#Article 1: గుంటూరు జిల్లా (872 words)


గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా ప్రాంతంలో ఒక జిల్లా. దీని ముఖ్యపట్టణం గుంటూరు. రాష్ట్ర రాజధాని అమరావతి గుంటూరు జిల్లాలో వుంది.  దీనికి 100 కి.మీ. తీరం ఉంది. కృష్ణా నది, సముద్రంలో కలిసేవరకు, ఎడమవైపు కృష్ణాజిల్లా, కుడివైపు గుంటూరు జిల్లాను వేరుచేస్తుంది. ఈ జిల్లా 11,391 చ.కి.మీ. ల విస్తీర్ణంలో వ్యాపించి, 48,89,230 (2011 గణన) జనాభా కలిగి రాష్ట్రంలో రెండవ పెద్ద జనాభాగల జిల్లాగా గుర్తింపు పొందింది.

ఈ జిల్లాకు అతి పురాతన చరిత్ర ఉంది. మౌర్యులు, శాతవాహనులు, పల్లవులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు పరిపాలించారు. పల్నాటి యుద్ధం ఈ జిల్లాలోని కారంపూడిలో జరిగింది.మొగలు సామ్రాజ్యం నిజాం పాలన, ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆ తరువాత మద్రాసు ప్రసిడెన్సీలో భాగమైంది. స్వాతంత్ర్య సమరంలో పెదనందిపాడు పన్నుల ఎగవేత, సైమన్ కమిషన్ ఉద్యమం లాంటి ఎన్నో చారిత్రక ఘట్టాలు ఈ జిల్లాలో జరిగాయి. స్వాతంత్ర్యం తరువాత ఆంధ్రరాష్ట్రంలో, ఆ తదుపరి ఆంధ్రప్రదేశ్ లో భాగమైంది.

విద్యా కేంద్రంగా అనాది నుండి పేరు పొందింది. ఈ జిల్లాను మిరపకాయల భూమి అని అంటారు. . పొగాకు, మిర్చి జిల్లా యొక్క ప్రధాన వ్యవసాయ ఎగుమతులు.

గుంటూరు ప్రాంతంలో పాతరాతి యుగం నాటినుండి మానవుడు నివసించాడనుటకు ఆధారాలు ఉన్నాయి. రాతియుగపు (పేలియోలిథిక్) పనిముట్లు గుంటూరు జిల్లాలో దొరికాయి. వేంగీ చాళుక్య రాజు అయిన అమ్మరాజ (922-929) యొక్క శాసనాలలో గుంటూరు గురించిన ప్రథమ ప్రస్తావన ఉంది. 1147, 1158 రెండు శాసనాలలో కూడా గుంటూరు ప్రసక్తి ఉంది.

బౌద్ధం ప్రారంభం నుండి విద్యా సంబంధ విషయాలలో గుంటూరు అగ్రశ్రేణిలో ఉంటూ వచ్చింది. బౌద్ధులు ప్రాచీన కాలంలోనే ధాన్యకటకం (ధరణికోట) వద్ద విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. తారనాథుని ప్రకారం గౌతమ బుద్ధుడు మొదటి కాలచక్ర మండలాన్ని ధాన్యకటకంలో ఆవిష్కరింపచేశాడు. ప్రసిద్ధ బౌద్ధ తత్వవేత్త అయిన ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతం వాడు. క్రీ.పూ 200 నాటికే ఈ ప్రాంతంలో అభ్రకం (మైకా) ను కనుగొనబడింది.

ప్రతీపాలపుర రాజ్యం (క్రీ పూ 5వ శతాబ్ది) – ఇప్పటి భట్టిప్రోలు – దక్షిణ భారతదేశంలో ప్రథమ రాజ్యంగా గుర్తింపు పొందింది. శాసన ఆధారాలను బట్టి కుబేర రాజు క్రీ. పూ. 230 ప్రాంతంలో భట్టిప్రోలును పరిపాలించాడని, ఆ తరువాత సాల రాజులు పాలించారని తెలుస్తుంది. వివిధ కాలాల్లో గుంటూరును పరిపాలించిన వంశాలలో ప్రముఖమైనవి: శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, ఆనంద గోత్రీకులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, చోళులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, కుతుబ్ షాహీలు. గుంటూరు ప్రాచీనాంధ్రకాలంనాటి కమ్మనాడు, వెలనాడు, పలనాడులో ఒక ముఖ్యభాగం. కొందరు సామంత రాజులు కూడా ఈ ప్రాంతాన్ని పాలించారు. ఈ సామంతుల మధ్య కుటుంబ కలహాలు, వారసత్వ పోరులు సర్వసాధారణంగా ఉండేవి. అటువంటి వారసత్వపోరే ప్రసిద్ధి గాంచిన పలనాటి యుద్ధం. జిల్లాలోని పలనాడు ప్రాంతంలో 1180 లలో జరిగిన ఈ యుద్ధం ఆంధ్ర కురుక్షేత్రంగా చరిత్ర లోను, సాహిత్యంలోను చిరస్థాయిగా నిలిచిపోయింది.

భారత స్వాతంత్ర్య సంగ్రామం లోను, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఏర్పాటు లోను జిల్లా ప్రముఖ పాత్ర వహించింది. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు మద్రాసు ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రంలో భాగమైంది. మద్రాసు రాష్ట్రం లోని తెలుగు మాట్లాడే జిల్లాలు ప్రత్యేక రాష్ట్రం కావాలని వాదించాయి. ఫలితంగా 1953లో 11 జిల్లాలతో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. 1970 ఫిబ్రవరి 2న ప్రకాశం జిల్లా ఏర్పాటు చేసినపుడు జిల్లా రూపురేఖలలో మళ్ళీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఒంగోలు తాలూకా మొత్తం, బాపట్ల, నరసరావుపేట, వినుకొండ తాలూకాలలోని కొన్ని ప్రాంతాలను విడదీసి ప్రకాశం జిల్లాలో కలిపి ఏర్పాటు చేసారు. దీనితో జిల్లా వైశాల్యం 15032 చ. కి. మీ నుండి 11,347 చ. కి. మీకి తగ్గిపోయింది.

తూర్పున కృష్ణా జిల్లా ఆగ్నేయాన బంగాళాఖాతం, దక్షిణాన ప్రకాశం జిల్లా, పశ్చిమాన తెలంగాణా లోని మహబూబ్ నగర్ జిల్లా, వాయువ్యాన తెలంగాణా లోని నల్గొండ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.గుంటూరు జిల్లా సగటున 33 మీటర్లు ఎత్తులో ఉంది. చాలవరకు సమతల ప్రదేశం. కొన్ని కొండలు కూడా ఉన్నాయి. కృష్ణా డెల్టా కొంతభాగం దీనిలో ఉంది.

నల్లమలై, వెంకటాయపాలెం శ్రేణులు, కొండవీడు కొండలు

పల్నాడు చుట్టూ కర్నూలు జిల్లాలోని నల్లమలై కొండలున్నాయి. మాచర్ల, యర్రగొండపాలెం శ్రేణిలో స్వామికొండ లేక వామికొండ (605 మీ) ఎత్తులో గలదు. కైరాలకొండ (590 మీ) తరువాత ఎత్తైన కొండ. వాయవ్య అంచున గల కొండలు మల్లవరం దగ్గర కృష్ణానదిలో కలిసేవరకు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా పలకరాయి,క్వార్ట్‌జైట్ రాయి లభిస్తుంది. మాచర్లకు పది కి.మీ. దూరంలో ఎత్తిపోతల జలపాతం నల్లమల కొండలపై చంద్రవంక నదిపై ఉంది. దీనిలో 21 మీ. ఎత్తునుండి నీరు పారుతుంది.

సత్తెనపల్లి దగ్గరలోని వెంకటాయపాలెం పేరు కలిగిన పలకరాయి, క్వార్ట్జైట్లు గల కొండలే ఇవి. 40 కిమీ పొడవుతో ఈశాన్య - నైరుతీ దిక్కున వుంటాయి. వీటిలో వజ్రాలు కనుగొన్నారట. దీనిలో ఎత్తైనది మైదర్సాల్ (447 మీ). నరసరావుపేట దగ్గర పల్నాడు, వినుకొండ, సత్తెనపల్లి సరిహద్దులు కలిసేచోట కృష్ణానదివైపుకు ఎత్తుతగ్గుతూ వుండే కొండలు ఉన్నాయి.

నరసరావుపేట దగ్గర గ్రానైట్ రాయి గల 19 కిమీ విస్తరించి, 523మీ ఎత్తువరకు కలకొండలు. దీనికి పశ్చిమంగా వేరుగా వున్న యల్లమంద లేక కోటప్పకొండ అని పిలవబడే 489 మీ. ఎత్తులో ఉంది. దానికి దక్షిణంగా అద్దంకి వైపు కొన్ని కొండలున్నాయి. మంగళగిరి, విజయవాడ మధ్య కొన్ని కొండలు కనిపిస్తాయి. చారిత్రకంగా, మతసంబంధపరమైనవి గుత్తికొండ, మంగళగిరి, వుండవల్లి.

నేల తీరులో రకాలు.

కృష్ణా నది, చంద్రవంక, తుంగభద్ర, నాగులేరు ప్రధాన నదులు. గుంటూరు ఛానల్, గుంటూరు శాఖా కాలువ, రొంపేరు, భట్టిప్రోలు, రేపల్లె కాలువలు, దుర్గి దగ్గర గుండ్లవాగు, రెంటచింతల దగ్గర గోలివాగు, గురజాల దగ్గర దండివాగు ఉన్నాయి.

కృష్ణానది మాచెర్ల పర్వతశ్రేణిలో గనికొండ దగ్గర 182 మీటర్ల (సముద్రమట్టంనుండి) లో గుంటూరు జిల్లాలో ప్రవేశిస్తుంది. పెద్ద లోయలోకి పారుతూ మాచెర్లను తెలంగాణ లోని అచ్చంపేట (మహబూబ్ నగర్) ను వేరుచేస్తుంది. కుడవైపు జర్రివాగు, ఎడమవైపున దిండి వాగుని కలుపుకొని పారుతుంది. చంద్రవంక కృష్ణాకి ఉపనది. తూర్పు నల్లమల కొండలలో పుట్టి ముతుకూరు గ్రామ ప్రక్కగా పారి, దాని ఉపనదియైన ఏడిబోగుల వాగుతో కలసి (ఆత్మకూరు ప్రాజెక్టు దగ్గర) ఈశాన్య దిశగా పయనించి మాచర్లను తాకి ఉత్తరంగా పారుతుంది. తుమృకోట రక్షిత అడవిలోకి పారేముందు, 21మీటర్ల ఎత్తునుండి క్రిందకు పారుతుంది. దీనినే ఎత్తిపోతల జలపాతం అంటారు. ఉత్తరదిశగా కొంత ప్రవహించి కృష్ణాలో కలుస్తుంది. నాగులేరు నది, వినుకొండ శ్రేణిలో నాయకురాలి పాస్ దగ్గర నల్లమల కొండలలో పుట్టి, కారెంపూడి ప్రక్కగా ప్రవహించి ఉత్తరదిశగా మాచర్ల పర్వతశ్రేణులలో 32 కి.మీ. పారి రామపురం దగ్గర కృష్ణాలో కలుస్తుంది. తూర్పు తీరంలో సాధారణంగా వుండే తీరులో కృష్ణా నది చాలా వరకు సమతలప్రాంతంలో ప్రవహించటంతో, వర్షాకాలంలో చాలా మట్టి మేట వేస్తుంది .

దిగువ కృష్ణా, కృష్ణా, గుండ్లకమ్మ ఓగేరు, రొంపేరు, కాలువలు నేరుగా సముద్రంలోకలిసే ప్రాంతం జిల్లాలోని నీటిపారుదల విభాగాలు.

సిమెంట్ తయారీలో వాడే సున్నపురాయి, ఇనుప ఖనిజం, రాగి, సీసం ప్రధాన ఖనిజాలు

బంగాళ ఖాతంలో ఏర్పడే తుఫాన్లు, అల్పపీడనాలు, తూర్పుతీరం దాటితే అధిక వర్షం, బలమైన గాలులకు కారణమవుతాయి. 

జిల్లా సగటు వర్షపాతం 830 మిమి. తూర్పు నుండి పడమరకు ఇది తగ్గుతుంది. నైరుతీ రుతుపవనాల వలన అవి తగ్గిపోయేటప్పుడు వర్షపాతం కలుగుతుంది. అక్టోబరులో వర్షాలు ఎక్కువ. సగటున 47 వర్షపు రోజులు. అత్యధికంగా 1879 నవంబరు 9 లో సత్తెనపల్లిలో 386 మిమి వర్షపాతం నమోదైంది.

వార్షిక అత్యల్ప, అత్యధిక ఉప్ణోగ్రతలు 	15 °C, 47 °C గా నమోదయ్యాయి. రెంటచింతల అత్యంత ఉప్ణోగ్రతకలప్రదేశం. 1948 మే 18 లో 49 °C నమోదయ్యింది.

ఈ జిల్లాలో ప్రధాన పంటలు:

భారీ నీటి పారుదల ప్రాజెక్టులలో ప్రకాశం బేరేజి ( పాత కృష్ణా ఆయకట్) క్రింద 2,02,032 హెక్టేర్లు నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రింద

రెవిన్యూ గ్రామాలు 729 (27 నిర్వాసిత గ్రామాలుతో కలిపి), 57 మండలాలు, నాలుగు రెవిన్యూ డివిజన్లు జిల్లా పరిధిలో ఉన్నాయి.

జిల్లాలో నాలుగు​ రెవెన్యూ విభాగాలు ఉన్నాయి, అవి:తెనాలి, గుంటూరు, నరసరావుపేట, గురజాల

 
 

 

 

గుంటూరు నుండి హైదరాబాదు, చెన్నైకు రహదారి, రైలు మార్గాలు ఉన్నాయి. 72 కిమీ జాతీయ రహదారి, 511 కి.మీ. రాష్ట్ర రహదారులు ఉన్నాయి.

గుంటూరు జిల్లాలో సాధారణ విద్యతో బాటు, వృత్తివిద్యకు సంబంధించి వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పలు విద్యాసంస్థలున్నాయి.

జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను 2019లో 1,05,68,262 పర్యాటకులు దర్శించారు. 




#Article 2: ఆంధ్రప్రదేశ్ (1400 words)


ఆంధ్రప్రదేశ్, భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. తెలంగాణాతో పాటు ఈ రాష్ట్రంలో తెలుగు ప్రధాన భాష. తదుపరి స్థానంలో ఉర్దూ ఉంది. ఈ రాష్ట్రానికి వాయవ్య దిశలో తెలంగాణ, ఉత్తరాన ఛత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాలు, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన తమిళనాడు రాష్ట్రం, పడమరన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. భారతదేశంలో ఎనిమిదవ అతి పెద్ద రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రంలోని ముఖ్యమైన నదులు గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్నా. ఆంధ్రప్రదేశ్ 12°37', 19°54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76°46', 84°46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82°30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని కాకినాడ మీదుగా పోతుంది.

ఆంధ్రులు వింధ్యపర్వత దక్షిణ భాగానికి తరలి వెళ్ళి, ద్రావిడులతో కలసిన ఆర్యులుగా క్రీ.పూ. 7వ శతాబ్దపు సంస్కృత రచనలు వర్ణిస్తున్నాయి. క్రీ. పూ. 5వ శతాబ్దములో ప్రతీపాలపురం (భట్టిప్రోలు) రాజధానిగా కుబేరక అను రాజు పాలన చేస్తున్నాడని ఆధారాలు దొరికాయి. మహావీరుడు, గౌతమ బుద్ధుడు ధాన్యకటకము (అమరావతి) సందర్శించారనడానికి ఆధారాలున్నాయి. మౌర్య చక్రవర్తి అశోకుని మరణానంతరం (క్రీ.పూ 232) ఆంధ్రులు వెలుగులోకి వచ్చారు. నవీన చరిత్రకారులు ఆంధ్రుల చరిత్ర ఆనాటినుండి మొదలైనట్లుగా లెక్కిస్తున్నారు. ఆంధ్ర (శాతవాహన), శక, పల్లవ, ఇక్ష్వాకు, తెలుగు చోళ, తూర్పు చాళుక్య, కాకతీయ, విజయనగర, కుతుబ్ షాహి, హైదరాబాదు నిజాంలు మొదలైన వంశాలకు చెందిన రాజులు ఆంధ్ర దేశాన్ని పరిపాలించారు. క్రీ.శ 17వ శతాబ్దములో బ్రిటీషు వారు కోస్తా ఆంధ్రను నిజామ్ వద్ద గెలుచుకొని మద్రాసు రాష్ట్రములో (మద్రాసు ప్రెసిడెన్సీ) కలుపుకున్నారు. హైదరాబాదు నిజామ్ బ్రిటిషు ఆధిక్యతను గుర్తించి తెలంగాణ ప్రాంతానికి పరిమితమైనాడు.

మద్రాసు రాజధానిగా ఉండే ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల నిరాహార దీక్ష చేసి మరణించారు, కానీ కర్నూలును రాజధానిగా చేసి 1953 అక్టోబరు 1న మద్రాసు రాష్ట్రంలో ఉత్తరాన ఉన్న 11 జిల్లాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం చేశారు. గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేసారు. టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి.

తెలుగు ప్రజల కోరికపై 1956, నవంబరు 1 న హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో కలిపి ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేసారు. కొత్త రాష్ట్రానికి హైదరాబాదు రాజధానిగా అవతరించింది. ఈ విధంగా భాష ఆధారముగా ఏర్పడిన రాష్ట్రములలో ఆంధ్రప్రదేశ్ మొదటి రాష్ట్రము అయినది. నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి.

రాష్ట్రం ఏర్పడినతరువాత అడపా దడపా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు దానికి పోటీగాసమైక్య ఉద్యమాలు జరుగుతూ వచ్చాయి.2009 లో కే.సి.ఆర్ నిరాహరదీక్ష విరమింపచేయడానికి కేంద్రప్రభుత్వం తెలంగాణాఏర్పాటు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడంతో ఈ ఉద్యమాలు మరింత బలం పుంజుకున్నాయి. కేంద్రప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అందరికీ అమోదమైన లక్ష్యంకొరకు ప్రయత్నించినప్పటికి సత్ఫలితాలివ్వలేదు.2013 జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 10 జిల్లాలతో కూడిన తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.తదుపరి సమైక్యాంధ్ర ఉద్యమము వూపందుకుంది. ప్రభుత్వ ఉద్యోగసంఘాల నాయకత్వంలో రెండు నెలలపై బడి సమైక్యాంధ్ర ఉద్యమము నడిచింది. 2013 అక్టోబరు 3న జరిగిన కేంద్రప్రభుత్వ మంత్రివర్గ సమావేశంలో తెలంగాణా ఏర్పాటుని ఆమోదించారు. తదుపరి చర్యగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాల సమస్యలపై చర్చించి వాటి పరిష్కార వివరాలతో కేబినెట్ నోట్, బిల్లు తయారీ జరిగింది. ఆ తరువాత రాష్ట్రపతి పంపిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును 
 శాసనసభ,శాసనమండలిలో సుదీర్ఘ చర్చల పూర్తికాకముందే ఒకవారం పొడిగించిన గడువు ముగిసే సందర్భంలో ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తిరస్కరించే తీర్మానం పై మూజువాణీ వోటుతో సభలు అమోదముద్ర వేశాయి. 2014, ఫిబ్రవరి 18న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోకసభ ఆమోదం లభించింది. 20 పిభ్రవరి న రాజ్యసభ ఆమోదం తెలిపింది. సీమాంధ్రకు న్యాయం చేయడానికి వెంకయ్యనాయుడు ప్రతిపాదించిన సవరణలను కొంత వరకు తృప్తిపరచే విధంగా ప్రధాని ఆరుసూత్రాల ప్యాకేజీని ప్రకటించిన పిదప, బిల్లుకు యథాతథంగా మూజువాణీ వోటుతో అమోదముద్ర పడింది . 2014 జూన్ 2 న తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలు 2 క్రొత్త రాష్ట్రాలుగా ఏర్పడినవి.

నీలం సంజీవరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రి. 1982 వరకు అన్నీ కాంగ్రెసు ప్రభుత్వాలే ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించాయి. 1982 వరకు కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలము పనిచేశాడు. ఆయన తరువాత పి.వి.నరసింహారావు ముఖ్యమంత్రిగా కొంతకాలం పనిచేసారు.

అయితే 1982 వరకు రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెసుకు ఉన్న బలాన్ని సవాలు చేయటానికి నందమూరి తారక రామారావు అదే సంవత్సరములో తెలుగుదేశం అనే పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించాడు. స్థాపించిన తొమ్మిది నెలలలోనే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారపగ్గాలు చేపట్టడంతో ఒక బుడతడి దెబ్బకు వస్తాదు కుప్పకూలినట్లయింది.

జగన్ ప్రభుత్వం సమీకృత అభివృద్ధి. పరిపాలన వికేంద్రీకరణ కొరకు, అమరావతిని కేవలం శాసనరాజధానిగా పరిమితం చేసి,విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా మార్పులు చేసిన చట్టానికి 2020 జూలై 31 న గవర్నరు ఆమోదముద్ర పడింది. ఈ చట్టాన్ని ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేయగా, తదుపరి విచారణ ఆగష్టు 14 వరకు యథాతథ స్థితి కొనసాగాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్ లో రెండు ముఖ్య ప్రాంతాలున్నాయి. అవి కోస్తాంధ్ర, రాయలసీమ. రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నాయి.కోస్తా ఆంధ్రలో ఎర్రటి నేలలు ఉండే మెట్ట భూములు, నల్లరేగడి నేలలు ఉండే డెల్టా భూములు ఉన్నాయి. రాయలసీమలో ఎర్రటి నేలలు ఉన్నాయి. ముఖ్య నగరాలు విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, గుంటూరు,ఒంగోలు, మచిలీపట్నం. గోదావరి, కృష్ణ వంటి మహానదులు రాష్టంలో ప్రవహించటంవలన కొన్ని లక్షల హెక్టేరుల భూమి సాగు చేయబడుతున్నది.

ఆంధ్రప్రదేశ్ విభజనానంతరం 13 జిల్లాలు ఉన్నాయి.జిల్లాలు, వాటి ముఖ్య పట్టణాలు, 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం జనాభా వివరాలు, విస్తీర్ణం , జన సాంద్రత వివరాలు క్రింది జాబితా ద్వారా తెలుస్తాయి

ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం నేటివిలువ ప్రకారం ₹1,22,376, స్థిర విలువల ప్రకారం ₹95,566 వుండగా, ఇవి భారతదేశానికి ₹1,03,818, ₹82,112 గా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయాక, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి, కొత్త పరిశ్రమల ఏర్పాటుకూ అనేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రానికి సన్ రైజ్ కంట్రీ అనే ఒక బ్రాండ్ నేమ్‌ను పెట్టి, దేశం లోను, బయటా ప్రచారం చేసింది. ప్రపంచ బ్యాంకు జరిపే వ్యాపార నిర్వహణ అనుకూలత (Ease of doing business)బిజినెస్ పరిశీలనలో రాష్ట్రం, దేశం మొత్తం మీద 2015 లో రెండవ స్థానంలోను , 2018 లో మొదటి స్థానంలోనూ నిలిచింది.

మెట్ట భూముల్లో ఆయిల్ పామ్, బత్తాయి, నిమ్మ, చెరుకు, కొబ్బరి, కొకొవా, జొన్న, దానిమ్మ, జామ, సపోటా, మిర్చి, ప్రత్తి, పొగాకు, కూరగాయలు వంటివి పండిస్తారు. డెల్టా ప్రాంతాల్లో వరి, కొబ్బరి, కూరగాయలు, పండిస్తారు. ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతం చేపలు, రొయ్యలు సాగులో దేశంలోనే ప్రసిద్ధిగాంచింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధినేత ముఖ్యమంత్రి కాగా, రాష్ట్ర పరిపాలన గవర్నరు పేరున జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ (దిగువ సభ) లో 175 స్థానాలు, విధాన మండలి (ఎగువ సభ)లో 58 స్థానాలు ఉన్నాయి.దీనికి తోడు, ఆంగ్లో-ఇండియన్ వర్గం నుంచి ఒకరిని శాసన సభకు నామినేటు చేస్తారు.ఆ రకంగా శాసన సభలో సభ్యుల సంఖ్య 175. ఆంధ్రప్రదేశ్ కు పార్లమెంటులో 36 స్థానాలు ఉన్నాయి. (లోక్ సభలో 25, రాజ్య సభలో 11). ఎలెక్ట్రానిక్ సాంకేతివ్యవస్థ ఉపయోగించి రాజీవ్ ఇంటర్నెట్ విలేజి కార్యక్రమం (ఆంధ్రప్రదేశ్) ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించటానికి అంతర్జాలంలో ఏపీ ఆన్ లైన్ అనే జాలస్థలి కలిగివుంది. విభజన తర్వాత నారా చంద్రబాబునాయుడు 2014, జూన్ 8 న నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర 1వ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 2019 మే 30న రెండవ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టాడు

విభజన తర్వాత రాష్ట్ర పక్షి రామచిలుక, రాష్ట్ర చెట్టుగా వేపచెట్టు, రాష్ట్ర జంతువుగా కృష్ణ జింక, రాష్ట్ర పువ్వుగా మల్లెపువ్వు నిర్ణయించారు. ఇవి జూన్ 6. 2018 నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చాయి.

తెలుగు రాష్ట్ర అధికార భాష. కవిత్రయమని పేరుగన్న నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ మహా భారత కావ్యాన్ని తెలుగులోకి అనువదించారు. మహా భాగవతమును బమ్మెర పోతన అనువదించాడు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు విశ్వనాథ సత్యనారాయణ, మొదలైనవారు తెలుగులో ఆధునిక రచయితలు. ఆంధ్రప్రదేశ్ కు గొప్ప సాంస్కృతిక వారసత్వము ఉంది. అన్నమాచార్య, త్యాగరాజు, రామదాసు తదితర గొప్ప కర్ణాటక సంగీతకారులు తెలుగు భాషలో కృతులు రచించి, భాషను సుసంపన్నం చేశారు. కూచిపూడి రాష్ట్ర శాస్త్రీయ నృత్యం. అలాగే నటరాజ రామకృష్ణ గారి కృషి వల్ల ఆంధ్రనాట్యం కూడా ప్రజాదరణ పొందింది. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నగరం తప్ప మిగిలిన ప్రాంతాల్లో గ్రామీణ సంస్కృతి కనిపిస్తుంది. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కొనసాగుతున్నది. ముస్లిముల జనాభా ఆంధ్ర ప్రాంతంలో చాలా తక్కువగా ఉంది.

భారతదేశంలో ముఖ్య నృత్యాల్లో ఒకటైన కూచిపూడి నాట్యానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లాకు చెందిన కూచిపూడి గ్రామం పుట్టినిల్లు. కూచిపూడి గ్రామంలో ప్రారంభమైన ఈ నృత్యరీతి ఆంధ్రప్రదేశ్ మొత్తానికే కాక దేశవిదేశాల్లో ఎందరెందరో నేర్చుకుని ప్రదర్శించే స్థాయికి ఎదిగింది. కూచిపూడి వారు ప్రదర్శించే నృత్యనాటికలు భామా కలాపం, గొల్ల కలాపం వంటివి తెలుగు వారి సంస్కృతిలో భాగంగా నిలుస్తున్నాయి. దేవదాసీలు మాత్రమే ప్రదర్శిస్తూ ఆచారవంతులైనవారు నృత్యకారులను పంక్తిబాహ్యులని భావించే స్థితిలో కేవలం బ్రాహ్మణ పురుషులే అన్ని వేషాలు వేస్తూ, విద్యావంతులైన వారితో కూచిపూడి నృత్యరీతిని సిద్దేంద్ర యోగి వ్యవస్థాపించారు. కాలక్రమేణా నృత్యరీతి తెలుగువారి సంస్కృతిలో ముఖ్యభాగమైంది. 1950 నాటికి స్థానికంగా ఉండిపోయిన దీనికి జాతీయ స్థాయిలో మెప్పును, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపునూ తీసుకురావడానికి వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి స్త్రీలను ప్రవేశపెట్టడం వంటి ప్రయత్నాలు చేసి యావజ్జీవితాన్ని కళకు అంకితం చేశారు. వంటివాటిని పునరుద్ధరించడంలో నృత్య కళాకారులు నటరాజ రామకృష్ణ ఎనలేని కృషి చేశారు. దేవదాసీల ప్రదర్శనల్లో విలసిల్లి క్రమంగా దేవదాసీ వ్యవస్థతో పాటుగా అంతరించిపోతున్న నృత్యరీతులను, లక్షణ గ్రంథాల్లో సైద్ధాంతికంగా ఉండి ప్రయోగంలో తరతరాల నుంచి లేని నృత్యరీతులను దేవాలయల్లోని ప్రతిమల నాట్యభంగిమలను లక్షణ గ్రంథాలతో కలిపి అధ్యయనం చేసి అపూర్వరీతిలో ఆంధ్ర నాట్యం పేరిట మరల సృజించారు.

తెలుగు సినిమా రంగంలో నటులు, నటీమణులు, దర్శకులు, నిర్మాతలు, గాయనీ గాయకులు ఎక్కువగా ఆంధ్ర ప్రాంతానికి చెందినవారే. రాష్ట్రం నుండి ఉద్భవించిన కొందరు ప్రముఖ సినీ కళాకారులు నాగయ్య, ఎన్.టి.రామారావు (మాజీ ముఖ్యమంత్రి), అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వి.రంగారావు (ఎస్.వి.అర్) జగ్గయ్య, కృష్ణంరాజు, సాగి రాజన్ రాజు (ముక్కురాజు), శోభన్ బాబు, ఘంటసాల,ఎస్.పి.బాలసుబ్రమణ్యం, సుశీల, జానకి, సావిత్రి, భానుమతి, అంజలి జమున, శారద, షావుకారు జానకి, వాణిశ్రీ, ఎల్.వి.ప్రసాద్, కె.వి.రెడ్డి, బి.యన్.రెడ్డి, బి.నాగిరెడ్డి, బాపు, రాజేంద్ర ప్రసాద్, చిరంజీవి, జయప్రద మొదలైనవారు. హిందీ సినిమా రంగంపై తెలుగు కళాకారుల హవా, ప్రత్యేకమైన ముద్ర గలదు.

విశాఖపట్నం జిల్లాలో ఏటి కొప్పాక అను గ్రామంలో ఇప్పటికీ చెక్క బొమ్మలు తయారగుచున్నవి. కృష్ణాజిల్లాలో కొండపల్లి గ్రామంలో కొండపల్లి బొమ్మలు తయారగుచున్నవి.

రహదారి, రైలు మార్గాలద్వారా ఇతర రాష్ట్రాలకు కలపబడివుంది. విమానయాన, సముద్రయాన మార్గాలు కూడా ఉన్నాయి. బంగాళఖాత తీరంలో, సముద్ర వ్యాపారానికి అనువుగా సముద్ర ఓడరేవులున్నాయి. విజయవాడలో అతి పెద్దదైన రైలు కూడలి, విశాఖపట్నంలో అతి పెద్ద ఓడరేవు ఉంది. 

రాష్ట్రంలోని మొత్తం రహదారుల పొడవు  కాగా, దానిలో పొడవు జాతీయ రహదారులు,  పొడవు రాష్ట్ర రహదారులు, పొడవుజిల్లా రహదారులు ఉన్నాయి. రాష్ట్రంలో జాతీయ రహదారి 16,  పొడవుంది. ఇది బంగారు చతుర్భజి ప్రాజెక్టులో భాగం. ఆసియా రహదారి 45 లో కూడా భాగమే. ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) రాష్ట్రంలోని భాగాలన్నిటికీ వేల కొద్ది బస్సులు నడుపుతూ ప్రముఖ పాత్ర వహిస్తున్నది. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (PNBS) ఆసియా ఖండములోనే ఒక పెద్ద బస్ ప్రాంగణం. 2019 జనవరి 30 నుండి రాష్ట్రంలోని వాహనాలకు AP-39 కోడ్ తో ప్రారంభమయి ఒక అక్షరము, నాలుగు అంకెల సంఖ్యతో నమోదు చేయటం ప్రారంభమైంది.

ఆంధ్రప్రదేశ్ లో  బ్రాడ్ గేజి రైలు మార్గం 3703.25 కిమీ. మీటర్ గేజి రైలు మార్గాలు లేవు. రైలు సాంద్రత కు 16.59. ఇది భారతదేశానికి సగటు 20 గా ఉంది. రాష్ట్రం గూండా పోయే హౌరా-చెన్నై ప్రధాన మార్గం డైమండ్ చతుర్భుజిలో భాగంగా అతివేగమైన రైలు మార్గంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలున్నాయి. రైలు నెట్వర్క్ రెండు జోనుల పరిధిలో ఉంది. దీనిని డివిజన్లగా విభాగించారు. దక్షిణ మధ్య రైల్వే లోని విజయవాడ రైల్వే డివిజన్, గుంటూరు రైల్వే డివిజన్, గుంతకల్ రైల్వే డివిజన్., తూర్పుకోస్తా రైల్వే జోన్ లోని వాల్తేర్ రైల్వే డివిజన్. రాష్ట్రానికి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ తీర రైల్వే జోన్ ఏర్పాటయింది.

విశాఖపట్నం, విజయవాడ రాష్ట్రంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు. రాష్ట్రంలో దేశీయ విమానాశ్రయాలు రాజమండ్రి, కడప, తిరుపతి లలో ఉన్నాయి. ఇంకా 16 చిన్న తరహా విమానాలు దిగడానికి సౌకర్యమున్న కేంద్రాలున్నాయి.

దేశంలోనే 2వ అతిపెద్ద కోస్తాతీరం రాష్ట్రంలో ఉంది.

విశాఖపట్నం ఓడరేవు దేశంలోకెల్లా సరకురవాణాకి అత్యంత పెద్దదైన ఓడరేవు. మిగతా ప్రముఖ ఓడరేవులు కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ. గంగవరం అతిలోతైన పోర్టు కావడంతో అతి పెద్ద సముద్రపడవలు (200,000 – 250,000 టన్నులు సరకులు బరువు) కు అనుకూలమైంది. పెద్దవి కాని 14 పోర్టులు భీమునిపట్నం, దక్షిణ యానాం, మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవు లలో ఉన్నాయి.

ప్రధాన వ్యాసం: ఆంధ్రప్రదేశ్ లో విద్యఆంధ్రప్రదేశ్ లో విద్యా నిర్వహణ ప్రభుత్వ శాఖలద్వారా జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి ముఖ్య పాత్ర వహిస్తుంది.




#Article 3: భూగోళ శాస్త్రము (102 words)


భూగోళ శాస్త్రము అంటే భూమికి సంబంధించినవిజ్ఞానాన్ని తెలిపే శాస్త్రం. దీనిలో భాగంగా దేశాలు భూగోళంలో ఎక్కడ ఉన్నాయో తెలుసుకొనడం. భూమి పై నదులు, పర్వతాలు, సముద్రాల స్థానాలను తెలుసుకొనడం, భూమి ఎలా ఏర్పడింది, ఏ మార్పులు పొందింది తెలుసుకోవడం. 

పేంజియా ఒక్కసారిగా ముక్కలుగా చీలలేదు, దాని చీలిక మూడు ముఖ్య ఉపాఖ్యానములుగా నడిచింది.

గత 150 సంవత్సరాలుగా మానవజాతి భూమి చుట్టూ గ్రీన్హౌస్ వాయువులు తీవ్రత పెంచారు, ముఖ్యంగా బొగ్గుపులుసు వాయువు (carbondiaoxide).తత్ఫలితంగా, ప్రపంచ వాతావరణం వేడిగా మారుతున్నది.భూమి వాతావరణం వెచ్చబడితే, క్రమేనా ధృవాల మంచు కరిగి సముద్ర మట్టం పెరుగుతుంది.ఇది భూభాగాన్ని తగ్గిస్తుంది, ఇంకా తక్కువ శక్తి ఆకాశంలోకి తిరిగి వెళ్తుంది.ఈ అధిక వెచ్చదనంతో మంచు కరిగి సముద్రాలు భూభాగాలను వరదలతో ముంచెత్తుతాయి, ఫలితంగా వెచ్చదనం పెరుగుతుంది.ఈ పరిణామాల వల్ల నిశ్చయమైన బిస భూ వాతావరణాన్ని మంచు ఇంటి నుంచి పచ్చ ఇంటి తత్వానికి మార్చేస్తుంది, సరిగ్గా రాక్షస బల్లుల కాలం మాదిరిగా.




#Article 4: ఖమ్మం (180 words)


ఖమ్మం, భారతదేశం లోని తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా, ఖమ్మం అర్బన్ మండలానికి చెందిన పట్టణం. ఖమ్మం జిల్లా ముఖ్య కేంద్రం.ఖమ్మం పట్టణం వ్యాపార,ఆర్థిక కేంద్రం .

చారిత్రిక గ్రంథాల ఆధారంగా ఖమ్మం నగరానికి మునుపటి పేరు ,స్తంభశిఖరి కంభం మెట్టు లేదా స్థంభాద్రి.  మెట్టు అంటే తెలుగు భాషలో కొండ లేదా ఎత్తైన ప్రదేశం. ఈ పేరును కమోమెట్ మరియు ఖమ్మమ్మెట్ అని కూడా ఆంగ్లీకరించారు.

చారిత్రక ఆధారాల ప్రకారము ఖమ్మం నిజనామము స్తంభశిఖరి . తరువాత ఖమ్మం మెట్టుగా పిలవబడింది.

చివరి నైజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో వీరోచితంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటానికి కాకలు దీరిన యోధులను, నాయకులను అందించిన ప్రాంతంగా ఖమ్మం చరిత్రలో నిలిచిపోయింది. సింగరేణి బొగ్గు గనులతో, పచ్చని అడవులతో, పారే జీవనది గోదావరితో అధిక సంఖ్యలో గిరిజనులను కలిగియున్న ఈ జిల్లా విప్లవ పోరాటాలకు, ఉద్యమాలకు, రాజకీయ చైతన్యానికి ప్రతీక.

ఖమ్మం భౌగౌళికముగా 17.25° ఉ 80.15° తూలో ఉంది.దీనికి ఉత్తరంగా ఛత్తీస్ ఘఢ్, ఒడిశా ఈశాన్యం గా, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలు తూర్పు గా, వరంగల్ జిల్లా దక్షిణంగా ఉంది. దీని వైశాల్యం 16, 029 చదరపు కిలోమీటర్లు. ఈ పట్టణం కృష్ణానదికి ఉపనది అయిన మున్నేరు నది ఒడ్డున విస్తరించి యున్నది. ఈ జిల్లాలో అధిక విస్తీర్ణము అడవులు వ్యాపించి యున్నవి. ఈ జిల్లాకు 1982 వరకు సాగు నీటి వసతి లేదు. జలగం వెంగళ రావు ముఖ్యమంత్రిగా ఉండగ సాగర్ నీరు లభించింది.

స్వాతంత్య్ర సంగ్రామంలో ఖమ్మం పట్టణంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు.

ఈ క్రింది ప్రాంతాలు ఖమ్మం పురపాలక సంస్థచే అధికారికంగా గుర్తించబడిన నివాస, వాణిజ్య ప్రాంతాలు.




#Article 5: కంప్యూటరు (4403 words)


ఆటలు - సాఫ్ట్‌వేర్‌ - హార్డ్‌వేర్‌- చరిత్ర - ఇంటర్నెట్టు

కంప్యూటరు అనేది అనేకమయిన ప్రక్రియల ద్వారా సమాచారాన్ని రకరకాలుగా వాడుకోటానికి వీలు కలుగచేసే యంత్రం. సమాచారము వివిధ రూపములలో ఉండవచ్చును: ఉదాహరణకు సంఖ్యలుగా, బొమ్మలుగా, శబ్దములుగా లేదా అక్షరములుగా ఉండవచ్చు. ఈ రోజుల్లో కంప్యూటరు అనేది ఒక విద్యుత్తు ఉపకరణం. ఈ ఉపకరణాన్ని కచ్చితంగా నిర్వచించాలంటే కష్టమనే చెప్పాలి. కంప్యూటరు అనే పరికరం కాలక్రమేణా ఎన్నో మార్పులు చెందటం వల్ల ఫలానా యంత్రమే కంప్యూటరు అని నిర్వచించటం కష్టమౌతుంది. ఈ క్రింది నిర్వచనాల ద్వారా గణనయంత్రము అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం చెప్పవచ్చు.

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత రోజులలో రెండు రకాల కంప్యూటరులు వాడుకలో ఉండేవి. అంక కలన యంత్రాలు (digital computers), సారూప్య కలన యంత్రాలు (analog computers). మధ్యలో కొన్నాళ్ళపాటు సంకర కలన యంత్రాలు (hybrid computers) వచ్చాయి. పోటీలో అంక కలన యంత్రాలు గెలవటం వల్ల ఇప్పుడు 'అంక' అన్న విశేషణాన్ని తీసేసి మామూలుగా కలన యంత్రం అని కానీ, గణనం చేసేది కనుక సంగణకం అని కాని లేదా కంప్యూటరు అని కానీ అంటున్నారు.

ఈ రోజుల్లో ఎక్కువ వాడుకలో ఉన్న కంప్యూటరు‌‌ను పోలిన యంత్రాలు మొట్టమొదట రెండవ ప్రపంచ యుద్ధం అంతం అయ్యే రోజులలో వెలిసేయి. పూర్వం ఈ కలన యంత్రాలు చాల భారీగా ఉండేవి. ఒకొక్క యంత్రానికి ఒకొక్క పెద్ద గది కావలసి వచ్చేది. పైపెచ్చు ఒక్కొక్కటి కోట్ల కొద్ది రూపాయలు ఖరీదు చేసేది. ఎంతో వ్యయ ప్రయాసలతో కూడిన అధిస్థాపన (establishment) కనుక ఈ యంత్రాన్ని ఎంతోమంది ఉమ్మడిగా వాడుకొనే వారు. ఇటువంటి ఉమ్మడి యంత్రాలు ఇప్పుడు ఉన్నాయి. ఈ రోజుల్లో ఇటువంటి వాటిని ప్రత్యేక వైజ్ణానిక అవసరాలకు ఉపయోగించుతున్నప్పుడు సూపరు కంప్యూటరు అని, పెద్దపెద్ద సంస్థల వ్యాపార లావాదేవీలు (transactions) సంవిధానం (processing) చేస్తున్నప్పుడు మెయిన్ ఫ్రేము కంప్యూటరు అని సంభోదిస్తూ ఉంటారు. ఇవి అపరిమితమయిన గణన సౌకర్యాలు కలిగి ఉంటాయి.

ఈ రోజుల్లో కంప్యూటరులు బాగా శక్తివంతమూ అయేయి, చవకా అయేయి; పైపెచ్చు బాగా చిన్నవీ అయేయి. దాని వల్ల భారీ యంత్రాల వాడుక పడిపోయింది; ఎవరి కంప్యూటరు వారే సొంతంగా కొనుక్కోగలిగే స్థాయికి ఎదిగేం. ఈ సొంత కంప్యూటరులనే ఆంగ్లంలో personal computer అనీ, హ్రస్వంగా PC అనీ, తెలుగులో వ్యక్తిగత కంప్యూటరు అనీ అంటున్నారు. ఈ సొంత కంప్యూటరులు బల్లమీద పెట్టుకునే రకాలు (desktop), ఒళ్ళో పెట్టుకునే 'ఉరోపరి' (laptop), చేత్తో పట్టుకునేవి (hand-held) అలా రకరకాల ప్రమాణాల్లో వస్తున్నాయి. పుస్తకం సైజులో ఉన్నవాటిని నోటుబుక్కు కంప్యూటరు అని పిలుస్తారు. ఇతర వస్తువులను నియంత్రించుటకు ఉపయోగించే వాటిని embedded computers అంటారు. ఉదాహరణకు డిజిటలు కెమెరాలు, ఉతికే యంత్రాలు (వాషింగు మెషీనులు) మొదలగు వాటిలో వాడే కంప్యూటరులు ఎంబెడెడు కంప్యూటరులు. అంతేకాదు పెద్ద విమానాలను సైతం నడిపే కంప్యూటరులను ఎంబెడెడు కంప్యూటరులు అనవచ్చు. పెద్దదైనా, చిన్నదైనా కంప్యూటరు పనిచేసే పద్ధతి ఒక్కటే. సిద్ధాంతమూ ఒక్కటే. మరొక విషయం. ఏపిల్ కంపెనీ వారి కంప్యూటరులు ప్రాచుర్యం లోకి వచ్చిన తరువాత PC అంటే ఏపిల్ కంపెనీవి కానివి అనే అర్థం వచ్చేలా వాడుక పెరిగిపోయింది.

ఇంకా కొత్త కొత్త రకాల కంప్యూటరులు పరిశోధన స్థాయిలో ఉన్నాయి. క్వాంటం శాస్త్రపు సూత్రాలని ఉపయోగించి నిర్మాణం జరిగితే అవి క్వాంటం కంప్యూటరులు. అలాగే DNA (అంటే జీవ కణాలలోని వారసవాహికలు) లో నిబిడీకృతమైన సూత్రాలని ఉపయోగించి నిర్మాణం జరిగితే అవి DNA కంప్యూటరులు.

పైపైకి వివిధ రూపాలలో అందుకే మన భారతదేశం అనేక రంగాలలో ముందు వుండే  కంప్యూటరులు కనిపించినా మౌలికంగా అవి పనిచేసే సూత్రం ఒక్కటే. కంప్యూటరులు మనం ఇచ్చిన సమాచారాన్ని తీసుకుంటాయి. ఆ సమాచారాన్ని జీర్ణించుకుని, జీర్ణమైన ఆ సమాచారాన్ని తిరిగి మనకి మరొక రూపంలో ఇస్తాయి. ఆవు మనం పెట్టిన గడ్డి తిని, జీర్ణించుకుని మనకి తిరిగి పాలు ఇచ్చినట్లే. మనలో చాలమందికి, ఇప్పటికీ, పెరట్లో ఆవులు ఉంటాయి. వాటికి గడ్డి మేపుతాం, కుడితి పడతాం, పాలు పిండుకుంటాం. ఆ మేత ఏమైంది? ఆ పాలు ఎలా తయారయ్యాయి అన్న విషయాలు మనం పట్టించుకోము. అదే విధంగా కంప్యూటరుని కేవలం ఉపయోగించుకునే వారికి కంప్యూటరు లోగుట్టు తెలియక్కర లేదు. ఉపయోగించుకోవడం తెలిస్తే చాలు. కారు నడిపేవారందరికీ కార్లు ఎలా పనిచేస్తాయో తెలుస్తోందా? తెలియవలసిన అవసరం కూడా లేదు.

కారు నడిపేవాడు కొద్దో, గొప్పో కారు గురించి తెలుసుకుంటే కారుని మరి కొంత బాధ్యతతో, సమర్ధతతో నడపవచ్చు కదా! అలాగే కేవలం వాడుకకే వినియోగించినా కంప్యూటరు గురించి కొద్దో, గొప్పో తెలిసి ఉంటే ఆ యంత్రాన్ని ఎంతో దక్షతతో వాడుకోవచ్చు. అలాగే కారు నడిపేవాడు కొద్దో, గొప్పో కారు గురించి తెలుసుకుంటే కారుని మరి కొంత బాధ్యతతో, సమర్ధతతో నడపవచ్చు కదా!

పూర్వకాలంలో “కంప్యూటరు” (computer) అనే ఇంగ్లీషు పదాన్ని లెక్కలు చేసే వ్యక్తిని ఉద్దేశించి వాడేవారు; అంటే “కంప్యూట్” (compute) చేసే వ్యక్తి. బండిని తోలే వ్యక్తిని ఇంగ్లీషులో “డ్రైవర్” (driver) అనిన్నీ, కుండలు చేసే వ్యక్తిని “పాటర్” (potter) అనిన్నీ అన్నట్లే. క్రమేపీ లెక్కలు చెయ్యడానికి యంత్రాలు వచ్చేయి. మనిషి చేసే పనినే యంత్రాలు చేస్తూన్నప్పుడు అదే “కంప్యూటరు” అన్న పేరుని యంత్రాన్ని ఉద్దేశించి వాడడం మొదలు పెట్టేరు. ఈ రోజుల్లో కంప్యూటరు అంటే యంత్రమే; మనిషి కాదు.

భారతీయ భాషలలో కలనం చెయ్యడం అంటే కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగారాలు వంటి లెక్కలు చెయ్యడం. మొదట్లో కంప్యూటరులని నిర్మించినప్పుడు వాటి చేత అంకెలతో ఈ రకం కలన కలాపాలే చేయించేవారు. అందుకనే వాటిని అంక కలనయంత్రాలు (digital computing machines) అనేవారు. కాలక్రమేణా కలనయంత్రాల చేత తార్కికమైన కలన కలాపాలు (logical calculations) కూడా చేయించడం మొదలు పెట్టేరు. అందుకని వాటిని అంక-తార్కిక యంత్రాలు (arithmetic-logic machines) అన్నారు. కొన్నాళ్లు పోయిన తరువాత కంప్యూటరుల చేత ఇంకా రకరకాల పనులు చేయించడం మొదలు పెట్టేరు. ఉదాహరణకి తెర మీద ఏది, ఎప్పుడు, ఎంతసేపు, ఎన్నిసార్లు చూపించాలో నిశ్చయించడం. కనుక ఈ రోజుల్లో కంప్యూటరు అంటే ఇచ్చిన సమాచారాన్ని జీర్ణించుకుని కొత్త సమాచారాన్ని వెళ్లగక్కే యంత్రం (information processing machine) అని మనం అర్థం చెప్పుకోవచ్చు.

మనం కంప్యూటరుకి మేపే సమాచారం (information) రకరకాలుగా ఉండొచ్చు. ఉదాహరణకి “రేపు వర్షం పడుతుందా?” అన్న ప్రశ్నకి సమాధానం కావాలనుకుంటే ముందు కొంత విషయ సేకరణ చెయ్యాలి. ప్రస్తుతపు వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియాలి: బయట ఎంత వేడిగా ఉంది? గాలి ఎంత జోరుగా వీచుతోంది? ఆకాశంలో మేఘాలు ఉన్నాయా? ఎలాంటి మేఘాలు? ఎంత ఎత్తులో ఉన్నాయి? వాతావరణ పీడనం ఎలా ఉంది? భారమితి ఏమిటి చెబుతోంది? సముద్రం హోరు పెడుతోందా? చంద్రుడు గుడి కట్టేడా? శివుడికి సహస్ర ఘటాభిషేకం చేసేరా? ఈ రకం విషయాల గురించి సమాచారం సేకరించి కంప్యూటరుకి ఇస్తాం. ఈ సమాచారాన్ని దత్తాంశాలు (data) అంటారు. ఈ సమాచారం అంతా ఆవుకి వేసే మేత లాంటిది. ఈ సమాచారాన్ని ఏమిటి చెయ్యాలో మనం కంప్యూటరుకి చెప్పాలి. పులుసు చేసే వ్యక్తికి పులుసులో పడే సంభారాల జాబితా ఇస్తే సరిపోతుందా? పులుసు చేసే పద్ధతి కూడా చెప్పాలి కదా. “నీళ్లు మరిగించు, చింతపండు వెయ్యి, చెంచాడు ఉప్పు వెయ్యి, చిటికెడు పసుపు వెయ్యి, ముక్కలు వెయ్యి, మరగనీ, పోపు వెయ్యి” ఇలా చెప్పాలి కదా. వీటిని ఆదేశాలు (instructions) అంటారు. సూక్ష్మంగా చెప్పాలంటే మనం కంప్యూటరుకి దత్తాంశాలు, ఆదేశాలు ఇవ్వాలి. వాటిని రంగరించి, జీర్ణించుకుని, మనకి కంప్యూటరు సమాధానాలు ఇస్తుంది. టూకీగా అదీ కంప్యూటరు చేసే పని.

మనం కంప్యూటరుకి ఇచ్చే ఆదేశాలు సాధారణంగా మనం మాట్లాడుకునే భాషని పోలిన భాషలో ఉంటే బాగుంటుంది – అంటే ఇంగ్లీషులోనో, తెలుగులోనో, రష్యన్ లోనో అనుకోవచ్చు. కాని మనం కంప్యూటరు ఎదురుగా నిలబడి, “పులుసు వండు” అని ఎంతలా అరిచినా కంప్యూటరుకి అర్థం కాదు. (ఆ రోజులు కూడా వస్తున్నాయి, కాని ప్రస్తుతానికి సినిమాలలో తప్ప నిజ ప్రపంచంలో కంప్యూటరులు ఆ రకం పనులు చెయ్యడం లేదు.) “నీళ్లు మరిగించు, ఉప్పు వెయ్యి, చింతపండు వెయ్యి…” అని విడమర్చి చెప్పినా కంప్యూటరుకి అర్థం కాదు. మన మనస్సులో ఉన్న కోరికని కంప్యూటరుకి చెప్పడం అనేది చాలా క్లిష్టమైన పని. ఎందుకంటే మనం ఏ మానవ భాషలో మాట్లాడినా అపార్ధాలకి అవకాశాలు ఎక్కువ.

మన మనస్సులో ఉన్న విషయం కంప్యూటరుకి అర్థం అయే భాషలో చెప్పడానికి ప్రత్యేకంగా తరిఫీదు పొందిన వ్యక్తులు కావాలి. వాళ్లనే మనం “ప్రోగ్రామర్లు” (programmers) అంటున్నాం. ఈ ప్రోగ్రామర్లు చేసే పని ప్రోగ్రాములు రాయడం. ప్రోగ్రాము అంటే కంప్యూటరుకి ఇచ్చే ఆదేశాలని ఒక క్రమ పద్ధతిలో పేర్చి రాయడం. ప్రోగ్రాము అంటే ఒక క్రమంలో ఉన్న ఆదేశాల సమాహారం. “ప్రోగ్రాము” అనే మాటకి “కార్యక్రమం” అనే తెలుగు మాట ఉంది. ఈ మాటని “వినోద కార్యక్రమం” వంటి ప్రయోగాలకి అట్టేపెట్టుకుని కంప్యూటరుకి మనం ఇచ్చే ఆదేశాలకి మరొక ప్రత్యేకమైన మాట వాడదాం. అందుకని వీటిని తెలుగులో “క్రమణికలు” అందాం. మన భాషలకి వ్యాకరణం ఉన్నట్లే ఈ కంప్యూటరు భాషలకి కూడా వ్యాకరణం ఉంటుంది. ఆ వ్యాకరణ నియమాలని పాటిస్తూ క్రమణికలు రాయాలి. మేలు రకం క్రమణికలు రాయగలిగే వాళ్లకి మంచి గిరాకీ ఎప్పుడూ ఉంటుంది.

మనం కంప్యూటరుకి క్రమణికలు (programs), దత్తాంశాలు (data) ఇస్తాం. ఈ క్రమణికలు మనకి అర్థం అయే మానవ భాషకి దగ్గరలో ఉంటాయి. దత్తాంశాలు మనకి అర్థం అయే దశాంశ పద్ధతిలో ఉంటాయి. కాని కంప్యూటరుకి  ఇవేమీ అర్థం కావు. వీటన్నిటిని కంప్యూటరుకి అర్థం అయే భాష (machine language) లోకి మార్చి, ఒక క్రమంలో కంప్యూటరుకి అందజేస్తే అది సరిగ్గా పనిచేస్తుంది. ఇదంతా పెద్ద తర్జుమా యంత్రాంగం. ఈ క్రమణికలని, వాటిని తర్జుమా చేసే యంత్రాంగాన్ని, కంప్యూటరు చెయ్యవలసిన పనులన్నిటిమీదా అజమాయిషీ చేసే యంత్రాంగాన్నీ, …, అంతటిని కలిపి “సాఫ్ట్‌వేర్” (software) అని పిలుస్తారు.

కంప్యూటరుల గురించి మాట్లాడేటప్పుడు “కఠినాంగం” (hardware), “మృదులాంగం” లేదా “కోమలాంగం” (software) అని స్థూలంగా రెండు భాగాలుగా విడగొట్టి మాట్లాడడం సంప్రదాయికంగా వస్తూన్న ఆచారం. బ్రహ్మ మనని పుట్టించినప్పుడు ఒక భౌతిక శరీరం ఇచ్చేడు, నుదిటి మీద ఒక రాత రాసేడు. మన భౌతిక శరీరం కఠినాంగం (గట్టి సరుకు), నుదిటి మీద రాసిన రాత మృదులాంగం (మెత్త సరుకు). రాయడానికి వీలైన నుదురు అనే గట్టి ఫలకం లేకపోతే బ్రహ్మ మాత్రం ఎక్కడ రాస్తాడు? అలాగని రాయడానికి పలక ఒక్కటీ ఉండి, దానిమీద రాయడానికి ఏమీ లేకపోతే ఆ ఖాళీ పలక ప్రాణం లేని కట్టెతో సమానం. కంప్యూటరు రంగంలో “కఠినాంగం” అన్న మాటని ఇంకా విస్తృత భావంతో వాడవచ్చు. కంప్యూటరు లోని భౌతిక విభాగాలన్నీ (అంటే మనం చేత్తో పట్టుకో దలుచుకుంటే మన పట్టుకి దొరికేవి) – అంటే తెర (screen), కుంచికపలక (keyboard), మూషికం (mouse), మొదలైనవన్నీ కఠినాంగాలే. పోతే, కఠినాంగం లేకుండా మృదులాంగానికి అస్తిత్వం లేదు. కాలు మోపడానికి కఠినాంగం ఆసరా లేకుండా కేవలం మృదులాంగం గాలిలో ఉందంటే అది దయ్యంతో సమానం అన్నమాట. ఈ రకం దయ్యాలని మనం “కంప్యూటరు వైరస్‌లు” (computer viruses) అనవచ్చు.

కంప్యూటరు పని చేసే తీరుకీ మనం వంటగదిలో వంట వండే తీరుకీ చాల దగ్గర పోలికలు ఉన్నాయి. మా ఇంట్లో ధాన్యం, దినుసులు, వగైరాలన్నీ కొట్టుగదిలో నిల్వ చేసుకుని, ఒక వారానికి కావలసిన సామానులు వంటగదిలో బీరువాలో పెట్టుకునేవాళ్లం. ఆ రోజుకి కావలసిన దినుసులు అప్పటికప్పుడు బయటకి తీసుకుని, తీనే మీద పెట్టుకుని, వంట చేసేవారు. ఇక్కడ, కంప్యూటరు పరిభాషలో, “తీనె”ని “కేష్” (cache) తోటీ, వంటగదిలో ఉన్న బీరువాని ప్రథమ స్థాయి కొట్టు (main memory) తోటీ, పొయ్యి మీద ఉన్న కలశాన్ని “ప్రోసెసర్” తోటీ పోల్చవచ్చు. అంటే నిజంగా కలనం (వంట) జరిగేది కలశంలో (గిన్నెలో) అన్న మాట. శంఖంలో పోస్తే కాని తీర్థం కాదు, కలశంలో వండితే కాని వంట కాదు, ప్రోసెసర్‌లో పడితే కాని కలనం కాదు కనుక మనం “ప్రోసెసర్”ని కలనకలశం అని కాని, కలశం అని కాని అందాం. ఇక్కడ “ప్రోసెసర్” (processor) అనేది కఠినాంగం, ఈ కఠినాంగంలో జరిగే కలనకలాపం (process) మృదులాంగం జరిపే ఒక ప్రక్రియ. ఈ “ప్రోసెస్” అన్న మాటకి చాల లోతైన అర్థం ఉంది. ఆ విషయం ఇక్కడ చర్చించడానికి వీలు పడదు.

మనం వంట చేస్తూన్నప్పుడు వంట సామగ్రి కోసం నిమిషనిమిషానికీ బజారుకి పరిగెట్టం కదా; వంటగదిలోనో, దగ్గరలో ఉన్న కొట్టు గదిలోనో దాచుకుంటాం. అలాగే వంట చేసే విధానాలు రాసిన పుస్తకం (పులుసు ఎలా చెయ్యాలో, పచ్చడి ఎలా చెయ్యాలో, అప్పాలు, అరిసెలు ఎలా చెయ్యాలో) కూడా వంట గదిలోనే అందుబాటుగా ఉంటే బాగుంటుంది కదా. అందుకని కలనయంత్రాలు కలనం చేస్తూన్నప్పుడు కావలసిన సరంజామా (అంటే దత్తాంశాలు, ఆదేశాలు) ఎక్కడో ఉంటే ప్రయోజనం లేదు; చేతికి అందుబాటులో ఉంటే బాగుంటుంది. అలాగని అన్నీ వంటగదిలో ఇమడవు కదా. అందుకని ముఖ్యంగా కావలసినవి, తరచుగా కావలసినవి దగ్గరగా పెట్టుకుంటాం; అప్పుడప్పుడు కావలసినవి కొట్టుగదిలో ఉంచుతాం, ఎప్పుడో కాని అవసరం లేనివి, అవసరం వెంబడి బజారుకి వెళ్లి తెచ్చుకుంటాం. అదే విధంగా కలన యంత్రాలు కూడా రకరకాల అమరికలతో కొంత సమాచారాన్ని దగ్గరగాను, కొంత సమాచారాన్ని దూరంగాను దాచుకుంటాయి. ఇలా తరతమ భేదాలని పాటిస్తూ సమాచారాన్ని నిల్వ చేసే పద్ధతిని నిల్వ సోపానక్రమం (storage hierarchy) అంటారు.

నిల్వ సోపానక్రమం (storage hierarchy) లో చేతికి అందుబాటులో దాచుకునే స్థలాన్ని కోశం (cache, కేష్) అంటారు. తరచుగా కావలసిన సమాచారాన్ని జోరుగా దాచుకుని (లేదా రాసుకుని), జోరుగా బయటకి తీసుకోడానికి (లేదా చదువుకోడానికి) వీలయే ప్రదేశాన్ని ప్రథమ స్థాయి కొట్టు (primary storage) అని అందాం. దీనినే ఇంగ్లీషులో మెయిన్ మెమరీ (main memory) అని కాని, రేం (RAM, Random Access Memory) అని కాని అంటారు. కలశంలో కలనం ఎంత జోరుగా జరుగుతోందో అంత జోరుగా ఈ కొట్టు సమాచారాన్ని కలశానికి అందజేయాలి. ఈ వివరాలన్నీ తరువాత చూద్దాం కాని ఒక్క విషయం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. కంప్యూటరుకి విద్యుత్ సరఫరాని ఆపేసినప్పుడు ఈ ప్రాథమిక స్థాయి కొట్లో రాసుకున్న సమాచారం అంతా చెరిగిపోతుంది. కనుక కంప్యూటరుని “ఆఫ్” చేసేసే ముందు ఈ కొట్లో దాచుకున్న దస్త్రాలని (files ని) మరొక చోట ఎక్కడైనా, చెరిగిపోని చోట, దాచు (రాసు) కోవాలి. ఇలా మరొక చోట రాసుకుందికి వీలుగా, ప్రాథమిక స్థాయి కొట్టుకి దన్నుగా, ద్వితీయ స్థాయి కొట్టు (secondary storage) మరొకటి ఉంటుంది. ఈ ద్వితీయ స్థాయి కొట్టుని నిర్మించడానికి ప్రత్యేకంగా తయారు చేసిన పళ్లేల దొంతిని వాడతారు కనుక దీనిని ఇంగ్లీషులో “డిస్క్ స్టోరేజ్” (disk storage) అంటారు. మనం వాడుకునే కంప్యూటరులకి తప్పనిసరిగా ఒకటో, రెండో, ఈ రకం నిల్వ పళ్లేల సదుపాయాలు ఉంటాయి. వీటన్నిటి గురించి తరువాత నేర్చుకుందాం.

కలనయంత్రాలు చేసే పని కలనం ఒక్కటే కాదు; అవి సమాచారాన్ని ఒక చోట నుండి మరొక చోటకి రవాణా కూడా చేస్తాయి. ఉదాహరణకి కొట్లో దాచుకున్న సమాచారాన్ని కలశం దగ్గరకి తీసుకురావాలి. కలనం జరిగిన తరువాత వచ్చిన సమాధానాలని మళ్లా కొట్లో దాచాలి. మనం కంప్యూటరు లోకి సమాచారాన్ని ఎక్కించాలంటే కుంచికపలక (keyboard) ద్వారా టైపుకొట్టినట్లు మీటలు నొక్కి ఎక్కించడం ఒక పద్ధతి. కుంచికపలక మీద మనం ఏ బొత్తాం (కుంచికం) నొక్కేమో అర్థం చేసుకుని ఆ బొత్తాం నిర్దేశించిన అక్షరాన్ని తెర మీద చూపించాలంటే సమాచారం రహదారుల వెంట రవాణా అవాలి. అనగా, ఆ బొత్తాం నిర్దేశించిన అక్షరం యొక్క ద్వియాంశ సంక్షిప్తాన్ని (binary code) కొట్లో దాచడానికి మరొక రహదారి కావాలి. ఈ రకం పనులని ఇంగ్లీషులో ఇన్‌పుట్/ఔట్‌పుట్ అంటారు. “ఇన్‌పుట్” అంటే లోపలికి రవాణా చెయ్యడం, ఔట్‌పుట్ అంటే బయటకి రవాణా చెయ్యడం. వీటిని తెలుగులో అంతర్యానం (input), బహిర్యానం (output) అని అనొచ్చు. కలనయంత్రాలకి కలనాంశాలని లోపలకి తీసుకోవడం, బయటకి వెలిగక్కడం అనే ఈ సామర్ధ్యత లేకపోతే మనం కంప్యూటరుతో సంభాషణలు జరపలేము.

కంప్యూటరులు మానవులతోటే సంభాషణలు జరపాలని నియమం ఏదీ లేదు. ఒక కంప్యూటరు మరొక కంప్యూటరుతో కాని, మరొక రకం యంత్రంతో కాని మాట్లాడవచ్చు. ఉదాహరణకి మనం ఎవరికైనా విద్యుల్లేఖ (E-mail) ద్వారా వార్త పంపినప్పుడు ఆ వార్తని గమ్యానికి సురక్షితంగా చేర్చడం కూడా సమాచార రవాణా పరిధిలోకే వస్తుంది. ఇలాంటి సందర్భాలలో కంప్యూటరు వాడుకలో ఉన్న టెలిఫోను వంటి వార్తాప్రసార (communications) సౌకర్యాల మీద ఆధార పడవచ్చు. అప్పుడు కంప్యూటరుని ఆ వార్తాప్రసార సాధనాలకి తగిలించడానికి “మోడెం” (modem) వంటి ఉపకరణాలు వాడతాం. మోడెం చేసే పని కంప్యూటరుకి అర్థం అయే సున్నలని, ఒకట్లని తీసుకుని టెలిఫోను తీగల మీద ప్రసారానికి అనుకూలమైన విద్యుత్ తరంగాలుగా మార్చడము (modulation), విద్యుత్ తరంగాల రూపంలో ఉన్న వాకేతాలు (signals) ని సున్నలు, ఒకట్లు గాను మార్చడం (demodulation). తీగలు లేకుండా నిస్‌తంతి (wireless) వార్తలని పంపేటప్పుడు కూడా మోడెం వాడొచ్చు. ఈ రోజుల్లో చాల మందికి ఇంట్లోను, బయట - ఎక్కడపెడితే అక్కడా – అంతర్జాలం (Internet) అందుబాటులో ఉంటోంది. అరచేతిలో ఇమిడే కంప్యూటరు సహాయంతో, తీగల బెడద లేకుండా వీరు సమాచారాన్ని పంపగలరు, అందుకోగలరు. రోజురోజుకీ మారుతూన్న ఈ సాంకేతిక రంగం గురించి ఏది రాసినా ఆ సిరా ఆరే వరకే ఆ రాతకి సార్థకత.

కంప్యూటరులో ముఖ్యమైన భాగాలు నాలుగు అని చెప్పుకోవచ్చు. మొదటిది కలనం జరిగే కలశం లేదా ఇంగ్లీషులో “ప్రోసెసర్” (processor). ఈ ప్రోసెసర్‌లో జరిగే కార్య కలాపాలని “ప్రోసెసింగ్” (processing) అనిన్నీ, ప్రత్యేకించి ఒక కార్యకలాపాన్ని ఉద్దేశించి చెప్పవలసి వచ్చినప్పుడు ప్రోసెస్ (process) అనిన్నీ అంటారు. సాంకేతికంగా వీటన్నిటికి లోతైన అర్థాలు ఉన్నాయి కనుక వీటిని కొంచెం జాగ్రత్తగా నిర్వచించి విపులీకరించ వలసిన అవసరం ఉంది.

ముందు “ప్రోసెస్” (process) అనే ఇంగ్లీషు మాటనే తీసుకుందాం. కాలగమనంతో ఒక పద్ధతిలో మార్పు చెందుతూ నడిచే ప్రక్రియని ఇంగ్లీషులో “ప్రోసెస్” అంటారు. దీనిని ప్రక్రియ లేక పరికర్మ అని తెలుగులో అనొచ్చు. ఈ ప్రక్రియ లేదా పరికర్మ ఎవరో ఒకరో, ఏదో ఒకటో చెయ్యాలి కద. “డ్రైవు చేసే దానిని డ్రైవర్ అన్నట్లే ప్రోసెస్ చేసేదానిని ప్రోసెసర్ అంటారు. దీనిని మనం తెలుగులో ప్రక్రియకారి అనో పరికర్మరి అనో అనాలి. (మనకి తెలుగులో ఈ రకం ప్రయోగాలు లేకపోలేదు. అల్లేవాడు అల్లుడు, జాలంతో పని చేసే వ్యక్తి జాలరి, కుండలు చేసేవాడు కుమ్మరి, మొదలైనవి.) ఈ రోజుల్లో చూపుడు వేలు గోరంత పరిమాణం ఉన్న చిన్న సిలికాన్ చితుకు (silicon chip) మీద ఈ పరికర్మరి అంతా పట్టెస్తుంది కనుక దీనిని “సూక్ష్మపరికర్మరి” అని కూడా అనొచ్చు. దీనినే మైక్రోప్రోసెసర్ (microprocessor) అని ఇంగ్లీషులో అంటారు. “మైక్రో” అంటే సూక్ష్మమైన అని అర్థం. “నయా పైస” కాలక్రమేణా పైస అయినట్లు ఈ రోజుల్లో “మైక్రో” అన్నా అనకపోయినా పరవాలేదు. ఈ కర్మరి లోనే లెక్కలు అన్నీ జరుగుతాయి.

పోతే, రెండవ భాగం పేరు కొట్టు లేదా కోఠీ (store) లేదా ధారణి (memory). ఈ కొట్టు రూపురేఖలు కూడా సాంకేతిక రంగంలో జరుగుతూన్న విప్లవాలతో మారుతున్నాయి. పూర్వం అయస్కాంతపు ఉంగరాలు, టేపులు, పళ్లేలు, చిల్లుల కాగితపు టేపులు వాడేవారు. ఇప్పుడు సిలికాన్ చితుకులు, లేసర్‌తో చదవగలిగే పళ్లేలు వాడుకలోకి వచ్చేయి. ఇక్కడ సాంకేతికమైన వివరాలు చాలా చెప్పుకోవచ్చు. సాంకేతికమైన మార్పులకి అతీతంగా కోఠీలని తార్కికమైన దృష్టితో సందర్శించడం మంచిది. తార్కికంగా కొట్టు అమరికని పోస్టాఫీసుల్లో ఉత్తరాలు బట్వాడా చెయ్యడానికి వాడే గదుల బీరువాలా ఉహించుకోవచ్చు. ప్రతి గదికి ఒక చిరునామా లేదా విలాసం (address) ఉంటుంది. ప్రతి గదిలోను ఒక అష్టా (అంటే, ఎనిమిది ద్వింకముల మాల) పడుతుందని అనుకుందాం.

పైన ఉదహరించిన రెండు అంశాలు మనకి సాధారణంగా బయటకి కనపడవు; డబ్బా లోపల ఎక్కడో ఉంటాయి. కనపడినా, చూడడానికి చిన్న చిళ్ల పెంకులాగో, పళ్లేల దొంతరలాగో కనిపిస్తాయి తప్ప, చూసినంత మాత్రాన అవి పని చేసే విధానం అవగాహన కాదు.

మూడు, సమాచారాన్ని లోపలికి పంపడానికీ, బయటకి తియ్యడానికి కావలసిన సదుపాయాలు. ఇవి రకరకాలుగా ఉండొచ్చు. వీటన్నిటిని కలిపి ఇంగ్లీషులో input/output అంటారు. తెలుగులో అంతర్యానం/ బహిర్యానం అన్నాం ఇదివరలో. మనం ఏ కంప్యూటరుతో ఏ పనిచేసినా వీటి మధ్యవర్తిత్వం ఉంటుంది కనుక ఇవి మనకి పరిచయమైన తెర (screen), ముద్రాపకి (printer), కుంచికపలక (keyboard), మూషికం (mouse), కేమెరా, మోడెం, వగైరా రూపాలలో కనిపిస్తాయి. ఇవి కాకుండా సమాచార రవాణాకి రహదారులు ఉంటాయి. ఇవి చూడడానికి రకరకాల ఆకారాలలో ఉన్న తీగలలా ఉంటాయి. వీటిని ఇంగ్లీషులో “బస్” (bus) అంటారు. ఈ “బస్” అనే పదం లేటిన్ లోని “ఆమ్నిబస్” (omnibus) అనే మాటకి సంక్షిప్తమే తప్ప మనం ప్రయాణం చేసే బస్సుకీ దీనికీ ఏ విధమైన సంబంధమూ లేదు. “ఆమ్నిబస్” అంటే “అందరికీ” అని అర్థం. విద్యుత్తుని అందరికి పంచి ఇచ్చే సాధనం కనుక మొదట్లో (అంటే, కంప్యూటరు యుగానికి ముందే) దీనికి ఆ పేరు వచ్చింది. కంప్యూటరు రంగంలో ఈ మాటకి అర్థం, “విద్యుత్ వాకేతాలని అన్నిచోట్లకి తీసుకెళ్లే రహదారి” అని చెప్పుకోవచ్చు. అంటే వాకేతాలు ప్రవహించే తీగల కట్ట. స్వయంబోధకంగా ఉంటే బాగుంటుంది కనుక మనం “బస్”ని అందాకా “తీగలకట్ట” (చీపురుకట్టలా) అందాం. సంస్కృతం మీద అభిమానం ఉన్నవాళ్లు దీనిని “తంతివారం” అనొచ్చు.

ఈ మూడు కఠినాంగం లేక “హార్డ్‌వేర్” (hardware) కోవ లోకి వస్తాయి. ఈ మూడు కాకుండా కంటికి కనబడని నాలుగో భాగం ఒకటి ఉంది. ఇది కలనకలశంలో కూర్చుని కథ నడిపిస్తుంది. కంప్యూటరులో ఉన్న అన్ని భాగాలు, ఎప్పుడు, ఎలా పనిచెయ్యాలో ఇది నిర్ణయిస్తుంది. అంటే పెత్తనం దీనిది. నిరవాకం దీనిది. దీని పర్యవేక్షణలోనే కంప్యూటరు నడుస్తుంది. చూద్దామంటే కనబడదు. పట్టుకుందామంటే పట్టుబడదు. ఇలా సర్వశక్తి సంపన్నమైన ఈ “ఇది”ని ఇంగ్లీషులో “ఆపరేటింగ్ సిస్టం” అంటారు. దీనిని తెలుగులో ఉపద్రష్ట అనొచ్చు లేదా నిరవాకి అనొచ్చు. లేదా నిర్వహణ వ్యవస్థ అనొచ్చు. ఉపద్రష్ట అంటే యజ్ఞయాగాదులని దగ్గర ఉండి నడిపించే వ్యక్తి. నిరవాకి అంటే నిరవాకం చేసేది. ఈ నిరవాకి మృదులాంగం (లేదా కోమలాంగం, లేదా software) కోవలోకి వస్తుంది.

కఠినాంగాన్ని ఒక భవనపు పునాదితో పోల్చితే, ఈ నిరవాకిని గోడలు, తలుపులు, మెట్లు వగైరాలతో పోల్చవచ్చు. పునాదులు లేకుండా గోడలని లేవనెత్తలేము. పునాదులు, గోడలు, గదులు, గుమ్మాలు, టొపారం ఉంటే ఏవో కొన్ని కనీస అవసరాలని తీర్చుకోవచ్చేమో కాని భవనం పూర్తిగా ఉపయోగం లోకి రాదు; అది ఒక డొల్ల (shell) మాత్రమే. ఆ “డొల్ల” భవనాన్ని ఎవరికి కావలసిన హంగులతో వారు మలుచుకోవాలి. కొందరు ఆ భవనాన్ని పాఠశాలగా వాడుకోవచ్చు. మరొకరు అదే భవనాన్ని నివాసయోగ్యమైన ఆవాసికలు (apartments or flats) గా విడగొట్టి వాడుకోవచ్చు. వేరొకరు అదే భవనాన్ని కచేరీగానో, ఆసుపత్రిగానో వాడుకోవచ్చు. అంటే ఎవరికి కావలసిన సదుపాయాలు వారు కొనుక్కుని, ఆ డొల్లలో అమర్చుకుని, ఆ భవనాన్ని వాడుకోవాలి. ఈ రకం సదుపాయాలని అనువర్తనాలు (ఇంగ్లీషులో applications అని కాని applications programs అని కాని) అంటారు. బ్రౌజరు (browsers), ఇ-మెయిలు (E-mail), “పద పరికర్మరి” (word processor), స్ప్రెడ్‌షీట్లు (spreadsheets), పవర్‌పోయింట్ (powerpoint), వగైరాలన్నీ ఈ కోవకి చెందుతాయి. ఈ అనువర్తనాలు అన్నీ, అందరికీ అవసరం ఉండవు. ఎవరికి కావలసినవి వారు కొనుక్కుని, కలనయంత్రంలో కీల్కొల్పుకుని (install చేసుకుని) వాడుకుంటారు.

పూర్వపు రోజుల్లో మైక్రోసాఫ్ట్ (Microsoft) కంపెనీ వారు అమ్మిన నిరవాకిని “డిస్క్ ఆపరేటింగ్ సిస్టం” (Disk Operating System) లేదా ముద్దుగా “డాస్” (DOS) అనేవారు. దీనినే MS-DOS అని కూడా అంటారు. ఆ రోజుల్లో ఈ నిరవాకి చేసే పని, ముఖ్యంగా, పరికర్మరి (లేదా కలనకలశం) లో ఉన్న దస్త్రాలు (files) తీసుకుని వాటిని కొట్లో పళ్లేల మీద రాయడం, అక్కడ నిల్వలో ఉన్న దస్త్రాలని పరికర్మరి లోకి తీసుకు రావడం. అందుకని ఆ రోజుల్లో ఆ పేరు సరిపొయింది. ఈ రోజుల్లో నిరవాకి ఇంకా ఎన్నో పనులు చేస్తుంది; కంప్యూటరు డబ్బాలో ఉన్న కఠినాంగాలకీ, వినియోగదారులు (users) కి మధ్య ఒక వారధిలా పనిచేస్తుంది.

ఈ రోజుల్లో బాగా ప్రచారంలో ఉన్న నిరవాకులు చాల ఉన్నాయి. వాటిల్లో కొన్ని పేర్లు: విండోస్-ఎన్‌టి (Windows NT), ఒ-ఎస్/2 (OS/2), యూనిక్స్ (Unix), డాస్/విండోస్ (DOS/Windows), విండోస్ 2000 (Windows 2000), మొదలైనవి. “విండోస్ 2000” వంటి నిరవాకి ఉండడం వల్లనే మనం కీబోర్డు (కుంచికపలక) మీద టైపు కొట్టిన అక్షరాలు వెనువెంటనే తెర మీద కనిపిస్తున్నాయి. ఈ నిరవాకి ఆధ్వర్యం లోనే మూషికాన్ని ఒక్క సారి “క్లిక్” చెయ్యగానే ముద్రాపకి కాగితం మీద అచ్చుకొట్టడం మొదలు పెడుతుంది. ఈ నిరవాకి ప్రమేయం లేకుండా విద్యుల్లేఖలు (E-mails) పంపలేము. నిరవాకి చేసే ఈ చాకిరీ అంతా మన అనుభవ పరిధిలో ఉన్న పనులు. మనకి తెలియకుండా మరెన్నో సాంకేతికమైన ఇంటి పనులు (housekeeping operations) నిరవాకి నేపథ్యంలో చేసుకు పోతూ ఉంటుంది. ఇవన్నీ అవసరం వెంబడి తెలుసుకుందాం.

ఈ పనులన్నీ చెయ్యడానికి నిరవాకికి తోడు ఉంది. నిరవాకితో చేతులు కలిపి సహాయం చేసే వాటిల్లో ముఖ్యమైనదానిని ఇంగ్లీషులో “బయాస్” (BIOS) అంటారు, అంటే Basic Input Output System అని అర్థం. ఈ బయాస్‌లో శాశ్వతంగా నిలచిపోయే రీతిలో కొన్ని ఆదేశాలు ఉంటాయి. అంటే ఈ రకం కొట్లో ఉన్న దత్తాంశాలు, ఆదేశాలు మనం చదవగలం కాని, ఉన్న వాటిని చెరిపేసి కొత్తవి రాయలేము. అందుకని బయాస్ నిర్మాణానికి వాడే సాధనాలలో CD-ROM (అంటే, Compact Disk – Read Only Memory) ముఖ్యమైనది. దీని “నిల్వ చేసే సామర్ధ్యం” దరిదాపు 680 MB (అంటే, 680 మిలియను అష్టాలు) వరకు ఉంటుంది. మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్లు, కంప్యూటరు ప్రాణం ఈ బయాస్‌లో ఉంటుందనుకోవచ్చు. ఇందులో ఉన్నవి ఏ కారణం వల్లనైనా చెరిగిపోతే, కంప్యూటరు ప్రాణం పోయినట్లే. అందుకనే చెరపడానికి వీలుకాని కొట్లో బయాస్ క్రమణికలు దాచుతారు.

బయాస్‌లో దాచిన ఆదేశాలు అటు కఠినాంగాలకీ, ఇటు నిరవాకికీ మధ్యవర్తిలా పని చేస్తాయి. ఉదాహరణకి నిరవాకిని నడిపే మృదులాంగం నకలు ఒకటి పళ్లెం మీద ఉంటుంది. కంప్యూటరుని “ఆన్” చెయ్యగానే ఈ మృదులాంగం లోని కొన్ని ముఖ్యమైన క్రమణికలు (programs) ప్రాథమిక స్థాయి కొట్లోకి రావాణా కావాలి. ఈ పని చెయ్యడానికి కావలసిన ఆదేశాలు బయాస్‌లో ఉంటాయి. మరొక ఉదాహరణ. కంప్యూటరుని “ఆన్” చేసిన వెంటనే మనం కీబోర్డు మీద ఏదో టైపు చెయ్యవలసిన అవసరం వస్తుంది. అంటే అంతవరకు ప్రాణం లేకుండా పడున్న కుంచికపలకకి ప్రాణం పోసి లేవగొట్టాలి. ఇలా లేవగొట్టడానికి కావలసిన క్రమణికలని “కుంచికపలక చోదరి” (keyboard driver) అంటారు. దీనిని కూడా బయాస్ లోనే దాచి ఉంచుతారు. ఇలాగే కంప్యూటరుతో సంభాషించడానికి కావలసిన మృదులాంగ చోదరులు (software drivers) అన్ని కూడా బయాస్ లోనే నిక్షిప్తమై ఉంటాయి. ఇదే విధంగా పళ్లెం మీద నిక్షిప్తం అయి ఉన్న నిరవాకిలోని క్రమణికలు అవసరం వెంబడి ప్రాథమిక స్థాయి కొట్లోకి రవాణా చెయ్యడానికి కావలసిన క్రమణికలు కూడా ఈ బయాస్ లోనే దాచుకోవాలి. ఇక్కడ “గుడ్డు ముందా? పిల్ల ముందా?” వంటి ప్రశ్న పుట్టే అవకాశం ఉంది కనుక ఇప్పటికి ఈ చర్చ ఆపుతాను.

ఇంటికి తీసుకెళ్లవలసిన అంశం. నిరవాకి లేదా ఉపద్రష్ట లేదా ఆపరేటింగ్ సిస్టం లేని కఠినాంగం (hardware) ప్రాణం లేని కట్టె లాంటిది. రెండూ ఉంటేనే ఏ పని అయినా చెయ్యగలిగే స్తోమత వస్తుంది.

ఈ రోజుల్లో కంప్యూటరుల చేత మనం చేయించలేని పనులు లేవు. కంప్యూటరుల సహాయం లేకుండా రైల్వే రిజర్వేషన్లు జరగవు, విమానాలు నడవవు, రాకెట్లు ఎగరవు, బేంకులో డబ్బు ధరావరతు కాదు, కార్లు నడవవు, కర్మాగారాలు నడవవు, టెలిఫోనులు పని చెయ్యవు, ఆఖరికి కంప్యూటరుల సహాయం లేకుండా కొన్ని శస్త్ర చికిత్సలు కూడా జరగవు. కంప్యూటరులు ఆగిపోతే ఆధునిక సమాజం ఆగిపోతుంది. కంప్యూటరులు ఇంత ప్రతిభ చూప గలుగుతున్నాయంటే దానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. అవి:

వచ్చిన చిక్కల్లా కంప్యూటరులు ఎప్పుడు ఏ పని చెయ్యాలో అంతా మనం అరటిపండు ఒలిచినట్లు విడమర్చి చెప్పాలి. మనం చెప్పటంలో తప్పుంటే కంప్యూటరు తప్పు చేస్తుంది కాని తనంత తాను తప్పు చెయ్యదు.

కంప్యూటరు ఎప్పుడు ఏమిటి చెయ్యాలో విడమర్చి చెప్పే ఆదేశాలని ఇంగ్లీషులో instructions అని కాని commands అని కాని అంటారు. ఇలా ఆదేశాలని ఒక క్రమంలో రాసినప్పుడు దానిని తెలుగులో 'క్రమణిక' అనిన్నీ ఇంగ్లీషులో ప్రోగ్రామ్‌ (program) అని అంటారు. ఇలా ప్రోగ్రాములు రాసే ప్రక్రియని ప్రోగ్రామింగ్ (programming) అంటారు. ఈ ప్రోగ్రాములు రాసే వ్యక్తిని ప్రోగ్రామర్‌ (programmer) అంటారు. కంప్యూటరులో రకరకాల పనులు చెయ్యటానికి రకరకాల క్రమణికలు వాడతారు. ఒకొక్క రకం ప్రోగ్రాముకు ఒకొక్క పేరు ఉంటుంది. ఉదాహరణకి ఎసెంబ్లర్‌, కంపైలర్‌, ఆపరేటింగ్‌ సిస్టమ్‌, మొదలైనవి కొన్ని రకాల ప్రోగ్రాములు. ఈ ప్రోగ్రాములన్నిటిని కలిపి ఇంగ్లీషులో సాఫ్‌ట్‌వేర్‌ (software) అంటారు. ఇలా ప్రోగ్రామర్లు రాసిన సాఫ్‌ట్‌వేర్‌ని కంప్యూటరు లోనే ఒకచోట భద్రపరుస్తారు. ఇలా భద్రపరచిన ప్రదేశాన్ని కొట్టు (store or memory) అంటారు. ఈ కొట్టు గదిలో దాచిన సాఫ్‌ట్‌వేర్‌ లోని ఆదేశాలని ఒకటీ ఒకటి చొప్పున కంప్యూటరు బయటకి తీసి, చదివి, అర్ధం చేసుకొని, ఆ ఆదేశాన్ని ఆచరణలో పెడుతుంది. ఇదంతా దరిదాపు విద్యుత్‌వేగంతో జరిగిపోతుంది. సెకెండుకి మిలియను ఆదేశాలని ఆచరణలో పెట్టగలిగే కంప్యూటరులు సర్వసామాన్యం.

కంప్యూటరులని రెండు విభిన్న కోణాల నుండి అధ్యయనం చెయ్య వచ్చు. మనిషికి స్థూలమైన భౌతిక శరీరం, కంటికి కనిపించని సూక్ష్మమైన ఆత్మ ఉన్నట్లే కంప్యూటరులకి స్థూలకాయం (హార్డ్‌వేర్‌), సూక్ష్మకాయం (సాఫ్ట్‌వేర్) అని రెండు భాగాలు ఉన్నాయి. సూక్ష్మ కాయం నివసించడానికి స్థూలకాయం కావాలి. అలాగే సూక్ష్మ కాయం లేక పోతే స్థూలకాయం ప్రాణం లేని కట్టె లాంటిది.

సిద్ధాంతపరంగా చూస్తే ఎటువంటి సమాచారమునయినా సంవిధానపరుచుటకు మనము కంప్యూటరులను ఉపయోగించవచ్చు. చర్చి-టూరింగు సిద్దాంతం ప్రకారం, ఒక నిర్దేశిత కనీస సామర్థ్యము ఉన్న కంప్యూటరుతో - అది పాకెటు డైరీ కానీవండి లేదా పెద్ద సూపరు కంప్యూటరు కానీయండి - మనము చేయగలిగే ఎటువంటి కార్యమునయినా నియంత్రించవచ్చు. కాబట్టి ఒకే రూపకల్పనను మనము వివిధ కార్యములను నెరవేర్చేటందుకు మలచవచ్చు. అవి కంపెనీలో జీతాల జాబితాలను నియంత్రించేది కావచ్చు లేదా ఫ్యాక్టరీలలో యంత్రాలను పనిచేయించే రాబోటులను నియంత్రించేవి అయినా అవచ్చు.

కంప్యూటరుకు సంబంధించిన సాంకేతిక అంశాలు ఎన్ని మార్పులు చెందినా, 1940ల నుండి ఇప్పటి వరకు మార్పు చెందనిది ఈ స్టోర్డ్ ప్రోగ్రాము ఆర్కిటెక్చరు ('భద్రపరిచిన ప్రోగ్రాము' అనే ఊహపై ఆధారపడ్డ నిర్మాణము) మాత్రమే. దీనిని ఫాన్ నోయిమన్ రూపశిల్పం (von Neumann architecture) అని కూడా పిలుస్తారు. ఈ రూపకల్పన వలన కంప్యూటరు అనేది ఒక వాస్తవ రూపము దాల్చగలిగింది. ఈ నిర్మాణము ప్రకారము మనము కంప్యూటరును నాలుగు ముఖ్య భాగములుగా విభజించవచ్చును. ఈ భాగములనన్నిటిని అనుసంధానించుటకు 'బస్' అను తీగల కట్టను ఉపయోగిస్తారు. వీటిని ఒక క్రమపద్ధతిలో నడిపించుటకు 'టైమరు' లేదా గడియారము అను ఒక వ్యవస్థను ఉపయోగిస్తారు.

ఉదాహరణ

పెద్ద పట్టణాలలో, నాలుగు వీధుల మొగలలో సంచార దీపాలు (traffic lights) వాడుతున్నారు ఈ రోజుల్లో. సాధారణంగా ఈ సంచార దీపపు గుత్తిలో మూడు దీపాలు ఉంటాయి: ఎరుపు, పసుపు, ఆకుపచ్చ. ఎదురుగా ఎర్ర దీపం కనిపిస్తూ ఉన్నంత సేపూ వాహనాలు ఆగి ఉండాలి. ఎదురుగా పసుపుపచ్చ దీపం కనిపిస్తే త్వరగా కూడలి (junction)లో ఉన్న వాహనాలు కూడలిని ఖాళీ చెయ్యాలి, కూడలిలో లేనివి కూడలి లోపలికి ప్రవేశించ కూడదు. ఎదురుగా ఆకుపచ్చ దీపం కనిపిస్తూ ఉన్నంత సేపూ వాహనాలు స్వేచ్ఛగా కూడలి గుండా పోవచ్చు. ఇవీ నిబంధనలు. ఇంతే కాకుండా ఎర్ర దీపం నిమిషం పాటు వెలగాలి. పసుపు దీపం మూడు సెండ్లు వెలగాలి. పచ్చ దీపం నిమిషం పాటు వెలగాలి. ఏ రెండు రంగుల దీపాలు ఒకే సారి వెలగ కూడదు అని కూడా నిబంధనలు విడమర్చి చెపుదాం.

ఇప్పుడు ఆ సంచార దీపాన్ని నియంత్రించటానికి ఒక క్రమణిక (program) ఈ కింది విధంగా రాయవచ్చు.

ఈ క్రమణికలో పదకొండు ఆదేశాలు (instructions) ఉన్నాయి. కంప్యూటరు ఈ పదకొండు ఆదేశాలనీ ఒక దాని తరువాత మరొకటి అమలు పరుస్తూ, అలా అంతు లేకుండా పనిచేస్తుంది.

కంప్యూటరు సమాచారాన్ని బక్షించి, మర్దనా చేసి, రంగరించి, జీర్ణించికుని, కొత్త సమాచారాన్ని మనకి ఇస్తుందని చెప్పుకున్నాం. మచ్చుకి ఈ ప్రశ్నలు చూడండి: బయట ఎన్ని డిగ్రీలు వేడిగా ఉంది? కారు ఎంత జోరుగా పరిగెడుతోంది? ఫలానా వాడి వయస్సు ఎంత? సాధారణంగా ఈ రకం ప్రశ్నలకి నిర్దిష్టంగా సమాదానాలు చెప్పడం కుదరదు. వయస్సు ఎంత అంటే ఏ 26 అనో 33 అనో చెబుతాం. చిన్న పిల్లలని అడిగితే మూడున్నర ఏళ్లు అని చెప్పినా ఆశ్చర్యపోము. కాని నిజానికి మన వయస్సు క్షణక్షణానికీ పెరుగుతూ ఉంటుంది. కాని మనం సాధారణంగా “నా వయస్సు 33 ఏళ్ల, ఆరు నెలల, మూడు రోజుల, ఎనిమిది గంటల, మూడు నిమిషాల,…. అంటూ చెప్పం. ఇలా సమాచారాన్ని కత్తిరించి కుదిమట్టంగా గుళికలలా చెయ్యడాన్ని “గుళికరించడం” (quantization) అందాం. ఇటుపైన ఉష్ణోగ్రత, వయస్సు, వేళ, మొదలైనవి కంప్యూటరులోకి ఎక్కించవలసి వచ్చినప్పుడు వాటిని కత్తిరించి, గుళికరించి వాడదాం. గుళికరించగా వచ్చిన సంఖ్యలని అదే పళంగా కంప్యూటరు వాడుకోలేదు. ఉదాహరణకి 33.14 అనే సంఖ్యనే తీసుకుందాం. దీన్ని గుళికరించి 33 చేసి ఆ పళంగా కంప్యూటరుకి ఇస్తే దానికి అర్థం కాదు. అందుకని ఆ 33 ని 100001 అని ఒకట్లు, సున్నలు ఉన్న పద్ధతిలో రాసి కంప్యూటరుకి ఇవ్వాలి.

మనం కంప్యూటరులో దత్తాంశాలు (data), ఆదేశాలు (instructions or commands) దాచినప్పుడు వాటిని ఎక్కడ దాచేమో తెలియాలి కదా. అందుకని కొట్టు (store or memory) అనే గదిని అరల పెట్టెలా ఊహించుకుందాం. అంటే, పోస్టాఫీసులో ఉత్తరాలు బట్వాడా చేసే బీరువాలా కాని, పోపు సామానులు దాచుకునే పెట్టెలా కాని ఉంటుందని ఊహించుకుందాం. ప్రతి “అర”కి ఒక చిరునామా లేదా విలాసం (address) ఉంటుంది. ప్రతి అర ఒక అష్టా (byte) పొడవు ఉంటుంది అని కూడా ఊహించుకుందాం. అంటే, ప్రతి అర లోనూ 8 ద్వింకములు (bits) పొడుగున్న సంఖ్య పడుతుంది. ఇలాంటి అరలు 1024 ఉంటే వాటిల్లో సున్న నుండి 1023 వరకు, మొత్తం 1024 ఏకైక ద్వియాంశ సంఖ్యలని దాచవచ్చు. కనుక అష్టా పొడుగున్న అరల పెట్టేలలో 0, 1, 2, 3, 4,…, 9 వరకు అంకెలు, A, B, C, D, …, Z వరకు పెద్ద బడిలో అక్షరాలు, a, b, c, d, …, z అనుకుంటూ చిన్న బడిలో అక్షరాలు, !, @, $, ^, , *, (, ), _, +, -, /, , ? వంటి చిహ్నాలు సునాయాసంగా దాచవచ్చు. ఈ శాల్తీ (character) లు అన్నీ కలుపుకున్నా 1024 కంటె తక్కువే ఉంటాయి కనుక ఇవి సునాయాసంగా మన కొట్లో పడతాయి. పట్టగా ఇంకా ఖాళీలు కూడా మిగిలిపోతాయి.

ఇప్పుడు ఒక ఒప్పందం చేసుకుందాం. ఏమిటా ఒప్పందం? : 0 ని 0000 0000 గాను, A ని 01000 0001 గాను, M ని 1101 0101 గాను అనుకుంటూ, కుంచికపలక (keyboard) మీద కనిపించే ప్రతి శాల్తీని ఒక ఏకైక పద్ధతిలో, ద్వియాంశ మాల (binary string) రూపంలో రాద్దాం. అలా రాసినప్పుడు కుంచికపలక మీద ఉన్న కొన్ని శాల్తీలు ఎలా ఉంటాయో ఈ దిగువ పట్టికలో చూడండి. దీనినే ASCII code అంటారు. ఈ సున్నలని, ఒకట్లని పదే పదే రాయడం కష్టం కనుక వీటిని షోడశాంశలో ఎలా రాయవచ్చో కూడా చూపించేను.

ఉదాహరణ

ఉదాహరణకి చాల చిన్న కంప్యూటరులలో “ముద్రాపకి” (printer) విలాసం షోడశాంశలో 378 అయి ఉండడం రివాజుగా వస్తూన్న ఆచారం. అంటే మనం అచ్చు కొట్టవలసిన అక్షరాన్ని ఈ విలాసం ఉన్న గదిలో దాచి, “ఇప్పుడు ముద్రించు” అని ఆదేశం ఇచ్చేమంటే కంప్యూటరు తిన్నగా 378 విలాసం ఉన్న గదిలోకి వెళ్లి, అక్కడ ఏది కనిపిస్తే దాని నకలు తీసుకుని ఆ నకలుని ముద్రాపకికి పంపుతుంది. ఇదీ టూకీగా కంప్యూటరు పని చేసే విధానం.

ఇప్పుడు కంప్యూటరు ఎలా పనిచేస్తుందో మరి కొంచెం వివరంగా చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణతో చెబుతాను. ఈ వివరణ ఒకటికి రెండు సార్లు చదివితే కాని గభీమని అర్థం కాదు. కొంచెం ఓపిక పట్టి చదవాలి.

ఒక కథో, వ్యాసమో రాసే ఉద్దేశంతో కంప్యూటరు ఎదురుగా కూర్చుని, కుంచికపలక (keyboard) మీద M అనే ఇంగ్లీషు అక్షరం ఉన్న కుంచిక (key) ని నొక్కేమని అనుకుందాం. అప్పుడు ఆ M అనే అక్షరం తెర మీద కనిపించడానికి ఎంత తతంగం ఉందో చవి చూద్దాం.

ఒక్క చిన్న పని చెయ్యడానికి ఇంత హడావిడా? పైపెచ్చు ఇదంతా త్రుటి కాలంలో జరిగిపోయినట్లు మనకి భ్రమ కలుగుతుంది. కలనకలశం మన జ్ఞానేంద్రియాల కంటే ఎన్నో రెట్లు జోరుగా పని చెయ్యడమే ఈ భ్రమకి కారణం.

పైన రాసినది కేవలం ఒక నఖచిత్రం అని మరచ పోకండి. ఈ ఒక్క పని చెయ్యడానికి లోపల జరిగే తతంగం కూలంకషంగా వర్ణించాలంటే ఎన్నో కాగితాలు ఖరాబు చెయ్యాలి. ఇలాంటి పనులు సెకండుకి వెయ్యికి పైబడి కలశం చేస్తూ ఉంటుంది.

ఇదంతా చదివి కంప్యూటరులని అర్థం చేసుకోవాలనే ఆశ వదలుకోకండి. ఏ ఒక్క వ్యక్తికి, అన్నీ అర్థం కావు. కంప్యూటరులతో రోజూ పని చేసేవాళ్లకి కూడా కొద్ది భాగమే అర్థం అవుతుంది.

ఏ ఎల్ యు. ఇది రెండు రకాల పనులు నిర్వర్తించును: గణిత కార్యకాలాపాలు అనగా కూడికలు (additions), తీసివేతలు (subtractions), గుణింతములు (multiplications), భాగాహారములు (divisions). రెండవ రకమయిన కార్యములు తర్కమునకు (logic) సంబంధించినవి. ఇది సెంట్రల్‌ ప్రోసెసింగ్‌ యూనిట్ లో 
(సి.పి.యు) ముఖ్యమైన భాగం.

నియంత్రణ వ్యవస్థ. దీనికి కేటాయించిన ముఖ్యమయిన పనులు: ఆదేశములను, డేటాను మెమరీ నుండి లేదా ఐ/ఓ నుండి చదవటం, ఆ ఆదేశములను అర్ధం చేసుకోవటం, ఏ ఎల్ యుకు ఆదేశానుసారము సరిఅయిన సంఖ్యలను అందించటం, ఏ ఎల్ యుకు ఆ సంఖ్యలతో ఏమి చేయాలో చెప్పటం, వచ్చిన ఫలితములను తెరిగి మెమరీ వద్దకు గానీ ఐ/ఓ వద్దకు గానీ పంపించటం. ఈ విభాగములో కౌంటరు అను ఒక లెక్కపెట్టే పరికరము ప్రస్తుత ఆదేశము నిల్వ ఉన్న చిరునామా యొక్క జాడను ఎల్లప్పుడూ తెలుపుతూ ఉంటుంది. సాధారణంగా ఒక ఆదేశము నిర్వర్తించగానే ఈ కౌంటరు యొక్క లెక్క పెరుగును. దీని వలన తరువాతి ఆదేశమును చదువుటకు వీలగును. అప్పుడప్పుడు ప్రసుత ఆదేశమే తరువాతి ఆదేశము యొక్క చిరునామాను తెలుపును. అటువంటి సమయాలలో కౌంటరు యొక్క లెక్కను సరిచేయటమే ఆదేశముగా భావించవలెను. 1980ల నుండి ఏ ఎల్ యు, నియంత్రించు విభాగము భౌతికంగా ఒకే చిన్న ఇంటిగ్రేటెడ్ సర్క్యూటులో ఉంచబడినవి. దానిని కేంద్రీయ సంవిధాన విభాగము - సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ (సి పి యు) అంటారు.

కంప్యూటరు యొక్క జ్ణాపకశక్తిని వరుసగా పేర్చిన గదుల పెట్టెలుగా భావించవచ్చు. ప్రతీ గదికీ ఒక ప్రత్యేక సంఖ్య చిరునామాగా ఉంటుంది. ప్రతీ గదిలో సమాచారమును భద్రపరచవచ్చు. ఈ సమాచారము కంప్యూటరుకు ఇవ్వవలసిన ఆదేశములు అయి ఉండవచ్చు, లేదా దత్తాంశాలు (డేటా, అంటే ఆదేశాలను నిర్వర్తించుటకు కావలిసిన సమాచారము) అయినా అయిఉండవచ్చు. శాస్త్ర ప్రకారం మనము ఆదేశాలను కానీ దత్తాంశాలను కానీ భద్రపరుచుటకు ఏ గది నయినా ఉపయోగించవచ్చు.క

ఈ విభాగము బయట ప్రపంచము నుండి సమాచారము సేకరించుటకు,, ఫలితములను బయట ప్రపంచమునకు తెలుపుటకు ఒక సాధనముగా ఉపయోగపడును. ఒక మామూలు వ్యక్తిగత కంప్యూటరులో సమాచారమును ప్రవేశపెట్టుటకు కీబోర్డు, మౌసులను, బహిర్గపరుచుటకు కంప్యూటరు మానిటరు, ప్రింటరు మొదలగు వాటిని ఉపయోగిస్తాము. ఇవి కాక ఇంకా ఎన్నో సాధనములను కంప్యుటరుకు బయట ప్రపంచమునకు మధ్య మార్పిడికి ఉపయోగిస్తారు.

సాధారణంగా ఇటువంటి కంప్యూటరు యొక్క పనిచేయు విధానము చాలా సూటిగా ఉంటుంది. కౌంటరు యొక్క లెక్క పెరిగిన ప్రతీసారి ఒక క్రొత్త ఆదేశమును, దానికి సంబంధించిన డేటాను మెమరీ నుండి చదివి దానిని నిర్వర్తించడము, తిరిగి ఫలితములను మెమరీలో బద్రపరచటం, మళ్ళీ తరువాతి ఆదేశమును స్వీకరించటం. ఈ విధముగా హాల్ట్ (ఆగుము) అను ఆదేశము వచ్చు వరకు జరుగుతూనే ఉంటుంది.

పెద్ద పెద్ద కంప్యూటరులలో ఈ నమూనాలో కొంచం తేడా ఉండును. వాటిలో ఒక సిపియు బదులుగా అనేక మయిన సిపియులు ఉండును. సూపరు కంప్యూటరులలో ఈ నిర్మాణము మరింత తేడాగా ఉండును. వాటిలో కొన్ని వేల సిపియులు ఉండును, అట్టి నిర్మాణములు ప్రత్యేకమయిన కార్యములకు మాత్రమే ఉపయోగించుతారు.

కొన్ని విశ్వవిద్యాలయాలలో కంప్యూటరు శాస్త్రాన్ని థీయరిటికల్ స్టడీ ఆఫ్ కంప్యుటేషన్ గా, అల్గారిదమిక్ రీజనింగుగా భోధిస్తారు. ఈ బోధనలో మామూలుగా థీయరీ ఆఫ్ కంప్యుటేషన్, అల్గారిథంల విశ్లేషణ, ఫార్మల్ పద్ధతులు, కాంకరెన్స్, డేటాబేసులు, కంప్యూటరు గ్రాఫిక్సు, సిస్టం విశ్లేషణ వంటి కోర్సులు చెపుతారు. ఇంకా కంప్యూటరు ప్రోగ్రామింగు కూడా చెపుతారు, కానీ దీనిని ఇతర విభాగాలకు సహాయకారిగా ఎక్కువగా భావిస్తారు, ఉన్నత కోర్సుగా కాకుండా! ఇక కొన్ని కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, సెకండరీ స్కూళ్ళు కంప్యూటరు శాస్త్రాన్ని వృత్తి విద్యగా చెపుతారు, ఈ కోర్సులలో కంప్యూటరు థీయరీ అల్గారిథంల పై కాకుండా కంప్యూటరు ప్రోగ్రామింగుపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తారు. ఈ సిలబసు కంప్యూటరు విద్యను సాఫ్టువేర్ ఇండస్ట్రీకి ఉపయోగపడే ఉద్యోగులను తయారు చేయడంపైననే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తుంది. కంప్యూటరు శాస్త్రము యొక్క ప్రాక్టికల్ విషయాలను సాధారణంగా సాఫ్టువేర్ ఇంజినీరింగ్ అని పిలుస్తారు. కాకపోతే దేనిని సాఫ్టువేర్ ఇంజినీరింగు అన వచ్చు అనే విషయము పై ఏకాభిప్రాయము లేదు. ఉదాహరణకు చూడండి పీటర్ జే. జెన్నింగ్ , టెక్నికల్ సింపోసియం ఆన్ కంప్యూటరు సైన్సు ఎడుకేషన్, 2004.
భారతీయ భాషల కంప్యూటరు ప్రక్రియ కంప్యూటరులను భారతీయభాషలలో వాడటానికి కావాలసిన ప్రామాణిక పద్ధతులను వివరిస్తుంది.

ప్రస్తుత సమాజములో దాదాపుగా అన్ని వృత్తుల వారు కంప్యూటరులను ఉపయోగించుచున్నారు. కాకపోతే విద్యాలయాలలో, కంప్యూటరులను ఉపయోగించుటకుగాను, వాటిని నడుపుటకు కావలిసిన ప్రోగ్రాములను వ్రాయుటకు ప్రత్యేక పద్ధతులను నేర్పుటకు గాను, ప్రత్యేక వృత్తివిద్యలు అవతరించినాయి. కానీ ప్రస్తుతానికి ఈ వృత్తివిద్యలకు ఉన్న నామములు, పదజాలము నిలకడగాలేవు అని చెప్పవచ్చును, కొత్త కొత్త విభాగములు పుట్టుకు వస్తూనే ఉన్నాయి. వీటిలో ముఖ్యమయినవిగా ఈ క్రింది వాటిని పేర్కొన వచ్చు:

దీనిని ఎలక్ట్రానిక్ ఇంజినీరింగుకు ఒక శాఖగా భావించవచ్చు. ఈ విభాగములో మనము కంప్యూటరుల యొక్క భౌతిక లక్షణాలు, వాటి నిర్మాణ ప్రక్రియ, నిర్మాణమునకు కావలిసిన విడిభాగముల గురించి వివరములు నేర్చుకొనవచ్చును.

anchuri gopal-Associate Proffessor computer engineering -
oruallu technology india software industry-near University-Hanamkonda,Waragnal cuty-Telangana-india
web site 




#Article 6: ఊరగాయ (1146 words)


ఊరగాయ దక్షిణ భారతదేశ ఆహార పదార్థం. దీనిని ఆవకాయ అని కూడా అంటారు.అనేక రకాల కాయల నుండి ఈ ఊరగాయలు తయారుచేస్తారు. ఈ ఊరగాయను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

తెలుగువారికి ఆవకాయ గురించి ఉపోద్ఘాతం అవసరంలేదు. వారికి ఇంటింటా సుపరిచితమైన వంట. అమెరికా వెళ్ళే తెలుగువారు చాలామంది తప్పక తీసుకువెళ్ళే పదార్థం. తింటున్న అన్నానికి వేరువేరు రుచులు కలపడానికి నంజుకునే వంటకాన్ని ఊరగాయ అంటారు. ఉదాహరణకు, కొత్తగా తోడుపెట్టిన తియ్యటి పెరుగన్నం తినేటప్పుడు దబ్బకాయ ఊరగాయ నంజుకుంటే పులుపు, కారం, ఉప్పు, కొద్దిగా దబ్బతొక్క చేదు కలిసి జిహ్వకు ఎంతో సుఖం కలిగిస్తుంది. పచ్చడి, పికిలు. ప్రాచీన గ్రంథాలలో ఊరుగాయ అని కూడా ఉంటుంది.

పుల్ల పచ్చి మామిడి ముక్కలతో చేసే ఆవకాయ, మాగాయ, లేక దాని కోరుతో చేసే మామిడికోరు ఊరగాయ; నిమ్మ, దబ్బ, ఉసిరి, గోంగూర, చింతకాయ, పండుమిరప, ఉల్లి, వెల్లుల్లి ఊరగాయలూ తరతరాల నుంచీ తెలుగువాళ్ళు వాడుతున్నారు. ఈ మధ్య టమోటా, దోస, కారట్టు, కాలిఫ్లవరు ఊరగాయల్లాంటివి గూడా వాడడం మొదలుపెట్టారు.

మామిడికాయలను తడిబట్టతో తుడిచి, ముక్కలు చేసి అందులో జీడి తీసేయాలి. ఒక గిన్నెలో కారంపొడి, ఉప్పు, జీలకర్ర, మెంతిపొడి, పసుపు వేసి ఉండలు లేకుండా బాగా కలియబెట్టాలి. మరో గిన్నెలో నువ్వులనూనె వేడి చేయాలి . ఈ నూనె బాగా కాగిన తర్వాత ఇంగువ వేసి చిటపటలాడాక ఆవాలు, జీలకర్ర కూడా వేసి పోపు పెట్టాలి. గిన్నెను పొయ్యి మీదనుండి దింపేయాలి. నూనె చల్లారనివ్వాలి. నూనె కాస్త చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం, వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలియబెట్టాలి. దీనివల్ల అందులోని తడి పోయి కమ్మగా ఉంటుంది. పూర్తిగా చల్లారాక కలిపి ఉంచుకున్న పొడుల మిశ్రమాన్ని వేసి మొత్తం కలపాలి. తర్వాత మామిడి ముక్కలు వేసి మొత్తం మసాలా ముక్కలకు పట్టేటట్టుగా కలపాలి. మొత్తం కలిపి శుభ్రమైన, తడిలేని జాడీలో ఆవకాయ వేసి జాగ్రత్తగా మూత పెట్టి ఉంచాలి. మూడు రోజుల తర్వాత మరోసారి ఆవకాయనంతా కలియబెట్టాలి. అంతే నోరూరించే కమ్మని ఆవకాయ తినడానికి తయారవుతుంది.

పలురకాల ఊరగాయలు (ముఖ్యంగా ఆవకాయ, మాగాయ, గోంగూర ఊరగాయలు) తయారుచేసే విధానాన్ని తెలుగువారే మొదట కనిపెట్టారు. ఊరగాయలు వాడడం ప్రాచీనకాలంనుంచీ జరుగుతోందని చెప్పడానికీ చాలా నిదర్శనాలున్నాయి. ఇప్పుడు ఊరగాయలవాడకం ఇండియా అంతటా వ్యాపించింది. ప్రాచీన తెలుగు సాహిత్యంలో ఊరగాయల గురించి ప్రస్తావన ఉంది కూడా. 

ప్రాచీన సాహిత్యంనుంచి  ఊరగాయల గురించి ఒక మంచి పద్యం:

సీ.   మామిడికాయయు, మారేడుగాయయు, 

తే.గీ.   కుందెనపుకొమ్ము, మామెనకొమ్ము, బుడమ

 
ఈ పద్యం నుంచి 18వ శతాబ్దంలో తెలుగువాళ్ళు ఎన్నో రకాల ఊరగాయలని చేసుకొని తినేవారని తెలుస్తుంది. ఈ పద్యం చదివినప్పుడల్లా ఏ తెలుగువారికైనా నోరు ఊరుతుంది. 

ఆముక్తమాల్యద శ్రీకృష్ణుడి భక్తురాలైన గోదాదేవి కథ, చాలా విచిత్రమైనది. తన జీవితాన్ని శ్రీకృష్ణుడికే అంకితం చెయ్యదలచుకొని ఈవిడ పెళ్ళి చేసుకోలేదు. ఈవిడనే మొదటి ఆండాళ్‌ అంటారు. ఈవిడ విష్ణుచిత్తుడి కూతురు. విష్ణుచిత్తుడు ప్రతిరోజూ ఒక కొత్త పూలదండ తయారుచేసి, శ్రీకృష్ణుడి విగ్రహానికి వెయ్యమని కూతురికి ఇచ్చేవాడు. గోదాదేవికి తన నాథుడైన శ్రీకృష్ణుడికి దండ మంచిదైతేనేగానీ వెయ్యడం ఇష్టంలేదు. అదిమంచిదో కాదో తెలుసుకోవడానికి దాన్ని ముందు తను ధరించి, మంచిదనిపించినతర్వాతే శ్రికృష్ణుడి విగ్రహానికి వేసేది. ఒకరోజు విష్ణుచిత్తుడు పూజ చేసే సమయంలో విగ్రహానికి వేసియున్న దండలో పొడుగాటి వెంట్రుకను చూస్తాడు. కూతురు దండను తను ముందు ధరించి తర్వాత దాన్ని విగ్రహాంమీద వేసిందని అతను అప్పుడు తెలుసుకుంటాడు. వాడిన పూలదండను దేవుడికి వెయ్యడం మహాపాపం అంటూ కూతుర్ని కోపగించి, ఆ వాడిన దండ తీసేసి, ఒకకొత్తదండ తయారుచేసి తనే వేస్తాడు. ఆ రాత్రి విష్ణుచిత్తుడికి కృష్ణుడు కలలో కనిపించి నాకు ఇవ్వాళ నువ్వు వేసిన దండ ఏమీ బాగాలేదు. మళ్ళీ రేపటినుంచీ నాకు మీ అమ్మాయి ఇంతకుముందువేశే దండల్లాంటివే వెయ్యమను అని హెచ్చరిస్తాడు.

ఆ కాలంలో విష్ణుచిత్తిడు తన అతిధుల భోజనానికి వివిధ ఋతువుల్లో ఏ ఏ వంటకాలు వడ్డన చేశేవాడో, ఈ వంటకాలు చెయ్యడానికి అతని భార్య ఎలాంటి వంటచెరుకు (కట్టెలు, కొబ్బరిచిప్పలు) వాడేదో, ఈ గ్రంథంలో 3 పద్యాల్లో వర్ణిస్తాడు శ్రీకృష్ణదేవరాయలు. ప్రతిపద్యం క్రిందా బ్రాకెట్టుల్లో దాని తాత్పర్యంకూడా యివ్వబడింది.

చం.  గగనము నీటిబుగ్గ కెనగా జడి వట్టిన నాళ్ళు భార్య క

(వరి అన్నము, ఒలిచిన పప్పు, నాలుగైదు కూరలు, వడియము, వరుగు, పెరుగు, నెయ్యి- ఇవి వర్షాకాలపు వంటకాలు.)

చం.  తెలినులి వెచ్చ యోగిరము, దియ్యని చారులు, దిమ్మనంబులున్‌,

(వెచ్చని అన్నము, చారు, తీయని చారు, అంబలి, చెఱకు పాలు, కొబ్బరినీళ్ళు, ఇతర రసములు, పండ్లు, చల్లని నీళ్ళు, వడమామిడిపిందెలు, నీరుమజ్జిగ- ఇవి వేసవికాలపు వంటకాలు.)

మ.   పునుగుందావి నవోదనంబు, మిరియంపుం బొళ్ళతో జట్టి చు-

(పునుగు వాసనగల అన్నము, మిరియాల పొడులు, ఘమఘమలాడు వేడి కూరలు, ఆవ, చిగురు పచ్చళ్ళు, పాయసము, ఊరుగాయలు, కరిగిన నేయి, పాలు- ఇవి శీతాకాలపు వంటకాలు.) ఇరపమొక్కలు భారతదేశానికి అమెరికాఖండం నుంచి వచ్చాయి. కారం రుచికి మిరియాలను వాడినట్లు చెప్పాడు. ఈ గ్రంథం వ్రాశిన కాలానికి మిరపమొక్కలు ఇంకా భారతదేశానికి రాలేదేమో!)

ఆముక్తమాల్యదకు ముందే 14వ శతాబ్దంలో రచింపబడిన క్రీడాభిరామంలో  కూడా ఊరగాయల గురించి ఒకపద్యం రూపంలో ప్రస్తావన ఉంది.

ఉ.   కప్పురభోగి వంటకము, కమ్మని గోధుమపిండి వంటయున్‌,

(మంచి సన్నన్నము, గోధుమపిండి వంట (రొట్టె), పంచదార, ఆవు నేయి, పెసరపప్పు, అరటి పండ్లు, నాలుగైదు ఊరుగాయలు, పెరుగు ఇవన్నియు ఒక రూకకు లభించును.) 

మిగతా వంటకాలకూ, ఊరగాయలకూ ముఖ్య భేదం ఏమిటంటే ఊరగాయలు చెయ్యడానికి వేడి అవసరం లేదు. ఊరగాయ చేసే పద్ధతి ఇలా ఉంటుంది: ఊరగాయగా చెయ్యబోతున్న కాయలను బాగా శుభ్రంచేసి, తడి ఆరాక వాటిని ముక్కలుగా కొయ్యాలి (ముక్కల ఊరగాయ చెయ్యడానికి), లేక కోరుగా తురమాలి (కోరు ఊరగాయ చెయ్యడానికి). అప్పుడు వాటిలో ఉప్పు, పసుపు, కారం, ఆవ పిండి, జీలకర్ర పిండి, ఆవాలు, వెల్లుల్లి, వేరుశనగ పప్పు, నువ్వుల నూనె, బెల్లం మొదలైన దినుసులు సరైన మోతాదులలో బాగా కలిపి, మిశ్రమాన్ని ఒక జాడీలో ఉంచాలి. కొన్నిరోజులు ఊరి, కాయముక్కలు మెత్తబడ్డాక అది ఊరగాయ అవుతుంది. కలిపిన దినుసుల సమూహంలో కాయ ఊరడంవల్ల తయారయింది కనుక దానికి ఊరగాయ అని పేరు పెట్టారు. 

నిలవ ఉంచినప్పుడు బూజు పట్టకుండా ఉండడానికి కాబోలు ఊరగాయల్లో ఉప్పు మరీ ఎక్కువ వేసే వారు పూర్వ కాలంలో. కానీ ఉప్పు ఎక్కువ తింటే బ్లడ్‌ ప్రెజరు పెరుగుతుందని తెలుసుకున్నాం గదా ఇప్పుడు. అందుకనే తక్కువ ఉప్పుతో ఊరగాయలు చేసే విధానాలు అమలులోకి వచ్చాయి. కానీ ఇలా చేసిన ఊరగాయలు ఎక్కువ కాలం నిలువజేయాలంటే వాటిని రెఫ్రిజిరేటర్లో ఉంచాలి.

ఇండియన్లు చేసే ఊరగాయలకూ, మిగతా దేశస్థులు చేసే పికిల్సు అనే వంటకాలకూ చాలా భేదాలున్నాయి. అమెరికా, యూరప్‌ల్లో చేసే కుకుంబర్‌ పికిలు, కుకుంబర్‌ని వినెగర్‌లో నానబెట్టడంతో తయారవుతుంది. జర్మన్‌లు చేశే సవర్‌క్రౌట్‌ తురిమిన కాబేజిని వినగర్లో నానబెట్టడంతో తయారవుతుంది. అలానే కొరియన్‌లు చేసే కిమ్చి కూడా, తురిమిన కాబేజి, చేపలూ, మాంసం ముక్కలూ వినగర్లో నానబెట్టడంతో తయారవుతుంది. వీళ్ళ పికిల్సన్నిటిలోనూ ముఖ్యంగా తగిలే రుచి పులుపు మాత్రమే. మన ఊరగాయల్లో ఆవ పిండీ, కారం, పసుపు, నువ్వుల నూనె (కొన్నిట్లో కొద్దిగా బెల్లం) మొదలైన దినిసులు ఉండడం ఒక గొప్ప విశేషం. దీనివల్ల మన ఊరగాయల్లో అన్నిరుచులూ తగుల్తాయి.

సాధారణంగా మనం ఇడ్లీ, దోశల్లాంటివి తినేటప్పుడు నంచుకోవడానికి పచ్చళ్ళు (కొబ్బరి పచ్చడి, దోసపచ్చడి, బీరతొక్కు పచ్చడి వగైరా) వాడతాం. ఈ పచ్చళ్ళు నిలువ ఉండవు, వాటిని సాధారణంగా చేసిన రోజునే వాడేస్తారు (ముఖ్యంగా రెఫ్రిజిరేటర్లు లేని పూర్వ కాలంలో). ఊరగాయలు అలా కాకుండా చాలారోజులు నిలువ ఉంటాయి. ఇదీ పచ్చళ్ళకూ, ఊరగాయలకూ ముఖ్య భేదం. కానీ ఈ మధ్య ఊరగాయలను కూడా పచ్చళ్ళని పిలవడం పరిపాటి అయిపోయింది. 

ఇంగ్లీషు వాళ్ళు భారతదేశం మొదట వచ్చినప్పుడు మన ఊరగాయలను రుచి చూశారు. ఇలాంటి వంటకాన్ని ఎప్పుడూ చూడకపోవడం చేత, వాటిని ఇంగ్లీషులో ఏమని పిలవాలో వారికి తెలియలేదు అప్పుడు. కానీ వారి పికిల్సులాగా పులుపుగా ఉండడంచేత ఊరగాయలను పికిల్సు అని పిలవడం మొదలుబెట్టారు. ఇండియాలో ఇంగ్లీషు వాడకం పెరిగిన కొద్దీ ఊరగాయలను పికిల్సు అని చెప్పుకోవడం వాడుకలోకి వచ్చింది.

ఇప్పుడు చిన్నిచిన్ని పల్లుటురుల్లో తప్పించి చాలామంది ఊరగాయల్ని స్వయంగా చేసుకునే బదులు, తయారుచేయ్యబడ్డ ఊరగాయల్ని మార్కెటులో కొనుక్కుంటున్నారు. దీనివల్ల ఊరగాయల తయారీ, అమ్మకం పెద్ద బిజినెస్‌ అయిపోయింది. ఇప్పుడు ఇండియాలో ఊరగాయలు చేశే పెద్దపెద్ద కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు ఊరగాయల్ని సీసాల్లోనూ, ప్లాస్టిక్‌ పౌచిల్లోనూ పాక్‌ చేశి ప్రపంచమంతటా సరఫరా చేస్తున్నారు. ఆరోగ్యంగా ఉండడానికి చాలామంది ఉప్పు, నూనె వాడకం తగ్గించాలనుకుంటున్నారుకదా ఈ రోజుల్లో. ఈ రెండు దినుసుల్నీ తక్కువగా వాడి ఊరగాయల్ని చెయ్యడం మొదలుపెట్టితే ఈ కంపెనీలు వారి బిజినెస్‌ వాల్యూముని ఇంకా బాగా పెంచుకోవచ్చు.

కొంతమంది, ఊరగాయల్ని తింటే ఆరోగ్యం చెడిపోతుందనో, లేక దాంట్లోని కారంవల్ల తిన్న మర్నాడు టాయిలెట్‌ వాడినప్పుడు కడుపునొప్పి లేక మంట కల్గుతుందనో అపోహ పడ్తారు. నిజానికి, ఇలా భయపడనవసరం లేదు. అన్ని ఆహారపదార్ధాలనీ తగుమోతాదులలోనే తినాలన్నది మాత్రం సత్యం. ఏ ఆహారపదార్ధమైనాసరే, మోతాదుమించితింటే శరీరానికి అపాయం కల్గవచ్చు. ఉత్తి మంచినీళ్ళైనా సరే తక్కువకాలంలో విపరీతంగా తాగేస్తే శరీరనికి చాలా హాని కల్గుతుంది. ఊరగాయలో ఉప్పు ఎక్కువగా ఉంటే, దాన్ని అతిగా తినడంవల్ల బ్లడ్‌ప్రెజరు పెరగవచ్చు. కానీ కారంగానీ, కారంఉన్న ఊరగాయలుగానీ మోతాదులో రోజూ తినడంవల్ల ఆరోగ్యం చెడిపోదని కచ్చితంగా చెప్పవచ్చు. నిజానికి దానివల్ల మెరుగవుతుందికూడా. రోజూ మోతాదులో ఊరగాయలు తినడం జీర్ణశక్తిని పెంచుతుందనీ, మనిషిలోని చలాకీతనాన్నీ, సరదాతనాన్నీ పెంచుతుందనీ పరిశోధనలవల్ల తెలిశింది. ఇంకొకరి మాటలు నమ్మడమెమ్దుకు. మీకు ఊరగాయలు తినే అలవాటు లేకపోతే, నచ్చిన ఊరగాయల్ని కొద్దిగా ప్రతిరోజూ తినడం మొదలుబెట్టి చూడండి. కొన్ని రోజుల్లో మీకే తెలుస్తుంది వాటివల్ల మీ జీవితం మెరుగవుతోందని.

ఉప్పు, కారం వగైరా రుచులతో ఉండే ఊరగాయలు మనిషిలో చలాకీతనం, చురుకుదనం, హుషారుతనం పెంపొందిస్తాయని చెప్పాను కదా. కనుక ఊరగాయలు తినడంవల్ల మోహ, కామోద్రేకాలూ; లైంగికవాంఛలూ పెరుగుతాయని అనుకోవడం సహజం. 1979-లో రిలీజు అయిన ``ఇంటింటి రామాయణం సినిమా నుంచి ఈ ఆలోచనని సమర్ధించే ఉప్పూ కారం తినకతప్పదూ-తప్పో ఒప్పో నడక తప్పదూ అనే పాట పాడుతారు. సినిమాలో ఈ పాటను, ప్రేమించుకొని పెళ్ళికని ఉవ్విళ్ళూరుతున్న ఒక జంట పాడతారు. పాటలో, ఉప్పు, కారం తినడం మూలాన శరీరవాంఛలు పెరుగుతాయనే భావన గ్రహించండి. ఊరగాయలు చెయ్యడానికి వాడే మిగతా స్పైసుదినిసులకు గూడా ఈ లక్షణం ఉన్నట్లు ప్రతీతి. దీంట్లో ఆవగింజంత సత్యం లేకపోలేదు. అందుకనే కాబోలు, దైవభక్తీ, భగవచ్చింతనా, ఆద్యాత్మికచింతనా అలవరచుకోమని బోధించే స్వాములు సాధారణంగా ఊరగాయలు తినవద్దని చెప్తుంటారు. నా సలహా మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. జీవితాన్ని ఎన్నో విధాలుగా ప్రభావితం చేశే ఉప్పు, కారం రుచులుగల ఊరగాయల్లాంటి పదార్ధాలని విసర్జించమనడం కన్నా, చిన్నతనం లోనే పిల్లలందరికీ; ప్రాపంచిక, ఐహిక, శరీర వాంఛలను అదుపులో పెట్టుకోగల్గే క్రమశిక్షణ నేర్పించడం చాలా ముఖ్యమని నేను చెప్తాను. ఇలాంటి క్రమశిక్షణ నేర్చుకున్నవారు మోతాదులో ఊరగాయలూ, స్పైసులూ తింటే వారి జీవితం చాలా మెరుగవుతుంది.

మాగాయే మహా పచ్చడి
పెరుగేస్తే మహత్తరి 
అది వేస్తే అడ్డ విస్తరి 
మానిన్యాం మహా సుందరి.




#Article 7: తెలుగుదనం (471 words)


సాధారణంగా తెలుగు వారి ప్రవర్తనలో కనిపించే అలవాట్లనూ, వాళ్ళు పాటించే ఆచారాలను తెలుగుదనాలు అంటారు. 

లంగా ఓణి లతో ఉన్న అమ్మాయిని చూసి తెలుగుదనం ఉట్టి పడుతుంది అంటారు, రూపాయికి వంద పైసలు లేదా పదహారు అణాలు అందువల్ల వందశాతం తెలుగుదనంతో అచ్చమైన తెలుగు సంస్కృతి అలవాట్లు కలబోసుకున్న తెలుగు అమ్మాయిని ‘పదహారణాల తెలుగమ్మాయి’ అంటారు.

పురుషులు ధోవతులుచొక్కాలు,  ఆడవాళ్ళూ చీరలు రవికెలు వస్త్రధారణ చేయడం తెలుగు వారి సంప్రదాయాలలో ఉంది. 

తెలుగు భాష పూర్వ ఔన్నత్యం అన్నప్పుడు మనకు గిడుగు రామమూర్తి గారు కందుకూరి , గురజాడ ,రాయప్రోలు,  దేవులపల్లి, జాషువా వీరందరూ మనసులో మెదులుతారు. వారందరు ధోవతులు,  చొక్కాలు ధరించిన వారే. తెలుగు భాషాభిమానం సాంప్రదాయ వేషభాషలతో మొదలవుతుంది. ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి పదవిని పొందినా సరే తెలుగుదనం ఉట్టిపడేలా సాంప్రదాయక ధోవతి, చొక్కాను ధరిస్తాడు. సుభాష్ చంద్రబోస్ కూడా కొన్ని సమయాలలో ధోవతి కట్టేవాడు.

తెలుగు వారు తమ గడపలకు పసుపు రాయడం, ఇంటి ముందర ముగ్గులు పెట్టడం, గుమ్మానికి తోరణాలు కట్టడం, కుంకుమ బొట్టు పెట్టుకోవడం, సాంప్రదాయక దుస్తులు ధరించడం వంటి ఆచారాలు ఉన్నాయి.  పెద్దలు కనపడం  గానే నమస్కారం చేయటం .బయటనుంచి వచ్చినపుడు కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి రావటం మొదలైనవి కూడా తెలుగు వారి సంప్రదాయాలే. కవిత్వం అంటే  పద్యాలలోనే రాయాలి. వ్యాకరణం పాటించాలి.

తెలుగువారి అచ్చతెలుగుదనం తెలుగు వారి వంటకాల్లోనే ఉట్టిపడుతూ ఉంటుంది. మనవంటకాల్లోనే మనప్రత్యేకత ఉందన్న విషయం దృఢంగా తెలియాలంటే తెలుగు వారి తినుబండారాలు తినడం చేతనవాలి. తెలుగు వారు గర్వించదగ్గ వంటకాలు ఏవని అడిగితే ఎవరైనా ఇడ్లీ, మసాలాదోసె వంటి అనేక వంటకాల పేర్లు చెబుతారు. కానీ తెలుగువారిని గుర్తించే వంటకం దిబ్బరొట్టె. ఇప్పుడు ఈ దిబ్బరొట్టెని కొన్ని మార్పులు చేసి ఊతప్పం గా దక్షిణాదివారు మార్చారు. ఇప్పుడు తెలుగువాళ్ళకి ఊతప్పమే తెలుసు గానీ దిబ్బరొట్టె తెలియకుండా పోయింది.

పెసరట్టు తెలుగు వాడి తినుబండారం. పెసరట్టులోనే తెలుగుదనం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. తెలుగు వాడు తప్ప మరొకడు వండలేనిది పెసరట్టు. పెసరట్టు ఏలూరులో పవరుపేట లో పుట్టింది. కాలవ ఒడ్డున  కాకి వారి వీధిలో పెసరట్ల రామయ్య గారి కొట్లో పెసరట్టు పుట్టింది.  కాలానుగుణ్యంగా పెసరట్టు ఇతర కోస్తా జిల్లాల వాళ్ళకి అలవాటయ్యింది.

ఊరగాయలు తినడం ఒక ముఖ్య తెలుగుదనం. ఎక్కడున్నా సరే, తెలుగువారు తినడానికి ఊరగాయల కొరకు ఉవ్విళ్ళూరుతుంటారు. ఇంకొక ప్రాంతంలో కానీ, దేశంలో కానీ స్థిరపడడానికి వెళ్తున్నా తెలుగువారు తమ ఊరగాయలని తప్పకుండా తమతో తీసుకు వెళ్తారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే తెలుగువారు నివసించడం మొదలుపెడితే, ఆ ప్రాంతంలో త్వరలో ఊరగాయ సీసాలు అమ్మే షాపులు వెలుస్తాయని కచ్చితంగా చెప్పవచ్చు.

పండుగ పూట వేకువనే లేచి సున్నిపిండితో నలుగు పెట్టుకుని తలంటు పోసుకోవడం తెలుగువారి సంప్రదాయం. చలిపొద్దులు, గంగిరెద్దులు, భోగిమంటలు, తలంటులు, పిండివంటలు, జడగంటలు, కొత్త పంటలు, హరిదాసులు, గొబ్బెమ్మలు, బంతిపూలు, భోగిపళ్లు, పాశురాలు, దాసరి కీర్తనలు, పిళ్ళారి ఆరగింపులు, సాతాని జియ్యర్లు, రంగవల్లులు, రథం ముగ్గులు, బొమ్మల కొలువులు అన్నీ కలిస్తే... సంక్రాంతి.

అత్తయ్య, మావయ్య, తాతయ్య, బాబయ్య, బామ్మ, పిన్ని వంటి కమ్మని వరుసలలో బంధువులని పిలుచుకోవడం తెలుగువారి సంప్రదాయం. బంధువుల వరస లేమిటి, అమ్మ అన్న కమ్మని పిలుపే నేడు కరువయింది.  సెల్‌ఫోన్లు, కంప్యూటర్లతోనే తప్ప- పిచ్చుకలు, పావురాలు, తూనీగలు, గోరువంకలు, లేగదూడలు, కుక్కపిల్లల వంటి సజీవ సహజీవులతో సావాసాలను బాల్యం మరిచేపోయింది. అసలవి మానవ పరివారంలోంచే తప్పుకొన్నాయి. చెట్లతో, ఏటిగట్లతో, పైరగాలితో స్నేహం చెడిపోయింది. పసివాళ్ల బతుకులు బోన్‌సాయి మొక్కలైపోయాయి. మొదళ్లు గిడసబారిపోయాయి. నిరంతరం యంత్రాలతోనే గడిపేస్తూ, పిల్లలు తామూ వాటిలో భాగం అయిపోతున్నారు. మాతృభాషలో విద్యాబోధన ఏ దశలోంచి కరవైపోయిందో అప్పుడే విద్యావ్యవస్థలోంచి తెలుగుదనం తప్పుకొంది. పసితనంలోనే ఆదర్శ జీవనానికి, వ్యక్తిత్వ నిర్మాణానికి, సంస్కార వికాసానికి దోహదం కూర్చే శతక వాఞ్మయం వూసే లేకుండాపోయింది. వ్యవస్థలో నైతిక విద్యార్జన, బోధన అడుగంటిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే- మన తిండి మనది కాదు. మన ఆలోచనలు మనవి కావు. మన మాటలు మనవి కావు. మన సినిమాలు మనవి కావు. మన బతుకే మనది కాకుండాపోయింది. అన్నింటా తెలుగుదనాన్ని,  మనల్ని మనమే పోగొట్టుకుంటున్నాం.

సభల్లో, సమావేశాల్లో, ఉత్సవాల్లో తెలుగుజాతి ప్రత్యేక కళారూపాన్నొకదాన్ని విధిగా వ్యాప్తిలోకి తేవాలి. స్వచ్ఛమైన జానపద సాహిత్యం, ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు, విభిన్నమైన కట్టుబాట్లను పునరుద్ధరించాలి. వారి ఔషధ విజ్ఞానం ప్రాచుర్యంలోకి రావాలి.

కోతికొమ్మచ్చులు, గోటింబిళ్లలు, గోదారీతలు, ఇసుకగుళ్లు, పాకంజీళ్లు, పప్పుబెల్లాలు, తొక్కుడుబిళ్లలు, వామనగుంటలు, వల్లంకి పిట్టలు, పట్టుపరికిణీలు, వెండిపట్టీలు, వైకుంఠపాళీలు, రుక్మిణీ కల్యాణాలు...వంటివి తెలుగువారి సంప్రదాయక విధానాలు.




#Article 8: ఖగోళ శాస్త్రము (708 words)


ఖగోళ శాస్త్రము (astronomy) అంటే నభోమండలం గురించిన అధ్యయనం. అంటే అంతరిక్షశాస్త్రం. అకాశంలో మనకి కనిపించే సూర్య, చంద్ర గ్రహ, నక్షత్రాదులతోపాటు విశ్వంలో ఉన్న అనేక ఖగోళ వస్తువులు/ పదార్థాల ఉత్పత్తి, ఉనికి, లక్షణాలు, నాశనములను శాస్త్రబద్ధంగా వివరిస్తుంది.

ఖగోళశాస్త్ర్రం అత్యంత ప్రాచీన విజ్ఞాన శాస్త్రాలలో ఒకటి. దూరదర్శిని (టెలిస్కోపు) కనుగొన్న తరువాత ఖగోళశాస్త్ర్రం కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అనంతంగా విస్తరించింది. 20వ శతాబ్దంలో ఖగోళశాస్త్రం రెండు ఉపశాస్త్రాలుగా విభజించబడింది. అవి: 

ఖగోళశాస్త్రానికి ఉన్న ప్రత్యేకత ఏమంటే, ఔత్సాహిక శాస్త్రజ్ఞులు (ఉత్సాహవంతులైన, నూతన, అనుభవము లేని శాస్త్రజ్ఞులు) కూడా చాలా ముఖ్యమైన విషయాలు కనుక్కున్నారు.(టెలిస్కోపు, ఉత్సాహము ఉంటే చాలు మరి). లక్షల గేలెక్సీ(నక్షత్ర కూటమి) లతో, కోట్లాది నక్షత్రాలతో ఈ విశ్వము అనంతమైనది కనుక ఇంకా తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. 

భారతీయ జ్యోతిష శాస్త్రము(astrology)లో ఖగోళశాస్త్రానికి విశేష ప్రాముఖ్యత ఉంది. సూర్యసిద్ధాంతము అతి ప్రాచీన ఖగోళశాస్త్ర గ్రంథం. దీని రచయిత ఎవరో తెలియదు. ఆర్యభట్ట, వరాహమిహిరుడు ప్రఖ్యాత భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు.

ప్రాచీన ఖగోళశాస్త్రం మామూలు కంటికి కనిపించే ఖగోళ వస్తువుల గమనాన్ని పరిశీలించడం ద్వారా వేసుకున్న అంచనాలతో ఉండేది. భారతదేశంతో పాటు ప్రాచీన బాబిలోనియా, పర్షియా, ఈజిప్టు, గ్రీసు, చైనా లలో ఖగోళ వేధశాల(astronomical observatories)లు నిర్మించబడ్డాయి. సూర్య, చంద్ర, నక్షత్రాదుల గమనము ఆధారంగా ఋతువులు, వర్షాలను నిర్ధారించి వాటిని బట్టి పంటలను వేసుకునేవారు. భూమి విశ్వకేంద్రమనీ, భూమి చుట్టూ నక్షత్రాలు గ్రహాలు పరిభ్రమిస్తున్నాయనీ నమ్మే వారు (టాలెమీ భూకేంద్ర/జియోసెంట్రిక్ సిద్ధాంతము)

టెలిస్కోపు కనుగొనక ముందు కూడా రోదసి (space) గురించి చాలా ముఖ్యమైన విషయాలు కనుగొనబడ్డాయి. వాటి లో కొన్ని , సూర్య, చంద్ర గ్రహణాలు వచ్చే కాలాన్ని ముందే అంచనా వెయ్యడము, చంద్రుని వైశాల్యము, భూమికి చంద్రునికి ఉన్న దూరము.

పరిశీలక ఖగోళశాస్త్రములో 13 వ శతాబ్దపు పర్షియా(పర్షియన్ సామ్రాజ్యము) లో, ఇతర మహ్మదీయ సామ్రాజ్యములలో ఖగోళ శాస్త్రము లో ఎన్నో నూతన విషయాలు కనుగొనబడ్డాయి. ముస్లిం ఖగోళశాస్త్రజ్ఞులు పెట్టిన నక్షత్రముల పేర్లు ఇంకా వాడుకలో ఉన్నాయి.

రెనసాన్స్ కాలములో, నికోలస్ కోపర్నికస్ సౌరకుటుంబానికి సౌరకేంద్ర/హీలియోసెంట్రిక్ నమూనాను ప్రతిపాదించెను. కోపర్నికస్ పరిశోధనలను గెలీలియో గెలీలి, యోహాన్స్ కెప్లర్లు పరిరక్షించి, సవరించి, విస్తరించారు. గెలీలియో మొదటి సారి పరిశోధనల కోసము టెలిస్కోపులు తయారుచేసి వాడెను. కెప్లర్ గ్రహ గతులను వాటి కక్ష్య లను మొదటిసారి కచ్చితముగా కనుగొనెను. కెప్లర్ న్యాయము లను ఋజువు చేసే సిద్ధాంతాలను కనుగొనడానికి మటుకు ఐజాక్ న్యూటన్ చేత కనుగొనబడిన , గురుత్వాకర్షణ శక్తి ఉపయోగపడ్డవి. న్యూటన్ రిఫ్లెక్టింగ్ టెలిస్కోపును కనుగొనెను. ఆ తరువాత జరిగిన ఎన్నోపరిశోధనలు టెలిస్కోపు పరిమాణమును, నాణ్యతను పెంచాయి. నికోలాస్ లూయీ డి లాకాయె విపులమైన నక్షత్ర సూచీ పట్టీ (కేటలాగు) లను తయారు చేసెను. విలియమ్ హెర్షెల్ విస్తారమైన నెబ్యులా, క్లస్టర్ కేటలాగులను తయారు చేసెను. ఆయన 1781 లో యూరెనస్ గ్రహమును కనుగొనెను. 1838 లో ఫ్రెడరిక్ బెస్సెల్ మొదటిసారి ఒక నక్షత్రము నకు దూరమును కనుగొనెను.

పందొమ్మిదవ శతాబ్దంలో లియోనార్డ్ ఆయిలర్, అలెక్సిస్ క్లాడ్ క్లైరాట్, జాన్ లె రాండ్ డిఅలెంబర్ట్లు గుర్తించిన 3 బాడీ ప్రాబ్లెమ్, చంద్రుడు, గ్రహములగతులను కచ్చితముగా కనుగొనెను. వీరి పరిశోధనలను జోసెఫ్ లూయీ లాగ్రాంజ్, పియర్ సైమన్ లాప్లాస్లు క్రోడీకరించి గ్రహముల, ఉపగ్రహముల కంపనము బట్టి వాటి బరువులను కనుగొనే విధమును కనుగొనిరి.
నూతన సాంకేతిక పరిజ్ఞానముతో పాటు ఖగోళ శాస్త్రములో కూడా విశేషమైన అభివృద్ధి సంభవించెను. స్పెక్ట్రోస్కోపు, ఫోటోగ్రఫిలు ఖగోళశాస్త్రానికి బాగా ఉపయోగపడ్డవి. జోసెఫ్ వాన్ ఫ్రాన్ హోఫర్ 1814-15 ల లో సూర్యకాంతి లో 600 పట్టీ (bands) లను కనుగొనెను. ఈ పట్టీలకు కారణము 1859 లో గస్టావ్ కిర్కాఫ్ 'సూర్యుని లో వివిధ మూలకాలు ఉండడము' అని తేల్చెను. ఇతర నక్షత్రములు కూడా సూర్యుని వలే ఉండును కాని వివిధ ఉష్ణోగ్రతలు, బరువులు కలిగి ఉండునని కనుగొన్నారు.

భూమి, సౌరకుటుంబము ఉన్న పాలపుంత నక్షత్రకూటమి (మిల్కీవే గేలెక్సీ)వలే అంతరిక్షము (space)లో ఇతర నక్షత్రకూటములు ఉన్నవని 20వ శతాబ్దములో కనుగొనడము జరిగింది. విశ్వము విస్తరిస్తున్నదని మిగతా గేలెక్సీలు మన గేలక్సీకు దూరంగా జరుగుతున్నాయని కనుగొన్నారు. నూతన ఖగోళ శాస్త్రములో క్వాజార్లు, పల్సార్లు, బ్లాజర్లు, రేడియో గేలెక్సీలు వంటి విశేష వస్తువులు కనుగొనబడ్డాయి. ఈ పరిశోధనల నుండి విడుదలైన సిద్ధాంతాల వల్ల కాలబిలము(బ్లాక్ హోల్) లు, న్యూట్రాన్ స్టార్ లను వివరించడము జరిగింది. Physical cosmology 20వ శతాబ్దములో సాధించిన అభివృద్ధితో మహావిస్ఫోట(బిగ్ బ్యాంగ్) వాదము నకు భౌతిక,ఖగోళ శాస్త్రముల నుండి cosmic microwave background radiation, హబుల్ నియమము, cosmological abundances of elements మద్దతు వచ్చెను.

బాబిలోనియా, ప్ర్రాచీన గ్రీసుదేశము లలో ఖగోళశాస్త్రము లో చాలా మటుకు ఆస్ట్రోమెట్రీ ( ఆకాశంలోనక్ష త్రాలు,గ్రహాల ఉనికిని కనుక్కోవడము) మాత్రమే ఉండేది. ఆ తరువాత జోహాన్స్ కెప్లర్, ఐజాక్ న్యూటన్ లవల్ల  (celestial mechanics) అభివృద్ధి చెందింది. ఖగోళ శాస్త్రము లో గణితాన్ని ఉపయోగించి రోదసి వస్తువవులకు గురుత్వాకర్షణ బలాలతో గలిగిన గమనాలను అంచనా వేయడము జరిగేది. సౌరమండలం లో గల గ్రహములు, ఉపగ్రహములు, ఆస్టరాయడ్స్ వగైరా మీద దృష్టి కేంద్రీకరించడము జరిగేది. ఈ రోజుల్లో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానము వల్ల రోదసి వస్తువుల స్థితి గతులు కనుక్కోవడము తేలికైంది కనుక, నూతన ఖగోళ శాస్త్రము రోదసి వస్తువుల భౌతిక ధర్మములను అర్థము చేసుకోవడము లో నిమగ్నమై ఉంది.

ఖగోళ శాస్త్రము లో ను సేకరించడము కాంతి, ఇతర విద్యుదయస్కాంత వికిరణాలను కనుగొనడము, వాటి పరిశీలనల వల్ల సాధ్యమవుతుంది. అయితే  డిటెక్టర్ల వల్ల సూర్యుని నుండి వచ్చే న్యూట్రినో లు,  ల నుండి న్యూట్రినోల వల్ల కూడా ఇంకా సమాచారము సేకరించవచ్చు.  ప్రభావమును కనుక్కొనే పరికరాలు కూడా ఉన్నాయి.  లను కనుక్కొనే ప్రయోగములు కూడా జరుగుతున్నాయి.

విద్యుదయస్కాంత వర్ణమాల(స్పెక్టృమ్) లో ఉన్న తరంగదైర్ఘ్య (వేవ్ లెంగ్త్) విభజనల వలే ఖగోళ శాస్త్రములో కూడా విభజనలు ఉన్నాయి. 

దస్త్రం:The Keck Subaru and Infrared obervatories.JPG|300px|right|thumb| సముద్రమట్టము నుండి తగినంత ఎత్తు కలిగి కాలుష్యము లేని  ఈ భూమిమీద అంతరిక్ష పరిశోధనలు చెయ్యడానికి అత్యంత వీలు ఉన్న ప్రదేశాలలో ఒకటి

రోదసి నౌక (space ship), రోదసి వాహనాల (spacecraft) వల్ల గ్రహాల అధ్యయనము ముందంజ వేసింది. వీటిలో గ్రహాల చుట్టూ పరిభ్రమిస్తూ రీడింగులు తీసుకునే  వంటి మానవ నిర్మిత ఉపగ్రహాలు,  వంటి ల్యాండింగ్ వెహికిల్ లు(ఇతర గ్రహము మీదకు దిగగలిగే వాహనము) ల వల్ల గ్రహాలు, ఉప గ్రహాల గురించి చాలా సమాచారము గ్రహించబడింది. ,  వంటి అంతరిక్ష వాహనము (స్పేస్ షటిల్) (అంతరిక్షము లోకి వెళ్ళి మళ్ళీ ఈ భూమ్మీదకు వెనక్కు రాగలిగే వాహనము) ల వల్ల అంతరిక్షము లో పరిశోధనలు సాధ్యమవుతున్నాయి

ఖగోళ శాస్త్రము ఇతర విజ్ఞాన శాస్త్రములతో చాలా సన్నిహిత సంబంధాలను పెంచుకుంటున్నది. ఆ విధముగా కనుగొన బడ్డ ఉపశాస్త్రములు




#Article 9: శాస్త్రము (274 words)


శాస్త్రము అనేది ఒక సంస్కృత పదం.  దీని అర్థం సూత్రం, నియమాలు, నిబంధనల పత్రం, సంకలనం, పుస్తకం లేదా గ్రంథం. ఈ పదాన్ని సాధారణంగా భారతీయ సాహిత్యంలో, నిర్వచించిన ప్రదేశంలో సాంకేతిక లేదా ప్రత్యేక జ్ఞానం కోసం ప్రత్యయం వలె ఉపయోగిస్తారు.

శాస్త్రానికి ఆంగ్లపదమైన  -లజీ (logy) కి సమానమైన అర్ధం ఉంది.  ఉదా. ఎకాలజీ, సైకాలజీ.  అంటే ప్రత్యేకమైన అంశంపై శాస్త్రీయ, ప్రాథమిక జ్ఞానమును శాస్త్రం అనవచ్చు. ఆంగ్లంలో ఉన్న రకరకాల మాటలకి సమానార్ధకంగా  తెలుగులో శాస్త్రం అన్న ఒక్క మాట వాడతారు. ఉదాహరణకి ఆంగ్లంలో మాథమెటిక్స్  కు తెలుగులో గణితం లేదా గణితశాస్త్రం అంటారు.  ఆంగ్లంలో ఫిజిక్స్ అన్న మాటని భౌతికం అని అనకుండా  భౌతిక శాస్త్రం అంటారు. అలాగే కెమిస్ట్రీ  ని రసాయనం అనేసి ఊరుకోకుండా రసాయన శాస్త్రం అంటారు. ఆంగ్లపదాలైన బయాలజీ, జుయాలజీ పదాలలో ఉన్న లజీ ( -logy)  ని కూడా  శాస్త్రం అనే పదంగా వాడుతారు. ఇక్కడ లజీ అన్న పదం అర్థం అధ్యయన శాఖ. ఇక జెనెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎకనమిక్స్ వంటి పదాలు -ics తో అంతమవుతాయి. ఇక్కడ ఈ పదం శాస్తం గా పిలువబడి ఆయా పదాలకు అర్థాలు జన్యుశాస్త్రం, గణాంకశాస్త్రం,అర్థశాస్త్రంగా మారుతాయి. ఆస్ట్రానమీ, ఎకానమీ వంటి -nomy తో అంతమయ్యే పదాలలో -nomy కూడా శాస్త్రంగా పిలువబడుతుంది. వాటిని ఖగోళశాస్త్రం, ఆర్థిక శాస్త్రం అనే అనువదిస్తాము. జాగ్రఫీ అనే పదంలో జియో అనగా భూమి, గ్రఫీ అనగా గియ్యడం, రాయడం అని అనుకుంటే జాగ్రఫీకి భూమిని గురించి బొమ్మలు గియ్యడం అనే అర్థం స్పురిస్తుంది. దీన్ని కూడా మనం భూగోళశాస్త్రం అనే తెలిగిస్తున్నాం.

శాస్త్రము అనగా సైన్సు అని ఒక అర్థము.  రాయబడినది అని మరొక అర్దము కూడా చెప్పుకొనవచ్చు. ఉదాహరణకు మనము శాస్త్ర బద్దముగా అను పదానికి according to science అని అర్దము చెప్పుకొనడము చూడవచ్చు. అలాగే పురాణాలు, వేదాలు మొదలైన వాటిని అన్నింటినీ శాస్త్రాలు అని అంటారు.

పై ఉదాహరణలని బట్టి శాస్త్రము అన్న మాటకి బిగువైన నిర్వచనం లేదని తెలుస్తోంది. ఒకానొకప్పుడు ఉండేది. ఈ మధ్య పోయింది. ఈ పరిస్థితి తెలుగులోనే కాదు, ఇంగ్లీషులో కూడా ఉంది. పొలిటికల్‌ సైన్సు, సోషల్‌ సైన్సు మొదలైన మాటలు ఈ పరిస్థితికి ఉదాహరణలు. ఈ వ్యత్యాసాలని గుర్తిస్తూ, ప్రస్తుతం పబ్బం గడవాలి కనుక, ఈ శీర్షిక కింద వచ్చే సైన్సు అన్న మాట యొక్క అర్థం గణిత, భౌతిక, రసాయనిక, జీవ శాస్త్రాలు, వాటిమీద ఆధారపడ్డ అనువర్తిత (applied) శాస్త్రాలకి పరిమితం చేసి, మిగిలిన వాటిని వీటితో కలబెట్టకుండా ఉంటే సందిగ్ధతకి తావు ఉండదు.




#Article 10: కంప్యూటర్ హార్డ్‌వేర్ (199 words)


హార్డ్‌వేర్‌ అనే మాటకి కంప్యూటర్ పరిభాషలో ఒక ప్రత్యేకమైన అర్ధం ఉంది. చేతితో ముట్టుకోడానికిగాని, పట్టుకోడానికికాని వీలైన భాగాలన్నీ స్థూలకాయం (hardware) నిర్వచనంలో ఇముడుతాయి. ఉదాహరణకి, బల్ల మీద ఇమిడే సొంత కంప్యూటరు (desk-top personal computer) కొనగానే మన చేతులతో తడిమి చూడడానికి వీలైనవి ముఖ్యంగా మూడు: (1) కంప్యూటర్‌ యొక్క అంతర్భాగాలన్నిటిని కప్పుతూ పైకి కనిపించే రేకు పెట్టె లాంటిది ఒకటి, (2) మనం రాసేవి, చూసేవి కనపడడానికి వీలుగా ఒక గాజు తెర (దీన్నే monitor అంటారు), దానితోపాటు టైపు చెయ్యడానికి వీలైన ఒక మీటల ఫలకము (దీనినే keyboard అంటారు), వగైరా, (3) వీటన్నిటిని అనుసంధించడానికి తీగలు. ఇవీ బయటకి కనిపించే స్థూలకాయం యొక్క ముఖ్య భాగాలు.

కంప్యూటర్ హార్డ్‌వేర్ అనునది కంప్యూటరుకు సంబంధించిన ఒక భౌతిక విభాగం. ఒక కంప్యూటరు లోని విడి భాగాలు, వాటిని కలిపే సాంకేతిక పరికరాల సముదాయమే హార్డ్‌వేర్. ఐతే ఇది కంప్యూటరు సాఫ్ట్‌వేర్కు  పూర్తిగా భిన్నం. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ అనేది హార్డ్‌వేర్ లోనే అంతర్గతంగా పనిచేస్తుంది. సాఫ్ట్‌వేర్ లోనే మరో రకం ఫర్మ్ వేర్. వీటిని ఎప్పటికప్పుడు మార్చవలసిన అవసరం ఉండదు. కాబట్టి ఇవి రీడ్-ఓన్లీ మెమోరీ (ROM) లాంటి హార్డ్‌వేర్ భాగాల లోనే నిక్షిప్తం చేయబడతాయి.

కొన్ని మినహా చాలా వరకు కంప్యూటరు హార్డ్‌వేర్ సాధారణ ప్రజలు చూసి ఉండరు. ఎందుకంటే అవన్నీ సీపీయూ అని పిలువబడే ఒక క్యాబినెట్ లో ఉంటాయి.

హార్డ్‌వేర్‌ కి, సాఫ్‌ట్‌వేర్‌కి  ఇంతవరకు మంచి తెలుగు పేరు ఎవ్వరూ పెట్టలేకపోయారు. ఇప్పటివరకు జరిగిన ప్రయత్నాలు:

పెట్టె మూత జాగ్రత్తగా తీసి, తెలిసీ తెలియకుండా దేనినీ ముట్టుకోకుండా జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ దిగువ వర్ణించిన భాగాలుకనిపిస్తాయి. మన శరీరపు చర్మాన్ని ఒలిచి లోపలికి తొంగి చూస్తే గుండె, మెదడు మొదలైన అవయవాలలాగే, ఈ పెట్టెలో ఎన్నో ముఖ్యమైన అవయవాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.

 




#Article 11: జనరంజక శాస్త్రము (247 words)


జనరంజక శాస్త్రం (జనరంజక విజ్ఞానశాస్త్రం ) (ఆంగ్లం:popular science) సాధారణ ప్రేక్షకుల కోసం ఉద్దేశించిన విజ్ఞాన శాస్త్ర వివరణ.  సైన్స్ జర్నలిజం ఇటీవలి శాస్త్రీయ పరిణామాలపై దృష్టి సారించినప్పటికీ, జనాదరణ పొందిన శాస్త్రం మరింత విస్తృతమైనది. దీనిని వృత్తిపరమైన విజ్ఞానశాస్త్ర  జర్నలిస్టులు లేదా శాస్త్రవేత్తలు రాయవచ్చు. ఇది పుస్తకాలు, చలనచిత్రాలు,  టెలివిజన్ డాక్యుమెంటరీలు, పత్రిక కథనాలు,  వెబ్ పేజీలతో సహా అనేక రూపాల్లో ప్రదర్శించబడుతుంది.

జనరంజక శాస్త్రం  అనేది శాస్త్రీయ పరిశోధనల యొక్క వృత్తిపరమైన మాధ్యమంగా శాస్త్రీయ సాహిత్యానికి మధ్య వారధి. ఇది ప్రజాదరణ పొందిన రాజకీయ, సాంస్కృతిక ఉపన్యాసం. భాష యొక్క ప్రాప్యతను, విజ్ఞాన శాస్త్ర పద్ధతుల  ఖచ్చితత్వాన్ని సంగ్రహించడం ఈ కళా ప్రక్రియ  లక్ష్యం. ప్రసిద్ధ శాస్త్ర పుస్తకాలు,  ప్రచురణలలో అనేక శాస్త్ర-సంబంధిత వివాదాలు చర్చించబడ్డాయి.  జీవసంబంధమైన నిర్ణయాత్మకత,  మేధస్సు యొక్క జీవసంబంధమైన అంశాలపై దీర్ఘకాల చర్చలు, ది మిస్మీజర్ ఆఫ్ మ్యాన్ , ది బెల్ కర్వ్ వంటి గుర్తింపు పొందిన పుస్తకాలలో ప్రచురించబడ్డాయి. 

పరిశీలనలు,  సిద్ధాంతాల  ప్రామాణికత, పద్ధతుల  వ్యవహారికమైన  సమర్థత గురించి సహచరులకు తెలియజేయడం, ఒప్పించడం శాస్త్రీయ సాహిత్యం ముఖ్య  ఉద్దేశ్యం. ప్రాచుర్యం పొందిన శాస్త్ర సమచారాన్ని,  ఫలితాల   ప్రాముఖ్యతను శాస్త్రీయంగా  బయటి వ్యక్తులకు (కొన్నిసార్లు ఇతర రంగాలలోని శాస్త్రవేత్తలతో పాటు) తెలియజేయడానికి,  ఒప్పించడానికి,  ఫలితాలను పరిరక్షించడానికి ప్రయత్నిస్తుంది. జనాదరణ పొందిన విజ్ఞానం ప్రత్యేకత, సాధారణతను నొక్కి చెబుతుంది. 

జనాదరణ పొందిన విజ్ఞాన సాహిత్యాన్ని శాస్త్రవేత్తలు కాని వారు వ్రాసే విషయంపై పరిమిత అవగాహన కలిగి ఉండవచ్చు. నిపుణులు కానివారు తప్పుదోవ పట్టించే ప్రసిద్ధ విజ్ఞాన శాస్త్రాన్ని గుర్తించడం కష్టమవుతుంది. ఇది నిజమైన శాస్త్రం, కల్పిత శాస్త్రాల  మధ్య సరిహద్దులను కూడా అస్పష్టం చేస్తుంది. ఏదేమైనా, కొన్నిసార్లు మంచి శాస్త్రీయ  నేపథ్యం, బలమైన సాంకేతిక కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగిన వారు శాస్త్రవేత్తలు కానప్పటికీ మంచి జనాదరణ పొందిన విజ్ఞాన రచనలను చేస్తారు. 

అనాది నుంచి మేధో సంపత్తి గల గొప్ప వ్యక్తులు కొందరు నిరంతరం శ్రమించి, ప్రాణాలకు సైతం తెగించి, జీవితం ధారపోస్తూ వస్తున్నారు. తమ తరానికి, భావి తరాలకు కొత్తబాటలు వేస్తున్నారు. కొత్త ద్వారాలు తెరుస్తున్నారు. జ్ఞానాన్ని వెదజల్లి నాగరికత అభివృద్ధికి పాటు పడుతున్నారు. వీళ్ళే వివిధ రంగాలలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు,  సైన్స్‌ రచయితలు. ఈ విధంగా శాస్త్రజ్ఞుడికీ, సామాన్యుడికీ మధ్య దూరాన్ని తగ్గిస్తూ వచ్చిన సుగమ విజ్ఞాన రచయితలు ఎంతోమంది ఉన్నారు.




#Article 12: కారము (401 words)


కారము ఒక ప్రధానమైన రుచి. ఇది షడ్రుచులులో ఒకటి. ఇది గాఢమైన రుచిని, వాసనను కలిగి ఉంటుంది. ఈ రుచి ఎక్కువగా మిరపకాయల ఆహార పదార్థాలలో ఉంటుంది. అధిక కారం రుచి కల పదార్థాలు తినే వారికి అయిష్టతను కల్పిస్తాయి. ఈ రుచిని కొన్ని సందర్భాలలో స్పైసీనెస్ లేదా హాట్‌నెస్ లేదా హేట్ వంటి పదాలలో కూడా చూచిస్తారు.  

పిక్వాన్సీ అనే పదం తక్కువ స్థాయి కారం రుచికల ఆహార పదార్థాల విషయంలో వాడుతారు.  ఉదాహరణకు ఆవాలు, కూర కలిగిన ఆహార పదార్థాలు.  

గుమ్మడికాయ కాయ కూర వేడిగా (పొయ్యి వెలుపల), కారంగా ఉంటుంది. దీనికి కారణం అందులో కలిపే దాల్చిన చెక్క, జాజికాయ, మసాలా దినుసులు, జాపత్రి, లవంగాలు వంటి సుగంధ ద్రవ్యాలు చేర్చబడతాయి.  ఆహార విమర్శకుడు అటువంటి కూరలను వివరించడానికి పిక్వాంట్ అనే పదాన్ని ఉపయోగించవచ్చు, 

కారం తింటే పొట్టలో పుండు పుడుతుందనే గాథ ఒకటి ఆధ్రేతర రాష్ట్రాలలోనూ – ముఖ్యంగా తమిళనాడులో – ఇతర దేశాలలోనూ చలామణీలో ఉంది. ఇది ఎంత వరకు వచ్చిందంటే తమిళ సోదరులు చెప్పిన మాటలని విని కాబోలు తెలుగు డాక్టర్లు కూడా సై అంటే సై అంటున్నారు. ఇవన్నీ పునాదులు లేని పేకమేడలని డాక్టర్‌ గ్రేం అంటున్నారు. ఈయన టెక్సస్‌ రాష్ట్రంలోని హ్యూస్టన్‌ నగరంలో ఉన్న బేలర్‌ కాలేజ్‌ అఫ్‌ మెడిసిన్‌ లో ఒక పేరు మోసిన ఘనాపాటీ. టెక్సస్‌ మెక్సికో దేశపు సరిహద్దులో ఉంది కాబట్టి కాబోలు మెక్సికో దేశపు కారం తినే అలవాటు టెక్సస్‌లోనూ కనిపిస్తుంది. అందుకని ఈయనకి కారం అంటే ఇష్టమో ఏమో నాకు తెలియదు కాని ఈయన కూడ ఈ పుకారులూ వదంతులూ విన్నాడు. విసిగెత్తే వరకూ విన్నాడు. తాడో, పేడో తేల్చేద్దామని ఒక ప్రయోగం చేసేడు.

ఆరోగ్యంగా ఉన్న మనుష్యులని కొంతమందిని కూడ గట్టి వాళ్ళని మూడు జట్లు గా విడగొట్టేడు. అందులో ఒక జట్టుకి కారం ఏమీ లేని చప్పిడి తిండి పెట్టేడు. రెండవ జట్టుకి అదే చప్పిడి తిండిలో అరడజను ఏస్పిరిన్‌ మాత్రలు కలిపి పెట్టేడు. మూడవ జట్టుకి బాగా కారం కలిపిన తిండి పెట్టేడు. మరునాడు ఒక బుల్లి విడియో కేమెరాని ఒక గొట్టానికి తగిలించి ఆ గొట్టాన్ని ఈ మూడు జట్ల వాళ్ళ పొట్టలలోకి దింపి క్షుణ్ణంగా పొట్ట గోడలని పరిశీలించేడు. ఏస్పిరిన్‌ తిన్న రెండవ జట్టు వాళ్ళ పొట్ట గోడలలో చిన్న చిన్న చిల్లుల గుండా రక్తం స్రవించడం చూసేడు తప్ప కారం తిన్న వాళ్ళ పొట్టలు, చప్పిడి తిండి తిన్న వాళ్ళ పొట్టలు ఒక్క లాగే, ఏ దోషం లేకుండా ఉన్నాయిట. 

ఇలాంటి ప్రయోగమే భారత దేశంలో కూడ ఎవరో రెండు జట్ల మీద చేసేరుట. ఓకరి తిండిలో మిరప పొడి బాగా జల్లేరుట. మరొక జట్టు తిండిలో మిరప పొడి పొడ కూడా లేదుట. ఈ రెండు జట్ల మధ్య ఏమీ తేడా కనిపించ లేదుట. 

ఈ రెండు ప్రయోగాల వల్ల తేలిందేమిటంటే మిరపకాయల వల్ల పొట్టలో పుండు పుట్టదని. నేను కూర్చున్న కుర్చీ లోంచి కదలకుండా స్పురణ ప్రయోగం (థాట్‌ ఎక్స్పరిమెంట్‌) ఒకటి చేసేను. దాని సారాంశం ఇది. సర్వ సాధారణంగా వేడి దేశాలలో ఉన్న ప్రజలు కారం ఎక్కువ తినడం నేను గమనించేను. వేడి దేశాలలో ఉన్న వాళ్ళకి చర్మం నల్లగా ఉండడం వల్ల ఉపయోగం ఉన్నట్లే, కారం తినాలనే కోరిక ఉండం వల్ల కూడా మనుగడకి పనికొచ్చే లాభం ఏదైనా ఉందేమో? డార్విన్‌ ని అడిగి చూడాలి.

దీనికి ఒక చక్కని వివరణ ఒకసారి నేను టెలివిజన్ కార్యక్రమములో విన్నాను - వేడి ప్రాంతాలలో ప్రజలు కారము ఎక్కువగా తినడం వల్ల తప్పనిసరిగా మంచినీరు ఎక్కువగా త్రాగుతారు. ఇది వారికి చాలా అవసరం. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుదు మన శరీరం లోంచి నీరు ఎక్కువగా ఆవిరి అయి పోతు ఉంటుంది.




#Article 13: విభూతి (326 words)


హోమంలో దర్బలు, ఇతర హోమ వస్తువులు దహించగా మిగిలిన హోమభస్మాన్ని విభూతి అని కూడా అంటారు. చాలా పవిత్రంగా భావించబడే విభూతి (విభూది) ప్రతి శివాలయంలోనూ తప్పక ఉంటుంది.

వేదములు, పురాణములు ఏకకంఠముతో విభూతి యొక్క మాహిమను చాటుచున్నవి. భస్మ స్నానము చేసినవారు సర్వతీర్ధాలు చేసినవారితో సమానము. భస్మధారణ చేసిన వారికి దుష్ట గ్రహములు, పిశాచములు, సర్వరోగములు, పాపములు సమీపించవు. ధర్మబుద్ధి కలుగ్ను. బాహ్య ప్రపంచ జ్ఞానం కలుగును. విభూది నొసట ధరించి శివపంచాక్షరి మంత్రము ప్రతిదినము పఠిచుచుండిన లలాటమున్ బ్రహ్మవ్రాసిన వ్రాత కూడా తారుమారగును.

అగ్నికి దహించే గుణం ఉంది. కట్టెలు, పిడకలు మొదలైన వాటికి దహనమయ్యే గుణం ఉంది. ఈ రెండింటి సమ్మేళనంతో ఉద్భవించిన విభూతి, ఆ రెండు గుణాలనూ త్యజించి శాశ్వత రూపాన్ని సంతరించుకుంది. విభూతి దహించదు, దహనమవదు. ఇది నిర్గుణత్వాన్ని సంతరించుకుంది.
హోమగుండంలో హోమం చేసినప్పుడు, ధునిలో కొబ్బరికాయలు మొదలైనవి భస్మం అయినప్పుడు వచ్చిన బూడిదను విభూతి అంటారు. హోమగుండం, ధుని – రెండూ పరమ పవిత్రమైనవి.
హోమగుండంలో మోదుగ, రావి సమిధలు, ఆవునెయ్యి ఉపయోగిస్తారు.
ధునిలో పీచు తీయని కొబ్బరికాయలు (Hairy Coconuts), పిడకలు (cakes made of cows dung), రావి, తులసి, మేడి చెట్ల కొమ్మలు (Pieces of Peepal, Tulasi and Medi), నవధాన్యాలు (Nine different grains), గంధపుచెక్కలు (Pieces of Sandal wood), నేరేడు (Camphor ), సాంబ్రాణి (Sambrani), ఆవునెయ్యి (Cows ghee ), సాంబ్రాణి sambrani powder), అగరొత్తులు (Incense Sticks) వేస్తారు. ఇవన్నీ కాలగా మిగిలిన బూడిద విభూతి.  విభూతిని విషెషమైన ఐష్వర్యము అని అందురు. 

కుడిచేతి మధ్యమ, అనామికా వేళ్ళ సాయంతో విభూతిని చేతిలోకి తీసుకోవాలి. నుదుటిపై పెట్టుకోవడం కూడా ఎడమవైపు నుండి కుడివైపుకు విభూతి రేఖలు తీర్చిదిద్దాలి. అప్పుడు అంగుష్టముతో విభూతి రేఖలపై కుడివైపు నుండి ఎడమవైపుకు మూడు రేఖలుగా ధరించడాన్ని త్రిపుండ్రం అంటారు. త్రిపుండ్రం అంటే అడ్డబొట్టు అని అర్థం. విభూతి ధరించినపుడు నుదిటిపై కనుబొమ్మలు దాటి ప్రక్కలకు గాని కనుబొమ్మల క్రిందికిగాని ధరించకూడదు. విభూతిధారణ దేవతాపూజ, జపము, యజ్ణ్జము, హోమము, శుభకార్యముల్లో ధరించిన కార్యములు సిద్ధించును. తప్పక ధరించవలెను. విభూతి భస్మం, తిలకం కాని నొసట ధరించనిదే భగవంతుని తీర్ధప్రసాదములు స్వీకరించ కూడదు.

వివిధ హోమభస్మాలు చేసే మేలు:

గమనిక: హోమభస్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై ఉంచకూడదు.

స్నానం అంటే ఒంటి మీద నీళ్ళు పోసుకోవడం. ఒంటి నిండా విభూతి పూసుకుంటే దానిని విభూతి స్నానం అంటారు. 

ఏ వస్తువైనా సంపూర్ణంగా కాలితే మిగిలేది భస్మం, లేదా బూడిద. కాలడానికి మూడు హంగులు కావాలి. ఒకటి, కాలగలిగే పదార్థం. రెండు, అది రాజుకుని అంటుకోడానికి తగినంత వేడి ఉండాలి. మూడు, ఆ వస్తువు మండడానికి తగినంత ఆమ్లజని సరఫరా ఉండాలి. అప్పుడు ఆ వస్తువు కాలుతుంది. కాలగా మిగిలిన దానిని బూడిద అంటాం. విభూది ఒక రకం బూడిదే. కాని నీళ్ళూ కూడ మరొక రకం బూడిదే. ఉదజని వాయువును ఆమ్లజని సమక్షంలో మండించగా మిగిలిన బూడిదే నీరు. కనుక, మండవలసిన పదార్థం అంతా మండిపోగా మిగిలినవే బూడిద, నీళ్ళూను. 




#Article 14: ఆకురాలు కాలం (156 words)


ఉష్ణమండలంలో ఉన్న ఆంధ్రదేశంలో చెట్లు ఆకులు రాల్చడం అంతగా కనిపించదుకాని, సమశీతల దేశాలలోను, శీతల మండలాలలోను చలికాలం వచ్చే సరికి కొన్ని చెట్లు ఆకులన్నిటిని పూర్తిగా రాల్చేసి మోడులలా బోడిగా కనిపిస్తాయి. మన దేశంలో కులూ లోయ లోను, కాశ్మీరు లోను ఈ విశేషం చూడవచ్చు. శీతల దేశాలలో కూడా అన్ని చెట్లూ ఆకులని రాల్చవు. పైను, ఫర్‌ మొదలైన చెట్ల ఆకులు సన్నగా సూదులలా ఉంటాయి; ఇవి ఆకులని రాల్చవు. ఎల్లప్పుడూ పచ్చగానే ఉంటాయి. కాని వెడల్పాటి ఆకులు ఉన్న చెట్లన్నీ చలికాలంలో ఆకులని రాల్చుతాయి. ఈ ప్రవర్తనకి చాల కారణాలు చూపించవచ్చు.

మొదటి కారణం. ఆకులు వెడల్పుగా ఉన్న చెట్టు వైశాల్యం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ వైశాల్యం ఉన్న చెట్టు ఎక్కువ వేడిని నష్టపోతుంది. ఈ విషయాన్నే మరొక విధంగా చెప్పాలంటే, ఎక్కువ వైశాల్యంగా ఉన్న చెట్టుకి ఎక్కువ చలి వేస్తుంది. మనకి చలి వేసినప్పుడు మన వైశాల్యం తగ్గించడానికి ముడుచుకుని కూర్చుంటాం. అలాగే చలి కాలంలో చెట్లు తమ వైశాల్యాన్ని తగ్గించడానికి ఆకులని రాల్చివేస్తాయి.

రెండవ కారణం. ఆకులు ఆహారపదార్ధాలని తయారుచేసే కర్మాగారాల్లాంటివి. వేసవి కాలంలో ఎండ మెండుగా ఉన్న రోజులలో ఆ సూర్యరస్మిని పీల్చుకోడానికి ఎక్కువ వైశాల్యం ఉన్న ఆకులు కావాలి. శీతాకాలం వచ్చేసరికి ఎండ తగ్గిపోతుంది కనుక ఆకులకి సరిపడా సూర్యరస్మి తగలదు. కనుక అవి పూర్వంలా పని చెయ్యలేవు. పని చెయ్యని ఆకులతో నాకేం పని అని చెట్టు ఆ ఆకులని రాల్చేస్తుంది.




#Article 15: భూగర్భం (249 words)


మన భూమి పుట్టి 4 500 000 000 సంవత్సరాల చిల్లర అయింది. భూమి పుట్టిన దగ్గరనుండి భూగర్భం లోనుండి నిరంతరం వేడి అలా బయటకి వస్తూనే ఉంది. అగ్ని పర్వతాలు పగిలినప్పుడు, భూగర్భం నుండి వేడి ఊటలు బయటకి ఉబికి వచ్చినప్పుడు, లోపల వేడి ఉందని దాఖలా అవుతోంది కదా. ఇలా వేడి బయటకి వచ్చేస్తూ ఉంటే భూమి కొంత కాకపోయినా కొంతైనా చల్లారాలి కదా. భూమి నుండి సతతం వేడి బయటకి ప్రసారమవుతూనే ఉంటుందనే సత్యం విజ్ఞాన శాస్త్రపు విద్యార్ధులకి ఎరుకే. నాలుగు వందల ఏభై కోట్ల సంవత్సరాలనుండి ఇలా చల్లారుతూన్న భూమి ఈపాటికి పూర్తిగా చల్లారి పోయి ఉండొద్దూ? ఇంకా లోపల ఎందుకీ కుతకుతలు? 

ముందస్తుగా అగ్ని పర్వతాలు మనం అనుకున్నంతగా పేలడం లేదు. పేలెనుపో, పేలిన అగ్ని పర్వతాలవల్ల భూమి చల్లారేది బహు కొద్దిగా. రెండు. రోదసిలోకి ప్రసారితమయే వేడి కన్న భూగర్భంలో రేడియో ధార్మిక మూలకాల విచ్చిత్తి వల్ల పుట్టే వేడి చాల ఎక్కువ. ఆఖరుగా మరొక్క ముఖ్య విషయం. పార్కు లోని పచ్చిక మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూన్న మనకి భూగర్భంలో ఉన్న 1760 సెల్సియస్‌ డిగ్రీల వేడి యొక్క ధాటి ఏమాత్రం తెలియడం లేదంటే దానికి కారణం భూమి పైపెచ్చు. ఇది ఎంతో సమర్ధవంతంగా లోపల వేడిని బయటకి పోకుండా ఆపుతోంది. 

నిజానికి మన అదృష్టం బాగుండబట్టి భూమి పుట్టి నాలుగున్నర బిలియను సంవత్సరాలైనా బహు కొద్దిగానే చల్లారింది. ఈపాటికి భూమి పూర్తిగా చల్లారిపోయి ఉండుంటే మన పుట్టి ములిగి ఉండేది. భూమి పూర్తిగా చల్లారిపోతే మరింక భూకంపాలు రావు. అగ్ని పర్వతాలు పేలవు. సముద్ర గర్భంలో భూమి ఉపరితలం మీద ఉన్న ఫలకాలు విస్తరణ చెందవు. భూఫలకాల పయనాలు ఆగిపోతాయి. తద్రూపేణా సరికొత్త పర్వతాలు పుట్టవు. ఉన్న పర్వతాలు ఎదగవు. అంటే భూమిలో చైతన్యం పూర్తిగా చల్లారి పోతుందన్న మాట. 

అగ్ని పర్వతాలు పేలక పోతేనూ, భూకంపాలు రాక పోతేనూ వచ్చిన నష్టం ఏమిటని మీరు అడగొచ్చు. జ్వరం వస్తే కస్టమని కాళ్ళూ, చేతులూ చల్లబడి పోవాలని కోరుకుంటామా? భూమిలో చైతన్యం చచ్చిపోతే ఏమిటవుతుందో ఒక్క నిమిషం ఆలోచించండి. ఇంకొక పది కోట్ల సంవత్సరాలలో మన పర్వతాలన్ని గాలి పోటుకీ వర్షపు ధాటికీ అరిగిపోతాయి. ఎత్తు పల్లాలన్నీ చదునుగా అయిపోతాయి. అప్పుడు సముద్రం నెమ్మదిగా భూభాగాన్ని కప్పెస్తుంది. అప్పుడు మన మనుగడకే ముప్పు.




#Article 16: తెలుగు (1524 words)


ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల అధికార భాష తెలుగు. భారత దేశంలో తెలుగు మాతృభాషగా మాట్లాడే  7.4 కోట్ల (2011) జనాభాతో  ప్రాంతీయ భాషలలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని ప్రజలు అత్యధికంగా మాట్లాడే భాషలలో 15వ స్థానంలోనూ, భారత దేశంలో హిందీ తర్వాత స్థానములోనూ నిలుస్తుంది. ప్రపంచ భాష గణాంకాల (ఎథ్నోలాగ్) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 9.3 కోట్ల (2020) మందికి మాతృభాషగా ఉంది. అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము తమిళముతో పాటు తెలుగు భాషను 2008 అక్టోబరు 31న భారత ప్రభుత్వం గుర్తించింది.

వెనుజులకు చెందిన వర్తకుడు నికొలో డా కాంటి భారతదేశం గుండా ప్రయాణిస్తూ, తెలుగు భాషలోని పదాలు ఇటాలియన్ భాష వలె అజంతాలు (అచ్చు అంతంన కలిగి) గా ఉండటం గమనించి తెలుగును 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్‌ గా వ్యవహరించాడు. కన్నడిగుడైన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను 'దేశ భాషలందు తెలుగు లెస్స ' అని వ్యవహరించాడు. కన్నడ అక్షరమాల తెలుగు భాష లిపిని పోలిఉంటుంది. కన్నడ భాషలోని చాలా పదాలు, పద శబ్దాలు కూడా తెలుగు భాషను పోలిఉంటాయి.

భాషా శాస్త్రకారులు తెలుగును ద్రావిడ భాషా వర్గానికు చెందిందిగా వర్గీకరించారు. అనగా తెలుగు – హిందీ, సంస్కృతం, లాటిను, గ్రీకు మొదలైన భాషలు గల ఇండో ఆర్యన్ భాషా వర్గానికి (లేదా భారత ఆర్య భాషా వర్గానికి) చెందకుండా, తమిళము, కన్నడం, మలయాళం, తోడ, తుళు, బ్రహూయి మొదలైన భాషలతో పాటుగా ద్రవిడ భాషా వర్గానికి చెందినదని భాషా శాస్త్రజ్ఞుల వాదన. తెలుగు 'మూల మధ్య ద్రావిడ భాష' నుండి పుట్టింది. ఈ కుటుంబంలో తెలుగుతో పాటు కుయి, కోయ, కొలామి కూడా ఉన్నాయి.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో సహా మొత్తం 26 భాషలు ప్రస్తుతం వాడుకలో ఉన్న ద్రావిడ భాషలు. ఆర్యభాషలు భారతదేశం ప్రవేశించక ముందు ద్రవిడ భాషలు భారతదేశమంతా విస్తరించి ఉండేవని కొంతమంది భాషా చరిత్రకారుల నమ్మకం. నాటి సింధు లోయ నాగరికత నివాసులు ద్రవిడ జాతికి సంబంధించినవారే అన్న కారణంగా వారి భాష కూడా ద్రవిడభాషే, లేదా ద్రవిడభాషలకు సంబంధించినదే అయివుంటుందని వారి నమ్మకం. కానీ వారి లిపిని అర్ధం చేసుకునే ముందే ఇది నిజమా కాదా అని కచ్చితంగా తేల్చడం అసంభవం.

క్రీస్తు శకం 1100–1400 మధ్య ప్రాచీన కన్నడ భాషనుండి ఆధునిక కన్నడ మరియూ తెలుగు లిపులు ఆవిర్భవించాయని, అందుకే తెలుగు లిపి, తెలుగు పదాలు కన్నడ లిపిని పోలియుంటాయి అనే సిద్ధాంతం ఉంది .

అనేక ఇతర ద్రావిడ భాషలవలె కాక తెలుగుభాష మూలాన్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు. అయినా కూడా, క్రీస్తు శకం మొదటి శతాబ్దములో శాతవాహన రాజులు సృష్టించిన గాథాసప్తశతి అన్న మహారాష్ట్రీ ప్రాకృత పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు, శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారై ఉంటారని నిర్ణయించవచ్చు. 

ఆదిమ ద్రావిడ భాషల చరిత్ర క్రీస్తుకు పూర్వం కొన్ని శతాబ్దాల వెనక నుండి ఉందని మనము తెలుసుకోవచ్చు, కానీ తెలుగు చరిత్రను మనము క్రీస్తు శకం 6వ శతాబ్దము నుండి ఉన్న ఆధారములను బట్టి నిర్ణయించవచ్చు. తెలుగులోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శతాబ్దమునకు చెందినది. శాసనాలలో మనకు లభించిన తొలితెలుగు పదం నాగబు. చక్కటి తెలుగు భాషా చరిత్రను మనము క్రీస్తు శకం 11 వ శతాబ్దం నుండి గ్రంథస్థము చేయబడినదిగా గమనించవచ్చు.

ఆంధ్రుల గురించి చెప్పిన పూర్వపు ప్రస్తావనలలో ఒకటి ఇక్కడ ఉదహరింపబడినది: (డా.జి.వి.సుబ్రహ్మణ్యం కూర్చిన తెలుగుతల్లి కవితా సంకలనంలో ఇవ్వబడినది) 

ఇది ఉద్యోతనుడు ప్రాకృత భాషలో రచించిన కువలయమాల కథలోనిది. ఈ ప్రాకృతానికి పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి తెలుగు అనువాదం: అందగత్తెలన్నా, అధవా యుద్ధరంగమన్ననూ సమానంగా ప్రేమించే వాళ్ళున్నూ, అందమైన శరీరాలు గల వాళ్ళున్నూ. తిండిలో దిట్టలున్నూ, అయిన ఆంధ్రులు అటూ, పుటూ (పెట్టు కాబోలు), రటూ (రట్టు ఏమో) అనుకొంటూ వస్తుండగా చూచాడు.

ఈ మూడు పదాల మూలాలూ, వాని మధ్య సంబంధాలు గురించి చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. క్రీ. పూ. 700 ప్రాంతంలో వచ్చిన ఐతరేయ బ్రాహ్మణము (ఋగ్వేదములో భాగము) లో మొదటిసారిగా ఆంధ్ర అనే పదం జాతి పరంగా వాడబడింది. కనుక ఇదే మనకు తెలిసినంతలో ప్రాచీన ప్రస్తావన. ఆ తరువాత బౌద్ధ శాసనాలలోనూ, అశోకుని శాసనాలలోనూ ఆంధ్రుల ప్రస్తావన ఉంది. క్రీ.పూ. 4వ శతాబ్దిలో మెగస్తనీసు అనే గ్రీకు రాయబారి ఆంధ్రులు గొప్ప సైనికబలం ఉన్నవారని వర్ణించాడు.

ఆంధ్రులు మాట్లాడే భాషకు ఆంధ్రము, తెలుగు, తెనుగు అనే పేర్లున్నాయి. ఆంధ్ర, తెలుగు అనేవి రెండు వేర్వేరు జాతులని అవి క్రమంగా మిళితమైనాయన్న కొంతమంది అభిప్రాయానికి జన్యు శాస్త్ర పరంగా కానీ భాషాశాస్త్ర పరంగా కానీ గట్టి ఆధారాలు దొరకలేదు. వైదిక వాఙ్మయం ప్రకారం ఆంధ్రులు సాహసోపేతమైన సంచారజాతి. భాషాశాస్త్ర పరంగా తెలుగు గోదావరి, కృష్ణా నదుల మధ్య నివసిస్తున్న స్థిరనివాసుల భాష. తెలుగు భాష మాట్లాడే ప్రాంతాన్ని ఆంధ్ర రాజులు ముందుగా పరిపాలించడం వల్ల ఆంధ్ర, తెలుగు అన్న పదాలు సమానార్థకాలుగా మారిపోయాయని కొంతమంది ఊహాగానం. 10వ శతాబ్దపు పారశీక చరిత్రకారుడు అల్ బిరుని తెలుగు భాషను 'ఆంధ్రీ' యని వర్ణించెను .

క్రీ. శ. 1000 కు ముందు శాసనాలలోగాని, వాఙ్మయంలోగాని తెలుగు అనే శబ్దం మనకు కానరాదు. 11వ శతాబ్దము ఆరంభము నుండి తెలుంగు భూపాలురు, తెల్గరమారి, తెలింగకులకాల, 'తెలుంగ నాడొళగణ మాధవికెఱియ' వంటి పదాలు శాసనాల్లో వాడబడ్డాయి. 11వ శతాబ్దములో నన్నయ భట్టారకుని కాలమునాటికి తెలుగు రూపాంతరముగా తెనుగు అనే పదము వచ్చింది. 13వ శతాబ్దములో మహమ్మదీయ చారిత్రకులు ఈ దేశమును త్రిలింగ్ అని వ్యవహరించారు. 15వ శతాబ్దము పూర్వభాగంలో విన్నకోట పెద్దన్న తన కావ్యాలంకారచూడామణిలో ఇలా చెప్పాడు.

శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం – అనే మూడు శివలింగక్షేత్రాల మధ్య భాగము త్రిలింగదేశమనీ, త్రిలింగ పదము తెలుగుగా పరిణామము పొందినదని ఒక సమర్థన. ఇది గంభీరత కొరకు సంస్కృతీకరింపబడిన పదమేనని, తెలుగు అనేదే ప్రాచీన రూపమని చరిత్రకారుల అభిప్రాయము. చాలామంది భాషావేత్తలు, చరిత్రకారులు ఈ వాదనలు పరిశీలించి దీనిలో నిజం లేదని అభిప్రాయపడ్డారు. అందుకు నన్నయ మహాభారతంలో త్రిలింగ శబ్దం ప్రయోగం కాకపోవడం కూడా కారణమన్నారు. 12వ శతాబ్దిలో పాల్కురికి సోమనాధుడు నవలక్ష తెలుంగు – అనగా తొమ్మిది లక్షల గ్రామ విస్తీర్ణము గలిగిన తెలుగు దేశము – అని వర్ణించాడు. మొత్తానికి ఇలా తెలుగు, తెనుగు, ఆంధ్ర – అనే పదాలు భాషకు, జాతికి పర్యాయపదాలుగా రూపుదిద్దుకొన్నాయి.

తెలుగు అజంత భాష. అనగా దాదాపు ప్రతి పదము ఒక అచ్చుతో అంతము అవుతుంది. దీన్ని గమనించే 15వ శతాబ్దములో ఇటాలియన్ యాత్రికుడు నికొలో డా కాంటి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ (ప్రాచ్య ఇటాలియన్) గా అభివర్ణించాడు. అచ్చుల శబ్దాలను చూడండి.

తెలుగును సాధారణంగా ఒకపదముతో మరొకటి కలిసి చేరిపోయే భాషగా గుర్తిస్తారు. ఇందులో ఒక నామవాచకానికి దాని ఉపయోగాన్ని బట్టి ప్రత్యేకమైన అక్షరాలు చేర్చబడతాయి. వ్యాకరణపరంగా, తెలుగులో కర్త, కర్మ, క్రియ, ఒక పద్ధతి ప్రకారం, ఒకదాని తర్వాత మరొకటి వాక్యంలో వాడబడతాయి.

తెలుగుకు నాలుగు ప్రధానమైన మాండలిక భాషలున్నాయి.

తెలుగు లిపి ఇతర భారతీయ భాషా లిపులలాగే ప్రాచీన బ్రాహ్మీ లిపి నుండి ఉద్భవించింది. అశోకుని కాలములో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. అందుచేత అన్ని దక్షిణ భారత భాషలు మూల ద్రావిడ భాష నుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రము బ్రాహ్మీ నుండి పుట్టాయి. అశోకుడి కాలానికి చెందిన బ్రాహ్మి లిపి రూపాంతరమైన భట్టిప్రోలు లిపి నుండియు, ప్రాచీన కన్నడ భాష 'హలెగన్నడ 'లిపినుండియూ తెలుగు లిపి ఉద్భవించింది.

తెలుగు లిపిని బౌద్ధులు, వర్తకులు ఆగ్నేయ ఆసియా ప్రాంతాలకు అందచేసారు. అక్కడ ఈ లిపి, మాన్, బర్మీస్, థాయ్, ఖ్మేర్, కామ్, జావనీస్,, బాలినీస్ భాషల లిపుల ఉద్భవానికి కారకమయ్యింది. తెలుగు లిపితో వాటికి స్పష్టంగా పోలికలు కనిపిస్తాయి. తెలుగు అక్షరమాల చూడడానికి దాని సమీప దాయాదియైన కన్నడ అక్షరమాల వలెనే కనిపిస్తుంది.

తెలుగు లిపి చాలవరకు ఉఛ్ఛరించగల ఏకాక్షరాలతో ఉండి, ఎడమనుండి కుడికి, సరళమైన, సంక్లిష్టమైన అక్షరాల సరళితో కూడి ఉంటుంది. ఈ విధమైన  ఉఛ్ఛరించగల ఏకాక్షరాలు అనేకంగా ఉండడానికి ఆస్కారం ఉన్నందువల్ల, అక్షరాలు అచ్చులు (వొవెల్స్ లేదా స్వర్), హల్లులు (కాన్సొనెంట్స్ లేదా వ్యంజన్) అన్న ప్రధానమైన ప్రమాణాలను కలిగి ఉన్నాయి. హల్లుల రూపు వాటి వాడుకను బట్టి, సందర్భానుసారము మార్పు చెందుతూ ఉంటుంది. అచ్చుల ధ్వని వాటిలో లేనప్పుడు హల్లులు పరిశుద్ధమైనవిగా పరిగణించబడతాయి. అయితే, హల్లులను వ్రాయడానికి, చదవడానికి, అచ్చు అను చేర్చడం సాంప్రదాయకం. హల్లులు వేర్వేరు అచ్చులతో చేరినప్పుడు, అచ్చు అంశం వర్ణ పరిచ్ఛేదముతో మాత్రలు అన్న సంకేతాలను ఉపయోగించడంతో గుర్తింపబడుతుంది. ఈ మాత్రల ఆకారాలు తమ తమ హల్లుల ఆకారాలకు ఎంతో విరుద్ధంగా ఉంటాయి. తెలుగులో ఒక వాక్యం పూర్ణవిరామంతో కానీ, దీర్ఘవిరామంతో కానీ ముగించబడుతుంది. అంకెలను గుర్తించడానికి తెలుగులో ప్రత్యేకంగా సంకేతాలున్నా, అరబిక్ అంకెలే విస్తృతంగానూ, సర్వసాధారణంగానూ ఉపయోగింపబడుతున్నాయి. ఈ విధంగా, తెలుగులో, 16 అచ్చులు, 3 విశేష అచ్చులు, 41 హల్లులు చేరి మొత్తం 60 సంకేతాలు ఉన్నాయి.

తెలుగు అంకెలు, సంఖ్యలు తెలుగు కేలెండరులో ప్రధానంగా వాడుతారు. ఇతరత్రా ఇండో అరబిక్ రూపాలనే వాడుతారు

తెలుగు భాష అక్షరాలకు యూనికోడ్ బ్లాకు 0C00-0C7F (3072–3199) కేటాయించబడింది. ఆగష్టు 15, 1992న తొలి తెలుగు న్యూస్ గ్రూప్ (soc.internet.culture.telugu) ఆవిర్భవించింది.

తెలుగు సాహిత్యాన్ని ఆరు యుగాలుగా వర్గీకరించ వచ్చును.

దీనిని నన్నయ్య యుగము అనవచ్చును. నన్నయ్య ఆది కవి. ఇతడు మహా భారతాన్ని తెలుగులో వ్రాయనారంభించి, అందులో మొదటి రెండు పర్వాలు పూర్తి చేసి, తరువాతి పర్వాన్ని (అరణ్య పర్వం) సగం వ్రాసి కీర్తి శేషుడు అయ్యాడు. నన్నయకు నారాయణ భట్టు సహాయంగా నిలిచాడు. నారాయణ భట్టు వాఙ్మయ దురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు. సహాధ్యాయులైన నారాయణ, నన్నయ భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునులవలె భారతాంధ్రీకరణకు పూనుకొని ఒక విజ్ఞాన సర్వస్వంగా దానిని రూపొందించే ప్రయత్నం ప్రారంభించారు; తెలుగు కావ్యభాషాస్వరూపానికి పూర్ణత్వం సాధించి, పండితులు పామరులు మెచ్చుకొనదగిన శైలిని రూపొందించి, తరువాతి కవులకు మార్గదర్శకులయ్యారు. ఆంధ్ర భాషా చరిత్రలో నన్నయ, నారాయణులు యుగపురుషులు. వీరు తెలుగు భాషకు ఒక మార్గాన్ని నిర్దేశించారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒకసారైనా నన్నయ్య అడుగుజాడలను అనుసరించినవారే.

నన్నయ తరువాతి కాలంలో ముఖ్యమైన సామాజిక, మత సంస్కరణలు చోటుచేసుకొన్నాయి. వీరశైవము, భక్తిమార్గము ప్రబలమై ఎన్నో కావ్యాలకు కారణమైనది. తిక్కన (13వ శతాబ్ది), ఎర్రన (14వ శతాబ్దం) లు భారతాంధ్రీకరణను కొనసాగించారు. నన్నయ చూపిన మార్గంలో ఎందరో కవులు పద్యకావ్యాలను మనకు అందించారు. ఇవి అధికంగా పురాణాలు ఆధారంగా వ్రాయబడ్డాయి.

ఈ కాలంలో సంస్కృతకావ్యాల, నాటకాల అనువాదం కొనసాగింది. కథాపరమైన కావ్యాలు కూడా వెలువడ్డాయి. ప్రబంధము అనే కావ్య ప్రక్రియ ఈ కాలంలోనే రూపు దిద్దుకున్నది. ఈ కాలంలో శ్రీనాథుడు, పోతన, జక్కన, గౌరన పేరెన్నిక గన్న కవులు. ఛందస్సు మరింత పరిణతి చెందింది. శ్రీనాథుని శృంగార నైషధము, పోతన భాగవతం, జక్కన విక్రమార్క చరిత్ర, తాళ్ళపాక తిమ్మక్క సుభద్రా కళ్యాణం మొదలైనవి ఈ యుగంలో కొన్ని ముఖ్యమైన కావ్యాలు.

ఈ సందర్భంలో రామాయణ కవులగురించి కూడా చెప్పకోవచ్చును. గోన బుద్దారెడ్డి రచించిన రంగనాథ రామాయణము మనకు అందిన మొదటి రామాయణం.

విజయనగర చారిత్రక శకానికి చెందిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆదరణలో 16వ శతాబ్దం ప్రాంతంలో తెలుగు సాహిత్యపు స్వర్ణయుగం వికసించింది. స్వతహాగా కవియైన మహారాజు తన ఆముక్తమాల్యదతో ప్రబంధం అన్న కవిత్వ రూపాన్ని ప్రవేశపెట్టాడు. ఆ కాలంలో అతి ప్రముఖ కవులైన అష్టదిగ్గజాలతో ఆయన ఆస్థానం శోభిల్లింది.

కర్ణాటక సంగీతపు ప్రముఖులెంతో మంది వారి సాహిత్యాన్ని తెలుగులోనే రచించారు. అటువంటి ప్రసిద్దమైన వారి జాబితాలోనివే త్యాగరాజు, అన్నమాచార్య, క్షేత్రయ్య రామదాసు (కంచెర్ల గోపన్న) 
వంటి పేర్లు. మైసూర్ వాసుదేవాచార్ వంటి ఆధునిక రచయితలు కూడా వారి రచనలకు మాధ్యమంగా తెలుగునే ఎంచుకొన్నారు.

నన్నయకు పూర్వము నుండి గ్రాంథిక భాష, వ్యావహారిక భాష స్వతంత్రముగా పరిణామము చెందుతూ వచ్చాయి. కానీ 20వ శతాబ్దము తొలినాళ్లలో వీటి మధ్య ఉన్న వ్యత్యాసాలు తీవ్ర వాదోపవాదాలకు దారితీసాయి. గ్రాంథికము ప్రమాణ భాష అని, స్థిరమైన భాష అని, దాన్ని మార్చగూడదని గ్రాంథిక భాషా వర్గము, ప్రజల భాషనే గ్రంథ రచనలో ఉపయోగించాలని వ్యావహారిక భాషా వర్గము వాదించడముతో తెలుగు పండితలోకము రెండుగా చీలినది.

మొట్టమొదటి నవలగా పరిగణించబడుతున్న కందుకూరి వీరేశలింగం రచన రాజశేఖరచరిత్రముతో తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ సంపూర్ణమయ్యింది. గ్రాంథిక భాష వాడకాన్ని తీవ్రంగా నిరసిస్తూ గిడుగు రామ్మూర్తి ప్రకటించిన ఆంధ్ర పండిత భిషక్కుల భాషాభేషజం ప్రభావంతో గురజాడ అప్పారావు (ముత్యాల సరాలు), కట్టమంచి రామలింగారెడ్డి (ఆంధ్ర విశ్వవిద్యాలయపు వ్యవస్థాపకుడు) (ముసలమ్మ మరణం), రాయప్రోలు సుబ్బారావు (తృణకంకణం) మొదలైన తెలుగుసాహిత్యపు నవయుగ వైతాళికులు వ్యావహారిక భాషను వాడడం వ్యావహారిక భాషా వాదా నికి దారితీసింది.

కొన్ని తెలుగు పరిశోధనల సిద్ధాంత పుస్తకాలు ఇన్ఫర్మేషన్, లైబ్రరీ నెట్ వారి జాలస్థలి లో అందుబాటులోవున్నాయి.

తెలుగు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే కాకుండా తమిళనాడు, కర్నాటక, ఒడిశాలలో కూడా మాట్లాడబడుతుంది. తమిళనాడులో నివసిస్తున్న ప్రజల్లో దాదాపు 42 శాతం తెలుగువారే. బెంగళూరులో 30 % మంది తెలుగు భాష మాట్లాడువారు నివసించుచున్నారు. తమిళనాడులోని హోసూరు, కోయంబత్తూరులలో, ఒడిశాలోని రాయగడ, జయపురం, నవరంగపురం, బరంపురం పర్లాకేముండిలలో తెలుగు భాష ఎక్కువ. విజయనగర సామ్రాజ్య కాలములో తెలుగు వారు వేల మంది తమిళ ప్రాంతములకు వెళ్ళి స్థిరపడ్డారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు అనేక మంది తెలుగువారు కోస్తా, రాయలసీమ ప్రాంతాల నుండి వలస వెళ్లి తమిళనాడులో స్థిరపడ్డారు. కాని వారి రోజువారీ అవసరాలకు అనుగుణంగా ఆ రాష్ట్ర ప్రాంతీయ భాష అయిన అరవములోనే మాట్లాడుతుంటారు. అలాగే కర్నాటకలో కూడా చాలామంది తెలుగు మాట్లాడగలరు. ఇంకా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మహారాష్ట్ర లోని కొన్ని సరిహద్ధు ప్రాంతాలలోని ప్రజలు అధికంగా తెలుగే మాట్లాడుతారు. దక్షిణాదిలో ప్రముఖ నగరాలైన చెన్నై, బెంగళూరులలో కూడా తెలుగు తెలిసినవారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఇక ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో స్థిరపడిన తెలుగు వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ క్రింది ప్రాంతాలలో తెలుగు భాష ఎక్కువగా మాట్లాడువారు నివసించుచున్నారు

మధ్య భారతదేశం 777 రాజపుత్ర స్థానము 61 క్రమముగా... 17,96,860 ... 2,16,974 మందిగా ఉంది.

ఆంధ్రభాషతో సంబంధించిన చిన్న చిన్న మాండలిక భాషలను మాట్లాడు వారి సంఖ్య ఈ క్రింది విధంగా ఉండేది.

పై యంకెలనన్నిటిని గూడిన నాంధ్రభాషను దానియుప భాషలను మాట్లాడువారి సంఖ్యవచ్చును.

ఆంధ్రుల జన సంఖ్య గడచిన ముప్పది వత్సరములలోను ఈ క్రింది రీతిగా పెరిగింది.

తెలుగు వాడుకలో వున్న ప్రాంతాలలో తెలుగు వారి వివరాలు.




#Article 17: గోడకుర్చీ (445 words)


గోడకుర్చీ తెలుగువారు ప్రాచీన కాలంలో కనిపెట్టిన ఒక అద్భుత యోగాసనం. తెలుగుపంతుళ్ళు అసభ్యప్రవర్తన చేసిన విద్యార్ధులకు క్రమశిక్షణ చర్యలో భాగంగా వాడే ఒక దండనాపద్ధతే గోడకుర్చీ వేయించటం.

గోడకు ఆనుకొని ఉన్న ఒక కుర్చీని ఊహించండి. శరీరాన్ని ఆ కుర్చీ పోజులో ఇమిడ్చి, కొంతసేపు ఒణక కుండా, కదలకుండా ఉంచడాన్నే `గోడకుర్చీ వెయ్యడం (లేక చెయ్యడం) అంటారు. ఇది చేయడానికి గోడకు సుమారు అడుగు దూరంలో పాదాలు రెంటినీ సుమారు అడుగు వ్యత్యాసంలో ఉంచి నిటరుగా నుంచోండి. మోకాలునుంచి పాదాలవరకూ కాళ్ళను నిటారుగా ఉంచుతూ వంగి, మోకాటినుంచి పిరుదులవరకూ ఉండే శరీర మధ్య భాగాన్ని భూమికి సమానంతరంగా చేసి, శరీర పైభాగాన్ని (పిరుదులనుంచి తలవరకూ) నీటారుగా చేస్తే ఈ పైభాగం గోడకు ఆనుతుంది. అప్పుడు చేతులు బార్లా చాపి భూమికి సమానాంతరంగా పెడితే అవీ గోడకు ఆనుకొని ఉంటాయి. ఇప్పుడు మీరు గోడకుర్చీ పోజుకి వస్తారు. అలానే కదలకుండా, పడిపోకుండా, సుమారు 5 నిముషాలు (మీ ఓపికను బట్టి) ఉండండి.

తెలుగువాళ్ళు ప్రాచీనకాలంనుంచీ గోడకుర్చీ చేస్తున్నారు. కానీ, మిగతాప్రాంతం ప్రజలకు గోడకుర్చీ గురించి ఇంతవరకూ తెలియదు. ఇంగ్లీషువాళ్ళు, స్కూల్లో అసభ్యంగా ప్రవర్తించిన పిల్లల్ని బెంచిమీద నిలబడమని శిక్ష వేస్తారు. ఇంగ్లీషువాళ్ళహయాంలో ఇన్ని సంవత్సరాలు ఉండడంవల్ల మన పంతుళ్ళు కూడా ఈ పద్ధతినే ఇప్పుడు అవలంబిస్తున్నారు. కానీ దీనిముందు తెలుగుపంతుళ్ళు అసభ్యప్రవర్తన చేసిన విద్యార్ధులకు క్రమశిక్షణ చర్యలో భాగంగా వాళ్ళచేత గోడకుర్చీ వేయించేవారు.

రక్తనాళాల్లో ప్లాకు పేరుకుంటే వాటిలో రక్తప్రసారం అడ్డగించబడుతుంది. హై బ్లడ్‌ప్రెజర్‌కీ, గుండెజబ్బుకీ ఇదే ముఖ్య కారణం. ప్రతిరోజూ షుమారు ఒక గంటసేపు ఈ వ్యాయామాలు చేశ్తే శరీరంలో రక్తప్రసరణ బాగా పెరిగి రక్తనాళాల్లో ప్లాకు పేరుకోవడానికి అవకాశం తగ్గుతుంది. ముసలితనంలో చాలామందికి సెనిలిటీ, ఆల్‌జైమర్సు వ్యాధి వచ్చి, వాళ్ళు క్రమేపీ జ్ఞాపకశక్తిని పోల్గోటం జరుగుతోంది. ఇవి పేషంట్లకూ, వారికుటుంబాలఖూ ఎన్నో ఇక్కట్లు కల్గించే ఘోరమైన వ్యాధులు. ఈ వ్యాధులకు ముఖ్యకారణం మెదడులోని రక్తనాళాల్లో ప్లాకు పేరుకోవడమే అని ఈ మధ్య తెలిసింది. దొర్లింగు, వణుకుల్లో తల తిప్పడంవల్ల, మెడ, మెదడుల్లో రక్తప్రసారం బాగా పెరిగి, మెదడులోని రక్తనాళాల్లో ప్లాకు పేరుకోవడానికి అవకాశం తగ్గుతుంది. కొంతమంది దిప్రెషన్‌ తో బాధ పడుతుంటారు. మెదడుని శరీరంక్రిందిభాగంతో కలిపే వేగాస్‌ నర్వుని (ఇది మెడ ఎడమభాగం గుండా దిగుతుంది) ఉత్తేజ పరిస్తే వారి పరిస్థితి మెరుగవుతుందని ఈ మధ్య కనిపెట్టారు. దొర్లిగు, వణుకుల్లో తలతిప్పడం మూలాన వేగాస్‌ నర్వుకి ఈ ఉత్తేజం రోజూ కల్గి దిప్రెషన్‌ రాకుండా చేస్తుంది. ఈ మధ్య ఇండియన్స్‌లో డయాబెటీసు చాలా ఎక్కువగా కన్పిస్తోంది. ఈ వ్యాధికి తెలుగులో చాలా పేర్లు ఉన్నాయి: ప్రమేహం, అతిమూత్రం, మధు మూత్రం, మధుమేహం, అని. కానీ ఇప్పుడు డయాబెటీసు అనే పదం బాగా వాడుకలోకి వచ్చేశింది. ప్రతిరోజూ శరీరంలో అవయవాలనన్నిటినీ బలంగా కదిలించే వ్యాయామాలు చేస్తే డయాబెటీసు వచ్చే అవకాశం బాగా తగ్గుతుందని పరిశోధనలవల్ల తెలిసింది. ప్రతిరోజూ గోడకుర్చీ వెయ్యడంవల్ల మోకాటికీ, మోకాటిచిప్పకూ, కాళ్ళలోని, తుంటిలోని ఎముకలకూ; బలం చేకూరి, ఎముకలబలహీనతకు చెందిన వ్యాధులు రాకుండా చేస్తుంది. సరిపోయినంత కాల్షియం తమ భోజనంలో తీసుకుంటూ, రోజూ గోడకుర్చీ వేశేవారి కాలి ఎముకలకు ఆస్టియోపొరోసిస్‌ రాదు.

మా పెద్దతాతయ్య గోడకుర్చీమీద ఒక మంచి సామెత చెప్పేవాడు. అది చెప్తాను. నా చిన్నప్పటికే పెద్దతాతయ్య ముసలివాడు. కానీ ప్రతిరోజూ కనీసం 5 నిమిషాలపాటు గోడకుర్చీ వేశేవాడు. మీరూ వెయ్యండిరా మీ కాళ్ళు బలపడ్తాయీ అని చెప్పేవాడు కానీ ఎవ్వరూ వీనేవాళ్ళం కాదు. దానికి ఆయన వాడే గోడను అందరూ తాతయ్య గోడా అని పిల్చేవారు. ఇండియాలో, రాత్రి పడుకున్న మంచాన్ని పగపూట ముడిచి గోడకు ఆన్చి ఉంచుతారుగదా. తాతయ్య గోడకు మాత్రం ముడిచిన మంచాలు ఆన్చడం నిషేధమ మా కుటుంబంలో. నేను ఎప్పుడైనా మర్చిపోయి నా మంచాన్ని ఆ గోడకు ఆనిస్తే మా అమ్మ తాతయ్య గోడకు ఎందుకాన్చావురా నీ మంచాన్ని అంటూ కోప్పడేది. ఒకసారి మాకుటుంబమంతా ఏదో పుణ్యక్షేత్రదర్శనానికి వెళ్ళాం. ఆ రోజల్లా చాలా నడవాల్సి వచ్చింది, కొండలు, మెట్లు చాలా ఎక్కాల్సివచ్చింది. సాయంత్రం బసకు చేరుకున్నవెంటనే చాలామంది నాకాళ్ళు నొప్పిపెడ్తున్నాయి మొర్రో అంటూ మంచాలమీద కూలారు. కానీ తాతయ్య మాత్రం కాయగూరలు కడిగి తరగడం మొదలుపెట్టాడు. నీ కాళ్ళు నొప్పిపెట్టడం లేదా తాతయ్యా అని అడిగితే గోడకుర్చీతో గట్టిపడ్డ కాళ్ళు ఎంతదూరమైనా వెళ్ళగలవురా అన్నాడు!.




#Article 18: భాష (173 words)


భాష : ప్రపంచంలోని ప్రతి మానవుడు తన ఆలోచనలను ఇతరులకు తెలుపడానికి, ఇతరుల ఆలోచనలను తెలుసుకోవడానికి ఉపయోగించుకునే మాధ్యమమే భాష. భాషకు లిపి, భాషాసూత్రాలు, వ్యాకరణం, సాహిత్యము ముఖ్యమైన అంశాలు.

భారతదేశంలో 3,372 భాషలు మాట్లాడేవారున్నారు. ప్రపంచంలో ఇన్ని భాషలు మాట్లాడే దేశం కానరాదంటే అతిశయోక్తిగాదు.

తెలుగు భాషలో భాష పదానికి వివిధ ప్రయోగాలున్నాయి. భాష నామవాచకంగా A language, speech, dialect. A word, phrase, expression. మాట, A solemn undertaking, vow, engagement: what one gives his word for, an oath, ప్రతిజ్ఞ, ప్రమాణము అని అర్ధాలున్నాయి. దేశ భాష the vernacular of a country. భాషణము v. n. అనగా Speaking, speech. మాటాడుట. భాషాంతరము n. అనగా Another language: a translation. భాషాగ్రంథము n. A poem in a modern or vernacular language, not in Sanskrit. భాషామంత్రము n. A spell or charm, written in any vernacular language, not in Sanskrit. భాషించు v. n. అనగా To speak, use language, converse, talk, మాటలాడు. భాషితము n. Speech, language. మాట. adj. Spoken, మాటాడిన. భాష్యము n. అనగా A commentary, a paraphrase or exposition either of scripture or a work on science, సూత్రవ్యాఖ్యానగ్రంథము. భాష్యకారులు లేదా భాష్యకార్లు n. అనగా A commentator or expounder of technical texts; బాసికములు fillets worn at weddings పెళ్ళిలో నుదుట ధరించేవి.

ఉపోద్ఘాతం




#Article 19: ఆటలు (653 words)


శరీరక సౌష్టవము కొరకు, మానసిక ఉల్లాసము కొరకు తర తరాలనుండి ఆటలు ఒక అద్భుతమైన సాధవముగా ఉన్నాయి. మన వాళ్ళు రక రకాల ఆటలు ఆడుతూ ఉంటారు. 

ఆడే పద్ధతిఃఆడేవాళ్ళు ఇద్దరుంటారు. 9 నప్పులుంటాయి. ఒకరి తర్వాత ఒకరు, ఒక్కొక్కటి చొప్పున నప్పాలి. ఎవరివైనా మూడు నప్పులు, అడ్డంగా గాని, నిలువుగా గాని ఒకే వరుసలో వస్తే ఒక దాడి జరిగినట్లు. దాడి జరిపిన వాళ్ళు ఎదుటివారి నప్పులలోంచి ఒక నప్పును (దాడి జరగనిది మాత్రమే) తీసుకుంటారు. ఒకసారి దాడి జరిపిన నప్పుని, ప్రక్కకు జరిపి, దానితో మరల దాడి చెయ్యవచ్చును. ఇలా ఆడే ఇద్దరిలో ఎవరివో ఒకరి నప్పులు పూర్తయ్యేవరకు ఆడుకోవచ్చును. మూలలో బాణం గుర్తులున్న కోణాలలో వరసగా నప్పులు పెట్టడం దాడిగా ఒప్పుకోబడదు.

ఆడే పద్ధతిః

ఆటగాళ్ళుః యిద్దరు, కావలసినవిః 3-పులులు, 15-మేకలు

పైనున్నది కొండ, క్రింద గళ్ళు అడవి, పులులు 3 కొండపైనే వుండాలి. ముందుగా ఒక మేకని అడవిలో వదలాలి, దాన్ని చంపేందుకు ఒక పులిని కొండమీంచి అడవిలోకి దించాలి. పులి కదలికలను బట్టి, మొదటి మేకకు కాపుగా ఇంకో మేకని నప్పాలి. అవసరాన్నిబట్టి ఒక్కొక్క పులిని కొండమీంచి దింపనూనచ్చు, కొండమీదకు పంపనూవచ్చు. ఇలా పులుల కదలికల్ని బట్టి, వాటికి అందకుండా 15 మేకల్ని క్రాస్ ల మీద పేర్చాలి, పులి తన తర్వాతి క్రాస్ మీద ఇన్న మేక మీంచి పైనుండి క్రిందికి కాని, అడ్డంగా గాని దూకవచ్చు. అలా దూకితే ఆ మేక చని పోయినట్లు భావించి ఆటలోనించి తీసేయ్యాలి. ఆయితే ఒక గడి ఎడంగాఉన్నా, లేదంటే వరుసగా వున్న రెండు మూడు మేకల మీంచి గాని పులి దూకకూడదు. ఆలాగే 15 మేకల్తోనూ 3 పులుల్ని కదలకుండా కట్టెయ్యచ్చును. అలా ఎక్కువ మేకలు చనిపోతే పులుల పార్టీ, పులులు కట్టుబడిపోతే మేకలపార్టీ నెగ్గినట్లు. మేకలు పులులమీంచి దూకలేవు సుమా! ఆడటం అలవాటైతే చదరంగం లాగానే ఆడుకోవచ్చు.

ఆడే పద్ధతిః

మూరెడు పొడుగున్న (గోడు), జానెడు పొడుగున్న (బిళ్ళ) కావాలి. జానెడు పొడుగున్నబిళ్ళ చివరలని నున్నగా అటూ ఇటూ కదురు లాగా చెక్కాలి. 
మూరెడు పొడుగున్న గోడుని ఒక పక్క కదురు లాగా చెక్కాలి. 
నేల మీద సన్నగా చిన్న గుంట తీసి దాని మీద అడ్డంగా చిన్న కర్ర (బిళ్ల) ని పెట్టి, పెద్ద కర్రతో లేపి ఎగిరేలా కొడతారు. 

 

 
ఈ ఆటలో ముందుగా ఒకరిని దొంగగా ఎన్నుకుంటారు. మిగతా వారిలో ఎవరో ఒకరు ఒక కర్రను వృత్తాకారంలో గీచిన గీతలోనుండి విసురుతారు. ఇలా వృత్తాకారంలో గీచిన గీతను గిరి అని కూడా పిలుస్తారు. అలా విసిరిన కర్రను దొంగ తీసుకొచ్చి గిరిలో ఉంచుతాడు. ఆ తర్వాత మిగతా వారిలో ఎవరో ఒకరిని తాకడానికి ప్రయత్నిస్తాడు. వారు అతనికి దొరకకుండా చెట్లెక్కి దాగి ఉంటారు. దొంగ వారిలో ఎవరో ఒకరిని తాకగల్గితే అలా దొరికిన అతను తర్వాత దొంగ అవుతాడు. ఒక వేళ దొంగ ఒకరిని తాకే ప్రయత్నంలో ఉండగా ఎవరో ఒకరు గిరిలో ఉన్న కర్రను తొక్కినట్లయితే మరలా అతనే దొంగగా ఉంటాడు.

ఈ ఆట ముఖ్యంగా 6 నుండి 13 వరకు వయసు గల బాల బాలికలు ఆడు ఆట. ఈ ఆటను ఎంత మందయినా ఆడవచ్చును. మొదటగా ఒకరిని దొంగగా నిర్ణయిస్తారు. ఈ ఆట ఆడు ప్రదేశమందు మట్టి ప్రదేశము (నేల), రాతి పృదేశము (బండ) ఉండవలెను. ముందుగా దొంగని నేల కావాలో బండ కావాలో కోరుకోమంటారు. ఉదాహరణకి దొంగ నేల కోరుకున్నచో, దొంగ నేల మీద, మిగిలిన వారందరు బండ మీద ఉంటారు. బండ మీద ఉన్నవారు నేల మీదకి వచ్చి దొంగని ఆటపట్టిస్తూ ఉంటారు. దొంగ బండ మీదకి వెళ్లకుండా నేల మీదకి వచ్చిన వాళ్లని పట్టుకోవటానికి ప్రయత్నించవలెను. ఇదియే దొంగ యొక్క ముఖ్య లక్ష్యం. దొంగకి చిక్కిన వారు దొంగ స్థానమును భర్తీ చేస్తారు. ఈ ఆట చిన్న పిల్లలకు బాగా ఇష్టమైన ఆట.

పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో పిల్లలు ఆట బొమ్మలను తెచ్చుకుని పెళ్ళి ఆట ఆడుకునేవారు. ఆట బొమ్మలకు పెళ్ళి వస్త్రాలు తొడిగి, వియ్యపువారి బొమ్మలను కూడా పెట్టేవారు. పిల్లలందరూ పెద్దల వేషధారణలో వచ్చి కూర్చుంటారు. పెళ్ళిలోని కన్యాదానం, జీలకర్ర-బెల్లం వంటి ఘట్టాలను నిర్వహించి చివరకు వరుడి బొమ్మ చేతికి చిట్టి మంగళ సూత్రాన్ని తగిలించి వధువు బొమ్మ మెడలో పడేలా చేస్తారు. అయితే సంసారపు శిక్షణ ఇచ్చే ఈ ఆట ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నం, ఆధునిక చధువులు, పాశ్చాత్య పోకడల వల్ల నేడు ఆట పూర్తిగా అంతరించిపోయింది. భారతీయ సంప్రదాయాన్ని, కుటుంబ వ్యవస్థను ప్రతిబంబించే ఈ ఆటను పాశ్చాత్య విష సంస్కృతి ప్రభావానికి గురైన నేటి పిల్లలకు తల్లిదండ్రులు తెలిపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది.

భారతదేశంలో బాగా ఆడే ఆట ఈ క్రికెట్. ఈ ఆట ఆడటానికి రెండు టీంలు వుండాలి. ఒక్కొక్క టీంలో 11 మంది వుంటారు. రమ.

వివిధ రకాల హాకీ గురించి తెలుసు కోవడానికి ప్రధాన వ్యాసం చదవండి.

భారతీయులచే కనిపెట్ట బడిన ఈ క్రీడ చాలా పురాతనమైనది. ఈ ఆటలో 12 నిలువు 12 అడ్డం వరసలతో కూడిన గళ్ళ బోర్డు ఉంటుంది. ఒకటి నల్ల గడి అయితే ఒకటి తెల్ల గడి. ఆడటానికి పావులు ఉంటాయి. నల్లవి 24 పావులు, తెల్లవి 24 పావులు. వీటిల్లో 12 సిపాయిలు లేదా కాలి బంట్లు, 2 ఏనుగులు,2 శకటాలు,2 గుర్రాలు,1 రాజు,1 మంత్రి లేదా రాణి.

ఆడే విధానంముందు పావులు పేర్చే విధానం.బోర్డు మన ఎదురుగా పెట్టుకున్నప్పుడు మన ఎడమ పక్క చివర నల్ల గడి ఉండాలి. ఆ చివరి గడిలో, ఈ చివరి గడిలో 2 ఏనుగులూ పెట్టాలి. వాటికి లోపలి పక్కన రెండు వైపులా 2 గుర్రాలూ పెట్టాలి. తరువాత శకటాలు, ఇప్పుడు 2 గళ్ళు మిగులుతాయి. 1 నల్లది, 1 తెల్లది. నల్ల పావులు ఐతే నల్ల రాజు తెల్ల గడిలో, తెల్లవైతే తెల్ల రాజు నల్ల గడిలో ఉంచాలి. మిగిలిందాంట్లో మంత్రి లేదా రాణిని ఉంచాలి.

ఎత్తులు

మొదట పావులు కదిపేది మాత్రం ఎప్పుడైనా తెల్ల పావులతో ఆడేవాళ్ళే.

ఇంటిపట్టున ఉండే ఆడపిల్లలు ఆడుకునే ఈ ఆటను అచ్చెనగండ్లు అని కూడా అంటారు. ఈ ఆటను చింతగింజలతోను, గచ్చకాయలతో కూడా ఆడుకొందురు.

ముఖ్య వ్యాసము: నాలుగు స్తంభాలాట




#Article 20: కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ (490 words)


కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, లేదా క్లుప్తంగా సాఫ్ట్‌వేర్ అనేది కంప్యూటర్ వ్యవస్థలో ఉపయోగించే కంప్యూటర్ ప్రోగ్రాములు, కంప్యూటర్ ప్రక్రియలు సంబంధిత రచనలు అన్నింటినీ కలిపి వర్ణించడానికి  

అధికంగా వాడే అర్ధంలో సాఫ్ట్ వేర్ అనగా కంప్యూటర్లు పనిచెయ్యడానికి ఇచ్చే ఆదేశాల వరుస. ఈ వరుసనే ప్రోగ్రాము అంటారు. ఇటువంటి ప్రోగ్రాములు చాలా రాస్తే ఒక పెద్ద పని చెయ్యడము వీలు అవుతుంది. అలాంటి పెద్ద ప్రోగ్రాముల గుంపుని సాఫ్ట్ వేర్ అంటారు.

సాఫ్ట్వేర్ అనే పదం క్రింది వాటికన్నింటకీ వివిధ సందర్భాలలో వాడుతారు.
 

agriculture education- agriculture software

ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుంది. రైతులు పంట ఉత్పత్తి, పంట దిగుబడి పెంచుకోవడానికి మార్గాలను అన్వేషిస్తున్నారు. రైతులు ట్రాక్, కొలిచేందుకు, కొన్ని వేరియబుల్స్ కు  స్పందించాలి. వారు సరైన ఫలితాలను పొందడానికి వాతావరణ పరిస్థితులు వంటి గత దిగుబడి డేటా, పర్యావరణ కారకాల ఆధారంగా ఆదర్శ నాటడం, నిర్వహణ, సాగు సీజన్ల గురించి తెలుసుకోవాలి. రైతులకు నేల యొక్క రాష్ట్రాన్ని, ప్రత్యేక నేలలో కనిపించే కీటకాలు, ఇతర ముఖ్యమైన వ్యవసాయ అంశాలలో నేల తేమ గురించి తెలుసుకోవాలి. వ్యవసాయ దిగుబడి, ఆదాయాలు పెంచడానికి, రైతులు డేటా ఆధారిత ఆలోచనలు ఉపయోగించాలి. ప్రతి పంటకు వ్యవసాయ దిగుబడులను ఆప్టిమైజ్ చేయడానికి కచ్చితమైన డేటా అంతర్దృష్టులు రైతులు, రైతులకు సహాయం చేస్తాయి. వారు ప్రతి వృద్ధి చక్రంలో విత్తనాల ప్రణాళికలు, అంతరిక్ష ఉపయోగాలను పర్యవేక్షిస్తారు. కచ్చితమైన వ్యవసాయం అనేది పంట ఉత్పత్తిని మరింత సమర్థవంతంగా చేస్తుంది ఆధునిక వ్యవసాయ పద్ధతి.

టాప్ ప్రెసిషన్ అగ్రికల్చర్ సాఫ్ట్వేర్: ఫార్మ్ వర్క్స్, SMS, మ్యాప్షాట్స్, AgDNA, సెంటెరా, ఆగ్రోసెన్స్ టాప్ అప్రసిస్ అగ్రికల్చర్ సాఫ్ట్వేర్.

ప్రెసిషన్ అగ్రికల్చర్ సాఫ్ట్వేర్ అంటే ఏమిటి?

ప్రెసిషన్ అగ్రికల్చర్ సాఫ్ట్వేర్ అనేది క్లౌడ్-ఆధారిత సాధనం, ఇది రైతులు సంరక్షించేటప్పుడు రైతులకు, పంట దిగుబడిని, ఆదాయాన్ని పెంచడానికి, నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. ఊహించిన దిగుబడి పరిమాణం, పంట వ్యర్థాలు, ఆదాయాల గురించి అంచనా వేయడానికి రైతులు ఈ అంచనా విశ్లేషణ సాధనాలను ఉపయోగిస్తారు. ఇది వినియోగదారుడు పంట, పంటల భ్రమణ మార్గదర్శిని, నేల నిర్వహణ యొక్క పరిస్థితులపై సమాచారాన్ని పొందటానికి సహాయపడుతుంది.

రియల్-టైమ్ ఇన్సైట్స్: ప్రెసిషన్ అగ్రికల్చర్ టూల్స్ టూల్ రియల్ టైమ్ రిపోర్టులు ఆఫర్ ఫర్ లేబర్, ఇన్పుట్స్ అండ్ అదర్ కారెక్టర్స్ ఇన్ దట్ పంట ప్రొడక్షన్. సెన్సింగ్ పరికరాలు ఎంపిక పారామితుల నిరంతర పర్యవేక్షణను అనుమతిస్తాయి, మొత్తం సమయం, ఫీల్డ్ పరామితుల యొక్క ప్రస్తుత స్థితిని నిర్ధారించడానికి రియల్ టైమ్ డేటాను అందజేస్తాయి.

దిగుబడి పర్యవేక్షణ: దిగుబడి పర్యవేక్షణ లక్షణం ఒక నిర్దిష్ట ప్రదేశంలో వినియోగదారు కొలత ఫలప్రథమైన దిగుబడికి దోహదపడుతుంది, మ్యాప్లో వివిధ సీడ్ రకాలు పనితీరును సరిపోల్చండి. ఇది పంట దిగుబడులను పర్యవేక్షించటానికి GPS- పొందిన సమాచారంతో అనుసంధానించబడుతుంది.

అంతర్నిర్మిత అకౌంటింగ్: అకౌంటింగ్ ఫీచర్ అంతర్నిర్మిత తో, కచ్చితమైన వ్యవసాయ సాఫ్ట్వేర్ యూజర్ రికార్డులు ఉంచడానికి, పంట దిగుబడి, లాభదాయకత ట్రాక్ అనుమతిస్తుంది.

ఫీల్డ్ మేనేజ్మెంట్: ప్రెసిషన్ అగ్రికల్చర్ సాఫ్ట్వేర్ వినియోగదారుని పంట భ్రమణ, ఎరువు, పైరు, నీటిపారుదల, నేల పరీక్ష ఫలితాలను పర్యవేక్షిస్తుంది.

ఇన్వెంటరీ మేనేజ్మెంట్: రైతులు తయారీదారుల నుండి గిడ్డంగులకు వ్యవసాయ వస్తువుల ప్రవాహాన్ని ట్రాక్ చేయవచ్చు, నిర్వహించవచ్చు. వినియోగదారు వ్యవసాయ ఉత్పత్తుల నిల్వను కూడా ట్రాక్ చేయవచ్చు.

లేబర్ మేనేజ్మెంట్: ప్రెసిషన్ అగ్రికల్చర్ సాఫ్ట్వేర్ వినియోగదారుని ఉత్పాదకతను పర్యవేక్షించటానికి అనుమతిస్తుంది.

ట్రేసెబిలిటీ: ఆహార ఉత్పత్తిలో ఎక్కువ ఆధారపడడానికి వీలు కల్పిస్తుంది, ఎందుకంటే ఆహార ఉత్పత్తికి వెళ్లేమిటో వినియోగదారులకు తెలియజేసే వ్యవసాయ విధానాలు, ఇన్పుట్లను కచ్చితమైన సమాచారాన్ని పొందడానికి వినియోగదారుని అనుమతిస్తుంది.

వాతావరణ రికార్డ్స్: ప్రెసిషన్ అగ్రికల్చర్ సాఫ్ట్వేర్ వారి క్యాలెండర్ను ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో సమకాలీకరించడానికి అనుమతిస్తుంది, అందువలన వినియోగదారు ఫీల్డ్ కార్యకలాపాలను షెడ్యూల్ చేయవచ్చు.

సహకార: ప్రెసిషన్ అగ్రికల్చరల్ సాఫ్ట్వేర్ సహకార విశేషణం వినియోగదారుల విశ్వసనీయ సర్కిల్ తో  సహకరించడానికి యూజర్ భాగస్వామ్య సమాచారాన్ని అనుమతించండి.

దిగుబడి, పెట్టుబడులను ఆప్టిమైజ్ చేయడానికి రైతులు పంట ఉత్పత్తిని పర్యవేక్షించటానికి వీలు కల్పించే ఒక ముఖ్యమైన సాధనం కచ్చితమైన వ్యవసాయ సాఫ్ట్వేర్ .

సాప్టువేరును అభివృద్ధి చెయ్యడానికి చాలా రకాలైన నమూనాలు ఉన్నాయి.

సాఫ్టువేరు టెస్టింగ్ అనగా సాఫ్టువేరును దాని వాడుకరులకు అందించే ముందు అందులో ఎటువంటి లోపాలూ లేవని నిర్ధారించటం, లేదా ఉన్న లోపాలన్నిటినీ వెలికి తీయటానికి చేసే ఒక ప్రక్రియ. సాధారణంగా సాఫ్టువేర్లను రెండు రకాల పరీక్షిస్తారు. అవి మాన్యువల్ (అనగా మనుషుల ద్వారా పరీక్షించడం), ఆటోమేషన్ (అనగా సాఫ్టువేర్లను పరీక్షించడానికి ప్రోగ్రాములను రాయడం). సాధారణంగా సాఫ్టువేర్లపై మనుషులే మొదటగా లోపాలను పట్టుకోవడానికి పరీక్షలు మొదలుపెడతారు. ఈలోగా సాఫ్టువేరు తయారీలో ఉత్పన్నమయ్యే సాధారణ లోపాలు తగ్గుముఖం పడుతున్న కొద్దీ వాటిని పరీక్షించడానికి ప్రోగ్రాములు (ఆటోమేషన్) తయారవుతాయి.




#Article 21: తెలుగు సాహిత్యము (646 words)


తెలుగు సాహిత్యమునకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. తెలుగు సాహిత్యం ఎంతో సుసంపన్నమైనది. ఆధ్యాత్మికములోనైనా, శృంగారాది నవరసములలోనైనా, జాతిని జాగృతం చేయు విషయంలోనైనా, తెలుగువారందరూ గర్వపడేటంత విశేషమై వెలుగొందుతున్నది తెలుగు సాహిత్యం. నన్నయ్య వ్రాసిన భారతము తెలుగులో మొదటి కావ్యము. అంతకు ముందే జానపద గీతాలు, కొన్ని పద్యాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. గాథా సప్తశతి లో తెలుగు జానపద గీతాల ప్రస్తావన ఉంది.

కాలానుగుణ తెలుగు సాహితీ చరిత్ర కోసం తెలుగు సాహితీ చరిత్ర ను చూడండి.

తెలుగు సాహితీకారుల గురించిన మరిన్ని వివరముల కోసం తెలుగు సాహితీకారుల ను చూడండి.

తెలుగు సాహిత్య చరిత్రను కొన్ని యుగాలుగా విభజించ వచ్చును.

దీనిని పురాణ యుగము లేదా భాషాంతరీకరణ యుగము అని అంటారు. 
నన్నయ్య ఆది కవి. ఈయన మహా భారతాన్ని తెలుగులో వ్రాయ ప్రారంభించి, అందులో మొదటి రెండు పర్వాలు పూర్తి చేసి, తరువాతి పర్వాన్ని (అరణ్య పర్వం) సగం వ్రాసి కీర్తి శేషుడు అయ్యాడు. నన్నయకు నారాయణ భట్టు సహాయంగా నిలిచాడు. నారాయణ భట్టు వాఙ్మయదురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు. సహాధ్యాయులైన నారాయణ, నన్నయ భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునులవలె భారతాంధ్రీకరణకు పూనుకొని, ఒక విజ్ఞాన సర్వస్వంగా దానిని రూపొందించే ప్రయత్నం ప్రారంభించారు; తెలుగు కావ్యభాషాస్వరూపానికి పూర్ణత్వం సాధించి, పండితులు పామరులు మెచ్చుకొనదగిన శైలిని రూపొందించి, తరువాతి కవులకు మార్గదర్శకులయ్యారు. ఆంధ్ర భాషా చరిత్రలో నన్నయ,నారాయణులు యుగపురుషులు. వీరు తెలుగు భాషకు ఒక మార్గాన్ని నిర్దేశించారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒకసారి అయినా నన్నయ్య అడుగుజాడలను అనుసరించిన వారే. నన్నయ్య ఆది కవి.

నన్నయ తరువాతి కాలంలో ముఖ్యమైన సామాజిక, మత సంస్కరణలు చోటు చేసుకొన్నాయి. వీరశైవం భక్తిమార్గం ప్రబలమై ఎన్నో కావ్యాలకు కారణమైనది.

తిక్కన మహాభారతం లోని 15 పర్వాలను పూర్తి చేసాడు. దీని ద్వారా ఈయన గొప్ప కవి అయ్యరు.

ప్రధాన వ్యాసము: ఎఱ్ఱన యుగము

తిక్కన మరణానికి సుమారు 10 సంవత్సరాలముందు (1280 ప్రాంతంలో) ఎఱ్ఱన జన్మించి ఉంటాడు. ఎఱ్ఱన మరణం 1360లో జరిగి ఉండవచ్చును. 1365-1385 ప్రాంతంలో జన్మించిన శ్రీనాథుడు తరువాతి యుగకవిగా భావింపబడుతున్నాడు.

ఆంధ్ర వాఙ్మయంలో ఆఖ్యాన పద్ధతిని నన్నయ, నాటకీయ పద్ధతిని తిక్కన ప్రారంభించినట్లే వర్ణనాత్మక విధానానికి ఎఱ్ఱన ఆద్యుడు. నన్నయ యొక్క శబ్దగతిని, తిక్కన యొక్క భావగతిని అనుసంధించి క్రొత్త శైలిని కూర్చిన మహానుభావుడు ఎఱ్ఱన. తెలుగుభాష పలుకుబడి, వాక్య నిర్మాణము ఈ కాలంలో ఆధునికతను సంతరించుకొన్నాయి. శ్రీనాథుని వంటి అనంతరీకులు ముందుగా ఈ శైలినే అలవరచుకొని రచనలు సాగించారు.

తిక్కన (13వ శతాబ్ది), ఎర్రన (14వ శతాబ్దం)లు భారతాంధ్రీకరణను కొనసాగించారు. నన్నయ చూపిన మార్గంలో ఎందరో కవులు పద్యకావ్యాలను మనకు అందించారు. ఇవి అధికంగా పురాణాలు ఆధారంగా వ్రాయబడ్డాయి. అందువలననే ఈ కాలాన్ని పురాణ యుగము అంటారు.

ఈ కాలంలో సంస్కృతకావ్యాల, నాటకాల అనువాదం కొనసాగింది. కథాపరమైన కావ్యాలు కూడా వెలువడ్డాయి. ప్రబంధము అనే కావ్య ప్రక్రియ ఈ కాలంలోనే రూపుదిద్దుకున్నది. ఈ కాలంలో శ్రీనాథుడు, పోతన, జక్కన, గౌరన పేరెన్నికగన్న కవులు. ఛందస్సు మరింత పరిణతి చెందింది. శ్రీనాథుని శృంగార నైషధం, పోతన భాగవతం, జక్కన విక్రమార్క చరిత్ర, తాళ్ళపాక తిమ్మక్క సుభద్రా కల్యాణం మొదలైనవి ఈ యుగంలో కొన్ని ముఖ్యమైన కావ్యాలు.

ఈ సందర్భంలో రామాయణము కవుల గురించి కూడా చెప్పకోవచ్చును. గోనబుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం మనకు అందిన మొదటి రామాయణం.

ఈ కాలాన్నే మధ్యయుగం అని కూడా అంటారు.

దీనినే ప్రబంధ యుగము అని కూడా అంటారు.
విజయనగర చారిత్రక శకానికి చెందిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆదరణలో 16 వ శతాబ్దం ప్రాంతంలో తెలుగు సాహిత్యపు స్వర్ణయుగం వికసించింది. స్వతహాగా కవియైన మహారాజు తన ఆముక్తమాల్యదతో ప్రబంధం అన్న కవిత్వరూపాన్ని ప్రవేశపెట్టాడు. ఆ కాలంలో అతి ప్రముఖ కవులైన అష్టదిగ్గజాలతో ఆయన ఆస్థానం శోభిల్లింది.

కర్ణాటక సంగీతపు ప్రముఖులు ఎంతో మంది వారి సాహిత్యాన్ని తెలుగులోనే రచించారు. అటువంటి ప్రసిద్దమైన వారి జాబితాలోనివే త్యాగరాజు, అన్నమాచార్య, క్షేత్రయ్య వంటి పేర్లు. మైసూర్ వాసుదేవాచార్ వంటి ఆధునిక రచయితలు కూడా వారి రచనలకు మాధ్యమంగా తెలుగునే ఎంచుకొన్నారు.

మొట్టమొదటి నవలగా పరిగణించబడుతున్న కందుకూరి వీరేశలింగం రచన రాజశేఖరచరిత్రముతో తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ సంపూర్ణమయ్యింది. గురజాడ అప్పారావు (ముత్యాల సరాలు), గిడుగు రామ్మూర్తి, కట్టమంచి రామలింగారెడ్డి (ఆంధ్ర విశ్వవిద్యాలయపు వ్యవస్థాపకుడు) (ముసలమ్మ మరణం), రాయప్రోలు సుబ్బారావు (తృణకంకణం), సురవరం ప్రతాపరెడ్డి మొదలైన తెలుగు సాహిత్యపు నవయుగ వైతాళికులు వ్యావహారిక భాషను వాడడం, వ్యావహారిక భాషా వాదమునకు దారితీసింది.

తెలుగు సాహిత్యంలో ముప్ఫైకి పైగా శతకాలను ముస్లిం కవులు రాశారు.భక్తి, నీతి, తాత్విక, ప్రబోధాత్మక సాహిత్యంలో ముస్లిం కవులు శతకాలు రాశారు.తెలుగుముస్లిం కవులు రాసిన కొన్ని శతకాలు ;

భక్త కల్పద్రుమ శతకం (1949)
మొక్కపాటి శ్రీరామశాస్త్రితో కలసి రాసిన శతకం సుమాంజలి.
హరిహరనాథ శతకము
అనుగుబాల నీతి శతకము
తెనుగుబాల శతకము

అల్లా మాలిక్‌ శతకము

సయ్యదయ్యమాట సత్యమయ్య సూక్తి శతకము

సోదర సూక్తులు

హుస్సేన్‌దాసు శతకము-ధర్మగుణవర్య శ్రీ హుసేన్‌ దాసవర్య

ప్రవక్త సూక్తి శతకము,భయ్యా శతకము

వేంకటేశ్వరుండు, బీబి నాంచారమ్మ
బెండ్లియాడి మతమభేదమనియె
హరి, ప్రమాణమైన వ్యర్థవాదాలేల?
పాపసాబు మాట పైడిమూట

సాధుశీల శతకము
కులము మతముగాదు గుణము ప్రధానంబు
దైవచింత లేమి తపముగాదు,
బాలయోగి కులము పంచమ కులమయా,
సాధులోకపాల సత్యశీల

గురుని మాట యశము గూర్చుబాట అనే మకుటంతో 'గురుని మాట' శతకం
మానస ప్రబోధము శతకం

మిత్రబోధామృతము అనే శతకం

బ్రహ్మ విద్యా విలాసము.

తెలుగుసాహిత్యములో ప్రపంచ సాహిత్యము లో వలెనే వివిధ రకరకాలైన పద్ధతులు ఉన్నాయి. ముఖ్యముగా ఈ క్రింది విషయములు చెప్పుకొనవచ్చు. 

తెలుగులో వివిధ సాహిత్య రీతుల్లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఎన్నో కావ్యాలు వచ్చాయి. వాటి వివరాలు ఇక్కడ చూడండి.

ప్రస్తుతము విప్లవ సాహిత్యము, అవధానములు, ఇంటర్నెట్టు తెలుగు సాహిత్యము, వివిధ ఇజములుకు చెందిన సాహిత్యములు, నవలలు,టీ. వీ. సాహిత్యము, సినీ సాహిత్యము, రీ మిక్సులు, చిన్న కథలు వంటివి తెలుగు సాహిత్య ముఖ చిత్రాన్ని చాలా వరకు పూర్తి చేస్తున్నాయి

విమర్శ ఒక సాహిత్య పక్రియ.ఈ ప్రక్రియ సర్వ స్వతంత్రమైనది. వచన రచన పక్రియ కాదు. ఏదో ఒక సృజనాత్మక సాహిత్య పక్రియ ఆధారం లేకుండా విమర్శ ఉండదు.




#Article 22: నన్నయ్య (653 words)


నన్నయ భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (క్రీ.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం వారు పాల్కురికిసోమనాథుడిని ఆది కవిగా భావిస్తున్నారు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు. నానాపురాణ విజ్ఞాన నిలయుడు; అవిరళ జపహోమ తత్పరుడు, వయ్యాకరణి, వాగనుశాసనుడు. సంస్కృత, ఆంధ్రభాషయందు పాండిత్యం కలవాడు. సంస్కృత మహాభారతానికి అనుసృజనయైన శ్రీమదాంధ్ర మహాభారతం రచించిన కవిత్రయం (ముగ్గురు కవులు) లో మొదటివాడు. మహాభారతమే తెలుగులో తొలి కావ్యంగా ప్రసిద్ధిచెందింది. మహాభారతానికి తెలుగు సాహిత్యంలో ఎంతో సాహితీపరమైన విలువ కలిగివుంది. చంపూ కవిత శైలిలోని మహాభారతం అత్యుత్తమ రచనాశైలికి అద్దంపడుతూ నిలిచింది.

నన్నయ సంస్కృతంలో తొలి తెలుగు వ్యాకరణ గ్రంథమైన ఆంధ్ర శబ్ద చింతామణి రచించారని భావిస్తారు. సంస్కృత భాషా వ్యాకరణాలైన అష్టాధ్యాయి, వాల్మీకి వ్యాకరణం వంటివాటి సరళిని అనుసరించారు. అయితే పాణిని పద్ధతికి విరుద్ధంగా ఐదు విభాగాలుగా తన వ్యాకరణాన్ని విభజించారు. అవి సంజ్ఞ, సంధి, అజంత, హలంత, క్రియ.

ఆదికవిగానే కాక శబ్దశాసనుడు, వాగనుశాసనుడు అన్న పేర్లతో ఆయన ప్రఖ్యాతుడయ్యారు. నన్నయ భారతంలోని అత్యుత్తమ, అత్యంత అభివృద్ధి చెందిన భాషను గమనిస్తే, నన్నయ భారతానికి పూర్వమే తెలుగు సాహిత్యంలో రచనలు ఉండి వుంటాయన్న సూచన కలగుతుంది. నన్నయకు ముందేవున్న పద్యశాసనాల్లోని పద్యాలు, అనంతరకాలంలోని పాల్కురికి సోమన రచనలో సూచించిన అనేక ప్రక్రియల సాహిత్యరూపాలు ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. కవిప్రశంసలు.

నన్నయ వేగిదేశానికి రాజైన రాజరాజనరేంద్రుని ఆస్థాన కవి. వేగిదేశము 8000 చదరపుమైళ్ళ వైశాల్యం కలిగి ఉండేది. పడమటన తూర్పుకనుములకు, తూర్పున సముద్కు, ఉత్తరాన గోదావరినదికి, దక్షిణాన కృష్ణానదికి మధ్యస్థమయిన తెలుగుదేశము అను వేగిదేశము గలదు.  ఈ వేగిపురమును పరిపాలిస్తున్న రాజమహేంద్రుని బట్టి ఈ నగరానికి రాజమహేంద్రవరము అనే పేరు వచ్చింది.

ఈ వేగిదేశ పాలకుడు, చాళుక్యరాజు విమలాదిత్యుడు. ఇతని పుత్రుడు రాజరాజనరేంద్రుడు. రాజనరేంద్రుడికి విష్ణువర్థనుడు అను బిరుదు ఉంది. రాజరాజనరేంద్రుడు క్రీ.శ.1022 నుండి క్రీ.శ1063 వరకు 41 సంవత్సరములు పరిపాలించాడు. నన్నయ దానశాసనము రచించాడని, నదంపూడి శాసనము కూడా వేయించాడని భావనవుంది. నన్నయ్య మహాభారతాన్ని తెలుగులో రాయడం మొదలుపెట్టి, అందులో ఆది,సభా,అరణ్య-పర్వాలను పూర్తి చేసి,  కీర్తిశేషు డయ్యాడు. నన్నయ తెలుగు భాషకు ఒక మార్గాన్ని నిర్దేశించారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒకసారి అయినా నన్నయ్య అడుగు జాడలను అనుసరించినవారే. 
నన్నయ్య రాజమహేంద్రవరం లేదా రాజమండ్రిలో వుండి ఈ మహా భారతాన్ని తెలుగులో రచించాడు. తల్లి గోదావరి ఒడ్డున కూర్చోని, తన రాజయిన రాజరాజనరేంద్ర మహారాజు గారికి చెప్పినదే ఈ మహాభారతము. రాజరాజనరేంద్రుని పాలన క్రీ.శ. 1045-1060 మధ్య కాలంలోనే భారతాంధ్రీకరణ జరిగి ఉంటుంది. నన్నయ ముద్గల గోత్రజాతుడగు వైదికబ్రాహ్మణుడు. అతడు రాజరాజ నరేంద్రుని ఆస్థానపురోహితుడు. ఆ విషయాన్ని తాన స్వయంగా క్రింది పద్యంలో తెలిపాడు.

నన్నయ తన రచన భారతంలో అవతారికలో షష్ఠ్యంతములు వేయలేదు. భాస్కరరామాయణం ఈ విషయములో దీనిని పోలి ఉంది. స్వప్నకథను, షష్ట్యంతములను మొట్టమొదట చేర్చినవాడు తిక్కన సోమయాజి. నన్నయ తన మహాభారత రచనకి నారాయణభట్టు సహకరించాడని పేర్కొనెను.

వ్యాసభారతాన్ని తెలుగులోకి తెచ్చిన ఆదికవి నన్నయ్య యథామూలానువాదం చెయ్యలేదు. ఒక్కో శ్లోకానికి ఒక్కో పద్యం అన్న పద్ధతి పెట్టుకోలేదు. ’భారత బద్ధ నిరూపితార్థము తెలుగు వారికి అందించడమే నా లక్ష్యం’ అన్నాడు. దానికి తగినట్టు పద్దెమినిమిది పర్వాలకూ ప్రణాళిక రచించి తన స్వేచ్ఛానువాదాన్ని ప్రారంభించాడు. తిక్కన, ఎర్రనలు అదే ప్రణాళికను అనుసరించి అదే లక్ష్యంతో దాన్ని పూర్తి చేసారు. అప్పటినుంచి ప్రాచీన తెలుగు కవులు అందరికీ అదే ఒరవడి అయ్యింది. స్వేచ్ఛానువాదాలే తప్ప యథామూలానువాదాలు అవతరించలేదు (శాస్త్ర గ్రంథాలు మాత్రం దీనికి మినహాయింపు). వర్ణనల్లోనేమి రసవద్ఘట్టాలలోనేమి అనువక్త ఈ తరహా స్వేచ్ఛను తీసుకున్నా సన్నివేశాలే ఆయా రచనల్లో కాంతిమంతాలుగా భాసించడం, పాఠకులు అందరికీ అవే ఎక్కువ నచ్చడం గమనించవలసిన అంశం. భారతంలో కొన్ని ఉపాఖ్యానాలు కావ్యాలుగా విరాజిల్లడం “ప్రబంధమండలి” అనిపించుకోవడం వెనక దాగి ఉన్న రహస్యం ఇదే.

నన్నయ్య ఈ మార్గం తొక్కడానికి ఒక చారిత్రక కారణం ఉంది. పదకొండవ శతాబ్దానికి ముందే వ్యాసభారతం కన్నడంలోకి దిగుమతి అయ్యింది. అయితే అది కన్నడ భారతమే తప్ప వ్యాస భారతం కాదు. వ్యాసుడి లక్ష్యమూ, పరమార్థమూ పూర్తిగా భంగపడ్డాయి. కథాగమనమూ, పాత్రల పేర్లు మాత్రం మిగిలాయి. స్వభావాలు మారిపోయాయి. భారత రచనకు పరమార్థమైన వైదిక ధర్మం స్థానాన్ని జైన మతం ఆక్రమించింది. ఈ అన్యాయాన్ని చక్కదిద్దడం కోసం నన్నయ ఘంటం అందుకున్నాడు. అందుచేత భారత పరమార్థాన్ని పునఃప్రతిష్ఠించడమే సత్వర కర్తవ్యంగా స్వేచ్ఛానువాద పద్ధతిని స్వీకరించాడు. బహుశ ఇందులోని స్వేచ్ఛ అనంతర 
కవులను ఆకర్షించింది. స్వీయ ప్రతిభా ప్రదర్శనకు అవకాశం ఇచ్చింది. అందుచేత కథాకల్పనల కోసం వృధా శ్రమ పడకండా ప్రఖ్యాత వస్తులేశాన్ని స్వీకరించి సర్వాత్మనా స్వతంత్ర కావ్యాలను రచించారు.

త్రిమూర్తులను స్తుతించే ఈ సంస్కృత శ్లోకముతో నన్నయ ఆంధ్ర మహాభారత రచనకు శ్రీకారం చుట్టాడు. భారతంలో నన్నయ రచించిన ఒకే ఒక్క సంస్కృత శ్లోకం ఇది.

తాత్పర్యం: లక్ష్మీ సరస్వతీ పార్వతులను వక్షస్థలమునందును, ముఖమునందును, శరీరము నందును ధరించి లోకములను పాలించువారును, వేదమూర్తులును, దేవపూజ్యులును, పురుషోత్తములును అగు విష్ణువు, బ్రహ్మ, శివుడు మీకు శ్రేయస్సు కూర్తురు గాక!

భారతాంధ్రీకరణలో ఆయన మూడు లక్షణములు -ప్రసన్నమైన కథాకలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్ధ సూక్తి నిధిత్వము - తన కింది పద్యంలో ప్రత్యేకముగా చెప్పుకొన్నాడు

నన్నయ రచించిన చివరిపద్యం (అరణ్యపర్వంలోనిది) - శారదరాత్రుల వర్ణన

తాత్పర్యం శరత్కాలపు రాత్రులు మెరిసే నక్షత్రాల పట్ల దొంగలైనాయి. - అంటే వెన్నెలలో చుక్కలు బాగా కనుపించటము లేదు. వికసించిన కలువల సుగంధాన్ని మోసుకుపోయే చల్లగాలితో, పూల పరాగంతో ఆకాశం వెలిగి పోతున్నది. చంద్రుడు కర్పూరపు పొడి వంటి వెన్నెలను విరజిమ్ముతున్నాడు.

సప్తమాత్రికలు అనగా బ్రహ్మ, మాహేశ్వరి, కౌముది, వైష్ణవి, వారాహి, ఇంద్రాని, చాముండ అనునవి సప్తమాత్రికలు.

ఆ కాలములో చరిత్రకాంశములిని తెలెపె గ్రంథములు రెండు ఉన్నాయి. అవి 1.జయంకొండన్ అఱవములో రచించిన కళింగట్టుపరణి (1063 నుండి 1112 వరకు చోళదేశముని పాలించిన కులోత్తుంగ చోడదేవుని  విజయాలను తెలెపెను) 2.బిల్హణుడు సంస్కృతములో రచించిన విక్రమాంకదేవచరిత్ర. (1076 నుండి 1126 వరకును కుంతల దేశముని పాలించిన పశ్చిమచాళుక్య రాజైన విక్రమాదిత్యుని విజయాలను తెలెపెను)

నన్నయ తాను తలపెట్టిన భారతరచన ముగించక ముందే మరణించడానికి కారణం భీమన అను మహాకవియొక్క శాపము అని ప్రతీతి. ఆ కథనం ఇలా ఉంటుంది..




#Article 23: తిక్కన (1332 words)


తిక్కన లేదా తిక్కన సోమయాజి (1205 - 1288). విక్రమసింహపురి (నేటి నెల్లూరు ప్రాంతాన్ని) పరిపాలించిన మనుమసిద్ధికి మంత్రిత్వం వహించారు. కవిత్రయములో తిక్కనది నాటకీయ శైలి, సంభాషణాత్మక శైలి.

ఈయనకు కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు అనే బిరుదు ఉండి. 

తిక్కన శిష్యుడు మారన. ఇతడు రాసిన మార్కండేయ పురాణం ప్రతాపరుద్ర దేవుని మంత్రులలో ఒకడైన నాగయగన్న మంత్రికంకితం చేసెను. మార్కండేయ పురాణంనందు 
 దేవుని కాలమున ఉన్నట్లు నిశ్చయము. తిక్కన గణపతిదేవుని దగ్గరికి పోయేటప్పటికి తిక్కనసోమయాజి యజ్ఞము చేయలేదు. భారతమును కూడా రచించలేదు.

తిక్కన సోమయాజి పెదతండ్రి కుమారుడు అయిన సహోదరుడు ఖడ్గతిక్కన. తిక్కన కుమారుడు కొమ్మన. తిక్కన మనుమరాలి భర్త యల్లాడమంత్రి. ఈ యల్లాడమంత్రి మనుమడు కవి సింగన్న. ఈ సింగన్న తండ్రి అయ్యలమంత్రి. తిక్కనసోమయాజి తాత మంత్రి భాస్కరుడు. తిక్కన కవి గౌతమిగోత్రుడు. తండ్రి
కొమ్మన. తల్లి అన్నమ్మ. కేతన, మల్లన, పెద్దన ఇతని పెదతండ్రులు.

ఈ తిక్కన నియోగిబ్రాహ్మణుడు. ఈయన పూర్వుల నివాసస్థలము మొట్టమొదట కృష్ణామండలంలోని వెల్లటూరు గ్రామం. ఉ ద్యోగరీత్య ఇతని తాతకాలమున గుంటూరునకు వచ్చారు. తరువాత నెల్లూరు రాజగు మనుమసిద్ది ఇతని కుటుంబమును ఆదరించి నెల్లూరుకి తీసుకొనివచ్చి పూర్వము హరిహర దేవాలయము ఉండిన ఇప్పటి రంగనాయకస్వామి ఆలయ సమీపమున గృహము కట్టించి ఇచ్చి తిక్కనసోమయాజులను అందుంచాడు. కేతన రాసిన దశకుమార చరిత్రనుబట్టి చూడగా తిక్కన ఇంటి పేరు కొత్తరువుయరయినట్టు తెలియవచ్చునది. తిక్కనకి అంకితము చేయబడిన దశకుమారచరిత్రము అను గ్రంథమునందు తిక్కన వంశావళి సమగ్రముగా వర్ణించబడింది.

తిక్కన తను రచించిన నిర్వచనోత్తర రామాయణము నందు

సారకవి తాభిరామ గుంటూరివిభుని
మంత్రి భాస్కరు మత్పితామహునిన్ దలచి
యైన మన్ననమెయి లోక మాదరించు
వేఱ నాకృతి గుణములు వేయు నేత?

అని తన కావ్యము స్వగుణముచేత కాకపోయిననూ తన తాత అయిన మంత్రిభాస్కరుని సారకవిత్వమహిమచేత అయిననూ లోకాదరణమునకు పాత్రయగునని చెప్పియున్నాడు. సూర్యవంశపు రాజైన మనుమసిద్ది ఆస్థానకవిగా తిక్కన ఉండడమే కాదు అతనితో సమానుడిగా గౌరవము పొందేవాడు. రాజునకు, కవికి మామవరుస ఉంది. తిక్కన నిర్వచనోత్తర రామాయణముని మనుమసిద్దికి అంకితం చేసెను. దీనితో మనుమసిద్ది

ఏనిన్ను మామ యనియెడ
దీనికిన్ దగనిమ్ము భారతీకన్యక నా
కీ నర్హుడావగు దనినని
భూ నాయకు పలుకు చిత్తమునకిం పగుడున్ 

నిన్ను మామా అని పిలుచునందుకైనా భారతమును నాకు అంకితం ఇమ్మని అడిగినట్లు చెప్పబడియున్నది.

తిక్కన నన్నయని ఆదికవిగా చెప్పలేదు. భారతమున మొదట మూడుపర్వాలను వ్రాసెనని చెప్పాడు.

తిక్కన కావ్యములు రెండు.1. నిర్వచనోత్తర రామాయణం. దీనినంతటిని పద్యములుగానే రచించెను. ఇది బాల్యమునందు రచించబడింది. ఇందలికథ సంస్కృతంలో ఉన్నంత లేక మిక్కిలి సంగ్రహపరచబడింది. పలుచోట్ల శైలి నారికేళపాకం అని చెప్పవచ్చును. అందుచేత ఈ గ్రంథం భారతమువలె సర్వత్ర వ్యాపింపకున్నది. యితడు 10 ఆశ్వాసములు ఈ గ్రంథమున రచించినను పుస్తకమును మాత్రము ముగింపలేదు. రామనిర్యాణకథను చెప్పుటకు భీతిల్లి దానిని వదిలిపెట్టినయెడల తిక్కన భారతమునందు స్త్రీపర్వకథయు కృష్ణనిర్యాణ మును చెప్పుటకేల భయపడలేదని ఒకరు ప్రశ్న వేయుచున్నారు. ప్రతీమరణకథకును భయపడి దానిని విడుచుచూ వచ్చినచో భారతమును రచింపకయే యుండవలెను. తిక్కన భారతమును మనుమసిద్దికి ఇచ్చినచో నరాంకితం అవుతుందని మనుమసిద్దికి ఇవ్వక శ్రీ భద్రాద్రిరామునికి అంకితం

తన కాలం నాటి సంఘములోని మతవైషమ్యాలను గమనించి శైవ వైష్ణవ మత కలహాలకు అతీతంగా హరిహరాద్వైతాన్ని సృష్టింఛాడు. సంఘసస్కర్తగా నిలిచాడు. తన భారత రచనను హరిహరనాధునకు అంకితమిచ్చారు. శివకేశవుల అభేదమును తెల్పు హరిహరనాధుని స్తుతితో తిక్కన భారతాన్ని ప్రారంభించాడు:

శ్రీయన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భ
ద్రాయితమూర్తియై హరిహరంబగు రూపము దాల్చి 'విష్ణు రూ
పాయ నమశ్శివాయ' యని పల్కెడు భక్తజనంబు వైదిక
ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము గొల్చెద నిష్టసిద్ధికిన్

మనుమసిధ్ది దాయాదుల వలన రాజ్యం కోల్పోయినాడు. తిక్కన, అప్పుడు ఓరుగల్లును పాలించిన కాకతి గణపతి దేవ చక్రవర్తిని దర్శించి మనుమసిధ్దికి కలిగిన కష్టాన్ని వివరించి ఆయన సాయముతో మనుమసిధ్దిని సింహాసనముపై పునఃప్రతిష్ఠ గావించాడు.

మారన, కేతన, గురునాధుడు

మహాకవి తిక్కన 12వ శతాబ్దంలో ఉపయోగించిన రుద్రాక్షమాల బయటపడింది. నెల్లూరులో నివసిస్తున్న ఆయన వంశస్థురాలు లక్ష్మీప్రసన్నకు ఆ మాల వంశపారంపర్యంగా సంక్రమించింది. నెల్లూరులోని పెన్నానది ఒడ్డున తిక్కన పార్కులో రుద్రాక్షమాల, పగడాన్ని 
.
మహాభారతములో నన్నయ్య రచించిన పర్వాలు కాకుండా మిగిలిన 15 పర్వాలను తిక్కన రచించాడు. ఆదికవి నన్నయ ఆది పర్వము, సభాపర్వము, అరణ్యపర్వములో కొంతభాగము రచించి గతించెను. అరణ్యపర్వములో మిగిలిన భాగమును ఎఱ్ఱన రచించాడు. అరణ్యపర్వము వరకును నన్నయ వ్రాసి మరణించగా, తరువాత ఈ మహాకవి, తిక్కన అరణ్యపర్వశేషమును మాత్రము విడిచిపెట్టి, విరాటపర్వము మొదలుకొని 15 పర్వములను వ్రాసాడు.అరణ్యపర్వమును ఆంధ్రీకరించుటచేతనే నన్నయ మృతిచెందాడని, అందుకే నేనుకూడా మృతిచెందుతాననే భయంతో అరణ్యపర్వమును తిక్కన విడిచిపెట్టినాడు అని కొందరు అంటారు. గ్రంథరచనకు పూర్వము మనుమసిద్ది తిక్కనచే యజ్ఞము చేయించి భారతమును సంపూర్ణముగా తిక్కనచే రచింపజేసినట్లు చెప్పుదురు. కాని ఈ మనుమసిద్దిరాజు తనని రాజరాజ నరేంద్రుని ఆస్థానమునకి పొమ్మనగా తిక్కన పోనని మారాం చేయడంతో, ఈ విషయాన్ని ఎరిగిన రాజరాజనరేంద్రుడు తిక్కనకి నీవు ఎక్కడనుండైనా రచనచేయవచ్చని సమాచారం పంపగా, అప్పుడు తిక్కనచే మనుమసిద్ది నెల్లూరులో యజ్ఞము చేయించెను. అయిననూ తిక్కన మనుమసిద్ధిపై కోపంతో, భారతముని మనుమసిద్దికి అంకితం ఇవ్వక, హరిహరనాథునికి అంకితం చేసెను అని కొందరి వాదన.

తిక్కన మొదట రచించిన పర్వములను చూసి వానియందు విశేషవృత్తములు లేకపోగా పండితులు, అతడు సామాన్య వృత్తములుతో కాలము గడుపుతున్నాడే కాని అపూర్వవృత్తరచనా కుశలుడు కాడని ఆక్షేపించిన మీదట తిక్కన స్త్రీ పర్వమునందు బహువిధ వృత్తములను రచించాడని చెప్పుదురు. తిక్కన రచించిన 15 పర్వములలో 45 ఆశ్వాసముల కంటే ఎక్కువ గ్రంథము లేదు. ఒక్కొక్క ఆశ్వాసమునకు 445 పద్యములు చొప్పున లెక్క చూసిననూ, భారతంలో తిక్కన 25000 పద్యముల కంటే అధికముండవు. దినమునకు 10 పద్యములు చొప్పున రచించినచో ఇంత మహాభారత గ్రంథము 5 లేదా 6 సంవత్సరములలో రచించవచ్చును. కాబట్టి ఇట్టి గ్రంథము ఒకరివల్ల రచించడం అసాధ్యము కాదు. సాధ్యమయ్యే అవకాశం ఉంది. కాని తిక్కన శైలితో సమానముగా వ్రాయుట మాత్రము ఎవ్వరికి సాధ్యముకాదు. తెలుగుభాష యందు ఎన్నిగ్రంథములు ఉన్నానూ, తిక్కన కవిత్వముతో సమానముగా కాని దానిని మించియున్నట్లుగాని కవిత్వము చెప్పగలిగిన వారు నేటివరకు ఒక్కరును కనబడలేదు. తిక్కన కవిత్వము ద్రాక్షాపాకము మిక్కిలి రసవంతముగా ఉండును. ఇతని కవిత్వమునందు పాదపూరణము కొరకు వాడిన వ్యర్థపదములు అంతగా కనిపించవు. ఈయన కవిత్వము లోలోక్తులతో కూడి జాతీయముగా ఉండును. ఇతని కవిత్వములో ఒకవంతు సంస్కృతము, రెండువంతుల తెలుగుపదములు కనిపిస్తాయి. నన్నయవలె తన గ్రంథమును మూలమునకు సరిగా వ్రాయలేదు. విరాటపర్వమునందు కథ కొంత పెంచెను. తక్కిన పర్వములందు మిక్కిలిగా కథను సంగ్రహపరిచెను. ఉద్యోగపర్వములోని సనత్కుమార ఉపదేశమును మూలమున పదిపండ్రిపత్రములున్నా, తెలుగున 2లేదా 3పద్యములతో సరిపెట్టెను. భగవద్గీతలు, ఉత్తరగీతలు మొదలైనవానిని వ్రాయనేలేదు.

భగవద్గీతలోని కొన్నిశ్లోకములకు దగ్గరగా కొన్ని పద్యములను వ్రాసాడు. ఉదాహరణకు ఈ క్రింది శ్లోకమును చూడుము.

అని తిక్కన ఆంధ్రీకరించాడు.భాగవద్గీతను అనువదించకపోవడానికి కారణం ఏమిటంటే యుద్ధమునందు శత్రువులు ఉన్నప్పుడు 18అధ్యాయములను కృష్ణుడు అర్జునకు చెప్పడం అసాధ్యము అగును.కావున రాయలేదు అని చెప్పవచ్చును.

ఈయన సంస్కృతమును తెనిగించినరీతిని తెలుపుటకై మూలగ్రంథములోని కొన్ని శ్లోకములను వాని అర్థమును తెలుపు పద్యములును కొన్నింటిని వివరించడం చూడవచ్చును.

విరాటపర్వం శ్లోకము  ఆలో కయసి కిం వృక్షం సూద దారుక్రుతేనవై !

 యది తే దారుభిః కృత్యం బహిర్వ్రుక్షాన్ని గృహ్యతామ్ !!

అనువాద పద్యము వలలుం డేక్కడన్ జూచె ?నొండెడ నపెవ్యక్ష్మాజముల్ పుట్టవే?
 ఫలితంబై వరశాఖ లోప్పన్ గ ననల్పప్రీతి సంధించుచున్

 విలసచ్చాయ నుపాశ్రిత ప్రతతికి న్విశ్రాంతిన్ గావింపన్ గాన్

 గల యీ భుజము వంట కట్టయలకై ఖండింపన్ గా నేటికిన్ ?  

దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాపస్ఫురత్
గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్ మత్పతుల్
గీర్వాణాకృతు లేవు రిప్డు నిను దోర్లీలన్ వెసంగిట్టి గం
ధర్వుల్ మానము బ్రాణమున్ గొనుట తధ్యంబెమ్మెయిన్ గీచకా 

సింగంబాకటితో గుహాంతరమునన్ జేర్పాటుమై యుండి మా
తంగ స్ఫూర్జిత యూధ దర్శన సముద్యత్క్రోధమై వచ్చు నో
జం గాంతార నివాస ఖిన్న మతి యస్మత్ సేనపై వీడె వ
చ్చెం గుంతీ సుత మధ్యముండు సమర స్థేమాభిరామాకృతిన్ 

ఈ కవి ఇంకా కవివాక్భంధనం అనే లక్షణగ్రంథముని కృష్ణశతకముని, విజయసేననము అనువాటిని రచించాడని భావన.

తిక్కన మనుమసిద్ది రాజ్యము అంతరించిన తరువాత కూడా చిరకాలము జీవించి, సర్వజనులచే గౌరవిమ్పబడేవాడైనా, మరణకాలమునకు విశేషవృత్తవంతుడిగా కనబడడు .అందుచే అతని కుమారుడు కొమ్మన పాటూరి కరినణమును సంపాదించవలసి వాడయ్యేన

తిక్కన (1205 - 1288) మహాభారతములో నన్నయ్య రచించిన పర్వాలు కాకుండా మిగిలిన 15 పర్వాలను రచించాడు. ఆది కవి నన్నయ ఆది పర్వము, సభాపర్వము, అరణ్యపర్వములో కొంతభాగము రచించి గతించిరి. అరణ్యపర్వములో మిగిలిన భాగమును ఎఱ్ఱన రచించాడు. తిక్కన అరణ్యపర్వమును వదలి, మిగిలిన పర్వములు రచించిరి. ముందుగా యజ్ఞము చేసి, సోమయాజియై, పిదప ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాడు. ఈయనకు కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు అనే బిరుదులు ఉన్నాయి.

క్రీస్తు శకం 1253 సంవత్సరంలో తిక్కన కోవూరు మండల పరిధిలోని పాటూరు గ్రామ సిద్దేశ్వరాలయంలో యజ్ఞం చేసినట్లు చరిత్ర చెబుతోంది. ఆశయసిద్ధి కోసం ఈశ్వరాలయంలో యజ్ఞం చేసినందువల్ల ఆ ఆలయాన్ని సిద్ధేశ్వరాలయంగా పిలిచారు. యజ్ఞం పూర్తి చేసిన తరువాత తిక్కన సోమయాజిగా మారి మహాభారత రచనకు ఉపక్రమించారు. అప్పటి యజ్ఞానికి సంబంధించిన అనేక అవశేషాలు నేడు శిథిలావస్థకు చేరుకొన్నాయి.
తిక్కన తిరుగాడిన జాడలేవీ?'వింటే భారతం వినాలి .... తింటే గారెలు తినాలి' అనే నానుడికి జీవం పోసింది తిక్కన. మహాభారత కథనాలకు అంతటి ఖ్యాతిని ఆర్జించిన కవిబ్రహ్మ తిక్కన మెచ్చిన ప్రదేశం, ఆయన పూజించిన ఆలయం నేడు దయనీయ స్థితికి చేరుకొన్నాయి.

మానవుడు పంజరంలోని చిలుకలాంటి వాడు' అనే ఉపమానం, నానుడి తిక్కన చాలా పర్యాయాలు ఉపయోగించారు. నిర్వచనోత్తర రామా యణంలో మొదటి మనుమసిద్ధిని వర్ణిస్తూ కీర్తి జాలము త్రిలోకీ శారీకకు అభిరామరాజిత పంజరంబుగజేసి అని చెప్పారు. అలాంటి తిక్కనే పూజించి, యజ్ఞం చేసిన సిద్దేశ్వరాలయం, రాతివిగ్రహాలు నేడు నిర్లక్ష్యమనే పంజరంలో చిక్కుకొని శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆయన పూజలు చేసిన నందీశ్వరుడ్ని అపహరించారు. మహాభారతాన్ని రసరమ్యంగా వర్ణించేందుకు తిక్కనకు సహకరించింది కోవూరు ప్రాంతమే.

తిక్కన పూర్వీకులు 'కొట్టురువు' ఇంటి పేరుతో పాటూరు గ్రామాధిపతులుగా పనిచేసినట్లు చరిత్ర చెబుతోంది. మనుమసిద్ధి కాలంలో తిక్కన ఇంటిపేరు 'పాటూరుగా' మారినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. యజ్ఞయాగాదులు అంటే తిక్కనకు చాలా ఇష్టం. పదకొండు పర్యాయాలు ఆయన పాటూరులోని సిద్ధేశ్వరాలయంలో యజ్ఞం చేసినట్లుగా కేతన తన దశకుమార చరిత్రలో పేర్కొన్నారు.
వేప, రావి చెట్లు మొలచి ఆలయం ధ్వంసమవుతోంది. ఆలయ ప్రాంగణాన ఉన్న బావిలో తిక్కన నిత్యం స్నానమాచరించి, సంధ్యావందనం చేసినట్లుగా తెలుస్తోంది. ఆ బావి వర అంతర్భాగంలో చెక్కిన చంద్రుడు, వినాయకుని శిల్పాలు సుందరంగా ఉండేవట కానీ, బావి పూర్తిగా ముళ్లపొదలతో నిండిపోవడం చేత ఆ శిల్పాల్ని ఇప్పుడు చూడలేము. మహాభారత రచనకు తిక్కన ఉపయోగించినట్లుగా చెప్పే 'ఘంటం' పాటూరుకు చెందిన తిక్కన వారసుల వద్ద ఉందని చెబుతారు. 'ఘంటం' ఉంచే ఒరకు ఒక వైపు సరస్వతీ దేవి, వినాయకుని ప్రతిమల్ని చెక్కారని, తాము చాలా సంవత్సరాల క్రిందట దానిని చూశామని పాటూరు గ్రామ వయోవృద్ధులు చెప్పారు.

నెల్లూరుకు చెందిన సాహిత్య సంస్థ 'వర్ధమానసమాజం' కొన్నేళ్ల కిందట నిర్వహించిన 'తిక్కనతిరునాళ్ళ'లో దానిని ప్రదర్శించారు. ఆ తరువాత ఒర చిరునామా లేకుండా పోయింది.
తిక్కన రూపాన్ని దశకుమార చరిత్రలో కేతన వర్ణించారు. ఆయన వర్ణన ఆధారంగా 1924 సంవత్సరంలో గుర్రం మల్లయ్య అనే చిత్రకారుడు ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో తిక్కన రూపాన్ని చిత్రీకరించారు. ఆ చిత్రపటమే నేడు నెల్లూరు పురమందిరంలోని వర్ధమాన సమాజంలో పూజలందుకుంటోంది. 1986 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆలయ పునర్నిర్మాణానికి రెండు లక్షల రూపాయల్ని మంజూరు చేసింది. అయితే - సిద్ధేశ్వరాలయం, తిక్కన పూజించిన శిలలు అన్నీ తమ సొంతమని, ప్రభుత్వానికీ దేవాదాయశాఖకూ సంబంధం లేదని పాటూరు వంశస్థుడు ఒకాయన ఆలయ పునర్నిర్మాణాన్ని అడ్డుకొన్నారట. పదేళ్ల కిం దట మాత్రం ఒక భక్తుడు శిథిల ఆలయానికి వెల్ల వేయించి తన భక్తిని చాటుకొన్నారని చెబుతారు.

పాటూరు గ్రామంలో తిక్కన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఇప్పటికీ లేకపోవడం విచారకరమని గ్రామస్థులు అన్నారు. తిక్కన గురించి రాసిన వ్యాసాలు, గ్రంథాలతో ఒక గ్రం«థాలయం ఏర్పాటు చేయాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. హైదరాబాదులోని టాంకుబండ్‌పై తిక్కన విగ్రహాన్ని ప్రతిష్ఠించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయన నివసించిన పాటూరు గ్రామాన్ని మరచిపోవడం బాధాకరం. ఆయన పూజించి, యజ్ఞం చేసిన సిద్ధేశ్వరాలయాన్ని ప్రభుత్వం దర్శనీయ స్థలాల జాబితాలో చేర్చాలని జిల్లా వాసులు, సాహిత్యాభిలాషులు కోరుతున్నారు. బ్రిటిషువారు నిర్మించిన కట్టడాల్ని సైతం చారిత్రక కట్టడాలుగా ప్రాధాన్యత కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం తిక్కన తిరుగాడిన నేల స్మృతులు ... శిల్పాల్ని, ఘంటాన్ని, ఒరను, నందీశ్వరుడ్ని పదిలపరచకపోవడం విచారకరం. తెలుగు జాతి గుండెల్లో తీయ తేనియ నుడుల్ని ఆచంద్రార్కం నిల్పిన తిక్కన జ్ఞాపకార్థం ఈ పని చేయాల్సిన అవసరం ఉంది.

 
మూలాలు:




#Article 24: ఎఱ్రాప్రగడ (1414 words)


ఎఱ్ఱాప్రగడ మహాభారతములో నన్నయ్య అసంపూర్ణముగా వదిలిన పర్వాన్ని పూర్తి చేసాడు. నన్నయ్య భారతాన్ని చదివి ఇతని భారతంలోని భాగం చదివితే ఇది నన్నయ్యే వ్రాసినాడా అనిపిస్తుంది, అలాగే తిక్కన్న భారతము చదివి ఎఱ్ఱాప్రగడ వ్రాసిన భారత భాగము చదివితే ఎఱ్ఱాప్రగడ భాగము కూడా తిక్కన్నే వ్రాసినాడా అనిపిస్తుంది.

సంస్కృతంలో రాసిన మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం 11 నుంచి 14 శతాబ్దాల మధ్య జరిగింది. ఎఱ్ఱాప్రగడ 14వ శతాబ్దములో రెడ్డి వంశమును స్థాపించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానములో ఆస్థాన కవిగా ఉండేవాడు. ఎర్రయ్యను ఎల్లాప్రగడ, ఎర్రన అనే పేర్లతో కూడా వ్యవహరిస్తారు. ఈయనకు ప్రబంధ పరమేశ్వరుడు అని బిరుదు ఉంది.

ఎర్రన తన నృసింహపురాణంలో చేసిన వంశవర్ణననుబట్టి అతని వివరాలు తెలుస్తున్నాయి. ఎఱ్ఱాప్రగడ పాకనాడు సీమ (ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని కందుకూరు సమీపంలోని గుడ్లూరు గ్రామములో జన్మించాడు. ఈయన ప్రస్తుత గుంటూరు జిల్లా వేమూరు మండలములోని చదలవాడ గ్రామములో నివసించాడు. వీరు శ్రీవత్స గోత్రము అపస్తంబు శాఖకు చెందిన బాహ్మణుడు. అతని తండ్రి సూరన, తల్లి పొత్తమ్మ (పోతమాంబ). ఎఱ్రన్నకు అతని తాత గారి నామధేయమయిన ఎఱపోతన నామకరణం చేశారు అతని తల్లిదండ్రులు. ఎఱ్ఱాప్రగడ మామ్మ పేరు పేర్రమ్మ (పేరమాంబ, ప్రేంకమాంబ). ఎఱ్ఱాప్రగడ ముత్తాత బొల్లన (ఆతని భార్య పోలమ్మ లేదా ప్రోలమాంబ). ఎఱ్ఱాప్రగడ కుటుంబ ఆరాధ్య దైవం శివుడు. గురువు గారి పేరు శ్రీశంకర స్వామి. ఎఱ్రన్న కుటుంబ ఆరాధ్య దైవం శివుడైనా విష్ణువుని కూడా పూజించేవాడు.

ఎర్రన బహుశా క్రీ.శ. 1280లో జన్మించి, 1364వరకు జీవించి ఉంటాడని సాహితీచరిత్రకారులు అంచనా వేస్తున్నారు. (కాకతీయ సామ్రాజ్యం 1323లో పతనమయ్యింది. అప్పుడు, అనగా 1324-25 కాలంలో, కాకతీయ సేనానులలో ఒకడైన ప్రోలయవేమారెడ్డి కందుకూరు మొదలు గోదావరీతీరంవరకు తన రాజ్యాన్ని అద్దంకి రాజధానిగా స్థాపించాడు). ఆ సమయంలోనే ఎర్రన 45ఏండ్ల వయసుగల ప్రౌఢకవి ప్రోలయవేమారెడ్డి ఆస్థానకవి అయ్యాడు. ఆ రాజు ఆస్థానంలోనే తన సాహితీజీవితాన్ని కొనసాగించాడు.

ఎర్రనకు రెండు బిరుదులున్నాయి (1) శంభుదాసుడు (2) ప్రబంధ పరమేశ్వరుడు. మొదటి బిరుదు అతని ఆధ్యాత్మిక ప్రవృత్తినీ, రెండవ బిరుదు అతని సాహిత్య విశిష్టతనూ తెలుపుతాయి.

'శంభుదాసుడు'గా తాను ప్రశస్తుడవుతాడని తన తాతగారు కలలో కనిపించి ఆశీర్వదించారని నృసింహపురాణం పీఠికలో ఎర్రన వ్రాసుకొన్నాడు. అతని బిరుదు శంభుదాసుడు అయినప్పటికీ అతడు గ్రహించినవన్నీ విష్ణుకథలే. ఈ విధంగా ఎర్రన హరిహరాద్వైతమును జీవితంలోనూ, రచనలలోనూ కూడా పాటించాడని తెలుస్తుంది.

'ప్రబంధ పరమేశ్వరుడు' అనే ప్రశస్తి అరణ్య పర్వశేష రచన వలన కలిగి, తరువాత అది బిరుదంగా కొనసాగిందని నృసింహపురాణంలోని ఒక పద్యం ద్వారా తెలుస్తున్నది. ఎర్రన పురాణకవుల కోవకు చెందినవాడయనా గాని, అద్భుతమైన తన వర్ణనాత్మకత ద్వారా తరువాతి ప్రబంధ కవులకు మార్గదర్శకమైనాడు. అతని ప్రబంధశైలి నృసింహపురాణంలో ఉన్నత స్థాయిని చేరుకుంది.

ప్రోలయవేమారెడ్డి ఆస్థానంలో చేరడానికి ముందు ఎర్రన చేసిన రచనలగురించి ఏ విధమైన వివరాలూ లేవు. అప్పటికే ఎర్రన మాన్యుడైన కవి గనుక కొన్ని రచనలు చేసిఉండవచ్చును కాని వాటిని ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. ఎర్రన రచనలన్నీ వేమారెడ్డి ఆస్థానంలో ఉండగానే సాగాయి.

ప్రోలయ వేముని కోరికపై ఎర్రన ముందుగా రామాయణాన్ని రచించాడు. కాని అది ఇప్పుడు దొరకడంలేదు. ఎర్రన వంశంవాడైన చదలవాడ మల్లన, ఎర్రన రచనల గురించి వ్రాస్తూ వల్మీకభవు వచోవైఖరి రామాయణంబు నాంధ్ర ప్రబంధంబు జేసె అని చెప్పాడు. అనగా ఇది వాల్మీకి రామయణానికి ఆంధ్రీకరణమేననీ, అదీ ఒక ఉద్గ్రంధమైన ప్రబంధమనీ తెలుస్తుంది. అయితే హుళక్కి భాస్కరాదులు వ్రాసి, సాహిణి సూరనకంకితమిచ్చిన భాస్కర రామాయణములోని కొన్ని ఘట్టాలు పాఠాంతరాలుగా చాలాపద్యాలు కనిపిస్తున్నాయి.ఈ పద్యాలు ఎర్రాప్రగడవే కావచ్చునని పండితుల ఊహ. అలాంటి 46 పద్యాలను ఎంతో శ్రమతో సేకరించి వేటూరి ప్రభాకరశాస్త్రి భారతి పత్రికలో ఎర్రాప్రగడ రామాయణం అనే శీర్షికతో ప్రకటించాడు. yes

ఇది కూడా ప్రోలయవేముని కోరికపై రచించి ఎర్రన ఆ రాజుకే అంకితమిచ్చాడు. ఈ రచన 1335 - 1343 మధ్యకాలంలో జరిగి ఉండవచ్చును (అమరేశ్వరాలయ శాసనం, ముట్లూరి శాసనం ఆధారంగా). ఇది ఖిలపురాణము. సంస్కృతంలో హరివంశం హరివంశ, విష్ణు, భవిష్య పర్ాలుగా విభజింపబడిఉన్నది. ఎర్రాప్రగడ మాత్రం దాన్ని పూర్వోత్తర భాగాలుగా విభజించాడు. ఈ హరివంశం ఆరంభంలో ఎర్రన తన గురువునూ, నన్నయనూ, తిక్కననూ ప్రశంసించాడు. ఈ రచనలో మూలకథ ప్రాశస్త్యం చెడకుండా దాన్ని సంగ్రహించి, అందులోని కథలను ఔచిత్యశుద్ధంగా, క్రమబద్ధంగా వ్రాయడంలో ఎర్రన ఎంతో నేర్పును కనబరచాడు.

(హరివంశాన్ని ఎర్రన సమకాలికుడైన నాచన సోమన కూడా

ఎఱ్ఱాప్రగడ కవిత్రయంలో మూడవ కవి, కాని ఆయన అనువదించినది మధ్య భాగము. నన్నయ మహాభారత అనువాదం అరణ్య పర్వం మధ్యలో ఆగిపోయింది. ఈ శేషభాగాన్ని మహాకవి తిక్కన ఏ కారణం చేతనో అనువదించలేదు. అలా మిగిలిపోయిన అరణ్య పర్వాన్ని తెలుగు లోకి ఎఱ్ఱన అనువదించాడు. అరణ్యపర్వములోని మొదటి మూడు ఆశ్వాసాలనూ, నాలుగవ ఆశ్వాసంలో 142 పద్యాలనూ నన్నయ వ్రాశాడు. తరువాత బహుశా నన్నయ మరణం కారణంగా ఆ కార్యం అక్కడితో ఆగిపోయింది. 143వ పద్యంనుండి ఎఱ్ఱన వ్రాశాడు. ఈ రచన బహుశా ప్రోలయ వేమునికాలంలోనే, హరివంశం రచన తరువాత, జరిగినట్లు అనిపిస్తుంది. ఈ విధంగా అరణ్యపర్వ శేషాన్ని కూడా ఆంధ్రీకరించడంతో తెలుగులో మహాభారత సమగ్రతను సాధించిన గౌరవం ఎర్రనకు దక్కింది. ఎర్రనకున్న సౌజన్యమూ, వినయమూ కారణంగా ఈ అరణ్యపర్వశేషాన్ని నన్నయ రచనతో కలిపే వ్రాసి, దానిని రాజరాజనరేంద్రునికే అంకితమిచ్చాడు. ప్రయత్నించి తత్కవితా రీతియు గొంత దోప దద్రచనయకా నారణ్యపర్వశేషం పూరించినట్లు చెప్పుకొన్నాడు.నన్నయభట్ట మహాకవీంద్రు సరస సారస్వతాంశ ప్రశస్తి తన్ను జెందుటయే అందుకు కారణమని కూడా ఎర్రన చెప్పుకొన్నాడు.

అరణ్యపర్వశేషం ఎర్రన వ్రాయలేదనీ, నన్నయ పూర్తిగా వ్రాసినదానిలో కొంతభాగం పాడు కాగా దానిని ఎర్రన పూరించాడనీ ఒక వాదం ఉన్నది (ఉత్సన్నవాదము - శతఘంటం వేంకటరంగశాస్త్రి). అలా కాదు నన్నయ వ్రాసినదానిలో కొన్ని పద్యాలు చెదలు తినడంవల్ల లోపించాయనీ, వాటిని ఎర్రన పూరించాడనీ మరొక వాదం ఉన్నది (శిథిల పూరణ వాదము - నడికుదుటి వీరరాజు). కాని ఈ రెండు వాదనలూ నిర్హేతుకమైనవనీ, ఎర్రన నిస్సందేహంగా అరణ్యపర్వాన్ని పూరించాడనీ పండితులు అభిప్రాయానికి వచ్చారు. పైగా శైలి, భాషషావిషయకమైన ఆధారాలద్వారా కూడా ఎర్రన స్వతంత్రరచనను కవులు నిర్ణయించారు. మూలరచనను గౌరవిస్తూనే ఎర్రన స్వతంత్ర రచనను సాగించాడు. అతని రచనలలో నన్నయ కథనా గమనాన్ని, తిక్కన నాటకీయతను,, ఎర్రన వర్ణనాత్మకతను గమనింపవచ్చును.

నృసింహ పురాణము (లక్ష్మీనృసింహావతార కథ) అనేది ఎఱ్ఱన స్వతంత్ర రచన. దీనిని ఎర్రన తన ఇష్టదైవమైన అహోబిలం నరసింహావతారము అంకితమిచ్చాడు. ఇది పేరుకే పురాణం గాని ప్రబంధలక్షణాలున్న కావ్యం. ఐతిహ్యం ప్రకారం ఒకరోజు ఎర్రన ధ్యానంలో మునిగి ఉండగా అతని తాత కనబడి ఈ రచనను చేయమని సలహా ఇచ్చాడు. ఇది బ్రహ్మాండపురాణంలోని కథ, విష్ణు పురాణం ఆధారంగా వ్రాయబడింది. బ్రహ్మాండాది పురాణోక్తంబయిన శ్రీనృసింహావతారంబను పురాణంబు తెనుగు భాష బ్రకటింపవలయు అన్నాడు. కాని అధికభాగం వర్ణనాదులు ఎర్రన స్వతంత్ర రచనలు. ఇందులో తెనుగు నుడికారపు సొగసులు, పద్యాలకూర్పు ఎంతో హృద్యంగా ఉంటాయి.

తెలుగు సాహిత్యంలో 1320 నుండి 1400 వరకు ఎఱ్ఱన యుగము అంటారు. ఈ యగంలో ప్రబంధ రచనా విధానానికి పునాదులు పడ్డాయి. మహాభారతంలో అరణ్యపర్వశేషం తెలుగుచేయబడింది. నన్నయ తిక్కనాదుల కాలములో చెల్లిన గ్రాంధిక, పౌరాణిక భాష ఈ యుగంలో ఆధునికతను సంతరించుకోసాగింది.

తిక్కన మరణానికి సుమారు 10 సంవత్సరాలముందు (1280 ప్రాంతంలో) ఎఱ్ఱన జన్మించి ఉంటాడు. ఎఱ్ఱన మరణం 1360లో జరిగిఉండవచ్చును. 1365-1385 ప్రాంతంలో జన్మించిన శ్రీనాథుడు తరువాతి యుగకవిగా భావింపబడుతున్నాడు.

ఎఱ్ఱన పేరుమీద ఒక యుగం అవుసరమా? ఆ కాలాన్ని తిక్కన, శ్రీనాథ యుగాలలో కలుపకూడదా? అన్న సందేహానికి పింగళి లక్ష్మీకాంతం తెలిపిన అభిప్రాయం ఇది - తిక్కన అనంతరం, శ్రీనాథునికి ముందు ఎఱ్ఱన, నాచన సోమన, భాస్కరుడు వంటి మేటికవులవతరించారు. అంతేగాక తెలుగు సారస్వతానికి త్రిమూర్తులైన కవిత్రయం తరువాతనే ఎంతటివారైనా పేర్కొనదగినవారౌతారు. ఆ మువ్వురును ఆంధ్ర కవి ప్రపంచానికి గురుస్థానీయులు. కనుక ఆ మువ్వురిపేరు మీద మూడు యుగాలుండడం ఉచితం. అంతేగాక ఆంధ్ర వాఙ్మయంలో ఆఖ్యాన పద్ధతిని నన్నయ, నాటకీయ పద్ధతిని తిక్కన ప్రారంభించినట్లే వర్ణనాత్మక విధానానికి ఎఱ్ఱన ఆద్యుడు. నన్నయ యొక్క శబ్దగతిని, తిక్కన యొక్క భావగతిని అనుసంధించి క్రొత్త శైలిని కూర్చిన మహానుభావుడు ఎఱ్ఱన. తెలుగుభాష పలుకుబడి, వాక్యనిర్మాణము ఈ కాలంలో ఆధునికతను సంతరించుకొన్నాయి. శ్రీనాథునివంటి అనంతరీకులు ముందుగా ఈ శైలినే అలవరచుకొని రచనలు సాగించారు. కనుక ఎఱ్ఱనను యుగకర్తగా సంభావించుట ఉచితం.

సాహిత్య అకాడమీ ముద్రించిన అరణ్య పర్వము ముగింపులో ఆ భాగం సంపాదకులు డా. పాటిబండ్ల మాధవశర్మ ఇలా వ్రాశాడు -

తెలుగు వైతాళికులు ప్రచురణాక్రమంలో ఎర్రాప్రగడ పుస్తకాన్ని రచించిన ఆచార్య వి. రామచంద్ర తన రచన ముగింపులో ఇలా వ్రాశాడు.

హరివంశం ఉపోద్ఘాతంలో ఎర్రన చెప్పిన పద్యం

నన్నయభట్ట తిక్క కవినాథులు చూపిన త్రోవ పావనం
బెన్నఁ బరాశరాత్మజ మునీంద్రుని వాఙ్మయ మాదిదేవుఁడౌ
వెన్నుని వృత్త మీవు కడు వేడుకతో విను నాయకుండ వి
ట్లెన్నియొ సంఘటించె మదభీప్సిత సిద్ధికి రాజపుంగవా! 

ఎర్రనరామాయణంలోనిదని నేలటూరు వేంకటరమణయ్య భావించిన పద్యం. హనుమంతుడు సాగరాన్ని దాటిన విధం.

చువ్వన మేను వంచి రవి సోకఁగ దోఁక విదల్చి పాదముల్
వివ్వఁగ బట్టి బాహువులు వీచి మొగంబు బిగించి కొండ జౌ
జవ్వన నూగి ముందఱికి జాగి పిఱిందికిఁదూగి వార్ధిపై
ఱివ్వన దాటె వాయుజుడు ఱెక్కలతోడి సురాద్రియోయనన్

మహాభారతం అరణ్యపర్వములో నన్నయ రచించిన చివరి పద్యము - శరత్కాలపు రాత్రులను వర్ణించునది.

శారదరాత్రులుజ్వల లసత్తర తారక హార పంక్తులన్
జారుతరంబులయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురో
దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క
ర్పూర పరాగ పాండు రుచిపూరము లంబరి పూరితంబులై

అదే వర్ణనను ఎర్రన కొనసాగిస్తూ సూర్యోదయాన్ని వర్ణించాడు. ఇది ఎర్రన భారతాంధ్రీకరణలో మొదటి పద్యం

స్ఫురదరుణాంశురాగరుచిఁ బొంపిరివోయి నిరస్తనీరదా
వరణములై దళత్కమల వైభవ జృంభణ ముల్లసిల్ల, మ
ద్దురతర హంస సారస మధువ్రత నిస్వనముల్ సెలంగఁగాఁ
గరము వెలింగె వాసర ముఖంబులు శారదవేళఁ జూడగన్

అరణ్యపర్వములోని మరొక పద్యము. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అన్న మాటలు.

ద్యూత వ్యాజమునన్ సభాంగణములో దుర్యోనుండట్లు దు
ర్నీతిం గూరి యొనర్చినట్టి యఘముల్ నిష్కంప ధైర్యోన్నతిన్
జేతఃస్ఫారుఁడవైన నీ కొకనికిం జెల్లెన్ సహింపంగ వి
ఖ్యాత క్షాంతులు లేరె ధార్మికులు నిక్కంబిట్టిరే యెవ్వరున్

నృసింహపురాణము పీఠికలో నన్నయ తిక్కలను గురించీ, తన యభీష్టసిద్ధి గురించీ ఎర్రన ఇలా అన్నాడు.

భాసుర భారతార్థముల భంగులు నిక్క మెఱుంగ నేరమిన్
గాసట బీసటే చదివి గాథలు త్రవ్వు తెనుంగు వారికిన్
వ్యాసముని ప్రణీత పరమార్థము తెల్లఁగఁజేసినట్టి య
బ్జాసన కల్పులం దలతు నాద్యుల నన్నయ తిక్కనార్యులన్

 
విష్ణుభక్తులకు కలిగే మేలు గురించి నృసింహపురాణంలో వర్ణన

పొందవు దుఃఖముల్ భయము పొందరు పొందరు దైన్యమెమ్మెయిన్
బొందవు తీవ్రదుర్దశలు పొందుఁ బ్రియంబులు పొందు సంపదల్
పొందు సమగ్ర సౌఖ్యములు పొందు సమున్నత కీర్తులెందు గో
వింద పదారవింద పదవీ పరిణద్ధ గరిష్ట చిత్తులన్

నన్నయను గూర్చి పొగుడుతూ ఎర్రన చెప్పిన పద్యం:

ఉన్నతగోత్ర సంభవము నూర్జిత సత్త్వము భద్రజాతి సం
పన్నము నుద్ధతాన్యపరిభావిమదోత్కటము న్నరేంద్ర పూ
జోన్నయనోచితంబునయి యెప్పుడు నన్నయ భట్ట కుంజరం
బెన్న నిరంకుశోక్తి గతి నెందును గ్రాలుటఁ బ్రస్తుతించెదన్‌

బాలకృష్ణ లీలా వర్ణన (హరివంశంలో)

నోరం జేతులు రెండు గ్రుక్కుకొనుచున్‌, మోమెల్ల బాష్పాంజన
స్మేరంబై తిలకింపనేడ్చుచు, బొరిన్‌ మీజేతులం గన్నులిం
పారం దోముచు, జేవబూని పిరుదొయ్యన్‌ మీద కల్లార్చుచున్‌
శ్రీరమ్యాంఘ్రియుగంబు గింజికొనుచుం జెల్వంబు రెట్టింపగా

శ్రీ కృష్ణుని శైశవోత్సవ వర్ణన (హరివంశంలో)

పాలుపారగా బోరగిలి పాన్పు నాల్గుమూలలకును వచ్చుచు మెలగి మెలగి
లలి గపోలమ్ములు గిలిగింతలువుచ్చి నవ్వింప గలకల నవ్వినవ్వి
ముద్దులు దొలుకాడ మోకాల గేలను దడుపుచు నెందును దారితారి
నిలుచుండబెట్టి యంగుళు లూతసూపగా బ్రీతితప్పడుగులు వెట్టిపెట్టి
అన్నగంటి దండ్రినిగట్టి నయ్యగంటి
నిందురావయ్య విందుల విందవంచు
నర్ధిదను బిలువంగ నడయాడియాడి
యుల్లసిల్లె గృష్ణుడు శైశవోత్సవముల

వెన్నెవెట్టెద మాడుమాయన్న యన్న
మువ్వలును మొలగంటలు మొరయు నాడు
నచ్యుతుండు, గోపికలు దమయాత్మ బ్రమసి
పెరువు దరువను మరచి సంప్రీతిజూప

మందలు మేపుకు వచ్చిన నందగోపుని వర్ణన (హరివంశం)

పరిమిత పలితైక భాసురంబగు కేశసంచయ మారణ్య సంచరమునఁ
దరువులరాయి కేసరముల నత్యంతదూసరంబై కడు మాసరమున
గోఖురోద్ధుతరేతు కుంఠితంబగు మోము చెమటబొట్టులఁజాలఁ జెన్నుమిగులఁ
గట్టిన చెంగావికాసె వేఁజిగురులజిగినూని తను పతిస్నిగ్ధకాంతి
నలరఁ గర్కశగ్రంథిలయష్టి చేతఁ బట్టి గోపాలపరివార బహువిధోక్తు
లెలసి చెలఁగంగఁ గదువుల వలననుండి వచ్చే నందగోపుఁడు నిజా వాసమునకు

ఆలమందల బృందావన వలస (హరివంశం)

బండ్లమెట్టింపుపై బరువులెక్కింపుమీ దళ్లుసుబూన్పు, కావళ్లనునుపు
పదిలంబుగా నేటివనటులు, కొత్తగోనెల బిములు పట్టు నివరివడ్లు
నోడబెరుగపాలు నొనరంగబోసి చాపలుమంచములుమీద బలియంగప్పు
దామెనలును వల్లె త్రాళ్లును దలుగులు గవ్వము ల్గొడవలి కత్తిసూడు
గొడుపువాదోళ్లు మొదలుగా జెడకయుండ
వలయు ముట్లెల్లదెమ్ము గందలపుటెడ్ల
గంపమోపులు ముందరగదలు మనుము.

హరివంశం నుండి గద్యం - మహాఘోష వర్ణన

పుష్పిత ఫలితానేక తురుషండ మండితంబు కాళిందీ తటంబున నలుదెసలం బొడవుగా నమర్చిన బలితంపుములు వెలుంగు లంగరము. జతనంబులై యొప్పు పెనుదొడ్లం గ్రమంబునం బ్రంఓదంబున వేఁకువం బోకు మేసివచ్చి రోమంధన వదనంబుల విహిత శయనలై సుఖియించు కదుపులలోన బేరు పేరంబిలువం బంచతిల్లుచు సుల్లసిత హుంకా రంబులగు వదనంబులతో నున్ముఖలగు తల్లులకు నఖిముఖంబులై హర్ష ప్రతినినందంబులు వొదలం బొదులనుండి యొండొంటిం దాటుకొని కలయు బాలవత్సంబుల యుత్సప సంచారంబులవల్ల, పెదయావుల వెనుకందగిలి యొండొంటిం జేరనీక బలియు రంకెలం బొదివి కాల ద్రవ్వి క్రోడాడుచు బొగరుమిగుల కరకెక్కిన మెడలును, పలుద మూపురంబులును, వెడద వీపులును, దోరంబు గంగడోళ్లునునై క్రాలు వృషంభుల దర్ప వికారంబు వలనను, మొదలనోరి సురువులుం, బెయ్యల రేణంబులుం, బాలకుండల మసులునుందమ యుడళులకు నెడపడనితొడవులుగా బిదికి యురుద్రాళ్లుం, దలుగులు తలమొల లంజుట్టి యిట్టునట్టులుం గలయంబాఱి క్రేపుల నేర్పరించు వారును, పల్లియలువైచి కోడెలంబట్టిపెనంచి కారూళ్ల జట్టికారులకు వశంబు సేయు బరవసం బెసంగ గ్రుమ్మరువారును, జూడుగొడపులుసు వాదోళ్లు ముకుబంతులు మొదలుగాగల సాధనంబులు గొనివచ్చి తెవులు గొంటులం జికిత్సించువారును, గ్రేపులంగొనని యావులందొ లంగం గట్టి పిళ్లువెట్టియు, మందులు సల్లియుల్లం, జాల దు:ఖపడి చేపెరింగించు వారును................




#Article 25: ఆతుకూరి మొల్ల (608 words)


ఆతుకూరి మొల్ల (1440-1530) 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి. తెలుగులో మొల్ల రామాయణముగా ప్రసిద్ధి చెందిన  రామాయణమును రాసినది. ఈమె కుమ్మరి కుటుంబములో జన్మించింది. మొల్ల శ్రీ కృష్ణదేవరాయలు సమయము (16వ శతాబ్దము) లోనిదని ప్రశస్తి. మొల్ల శైలి చాలా సరళమైనది, రమణీయమైనది.

మొల్ల జీవించినకాలం గురించి పరిశోధకులలో భిన్నాభిప్రాయాలున్నాయి. 'సన్నుత సుజ్ఞాన సవివేకి వాల్మీకి' దగ్గరనుండి 'తిక్కకవిరాజు భోజు' వరకూ మొల్ల నుతించింది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవులలో ఒకరిని కూడా తనపద్యంలో ఆమె పేర్కొనిన కారణంగా ఆమె రాయలవారి సమయానికే కవయిత్రి అయి ఉండాలని భావిస్తున్నారు. జనసామాన్యంలో ప్రచారంలో ఉన్న కథలు మొల్ల, తెనాలిరామలింగడు సమకాలీకులని వెల్లడిస్తున్నాయి. 16వ శతాబ్దికి చెందిన ఏకామ్రనాధుడనే చరిత్రకారుడు తన ప్రతాపచరిత్రలో మొల్లను పేర్కొన్నాడు. అందులో పేర్కొన్న సాంఘిక పరిస్థితులను బట్టి మొల్ల సుమారుగా క్రీ.శ. 1581 కి ముందుగా జీవించి ఉండేదనిపిస్తున్నది. ఆమె తిక్కన సోమయాజికీ, భాస్కరునికీ, ప్రతాపరుద్రునికీ సమకాలీనురాలు కావచ్చును కూడాను. ఈమె కులావంశ సంజాత. ఇంటి పేరు ఆతుకూరివారు.వంగడమునుబట్టి కుమ్మరి మొల్ల అని విశ్వమున వ్యవహరించబడుచున్నది. ఈమె జనకుడు కేతనపెట్టి. గ్రంథావతారికలో ఆదికవి స్థుతియందు శ్రీనాధుడుని స్మరించియుండుటచే ఈమె శ్రీనాధుడు తరువాత కాలమున ఉండెడిదని తెలియుచున్నది.చరిత్ర పరిశోధకులు 1525సం. ప్రాంతమని నిర్ణయించారు. ఈమె ఆజన్మబ్రహ్మచారిణి అని చెప్పెదరు.

స్వస్థలం : కడప జిల్లా గోపవరం మండలం గోపవరం గ్రామం .ఈ గ్రామం కడప పట్టణమునకు 56 కి.మీ దూరములో ఉంది. బద్వేలుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతమునకు చెందినదని మొల్ల రామాయణములోని ఈ క్రింది పద్యము ద్వారా తెలియుచున్నది.

నెల్లూరు దగ్గర ఇంకో గోపవరం ఉన్నా గానీ అక్కడ శ్రీకంఠ మల్లేశ్వరస్వామి ఆలయం లేదు. మొల్ల తాను శ్రీ కంఠ మల్లేశ్వరుని వరం చేతనే కవిత్వం నేర్చుకున్నానని స్వయంగా చెప్పింది. శ్రీరామాలయమూ గోపవరంలోనే ఉంది. తరతరాలుగా జనం చెప్పుకునే మొల్ల బండ ఉంది. గ్రామస్థులు ఈ బండకు పూజ చేయడం ఉంది. శ్రీ కృష్ణదేవరాయలు ఈ గోపవరంలో బస చేసినట్లుగా స్థానికులు చెప్పుకొంటూ ఉంటారు. మొల్ల పూర్వీకులు ఆత్మకూరుకు చెంది ఉంటారనీ, అందుకే ఆతుకూరు ఇంటిపేరు అయిందనీ కొందరి అభిప్రాయం. కుమ్మరి కులానికి చెందిన మొల్ల ఈ ప్రాంతానికి చెందినదనడానికి గోపవరం దగ్గర కుమ్మరి కులాలవారూ ఉన్నారు. మొల్ల నివసించిన ఇల్లుగా గోపవరంలో పాడుబడిన ఇల్లు ఉంది. పెద్దన  తెనాలి రామలింగడు కూడా గోపవరం వచ్చి మహా భక్తురాలైన కవయిత్రి మొల్ల గారిని దర్శించినట్లు ఆమెపై చేసిన దూసను మన్నించవలసినదిగా ప్రాధేయపడ్డారు.

వాంగ్మయ మూలాల ఆధారముగా మొల్ల స్వంతంత్ర భావాలు కలిగి ఉండేదని, చిన్న తనములోనే తల్లిని కోల్పోగా తండ్రి కేసన శెట్టి గారు ఈమెను గారాబముగా పెంచెనని తెలుస్తున్నది. ఈమెకు తండ్రి అంటే అమిత ఇష్టము. చివరి దాకా తండ్రి యొక్క ఇంటి పేరునే ఉపయోగించడము మూలాన మొల్ల పెళ్ళి చేసుకోలేదని అనుకోవచ్చు.

మొల్ల రామాయణము ఆరు కాండములలో 138 పద్యములతో కూడుకున్నది. ఈ కావ్యమును మొల్ల కేవలము ఐదు రోజులలో రాసినదని ప్రతీతి. మొల్ల రచన ఆనాటి పద్ధతికి విరుద్ధముగా వాడుక భాషకు దగ్గరగా ఉంది.

తోయజదళాక్షి వలరాయడిటు లేచి పటుసాయకములేర్చి ఇపుడేయగ దొడంగెన్ 
తోయదపథంబున నమేయరుచి తోడ నుదురాయడును మించి వడ గాయగ గడంగెన్ 
కోయిలలు కీరములు కూయగ నళివ్రజము లేయెడల జూచినను మ్రోయుచు చెలంగెన్ 
నాయెడల కృపారసము నీయకవివేకమున నీయెడల నుండుతిది న్యాయమె లతాంగీ

జడలు దాలిచి తపసుల త్సందమునను 
తమ్ముడును తాను ఘోర దుర్గమ్ములందు 
కూరగాయలు కూడుగా కుడుత్సునట్టి 
రాముడేరీతి లంకకు రాగలండు 

తనకు శాస్త్రీయమైన కవిత్వజ్ఞానం లేదనీ, భగవద్దత్తమైన వరప్రసాదంవల్లనే కవిత్వం చెబుతున్నాననీ ఆమె అన్నది. కాని ఆమె అనేక సంస్కృత, తెలుగు పూర్వకవులను స్తుతించిన విధం చూస్తే ఆమెకు వారి రచనలతో గణనీయమైన పరిచయం ఉండిఉండాలనిపిస్తున్నది. తనకు పాండిత్యం లేదని మొల్ల వ్రాసినది సంస్కృతిలో భాగమైన అణకువ, విధేయత వంటి లక్షణాల కారణంగానే తప్ప వేరే కాదని స్త్రీ రచయిత్రుల చరిత్ర వ్రాసిన నిడదవోలు మాలతి భావించారు.

గ్రంధావతారికను బట్టి ఈమె తక్కిన కవయిత్రులవలె గురువునొద్ద విద్యనభ్యసించలేదని, గోపరపు శ్రీకంఠ మల్లేశుకృపను కవిత్వమును చెప్పనేర్చినదనియు తెలియుచున్నది. ఈమె కావ్యలక్షణాదికముల నేమియు నెరుంగక పోయినను నన్నయ తిక్కనాది కవుల గ్రంథములను మాత్రము క్షుణ్ణముగా చదివినదని ఈమె పద్యముల తీరు నడకలను బట్టి చెప్పవచ్చును.ఈమెపై పోతన కవితా ప్రభావము ఎక్కువగాగలదు. పలికెడది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుడట... అని పోతన చెప్పిన మాదిరిగనే ఈమె రామాయణమందు చెప్పమని రామచంద్రుడు, చెప్పించిన పలుకుమీద జెప్పెదనే నెల్లప్పుడు నిహపరసాధన, మిప్పుణ్యచరిత్ర, తప్పులెంచకుడు కవుల్ అని పల్కినది. సర్వగుణాకరుడు శ్రీరాముని చరితమును నెందరెన్ని విధముల రచన గావించినను నవ్యతకలిగి వీనులవిందై, యమృతపు సోనలపొందై యలరారు చుండుటతానీ గ్రంథమును చేపట్టుటకు కారణమని చెప్పినిది., అట్టి మహాత్ముని చరితమును కందువ మాటల్ నందముగా కూర్చి పఠితలకు శ్రోతలకు విందును గూర్తునని ముందంజ వేసింది.
గ్రంథావతారిక యందు చెప్పబడిన విషయముల వల ఈమె పూర్వకవుల సంప్రదాయమునే అనుసరించి కావ్యారంభమున అయోధ్యాపుర వర్ణనతో ప్రారంభమై, దశరుధుని పుత్రకామేష్ఠి, శ్రీరామచంద్రుని జననమాదిగా రావణవధానంతరము ముగియుచున్నది.ఉత్తరరామాయణముని స్పృశించలేదు.

సాధారణంగా కవులు వర్ణనాదులయందు జటిలమై, సుదీర్ఘమైన సమాసము ల నొడగూర్చితమ పాండిత్యప్రకర్షను చూపింతురు.శాబ్దాడంబరమునకు ప్రాధాన్యమిచ్చి ప్రబంధయుగమున పుట్టిన మొల్ల శబ్దాడంబరమునకు లోనుగాక యలతి యలతి పదములతోనే రచన సాగించి పేరొనొందినది. చిన్ని చిన్ని గీతములలో పెద్ద భావముల నిముడ్చుట ఈమె సహజ గుణము. జడలు ధరియించి తపసుల చందమునను, దమ్ముడును దాను ఘోరదురమ్ములందు కూరగాయలు కూడుగాగుడుచునట్టి, రాముడేరీతి లంకకు రాగలడు. పదబంధముల యందు ఈమెకు చక్కని నేర్పు ఉంది.

తిక్కన వలె ఈమె పాత్రలను కండ్లకు కట్టునటుల చింత్రించ గలదు. హనుమంతుడు సముద్రమున దాటునపుడు ఈమె ఆప్రాంతమును చూచినది గాబోలు అనిపించును, ఆసముద్రోల్లంఘన మెంత సత్యసముపేతముగా వర్ణించెనో చూడండి:

 మొగము బిగించి, పాదముల మొత్తముగానట నూదిత్రొక్కి,నీ
 టుగ మొగమెత్తి భీకర కఠోర రవంబున వార్చి బాహు ల
 త్యగణితలీలమాచి, వలయంబుగ వాలముద్రిప్పి వ్రేగునన్
 నగము సగంబు క్రుంగ గపినాధుడు నింగి దాటే రివ్వునన్!!!




#Article 26: శ్రీనాథుడు (659 words)


శ్రీనాథుడు (1365–1441) 15 వ శతాబ్దికి చెందిన తెలుగు కవి. దివ్యప్రబంధన శైలికి ఆదరణ కల్పించాడు.

చిన్నారి పొన్నారి చిఱుత కూఁకటినాఁడు రచియించితి మరుత్తరాట్చరిత్ర - బాల్యములోనే బృహత్కావ్యాన్ని రచించిన ప్రౌఢ కవి శ్రీనాథుడు. వీరి రచనలలో వీరి వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. పాండిత్య గరిమతో అచంచల ఆత్మవిశ్వాసం మూర్తిభవించిన నిండైన విగ్రహం వారి రచనలు చదువుతూ ఉంటే గోచరిస్తుంది.

శ్రీనాథుడు 15వ శతాబ్దమున జీవించాడు. వీరు కొండవీటి ప్రభువు సర్వజ్ఞసింగ భూపాలుని ఆస్థాన కవి. విద్యాధికారి. ఈ కాలమందు ఎందరో కవిపండితులకు రాజాశ్రయం కల్పించారు. శ్రీనాధుడు కొండవీటి రెడ్డి రాజు ప్రోలయ వేమభూపతి ఆష్థానం వాడని ప్రసిద్ధి. శ్రీనాధుడు రెడ్డిరాజుల కడనున్న విద్యాధికారి అన్నమాట లోక విదితం. అద్దంకి రెడ్డిరాజులు క్రమముగా కొండవీడు, రాజమహేంద్రవరములలో రాజ్యమేలినారు. శ్రీనాధభట్ట సుకవి కొన్నాళ్ళు విస్తృతముగా ఆంధ్రదేశముననే కాక కర్ణాటక ప్రాంతమునందు కూడ సారస్వత యాత్రలు నెరపి తన భాషకు ఎనలేని సేవ చేసినాడు. శ్రీనాధామాత్యుని తాతగారు కమలనాభామాత్యుడు తన మనుమని ముద్దు పలికులలో ఇట్లు వర్ణించినాడు కనకక్ష్మాధర ధీరు, వారిధి తటీ కాల్ పట్టణాధీశ్వరున్ అనుగుందాత, కమనాభామాత్య చూడామణిన్ సాగర తటమునందున్న కాల్ పట్టణమునకు అధిపతి కమలలాభామాత్యుడు నేటి ప్రకాశం జిల్లా గుండ్లకమ్మనదికి దక్షిణ తటమున బంగాళాఖాతమునకు పడమరగా సుమారు ఇరువది కిలోమీటర్ల దూరములోనున్న నేటి ఊరు కొలచనకోట. ఈ కొలచనకోట యే కొలసనకోట (కాల్ సనకోట) అదే శ్రీనాధుని జన్మస్థలమని పలువురి చరిత్రకారుల అభిప్రాయము. మరికొందరు పండితులు శ్రీనధుడు సింగరాయ కొండ ప్రాంతము వాడని అందురు.కందుకూరు ప్రాంతమగు సింగరాయ కొండకు చేరువగల నెలవులలో శ్రీనాధుడుండెనని అనుకుందురు. ఇక్కడ అద్దంకి దాపున ఒక సింగరికొండ యున్నది. ఇదియు నారసింహ క్షేత్రము. ఏది ఎమైనా శ్రీనాధుడు ప్రకాశం సీమలోనివాడని, జన్మస్థలము ఈ ప్రాంతములోనే జరిగినదని తెలియుచున్నది.

డిండిమభట్టు అనే పండితుని వాగ్యుధ్ధంలో ఓడించి అతని కంచుఢక్కను పగుల గొట్టించాడు. ఈతనికి కవిసార్వభౌముడను బిరుదము ఉంది. 

ఇతను ఎన్నో కావ్యాలు రచించాడు. వాటిలో కొన్ని: భీమఖండము, కాశీ ఖండము, మరుత్తరాట్చరిత్ర, శృంగార నైషధము మొదలగునవి. ఈయన వ్రాసిన చాటువులు ఆంధ్రదేశమంతా బహు ప్రశస్తి పొందాయి. 

కాశీఖండమునందు చెప్పుకున్నట్టుగా


ప్రాయమింతకు మిగులఁ గైవ్రాలకుండఁ 
గాశికాఖండ మను మహాగ్రంథ మేను 
తెనుఁగు జేసెదఁ గర్ణాటదేశ కటక 
పద్మవనహేళి శ్రీనాథభట్టకవిని. 

శ్రీనాథమహాకవి చాటుపద్యాలకు ప్రసిద్ధి. ఆయన వ్రాసిన ఒకటి రెండు చాటువులనైనా చెప్పుకోకపోతే విషయానికి సమగ్రత చేకూరదు. మచ్చుకి దిగువ రెండుపద్యాలూ అవధరించండి.

కుల్లాయుంచితి, కోకసుట్టితి, మహాకూర్పాసమున్ బెట్టితిన్,
వెల్లుల్లిన్ తిలపిష్టమున్ మెసవితిన్ విశ్వస్త వడ్డింపగా
చల్లాయంబలి ద్రావితిన్, రుచులు దోసంబంచు పోనాడితిన్,
తల్లీ! కన్నడ రాజ్య లక్ష్మి! దయలేదా? నేను శ్రీనాథుడన్ .

కవితల్ సెప్పిన పాడనేర్చిన వృధాకష్టంబె, యీ భోగపుం
జవరాండ్రేగద భాగ్యశాలినులు, పుంస్త్వంబేటికే పోగాల్పనా ?
సవరంగాసొగసిచ్చి, మేల్ యువతి వేషంబిచ్చి పుట్టించుచో
యెవరేనిన్ మదిమెచ్చి ధనంబులిత్తురుగదా నీరేజపత్రేక్షణా!

నీలాలకా జాల ఫాల కస్తూరికా
తిలకంబు నేమిట దిద్దువాడ
నంగనాలింగనా నంగ సంగర ఘర్మ
శీకరం బేమిట జిమ్మువాడ
మత్తేభగామినీ వృత్తస్తనంబుల
నెలవంక లేమిట నిల్పువాడ
భామామణీ కచాభరణ శోభితమైన
పాపట నేమిట బాపువాడ
ఇందుసఖులను వేప్రొద్దు గ్రిందు పరిచి
కలికి చెంగల్వ రేకుల కాంతి దనరి

పోయె నా గోరు తన చేతి పోరు మాని

ఒకసారి శ్రీనాథ కవిసార్వభౌములు పల్నాటిసీమ కు వెళ్లారు. అక్కడి నీటి ఎద్దడి చూసి ఈ కంద పద్యాన్ని చాటువుగా చెప్పేరట -

సిరిగలవానికిజెల్లును
తరుణులు పదియారువేలుతగపెండ్లాడన్
తిరిపెమునకిద్దరాండ్రా
పరమేశాగంగవిడువు పార్వతిచాలున్

ఈయన పోతనకు సమకాలీనుడు. పోతనకు బంధువని, పోతన రచించిన శ్రీమదాంధ్రభాగవతాన్నిసర్వజ్ఞసింగభూపాలునికి అంకితమిప్పించడానికి ఒప్పింప చూసేడనే కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి కానీ చారిత్రాక ఆధారాలు లేని కారణంగా వాటి విశ్వసనీయత పై పలు సందేహాలు, వివాదాలు ఉన్నాయి.శ్రీనాథుని బావమరుదులలో ఒకరి పేరు పోతన(దగ్గుపల్లి పోతన).ఇతడు కూడ కవే. తెలియని వారు ఈ పోతనను బమ్మెర పోతన గా పొరపడి ఉంటారు.

శ్రీనాథుని అంతిమ దినాలు బహు దుర్బరంగా గడిచాయి. కొండవీటి ప్రాభవంతో పాటు శ్రీనాథుని ప్రభ మసకబారింది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టేయి. కృష్ణాతీరాన ఉన్న బొడ్డుపల్లి గ్రామాన్ని గుత్తకు తీసుకొని శిస్తు కట్టని కారణంగా ఆయన భుజంపై ఊరిబయటనున్న శిలను ఉంచి ఊరంతా తిప్పారని ఆయన చాటు పద్యం ద్వారా తెలుస్తుంది.

కృష్ణవేణమ్మ గొనిపోయె నింత ఫలము
బిలబిలాక్షులు తినిపోయె తిలలు పెసలు
బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి
నెట్లు చెల్లింతు సుంకంబు నేడు నూర్లు?

దీనారటంకాల దీర్థమాడించితి
    దక్షిణాధీశు ముత్యాలశాల,
పలుకుతోడై తాంధ్రభాషా మహాకావ్య
    నైషధగ్రంథ సందర్భమునకు,
పగులగొట్టించి తుద్భట వివాద ప్రౌఢి
    గౌడడిండిమభట్టు కంచుఢక్క,
చంద్రభూష క్రియాశక్తి రాయలయొద్ద
    పాదుకొల్పితి సార్వభౌమ బిరుద,
మెటుల మెప్పించెదో నన్ను నింకమీద
రావు సింగ మహీపాలు ధీవిశాలు
నిండుకొలువున నెలకొనియుండి నీవు
సకలసద్గుణ నికురంబ! శారదాంబ!

కవిరాజుకంఠంబు కౌగిలించెనుగదా
    పురవీధినెదురెండ బొగడదండ,
సార్వభౌముని భుజాస్కంధ మెక్కెనుగదా
    నగరివాకిటనుండు నల్లగుండు,
ఆంధ్రనైషధకర్త యంఘ్రి యుగ్మంబున
    దగలియుండెనుగదా నిగళయుగము,
వీరభద్రారెడ్డి విద్వాంసుముంజేత
    వియ్యమందెనుగదా వెదురుగొడియ,
కృష్ణవేణమ్మ గొనిపోయె నింతఫలము 
బిలబిలాక్షులు తినిపోయె తిలలుపెసలు
బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి
నెట్లుచెల్లింతు టంకంబు లేడునూర్లు?

కాశికావిశ్వేశు గలసె వీరారెడ్డి
     రత్నాంబరంబు లే రాయడిచ్చు?
కైలాసగిరి బండె మైలారువిభుడేగె
     దినవెచ్చ మేరాజు దీర్పగలడు?
రంభ గూడె తెనుంగురాయరాహుత్తుండు
     కస్తూరి కేరాజు ప్రస్తుతింతు,
స్వర్గస్థుడయ్యె విస్సన్నమంత్రి మరి హేమ
     పాత్రాన్న మెవ్వని పంక్తి గలదు?
భాస్కరుడు మున్నె దేవునిపాలి కరిగె 
కలియుగంబున నిక నుండ కష్టమనుచు
దివిజకవివరు గుండియల్ దిగ్గురనగ
నరుగుచున్నాడు శ్రీనాథు డమరపురికి.

చాటు పద్యాల్లో కనిపించే శ్రీనాథుడి వ్యక్తిత్వం ఇది -

శ్రీనాథుడు తన గ్రంథాలతో ఎంతగా లబ్ధప్రతిష్ఠుడయాడో చాటువుల ద్వారా కూడా అంతే. ఐతే శ్రీనాథుడివిగా చెప్పబడేవన్నీ ఆయన చెప్పినవేనా అనేది ఎవరూ తేల్చలేని విషయం. కాని, రసవేత్తలైన పాఠకుల దృష్టిలో శ్రీనాథుడి వ్యక్తిగత జీవనచిత్రణని చూపిస్తాయివి. ఈ చాటుపద్యాలలో కనిపించే శ్రీనాథుడు ఎంతో ఆధునిక భావాలున్నవాడు. ఈ కాలపు సమాజంలో హాయిగా ఇమిడిపోగలవాడు. ఆనాటి సమాజానికి ఆయన జీవనశైలి మింగుడుపడనిదై ఉండాలి. అందుకే అంతటి మహానుభావుడూ చివరిదశలో ఎన్నో ఇక్కట్లకు గురయ్యాడు. ఎవరూ ఆయన్ని ఆదుకోవటానికి రాలేదంటే తన బంధుమిత్రులకు ఎంత దూరమయాడో తెలుస్తుంది. సర్వస్వతంత్రుడిగా, నిరంకుశుడిగా జీవితాన్ని తన మనసుకు నచ్చిన రీతిలో సాగించిన శ్రీనాథుడి మూలంగా మనకు మిగిలిన సంపదలో ముఖ్యభాగం ఈ చాటువులు.




#Article 27: బమ్మెర పోతన (247 words)


బమ్మెర పోతన (1450–1510) గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. వీరు సంస్కృతములో ఉన్న శ్రీమద్భాగవతమును ఆంధ్రీకరించి తన జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసాడు. శ్రీమదాంధ్ర భాగవతములోని పద్యాలు వినని తెలుగు వాడు లేదంటే అతిశయోక్తి కాదు.

వీరు నేటి జనగామ జిల్లా లోని బమ్మెర గ్రామంలో లక్కమాంబ కేసయ దంపతులకు జన్మించారు.. వీరి అన్న పేరు తిప్పన. వీరిది బమ్మెర వంశం, శైవ కుటుంబం. వీరిగురువు ఇవటూరి “సోమనాథుడు”.వీరు ఆఱువేల నియోగులు, కౌండిన్యస గోత్రులు.

ఒక రోజు గోదావరి నదిలో స్నానమాచరించి ధ్యానం చేస్తుండగా శ్రీ రాముడు కనిపించి వ్యాసులవారు రచించిన సంస్కృతం లోని భాగవతాన్ని తెలుగులో రాయమని ఆదేశించారని ఒక కథ. పోతన భాగవత రచనకు సంబంధించి చాలా కథలే ప్రచారంలో ఉన్నాయి. ‘అల వైకుంఠపురంబులో’ అనే పద్యాన్ని ప్రారంభించి దాన్ని పూర్తిచేయలేని పక్షంలో, ఆ భగవంతుడే మిగతా పద్యాన్ని పూర్తిచేశాడన్న గాథ ఒకటి ప్రచారంలో ఉంది. ఓరుగల్లుకి ప్రభువైన సింగరాయ భూపాలురు భాగవతాన్ని తమకి అంకితమివ్వమని అడగగా పోతన అందుకు నిరాకరించి శ్రీ రామునికి అంకితం ఇచ్చారు. శ్రీమదాంధ్ర భాగవతం మొత్తము పోతన రచించినా, తరువాతి కాలంలో అవి పాడవడంతో 5వ స్కంధం (352 పద్యగద్యలు) గంగన, 6వ స్కంధం (531 పద్యగద్యలు) సింగయ, 11, 12 స్కంధాలు (182 పద్యగద్యలు) నారయ రచన అనీ ఎక్కువ ప్రచారంలో ఉంది.

యవ్వనంలో ఉండే సహజచాపల్యంతో పోతన భోగినీ దండకం అనే రచనను చేశారు. ఆనాటి రాజు సర్వజ్ఞ సింగభూపాలుని ప్రియురాలి మీద అల్లిన ఈ దండకం, తెలుగులోనే తొలి దండకమని భావించేవారు లేకపోలేదు. ఆ తరువాత దక్షయజ్ఞ సందర్భంగా శివుని పరాక్రమాన్ని వివరిస్తూ ‘వీరభద్ర విజయం’ అనే పద్య కావ్యాన్ని రాశారు.

పోతన, శ్రీనాథ కవిసార్వభౌముడు సమకాలికులు, బంధువులు అనే సిద్ధాంతం ప్రాచుర్యంలో ఉంది కానీ ఈ సిద్ధాంతం నిజం కాదనే వారూ ఉన్నారు. వీరిమధ్య జరిగిన సంఘటనలగురించి ఎన్నో గాథలు ప్రచారములో ఉన్నాయి.

పోతన కవిత్వములో భక్తి, మాధుర్యము, తెలుగుతనము, పాండిత్యము, వినయము కలగలిపి ఉంటాయి. అందులో తేనొలొలుకుతున్నవనేది ఎలా చూచినా అతిశయోక్తి కానేరదు. భావి కవులకు శుభము పలికి రచన ఆరంభించిన సుగుణశీలి ఆయన.
డా. సి.నారాయణరెడ్డి గారి వ్యాసము  తెలుగు సాహిత్యములో పోతనగారి విశేష స్థానాన్ని వివరిస్తుంది.

బామ్మేరా పోతన




#Article 28: అన్నమయ్య (2753 words)


అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (మే 9, 1408 - ఫిబ్రవరి 23, 1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉంది. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి.

కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు. (సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉంది. ప్రధాన మందిరంలో ఘంట అవతారమని కూడా అంటారు). త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు.

చందమామ రావే జాబిల్లి రావే అంటే వేంకటేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ, తెలుగు పిల్లలు మాత్రము గబుక్కున తింటారు. జోఅచ్యుతానంద జో జో ముకుందా అంటే ముకుందుడు నిద్ర పోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు మాత్రము హాయిగా నిద్ర పోతారు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమై పోయినాయి; జనాల నోళ్ళలో నాటుకొని పోయినాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు - ఇలా మొత్తము ముప్పై రెండు వేల పాటలు వ్రాసాడు.

అన్నమయ్య మనుమడు తాళ్ళపాక చిన్నన్న అన్నమాచార్య చరితము అన్న ద్విపద కావ్యములో అన్నమయ్య జీవిత విశేషాలను పొందుపరచాడు. ఈ గ్రంథం 1948లో లభ్యమై ముద్రింపబడింది. అన్నమయ్య జీవితం గురించి మనకు తెలిసిన వివరాలకు ఈ రచనే మౌలికాధారం. కాని బహువిధాలైన నమ్మకాలూ, అనుభవాలూ, ఘటనలూ, కథలూ ఈ వివరాలలో పెనవేసుకొని ఉన్నాయి.

నందవరీకులు క్రీ.శ. 10వ శతాబ్దంలో కాశినుండి ఆంధ్ర దేశానికి వలస వచ్చిన శుద్ధవైదిక బ్రాహ్మణులని పరంపరాయాత ప్రతీత. క్రీ.శ. 10వ శతాబ్దంలో నేటి కర్నూలు జిల్లాలోని నందవరం అనే గ్రామాన్ని నందుడనే రాజు పాలించేవాడు. ఈ రాజు కాశియాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ కొందరు వైదిక బ్రాహ్మణులు చాముండేశ్వరీ ఉపాసకులు పరిచయం అయ్యారని, ఆ సమయంలో వారణాసిలో క్షామం రాగా ఆ బ్రాహ్మణ కుటుంబాలు కొన్ని ఆంధ్రదేశానికి వలసివచ్చి నంద రాజు ఆశ్రయంలో స్ధిరపడ్డారనీ, నందరాజుచే తీసుకొని రాబడిన వైదికిలు కావడంచే నందవైదికులుగా ప్రచారం పొందారని జనవాక్యం. కాలక్రమాన వీరు నేటి కర్నూలు, కడప జిల్లాలో స్ధిరపడ్డారని పరిశోధకులు అభిప్రాయం. తాళ్ళపాక గ్రామ నామం అన్నమయ్య వంశస్ధులకు ఇంటిపేరుగా నిలిచింది. అన్నమయ్య కూడా నందవరీకుడే. ద్విపద కావ్యం ప్రకారం అన్నమయ్య తాత నారాయణయ్య. చదువు అబ్బక, గురువులు పెట్టే హింసలు భరించలేక నారాయణయ్య చనిపోవాలని అనుకొన్నాడట. వూరిలో గ్రామ దేవత చింతలమ్మ గుడివద్ద విషసర్పం పుట్టలో చేయి పెట్టాడట. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై అతని వంశంలో మూడవతరంలో హరి అంశతో ఒకబాలుడు జన్మిస్తాడని చెప్పిందట.

భారద్వజ గోత్రులైన అన్నమయ్య పూర్వుల ప్రస్తావన నాలుగు తరాలకు సంబంధించిన వివరాలను చిన్నన్న అన్నమాచార్య ద్విపద వల్లను, అష్టమహిషి కల్యాణం వల్లను గ్రహించవచ్హును.

భరద్వాజ ఋషి - నారాయణయ్య - విఠలయ్య - నారాయణయ్య - విఠలుడు - నారాయణుడు - నారాయణసూరి - అన్నమాచార్య

కడప జిల్లా రాజంపేట తాలూకా పొత్తిపినాడు మండలం నడిబొడ్డున తాళ్లపాక గ్రామం విరాజిల్లుతుండేది. ఆ గ్రామంలో వెలసిన చెన్నకేశవస్వామి, సిద్ధేశ్వరస్వామి ల కరుణాకటాక్షములతో ఆ గ్రామజనులు సుఖవంతులై జీవనం సాగించేవారు. ఇచ్చట చెన్నకేశవస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశాడు. సస్యశ్యామలమై విరాజిల్లే ఈ గ్రామం సన్మునులకు, అఖిల దేవతలకు నిజవాసమై వుండేదని అంటారు స్థలజ్ఞులు.ఈ చెన్నకేశవస్వామిని దేవతలు, ఋషులు, సిద్ధులు ప్రతి రోజూ పూజిస్తారు. ఈ చెన్నకేశవస్వామి గుడిని ఆశ్రయించుకొని కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు జీవించేవి. ఆ గ్రామవాసులు తలపక ఇందిరారమణపదైక మానసులుగా జీవనం సాగించేవారు. వాళ్లల్లో నారాయణయ్య చాల ప్రసిద్ధుడు. ఇతని నాలుగోతరంలో మరో నారాయణయ్య వుండేవాడు. అన్నమయ్య పితృ పితామహులు నారాయణయ్య, విఠలయ్యలు విష్ణుభక్తిరతులై తాళ్ళపాక చెన్న కేశవస్వామిని సేవించుకొంటూ జీవితం గడిపేవారు. ఈ నారాయణయ్య కథ తోనే మన అన్నమయ్య కథ మొదలౌతుంది.

నారాయణయ్యకు చిన్నతనంలో ఎంతకీ చదువు రాలేదు. తండ్రి విఠలయ్య నయాన భయాన చెప్పి చూశాడు. లాభం లేక పోయింది. తన వద్ధ ప్రయోజనం లేదని ప్రక్కనే వున్న ఊటుకూరులో తన బంధువుల వద్ద వుంచాడు. ఊటుకూరు నేడు కడపజిల్లా రాజంపేట తాలూకాలో ఉంది. అన్నమయ్య మనవడు చినతిరుమలయ్య ఊటుకూరి చెన్నరాయని మీద కొన్ని సంకీర్తనలు కూడా రచించాడు. అక్కడ బళ్ళో ఉపాధ్యాయులు శతవిధాల ప్రయత్నించారు. గురువులు నారాయణయ్యను చతుర్విధ ఉపాయాలకు గురి చేశారు. అయినా బాలునికి చదువుపట్ల శ్రద్ధకలుగలేదు. నారాయుణిని కళ్లల్లో నీళ్లే తప్ప నోట సరస్వతి పలకలేదు. వాళ్లు విసిగిపోయి బాలుని రకరకాల శిక్షలకు గురిచేసారు. చివరకు గురువు నారాయణయ్యను కోదండమున వ్రేలాడదీశారు. కోలగగ్గెర విధించారు. గుంజిళ్లు తీయించారు. కోదండం అంటే దూలానికి తాడు కట్టి వ్రేలాడతీయడం. కోలగగ్గెర అంటే కాళ్ళుచేర్చికట్టి కూలద్రోయడం.

నారాయణయ్యను అయ్యవార్లు ఇంతటి కఠిన పరీక్షలకు గురిచేసినందుకు మనస్సు గాయపడింది. నలుగురూ అవహేళన చేస్తున్నారు. సిగ్గుతో, అవమానంతో క్రుంగిపోయాడు. ఇంతకంటె చావు మేలను కున్నాడు. నారాయణయ్య ఊటుకూరు గ్రామశక్తి అయిన చింతలమ్మగుడి సమీపాన పుట్టలో పాముందని ఎవరో చెబుతుండగా విన్నాడు. నారాయణుడు ఒంటరిగా గుడికి చేరి పుట్టలో చేయి పెట్టాడు. నేడు ఊటుకూరునందు చింతలమ్మ ఆలయం కనిపించదు. కాని ఊటుకూరు శివాలయంలో ఒక గదిలో వున్న స్త్రీమూర్తి విగ్రహం చింతలమ్మ అని స్ధానికుల అభిప్రాయం. పాము కరవలేదు సరికదా, నారాయణయ్యకు త్రికాల వేదినియైన చింతలమ్మ ప్రత్యక్షమైంది. నారాయణయ్య ఏడుస్తూ ఆమె పాదాల మీద పడ్డాడు. చింతలమ్మ ఆ బాలుని ఓళ్ళో చేర్చుకొని వూరడించింది.ఎందుకుబాబూ ఈ అఘాయిత్యం? నీ మూడోతరంలో గొప్ప హరి భక్తుడు జన్మిస్తాడు. అతని వల్ల మీ వంశమే తరిస్తుంది. నీకు చదువు రాకపోవడమేమిటి? వెళ్ళు,తాళ్ళపాక చెన్నకేశవస్వామే నీకు అన్నీ అనుగ్రహిస్తాడు అని నారాయణయ్యను అనుగ్రహించి అంతర్థానమైనది. అమ్మవారి ఆదేశం ప్రకారం నారాయణయ్య తాళ్ళపాక చేరి ఆశ్రితక్లేశనాశకుడైన చెన్నకేశవస్వామిని సేవించి స్వామి అనుగ్రహించే వేదవేదాంగ పారంగతుడై సకలవిద్యలు పొందగలుగుతాడు. సర్వజ్ఞుడని కీర్తి పొందుతాడు. ఈ నారాయణయ్య కుమారుడే నారాయణసూరి.

అన్నమయ్య తండ్రి అయిన నారాయణసూరి గొప్ప కవి, పండితుడు, సకల విద్యాదురంధరుడుగా ప్రసిద్ధికెక్కినవాడు. అన్నమయ్య తండ్రి పేరు ’నారాయణసూరి’గా చిన్నన్న పేర్కొనడాన్నిబట్టి తాళ్ళపాకవారు అన్నమయ్య జననానికి ముందే పండిత వంశస్ధులుగా కీర్తించబడేవారని భావించవచ్చును. నారాయణసూరి ధర్మపత్ని లక్కమాంబ, మహా భక్తురాలు. మధురంగా పాడుతుంది. ఈమె స్వగ్రామం మాడువూరు, కడప జిల్లా సిద్దపట్నం తాలూకాలో వున్నది. అక్కడ చెన్నకేశవస్వామి ఈమెతో ప్రత్యక్షంగా మాట్లాడేవాడట.

భాగవతసేవా పరాయణులైన నారాయణసూరి, లక్కమాంబ లకు సంతానం లేకపోవడం తీవ్రవ్యధకు గురిఅయినారు. ఈ పుణ్య దంపతులు సంతానం కోసం చేయని వ్రతం లేదు, కొలవని దేవుడు లేడు. మాకు మంచి కొడుకును ప్రసాదించు స్వామీ అని ఏడుకొండలస్వామికి మ్రొక్కుకున్నారు. ముడుపులు కట్టుకున్నారు. ఒక మంచిరోజు చూసి ఇద్దరూ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం ప్రయాణమయ్యారు.లక్కమాంబ, నారాయణసూరి తిరుమల చేరారు. స్వామి మందిరం ప్రవేశించారు. గరుడగంభం వద్ద సాగిలి మ్రొక్కారు. వాళ్ళకేదో మైకం కమ్మినట్లైంది. కళ్లు మిరుమిట్లు గొలిపే తేజస్సు కనిపించి ధగధగ మెరిసే ఖడ్గాన్ని వాళ్ల చేతుల్లో పెట్టి అద్రుశ్యమైంది. వేంకటేశ్వరస్వామి తన నిజ ఖడ్గమైన నందకాన్ని ఆ పుణ్య దంపతులకు ప్రసాదించాడు. వాళ్ళు పరమానంద భరితులయ్యారు. వేంకటపతిని దర్శించి స్తుతించారు. సంతోషంతో తాళ్లపాకకు తిరిగి వచ్చారు.

ఆ దంపతులు తిరుమల తిరుపతిని దర్శించుకొని, ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ ప్రణామం ఆచరించినపుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని గాథ. కొండలయ్య తాను ధరించే బిరుదు గజ్జియల ముప్పిడి కఠారాన్ని వారికందజేశాడట. అలా పుట్టిన శిశువే అన్నమయ్య.

లక్కమాంబ గర్భవతి అయింది. వైశాఖమాసం విశాఖ నక్షత్రంలో ఒక శుభలగ్నంలో మూడు గ్రహాలు ఉన్నత దశలో వుండగా నారాయణసూరి, లక్కమాంబలకు నందకాంశమున పుత్రోదయమైనది, మగశిశువు ఉదయించాడు.
సర్వధారి సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు (మే 9, 1408) కడప జిల్లా లోని రాజంపేట మండలం తాళ్ళపాక గ్రామములో అన్నమయ్య జన్మించాడు. 8వ యేట అన్నమయ్యకు ఆయన గురువు ఘనవిష్ణు దీక్షనొసగినపుడు అన్నమాచార్య నామం స్థిరపడింది. నారాయణసూరి ఆ శిశువునకు ఆగమోక్తంగా జాతకర్మ చేశాడు.

శ్రీమహావిష్ణువు వక్షస్ధలమందలి కౌస్తుభమే శఠకోపయతిగా, వేంకటేశ్వరస్వామి గుడి ఘంట వేదాంతదేశికులుగా స్వామి హస్తమందలి నందకమనే ఖడ్గాంశలో పేయాళ్వారులు, అన్నమయ్యలు అవతరించారని ప్రాజ్ఞుల విశ్వాసం.

పరమ సుగ్యాన సంపద పొదలంగ.........

అన్నమయ్య బోసి నవ్వులు వొలకబోస్తూ నలుగురినీ మురిపించేవాడు. మాటిమాటికీ వెంకన్న పేరు చెబితేనే ఉగ్గుపాలు త్రాగేవాడు. వేంకటపతికి మొక్కుమని చెబితేనే మొక్కేవాడు. వేంకటపతిమీద జోలపాడనిదే నిద్రపోడు. లక్కమాంబ భక్తిగీతాలు పాడుతుంటే పరవశించి పోయేవాడు. నారాయణసూరి కావ్యాలలో అర్ధాలు వివరిస్తూవుంటే తానూ ఊ కొట్టేవాడు.ఇలా అన్నమయ్య శిశుప్రాయం నుండి వేంకటపతి మీది ధ్యానంతో ప్రొద్దులు గడిపేవాడు.

అన్నమయ్యకు అయిదు సంవత్సరాలు నిండాయి. నారాయణసూరి ఆర్యుల సమ్మతి ప్రకారం ఉపనయనం చెయించాడు. అన్నమయ్యకు -

అహినాయకాద్రి
వెన్నుని వరముచే విద్య లన్నియును
నమితంబు లగుచు జిహ్వరంగసీమ
తము దామె సొచ్చి నర్తనమాడ దొడగె

అన్నమయ్య ఆడిన మాటల్లా అమృతకావ్యంగ, పాడినదల్లా పరమగానంగా భాసించేది. చిన్ననాటనే వేంకటపతి మీద వింత వింతలుగా సంకీర్తనలు ఆలపించేవాడు. కాని అన్నమయ్య సంకీర్తన రచనకు స్వామి ఆదేశం పొదినది తన పదహారవ సంవత్సరంలోనే! వేంకటేశ్వరస్వామి ఆదేశం ప్రకారం అన్నమయ్య తన పదహారో ఏటనుండి రోజుకొక్క సంకీర్తనకు తక్కువ కాకుండా వ్రాయడం ప్రారంభించాడు. ఈ విషయం రాగిరేకులమీద తొలి వ్యాక్యాలవల్ల కూడా స్పష్టమవుతున్నది. అన్నమయ్య ఏక సంథాగ్రాహి.  గురువులు చెప్పిన పాఠాలు చెప్పినవెంటనే అప్పచెప్పేవాడు. వాళ్లు ఆశ్చర్యపడేవాళ్లు. ఇంక అన్నమయ్యకు నేర్పించవలసింది ఏమీ లేదని త్వరలోనే తెలుసుకున్నారు. అన్నమయ్య చెన్నకేశవుని గుడిచేరి బుజ్జి కేశవా అని పిలిచేవాడు.

బుజ్జిబాలుని ముద్దు మాటలకు మురిసి చెన్నకేశవుడు చిరునవ్వులు చిందించేవాడు. అన్నమయ్య ఎప్పుడూ ఆటల్లో పాటల్లో మునిగి తేలేవాడు. చెరువు కట్టలమీద చేరి చెట్టుమీద పిట్టలతో గొంతు కలిపేవాడు. చిరుగాలుల సవ్వడికి మురిసేవాడు. చెరువులోని అలలలో ఉయ్యాలలూగే కమలాలను చూస్తూ గంతులేసేవాడు. కన్నెపిల్లలు వెన్నెల రోజుల్లో జాజర పాడుతూంటే అక్కడ చేరుకొని వాళ్లను అల్లరి పెట్టేవాడు. రాగం పాడీ, తాళం వేసీ చూపేవాడు. మీకేం తెలీదు పొమ్మని ఎగతాళి చేసేవాడు. కలుపు పాటల్లో, కవిల పాటల్లో జానపదులతో బాటు శ్రుతి కలిపేవాడు. అన్నమయ్య మాటన్నా పాటన్నా ఆ వూరి వాళ్లు ఎంతో సంబరిపడిపోయే వాళ్లు.

నారాయణసూరిది పెద్ద కుటుంబం. ఉమ్మడి కుటుంబాలలో చిన్న చిన్న కలతలు తప్పవు. వాళ్ల కోపతాపాలు అర్థం లేనివి కావు. ఇంతలో తగువులాడతారు. అంతలో కలిసిపోతారు.అన్నమయ్య బాల్యంలో తల్లిదండ్రులు, వదిన చెప్పిన పనులు అన్నీ విసుగు చెందగ చేసేవాడు. ఉమ్మడి కుటుంబాలల్లో పనులు తప్పవు. అందుకనే అన్నమయ్య  ఎప్పుడూ దండె భుజాన తగిలించుకొని పాటలు పాడడం ఇంటివారలకు అంతగా నచ్చేది కాదు. ఒకనాడు అందరు కలిసికట్టుగా అన్నమయ్య మీద విరుచుకు పడ్డారు. అన్నమయ్యకు దిక్కు తెలియలేదు. ఎప్పుడూ ఆ దండె భుజాన తగిలించుకొని పిచ్చి పాటలు పాడుకోవడమేనా? ఇంట్లో పనీపాటా ఎవరు చూస్తారు? అని ఇంటివాళ్లు దెప్పి పొడిచారు. గాలి పాటలు కట్టిపెట్టి అడవికెళ్ళి పశువులకింత గడ్డి తెచ్చిపడేయ్. ఏ విసుగులో వున్నాడో నారాయణసూరి కొడుకును కసిరినంత పనీచేశాడు. లక్కమాంబ మాత్రం కొడుకువైపు జాలిటా చూసింది. అన్నమయ్య ఏమీ బదులు పలకలేదు. కొడవలి భుజాన తగిలించుకొని అడవికి బయలుదేరాడు.

అన్నమయ్యకు అడవికి వెళ్ళడం అలవాటు లేదు. ఒక చెట్టు కింద చతికిలబడ్డాడు. తంబుర చేతిలోనే ఉంది. తీగలు సవరించి పాడబోయాడు. పక్కనే కొడవలి ఉంది. దాన్ని చూస్తూనే వచ్చిన పని గుర్తుకు వచ్చింది. లేచి చుట్టూ పరికించాడు. ఒక చోట పచ్చిక బాగా బలిసి ఉంది.

నే పార దఋగు యోగీంద్రు చందమున ’

అంటూ కొడవలితో పచ్చికను కోస్తున్నాడు. పచ్చిక కోస్తున్నా మనసంతా శ్రీహరి మీదనే ఉంది. అందుకే మరికొంత పచ్చికను కొయబోతున్న అన్నమయ్య ఒక్కసారి అమ్మా!! అని కేక పెట్టాడు. చిటికినవేలు తెగి రక్తం బొటబొటా కారుతున్నది. రక్తం చూస్తూనే కళ్లు తిరిగిపోయాయి. బాధతో మూలిగాడు. ఈ అవస్థకు కారణం ఎవరు? ఒక్కమారు తనబంధువుల్ని తల్లిదండ్రుల్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. వేదనలో విరక్తి, భక్తి జన్మించాయి. వేదనలో వేదం ప్రభవించినట్లు ఈ సంఘటన అన్నమయ్య జీవితంలో భక్తిరసావేశానికి నాంది పలికింది. అంతా అబద్ధం. తనకు ఎవ్వరూ లేరు. లౌకిక బంధాలతో తనకు పని లేదనుకున్నాడు.

మయ్యంచు మనసున నే మొహమతినెత్తి||

తగు బంధూలా తనకు దల్లులును దండ్రులును
వగలబెట్టుచు దిరుగువారేకాక
మిగుల వీరల పొందు మేలనుచు హరినాత్మ
దగిలించలేక చింతాపరుడనైతి ||

అని చింతించి......

నెల్ల సంపదలునై యెల్ల చందముల
ననుబ్రోచు శెశాద్రినాధుని,గొలిచి
మనియెద.........

అని నిర్ణయించుకొంటాడు.

అదే సమయాన తిరుమల వెళ్ళే యాత్రికుల గుంపును చూశాడు. వాళ్లు ఆడుతూ పాడుతూ వెళ్తున్నారు. చేతిలొ వున్న కొడవలిని విసిరేసాడు. తంబుర చేత పట్టుకొని ఆ గుంపులో కలిసిపోయాడు. ఆ యాత్రికులు ఎవరోకారు, సనకాదులనే భక్తబృందం. వాళ్ల వేశం తమాషాగా వుంది. జింక చర్మంతో చేసిన కిరీటాలు పెట్టుకున్నారు. అబ్రకము, ఆకులు కుట్టిన బట్టలు వేసుకున్నారు. నొసట పట్టెనామాలు, శంఖ చక్రాల ముద్రికలు, కాళ్లకు కంచు అందెలు, చేతిలో బాణాలున్నాయి. దండెలు మీటుకుంటూ చిట్టి తాళాలు వాయిస్తూ మద్దెల మ్రోగిస్తూ భక్తి పారవశ్యంతో పాడుతూ చిందులేస్తూ మధ్యలో గోవిందా! గోవింద!........

ఆమటి మ్రొక్కులవాడే ఆదిదేవుడే వాడు
తోమని పళ్యలవాడే దురితదూరుడే ||
.......

అంటూ చిత్రగతుల పాడుకుంటూ కొండకు పయనమవుతున్న యాత్రికులతో కలిసి తిరుపతి చేరుతాడు అన్నమయ్య.

తిరుపతి పొలిమేరలోకల గ్రామసక్తి తాళ్ళపాక గంగమ్మను సేవించాడు. తిరుపతిలో ఇంకా తాతాయగుంట గంగమ్మ, అంకాళమ్మ, వేశాలమ్మ, కాళెమ్మ, నేరెళ్ళమ్మ, కావమ్మ, మారలయ్య అనే గ్రామశక్తులు కొలువై ఉన్నారు. పూర్వం తిరుపతికి వచ్చే భక్తబ్రుందం మొదట తాళ్ళపాక గంగమ్మను సేవించిన తరువాతనే తిరుమలను సందర్సించే ఆచారం వుండేది. నేటికి తిరుపతిలో మేనెలలో గ్రామసఖ్తి గంగమ్మజాతర వైభవోపేతంగా జరుగుతుంది.

గంగమ్మని దర్సించిన అనంతరం అన్నమయ్య -

లందు వెలుగొంది ప్రభమీరగాను 

అని ౧౦౮ తిరుపతులను కీర్తిస్తూ అచ్చటి చక్రవర్తి పీఠాలు, దేశాంత్రుల మఠాలు, తపస్వుల గృహాలు, విశ్రాంతదేశాలను సందర్శిస్తాడు.
తిరుమలకు పయనమవుతూ మార్గమధ్యంలోని అళిపురిసింగరి, తలయేరుగుండు, పెద్దయెక్కుడు, కపురంపు కాలువలను సందర్శిస్తాడు.

ఇక్కడ అళిపురిసింగరి, తలయేరుగుండు, కురువమండపం, పెద్దయెక్కుడు, కపురంపు కాలువ, మోకాళ్ళముడుపులను గూర్చి వివరించడం సమంజసం.

అన్నమయ్య ఇంటిలో తల్లి సంగీతం, తండ్రి పాండిత్యం ఛాయలలో పెరిగాడు. ఉపవీత సంస్కారం పొందిన తరువాత ఇంటి గురుకులంలోనే విద్యాభ్యాసం సాగింది. ఏక సంధాగ్రాహి అయినందున అనతికాలంలో ఉన్నత విద్యావంతుడయ్యాడు.
తన పదహారవ యేట అన్నమయ్యకు శ్రీవేంకటేశ్వర దర్శనానుభూతి కలిగింది. అప్పటినుండి అన్నమయ్య అద్భుతమైన కీర్తనలను రచింపసాగాడు.

ఒకనాడు (8వ ఏట)ఎవరికీ చెప్పకుండా అన్నమయ్య కాలినడకన తిరుపతి బయలుదేరాడు. సంప్రదాయం తెలియక తిరుమల కొండను చెప్పులతో కొండనెక్కుచుండగా అలసిపోయి ఒక వెదురు పొదలో నిద్రపోయెను. అప్పుడు ఆయనకు కలలో అలివేలు మంగమ్మ దర్శనమిచ్చి పరమాన్నాన్ని ప్రసాదించి, పాదరక్షలు లేకుండా కొండనెక్కమని బోధించింది. అప్పుడు పరవశించి అలమేలుమంగను కీర్తిస్తూ అన్నమయ్య శ్రీవేంకటేశ్వర శతకము రచించాడు.
తిరుమల శిఖరాలు చేరుకొన్న అన్నమయ్య స్వామి పుష్కరిణిలో స్నానం చేసి, వరాహ స్వామి దేవాలయంలో ఆదివరాహ స్వామిని దర్శించుకొన్నాడు. పిదప వేంకటపతి కోవెల పెద్దగోపురము ప్రవేశించి నీడ తిరుగని చింతచెట్టుకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి, గరుడ స్తంభానికి సాగిలి మ్రొక్కాడు. సంపెంగ మ్రాకులతో తీర్చిన ప్రాకారము చుట్టి విరజానదికి నమస్కరించాడు. భాష్యకారులైన రామానుజాచార్యులను స్తుతించి, యోగ నరసింహుని దర్శించి, జనార్దనుని (వరదరాజస్వామిని) సేవించి, వంట యింటిలో వకుళా దేవికు నమస్కరించి, యాగశాలను కీర్తించి, ఆనంద నిలయం విమానమును చూచి మ్రొక్కాడు. కళ్యాణమంటపమునకు ప్రణతులిడి, బంగారు గరుడ శేష వాహనములను దర్శించాడు. శ్రీభండారమును చూచి, బంగారు గాదెలను (హుండీని) సమర్పించి తన పంచె కొంగున ముడివేసుకొన్న కాసును అర్పించాడు. బంగారు వాకిలి చెంతకు చేరి, దివ్యపాదాలతో, కటివరద హస్తాలతో సకలాభరణ భూషితుడైన దివ్యమంగళ శ్రీమూర్తిని దర్శించుకొన్నాడు. తీర్ధ ప్రసాదాలను స్వీకరించి, శఠకోపముతో ఆశీర్వచనము పొంది, ఆ రాత్రి ఒక మండపములో విశ్రమించాడు.

తరువాత అన్నమయ్య కొండపై కుమార ధార, ఆకాశ గంగ, పాప వినాశం వంటి తీర్ధాలను దర్శించి, కొండపైనే స్వామిని కీర్తిస్తూ ఉండిపోయాడు. అతని కీర్తనలు విని అర్చకులు అతనిని ఆదరించ సాగారు.

తిరుమలలో ఘనవిష్ణువు అనే ముని స్వామి అన్నమయ్యను చేరదీసి అతనికి భగవదాజ్ఞను తెలిపి శంఖ చక్రాదికములతో శ్రీవైష్ణవ సంప్రదాయానుసారముగా పంచ సంస్కారములను నిర్వహించాడు. గురువుల వద్ద వైష్ణవ తత్వాలను తెలుసుకొంటూ, ఆళ్వారుల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ, వేంకటేశ్వరుని కీర్తిస్తూ తిరుమలలోనే అన్నమయ్య జీవితం గడప సాగాడు.

కొండ ఎక్కుటలో తొలిమెట్టుగల ప్రాంతం అళిపురి. అడిపడి, అలిపిరి అని కూడా పిలుస్తారు.
అలిపిరి చేరాడు, అక్కడ వెలసిన నరసింహస్వామికి నమస్కారం చేశాడు. అలిపిరి కొండకు చుక్కల పర్వతం అని కూడా పేరు. భగవంతుని చేరడానికి ఇది తొలిపాదం.

అన్నమయ్య తిరుమలలో ఉన్నాడని విని అతని తల్లిదండ్రులు తిరుమలకు వెళ్ళి అతనిని ఇంటికి తిరిగి రమ్మని బ్రతిమాలారు. ముందు నిరాకరించినా గాని అన్నమయ్య గురువు ఆనతిపై తాళ్ళపాకకు తిరిగి వచ్చాడు. కాని నిరంతరం భగవధ్యానంలో ఉంటూ స్వామిని కీర్తిస్తూ ఉండేవాడు. అతనికి యుక్త వయస్సు రాగానే తిమ్మక్క, అక్కమ్మ అనే పడతులతో వివాహం చేశారు తల్లిదండ్రులు. వైవాహిక జీవితంలో పడిన అన్నమయ్య ఒకమారు తన ఇద్దరు భార్యలతో కూడి తిరుమలను దర్శించాడు. ఆ సమయంలోనే శ్రీవేంకటపతికి రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించాడు.

అప్పటినుండి అన్నమయ్య పుంఖానుపుంఖాలుగా కీర్తనలు చెప్పాడు. అతని శిష్యులు వాటిని గానం చేస్తూ తాళపత్రాలకు ఎక్కించసాగారు. తరువాత అన్నమయ్య తన భార్యలతో కలసి తీర్ధయాత్రలకు బయలుదేరాడు. వారు ముందుగా తమ వూరిలో చెన్నకేశవుని అర్చించారు. మార్గంలో నెందలూరు సౌమ్యనాధుని, ఒంటిమిట్ట రఘురాముని, కడప వేంకటరమణుని, చాగలమర్రి చెన్నకేశవుని దర్శించుకొన్నారు. తరువాత నవనారసింహ క్షేత్రం అయిన అహోబిలం చేరుకొని శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని ఆనందించారు. ఆ క్షేత్రాన్ని, తీర్ధాన్ని, దైవాన్ని అన్నమయ్య తన కీర్తనలతో స్తుతించాడు. అహోబల మఠ స్థాపనాచార్యుడైన ఆదివణ్ శఠకోపయతులవద్ద అన్నమయ్య సకల వైష్ణవాగమాలను అధ్యయనం చేశాడు. అతని బోధనల ద్వారా పరబ్రహ్మస్వరూపమునర్చించే దివ్యయోగంలో కుల విచక్షణ వంటి అడ్డుగోడలను కూలగొట్టాలని అవగతం చేసుకొన్నాడు. ఇంకా అన్నమయ్య దక్షిణాదిన ఎన్నో వైష్ణవ క్షేత్రాలను దర్శించుకొన్నాడు. అతని కీర్తనలు అంతటా ప్రసిద్ధం కాజొచ్చాయి.

విజయగర రాజ ప్రతినిధి, దండనాధుడు అయిన సాళ్వ నరసింగరాయలు (ఇతడు శ్రీకృష్ణదేవరాయలుకు తాత), టంగుటూరు కేంద్రంగా ఆ సీమ (పొత్తపినాడు) పాలనా వ్యవహారాలు చూస్తుండేవాడు. అతనికి మూరురాయర గండ అనే బిరుదుండేది. అన్నమయ్య కీర్తనలు, అతని ఆశీర్వచన మహాత్మ్యం గురించి విన్న దండనాధుడు తాళ్ళపాకకు వెళ్ళి అన్నమయ్యను దర్శించి అతనితో సాన్నిహిత్యాన్ని పెంచుకొన్నాడు. తరువాత అతను పెనుగొండ ప్రభువయినాక అన్నమయ్యను తన ఆస్థానానికి ఆహ్వానించాడు. రాజ ప్రాపకం వలన అన్నమయ్య సంగీత ప్రభావం కన్నడదేశంలో హరిదాసకూటాలలో ప్రసిద్ధమయ్యింది. తరువాతి కాలంలో ఆ రాజు అన్నమయ్యను తనపై కూడా ఒక్కపదాన్ని వినిపించమని కోరాడట. హరిని కీర్తించే నోట నరుని కీర్తించనని అన్నమయ్య నిరాకరించినందున, కోపించి రాజు అతనిని చెరసాలలో సంకెళ్ళలో ఉంచాడట.

రాజాస్థానం తనకు తగినది కాదని తెలుసుకొని అన్నమయ్య తిరుమల చేరాడు. తన శేషజీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్యారాధనలో, సంకీర్తనా దీక్షలో గడిపాడు. ఈ దశలో బహుశా ఆధ్యాత్మిక సంకీర్తనలు అధికంగా రచించాడు. వేంకటాచలానికి సమీపంలో ఉన్న మరులుంకు అనే అగ్రహారంలో నివసించేవాడు. ఈ సమయంలో రాజ్యంలో కల్లోలాలు చెలరేగాయి. అంతఃకలహాలలో రాజవంశాలు మారాయి. అన్నమయ్య జీవితంపట్ల విరక్తుడై నిత్యసంకీర్తనలతో పొద్దుపుచ్చేవాడు. అతని కీర్తనలలోని ఆశీర్వచన మహాత్మ్యం కథలు కథలుగా వినిన ప్రజలు అతని సంకీర్తనా సేవకు జనం తండోపతండాలుగా రాసాగారు.

ఈ సమయంలోనే పురందర దాసు తిరుమలకు వచ్చాడు. ఇద్దరూ వయోవృద్ధులు. భక్తశ్రేష్టులు. విష్ణుసేవాతత్పరులు. సంగీత కళానిధులు. ఒకరినొకరు ఆదరంతో మన్నించుకొన్నారు. మీ సంకీర్తనలు పరమ మంత్రాలు. వీటిని వింటే చాలు పాపం పటాపంచలౌతుంది. మీరు సాక్షాత్తు వేంకటపతి అవతారమే అని పురందరదాసు అన్నాడట. అప్పుడు అన్నమాచార్యుడు సంధ్య వార్చుకోవడానికి సాక్షాత్తు విఠలునితోనే నీళ్ళు తెప్పించుకొన్న భాగ్యశాలివి. మీ పాటలు కర్ణాటక సంగీతానికే తొలి పాఠాలు. మిమ్ము చూస్తే పాండురంగని దర్శించుకొన్నట్లే అన్నాడట.

ఇతడు శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అని భావన ఉంది. పదకవితా పితామహుడు, సంకీరత్నాచార్యుడు, పంచమాగమ సార్వభౌముడు, ద్రవిడాగమ సార్వభౌముడు - ఇవి అన్నమయ్యకు సమకాలీనులు సాదరంగా ఇచ్చిన బిరుద నామాలు. అవసానకాలంలో తన కొడుకు పెద తిరుమలయ్యను పిలచి, ఇంక దినమునకు ఒక్క సంకీర్తనకు తక్కువ కాకుండా శ్రీనివాసునకు వినిపించే బాధ్యతను అతనికి అప్పగించాడట.

పూర్తి అన్నమాచార్య కీర్తనలు :

అన్నమయ్య సంకీర్తనా సేవ సంగీత, సాహిత్య, భక్తి పరిపుష్టం. అధికంగా తెలుగులోనే పాడినా అతను సంస్కృత పదాలను ఉచితమైన విధంగా వాడాడు. కొన్ని వందల కీర్తనలను సంస్కృతంలోనే రచించాడు. కొన్నియెడల తమిళ, కన్నడ పదాలు కూడా చోటు చేసుకొన్నాయి. అతని తెలుగు వ్యావహారిక భాష. మార్గ, దేశి సంగీత విధానాలు రెండూ అతని రచనలలో ఉన్నాయి. అన్నమయ్యకు పూర్వం కృష్ణమాచార్యుల వచనాలవంటివి ఉన్నా గాని అవి అంగాంగి విభాగం లేక, అఖండ గద్య ధారగా, గేయగంధులుగా ఉన్నాయి. శివకవుల పదాలగురించి ప్రస్తావన ఉన్నాగాని అవి లభించడంలేదు. మనకు లభించేవాటిలో అన్నమయ్యవే తొలిసంకీర్తనలు గనుక అతను సంకీర్తనాచార్యుడు, 'పదకవితా పితామహుడు అయ్యాడు.

అన్నమయ్య యోగ వైరాగ్య శృంగార సరణి మొత్తం 32,000 సంకీర్తనలు రచించాడని అతని మనుమడు చిన్నన్న పేర్కొన్నాడు. అతని పుత్రపౌత్రాదులు వీటిని రాగిరేకులమీద వ్రాయించారు. ఆ రేకులను తిరుమలలో సంకీర్తనా భండాగారంలో పొందుపరచారు. అయితే ప్రస్తుతం 12,000 మాత్రమే లభిస్తున్నవి. రేకులమీది అంకెల ప్రకారం కొన్ని రేకులు లభించడంలేదు. (వాటిని కొందరు కరగించుకొని ఉండవచ్చును.)

సంకీర్తనా లక్షణమనే సంస్కృత గ్రంథం కూడా అన్నమయ్య వ్రాశాడట. మంజరీ ద్విపదలో శృంగార మంజరి అనే కావ్యాన్ని రచించాడు. అతడు రచించాడని చెప్పబడే 12 శతకాలలో వేంకటేశ్వర శతకము ఒక్కటి మాత్రమే లభిస్తున్నది. ఇతర ప్రబంధాలు, వేంకటాచల మహాత్మ్యము, సంకీర్తనలక్షణం, ద్విపద రామాయణం వంటి గ్రంథాలు లభించలేదు.
ఐ
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ మాటలలో అన్నమయ్య రచనలు  ఒక సారస్వత క్షీర సముద్రం. కావ్యముల ధర్మమైన బావార్జవంలో, శైలిలో, భావవైవిద్యంలో, రాశిలో అన్నమాచార్యుని రచనను మించినది ఆంధ్ర వాఙ్మయంలో మరొక్కటి లేదు... నగుబాట్లైన ద్విపద, పద కవితలను ఉద్ధరించి ఉన్నత స్థానం కలిగించిన ప్రతిష్ఠ అన్నమాచార్యునిదే

అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. అతని రచనలలో భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారము, వేదాంతము అత్యంత మనోహరంగా, వినసొంపుగా చెప్పబడ్డాయి. సరళమైన మాటలలో ఆధ్యాత్మ సత్యాలను, వేంకటపతి తత్వాన్ని, జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యాన్ని వినిపించాడు. లోకనీతిని, ధర్మాన్ని, విష్ణుతత్వాన్ని కీర్తించాడు. దక్షిణాపధంలో భజన సంప్రదాయానికి అన్నమయ్యే ఆద్యుడు.

పదివేల శేషుల పడగల మయము

పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల 

జలజల రాలీని జాజులు మాయమ్మకు

నీరజాలయమునకు నీరాజనం

రావె పరమానంద రామ గోవింద 

పల్లదపుఁగోరికలపాలు సేయవలెనా

ఉదయాద్రి తెలుపాయె ఉడురాజు కొలువిడె
అదనెరిగి రాడాయెనమ్మా నా విభుడు

అన్నమయ్య వంశం తెలుగు సాహిత్యానికి ఆభరణం. అన్నమయ్య తండ్రి మహాపండితుడు. తల్లి సంగీతకళానిధి. అన్నమయ్య భార్య తిమ్మక్క తెలుగులో తొలి కవయిత్రి. సుభద్రా కళ్యాణం మంజరి ద్విపద కావ్యం రచించింది. ఈమె కుమారుడు నరసింహుడు సంగీత సాహిత్య కళా కోవిదుడని చిన్నన్న వ్రాశాడు (పాడఁజెప్పఁగ వర్ణపద్ధతినీడు, జోడులేఁడని సభ సొచ్చి వాదించి, పరఁగిన ధీశాలి ప్రతివాదదైత్య నరసింహుఁడనఁగల్గె నరసింహగురుఁడు). కవికర్ణ రసాయనం అనే కావ్యాన్ని వ్రాసిన సంకుసాల నృసింహకవి ఇతడేనని కొందరి అభిప్రాయం. నరసింగన్న భార్యలు వాచ్చారమ్మ, అనంతమ్మ. వారి పుత్రులు నారాయణుడు, అప్పలార్య, అన్నలార్య.

తిరుమలాచార్యుడు తండ్రి వలెనే సంకీర్తనా యజ్ఞం నిర్వహించాడు. ఇతని ఆధ్యాత్మ శృంగార సంకీర్తనలతో పాటు మరికొన్ని లఘురచనలు లభించాయి. వెంకటేశ్వర వచనములు, శృంగార దండకము, చక్రవాళ మంజరి, శృంగార వృత్త శతకము, వేంకటేశ్వరోదాహరణము, నీతి సీసశతకము, సుదర్శన రగడ, రేఫఱకార నిర్ణయం, ఆంధ్ర వేదాంతం (భగవద్గీత తెలుగు అనువాదవచవం), శ్రీ వేంకటేశ ప్రభాత స్తవము (ద్విపద), సంకీర్తనా లక్షణ వ్యాఖ్యానం (అలభ్యం) వంటివి రచించాడు. ఇతని భార్య తిరుమలమ్మ. వారి కొడుకులు చిన తిరుమలయ్య, అన్నయ్య, పెదతిరువెంగళ నాథుడు, చినతిరువెంగళనాధుడు (చిన్నయ్య లేదా చిన్నన్న), కోనేటి తిరువేంగళనాధుడు. చినతిరుమలయ్య తన తండ్రి, తాతలవలెనే ఆధ్యాత్మ, శృంగార సంకీర్తనలు రచించాడు. ఇంకా అష్టభాషా దండకం, సంకీర్తన లక్షణం (తండ్రి, తాతల సంస్కృత రచనలకు అనువాదం) వ్రాశాడు.

చినతిరుమలయ్య, అతని భార్య పెదమంగమ్మల కొడుకు తిరువేంగళప్ప అమరుక కావ్యానువాదము, అమరకోశానికి బాల ప్రబోధిక వ్యాఖ్య, ముమ్మటుని కావ్య ప్రకాశికకు సుధానిధి వ్యాఖ్య, రామచంద్రోపాఖ్యానం (అలభ్యం) వంటి రచనలు చేశాడు. పెద తిరుమలయ్య కొడుకు చిన్నన్న జనుల మన్ననలు పొందిన పరమ భక్తుడు, మహాగాయకుడు, భజన సంప్రదాయ ప్రచారకుడు, ద్విపద కవితకు విశేషంగా ప్రచారాన్ని కలిగించాడు. ఇతడు రచించిన అన్నమాచార్యుని జీవిత చరిత్రయే మనకు అన్నమయ్య జీవితానికి సంబంధించిన ప్రధాన ఆధార గ్రంథము. అంతే గాక ఇతడు పరమయోగి విలాసము, అష్టమహిషీ కళ్యాణము, ఉషా పరిణయము అనే ద్విపద కావ్యాలను రచించాడు. అన్నమయ్య, అక్కలమ్మల కుమార్తె తిరుమలాంబను తిరుమల కొండయార్యునికిచ్చి పెళ్ళి చేశారు. వారి కొడుకు రేవణూరి వెంకటాచార్యుడు శకుంతలా పరిణయము, శ్రీపాదరేణు మహాత్మ్యము.

ఇలా తాళ్ళపాక కవులు తెలుగు భాషకు, ప్రత్యేకించి పదకవితకు, ద్విపద కవితకు ఎనలేని సంపదను ఒనగూర్చారు. చిన్నన్న ద్విపద కరగును, పన్నుగ పెద తిరుమలయ్య పదమునకెరగున్, మిన్నంది మొరసె నరసింగన్న పద్య గద్య శ్రేణిన్ అని తెనాలి రామకృష్ణుని చాటువు.

అన్నమయ్య యొక్క విస్తృత పద సంపదను ఉపయోగించుకొని ప్రజలలో వేంకటేశ్వరుని మధురభక్తిని, శరణాగతిని ప్రోత్సహించడానికి అన్నమాచార్య ప్రాజెక్టు స్థాపించబడింది. అన్నమాచార్య ప్రాజెక్టులో సంగీతం, పరిశోధన, ప్రచురణ, రికార్డింగ్‌ అనే మూడు భాగాలున్నాయి. యువకళాకారులను తయారు చేసే దిశగా సంగీత విభాగం పనిచేస్తుంది. పరిశోధన, ప్రచురణ విభాగంలో భాగంగా అన్నమాచార్య సంకీర్తనల మీద, అన్నమాచార్యుల జీవిత చరిత్ర మీద పరిశోధన చేసేవారికి ప్రోత్సాహం లభిస్తుంది. రికార్డింగు విభాగం ద్వారా అన్నమయ్య సంకీర్తనలను ఆడియో క్యాసెట్ల రూపంలో తయారుచేసి మార్కెట్టులో అమ్ముతారు. తిరుమల తిరుపతి దేవస్థానము నిర్వహించే ధర్మ ప్రచార పరిషత్ తప్పితే మిగతా ప్రాజెక్టులన్నీ అన్నమాచార్య ప్రాజెక్టు పరిధిలోకి వస్తాయి. అన్నమాచార్య ప్రాజెక్టుతో దగ్గరి అనుబంధాన్ని కలిగి ఉంటాయి. అవి ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, భాగవత ప్రాజెక్టు, వేద రికార్డింగు ప్రాజెక్టు.

అన్నమయ్య ఆరు వందల జయంతి సందర్భంగా తాళ్ళపాకలో 19-5-2008 నుండి 22-05-2008 వరకు వుత్సవాలు జరుగుతున్నాయి.ఈ సందర్భంగా 108 ఆడుగుల విగ్రహాన్ని 108 రోజులలో నిర్మించారు. తి.తి.దే వారు నిర్వహిస్తున్నారు. అన్నమయ్య 12 వ తరము వారు అగర్బ దరిద్రములో కొట్టుమిట్టాడు తున్నారని (చూడుడు ఆంధ్రజ్యోతి తేది 23-05-08), ప్రభుత్వము వారు పించన్లు ఏర్పాటు చెయ్యడానికి వొప్పుకొన్నారు.అన్నమయ్య సాహితీ సంపదను తరతరాల వారికి అందించ డానికి, వారి వంశస్థులను వినియోగించ వచ్చును.

అన్నమయ్య పాటల ద్వారా ప్రసిద్ధులైన కొందరు గాయకులు 

త్యము

తాళ్ళపాక కవులకు సంబంధించిన కొన్ని రచనలు, పరిశోధనా గ్రంథాలు ఇంటర్నెట్ ఆర్చీవులలో లభిస్తున్నాయి.




#Article 29: తాళ్ళపాక తిమ్మక్క (172 words)


తాళ్ళపాక తిమ్మక్క లేదా తాళ్ళపాక తిరుమలమ్మ తొలి తెలుగు కవయిత్రి. వీరు తాళ్ళపాక అన్నమాచార్యుల వారి ఇల్లాలు, మొదటి భార్య. ఈమె నన్నయ భారతము ఆధారముగా 1163 పాదాలతో సుభద్రా కల్యాణము అనే ద్విపద కావ్యము రాసినది.

 ప్రథమాంధ్ర భాషా కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క. మహాకవి, వాగ్గేయకారుడు అయిన అన్నమయ్య ఇల్లాలు తిమ్మక్క అని వేటూరి ప్రభాకరశాస్త్రి గారి నిర్ణయం. ఈమె సుభద్రా కల్యాణం అనే కావ్యాన్ని రచించింది. సుభద్రా కల్యాణానికి ఆధారం నన్నయ భారతమే. నన్నయ ఆది పర్వంలో 135 గద్య పద్యాలలో విజయ విలాసం రచించాడు. అతనిని అనుసరిస్తూ తిమ్మక్క 1163 పాదాల ద్విపద కావ్యాన్ని రచించింది. కడుమంచి తేటపలుకులతో చెప్పిన పాటగా తన కావ్యాన్ని పేర్కొంది. కొన్ని కొన్ని ఘట్టాలలో నన్నయలాగానే మూలాతిక్రమణం చేసింది. అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ - అమర అహోబళంబా వెంకటాద్రి వరుస నాపై కంచి వరదుల గొలిచె-అని తిరుపతి వెంకటేశ్వరులకు అర్జునునిచేత మొక్కులందించింది.

నన్నయ మహాభారతంలో లేని బావా మరదుల హాస్యం తిమ్మక్క సుభద్రా కల్యాణంలో నింపి రచించింది. సుభద్ర పాత్రను సమయోచితంగా తీర్చిదిద్దింది. సుభద్ర చేత ఈడుకు తగిన ఆటలు ఆడించింది. 
చేమకూర వెంకటకవి తన విజయ విలాసంలో తిమ్మక్కను అనుసరించాడు. సుభద్ర అర్జునుని వర్ణించిన సందర్భంలో రచించిన- ఎగుభుజమ్ములవాడు మృగరాజు నడుము నడచి పుచ్చుకొను నెన్నడుము గలవాడు - అన్న తిమ్మక్క రచనను చేమకూర వెంకటకవి - ఎగుభుజములవాడు మృగరాజ మధ్యంబు పుదికి పుచ్చుకొను నెన్నడుమువాడు- అనుసరించాడు. సుభద్రా కల్యాణం స్త్రీలకోసం స్త్రీ రచించిన గ్రంథం అన్న విషయం కావ్యాన్ని చదివితే అర్థమవుతుంది. సుభద్రా కల్యాణాన్ని తిమ్మక్క రచించలేదన్న వాదోపవాదాలు పండితలోకంలో ఉన్నాయి.




#Article 30: మధుబాబు (407 words)


మధుబాబుగా ప్రసిద్ధుడైన వల్లూరు మధుసూదన రావు ప్రముఖ తెలుగు నవలా రచయిత.  ఎక్కువగా పరిశోధనాత్మక (డిటెక్టివ్) నవలలు ప్రచురించాడు. వీరి చాలా నవలలో షాడో కథానాయకుడిగా కనిపిస్తాడు. కొన్ని నవలలలో వాత్సవ్‌ని కూడా కథానాయకుడిగా చేసి రాస్తూ ఉంటారు. ఈయన రచనా శైలిలో ఒక ప్రత్యేకత ఉన్నది, ఏ విషయాన్ని రచయతగా చెప్పారు. దానిని కథ లోని పాత్రలు మాట్లాడుకునేటట్లు చేస్తారు. ఈయన వ్రాసిన జానపద నవలలు కూడా ఇంతే స్థాయిలో చదువరులను ఆకట్టుకున్నాయి.

విజయవాడకు దగ్గరున్న హనుమాన్ జంక్షన్‌కు చెందిన ఈయన 100కి పైగా నవలలను ప్రచురించాడు. ఈయన నవలలు ప్రాచుర్యము పొందడానికి పాత్రలలోని మానవీయత, హాస్యమేనని పాఠకులు భావిస్తారు. ప్రారంభదశలో మధుబాబు నవలలు మద్రాసులోని ఎం.వీ.ఎస్ పబ్లికేషన్స్ ప్రచురించింది. ఆ తరువాత ఈయన మధుబాబు పబ్లికేషన్స్ పేరుతో సొంత ప్రచురణాలయము ప్రారంభించారు. మధుబాబు నవలలు స్వాతి వార పత్రికలో చాలా సంవత్సరాలు వారం వారం ధారావాహికగా ప్రచురించబడ్డాయి. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి వారి నవ్య వీక్లీలో మధుబాబు నవలలు ధారావాహికలుగా ప్రచురించబడుతున్నాయి.

మధుబాబు చాలా కాలం వరకు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేసి ఈమధ్యనే పదవీ విరమణ చేసారు. మెర్కురి ఎంటర్‌టైన్‌మెంట్ అనే చలన చిత్ర నిర్మాణ సంస్థకి ఒక కథను సమకూర్చారు. ఈయన పేరుకున్న ప్రాముఖ్యత దృష్ట్యా మధుబాబును అనుకరిస్తూ మధురబాబు, శ్రీ మధుబాబు వంటి రచయితలు వెలశారు.

మధుబాబు జులై 6, 1948 న కృష్ణా జిల్లా, తోట్లవల్లూరు గ్రామంలో జన్మించాడు. సూర్యనారాయణ రావు, భారతి ఈయన తల్లిదండ్రులు. తండ్రి కరణంగా పనిచేసేవాడు. వీరిది మధ్యతరగతి కుటుంబం. మధుబాబుకు నలుగురు చెల్లెళ్ళు ఉన్నారు. ఏడో తరగతి వరకు తోట్లవల్లూరు లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. చదువు అనుకున్నట్టుగా సాగకపోవడంతో తండ్రి ఈయనను ఎ. కొండూరు మండలం కంభంపాడు గ్రామంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాబాయి దగ్గరకు పంపించాడు. అక్కడ చదువుతున్నప్పుడే నాటకాలమీద, సాహిత్యం మీద ఆసక్తి ఏర్పడ్డాయి. ఎస్. ఎస్. ఎల్. సి కోసం మళ్ళీ స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. తండ్రి స్వతహాగా సాహిత్యాభిమాని. ఆయన ఎక్కువగా శరత్ సాహిత్యం చదివేవాడు. వీరి ఇంట్లో సుమారు 2000 దాకా పుస్తకాలు ఉండేవి. మధుబాబు వీటిలో చాలా పుస్తకాలు చదివాడు. మచిలీపట్నంలో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేశాడు. కానీ ఆ వృత్తిలో ఎదుగుదల ఉండదని మొదట్లో అందులో చేరలేదు.

హైదరాబాదులో దుర్గాబాయి దేశ్‌ముఖ్ స్థాపించిన ఆంధ్ర మహిళా సభ లో అకౌంటెంట్ గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. పగలు ఉద్యోగం చేస్తూ రాత్రి కళాశాలలో చదువుతూ పి. యు. సి, తర్వాత బి. కాం పూర్తి చేశాడు. తన పని చేసే చోటనే ఉన్న గ్రంథాలయంలో చాలా పుస్తకాలు చదివాడు. కొద్దికాలం హైదరబాదు రిజర్వు బ్యాంకులో కాయిన్, నోట్ ఎక్జామినర్ కూడా పనిచేశాడు. అదే సమయంలో నాటకాల మీద ఆసక్తితో చాలా నాటకాల్లో పాల్గొన్నాడు. 

జీవితంలో ఏదో సాధించాలనే తపనతో అనేక ప్రాంతాల్లో పర్యటించడం మొదలుపెట్టాడు. 1972 నాటికి మద్రాసు చేరుకున్నాడు. అక్కడే రచనలు మొదలు పెట్టాడు. తన మొదటి రచన ప్రారంభించక మునుపే ఎం. వి. ఎస్. పబ్లిషర్స్ అనే సంస్థకు వెళ్ళి తన దగ్గర ఒక నవల ఉన్నదనీ ప్రచురిస్తారా అని అడిగాడు. విషయం బాగుంటే ప్రచురిస్తామన్నారు వాళ్ళు. దాని తర్వాత ఆయన కేవలం మూడు రోజుల్లో వాంటెడ్ డెడ్ ఆర్ అలైవ్ అనే నవలను రాసి వారికి ఇచ్చాడు. ఇది 15 సార్లు పునర్ముద్రితమైంది. ఆయన అందుకున్న తొలి పారితోషికం 50 రూపాయలు. ఈయన రచయిత కావడం వెనుక స్నేహితుడు బొర్రా సుబ్బారావు ప్రోత్సాహం ఉంది. ఈయన మధుబాబును మరిన్ని రచనలు చేసేలా ప్రోత్సహించాడు.

నవలలు రాస్తూ దాదాపు ఏడు సంవత్సరాల పాటు మద్రాసులో గడిపి రచయితగా మంచి గుర్తింపు సాధించాడు. తర్వాత 1979 లో స్వస్థలానికి తిరిగి వచ్చి తనకున్న విద్యార్హతలతోనే ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరాడు. తర్వాత ఉద్యోగంలో కొనసాగుతూనే ఖాళీ సమయాల్లో తన రచనా ప్రస్థానం కొనసాగించాడు.




#Article 31: యండమూరి వీరేంద్రనాథ్ (165 words)


యండమూరి వీరేంధ్రనాథ్ ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు. తూర్పు గోదావరి జిల్లా రాజోలులో యండమూరి చక్రపాణి, నరసమాంబ దంపతులకు నవంబరు 14 1948లో జన్మించాడు. ఇతడు తెలుగులో సుప్రసిద్ధ నవలా రచయిత. యండమూరి వ్రాసిన చాలా నవలలు చదివేవారిని ఎంతగానో ప్రభావితం చేసేవి. వాటిలో కొన్ని సినిమాలుగా కూడా వచ్చినాయి.

యందమూరి వీరేంద్రనాథ్ తూర్పు గోదావరి జిల్లా రాజోలులో యండమూరి చక్రపాణి, నరసమాంబ దంపతులకు నవంబరు 14 1948లో జన్మించాడు. తండ్రి ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం చేస్తుండటం వల్ల ఉద్యోగ రీత్యా అనేక ప్రదేశాలు తిరిగాడు. అందువల్ల ఆయన బాల్యం అనేక ప్రాంతాల్లో గడిచింది.
ప్రాథమిక విద్య కాకినాడ, రాజమండ్రి ల లోనూ, ఆరవ తరగతి జమ్మలమడుగు లోనూ, ఏడవ తరగతి అనంతపురం లోనూ, ఎనిమిది, తొమ్మిది తరగతులు ఖమ్మం లోనూ, పదో తరగతి, ఇంటర్మీడియట్ హైదరాబాద్ లోనూ, బి.కాం కాకినాడ లోనూ చదివాడు. 1972లో సీ.ఏ. పట్టా పుచ్చుకున్నాడు.

వృత్తి రీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన యండమూరి ఐదు సంవత్సరాల పాటు స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లో, పది సంవత్సరాల పాటు ఆంధ్రా బ్యాంకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ విభాగానికి అధిపతిగా పనిచేశాడు. పూర్తిస్థాయి రచయితగా మారడం కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు.

ఆయనకు 10-03-1974 లో అనుగీతతో వివాహం జరిగింది. వారి కుమారుడి పేరు ప్రణీత్. 

వివిధ నాటకాలు, నాటికలు, నవలలు, సినిమాల కోసం, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, ఉపన్యాసాలలో ఈయన వ్రాసిన ఈ పంక్తులు, చెప్పిన మాటలు ఈయన శైలి ఏమిటో చెబుతాయి. 




#Article 32: వేమన (1173 words)


చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు వెలుగులోకి వచ్చాయి. పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి, ప్రజల్ని మెప్పించిన కవి వేమన . ఆటవెలదితో అద్భుతమైన కవిత్వము, అనంతమైన విలువ గల సలహాలు, సూచనలు, విలువలు, తెలుగు సంగతులు ఇమిడ్చిన మహానుభావుడు యోగి వేమన.

వేమన పద్యాలలో అతని జీవితానికి సంబంధించిన క్రింది పద్యాలు ముఖ్యంగా ఉదహరిస్తారు. 

నందన సంవత్సరమున పొందుగ కార్తీకమందు బున్నమినాడీ వింధ్యాద్రి సేతువులకును, నందున నొక వీరు డేరుపడెరా వేమా!

ఊరుకొండవీడు వునికి పశ్చిమవీధి; మూగచింతపల్లె మొదటి యిల్లు ఎడ్డిరెడ్డికులము యేమని చెప్పుదు; విశ్వదాభిరామ వినురవేమ!

కాదనడెవ్వరితోడను; వాదాడగబోడు వెర్రివానివిధమునన్ భేదాభేద మెరుంగును; వేదాంత రహస్యములను వేమన నుడువున్ ॥

వేమన జీవితం గురించి (పెద్దగా పరిశోధన జరుగక ముందు) ప్రచారంలో వున్న కథ క్రింద ఇవ్వబడింది.

కొండవీడు పాలించిన కుమారగిరి వేమారెడ్డి కాలంలో ఒక బ్రాహ్మణ యువకుడు భిల్లకన్యను వివాహమాడి అడవిలోని పరుసవేది జలాన్ని సంగ్రహించాడు. ఒక కోమటి మిత్రుడు ఆ బ్రాహ్మణునినుండి పరుసవేదిని కుయుక్తితో తీసుకొని ఆ బ్రాహ్మణుని మరణానికి కారకుడయ్యారు. ఇది తెలిసి రాజు కుమారగిరి వేమారెడ్డి కోమటి సంపదను స్వాధీనం చేసుకొన్నారు. కోమటి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆ హత్యాపాతకం పోవడానికి కోమటి వేమారెడ్డి పలు ధర్మకార్యాలు చేయడమే కాకుండా తన పిల్లలకు ఆ బ్రాహ్మడి పేరూ, కోమటి పేరూ పెట్టారు. అలా అతని కొడుకులు పెదకోమటి వెంకారెడ్డి, రాచవేమారెడ్డి, వేమారెడ్డి. ఈ మూడవ కొడుకే వేమన కవి అయ్యారు.

యవ్వనంలో వేమన వేశ్యాలోలుడై తిరిగేవారు. బంధువులు అతన్ని అసహ్యించుకొనేవారు కాని వదిన మాత్రం చిన్నపిల్లవాడి వలె ఆభిమానించేది. ఒక వేశ్య అతనిని వలలో వేసుకొని, అన్ని నగలు సాధించుకొని, తుదకు అతని వదినగారి ముక్కు బులాకీ తెమ్మని అడిగింది. మంగళసూత్రం వలె ముత్తయిదు చిహ్నమైన బులాకీ ఇవ్వడానికి ముందు వదిన పెట్టిన నియమం వల్ల వేమన తాను తుచ్ఛమైన శారీరక సౌఖ్యాలకోసం వెంపర్లాడుతున్నానని గ్రహించారు. జ్ఞానాన్ని ప్రసాదించిన వదినకు ప్రణమిల్లారు.

తరువాత వ్యవసాయం చేయసాగారు. ఎవరికీ పనికిరాని వెర్రిపుచ్చకాయలు సాగుచేసి కూలిగా ఆ పుచ్చకాయలే ఇస్తానన్నారు. అతిపేదరికంతో బాధపడుతున్న ఒక కుటుంబం అలా పుచ్చకాయలు తీసికెళ్ళి వాటిని తెరచి చూస్తే అందులో మణులున్నాయట. తరువాత ఆ సంపదతో వేమన అన్న భాగ్యవంతుడయ్యారు.

వేమన వదిన నగలను అభిరాముడనే విశ్వబ్రాహ్మణుడు చేసేవారు. ఆ అభిరాముడు ఒక యోగిని సేవించి ఆతని అనుగ్రహానికి పాత్రుడయ్యారు. అయితే చివరి రోజున యుక్తిగా అభిరామయ్యను తమ భవనంలో కట్టడి చేసి, ఆ యోగి అవసాన సమయంలో వేమన వెళ్ళి, బీజాక్షరాలు తన నాలుకపై రాయించుకొన్నారు. తిరిగి వచ్చి అభిరామయ్య కాళ్ళపైబడి క్షమించమని వేడుకొన్నారు. తరువాత అభిరామయ్య పేరు చిరస్థాయిగా ఉండేలా తన పద్యాలలో చెప్పారు. ఆ తరువాత వేమన దేశమంతటా తిరిగి మఠాలు కట్టించారు. తత్వాన్ని బోధించాడు. అందరి యెదుటా యోగి సంప్రదాయంలో మహాసమాధి చెందారు.

ప్రాచుర్యంలో ఉన్న మరో ఇతివృత్తం ప్రకారం వేమన వదిన నగలను అభిరాముడనే విశ్వబ్రాహ్మణుడు చేసేవారు. ఆ అభిరాముడు ఒక యోగిని సేవించి ఆతని అనుగ్రహానికి పాత్రుడయ్యారు. అయితే చివరి రోజున యుక్తిగా అభిరామయ్యను తమ భవనంలో కట్టడి చేసి, ఆ యోగి అవసాన సమయంలో వేమన వెళ్ళి బీజాక్షరాలు తన నాలుకపై రాయించుకొన్నారు. తిరిగి వచ్చి అభిరామయ్య కాళ్ళపైబడి క్షమించమని వేడుకొన్నారు. తరువాత అభిరామయ్య పేరు చిరస్థాయిగా ఉండేలా తన పద్యాలలో చెప్పాడు.

ఈయన యవ్వనంలో వేశ్యాలోలుడిగా జీవించారు. కొంతకాలానికి విరక్తిచెంది, తపస్సు చేసి యోగిగా మారారు. సమాజానికి హితబోధ చేస్తూ వేలాది పద్యాలు చెప్పారు. చివరికి కడప]దేవునికడప] దగ్గరి పామూరుకొండ గుహలో శార్వరి నామ సంవత్సరం శ్రీరామ నవమి నాడు సమాధి చెందారు.

వేమన సమాధి అని ఇప్పటికీ ప్రసిద్ధమైనది కదిరి తాలూకాలోని కటారుపల్లె.

వేమన కాలం గురించీ, జీవితం గురించీ సి.పి. బ్రౌన్, తరువాత మరికొందరు అధ్యయనం చేశారు. వంగూరి సుబ్బారావు, వావిళ్ళ వెంకటేశ్వరశాస్త్రి, బండారు తమ్మయ్య, ఆరుద్ర, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, వేమూరి విశ్వనాధశర్మ, కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, కట్టమంచి రామలింగారెడ్డి వంటి పండితులు, పరిశోధకులు ఈ విషయంపై వివిధ అబిప్రాయాలు తెలిపారు. ఈ పరిశోధనల సారాంశం, వాటి గురించి కొంత ఖండన త్రిపురనేని వెంకటేశ్వరరావు వేమన - పదహారేళ్ళ పరిశోధనలో ఉంది. అతని కాలం గురించి ఏకాభిప్రాయం ఇప్పటివరకూ లభించలేదు. వివిధ పద్యాలలో ఉన్న పాఠాంతరాలు ఈ సమస్యను మరింత జటిలం చేస్తన్నాయి. త్రిపురనేని వెంకటేశ్వరరావు అభిప్రాయం ప్రకారం వేమన జీవితం గురించిన ఊహాచిత్రం ఇలా ఉంది..

వేమన ఒక మోతుబరి రైతుబిడ్డ. ఊరికి పెదకాపులైనందున వారికి ఆన్ని భోగాలు ఉన్నాయి. చిన్నతనంలో తన సావాసగాండ్రకు నాయకునిగా మెలిగారు. మూగచింతల పెదకాపునకు ఆ దేశపు రాజధాని కొండవీడులో కూడా ఒక ఇల్లు (విడిది) ఉంది. పదేండ్ల ప్రాయంలో వేమన చదువుకోసం నగరానికి వెళ్ళాడు. దిట్టలైన గురువులవద్ద చదువుకొన్నాడు. సంస్కృతము, గణితము నేర్చుకొన్నారు. (ఒకటి క్రింద నొక్కటొనర లబ్ధము పెట్టి వరుసగా గుణింప వరుస బెరుగు - geometric progression - తెలుసుకొన్నాడు). పద్దులు వ్రాయగలరు. సాము, కసరత్తులలో ఆసక్తి కలిగియున్నారు. నీతిని తెలిసినవారు. రాగాలలోను, వీణానాదంలోను నేర్పరి. సాహసికుడు. స్వచ్ఛందుడు. బుద్ధిమంతుడు.

కలిమి, కులము కలిగినవాడు, సాహసి, కళాభిమాని, యువకుడు అయిన వేమన పట్టణంలో వేశ్యలింటికి పోవడానికి అలవాటు పడ్డారు (ఇది నాటి సామాజిక నీతికి విరుద్ధం కాదు). కాని అతని సొమ్ములన్నీ కరిగిపోగా అభాసుపాలయ్యుంటారు. చివరకు ఎలాగో తంటాలుపడి, సమస్యను పరిష్కరించి అతనికి వివాహం చేశారు పెద్దలు. సంసారం బాధ్యతగా సాగించాడు కాని కాలంతోపాటు సమస్యలు పెరిగాయి. భార్యపట్ల ఆకర్షణ తగ్గింది. తరిగి పోయిన ఆస్తితో పెదకాపు కొడుకు ఊరిలో మనగలగడం కష్టం అయ్యింది. ఊరు విడచి జమీందారునో, చిన్నపాటిరాజునో ఆశ్రయించి కొలువులో ఉద్యోగం చేసి ఉండవచ్చు. బహుశా పద్దులు, భూమి పన్నులు, తగవుల పరిష్కారం వంటిపనులు అతనికి అప్పగింపబడి ఉండవచ్చును. కాని అతను నిక్కచ్చిగా ధర్మాన్ని వచించడం ఇతర ఉద్యోగులకు, ఒకోమారు ప్రభువుకూ కూడా ఇబ్బంది కలిగించి ఉండవచ్చును. కొలువులో చాలీచాలని జీతం, గంపెడు సంసారం, మరోప్రక్క ఏవగింపు కలిగించే లోకం తీరు - ఇవన్నీ కలిసి ఆ మేధావి, పండితుడు, స్వచ్ఛందుడు అయిన వేమనను తిరుగుబాటుదారుగా చేసి ఉండవచ్చును.

అదే కాలంలో దేశంలో నెలకొన్న కరువులు, పాలకుల అక్రమాలు, ఈతిబాధలు అతని ఆలోచనలకు పదును పెట్టాయి. స్వకార్యాలకు, లోకోపకారానికి ఎలాగైనా స్వర్ణ విద్యను సాధించాలని దీక్ష పూనారు. దాని గురించి మరల మరల ప్రస్తావించారు. అతను ఎందరో యోగులను, గురువులను దర్శించారు. వారు చెప్పిన సాధనలు చేశారు. గురువుల మర్మాన్ని తెలుసుకొన్నారు. ప్రాపంచిక జీవితంలో ఎంత మోసం, కపటం, నాటకం, దంభం వున్నాయో గ్రహించిన వేమన సన్యాసుల బ్రతుకులలో కూడా అవే లక్షణాలున్నాయని తెలుసుకొన్నారు. వారి మోసమును ఎలుగెత్తి ఖండించారు.

వేమన భార్య, కూతురి పెళ్ళి చేసి అల్లుని ప్రాపున సంసారం లాగిస్తున్నది. వేమనను వెనుకకు రమ్మని అల్లునితో రాయబారం పంపింది కాని వేమన తిరస్కరించారు. కులాన్నీ, అధికారాన్నీ, అహంకారాన్నీ, సంపన్నుల దౌష్ట్యాన్నీ నిరసిస్తూ ఊరూరా తిరిగి తత్వాలు చెప్పసాగారు. కొందరు వెర్రివాడని తరిమికొట్టారు. తనను తానే వెర్రి వేమన్న అని అభివర్ణించుకొన్నారు. వేదాంత సారాన్ని తన చిన్న పద్యాలలో పొందుపరచి ఊరూరా ప్రబోధించారు.

ఆత్మ సంస్కారాన్ని, కుల సంస్కారాన్ని, ఆర్థిక సంస్కారాన్ని ప్రబోధించారు. గురువుల కపటత్వాన్ని నిరసించారు. జీవితంలో, తత్వంలో, దాని ఆచరణలో అంతగా సాధన చేసి బోధించినవారు అరుదు. చివరకు (పామూరు గుహలోనో లేక వైఎస్ఆర్ కడప జిల్లా చిట్వేలు మండలం చింతపల్లి వద్దనో మరెక్కడో) మహాసమాధి చెందారు.

వేమన పద్యాలు లోక నీతులు. సామాజిక చైతన్యం వేమన పద్యాల లక్షణం. వేమన సృశించని అంశం లేదు. సమాజంలోని అన్ని సమస్యలు భిన్న కోణాల్లోంచి దర్శించి ఆ దర్శన వైశిష్ట్యాన్ని వేమన తన పద్యాలలో ప్రదర్శించాడు. కుటుంబ వ్యవస్థలోని లోటు పాట్లు, మతం పేరిట జరుగుతున్న దోపిడీలు, విగ్రహారాధనను నిరసించడం, కుహనా గురువులు, దొంగ సన్యాసులు ఒకటేమిటి కనిపించిన ప్రతి సామాజిక అస్థవ్యస్థత మీద వేమన కలం ఝళిపించాడు

పద్యాలన్నీ ఆటవెలది ఛందంలోనే చెప్పాడు. ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో, చక్కటి ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పాడు వేమన. సాధారణంగా మొదటి రెండు పాదాల్లో నీతిని ప్రతిపాదించి, మూడో పాదంలో దానికి తగిన సామ్యం చూపిస్తాడు. ఉదా:

అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను
సజ్జనుండు పలుకు చల్లగాను
కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ.

విద్యలేనివాడు విద్వాంసు చేరువ 
నుండగానె పండితుండు కాడు 
కొలది హంసల కడ కొక్కెర లున్నట్లు 
విశ్వదాభిరామ వినురవేమ! 

కొన్ని పద్యాల్లో ముందే సామ్యం చెప్పి, తరువాత నీతిని చెబుతాడు. ఉదా:

అనగననగరాగ మతిశయించునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ.

నాలుగో పాదం విశ్వదాభిరామ వినుర వేమ అనే మకుటం. ఈ మకుటానికి అర్థంపై కూడా రెండు వాదనలున్నాయి.

బ్రౌను కూడా ఈ రెండో అర్థాన్నే తీసుకుని పద్యాలను ఇంగ్లీషులోకి అనువదించాడు.

ఆ కాలం పరిస్థితులను బట్టి చూస్తే వేమన గొప్ప హేతువాది అని గ్రహింపవచ్చును. సమాజంలో ఎంతో దృఢంగా పాతుకుపోయిన ఆచారాలను, భావాలను అంత నిశితంగా ఎత్తిచూపడానికి చాలా ఆత్మస్థైర్యం, అవగాహన కావాలి.  

పాలకడలిపైన పవ్వళించినవాడు
గొల్ల ఇండ్ల పాలు కోరనేల?
ఎదుటివారి సొమ్ము ఎల్ల వారికి తీపి ... విశ్వ.

కనక మృగము భువిని కద్దులేదనకుండ
తరుణి విడిచిపోయె దాశరధియు
తెలివిలేనివాడు దేవుడెట్లాయెరా? viswa dhabi rama vinura vema

పలుగురాళ్ళు దెచ్చి పరగ గుడులు కట్టి
చెలగి శిలల సేవ జేయనేల?
శిలల సేవ జేయ ఫలమేమికలుగురా? ..విశ్వ.

మాలవానినంటి మరి నీటమునిగితే
కాటికేగునపుడు కాల్చు మాల
అప్పుడంటినంటు ఇప్పుడెందేగెనో? .. విశ్వ.

వేమన పద్యాలు వందల సంవత్సరాల వరకు గ్రంథస్తం కాకుండా కేవలం సామాన్యుల నోటనే నిలిచి ఉన్నాయి. 1731లో ఫాదర్ లెగాక్ తొలిసారిగా వేమన పద్యాలు సేకరించాడని పరిశోధకులు భావిస్తారు. 1816లో ఒక ఫ్రెంచి మిషనరీ, తరువాత ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఎన్నో వేమన పద్యాలను సేకరించారు. తాను వేమనను కనుగొన్నానని బ్రౌన్ దొర సాధికారికంగా ప్రకటించుకొన్నాడు. అతను వందల పద్యాలను సేకరించి వాటిని లాటిన్, ఆంగ్ల భాషలలోకి అనువదించాడు. అలాగే హెన్రీ బ్లూచాంస్ (1897), విలియమ్ హోవర్డ్ కాంబెల్ (1910), జి.యు.పోప్, సి.ఇ.గోవర్ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు వేమనను లోకకవిగా కీర్తించారు.

తెలుగువారిలో వేమన కీర్తిని అజరామరం చేయడానికి కృషి చేసినవాడు కట్టమంచి రామలింగారెడ్డి. రాష్ట్రంలో పలుచోట్ల వేమన జయంతి ఉత్సవాలు, సంఘాలకై రెడ్డి కృషి చేశాడు.

పైన పేర్కొన్న సాహితీ వేత్తల కృషి తరువాత వేమన రచనలకు పండితులనుండి అనన్యమైన గౌరవం లభించసాగింది. కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, సురవరం ప్రతాపరెడ్డి, మల్లంపల్లి సోమశేఖరశర్మ, వేటూరి ప్రభాకరశాస్త్రి వంటివారు వేమనను సంస్కర్తగా ప్రస్తుతించారు. ఆరుద్ర మన వేమన అన్న గ్రంథాన్ని రచించారు. తరువాత ఎందరో యువ కవులు, రచయితలు వేమన గురించి, వేమన రచనల గురించి పరిశోధనలు చేశారు. డా. ఎన్. గోపి, బంగోరె వంటివారు వీరిలో ప్రముఖులు.

కేంద్ర సాహిత్య అకాడమీ వారు ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు చేత వేమన జీవిత చరిత్రను వ్రాయించి 14 భాషల్లోకి అనువదింపజేశారు. ఆంగ్ల, ఐరోపా భాషలన్నింటిలోకి, అన్ని ద్రావిడ భాషలలోకి వేమన పద్యాలు అనువదింపబడ్డాయి. వేమనకు లభించిన ఈ గౌరవం మరే తెలుగు కవికి లభించలేదు. ఐక్య రాజ్య సమితి - యునెస్కో విభాగం వారు ప్రపంచ భాషా కవుల్లో గొప్పవారిని ఎంపిక చేసే సందర్భంలో వేమనను ఎన్నుకొని ఆ రచనలను పలు భాషలలోకి అనువదింపజేశారు.




#Article 33: మహాభాగవతం (626 words)


ఇది భాగవత పురాణాన్ని గురించిన సాధారణ వ్యాసం
 తెలుగులో పోతన రచించిన గ్రంథాన్ని గురించి ప్రత్యేకంగా శ్రీమదాంధ్ర భాగవతం అనే వ్యాసంలో వ్రాయండి.

భాగవతం లేదా భాగవత పురాణం లేదా శ్రీమద్భాగవతం (Bhagavata Purana or Bhāgavatam) హిందూ మత సంప్రదాయంలోనూ, సాహిత్యంలోనూ, ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణము. ఇది భగవంతుని కథ గాను, భగవంతునికి శరణాగతులైన భక్తుల కథగాను భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాథ. ప్రధానంగా విష్ణువు, కృష్ణుడు, ఇతర భగవదవతారాలు గురించి ఈ గ్రంథంలో చెప్పబడ్డాయి.
 
ఋషుల కోరికపై సూతుడు తాను శుక మహర్షి ద్వారా విన్న ఈ భాగవత కథను వారికి చెప్పినట్లుగాను, దానిని వేద వ్యాసుడు గ్రంథస్తం చేసినట్లుగాను ఈ కథ చెప్పబడింది. భాగవతంలో వివిధ భాగాలను స్కంధాలు అంటారు. వివిధ స్కంధాలలో భగవంతుని అవతార కార్యాల వర్ణనలు, భక్తుల గాథలు, పెక్కు తత్వ బోధలు, ఆరాధనా విధానాలు, ఆధ్యాత్మికమైన సంవాదాలు పొందుపరచబడినాయి. భగవంతుని లీలలు సవివరంగా వర్ణింపబడ్డాయి. అతని ౨౧ (21) అవతారాలు వర్ణింపబడ్డాయి. వైష్ణవులందరికీ ఇది పరమ పవిత్రమైన గ్రంథము. ఇది మొత్తము ద్వాదశ (12) స్కంధములుగా విభజించబడింది. 

వేదాంత పరంగా భాగవతం ప్రాముఖ్యత భాగవతంలోనే క్రింది శ్లోకంలో చెప్పబడింది.

సర్వ వేదాంత సారం హి శ్రీ భాగవతమీస్యతే
తద్రసామృత తృప్తస్య నాన్యత్ర స్యాద్రతి క్వచిత్

శ్రీమద్భాగవతం సకల వేదాంత సారంగా చెప్పబడింది. భాగవత రసామృతాన్ని పానం చేసినవారికి మరే ఇతరములు రుచించవు (12.13.15) 
వైష్ణవ సిద్ధాంతాలలో వేదాంత సూత్రాలకు భాగవత పురాణమే సహజమైన వ్యాఖ్యగా పరిగణింపబడుతున్నది. పురాణాలలో ఇది ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది.

భాగవతం ప్రాముఖ్యత గురించి ఏల్చూరి మురళీధరరావు ఇలా వ్రాశాడు - అష్టాదశ మహాపురాణాలను ప్రస్తావించిన దేవీభాగవతంలోని శ్లోకంలో భాగవతం ఉపపురాణంగా చెప్పబడింది. అప్పటిలో (దేవీభాగవతం 12వ శతాబ్దంలో రచింపబడిందని ఒక అభిప్రాయం) శాక్తేయమతానికి ప్రాధాన్యత కల్పించే ప్రయత్నంలో ఇలా వ్రాయబడి ఉండవచ్చునని ఒక అభిప్రాయం ఉంది. లోకంలో మహాభాగవతానికి ఉన్న ప్రసిద్ధి సామాన్యమైనది కాదు. ఈ మహా గ్రంథం ఆసేతుశీతాచల వ్యాప్త పండిత మండలీ కంఠస్థగిత విపుల మణిహారమై, నానా మత ప్రస్థాన సిద్ధాంతావిరుద్ధ ప్రమాణ తర్క సాధనోపాలంభ పూర్వక దుర్విగాహ భక్తి స్వరూప నిరూపణ ఫల వ్యాచి ఖ్యాసువులకు ఆలవాలమై, గీర్వాణ వాణీ తరుణారుణ చరణారవింద మరందాస్వాదలోల హృన్మత్త మిళింద చక్రవర్తులచే బహుభాషలలోనికి అనూదితమై, మోక్షాభిలాషుల మనస్సులలో భద్రముద్రాంకితమై, నిజానికి పురాణమంటే ఇదేనన్నంత అవిరళమైన ప్రచారాన్ని గడించింది. .. ఆధ్యాత్మిక శిఖరాల నధిరోహించిన ఈ ఉద్గ్రంథం భారతదేశంలోని సారస్వతేయుల మహాప్రతిభకు ప్రధమోదాహరణమై శాశ్వతంగా నిలిచి ఉంటుంది. 

చారిత్రికంగా భాగవతం 9వ, 10వ శతాబ్దాల సమయంలో, భక్తి మార్గం ప్రబలమైన సమయంలో, రూపు దిద్దుకొన్నదని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. కాని హిందూ మత సంప్రదాయాలలోని విశ్వాసం ప్రకారం కలియుగారంభంలో వేద వ్యాసునిచే రచింపబడినదని చెబుతారు.

కొందరి వాదనల ప్రకారం వేదాలలో సరస్వతీ నదిని ఒక మహానదిగా ప్రస్తావించినందున ఈ రచన చాలా పురాతనమైనది అయ్యుండాలి. 
 ఎందుకంటే సరస్వతీ నది సుమారు క్రీస్తు పూర్వం 2000 సమయంలో కనుమరుగయ్యింది.

భాగవత పురాణము సంభాషణల రూపంలో రచించబడింది. పరీక్షన్మహారాజు ( పాండవ మద్యముడైన అర్జునుని మనుమడు) ఒక బ్రాహ్మణునిచే శాపగ్రస్తుడై ఏడు దినములలోపు మరణిస్తాడని తెలిసి తన రాజ్య విధులన్నీ పక్కనబెట్టి ప్రతీ జీవి యొక్క అంతిమ లక్ష్యాన్ని తెలియగోరాడు. అదే సమయంలోనే తను సంపాదించిన అపార జ్ఞాన సంపదను ఎవరికి బోధించాలో తెలియక, ఒక మంచి శిష్యుని కోసం వెతుకుతున్న శుకుడు అనే ముని రాజుకు తారసపడి ఆ రాజుకు బోధించడానికి అంగీకరిస్తాడు. ఈ సంభాషణ ఎడతెరిపిలేకుండా ఏడు రోజులపాటు కొనసాగింది. ఈ వారం రోజుల సమయంలో రాజుకు నిద్రాహారాలు లేవు. ఒక జీవి యొక్క అంతిమ లక్ష్యం, నిత్య సత్యమైన భగవంతుడు శ్రీకృష్ణుడు గురించి తెలుసుకోవడమేనని వివరిస్తాడు.

పురాణాలలో వర్ణించవలసిన విషయాలను క్రీ..శ. 6వ శతాబ్దిలో అమర సింహుడు తన నామతింగానుశాసనంలో ఇలా చెప్పాడు.

వ్యాస భాగవతంలో పది మహాపురాణ లక్షణాలున్నాయి:

(1) సర్గము (2) విసర్గము (3) వృత్తి (4) రక్షణము (5) మన్వంతరము (6) వంశము (7) వంశానుచరిత (8) నిరోధము (9) హేతువు (10) అపాశ్రయం.

ఈ లక్షణాలన్నీ భాగవతంలో ఉండడం వల్లనే అది మహాపురాణంగా ప్రసిద్ధమైనది.

భాగవతంలోని వివిధ స్కంధాలలో ఉన్న ముఖ్య విషయాలు సంక్షిప్తంగా క్రింద తెలుపబడ్డాయి. (మరింత విపులమైన వివరాలకోసం ఆయా స్కంధాల గురించిన ప్రత్యేక వ్యాసాలు చూడండి)

ఆధునిక కాలంలో శాస్త్రీయ విజ్ఞాన పరిశోధనల ద్వారా తరచి చూస్తున్న కొన్ని విషయాలు భాగవతంలో అప్పటి సిద్ధాంతాల ప్రకారం ప్రస్తావించబడ్డాయి. మూడవ స్కంధం (11వ అధ్యాయం) లో సమయ విభాగం గురించి చెప్పబడింది. అందులో సూక్ష్మకాలం పరమాణు ప్రక్రియలకు పట్టే కాల పరిమాణం రేంజిలో ఉంది. స్థూల కాలం విశ్వం వయస్సుగా చెప్పబడే కాలం రేంజిలో ఉంది.

అలాగే 9వ స్కంధంలో తన కకుద్ముడు అనే రాజు తన కుమార్తె రేవతిని బ్రహ్మ లోకానికి తీసికొని వెళ్ళి, కొద్ది సమయం (నిముషాలు, గంటలు?) బ్రహ్మను దర్శించి తిరిగి భూలోకానికి తిరిగి వచ్చే సరిగి భూలోకంలో ఎన్నో వేల సంవత్సరాలు గతించాయి. ఈ సంఘటన ఆధునిక సాపేక్ష సిద్ధాంతంలో చెప్పబడే కాలం వ్యవధి కుంచించుకుపోవడం లేదా పెరగడం () అనే విషయానికి సారూప్యతను కలిగి ఉంది.

భగవంతుని దివ్య స్వరూపం భాగవతంలో ఒకచోట ఇలా వర్ణించబడింది.

భాగవతంలో విష్ణువు యొక్క 25 అవతారాల లీలలు వర్ణించబడ్డాయి.

యమునా నది తీరాన బృందావనంలో కృష్ణుని బాల్య లీలలు భాగవతంలో విపులంగా వర్ణించబడ్డాయి. వెన్నదొంగగా, గోపాల బాలకునిగా, గోపీజన మానస చోరునిగా, నందగోకుల సంరక్షకునిగా బాలకృష్ణుని చేష్టలు, తల్లికి తన నోట సకల భువనాలు చూపిన లోకాధినాధుని స్వరూపము, గోవర్ధన గిరిధారిగా కొండనెత్తిన వాని మహిమ - ఇవన్నీ శ్రీకృష్ణావతారం కథలో ముఖ్యమైన విశేషాలు. కృష్ణుడు తమనుండి దూరమైనపుడు గోపికలు పడే వేదన భక్తి భావానికి సంకేతంగా వర్ణిస్తారు.

ఇవి కాకుండా తెలుగులో భాగవతానికి, సంబంధిత పురాణాలకు సంబంధించిన పెక్కు రచనలు సంప్రదాయ సాహితయంలోను, ఆధునిక సాహిత్యంలోను, జానపద సాహిత్యంలోను ప్రముఖ స్థానం వహిస్తున్నాయి. వాటిలో కొన్ని 




#Article 34: భాగవతం - ఒకటవ స్కంధము (192 words)


భాగవతము ఋషుల ప్రశ్నలతో మొదలవుతుంది. తరువాత భాగవతము లోని వివిధ అవతారములను గురించి వివరించారు. అటు పిమ్మట భాగవతము ఎలా మొదలైనదో వివరింపబడింది. వేదాలు విభజించి, మహాభారతం రచించి, 17 (17) పురాణాలు రాసి కూడా వ్యాసభగవానునికి మనశ్శాంతి లేకుండా పోయింది. అప్పుడు వారి ఆధ్యాత్మిక గురువు గారు అయిన నారద మహర్షి విచ్చేసిభాగవతము రాయమని ఉపదేశించి, అనేక విషయాలు బోధించి వెళతారు. అప్పుడు వ్యాసులవారు ఈ భాగవతము రాస్తారు.

తరువాత ఈ భాగవతాన్ని ఎలా ప్రచారములోనికి తెచ్చినారో వివరింపబడింది. మహాభారతము ముగియడము, పరిక్షిత్తు మినహా అందరూ పరమ పదము చేరుకోవడము, భీష్ముని నిర్యాణము, శ్రీ కృష్ణ భగవానుని ద్వారకా ప్రయాణము, ద్వారకలో వారు ప్రవేశించడము, పరిక్షిత్తు జననము, దృతరాష్ట్రుడు అడవులకి వెళ్ళడము, శ్రీ కృష్ణ నిర్యాణము, పాండవులు రాజ్యాన్ని వదిలి వెళ్ళడము, పరిక్షిత్తు, కలి సంవాదము, పరిక్షిత్తు కలి పురుషుడుని దండించడము, దయచూపడము, పరిక్షిత్తుకి బ్రాహ్మణ బాలుడు శాపాన్ని ఒసగడము, శుకదేవ మహర్షి ఆగమనము, పరిక్షిత్తు వారిని ప్రశ్నలు అడగటము అనే వివరములు ఈ ప్రథమ స్కంధములో గలవు .

కురుక్షేత్రం అయిపోయిన రోజు రాత్రి పాండవ శి బిరంలో అందరూ నిద్రిస్తుండగా, అశ్వత్థామ వీరావేశంతో వచ్చినిద్రిస్తున్న ఉప పాండవులను హాతమార్చెను. పాండవులు చంపబడ్డారన్న వార్త తెలుసుకున్న అర్జునుడు వీరావేశంతో వీరిని చంపిన వాడిని తీసుకువచ్చి నీ పాదాల వద్ద పడివేస్తానని ద్రౌపదితో శపథం చేసి, కురుక్షేత్రంకి వచ్చి అక్కడ ఉన్న భటుల ద్వారా చంపినవాడు అశ్వత్థామ అని తెలుసుకొని, వాడితో యుద్ధము చేసెను.
సవ్యసాచి ప్రతిభ ముందు తాళలేక అశ్వత్థామ బ్రహ్మశిరోనామాస్త్రం ప్రయోగించగా, ఆ అస్త్రం లోకాలన్నిటిని కమ్మేస్తుండగ అది చూసిన కృష్ణుడు అర్జునుడిని కూడా బ్రహ్మశిరోనామాస్త్రాన్ని ప్రయోగించమనగా, అర్జునుడు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించినాడు. పిమ్మట రెండు బ్రహ్మశిరోనామాస్త్రలను కూడా ఉపసంహరించి, అశ్వత్థామను కట్టి ద్రౌపది ఎదుట నిలబెట్టగా.




#Article 35: భాగవతం - పన్నెండవ స్కంధము (544 words)


ద్వాదశ స్కంధము చివరి స్కంధము, కాని ఇక్కడ మంచి ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.

శుకయోగి పరిక్షిత్తునకు భావికాలగతులను చెప్పుట, యుగధర్మ ప్రాకృతాది ప్రళయచతుష్టయ వివేచనము, పరిక్షిత్తు మృతిచెందుట, జనమేజయుడు సర్ప యాగము చేయుట, వేద వ్యాసుడు పురాణములు, వేదములు ప్రచారము చేయుట, మార్కండేయోపఖ్యానము, చైత్రాది మాసంబుల సంచెరించెడు ద్వాదశాదిత్యుల క్రమంము తెలుపుటతో భాగవతము ముగుస్తుంది.

బృహద్రధుడు అనే రాజుకు పురంజయుడు పుడతాడు. అతనికి శునకుడనే అమాత్యుడుంటారు. అతడు పురంజయుని సంహరించి తానే గద్దెనెక్కి రాజ్యం పరిపాలిస్తుంటాడు. అతనికి కొంతకాలానికి ఒక కొడుకు పుడతాడు. వాడికి ప్రద్యోతుడని పేరు పెట్టి రాజ్యం కట్టబెడతాడు.

ప్రద్యోతునికి విశాఖరూపుడు, అతనికి నందివర్దనుడు పుడతాడు. ఈ రాజు లైదుగురు నూటముప్పైయ్యెనిమిది సంవత్సరాలు భూమిని పరిపాలించి వృద్ది చెందుతారు. ఆ తరువాత శిశునాగుడు అనే రాజు జన్మిస్తాడు. అతనికి కాకవర్ణుడు కొడుకవుతాడు. ఆ కాకవర్ణుని కొడుకు క్షేమవర్ణుడు.

క్షేమవర్ణ మహారాజుకు క్షేత్రఙ్నుడు పుత్రుడు. అతనికి విధిసారుడు, అతనికి అజాతశత్రువు, అతనికి దర్బకుడు, అతనికి అజయుడు, అతనికి నందివర్దనుడు, అతనికి మహానంది ఉదయిస్తారు. శిశునాగులు అన్న పేరుతో ప్రసిద్దులయిన యీ పదిమంది మహారాజులు కలికాలంలో మూడు వందల అరవైయేళ్ళు అవిచ్ఛిన్నంగా అవనీ పాలన చేస్తారు.

ఆ పిమ్మట మహానందికి శూద్రవనిత కడుపున మహాపద్ముడు పుడతాడు. అతడు మహాబలవంతు డవుతాడు. అయినప్పటికీ, అతనితో క్షత్రియ వంశం అంతరించిపోతుంది. ఆ సమయంలో రాజులు శూద్రప్రాయులైపోతారు;ధర్మహీనులైపోతారు. మహాపద్మునికి సుమాల్యుడు మొదలైన తనయులు ఎనమండుగురు కలుగుతారు. వంద సంవత్సరాల పాటు వారి పరిపలన సాగుతుంది. ఆ పిమ్మట కార్ముకుడు మొదలయిన రాజులు తొమ్మండుగురు పుడతారు. వారికి నవనందు లని వ్యవహారము. ఆ నవనందులకు ఒక అవనీసుర శ్రేష్టుడు అంతరింపజేస్తాడు. నందులు లేకపోవడంచేత కొంతకాలంపాటు మౌర్యులు పరిపాలన చేస్తారు.

ముందు చెప్పిన అవనీసురశ్రేష్టుడు చంద్రగుప్తునికి అభిషేకం చేసి రాజ్యాన్ని అప్పగిస్తాడు. ఆ చంద్రగుప్తునికి వారిసారుడు ఆవిర్బవిస్తాడు. క్రమంగా వారిసారుని కొడుకు అశోకవర్దనుడు, అతని తనయుడు సుయశస్సు, వాని సుతుడు సంయుతుడు, అతని నందనుడు శాలిశూకుడు, వాని పుత్రుడు సోమశర్ముడు, వాని తనూభవుడు శతధన్వుడు, వాని కొమరుడు బృహద్రథుడు వరుసగా రాజు లవుతారు.

మౌర్యునితో కలసి ఆ పదిమంది రాజులు మొత్తం మేద నూటముప్పయ్యేడు సంవత్సరాలు నిరాఘాటంగా రాజ్యపాలన చేస్తారు.

ఆ సమయములో బృహద్రథుని సైన్యాధినేత శుంగవంశజుడయిన పుష్యమిత్రుడు అతనిని చంపి రాజ్యాన్ని అపహరిస్తాడు. అతనికి అగ్నిమిత్రుడు పుట్టి రాజవుతాడు, అతని తరువాత సుజ్యేష్టుడు, వసుమిత్రుడు, భద్రకుడు, పుళిందుడు, ఘోషుడు, వజ్రమిత్రుడు, భాగవతుడు, దేవభూతి వరసగా తమ తండ్రినుంచి సంక్రమించిన రాజ్యాన్ని తాము గ్రహించి పరిపాలిస్తారు. పైని చెప్పిన పదిమంది శుంగులు నూటపన్నెండు సంవత్సరాలు రాచరికం నిలుపుకుంటారు. శుంగవంశజులలో చివరివా డయిన దేవభూతిని కణ్వమంత్రి అయిన వసుదేవుడు వధించి తానే రాజ్యాధిపతి అవుతాడు. అతనికి భూమిత్రుడనే పుత్రుడు కలుగుతాడు. ఆ మహానుభావునికి నారాయణుడనే కొడుకుపుడతాడు. కణ్వ వంశస్తులు మొత్తంమీద మూడువందల నలభైఅయిదు సంవత్సరాలు ప్రభువులై పరిపాలన చేస్తారు.

అటుపిమ్మటి విషయం విను. కణ్వ వంశంలో సుశర్ముడనే రాజు పుడతాడు. కాని, అతనికి బృత్యుడయిన ఆంధ్రజాతీయుడు వృషలుడనేవాడు అతనిని వధిస్తాడు. అధర్మ మార్గంలో సంచరిస్తూ ఆ రాజ్యాన్ని అవక్రవిక్రమంతో పరిపాలిస్తాడు. అతని తరువాత అతని తమ్ముడు కృష్ణుడు రాజవుతాడు. ఆ తరువాత శామ్తకర్ణుడు, పౌర్ణమానుడు, లంబోదరుడు, శిబిలకుడు, మేఘస్వాతి, దండమానుడు, హాలేయుడైన అరిష్టకర్మ, తిలకుడు, పురీష సేతుడు, సునందనుడు, వృకుడు, జటావుడు, శివస్వాతి, అరిందముడు, గోమతి, పురీమంతుడు, దేవశీర్షుడు, శివస్కందుడు, యఙ్నశీలుడు, శ్రుతస్కందుడు, యఙ్నశత్రుడు, విజయుడు, చంద్రబీజుడు, సులోమధి అనే రాజులు పైతృకంగా వచ్చిన రాజ్యసంపదను క్రమంగా అనుభవిస్తారు. వారందరూ పరిపాలించిన కాలం నాలుగు వందలయేభై ఆరు సంవత్సరాలు.

ఆ తరువాత నాభీరవంశంజులేడుగురు, గర్దభవంశజులు పదిమంది, కంకవంశజులు పదహారుగురు భూభారాన్ని ధరించి పరిపాలిస్తారు.

ఆ తరువాత ఎనిమిది మంది యవనులు, పదునలుగురు బర్బరులు ప్రభువులవుతారు.

ఆ పిమ్మట గురుండులు పదముగ్గురు, మౌనులు పదకొండుమంది గర్వంతో కన్నూ మిన్నూ కానకుండా పందొమ్మిదివందల తొమ్మిది సంవత్సరాలు పరిపాలన సాగిస్తారు. ఆ పిమ్మట మౌనవంశంలో పుట్టిన పదకొండుమంది మూడు వందల సంవత్సరాల పాటు మత్సరగ్రస్తులై పరిపాలన సాగిస్తారు. అదే సమయంలో కైలికిలులు అనే యవనులు అవనీపాలకులవుతారు. ఆ తరువాత భూతనందుడు, నవభంగిరుడు, శిశునందుడు, అతని తమ్ముడయిన యశోనందుడు, ప్రవీరకుడు అనేవారు వీరులై నూటారు సంవత్సరాలు పాలకు లవుతారు. ఆ రాజులకు పదముగ్గురు కొడుకులు పుడతారు. వారిలో ఆరుగురు బాహ్లికదేశానికి అధిపతులవుతారు. మిగిలిన యేడుగురు కోసలదేశానికి అధిపతులవుతారు.

అప్పుడు వైడూర్యపతులు నిషధదేశానికి అదీశ్వరు లవుతారు. పురంజయుడు మగధదేశప్రభువుగా ప్రభవిస్తాఉ. పుళిందులూ, యుదువంశస్థులూ, మద్రదేశీయులూ అయిన హీనజాతి జనులు బ్రహ్మ ఙ్నానహీనులూ, హరిభక్తివిహీనులూ కాగా వారికి ధర్మాన్ని ఉపదేశించి నారాయణుని పట్ల భక్తి తాత్పర్యం కలుగజేస్తాడు. శక్తి శౌర్యసమన్వితు లయిన క్షత్రియుల నుంచి ప్రయోగ వరకు గల భూమిని పరిపాలిస్తాడు.

శూద్ర ప్రాయులైన రాజులు, వ్రాత్యులునాస్తికులు అయిన బ్రాహ్మణులు సౌరాష్ట్రమూ, అవంతీ, అభీరమూ, అర్బుదమూ, మాళవమూ అనే దేశాలకు అధిపతు లవుతారు. సింధుతీరంలోనూ, చంద్రభగ పరిసరాలలోనూ, కాశ్మీరదేశంలోనూ మ్లేచ్చాకారు లయిన రాజులు పరిపాలన చేస్తారు. వారికి తెలివితేటలుండవు; ధర్మమూ, సత్యమూ, దయాఉండవు. క్రోధమాత్సర్యాలతో పెచ్చరిల్లి స్త్రీలనూ, బాలకులనూ, గోవులనూ, బ్రాహ్మణులనూ వధించడానికి వెనుదీయరు. పరధనాసక్తి అల్పాయువులూ, అల్పబలులూ అవుతారు. శ్రీ విష్ణు పాదపద్మమకరందంలోని రుచి వారికి తెలియదు. ఒకరి పట్ల ఒకరు వైరం పెంచుకొని యుద్ధాలకు సిద్దపడి ప్రాణాలు కోల్పోతారు. ఆ సమయంలో ప్రజలు కూడా వారి వేషభాషలనూ, శీలవృత్తులనూ అనుసరిస్తారు.




#Article 36: నరసింహావతారము (950 words)


శ్రీనారసింహుడు, నరసింహావతారము, నృసింహావతారము, నరహరి, నరసింహమూర్తి, నరసింహుడు (Nrisimha, Narasimha, Narahari incarnation)- ఇవన్నీ శ్రీమహావిష్ణువు నాల్గవ అవతారమును వర్ణించే నామములు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఈ దశావతారాలలో నాలుగవ అవతారము నారసింహావతారము. మహాలక్ష్మిని సంబోధించే శ్రీ పదాన్ని చేర్చి శ్రీనారసింహుడని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు.

స్వామి ప్రార్థనలలోని శ్రీ జగద్గురు ఆదిశంకరాఛచార్యుల వారి శ్లోకం:

ప్రార్థన శ్లోకం:

విష్ణువు ప్రతి అవతారానికీ ఒక ప్రత్యేకత ఉంది. అలాగే నరసింహావతారములో కొన్ని ప్రత్యేకతలను గమనించవచ్చును.

ఇంక ఈ అవతారాన్ని స్మరించడంలో తెలుగువారికి మరికొన్ని విశేషమైన వనరులు ఉన్నాయనవచ్చును.

జయ విజయులు వైకుంఠంలో ద్వారపాలకులు. విష్ణుసేవా తత్పరులు. ఒకమారు సనకసనందనాది మునులు నారాయణ దర్శనార్ధమై వైకుంఠమునకు రాగా అది తగు సమయము కాదని ద్వారపాలకులు వారిని అడ్డగించారు. అందుకు మునులు కోపించి, విష్ణులోకానికి దూరమయ్యెదరని శపించారు. అప్పుడు వారు శ్రీ మహా విష్ణుఫును శరణు వేడగా, మహర్షుల శాపమునకు తిరుగులేదు. కానీ మీరు నా భక్తులైనందువలన మీకు కొంత శాప విమోచన కలిగిస్తాను. మీరు నా భక్తులుగా 7 జన్మలు గానీ, విరోధులుగా 3 జన్మలుగానీ భూలోకమున జన్మించిన పిమ్మట మరల వైకుంఠానికి వస్తారని ఉపశమనాన్నిచ్చారు. అప్పుడు వారు మీకు దూరంగా 7 జన్మలు ఉండలేమని, విరోధులుగా 3 జన్మలు ఎత్తుతామని పలికెను.

ఆ జయవిజయులే కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగాను, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగాను, ద్వాపరయుగంలో శిశుపాల దంతవక్తృలుగాను జన్మించారు. ప్రతి జన్మలోను విష్ణువు అవతారంచేత వధులై అనంతరం శాపవిముక్తి పొందారు.

కశ్యప ప్రజాపతి భార్యయైన దితి గర్భాన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులనే మహావీరులు జన్మించారు. హిరణ్యాక్షుడు బలగర్వితుడై దేవతలను యద్ధంలో ఓడిస్తూ అందరినీ భయభీతులను చేశాడు. పాతాళాంతర్గతయైన భూదేవిని శ్రీవరాహమూర్తి అవతారంలో ఉద్ధరిస్తున్న శ్రీమహావిష్ణువును యుద్ధానికి కవ్వించాడు. అప్పుడు జరిగిన భీకరమైన యద్ధంలో హిరణ్యాక్షుడు మరణించాడు.

సోదరుని మరణానికి చింతిస్తూనే హిరణ్యకశిపుడు తల్లిదండ్రులను, బంధువులను ఓదార్చాడు. అనంతరం రాజ్యపాలనాభారాన్ని మంత్రులకు అప్పగించి తాను మందరగిరికి పోయి ఘోరమైన తపసు ఆచరించాడు. అతని తపస్సు ఉగ్రతకు లోకాలు కంపించాయి. అతని శరీరం కేవలం ఎముకల గూడయ్యింది. బ్రహ్మ ప్రత్యక్షమై తన కమండల జల ప్రోక్షణతో అతని శరీరాన్ని నవయౌవనంగా, వజ్ర సదృశంగా చేశాడు. వరం కోరుకొమ్మన్నాడు. హిరణ్యకశిపుడు విధాతకు మ్రొక్కి, తనకు గాలిలోగాని, ఆకాశంలోగాని, భూమిపైగాని, నీటిలోగాని, అగ్నిలోగాని, రాత్రి గాని, పగలు గాని,దేవదానవమనుష్యులచేగాని, జంతువులచేగాని, ఆయుధములచేగాని, ఇంటగాని, బయటగాని మరణముండరాదని కోరాడు. అలాగే బ్రహ్మ వరాన్ని అనుగ్రహించాడు.

ఇంక వరగర్వంతో హిరణ్య కశిపుడు విజృంభించాడు. దేవతలను జయించాడు. ఇంద్రసింహాసనాన్ని ఆక్రమించాడు.పంచభూతాలను నిర్బంధించాడు. తపసులను భంగ పరచాడు. సాధులను హింసింపసాగాడు. దేవతలు విష్ణువుతో మొరపెట్టుకొనగా విష్ణువు - కన్నకొడుకునకు ఆపన్నత తలపెట్టిననాడు హిరణ్యకశిపుని పట్టి వధింతును. మీకు భద్రమగును - అని వారికి అభయమిచ్చాడు.

హిరణ్యకశిపుడు తపసు చేసుకొనే కాలంలో దేవతలు అదనుచూసుకొని అతనిరాజ్యంపై దండెత్తి కౄరంగా కొల్లగొట్టారు. గర్భవతియైన రాక్షసరాజు భార్యను ఇంద్రుడు చెరపట్టగా నారదుడు ఇంద్రుని మందలించి, ఆమెను రక్షించి తన ఆశ్రమానికి కొనిపోయాడు. ఆశ్రమంలో నారదుడొనర్చిన భాగవత తత్వబోధను గర్భస్థుడైన ప్రహ్లాదుడు గ్రహించాడు. రాజ్యానికి తిరిగివచ్చిన హిరణ్యకశిపునకు నారదుడు అతని ధర్మపత్ని నప్పగించాడు.

ప్రహ్లాదుడు జన్మతః పరమ భాగవతుడు. లలిత మర్యాదుడు. నిర్వైరుడు. అచ్యుతపద శరణాగతుడు. అడుగడుగున మాధవానుచింతనా సుధా మాధుర్యమున మేను మరచువాడు. సర్వభూతములందు సమభావము గలవాడు. సుగుణములరాశి. అట్టి ప్రహ్లాదునకు విద్య నేర్పమని, తమ రాజప్రవృత్తికి అనుగుణంగా మలచమనీ రాక్షసరాజు తమ కులగురువులైన చండామార్కులకప్పగించాడు. 

చదవనివాడజ్ఞుండగు
చదివిన సదసద్వివేక చతురత గలుగున్
చదువగ వలయును జనులకు
చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రీ

అని కొడుకునకు బోధించి గురుకులమునకు పంపాడు. ఈ బాలకునకు చదువుచెప్పి నీతికుశలుని గావించి, రక్షించమని గురువులను ప్రార్థించాడు.గురుకులంలో ప్రహ్లాదుడు గురువులపట్ల వినయంతో వారుచెప్పిన విషయాలను చెప్పినట్లు ఆకళించుకొన్నాడు.

ఒకమారు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చేరబిలచి - నీవు ఏమి నేర్చుకున్నావు? నీకు ఏది భద్రము?- అని ప్రశ్నించగా ప్రహ్లాదుడు సర్వము అతని దివ్యకళామయము అని తలచి విష్ణువు నందు హృదయము లగ్నము చేయట మేలు అని ఉత్తరమిచ్చాడు. రాక్షసులకు తగని ఈ బుద్ధి నీకెలా పుట్టింది? హరీ, గిరీ అని ఎందుకు ప్రేలుతున్నావు? అని తండ్రి గద్దించాడు. ఆందుకు ప్రహ్లాదుడు

విష్ణు భక్తి నాకు దైవయోగం వల్ల సహజంగా సంభవించింది. అని జవాబిచ్చాడు.

కోపించిన రాక్షస రాజుకు సర్దిచెప్పి, మరల వివిధోపాయాలలో బోధన చేస్తామని ప్రహ్లాదుని గురుకులానికి తీసుకొని వెళ్ళారు గురువులు. అక్కడ మళ్ళీ ప్రహ్లాదునికి తమ విద్యలు నూరిపోసి, రాజువద్దకు తిరిగి తీసికొని వెళ్ళారు. రాజు తన కొడుకును ముద్దుచేసి - గురువులే సంవిద్యాంశంబులు జెప్పిరో, విద్యా సారమెరుంగకోరెద, భవదీయోత్కర్షమున్ జూపవే ననుగన్న తండ్రీ -అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు

మరి ఆ మర్మమమేమిటి? తను హృద్భాషలసఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనార్చనముల్, సేవయు, నాత్మలో నెఱుకయున్, సంకీర్తనల్, చింతనంబను నీ తొమ్మిది భక్తిమార్గంబుల సర్వాత్ముడైన హరిన్ నమ్మి సజ్జనుడై యుండుట భద్రము. శ్రీహరి భక్తిలేని బ్రతుకు వ్యర్ధము. విష్ణుని సేవించు దేహమే ప్రయోజనకరము. ఆ దేవదేవుని గూర్చి చెప్పేదే సత్యమైన చదువు. మాధవుని గూర్చి చెప్పేవాడే సరైన గురువు. హరిని చేరుమని చెప్పేవాడే ఉత్తముడైన తండ్రి. - అని వివరించాడు.

హిరణ్య కశిపుడు మండి పడ్డాడు. తన శత్రువైన విష్ణువును కీర్తించినందుకు ప్రహ్లాదుని కఠినంగా శిక్షించమని ఆదేశించాడు. కాని శూలాలతో పొడిచినా, ఏనుగులతో తొక్కించినా, మంటల్లో కాల్చినా, కొండలపైనుండి త్రోయించినా ప్రహ్లాదునకు బాధ కలుగలేదు. అతడు హరినామ స్మరణ మానలేదు. అదిచూసి రాజు చింతాక్రాంతుడయ్యాడు. మరొక అవకాశం అడిగి రాక్షసగురువు ప్రహ్లాదుని గురుకులానికి తీసికొనివెళ్ళారు. అక్కడ ప్రహ్లాదుడు మిగిలిన రాక్షస బాలురకు ఆత్మజ్ఞానాన్ని, హరితత్వాన్ని, మోక్షమార్గాన్ని ఉపదేశించసాగాడు. ఇలా లాభం లేదని గురువు రాజుతో మొరపెట్టుకున్నాడు.

క్రోధంతో హిరణ్య కశిపుడు ప్రహ్లాదుని పిలిపించి - నేనంటే సకల భూతాలు భయపడతాయి. దిక్పాలకులు నా సేవకులు? ఇక నీకు దిక్కెవరు? బలమెవరు? అని గద్దించాడు. అందరికీ ఎవరు బలమో, అందరికీ ఎవరు దిక్కో ఆ విభుడే నాకు దిక్కన్నాడు ప్రహ్లాదుడు.

ఆ హరి ఎక్కడుంటాడు? అని దానవేశ్వరుడు ప్రశ్నించగా

ఇంకా చక్రి సర్వోపగతుడు. ఎందెందు వెదకి జూచిన నందందే గలడు అని చెప్పాడు.

ఇలా దైత్యరాజు, అతని సుతుడు వాదించుకొటుండగా శ్రీహరి సకల జడ,చేతన పదార్ధములలో శ్రీ నరసింహాకృతిలో నుండెను (సర్వాంతర్యామిత్వం)

అయితే ఈ స్తంభమునన్ జూపగలవె చక్రిన్ గిక్రిన్? అని రాజు ప్రశ్నించాడు. బ్రహ్మ నుండి గడ్డిపోచవరకు అన్నింటిలో విశ్వాత్ముడైయుండేవాడు ఈ స్తంభమునందెందుకుండడు? స్తంభాంతర్గతుడై ఉండును. ఏ సందేహములేదు. నేడు గానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్ అన్నాడా పరమ భాగవతుడైన ప్రహ్లాదుడు. సరే. చూద్దాం. ఈ స్తంభంలో విష్ణువును చూపకుంటే నీ తలతీయిస్తాను. అప్పుడు హరి వచ్చి అడ్డుపడతాడా? అని హిరణ్యకశిపుడు చేతితో స్తంభంపై చరిచాడు.

బ్రహ్మాండ కటాహం బ్రద్దలయ్యే ఛటఛట ఫటఫటారావములు ధ్వనించాయి. పదిదిక్కుల నిప్పులు చెదిరాయి. 

ప్రఫుల్ల పద్మయుగళ సంకాశ భాసుర చక్ర చాప హల కులిశాంకుశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండును, చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వ విశ్వంభరాభర ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మ కులశేఖరుండును, దుగ్ధజలధిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభ యుగళుండును, ఘణఘణాయమాన మణికింకిణీ గణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబర కటిప్రదేశుండును, .......... కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును, వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత ఖరతర ముఖ నఖరుండును, ధగధ్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును, సంధ్యారాగ రక్త ధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును, ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయుండును, ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సంయుతుండును, మహాప్రభావుండును నైన శ్రీనృసింహదేవుడు స్తంభమునుండి ఆవిర్భవించాడు.

ఇది నరమూర్తికాదు, కేవల హరిమూర్తియు కాదు. హరిమాయా రచితమై యున్నదను కొన్నాడు హిరణ్య కశిపుడు. అప్పుడు శ్రీ నృసింహదేవుడు భీకరంగా హిరణ్యకశిపుని ఒడిసిపట్టి తనయొడిలో వేసికొని వజ్రాలవంటి తన నఖాలతో (గోళ్లతో)చీల్చి చెండాడాడు.

ఇలా శ్రీహరి (మనిషీ, జంతువూ కాక)నారసింహుని రూపంలో, (పగలూ, రాత్రీ కాని) సంధ్యాకాలంలో, (ప్రాణం ఉన్నవీ లేనివీ అని చెప్పలేని) గోళ్ళతో, (ఇంటా బయటా కాక) గుమ్మంలో, (భూమిపైనా, ఆకాశంలో కాక) తనతొడపైన హిరణ్యకశిపుని సంహరించాడు. బ్రహ్మ వరము వ్యర్ధం కాలేదు. ప్రహ్లాదుని మాట పొల్లు పోలేదు.

స్వామి ముఖం భీకరంగా కనపిస్తోంది. రక్తరంజితమైన వజ్రనఖాలు సంధ్యాకాలపు ఎర్రదనాన్ని సంతరించుకొన్నాయి. ప్రేవులను కంఠమాలికలుగా వేసుకొన్నాడు. జూలునుండి రక్తం కారుతోంది. ఆయన నిట్టూర్పులు పెనుగాలుల్లా ఉన్నాయి. దేవతలు ఆయనపై పుష్పవర్షాన్ని కురిపించారు. సకలదేవతలు స్తుతించి ప్రణతులు అర్పించారు.

మహాభాగవతుడైన ప్రహ్లాదుడు ఉగ్రమూర్తిగా దర్శనమిచ్చిన స్వామికి అంజలి ఘటించి సాష్టాంగ ప్రమాణం చేశాడు. శ్రీనారసింహస్వామి తన అభయ మంగళ దివ్య హస్తాన్ని ప్రహ్లాదుని తలపైనుంచి దీవించాడు. ప్రహ్లాదుడు పరవశించి పలువిధాల స్తుతించాడు. ప్రసన్నుడైన స్వామి ఏమయినా వరాన్ని కోరుకొమ్మన్నాడు.

శంకరుడు, బ్రహ్మాది దేవతలు శ్రీనారసింహుని ప్రస్తుతించారు. దేవ దేవా! నీ నృసింహావతారాన్ని నిష్ఠతో ధ్యానించేవారికి యమునిగురించిన భయముండదు అన్నాడు బ్రహ్మ. శ్రీలక్ష్మీ సమేతుడై స్వామి వైకుంఠమునకరిగెను. బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదుని పూజలందుకొని తమలోకములకరిగిరి.

ఈ అవతారాన్ని గురించి ధర్మరాజునకు చెబుతూ నారదుడిలా అన్నాడు.




#Article 37: బుద్ధావతారము (117 words)


బుద్ధావతారము విష్ణువు దశావతారాలలో ఒకటి.

బుద్దావతారము క్షణ కాలము మాత్రమే ఉంది. విష్ణుమూర్తి రాక్షసుని చంపడానికి దిగంబర అవతారము ఎత్తుతాడు. అందుకని ఈ అవతారమును పూజించరు. అంతకు ముందరి అవతారమైన కృష్ణావతారమును పుజిస్తారు. కృష్ణార్పణం అంటారు. బుద్దార్పణం అనరు.

త్రిపురాసురుల భార్యలు మహాపతివ్రతలు. వారిపాతివ్రత్య శక్తి వల్ల త్రిపురలను ఎవరు జయించలేక పోతారు.అప్పుడు ఆ శక్తిని ఉపసమ్హరింప చేయ్యడానికి లోకరక్షణ, ధర్మ రక్షణ కోసం శ్రీ మహా విష్ణువు బుద్ధ రూపాన్ని ధరించాడు. సమ్మోహనకరమైన రూపముతో, ఒక అశ్వత్థ వృక్షమూలాన సాక్షాత్కరించిన అతనిని జూచి, మోహితులై, ధర్మాన్ని తప్పారు ఆ స్త్రీలు. దానితో త్రిపురుల బలం క్షీణించింది. శివుని చేత హతులయ్యారు.
ఇదే విషియం ఆపన్నివారక స్తోత్రము లో ఉంది. ద్వైత్యస్త్రీమనభంజినే అంటే రాక్షస స్త్రీల పాతివ్రత్యాన్ని భంగం చేసినవాడు అని అర్ధం.

పైన వృత్తాంతాన్ని అన్నమయ్య దశావతార వర్ణనలో పేర్కొన్నాడు.

'పురసతుల మానములు పొల్లజేసినచేయి.
ఆకాసాన బారేపూరి
అతివలమానముల కాకుసేయువాడు
ఆకాసాన విహరించే ఊరులు - త్రిపురాలు.
వారి మగువల ధర్మాన్ని తప్పించినవాడు. 

అప్పటి పరిస్థితుల బట్టి లోకరక్షణ కోసం స్వామి ధరించిన లీలావతారమిది.




#Article 38: శ్రీ కృష్ణుడు (1908 words)


శ్రీకృష్ణుడు, హిందూమతంలో అర్చింపబడే ఒక దేవుడు. విష్ణువు పది అవతారాలలోఎనిమిదవ అవతారము. హిందూ పురాణాలలోను, తాత్త్విక గ్రంథాలలోను, జనబాహుళ్యంలోని గాథలలోను, సాహిత్యంలోను, ఆచార పూజా సంప్రదాయాలలోను కృష్ణుని అనేక విధాలుగా భావిస్తుంటారు, చిత్రీకరిస్తుంటారు. చిలిపి బాలునిగాను, పశువులకాపరిగాను, రాధా గోపికా మనోహరునిగాను, రుక్మిణీ సత్యభామాది అష్టమహిషుల ప్రభువుగాను, గొపికల మనసు దొచుకున్నవాదిగాను యాదవరాజుగాను, అర్జునుని సారథియైన పాండవ పక్షపాతిగాను, భగవద్గీతా ప్రబోధకునిగాను, తత్త్వోపదేశకునిగాను, దేవదేవునిగాను, చారిత్రిక రాజనీతిజ్ఞునిగాను ఇలా బహువిధాలుగా శ్రీకృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం చిత్రీకరింపబడినాయి.. మహాభారతం, హరివంశం, భాగవతం, విష్ణుపురాణం - ఈ గ్రంథాలు కృష్ణుని జీవితాన్ని, తత్త్వాన్ని తెలిసికోవడానికి హిందువులకు ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు.

హిందూమతంలో, ప్రత్యేకించి వైష్ణవులలో కృష్ణునిపూజ దేశమంతటా చాలా ముఖ్యమైనది. మథురలో బాలకృష్ణునిగా, పూరీలో జగన్నాథునిగా, మహారాష్ట్రలో విఠోబాగా, రాజస్థాన్‌లో శ్రీనాధ్‌జీగా, తిరుమలలో వేంకటేశ్వరునిగా, ఉడిపిలో కృష్ణునిగా, గురువాయూరులో గురువాఐరోపాపగా కృష్ణుని పూజిస్తారు. ఇంతే కాకుండా విష్ణువు ఆలయాలన్ని కృష్ణుని ఆలయాలే అనవచ్చును. ఇందుకు అనుగుణంగా దేశంలో వివిధ ప్రాంతాలలోను, వర్గాలలోను అనేక సంప్రదాయాలు నెలకొన్నాయి. వీటిలో ప్రధానమైన భావం:

శ్రీమహా విష్ణువు తన సృష్టి లోని జీవులకు బాధలు హెచ్చినప్పుడు, లోకంలో పాపం హద్దు మీరినప్పుడు, దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించడం కోసం జీవుల రూపంలో అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడు. ఈవిధంగా అవతరించడాన్నిలీలావతారం అంటారు. ఇలాంటి లీలావతారాలు, భాగవతం ప్రకారం, భగవంతునికి ఇరువయ్ి రెండు (22) ఉన్నాయి. శ్రీమహావిష్ణువు లీలావతారాలలో ఇరువదవ అవతారం శ్రీకృష్ణావతారం. ఈ లీలావతారాలు ఇరవైరెండింటి లోనూ ముఖ్యమైనవి పది ఉన్నాయి. ఈ పదింటిని దశావతారాలు అంటారు. దశావతారాలలో శ్రీకృష్ణావతారం కొన్నిచోట్ల చెప్పబడుతుంది. కొన్నిచోట్ల చెప్పారు. (రామోరామశ్చరామశ్చ). యుగాలలో రెండవదయిన త్రేతాయుగంలో శ్రీరాముని లోక కళ్యాణ కారకునిగ రావణాది రాక్షస శిక్షకుడిగ కీర్తించబడుతున్నాడు. నారాయణుడు ఆ తర్వాతదయిన ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు. శ్రీకృష్ణుడు నారాయణుడి అవతారాల్లో పరిపూర్ణావతారంగ కొలవబడుతున్నాడు. గీతోపదేశం ద్వారా అర్జునుడికి సత్యదర్శనం చేసి, కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని ముందుకు నడిపించాడు. ఆ విధంగా భగవద్గీతను లోకానికి ఉపదేశించి శ్రీకృష్ణుడు జగద్గురువు అయ్యాడు.

విష్ణు సహస్రనామ స్తోత్రంలో కృష్ణ అనే నామం రెండు సార్లు వస్తుంది (1) అగ్రాహ్యః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః (2) వేధాః స్వాంగో జితః కృష్ణో దృఢః సంకర్షణోచ్యుతః - ఈ రెండు సందర్భాలలోను వివిధ వ్యాఖ్యానకర్తలు వివిధ భావాలను తెలిపారు. అవి క్లుప్తంగా క్రింద ఇవ్వబడినాయి* 

అనేక దేవాలయాల విగ్రహాలలోను, ఇతర శిల్పాలలోను, చిత్రాలలోను, ప్రార్థనలలోను, కావ్యాలలోను, సాహిత్యంలోను, పురాణాలలోను, సినిమాలలోను కృష్ణుని రూప స్వభావాల చిత్రణ ఉంది. ఉదాహరణగా కృష్ణాష్టకం అనే ప్రార్థనలో కృష్ణుని వర్ణించిన విధానం - 
దేవకీవసుదేవుల నందనుడు, కంసచాణూర మర్దనుడు, నల్లని మేనికాంతి (అతసీపుష్ప సంకాశం) కలవాడు, నెమలి పింఛము, వివిధ ఆభరణములు, మందారమాల, పీతాంబరములు, తులసి మాలలు ధరించినవాడు, మెలిదిరిగిన ముంగురులు కలవాడు, రుక్మిణీసత్యభామాది భామలతో విహరించువాడు, గోపికల కుచముల కుంకుమ అంటిన వక్షస్థలము, శ్రీవత్స చిహ్నము కలవాడు, వనమాల, శంఖచక్రములు ధరించినవాడు.

తెలుగునాట పోతన శ్రీమదాంధ్ర భాగవతం అత్యంత ప్రాచుర్యం కలిగిన గ్రంథం. ఇందులో కృష్ణుని రూప స్వభావ వర్ణన అనేక పద్యాలలో ఉంది. పోతన వాడిన కొన్ని వర్ణనలు - నల్లనివాడు, పద్మ నయనమ్ములవాడు, నవ్వు రాజిల్లెడు మోమువాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడు, సుధారసమ్ము పైజల్లెడువాడు, యదుభూషణుడు, నర (అర్జునుని) సఖుడు, శృంగార రత్నాకరుడు, లోకద్రోహి నరేంద్ర వంశదాహకుడు, లోకేశ్వరుడు, నిర్వాణ సంధాయకుడు, భక్తవత్సలుడు, బ్రాహ్మణ్యుండు, గోవిందుడు, - పాండవులకు సఖుడు, సారథి, సచివుడు, నెయ్యము, వియ్యము, విభుడు, గురువు, దేవుడు - ఇలా లెక్కలేనన్ని వర్ణనలున్నాయి.

అన్నమయ్య చెప్పిన కొన్ని వర్ణనలు - ముద్దుగారే యశోద ముంగిట ముత్యము, కాళింది పడగలపైని కప్పిన పుష్యరాగము, రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము

వివిధ గ్రంథాలలో శ్రీకృష్ణుని జీవిత వృత్తాంతం ఉంది. వాటిలో భాగవతంలో ఉన్న కథాక్రమం ప్రజలకు సుపరిచితమైనది. ఇందులో నవమ స్కంధములో వసుదేవుని వంశక్రమం ఉంది. తరువాతదశమ స్కంధము, ఏకాదశ స్కంధములలో కృష్ణుని జీవిత వృత్తాంతము ఉంది.  సంభాషణలో శ్రీకృష్ణుని  లాక్షాగృహదహనానంతరం కృష పరవేశం అవుతుంది. అక్కడినుండి కురుక్షేత్ర సంగ్రామం చివరి వరకు కృష్ణుని కథ పాండవుల కథకు సమాంతరంగా నడుస్తుంది. మహాభారతం చివరిలో కృష్ణుని నిర్యాణం ఉంది. భాగవతం కథారంభంలోనే కృష్ణుని నిర్యాణం చెప్పబడింది. వీటిలోనుండి సంగ్రహింపబడిన కృష్ణుని కథ క్రింద ఇవ్వబడింది.

లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి, బ్రహ్మదేవుల ప్రార్థన మేరకు భగవంతుడు దేవకీ వసుదేవులకు జన్మింపదలిచాడు.

మధురా నగరాన్ని యాదవ క్షత్రియ వంశంకి చెందిన శూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు. వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకిని ఇచ్చి వివాహం చేస్తారు. చెల్లెలు అంటే ఎంతో ప్రేమ కల కంసుడు ఆమెను అత్తవారి ఇంటికి రథం మీద సాగనంపుతుంటే అశరీరవాణి దేవకి గర్భంలో పుట్టిన ఎనిమిదో కుమారుడు కంసుడిని సంహరిస్తాడు అని చెబుతుంది. కంసుడు దేవకిని, వసుదేవుడిని, ఆడ్డువచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహారాజును కూడా చెరసాలలో పెడతాడు. దేవకీ దేవి ఏడవ మారు గర్భం ధరించి నప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య రోహిణి గర్భంలో ప్రవేశ పెడతాడు. ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు. చెరసాలలో దేవకికి గర్భ స్రావం అయిందని అనుకొంటారు. కొన్ని రోజులకు దేవకీ దేవి ఎనిమిదో మారు గర్భం ధరిస్తుంది. లక్ష్మీనాథుడు దేవకి గర్భములో ఉండడం చూసి దేవతలు, యక్ష, కిన్నర,కింపురుషులు దేవకీ దేవి ఉన్న చెరసాలకు వచ్చి స్తుతిస్తారు.

దేవకి గర్భం నుండి శ్రావణ శుద్ధ అష్టమి తిథి నాడు విష్ణువు శ్రీకృష్ణుడై రోహిణీ నక్షత్ర యుక్తమైనప్పుడు జన్మిస్తాడు. కృష్ణుడు జన్మించాక వసుదేవుడు కృష్ణుడిని పొత్తిళ్ళలో పెట్టుకొని, చెరసాల బయట నిద్ర పోతూ ఉన్న కావలి వాళ్ళను తప్పించుకొని, యమునా నది వైపు బయలు దేరుతాడు. యమునానది రెండుగా చీలి పోతుంది. నందనవనంలో తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్ళి యశోద ప్రక్కన ఉన్న శిశువు ప్రదేశంలో శ్రీకృష్ణుడిని విడిచి ఆ శిశువును తీసుకొని తిరిగి చెరసాలకు వస్తాడు. చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు ఏడుస్తుంది. కంసుడు ఆ శిశువును తీసుకొని చంపడానికి పైకి విసరగా ఆ శిశువు ఎనిమిది చేతులతో శంఖ చక్ర గదా శారంగాలతో ఆకాశం లోకి లేచి పోయి తాను యోగ మాయ నని కంసుడిని చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయం అవుతుంది. దేవకీవసుదేవులకు అష్టమ సంతానంగా కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు వ్రేపల్లె లోని యశోదాదేవి ఒడిని చేరి, అక్కడే పెరిగాడు.

మధురానగరంలో కంసుని చెరసాలలో జన్మించిన కృష్ణుడు పుట్టగానే తన తండ్రి వసుదేవునిచే వ్రేపల్లె లోని నందుని ఇంట చేరి యశోదాదేవి ముద్దు బిడ్డగా బాల్య జీవితము గడిపాడు. పాలుత్రాగే ప్రాయంలో తనను చంపటానికి కంసునిచే పంపబడిన పూతనను, బుడిబుడి నడకల ప్రాయంలో శకటాసురాదులను సంహరించాడు. చిరు ప్రాయంలో యశోదకు తననోటిలో అండ పిండ బ్రహ్మాండాదులను చూపి యశోదను ఆనందాశ్చర్యచకితురాలిని చేశాడు. దోగాడే వయసులో యశోదచే నడుముకి కట్టబడిన రోలుతో రెండు మద్ది చెట్లను కూల్చి మద్దిచెట్ల రూపంలో ఉన్న గంధర్వులకు శాపవిమోచనం గావించాడు.

అన్న బలరామునితో చేరి స్నేహితులతో గోపాలుడయ్యాడు. వేణుగానంలో అసాధారణ ప్రజ్ఞ చూపించి ఆబాలగోపాలాన్ని మంత్రముగ్ధులను గావించాడు. కాళిందీనదిలో ఉన్న కాళీయుడి తలపై నృత్యముచేసి తాండవకృష్ణుడు అయ్యాడు. కాళీయుని మదమణచి, కాళిందిని విడిచి దూరంగా పంపి వ్రేపల్లె వాసుల మన్ననలను పొందాడు. ప్రళయకాలంలో గోవర్ధన గిరి ని తన చిటికెన వేలుతో ఎత్తి వ్రేపల్లె వాసులను ఆ గిరి కిందకు చేర్చికాపాడి వ్రేపల్లె వాసుల మనసుల్లో భగవంతుడి స్థాయికి ఎదిగాడు. అల్లరి పనులతో అలరించి, ఆపత్కాలంలో ఆదుకుని, ధైర్యసాహసాల ప్రదర్శనతో వ్రేపల్లెను మురిపించాడు.

కృష్ణుని చంపడానికి కంసుడు ఒక వ్యూహం పన్ని, ఉద్ధవుని దూతగా పంపి, కృష్ణబలరాములను మధురకు రప్పించాడు. బలరామకృష్ణులు చాణూర ముష్టికులనే మల్లులను, తరువాత కంసుని వధించి తమ తాత ఉగ్రసేనుని చెర విడిపించి అతనిని రాజ్యాభిషిక్తుని గావించారు. చెరలోఉన్న తల్లి, తండ్రులను వారితో పాటుగా విడిపించి ద్వారకకు చేరుకున్నారు.

దేవకీ వసుదేవుల కోరికపై విద్యాభ్యాసానికి సాందీపని ముని ఆశ్రమము చేరుకొని అక్కడ కుచేలుని చెలిమిని పొందారు. గురుదక్షిణగా అంతకుపూర్వమే మరణించిన గురుపుత్రుని బ్రతికించి తెచ్చి గురువుకి సమర్పించారు. విద్యాధనంతో తన తల్లి తండ్రులవద్దకు చేరుకున్నారు.

దేవకీ వసుదేవులు కృష్ణుని తల్లిదండ్రులు. అన్న బలరాముడు. చెల్లి సుభద్ర. కాని బాల్యంలో కృష్ణబలరాములు యశోదా నందులవద్ద వ్రేపల్లెలో పెరిగారు. కృష్ణుని తమ్ముడు సాత్యకి.

శ్రీకృష్ణుడు అష్టభార్యలను వివాహమాడాడు. విదర్భ రాజైన భీష్మకుని పుత్రిక రుక్మిణి కృష్ణుని ప్రేమించింది. కానీ ఆమె సోదరుడు రుక్మి అతడిని ద్వేషించి ఆమెను శిశుపాలునికిచ్చి పెళ్ళి చేయాలని నిశ్చయించాడు. రుక్మిణి పంపిన రహస్య సందేశం గ్రహించి కృష్ణుడు ఆమె అభీష్టం మేరకు రాక్షస పద్ధతిలో అపహరించి వివాహం చేసుకుంటాడు. సత్రాజిత్తు కుమార్తె సత్యభామ. కృష్ణుడు శమంతకమణిని తనకిమ్మని కోరగా అతడు అంగీకరించలేదు. ఒకసారి సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక సింహము అతనిని చంపి, మణిని హరించింది. జాంబవంతుడు ఆ సింహమును చంపి మణిని తన కుమార్తె జాంబవతి కిచ్చాడు. మణి కొరకై ప్రసేనుడిని కృష్ణుడే హతమార్చెనన్న అపవాదు వ్యాపించింది. కృష్ణుడు మణిని అన్వేషిస్తు పోయి పోయి జాంబవంతుని గుహలో ఉన్న మణిని తీసుకున్నాడు. జాంబవంతునికీ, కృష్ణునికీ జరిగిన యుద్ధంలో జాంబవంతుడు పరాజితుడైనాడు. శ్రీకృష్ణుని శ్రీరాముని అవతారంగా గుర్తించిన జాంబవంతుడు మణితో సహా కూతురు జాంబవతిని అతనికి సమర్పించాడు. మణిని తెచ్చి సత్రాజిత్తునకిచ్చాడు. అప్పుడు సత్రాజిత్తు మణితోపాటు తన కుమార్తె సత్యభామను కృష్ణునికిచ్చి వివాహం చేసెను.

కాళింది, భధ్ర, నాగ్నజితి, మిత్రవింద, లక్షణ అతని ఇతర భార్యలు. భద్ర శ్రీకృష్ణుని తండ్రియగు వసుదేవుని చెల్లెలైన శ్రుతకీర్తి పుత్రిక. మిత్రవింద కూడా అవంతీ రాజు పుత్రిక, మేనత్త కూతురు. ఆమెను స్వయంవరంలో వరించి కృష్ణుడు చేపట్టాడు. కోసల దేశాధిపతి నగ్నజిత్తుకు ఏనుగుల వంటి బలం కలిగిన ఏడు వృషభాలు ఉండేవి. వాటిని నిగ్రహించిన వానికి తన కుమార్తె నాగ్నజితిని ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. కృష్ణుడు ఏడు రూపాలు దాల్చి ఏడు ఎద్దులను బంధించాడు. రాజు పుత్రికనిచ్చి పరిణయం చేశాడు. లక్షణ మద్ర దేశాధిపతి కూతురు. స్వయంవరంలో శ్రీకృష్ణుని వరించింది. ఈ విధంగా కృష్ణుని ఎనమండుగురు భార్యలు అష్టమహిషులుగా విలసిల్లారు.

సుభద్రను అర్జునునికి ఇచ్చి పెళ్ళి చేశారు. వారి కొడుకు అభిమన్యుడు (కృష్ణునికి మేనల్లుడు)

శ్రీకృష్ణుడికి భార్యలందరితోనూ ఒక్కొక్కరి వల్ల పదేసి మంది పిల్లలు పుట్టారు. రుక్మిణి వల్ల కృష్ణుడికి ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుబారుడు, చారుగుప్తుడు, భద్రచారుడు, చారుచంద్రుడు, విచారుడు, చారుడు అనే బిడ్డలు కలిగారు. సత్యభామ వల్ల కృష్ణునికి భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, అతిభానుడు, శ్రీభానుడు, ప్రతిభానుడు అనే బిడ్డలు కలిగారు. జాంబవతీ శ్రీకృష్ణులకు సాంబుడు, సుమిత్రుడు, పురజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్రకేతుడు, వసుమంతుడు, ద్రవిడుడు, క్రతువు అనే సంతానం కలిగింది. జాంబవతికి కలిగిన ఈ బిడ్డలంటే కృష్ణుడికి ప్రత్యేకమైన ప్రేమ ఉండేది.నాగ్నజితి, కృష్ణులకు వీరుడు, చంద్రుడు, అశ్వసేనుడు, చిత్రగుడు, వేగవంతుడు, వృషుడు, లముడు, శంకుడు, వసుడు, కుంతి అనే పిల్లలు కలిగారు. కృష్ణుడికి కాళింది వల్ల శ్రుతుడు, కవి, వృషుడు, వీరుడు, సుబాహుడు, భద్రుడు, శాంతి, దర్శుడు, పూర్ణమానుడు, శోమకుడు అనే కుమారులు జన్మించారు. లక్షణకు, శ్రీకృష్ణుడికి ప్రఘోషుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, సహుడు, ఓజుడు, అపరాజితుడు అనే సంతానం కలిగింది. మిత్రవింద, కృష్ణులకు వృకుడు, హర్షుడు, అనిలుడు, గృద్ధుడు, వర్ధనుడు, అన్నాదుడు, మహాశుడు, పావనుడు, వహ్ని, క్షుధి అనే పుత్రులు పుట్టారు. కృష్ణుడికి భద్ర అనే భార్య వల్ల సంగ్రామజిత్తు, బృహత్సేనుడు, శూరుడు, ప్రహరణుడు, అరిజిత్తు, జయుడు, సుభద్రుడు, వాముడు, ఆయువు, సత్యకుడు అనే పిల్లలు పుట్టారు. చాలామంది అపోహపడుతున్నట్టుగా శ్రీకృష్ణుడికి 16వేలమంది (కొన్ని గ్రంథాలలో 16100 అని ఉన్నది) భార్యలతో శారీరక బంధము కలిగియుండలేదు. 16వేల గోపికా స్త్రీలను నరకాసురుని బారినుండి కాపాడి సంఘములో సముచిత స్థానము కల్పించాడు. భర్త అనగా భరించువాడు అను నానుడి ప్రకారము, ఒక పురుషుని పంచన చేరి, అతని నివాసమునందు నివసించు స్త్రీలకు అతడే భర్తగా నిర్ణయించే అప్పటి కాలమానస్థితిగతులనుబట్టి శ్రీకృష్ణునికి భార్యలుగా చెప్పబడ్డారు. కానీ పైన చెప్పబడిన అష్ఠ అష్టమహిషులతోనే శ్రీకృష్ణునికి సంతానము కలిగినది అని గ్రంథాలు ఉద్ఘాటిస్తున్నాయి.
.

లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి, బ్రహ్మదేవుల ప్రార్థన మేరకు భగవంతుడు దేవకీ వసుదేవులకు జన్మింపదలిచాడు.
ఒకమారు పారిజాత పుష్పం కారణంగా కృష్ణుడు ఇంద్రునితో పోరి స్వర్గలోకంనుండి పారిజాతతరువును తెచ్చి సత్యభామకు ప్రీతికూర్చాడు. లోకాళను బాధిస్తున్న నరకాసురుని వధించి అతని కొడుకు భగదత్తునికి పట్టం కట్టాడు. నరకునిచే బంధింపబడిన రాజకన్యలను కృష్ణుడు పెండ్లాడి అందరిపట్ల తనమాయాప్రభావంతో సంసారం నెరపాడు.

శ్రీకృష్ణుని అతిశయాన్ని చూసి ఓర్వలేక కాలయవనుడు, జరాసంధుడు, సాళ్వుడు వంటివారు కృష్ణునిపై దండెత్తారు. శ్రీకృష్ణుడు వారిని ఓడించాడు. ఇంకా ద్వివిధుడు, దంతవక్త్రుడు మొదలైనవారు కూడా కృష్ణుని చేత హతులైనారు.

మేనత్త కుమారులైన పాండుసుతులతో శ్రీ కృష్ణుని అనుబంధం మరువరానిది. పాండవ మద్యముడైన అర్జునునితో చెలిమి విడదీయరానిది. పాండవుల జీవితములో జరిగిన ప్రతి సంఘటనలో శ్రీకృష్ణుని పాత్ర ఉంది. శ్రీకృష్ణుని సంప్రదించకుండా ధర్మరాజు శకునితో ఆడిన జూదము తప్పమిగిలినవన్నీ శ్రీకృష్ణుని సలహా సంప్రదింపులతో జరిగినవే. కీలకమైన సమస్యలన్నీ కృష్ణుని సహాయంతో తీరినవే. ద్రౌపదిని శ్రీకృష్ణుడు స్వంత చెల్లెలికన్నామిన్నగా చూసుకున్నాడు. వస్ర్తాపహరణ అవమానమునుండి ఆమె శ్రీకృష్ణుని సహాయంతోనే బయటపడింది. పాండవవనవాస సమయంలో వారికి వచ్చిన అనేక సమస్యలకు శ్రీకృష్ణుని సలహాతో పరిష్కారం చేసుకున్నారు. వారి రాజ్యం మీదకు అనేకమార్లు దండెత్తిన జరాసంధుని భీముని సాయంతో తుదముట్టించి తన రాజ్యానికి శత్రు భయాన్ని తొలగించాడు. ద్వారక సముద్రగర్భంలో మునిగిపోతుందని ముందుగానే ఊహించి ద్వారక వాసులను అప్రమత్తంచేసి వారిని ఆపదనుండి రక్షించాడు. ఇంద్రప్రస్థంలో ధర్మరాజు చేసిన అశ్వమేధయాగ సమయంలో మేనత్తకి ఇచ్చిన మాటను పాలించి శిశుపాలుని నూరు తప్పులను సహించిన తరువాత అతనిని చక్రాయుధంతో వధించాడు.

పాండవుల వనవాసం తరువాత వారి తరఫున కురుసభలో రాయబారము చేశాడు. కురుక్షేత్రంలో యుద్ధసమయంలో అర్జునునికి గీతాభోధ చేసి అతనిని యుద్ధోన్ముఖుని చేశాడు. అర్జునునికి సారథియై యుద్ధం ముగిసేవరకూ పాండవులకు రక్షణగా ఉన్నాడు. అశ్వత్థామ అస్త్రంవల్ల ఉత్తర గర్భంలో పిండం కూడా మృత్యవును ఎదుర్కోగా కృష్ణుడు తన చక్రంతో ఆ గర్భస్థ శిశువును రక్షించాడు. ఆ శిశువే పరీక్షిత్తుగా జన్మించి పాండవుల అనంతరం రాజ్యానికి అధిపతి అయ్యాడు.

మహాభారత యుద్ధానంతరం యాదవకులం కూడా అంతఃకలహాలతో నశిస్తుందని గాంధారి శపించింది. అలాగే యాదవకులంలో కొందరి చిలిపి పనుల కారణంగా పుట్టిన ముసలం ( రోకలి ) అందరి మరణానికీ కారణమయ్యింది. బలరాముడు యోగం ద్వారా దేహాన్ని త్యజించాడు. కృష్ణుడు అరణ్యాలకు వెళ్ళాడు. అక్కడినుండి కృష్ణుడు స్వర్గానికి నేరుగా వెళ్ళాడని వ్యాసుని భారతంలో ఉంది. అయితే ఒక నిషాదుని ( పూర్వజన్మలో వాలి) బాణం వలన కృష్ణుడు గాయపడి దేహాన్ని త్యజించాడని మరికొన్ని పురాణాలలో ఉంది.

పురాణాలలో తెలిపిన ప్రకారం  శ్రీకృష్ణుని నిర్యాణంతో ద్వాపరయుగం అంతమయింది. కలియుగం ఆరంభమయింది. ఇది క్రీ.పూ. 3102 ఫిబ్రవరి 17/18 తేదీలలో జరిగిందని కొన్ని అంచనాలున్నాయి (అయితే ఈ అంచనాలలో పలు అభిప్రాయ భేదాలున్నాయి)

రామానుజాచార్యులు వంటి వైష్ణవ గురువులు, గౌడీయ వైష్ణవుల విశ్వాసం ప్రకారం శ్రీకృష్ణుడు జరామరణ రహితుడు. మహాభారతంలో యుద్ధఘట్టం వర్ణనలో కొన్నిచోట్ల శ్రీకృష్ణుడి దేహం గాయపడినట్లు వర్ణించినా గాని, మరికొన్ని ఘట్టాలలో అతను చరాచరవిశ్వాత్మకుడని, ఆదిమధ్యాంతరహితుడని, సామాన్యమైన పాంచభౌతిక దేహానికి అతీతుడనీ గ్రహించాలి. ఇదే విషయాన్ని కృష్ణుడు ఉద్యోగపర్వంలో చెప్పాడు కూడాను.

ఉత్తర ప్రదేశ్ లోని మీర్జాపూర్‌లో లభించిన క్రీ.పూ. 800 నాటి ఒక చిత్రంలో సుదర్శన చక్రం ధరించిన రథసారథిని కృష్ణుడని అనుకోవచ్చును.

కృష్ణుని గురించిన ప్రస్తావన లభించిన మొట్టమొదటి గ్రంథం ( చరిత్ర కారుల అంచనా ప్రకారం ) ఛాందోగ్యోపనిషత్తు. ఇందులో కృష్ణుడు దేవకి సుతుడని, ఘోర అంగీరసుని శిష్యుడని చెప్పబడింది. నారాయణ అధర్వశీర్ష, ఆత్మబోధ వంటి ఉపనిషత్తులలో కృష్ణుడు భగవంతుడని, నారాయణుని అవతారమని చెప్పబడింది.

తైత్తరీయారణ్యకము (X,i,6) లో వాసుదేవుడు, నారాయణుడు, విష్ణువుల గురించిన ప్రస్తావన ఉంది. క్రీ.పూ. 4వ శతాబ్దికి చెందిన వ్యాకరణకర్త పాణిని అష్టాధ్యాయిలోవాసుదేవకుడు అనగా వాసుదేవుని భక్తుడు అని తెలిపాడు. అదే సందర్భంలో అర్జునుని ప్రస్తావన కూడా ఉండడం వలన ఈ వాసుదేవుడే కృష్ణుడు అనుకొనవచ్చును. వేదకాలంలో ఎప్పుడో వాసుదేవుడు, కృష్ణుడు ఒకరిగా భావింపబడడం మొదలయ్యుండవచ్చును. ప్రస్తుతం మనకు లభిస్తున్న మహాభారతం కాలం నాటికి కృష్ణుడు విష్ణువు అవతారమనే భావన స్థిరపడింది.

మధురలో ఉండే శూరసేనుడు హెరాకిల్స్ను పూజించాడని క్రీ.పూ. 4వ శతాబ్దంలో చంద్రగుప్తుని ఆస్థానాన్ని దర్శించిన మెగస్తనీస్ వ్రాశాడు. మెగస్తనీస్ వ్రాసిన ఇతర వ్రాతలను బట్టి హెరాకిల్స్, కృష్ణుడు ఒకరే అనుకోవచ్చును.. క్రీ.పూ. 180-165 కాలంలో గ్రీకో-బాక్ట్రియన్ పాలకుడు అగాథకిల్స్ () కృష్ణ బలరాములున్న నాణేలను ముద్రించాడు.

చితోర్ ఘర్ జిల్లా నగరి వద్ద ఘోసుండి, హాథిబాడలలో లభించిన క్రీ.పూ. 2వ శతాబ్దం నాటి శాసనాల ప్రకారం - సంకర్షణ (బలరాముడు), వాసుదేవులను (కృష్ణుడు) పూజించడం కోసం గజాయనసర్వతాత అనే రాజు నారాయణ వటంలో ఒక పూజా శిలా ప్రాకారం (గుడి వంటిది) నిర్మించాడు. అదే కాలంనాటి శాతవాహనుల శాసనాలలో కూడా ఇతర దేవతలో పాటు సంకర్షణ, వాసుదేవుల ప్రస్తుతి ఉంది.

క్రీ.పూ. 1వ శతాబ్దంలో గ్రీస్‌కు చెందిన హెలిడోరస్ () భిల్సా సమీపంలో బేసన్‌గర్ వద్ద ఒక స్తంభ శాసనాన్ని (Heliodorus pillar) వేయించాడు. ఆ శాసనంపై వ్రాసిన విషయం:  దేవదేవుడైన వాసుదేవుని కొఱకు ఈ గరుడ స్తంభాన్ని వేయించిన భాగవత ప్రభువు భక్తుడు హెలియోడోరస్. అతను తక్షశిలకు చెందిన గ్రీకు వ్యక్తి (Diya Greek Dion) కొడుకు, గ్రీకుమహారాజు అంటాలికిట (Great King Amtalikita [Greek Antialcidas]) రాయబారిగా కాశీపుత్రభగభద్రుని ఆస్థానానికి వచ్చియున్నాడు. కాశీపుత్ర భగభద్రుడు తన 14వ సంవత్సరపు పాలనలో ఉన్నాడు. [...] మూడు అమృత ధర్మాలు [...] పాటిస్తే స్వర్గానికి మార్గం లభిస్తుంది. ఆత్మ సంయమనం, దానగుణం, శ్రమ. ఇలాగే ఇదే కాలానికి చెందిన మరికొన్ని శాసనాలు లభించాయి.

క్రీ.పూ. 150 కాలానికి చెందిన వ్యాకరణకర్త పతంజలి రచనలలో కృష్ణుడు, సంకర్షణుడు, జనార్దనుడు, బలరాముడు, కేశవుడు వంటి దేవతల ప్రస్తావనలున్నాయి. క్రీ.పూ. 1వ శతాబ్దంలో వృష్ణివంశానికి ఐదుగురు వీరుల పూజ గురించి ( బలరాముడు, కృష్ణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సాంబుడు ) ప్రస్తావన ఉన్న శాసనం మధుర సమీపంలో మోరా వద్ద లభించింది.

అయితే శ్రీకృష్ణుడు చారిత్రక పురుషుడు కాదని, కేవలం మహాభారత కావ్యంలో కల్పిత పాత్ర అని, మహాభారత కావ్యం వేద కాలం తర్వాత, సుమారు 800 B.C - 500 B.C మధ్య రచించబడినది అని, ఆర్యుల రాక మునుపు భారతదేశంలో సంస్కృత భాష వాడుకలో లేదని వాదించేవారు లేకపోలేదు.

 




#Article 39: నిఘంటువు (869 words)


 
నిఘంటువు (అనగా ఆక్షర క్రమములో పదములు, వాటి అర్థములు కలిగినది. దీనినే పదకోశము, వ్యుత్పత్తి కోశము అనికూడా అంటారు. తెలుగు భాష యందు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ రచించిన నిఘంటువు ప్రఖ్యాతి గాంచింది. గిడుగు రామమూర్తి గారు తెలుగు సవర పదకోశం చేశారు.

ఇది క్రీ.శ.1860 ప్రాంతమున గణపవరపు వేంకటకవిప్రణీతమైన సర్వలక్షణశిరోమణి అను నామాంతరము గల శ్రీ వేంకటేశాంధ్రము. ఇందు దేశీయములు, తబ్ధవములు అచ్చ తెలుగు పదములు దైవతమానవస్థావర తిర్య జ్ఞానార్ధవర్ధులను విభజనమున 128 సీస పద్యములలో నిఘంటువుగా కూర్చబడింది. కవి అమరకోశముతో సమానముగా దీనిని రచించి వేంకటేశునికి అంకితమిచ్చినట్లు చెప్పియున్నాడు.ఇది కొంచెం ఇంచుమించుగా పర్యాయపద నిఘంటువుగా అనవచ్చును.  పెరుమాళ్ళు నల్లదేవర కర్రిసంగాతి వెడవిల్తునయ మచ్చయెడదమేటి.. వెన్నుడన నీదు పేళ్ళు శ్రీవేంకటేశ అను పద్ధతిలో రచించబడెను.

విరియనా పువ్వు సీవిరియనా కల్లు వా
విరియనా చెట్టు కావిరియు పొగయు
పరియనా డాలు రూపరియనా సొగసు మే
పరియనా తిండి తేపరన తెగువ
తరలునా వళుల బిత్తరులునా చెలులుచి
త్తరులు నా బొమ్మత్తరులు వలపు
కణియనా కప్పు సాకిరియినా సాక్షి బూ
కరియనా నదలు టక్కరస దొంగ
వరియనా చేను లావరియనా బంటును
సరియనా దండ కేసరులు వడ్లు..
నూరిజనకల్ప వరదందశూకతల్ప
డంబు కరివేల్పు పిట్టసిడంబుదాల్ప.

ఆంధ్రనిఘంటువుల ప్రాథమికావస్థను తెల్పుటకిది చాల తోడ్పడుచున్నది.

పద్యమ ఆంధ్రనిఘంటువులలో ఆంధ్రభాషార్ణవమే ఎక్కువ సమగ్రామంగను, మిక్కిలి ఉపయోగకరమైనది. ఇది కూడా రమారమి తంజావూరి రఘునాధ నాయకుడు కాలమునాటిదే. దీనిని రచించినది విద్వత్కవియగు నుదురుపాటి వెంకనార్యుడు. ఇద్ము ప్రథమ కాండమున స్వ్రగ, వ్యోమ, ది, క్కాల, ధీ, వా, క్చబ్దాది, నాట్య, పాతాళ, భోగి, నరక వారి వర్గములు; ద్వితీయ కాండమున భూ,పుర, శైల, వనౌషధి, సింహాది,మనుష్య, బ్రహ్మ, క్షత్రియ, వైశ్య,శుద్ర వర్గములును; తృతీయ కాండమున విశేష్యనిఘ్న, సంకీర్ణ నానా, ర్ధావ్యయ,క్రియావర్గములును ఉన్నాయి. ఇందలి శైలి మిగుల రమ్యము.

పలుకవెలఁదిమగఁడు బంగారుకడుపువాఁ
డంచతేజి నెక్కునట్టి రౌతు
బమ్మ తాత నలువ తమ్మిచూలి దుగినుఁ
డనఁగ బ్రహ్మపేరు లబ్జమౌళి.  

ఇట్టి పద్యములు దీనికి ఉదాహరణములు. దీనిని ఉప్దయోగించే ఇటీవలి శబ్దరత్నాకరము, సుర్యరాయాంధ్ర నిఘంటువు అనేకపదుములు నేర్చుకొనిరి.

దీనిని రచించినది పైడిపాటి లక్ష్మణకవి.ఇందు దైవతమానవస్థావర తిర్య జ్ఞానార్ధవర్ధులను విభజనము ఉంది.దీనిని కవి తన ఇష్టదైవమైన విశ్వేశ్వరునికి అంకితమిచ్చాడు.ఇందు పద్యములు పదములు కూడా ప్రశస్తములే. 

వలపులగౌరు చౌదంతి వెల్లయేనుఁ
గనఁగ నై రావతంబున కాఖ్య లమరు
వేల్పుదొరతేజి యనఁగను వెల్లగుర్ర 
మనఁగ నుచ్చైశ్రవం బొప్పు నంబికేశ.

ఆంధ్రనామసంగ్రహమున చేరక మిగిలిపోయిన మరికొన్ని పదములతో ఆంధ్రనామశేషము అను పేరిట క్రీ.శ.1750 ప్రాంతమున ఆడిదము సూరకవి మరియొక సంగ్రహనిఘంటవును రచించెను.చర్విత చర్వణముగా మరల మరియొక నిఘంటువును రచించక ఆంధ్రనామసంగ్రహమునకు అనుబంధముగా దీనిని రచించెను. ఈరెండు పెక్కు పదములు తెలుపుచున్నవి.

దీనిని రచించినది క్రీ.శ. 18వ శతాబ్దమునకు చెందిన వెచ్చ కస్తూరిరంగకవి. దీనిని ఇతడు సాంబమూర్తికి అంకితమిచ్చాడు.ఆనంద రంగరాట్చందోగ్రంధకర్త యగు కస్తూరిరంగకవి ఈ నిఘంటువును ప్రామాణికముగనే అంగీకృతమైయున్నది.

ఇది క్రీ.శ.1840ప్రాంతమున వెలువడినది.దీనిని శ్రీ.రాజా త్యాడిపూసపాటి వీరపరాజు రచించెను. ఇది ఒక పద్య నిఘంటువు.ఇందు సుర, నర, గుణ, పరికర, చర, అచర, నానరధవర్గులు ఉన్నాయి. ఇది యతిసామాన్య నిఘంటువు.

దీనిని మామిడి వెంకయ్య అను బందరువాసి 1810 సం. న రచించగా ఇది చెన్నపురిలో 1848లో ముద్రితమయ్యెను. ఇది అసమగ్రము, అవిశ్వసనీయమని బ్రౌను దొర వ్రాసెను.నిజమే కాని, ప్రాచీనప్రబంధములందలి కొన్ని పదములు దీసి అకారాదిగా గూర్చి వివిధార్ధమలను వచనములో నొసగుటయే ఇందలి విశేషము.

ఇది అకారక్రమముగా ఆంగ్లపద్ధతిన రచించిన మొదటి నిఘంటువు ఇదియే. ఇది తెలుగు రాని ఆంగ్లేయులకు తెలుగు తెలిసికొనుటకు ఉపయోగించునట్లు తెలుగు పదముల ఆంగ్ల అర్ధములతో రచించబడింది. క్యాంబెలు తెలుగుపాండిత్య అల్పమగుట నిందు చేరనిపదములు, చేర్చిన పదములకు ఈయని అర్ధములు, ఇచ్చిన వానిలో పెక్కు తప్పులు ఉన్నాయి.

క్యాంబెలు తప్పులు సరిదిద్ది బ్రౌణు దొర తెలుగు పాండిత్యము సంపాదించి దీని చాలా ప్రశాస్తముగా వ్రాసియున్నాడు.తెలుగు పదములకు ఆంగ్లార్ధములతో ఒకటి, ఆంగ్లపదముల ఆంధ్రార్ధములతో ఒకటి, అన్యదేశ్యపదజాలముతో అర్ధములతో మిశ్రనిఘంటువు ఇతడు మరియొకటి రచించి కీర్తిగాంచెను.ఇందు మొదటిదానిలో అనేక తెలుగు పదములను జేర్చి వానివాని అర్ధములకు లభ్యములైన పూర్వకవిప్రయోగములను వ్యావహారిక వాక్యములను ఈతడు ఉదహరించియున్నాడు. ఇది క్రీ,శ. 1852లో ప్రకటింపబడింది. 1806లో అల్పారంభమైనను 1830 వరకు ఆంధ్రగ్రంధము లచ్చ్వడుటకే నోచుకొననిదినములలో ఎన్నియో ప్రాచీన ప్రబంధముల సంపాదించి, కొన్ని టీకలు వ్రాయించి కొన్నిటిని ప్రకటించి తెలుగున వ్యాకరణము, నిఘంటువులు రచించి తెలుగుపండితులను కొనియాడి తెలుగు భాషకు బ్రౌను దొర నిరుపమానమగు సేవచేసియున్నాడు.ఈతని నిఘంటువే శాబ్దరత్నాకరమునకు, ఇటీవలి నిఘంటువులకును ప్రతిపాదికయై యెంతయో మేలుకూర్చెను.

బ్రౌను తరువాత పండితాదరణ పాత్రమైన సమగ్రాంధ్రనిఘంటువును సమర్ధతతో నిర్వహింప సమకట్టినవాడు పరవస్తు చిన్నయసూరి. ఈ పవిత్రసంకల్పముతో క్రీ.శ. 1875-80 ప్రాంతమున అకారక్రమమున పదముల్క పట్టికలు తయారుచేసి ప్రతిపదమునకు ప్రతియర్ధమునకు ప్రాచీనకవిప్రయోగములను పరమనిర్ధారకములుగా నున్నవి మాత్రమే కొన్నిటిని కొన్నిటిని జేర్చుకొని యుంచాడు కాని చిన్నయసూరి అర్ధనిర్ణయాదుల జేసి నిఘంటువు పూర్తిచేయుటకు నోచుకొనక దెవంగతుడు అగుటచే ఆతని నిఘంటురచనాద్యోమమే పెక్కురకు దెలియలేదు. ఇది ఆంధ్రుల దురదృష్టమే.

దీనిని శ్రీ. బహుజనపల్లి సీతారామాచార్యులు వారు క్రీ.శ. 1885లో రచించారు. ఇందు శబ్దార్ధస్వరూపనిర్ణయము శాస్త్రసమ్మతమగను, సమంజసముగను జేయబడుట నిది శ్రీఆచార్యులవారి సామర్ధ్యమును వేనోళ్ళ చాటునదై యున్నది. పదపదార్ధములకు పూర్వకవిప్రయోగములెన్నియో నొసగబడుట ఈ నిఘంటువునకు ప్రామణికత సిద్ధించింది. ఇది పూర్వ నిఘంటువులన్నింటికంటె ఉత్తమమైనది. కాని యతివిస్తృతమగు ఆంధ్ర్హభాషలోని పదజాలమెంతయో చేరవల్సైయున్నది. దీని మొదటి ప్రచురణ:1996.ముద్రణ:అసియన్ ఎడ్యుకెసనల్ సర్విసెస్,న్యూఢిల్లి.

దీనిని క్రీ.శ. 1888లో శ్రీ ఓగిరాల జగన్నాధకవి గారు రచించిరి. అకారక్రమమున ఆచ్చికపదముల అర్ధములు, అర్ధాంతరములు ఇందులో నున్నవి. కొన్నిచోట్ల పూర్వగ్రంధములనుండి ఆశ్వాసపద్యసంఖ్యారహితముగ కొన్ని ప్రయోగములు ఈయబడినవి.కాలక్రమమున పదములు అర్ధములు మారుచుండుటచె సుప్రశిద్ధప్రయోగశూన్యములైన నిఘంటువులు ప్రమాణికములు కాజాలవనుటకిది సాక్ష్యము.కాని నేడు మరుగుపడిన దేశ్యపదములు ఎన్నియో ఇందు ఉన్నాయి.

సంవత్సరం, నిఘంటు నిర్మాత, నిఘంటువు పేరు, ప్రచురించ బడిన ప్రదేశం.

దీనిని క్రీ.శ. 1903లో సరస్వతుల సుబ్బరామశాస్త్రి గారు రచించిరి. ఇది అచ్చతెలుగు నిఘంటువు.శ్రీ పం.తిరువెంకటాచార్య రచిత మగు శబ్దార్ధకల్పతరువు, శ్రీ తాటికొండ తిమ్మారెడ్డి విరచితమగు శబ్దార్ధచింతామణి చెప్పుంకొనుటకు విశేషణములు లేని లఘునిఘంటువులు.

దీనిని 1906లొ శ్రీమహంకాళి సుబారాయుడు రచించిరి. దీనిని చిన్న శబ్దరత్నాకరము అంటారు. ఇది పాఠశాలలలోని విద్యార్థులకు ఉపాధ్యాయులకు చాల ఉపయోగకరముగ ఉండును.

దీనిని 1903లో శ్రీ కొట్రలక్ష్మీనారాయణశాస్త్రి రచించిరి. ఇది ఒక శుద్ధాంధ్రప్రతిపదార్ధ పదనిఘంటువు. ఇదియును పిల్లశబ్దరత్నాకరమే. విద్యార్థులకు ఉపయోగికారియే.

దీనిని 1905లో శ్రీశిరోభూషణము రంగాచార్యులు గారు రచించిరి.ఇది ఇపుడు అలభ్యము.

దీనిని 1908లొ శ్రీ నాదెళ్ళ పురుషోత్తమకవిగారు రచించిరి. దీని యందు ప్రకృతి రూపప్రకాశిక, అన్యరూపదీపిక, విశేషరూపదర్శిక అను పలు విభజనలు ఉన్నాయి. ఇది పూర్వ నిఘంటువులనుండి ఈవిభజనములకు నౌవుగా పలుపదములను కొనికూర్పబడినవి.

ఆంధ్ర నిఘంటు రచనమున ఆధునికముగా అగ్రగణ్యస్థానమంద దగిన సూర్యరాయనిఘంటు రచనము 1920 సం.ప్రాంతమున చెన్నపురిలో ఆరంభమైనది. దీనికి శ్రీ పీఠికాపురాధీశులు అగు శ్రీ జయంతి రామయ్య పంతులు ఆశ్రయము. ఈ బృహన్నిఘంటువున అనేక తత్సమ శాబ్దములు పరిశీలనా పూర్వకముగా సంస్కృత నిఘంటువుల నుండి గైకొనబడినవి. వానికి సంస్కృత కావ్య నాటకాదుల నుండియు, ఆంధ్ర ప్రబంధములనుండియు నటనటనావశ్యకములని తోచిన చోటులను, అర్ధ విశేషములు గల చోటులను ప్రయోగములీయబడినవి. ప్రతిపదమునకును ప్రతి అర్ధమునకును ప్రామాణిక ప్రయోగములనో, నిఘంటువులనో, లేక శిష్టవ్యవహారమునో ఈనిఘంటువు చూపుచుండుటచే దీని కొక ప్రామాణికత ఇచ్చినట్లయినది. ఒక్కొక్క పదమునకు అర్ధమునకు ఒక్కొక్క పయోగమునేకాక పూర్వ పూర్వతర పూర్వతమ ప్రయోగములను ప్రధాన పదములక్రింద ఇచ్చి వాని అర్ధాంతరములను ప్రయోగ సహితముగా ఇందు వివరించిరి. శబ్దముల జన్య జనక సంబంధము కూడనిందు వివరింపబడింది.లోకవ్యవహారము నుండియు ప్రాచీన శిలాశాసనములనుండియు కొన్ని కొన్ని శబ్దములిందు గైకొనబడినవి. వానివానికి సముచితార్ధములు, అర్ధాంతరములు ఇందు పొందు పరచబడినవి.

లకంసాని చక్రధరరావు,ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ సంపాదకత్వంలో తెలుగు వ్యుత్పత్తి కోశం  పేరుతో తెలుగు నుండి తెలుగు నిఘంటువు 1,08,330 పదాలతో 8 సంపుటాలుగా వెలువడినది. 

ఆంతర్జాల నిఘంటువు

ఆధునిక కాలంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో మార్పులు (క్లుప్త సందేశ సేవ (SMS), ఇంగ్లీషు భాషా, సమాచార సాధనాలు, దృశ్య శ్రవణ మాధ్యమాలలో ఎక్కువ ఇంగ్లీషు పదాలు వాడుక) ప్రజల జీవనశైలి, వారి భాషపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితులలో తెలుగు భాషని సజీవంగా పుంచడానికి, కొత్తగా తయారయ్యే పరభాషా పదాలకి అనుగుణంగా తెలుగు పదాల నిర్మాణం జరగాలి. దీనికి ప్రస్తుతం ఎవరికి వారే యమూనాతీరే అన్నట్లుగా జరుగుతున్న పనిని కొంతవరకు సమన్వయం చేస్తున్న జాల స్థలాలున్నా   
మరింత మెరుగు చేయటానికి తెలుగు భాషా సంస్ధలు ముందుకి రావాలి.

ప్రింట్‌ రూపంలో ఉన్న నిఘంటువులకు గిరాకీ తగ్గిపోతోంది కాబట్టి ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలు ఇక నుంచి ఆన్‌లైన్‌లో మాత్రమే ఉండేలా ఆక్స్‌ఫర్డ్ ప్రెస్‌ వ్యూహం మార్చింది.




#Article 40: గోదావరి (373 words)


గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత అతి పెద్ద నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి,నిజామాబాదు జిల్లా రెంజల్ మండలం కందకూర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్ర ప్రదేశ్ లోనికి ప్రవేశించి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళా ఖాతములో సంగమిస్తుంది. గోదావరి నది మొత్తం పొడవు 1465 కిలోమీర్లు . ఈ నది ఒడ్డున చాలా ప్రఖ్యాత పుణ్యక్షేత్రములు, పట్టణములు ఉన్నాయి. భద్రాచలము, రాజమహేంద్రవరం వంటివి కొన్ని. ధవళేశ్వరం దగ్గర అఖండ గోదావరి (గౌతమి) ఏడు పాయలుగా చీలుతుంది. అది గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ, కశ్యప. ఇందులో, గౌతమి, వశిష్ఠ, వైనతేయలు మాత్రమే ప్రవహించే నదులు. మిగిలినవి అంతర్వాహిని లు. ఆ పాయలు సప్తర్షుల పేర్ల మీద పిలువబడుతున్నాయి.

పూర్వము బలి చక్రవర్తిని శిక్షించేందుకు శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తి మూడడుగుల స్థలం కావాలని అడుగగా బలి చక్రవర్తి మూడడుగులు ధారపోసాడు. మహావిష్ణువు ఒక అడుగు భూమి పైన, రెండో అడుగు ఆకాశం పైన, మూడో అడుగు బలి తలపై పెట్టి పాతాళం లోకి త్రొక్కి వేస్తాడు. భూమండలం కనిపించకుండా ఒక పాదం మాత్రమే కనిపించడంతో చతుర్ముఖ బ్రహ్మ కమండలం లోని నీటిలో సమస్త తీర్థాలను ఆవాహన చేసి ఆ ఉదకంతో శ్రీ మహావిష్ణువు పాదాలను అభిషేకించి, మహావిష్ణువును శాంతింపజేస్తాడు. అందువల్లనే గంగను విష్ణుపాదోద్భవి గంగా అని పిలుస్తారు. అలా పడిన గంగ పరవళ్ళు త్రొక్కుతుంటే శివుడు తన జటాజూటంలో బంధిస్తాడు. పరమశివుడిని మెప్పించి భగీరథుడు తన పితామహులకు సద్గతులను కలగజేయడానికి గంగను, గోహత్యాపాతకనివృత్తి కోసం గౌతమ మహర్షి గోదావరిని భూమికి తీసుకొని వస్తారు.
 
ఒకానొకప్పుడు దేశంలో క్షామం ఏర్పడి కరువుతో తినడానికి తిండి లేకుండా ఉన్న సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తితో తోటి ఋషులకు, వారి శిష్యులకు కరువు నుండి విముక్తి కలిగించి అన్నపానాలు దొరికే ఏర్పాటు చేశాడు. అప్పుడు ఆ ఋషులు తమకు లేని తపోశక్తులు గౌతమునికి ఉన్నాయని ఈర్ష్యతో ఒక మాయ గోవును పంపి గౌతముడి పాడిపంటలు నాశనం చేయించారు. గౌతముడు ఒక దర్భతో ఆ గోవును అదలించగా అది మరణించింది. గౌతముడు తాను చేసిన గోహత్యాపాతకం నివృత్తి కోసం శివుడిని మెప్పించి గంగను భూమి మీదకు తెప్పించాడు ఆ గంగయే గోదావరి లేదా గౌతమీ నది. ఈ నదిని ఆ చనిపోయిన గోవు మీద నుండి ప్రవహింపజేసి తన గోహత్యాపాతకాన్ని విముక్తి చేసుకొన్నాడు. ఆ గోవుకి స్వర్గప్రాప్తి కలిగింది. ఆ స్థలమే గోష్పాద క్షేత్రం. ఈ క్షేత్రమే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు పట్టణం.

దేశంలో ప్రతీ జీవ నదికీ పుష్కరం ఉన్నట్లే, గోదావరికి కూడా పుష్కరం ఉంది. పంచాంగము ప్రకారం గురుడు సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరికి పుష్కరం వస్తుంది. 2015, జూలై నెలలో గోదావరికి మహాపుష్కరం వచ్చింది.

(పూర్తి వ్యాసం కొరకు గోదావరి నది పుష్కరము చూడండి)

గోదావరి నది యొక్క పరీవాహక ప్రాంతము 3,13,000 చదరపు కిలోమీటర్ల మేర మహారాష్ట్ర, తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, ఒడిషా రాష్ట్రాలలో వ్యాపించి ఉంది. ఈ నది యొక్క ప్రధాన ఉపనదులు:

తెలుగులో తొలి కావ్యరచన కాలం నుండి గోదావరి ప్రాంతంలో అనేకమంది కవులు చాలా కావ్యాలను రచించారు. వీరిలో ఎక్కువమంది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్ళు. ప్రాచీనకాలం నుండి 1980 ప్రాంతం వరకు గోదావరి ప్రాంతంలో వెలసిన కవులీ వ్యాసంలో పేర్కొన్నారు:




#Article 41: సత్యయుగం (262 words)


సత్య యుగం (సంస్కృత: सत्ययुग), హిందూధర్మ సమయం ప్రకారం నాలుగు యుగాలలో ఇది మొదటిది.దీనిని కృత యుగం అని కూడా అంటారు. సత్య యుగం (యుగము లేదా యుగం), మానవత్వం దేవతలచే మానవత్వంతో పరిపాలించబడినప్పుడు, ప్రతి వ్యక్తి ఆచరించే పని స్వచ్ఛమైన ఆదర్శానికి దగ్గరగా ఉంటుంది. మానవత్వం, అంతర్గత మంచితనం కలిగి పాలించటానికి సర్వశ్రేష్టమైన పరమాత్మ అనుమతిస్తుంది. దీనిని కొన్నిసార్లు స్వర్ణయుగం అని పిలుస్తారు.సత్య యుగం 1,728,000 సంవత్సరాలు లేదా 4800 దైవిక సంవత్సరాలు ఉంటుంది.నైతికతకు ప్రతీకగా ధర్మ దేవుడు (ఆవు రూపంలో చిత్రీకరించబడింది) సత్యయుగంలో నాలుగు కాళ్లపై నిలబడ్డాడు.తరువాత త్రేతా యుగంలో ఇది మూడు కాళ్లపై, తరువాత ద్వాపరా యుగంలో రెండు కాళ్లపై నిలబడ్డది. ప్రస్తుతం జరుగుచున్న అనైతిక యుగంలో (కలియుగం) ఇది ఒక కాలు మీద నిలుచుని పరిపాలిస్తుంది. 

ప్రతి మతానికి దాని నియమాలు, భావాలు ఉన్నాయి. సమయం, విశ్వోద్భవ శాస్త్రం వివేక సిద్ధాంతాలు హిందూ మతాన్ని ప్రత్యేకమైనవిగా చేసాయి.సమయం సృష్టి, విధ్వంసం, చక్రంగా పరిగణించబడ్డాయి.హిందూ ధర్మసమయం ప్రకారం నాలుగు యుగాలుగా విభజించబడింది.ఇవి ఒకదాని తరువాత ఒకటిగా అనుసరిస్తాయి.వేదాల ప్రకారం సమయం గతించిపోయే చక్రంలాగా నాలుగు యుగాలుగా విభజించబడింది.అందులో మొదటిది సత్య యుగం -- 4 * 432000 సంవత్సరాలు, త్రేతా యుగం -- 3 * 432000 సంవత్సరాలు, ద్వాపర యుగం - 2 * 432000 సంవత్సరాలు, కలియుగం -- 432000 సంవత్సరాలుగా వేదాలు ప్రకారం నిర్వచించబడింది.సత్యయుగం నుండి యుగాలు గతించేకొద్దీ యుగాలు ధర్మం, జ్ఞానం,మేధో సామర్థ్యం, భావోద్వేగం, శారీరక బలం క్రమంగా క్షీణించడం జరుగుతుంది.భగవంతుడిని ధర్మం, అమల, యోగేశ్వర, పరమాత్మ, అవ్యక్త పేర్లతో పిలిచేవారు.

ఇందు భగవంతుడు నారాయణుడు, లక్ష్మీ సహితముగా భూమిని పరిపాలిస్తాడు. దీని కాల పరిమాణము 432000 * 4 = 1728000 అనగా పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం నాలుగుపాదాల మీద నడుస్తుంది. ప్రజలు ఎలాంటి ఈతిబాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారు.అకాలమరణాలుండవు.వైవశ్వత మన్వంతరములో సత్యయుగం కార్తీక శుద్ధ నవమి రోజు ప్రారంభమైంది.ధర్మం సుప్రీం. మానవని పొట్టితనం 21 మూరలుగా ఉంటుంది.మానవుడు అన్ని భ్రమల నుండి విముక్తి పొందుతాడు.శివుడు, సతీదేవి వివాహ కర్మ సత్య యుగంలో జరిగింది.ధర్మ స్తంభాలన్నీ పూర్తిగా ఉన్నాయి. సత్య యుగంలో, ప్రజలు మంచి, ఉత్కృష్టమైన పనులలో మాత్రమే నిమగ్నమయ్యారు.సత్య యుగంలో, విష్ణువు నాలుగు రూపాల్లో అనగా,మత్స్య,కూర్మ,వరాహ,నరసింహ అవతారలలో అవతరించాడు.సత్య యుగంలో మానవుడి సగటు ఆయుర్దాయం సుమారు 4000 సంవత్సరాలు.  జ్ఞానం, ధ్యానం, తపస్సు ఈ యుగంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.




#Article 42: ద్వాపరయుగం (367 words)


ద్వాపరయుగం హిందూ మత గ్రంథాలలో వివరించబడిన నాలుగు యుగాలలో మూడవది. దీని కాల పరిమితి 864,000 మానవ సంవత్సరాలు. ఈ యుగంలో నారాయణుడు శ్రీకృష్ణుడిగా అవతరించి పాపసంహారం చేసాడు. సంస్కృతంలో ద్వాపర అంటే రెండు ముందు, అంటే మూడవ స్థానంలో ఉంది. ద్వాపర యుగం త్రత యుగం తరువాత, కలియుగానికి ముందు ఉంటుంది. పురాణాల ప్రకారం, కృష్ణుడు తన శాశ్వతమైన వైకుంఠ నివాసానికి తిరిగి వచ్చిన క్షణంలో ఈ యుగం ముగిసింది. భాగవత పురాణం ప్రకారం, ద్వాపర యుగం 864,000 సంవత్సరాలు లేదా 2400 దైవిక సంవత్సరాలు ఉంటుంది.

ద్వాపర యుగంలో మతం రెండు స్తంభాలపై మాత్రమే ఉంది. అవి: కరుణ, నిజాయితీ. విష్ణువు పసుపు రంగును కలిగి ఉంటాడు. వేదాలను ఋగ్వేదం, సామ వేదం, యజుర్వేదం, అధర్వ వేదం అనే నాలుగు భాగాలుగా వర్గీకరించారు. ఈ కాలంలో, బ్రాహ్మణులు వీటిలో రెండు లేదా మూడు గురించి పరిజ్ఞానం కలిగి ఉంటారు. కాని అరుదుగా నాలుగు వేదాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారుంటారు. దీని ప్రకారం, ఈ వర్గీకరణ కారణంగా, విభిన్న చర్యలు, కార్యకలాపాలు ఉనికిలోకి వస్తాయి.

ద్వాపర యుగంలోని ప్రజలందరూ ప్రతి తరగతికి సూచించబడిన, శూరులైన, ధైర్యవంతులైన, ప్రకృతితో పోటీపడేవారుంతారు. వీరు తపస్సు, దాతృత్వాలలో మాత్రమే నిమగ్నమైన గ్రంథ ధర్మాన్ని సాధించాలని కోరుకుంటారు. వారు వివ్యమైన ఆనందం కోరుకుంటారు. ఈ యుగంలో, దైవిక తెలివి ఉనికిలో ఉండదు, అందువల్ల ఎవరైనా పూర్తిగా సత్యవంతులు కావడం చాలా అరుదు. ఈ మోసపూరిత జీవితం ఫలితంగా, ప్రజలు అనారోగ్యాలు, వ్యాధులు, వివిధ రకాల కోరికలతో బాధపడుతుంటారు. ఈ రోగాలతో బాధపడుతున్న తరువాత, ప్రజలు తమ దుశ్చర్యలను గ్రహించి, తపస్సు చేస్తారు. కొందరు భౌతిక ప్రయోజనాలతో పాటు దైవత్వం కోసం కూడా యజ్ఞాన్ని నిర్వహిస్తారు.

ఈ యుగంలో, బ్రాహ్మణులు యజ్ఞ, స్వీయ అధ్యయనం, బోధనా కార్యకలాపాలలో పాల్గొంటారు. వారు తపస్సు, మతం, ఇంద్రియాల నియంత్రణ, సంయమనంలో పాల్గొనడం ద్వారా దివ్యమైన ఆనందాన్ని పొందుతారు.

క్షత్రియుల ముఖ్యమైన విధి ప్రజలను రక్షించడం. ఈ యుగంలో వారు వినయపూర్వకంగా ఉంటారు. వారి భావాలను నియంత్రించడం ద్వారా తమ విధులను నిర్వర్తిస్తారు. క్షత్రియులు శాంతిభద్రతల అన్ని విధానాలను కోపంగా లేదా క్రూరంగా చేయకుండా నిజాయితీగా అమలు చేస్తారు. వారు సాధారణ పౌరులపై అన్యాయం లేకుండా ఉంటారు. తత్ఫలితంగా ఆనందాన్ని పొందుతారు.

రాజు పండితుల సలహాలను తీసుకుంటాడు. తదనుగుణంగా తన సామ్రాజ్యంలో శాంతిభద్రతలను నిర్వహిస్తాడు. దుర్గుణాలకు బానిసైన రాజు కచ్చితంగా ఓడిపోతాడు. సామ, దాన, భేద, దండోపాయాలు, ఉపక్ష నుండి ఒకటి లేదా రెండు లేదా అన్నీ వాడుకలోకి తీసుకురాబడ్డాయి. కావలసిన వాటిని సాధించడంలో సహాయపడతాయి. ప్రజా అలంకారం, క్రమాన్ని కాపాడుకోవడంలో రాజులు శ్రద్ధ చూపుతారు.

కొంతమంది రాజులు, పండితులతో పాటు కుట్రను రహస్యంగా పథకలు చేస్తారు. విధానాల అమలులో బలమైన వ్యక్తులు పనిని అమలు చేస్తారు. మతపరమైన కార్యకలాపాలను నిర్వహించడానికి రాజు పూజారులను నియమిస్తాడు. ఆర్థికవేత్తలు, మంత్రులను ద్రవ్య కార్యకలాపాలకు నియమిస్తాడు. 'సూర్య వంశం', 'చంద్ర వంశం' అనే రెండు క్షత్రియ రాజవంశాలు ఉన్నాయి.

వైశ్యులు ఎక్కువగా భూస్వాములు, వ్యాపారులు. వైశ్యుల విధులు వాణిజ్యం, వ్యవసాయం. వైశ్యులు దాతృత్వం, ఆతిథ్యం ద్వారా ఉన్నత గతులను సాధిస్తారు.

అధిక శారీరక పనిని కోరుకునే పనులను చేయడమే సుద్రుల విధి. ప్రతి ఒక్కరూ జన్మతః శూద్రులు, వారి పనులతో వారు క్షత్రియ, బ్రాహ్మణ లేదా వైశ్యులవుతారని వేదాలు చెబుతున్నాయి. హస్తినాపుర ప్రఖ్యాత ప్రధాని విదురుడు సుద్ర సమాజంలో జన్మించాడు. అతని జ్ఞానం, ధర్మం, అభ్యాసం కారణంగా బ్రాహ్మణ హోదా పొందాడు.

ఇవి కూడా చూడండి




#Article 43: యతి (253 words)


పద్య పాదంలో మొదటి అక్షరానికి ఆ పద్యం లక్షణములలో చెప్పబడిన యతి స్థానంలో మైత్రి గల అక్షరాన్ని వాడటాన్నే యతి మైత్రి అంటారు.

యతి అంటే విరామం అని అర్థం. లయబద్ధమైన పద్య నడకలో సహజంగా వచ్చే విరామాన్ని యతి స్థానం అంటారు. సంస్కృతంలో యతి విరామాన్ని సూచిస్తుంది. కానీ తెలుగు పద్యాలలో ఇది అక్షర సామ్యాన్ని నియమిస్తుంది. అంటే ఈ యతి స్థానంలో ఉండే అక్షరం పాదం మొదటి అక్షరంతో యతి మైత్రిలో ఉండాలనేది నియమం.

ఈ క్రింది అక్షర వర్గాలలో ఒక వర్గంలోని అన్ని అక్షరాలూ పరస్పరం 
యతి మైత్రిలో ఉంటాయి.

జననీస్తన్యము గ్రోలుచున్ జరణ కంజాతంబునన్ గింకిణీ
స్వన మింపారగ దల్లి మేన మృదుల స్పర్శంబుగా దొండ మ 
ల్లన యాడించుచు జొక్కు విఘ్నపతి యుల్లాసంబుతో మంత్రి వె 
న్ననికిన్ మన్నపు పొంపుమీర నొసగున్ భద్రంబు లెల్లెప్పుడున్
చివరి పాదంలో మొదటి అక్షరం న. యతిస్థానంలోని అక్షరం భ. ఈ రెండు హల్లులకీ యతి చెల్లదు. కానీ, భముందు పదం నొసగున్లో న్ ఉంది కాబట్టి, దానికి నతో యతి చెల్లుతుంది.

అంకము జేరి శైలతనయా స్తనదుగ్ధములాను వేళ బా 
ల్యాంక విచేష్ట దొండమున నవ్వలి చన్ గబళింపబోయి యా 
వంక గుచంబు గాన కహివల్లభ హారము గాంచి వే మృణా 
ళాంకుర శంక నంటెడి గజాస్యుని గొల్తు నభీష్ట సిద్ధికిన్!
రెండవ పాదంలో, మొదటి అక్షరంలో సంధి జరిగింది, బాల్య + అంక. అలాగే యతిస్థానంలో (10వ అక్షరం) కూడా సంధి జరిగింది, తొండమునన్ + అవ్వలి. సంధి జరగక ముందున్న అక్షరాలు అంకు, అకు యతిమైత్రి జరిగింది. అలాగే నాల్గవ పాదంలో, మృణాళ + అంకుర, గజ + ఆస్య. అక్కడ అంకు ఆకు యతిమైత్రి.

పై చెప్పినవి కాక మరికొన్ని ప్రత్యేక యతి మైత్రులు ఉన్నాయి. కాని అవి అరుదు.

సంస్కృత భాషయందు ఏలాక్షణికుడు విరచించిన చ్చందశాస్త్ర గ్రంధము నందైనను ప్రతిశ్లోకముయొక్కయు యతిస్థాన నిర్దేశములో భేదము కనిపించదు. ఆంధ్రములో ఈ యతిస్థాన నిర్దేశము ద్వివిధముగా కనిపిస్తున్నది. యతిర్విచ్చేధః అనెడు లక్షణ యుక్తమైన స్థానమునందే పద్యములో యతి నిర్దేశము చేయుటొకటి. రెండవది చిత్రకవి పెద్దనార్యుని లక్షణసార సంగ్రహమునందును అనంతుని చంధోదర్పణము నందును శార్దూల విక్రీడిత వృత్తలక్షణము చెప్పునప్పుడు వివరించినారు. ఇట్లే మరికొన్ని చంధోగ్రంధములలో యతిస్థాన నిర్దేశమునందు ఈ క్రింద బొమ్మలో వివరించబడినది.

యతి అనగా ముని, యోగి అనే అర్ధాలు కూడా ఉన్నాయి.




#Article 44: శార్దూల విక్రీడితము (140 words)


ఇది వృత్త ఛందస్సు క్రిందికి వస్తుంది. ప్రతి వృత్త పద్యములో ఈ లక్షణాలు ఉంటాయి. నాలుగు పాదములు ఉంటాయి, నియమిత గణాలు ఉంటాయి, నియమిత సంఖ్యలో ఆక్షరాలు ఉంటాయి, యతి, ప్రాస నియము ఉంటాయి.

సారాచార విశారదాయి నయితిన్ శార్దూల విక్రీడితా
కారంబై మసజమ్ము లిమ్ముగ సతాగప్రాప్తమై చెల్వగున్
శార్థూలం వృత్తమునందు గణములు

పాదాలు: నాలుగుప్రతి పాదంలోనూ అక్షరముల సంఖ్య = 19ప్రతిపాదంలోని గణాలు: మ, స, జ, స, త, త, గయతి : ప్రతిపాదంలోనూ 13 వ అక్షరముప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు

ఉదాహరణలుసవరించు

తాటంకాచలనంబుతో, భుజనటద్దమ్మిల్ల బండంబుతో, 
శాటీముక్త కుచంబుతో, సదృఢచంచత్కాంచితో, శీర్ణలా
లాటాలేపముతో, మనోహరకరాలగ్నోత్తరీయంబుతో
గోటీందుప్రభతో, సురోజభర సంకోచద్విలగ్నంబుతోన్,

భీమంబై తల ద్రుంచి ప్రాణముల బాపెం జక్ర మాశు క్రియన్
హేమక్ష్మాధర దేహముం జకితవన్యేభేంద్ర సందోహముం
గామ క్రోధన గేహమున్ గరటి రక్త స్రావ గాహంబు ని
స్పీమోత్పాహము వీత దాహము జయశ్రీ మోహమున్ గ్రాహమున్.

మూలాలు.

 

తాటంకాచలనంబుతో, భుజనటద్దమ్మిల్ల బండంబుతో, 
శాటీముక్త కుచంబుతో, సదృఢచంచత్కాంచితో, శీర్ణలా
లాటాలేపముతో, మనోహరకరాలగ్నోత్తరీయంబుతో
గోటీందుప్రభతో, సురోజభర సంకోచద్విలగ్నంబుతోన్,

భీమంబై తల ద్రుంచి ప్రాణముల బాపెం జక్ర మాశు క్రియన్
హేమక్ష్మాధర దేహముం జకితవన్యేభేంద్ర సందోహముం
గామ క్రోధన గేహమున్ గరటి రక్త స్రావ గాహంబు ని
స్పీమోత్పాహము వీత దాహము జయశ్రీ మోహమున్ గ్రాహమున్.




#Article 45: ఉత్పలమాల (105 words)


ఇది వృత్త ఛందస్సు క్రిందికి వస్తుంది. ప్రతి వృత్త పద్యములో ఈ లక్షణాలు ఉంటాయి. నాలుగు పాదములు ఉంటాయి, నియమిత గణాలు ఉంటాయి, నియమిత సంఖ్యలో ఆక్షరాలు ఉంటాయి, యతి, ప్రాస నియము ఉంటాయి.

భానుసమాన విన్భరన భారలగంబుల గూడి విశ్రమ
స్థానము నందు బద్మజ యుతంబుగ నుత్పలమాలయై చనున్.

పోతన తెలుగు భాగవతంలో 475 ఉత్పలమాల వృత్త పద్యాలను వాడారు. వాటిలో రెండింటిని ఉదాహరణగా ఇక్కడ.

పుణ్యుడు రామచంద్రుడట వోయి ముదంబున గాంచె దండకా
రణ్యము దాపసోత్తమ శరణ్యము నుద్దత బర్హిబర్హలా
వణ్యము గౌతమీ విమల వాఃకణ పర్యటన ప్రభూత సా
ద్గుణ్యము నుల్ల సత్తరు నికుంజ వరేణ్యము నగ్రగణ్యమున్

ఊహ గలంగి జీవనపుటోలమునం బడి పోరుచున్ మహా
మోహలతా నిహద్దపదమున్ విడిపించుకొనంగ లేక సం 
దేహముబోదు దేహిక్రియ దీనదశన్ గజ ముండె భీషణ 
గ్రాహదురంత దంత పరిఘట్టిత పాద ఖురాగ్ర శల్యమైన్

తిక్కన చెప్పిన ప్రసిద్ధమైన పద్యం [సారపు ధర్మమున్ విమల సత్యము]ఉత్పలమాలకు మరొక ఉదాహరణ.




#Article 46: సినిమా (561 words)


సమకాలీన సమాజంలో సినిమా ఒక అత్యంత ప్రాముఖ్యత గల అంశంగా అభివృద్ధి చెందింది. అనాదిగా ప్రదర్శనమౌతున్న కళారూపాలు నాటకాలు, నృత్యాలు, కథాకాలక్షేపాలు, బొమ్మలాటలు, కవితలు వంటి ఎన్నో కళలను ఒకటిగా మేళవించి, ఒకే మారు లక్షలాది ప్రేక్షకులముందుంచగల అపూర్వ సృష్టి సినిమా. ఇది పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానం వల్లనే సాధ్యమయ్యింది. 

సినిమాలో ఎన్నో అంశాలు మిళితమై ఉన్నాయి. కళ, నటన, పర్వవేక్షణ, కృషి, పెట్టుబడి, వ్యాపారం, రాజకీయం, మనోవిజ్ఞానం, సృజనాత్మకత ఇలా ఎన్నో అంశాలు కలిసి ఒక సినిమా రూపు దిద్దుకొంటుంది. కొంత నిజం, కొంత ఊహ, కొంత మాయాజాలం అన్నీ సినిమా తెరపైన ఆడే పాత్రలను ప్రేక్షకుల సమాజంలో భాగస్వాములుగా చేస్తాయి.

ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో సినిమాలు భారత దేశంలో తయారవుతున్నాయి. సినిమా ప్రభావం భారతీయులపైన, ప్రత్యేకించి తెలుగువారిపైన బాగా ఎక్కువ.

సినిమా, ఫిలిమ్, మూవీ, టాకీ అనేవన్నీ ఆంగ్లపదాలు. వీటి మధ్య కాస్త తేడాలున్నాయి గాని వీటన్నింటినీ ఇంచుమించు సమానార్ధకంగా వాడడం జరుగుతుంది. 

ఇక Motion Picture అనే ఆంగ్లపదానకి సరైన అనువాదపదంగా తెలుగులో చలనచిత్రం (సంస్కృత పదం నుండి चलच्चित्रम् అంటే కదిలేబొమ్మ అంటే అనేక భారతీయ భాషలలోకి మార్చబడింది) అంటారు. కాని సినిమా అనేదే బాగా జనబాహుళ్యంలో వాడే పదం. ఇంకా వెండితెర అనే పదాన్ని కూడా సినిమాను సూచిస్తూ వాడుతారు.

ఫొటోగ్రాఫిక్ ఫిల్మ్ పై కెమేరాతో వరుసలో చిత్రాలు ముద్రంచడం అన్నది సినిమాకు ప్రధానమైన ప్రక్రియ. ఫిల్మ్‌ను ప్రొజెక్టర్‌లో వేగంగా కదపడం వలన వరుస చిత్రాలన్నీ ఒకదానితో ఒకటి కలసిపోయి ఆ చిత్రాలు కదులుతున్నట్లుగా అనిపిస్తుంది. దీనిని Persistence of vision అంటారు. మొదట మూగగా ప్రారంభమైన సినిమాలకు తరువాత ధ్వని తోడయ్యింది. ఆపై రంగులు అద్దారు. అలా సినిమా చాలా కాలం నుండి వర్ధిల్లుతూ వస్తోంది.

అయితే అన్ని రంగాలలోలాగానే సినిమారంగంలో కూడా ఇటీవల చాలా సాంకేతికమైన మార్పులు సంభవించాయి. ముఖ్యంగా కంప్యూటర్లు, డిజిటల్ టెక్నిక్కులు, యానిమేషన్ వంటి సాంకేతిక ఆవిష్కరణలు సినిమా నిర్మాణాన్ని, ప్రదర్శనలను అనూహ్యంగా ప్రభావితం చేశాయి.

సినిమాకు అత్యవసరమైన సాంకేతిక సిద్దాంతం Persistence of Vision with Regard to Moving Objects అనే పరిశోధనా వ్యాసంలో 1824లో పీటర్ మార్క్ రోజెట్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు.

ఎడిసన్ లాబొరేటరీస్‌లో పనిచేసే లారీ డిక్సన్ అనే వ్యక్తి ప్రప్రథమంగా వరుసక్రమంలో చిత్రాలుండే సెల్యులాయిడ్ ఫిలిమ్‌ను తయారు చేశాడు. తరువాత 1894లో థామస్ ఎడిసన్ కైనెటో గ్రాఫ్ (కెమెరా), కైనెటోస్కోప్ (ప్రొజెక్టర్) అనే రెండు పరికరాలను ఆవిష్కరించాడు. ప్రేక్షకులు ఒక చూపుడు గొట్టం (eye piece) ద్వారా అద్దంపై ప్రతిబింబించబడిన కదిలే బొమ్మను చూడడం సాధ్యమయ్యింది. కైనెటోస్కోప్ పార్లర్లు అమెరికాలోను, యూరోప్‌లోను విస్తరించాయి.

అదే సమయంలో యూరోప్‌లో క్రొత్త కెమేరాలు, మరొకొన్ని పరికరాలు కనుగొన్నారు. బ్రిట్‌పాల్ అనే పరిశోధకుడు 1895లో యూరోప్‌లో ఒక ఫిల్మ్ ప్రొజెక్టరు పరికరాన్ని తయారు చేశాడు. ఫ్రాన్స్‌లో లూమిరె సోదరులు (ఆగస్టు లూమిరె, లూయిస్ లూమిరె) 1895లో ఒక సూట్‌కేసు సైజులో ఉన్న సినిమాటోగ్రాఫ్ పరికరాన్ని తయారు చేశారు. ఇందులో  కెమెరా, ఫిల్మ్ డెవెలప్‌మెంట్, ప్రొజెక్టర్ పనులన్నీ కలిపి చేయడం సాధ్యమయ్యింది. వారు తిరణాలవంటి జనసందోహాలలో ప్రజలవద్ద డబ్బులు తీసుకొని తమ కదిలే చిత్రాలను ప్రదర్శించడం ప్రారంభించారు. ఆధునిక సినిమాకు ఇదే నాంది అనవచ్చును. ఇతరులు కూడా ఇదే విధానాన్ని కొద్దిమార్పులతో (సాంకేతికంగానూ, వ్యాపారపరంగానూ) అనుకరించారు.

చిత్రాలకు ధ్వనిని చేర్చడానికి చేసిన ప్రయత్నాలు 1920 దశకం వరకు విజయవంతం కాలేదు. కనుక మొదటి 30 సంవత్సరాలు మూగబొమ్మలే రాజ్యమేలాయి. ప్రదర్శన సమమయంలో వ్యాఖ్యాతలు తోడవ్వడం, లేదా వాద్యబృందాల సహకారం ఇలా రకరకాల హంగులు సమకూర్చేవారు.

మొదట 1900 సంవత్సరంలో పారిస్‌లో చిత్రాలతో ధ్వని ప్రక్రియ కనుగొన్నారు. 1906లో లండన్‌లో యూజీన్ లాస్టే ఫిలిమ్‌తో ధ్వని విధానానికి పేటెంట్ పొందాడు. 1910లో ఇది ప్రయోగాత్మకంగా J'entends très bien maintenant అనే మాటలతో ధ్వనించింది. 1922లో బెర్లిన్‌లో ప్రేక్షకులముందు ధ్వనితో కూడిన చిత్రాన్ని ప్రదర్శించారు. 1923 నుండి న్యూయార్క్‌లో ప్రేక్షకులు డబ్బులిచ్చి టాకీ (శబ్ద చిత్రం)ను చూడడం ప్రారంభించారు. 1926లో వార్నర్ బ్రదర్స్ వారు వైటాఫోన్ అనే సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. 1927లో వారి The Jazz Singer చిత్రం కొంత మూగ గానూ, కొంత మాటలు, పాటలు కలిపి విజయవంతంగా ప్రదర్శింపబడింది. 1928లో The Lights of New York అనే పూర్తి ధ్వనితో కూడిన చిత్రం వచ్చింది. ఆ తరువాత అంతా టాకీల యుగమే.

సమకాలీన సమాజంలో సినిమా ఒక అత్యంత ప్రాముఖ్యత గల అంశంగా అభివృద్ధి చెందింది. అనాదిగా ప్రదర్శనమౌతున్న కళారూపాలు నాటకాలు, నృత్యాలు, కథాకాలక్షేపాలు, బొమ్మలాటలు, కవితలు వంటి ఎన్నో కళలను ఒకటిగా మేళవించి, ఒకే మారు లక్షలాది ప్రేక్షకులముందుంచగల అపూర్వ సృష్టి సినిమా. ఇది పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానం వల్లనే సాధ్యమయ్యింది.

సినిమాలో ఎన్నో అంశాలు మిళితమై ఉన్నాయి. కళ, నటన, పర్వవేక్షణ, కృషి, పెట్టుబడి, వ్యాపారం, రాజకీయం, మనోవిజ్ఞానం, సృజనాత్మకత ఇలా ఎన్నో అంశాలు కలిసి ఒక సినిమా రూపు దిద్దుకొంటుంది. కొంత నిజం, కొంత ఊహ, కొంత మాయాజాలం అన్నీ సినిమా తెరపైన ఆడే పాత్రలను ప్రేక్షకుల సమాజంలో భాగస్వాములుగా చేస్తాయి.

తొలినాళ్ళలో సినిమాలు నలుపు తెలుపులలోనే ఉండేవి. 1906లో జార్జ్ ఆల్బర్ట్ స్మిత్ కైనెమాకలర్ పేరుతో రెండు రంగుల చిత్రాన్ని తయారుచేశాడు. 1909లో ఈ విధానం వాణిజ్యపరంగా ప్రదర్శనకు అమలుచేయబడింది. కాని ఇందులో చాలా సమస్యలుండేవి. 1932లో టెక్నికలర్ అనే మూడు రంగుల ప్రక్రియ ఆరంభమైంది.






#Article 48: సీసము (పద్యం) (350 words)


సీస పద్యం చాలా ప్రాచీనమైనది. మొదటగా ఈ పద్యాన్ని గుణగ విజయాదిత్యుని కందుకూరు శాశనం (క్రీ.శ.850 సం) లో చూశారు. అంతకు ముందే ఎన్నో సవంత్సరాలనుంచీ ఉండి ఉండవచ్చు. ఈ పద్యం చాల వరకూ శిథిలమైందని చరిత్ర కారులు చెప్పారు. అయితే ఉన్నంతవరకూ కొమర్రాజు లక్ష్మణరావు గారు ఇచ్చారు.

శివ పద వర రాజ్య సేవితుండ
ఖిలుడు ననృతరిపు బలుడు నాహవరావ
దండమోద్య సిఘాసనుండగణిత
దానమాన్యుండు దయా నిలయుండును
భండన నండన పండరంగు
...................................కొలది లేని
కొట్టము ల్వోడిచి గుణక నల్ల
తాని పక్ష పాతి................
....................విభవ గౌరవేంద్ర..

ఈ పద్యంలో ఒక విశేషం ఏమిటంటే.. కొలది లేని అనే మాట వచ్చేదాకా అన్నీ తత్సమ పదాలే కావడం విశేషమే! ఈ పద్యం ఏ పాదానికి ఆ పాదం విడిపోకుండా వుండే గునుగు సీసం కావడం మరొక విశేషమని పెద్దలు చెప్తున్నారు. నాహవరావ దండమోద్య సిఘాసనుండగణిత దానమాన్యుండు అనే పెద్ద పెద్ద సమాసాలు అప్పుడే మొదలైన విశేషం గమనించారు గదా. కొమర్రాజు లక్ష్మణరావు నన్నయ యుగానికి చెందిన ద్రాక్షారామంలోని సీసపద్యశాసనాన్ని ప్రకటించారు. గిడుగు రామమూర్తి పంతులు ప్రకటించిన దీర్ఘసీసపద్యశాసనం మరొకటి నన్నయ కాలం నాటిదే అయివున్నది.

కలుగడే నాపాలి కలిమి సందేహింప
గలిమిలేములు లేక కలుగువాడు; 
నా కడ్డపడ రాడె నలి న సాధువులచే 
బడిన సాధుల కడ్డపడెడువాడు
చూడడే నా పాటు జూపుల జూడక
చూచువారల గృపజూచువాడు; 
లీలతో నా మొఱాలింపడే మొఱగుల
మొఱ లెఱుంగుచు దన్ను మొఱగువాడు;

క.
నల నగ సల భ ర త ల లో
పల నాఱిటి మీఁద రెండుఁ బద్మాప్త గణం
బులఁ దగి నాలుగు పదములఁ
జెలువగు నొక గీతి తోడ సీసము కృష్ణా !

ప్రాస నియమం లేదు.

వరధర్మకామార్థ వర్జితకాములై
విబుధు లెవ్వాని సేవించి యిష్ట
గతి బోందుదురు? చేరి కాంక్షించువారి క
వ్యయ దేహ మిచ్చు నెవ్వాడు కరుణ? 
ముక్తాత్ము లెవ్వని మునుకొని చింతింతు? 
రానందవార్ది మగ్నాంతరంగు 
లేకాంతు లెవ్వని నేమియు గోరక 
భద్రచరిత్రంబు బాడుచుందు?

సీసపద్యం ఎట్లా ఉండాలనేది ఒక ఆటవెలది పద్యంలో ఈ విధంగా చెప్పబడింది.

ఇంద్రగణములారు ఇనగణంబులు రెండు
పాదపాదమందు పల్కుచుండు
ఆటవెలదినైన తేటగీతియు నైన
చెప్పవలయు మీద సీసమునకు

సీస పద్యాన్ని ఒకేలాగా ఉండే నాలుగు పెద్ద పాదాలుగా కాని (1,1,1,1), ఈ ఒక్కో పెద్ద పాదాన్ని రెండు చిన్న పాదాలుగా (1,2,1,2,1,2,1,2) - మొత్తం ఎనిమిది పాదాలుగా - గాని వివరించవచ్చు. సీస పద్యంలో భాగం కాకపోయినా, సీస పద్యం తరువాత ఒక గీత పద్యం (ఆటవెలది లేదా తేటగీతి) వస్తుంది.

ఈ అచ్చ తెనుగు పద్యరీతులలో కచ్చితమైన గణాలు చెప్పకపోవటం వల్ల అన్ని పద్యాలు (అంతెందుకు ఒక పద్యంలోని అన్ని పాదాలు) ఒకే లయలో ఉండనవసరం లేదు. కాని వీటి లయను గుర్తించడం అంత కష్టం కాదు. పద్యాలు పైకి చదువుతుంటే లయ దానంతటదే అవగతం అవుతుంది.

 తిలకమేటికి లేదు తిలకినీ తిలకమా? పువ్వులు దురుమవా పువ్వుఁ బోడి
 కస్తూరి యలదవా కస్తూరికా గంధి? తొడవులు దొడువవా తొడవుతొడవ?
 కలహంస బెంపుదే కలహంస గామిని? కీరముఁ జదివింతె కీరవాణి?
 లతలఁ బోషింతువా లతికా లలితదేహ? సరసి నోలాడుదే సరసిజాక్షి?

 మృగికి మేతలిడుదె మృగశాబలోచన? గురులనాదరింతె గురువివేక?
 బంధుజనుల బ్రోతె బంధుచింతామణి? యనుచు సతుల నడిగె నచ్యుతుండు

నవవికచసరసిరుహనయన నిజయుగచరణ గగనచరనదిజనిత నిగమవినుత ఙలధిసుతకుశకలశ లలితమృగమదరుచిర




#Article 49: శ్రీశైల క్షేత్రం (1702 words)


శ్రీశైల క్షేత్రం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునందు కర్నూలు జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రము. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము. మెలికలు తిరుగుతూ, లోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం అయిన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి.

ఇక్ష్వాకులు,రెడ్డి రాజులు,చాళుక్యులు, కాకతీయులు, ముసునూరి, పెమ్మసాని, విజయనగర లాంటి రాజులు ఎందరో సేవలు చేసిన మహాక్షేత్రం. పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు పూజలు చేసిన శ్రీమల్లికార్జునుని పవిత్రధామం. శ్రీశైల దేవస్థానమునకు రక్షణ కొరకు కొందరు రాజులు చుట్టూ కోట లాంటి పటిష్ఠ కట్టడము నిర్మించారు. నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారములు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు,అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు. శ్రీశైలం ఒక భాస్కర క్షేత్రముః- ఆధారము గోకర్ణ కంఢము లోని, గోకర్ణ పురాణము అను సంసృత గ్రంథము ౬౬ వ. అధ్యాయము నుండి .... 
పర్వతాగ్రే నదీతీరే బ్రహ్మ,విష్ణు,శివై శ్రితే..........అను శ్లోక ప్రమాణముగా శ్రీశైలం ఒక భాస్కర క్షేత్రము అనుటలో ఎలాంటి సందేహము లేదు.శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది,అష్టాదశ శక్తి పీఠములలో ఆరవది, దశ భాస్కర క్షేత్రములలో శ్రీశైలం ఆరవది.

శ్రీశైలం చరిత్రకు ఆధారాలుగా ఉన్న శాసనాల్లో మొదటిది క్రీ.శ.6వ శతాబ్ది నాటిది. ఆరవ శతాబ్ది నాటి మైసూరులోని కదంబరాజుల తాల్గుండి శాసనంలో మొదటిసారి శ్రీశైలం పేరు కనిపిస్తోంది.

తెలుగు, తమిళ, కన్నడ గ్రంథాల్లో దీని ప్రశంస విస్తారంగా కనిపిస్తోంది. క్రీ.శ.6, 7 శాతాబ్దాల నాటి తమిళ శైవ గ్రంతం తేవరంలో అస్పర్, సుందర్, నమ్మందర్ అనే పేర్లున్న భక్తకవులు శ్రీశైలాన్ని గురించి గానం చేశారు. తిరుప్పాపురం (శ్రీపర్వతం) అని పేర్కొన్నారు. క్రీ.శ.14వ శతాబ్దం నాటి శైవకవియైన పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రములో కరమొప్పు దక్షిణ కైలాసము అంటూ శ్రీశైలాన్ని కీర్తించారు. తెలుగు సాహిత్యంలో తొలి యాత్రాచరిత్రగా పేరొందిన కాశీయాత్ర చరిత్రలో శ్రీశైలం 1830ల నాడు ఎలా ఉందన్న వివరాలు దొరుకుతున్నాయి. 1830లో చెన్నపట్టణం నుంచి కాశీకి యాత్రగా వెళ్ళిన గ్రంథకర్త ఏనుగుల వీరాస్వామయ్య ఆ ఏడాది జూన్ 16 నాటికి శ్రీశైలం చేరుకున్నారు. ఆయన వ్రాసిన దాని ప్రకారం 1830ల్లో ఈ ప్రాంతం కందనూరు నవాబు అధీనంలో ఉండేది. శ్రీశైలం కొండమీద వాసయోగ్యమైన పరిస్థితులు లేకపోవడమూ, క్రూరమృగాల భీతి ఉండడంతో ఈ ఆలయాల అర్చకులు, కందనూరు నవాబు తరఫున యాత్రికుల నుంచి హాశ్శీలు తీసుకునే ముసద్దీలు ఆత్మకూరు పట్టణంలో కాపురం ఉండేవారు. ఉత్సవాలకు వచ్చే సాధారణ భక్తులకు ఒక్కొక్కరికీ రూ.7, గుర్రానికి రూ.5, అభిషేకానికి రూ.3, వాహనోత్సవం చేయిస్తే ఉత్సవపు సెలవులు కాక రూ.43, దర్పణసేవోత్సవానికి రూ.3 ప్రకారం నవాబుకు చెల్లించాల్సివచ్చేది. శ్రీశైలానికి వెళ్ళే నాలుగు బాటల్లో ఆత్మకూరు బాట తప్ప మిగిలిన దారులు ఉత్సవాలు కాని సామాన్యమైన రోజుల్లో వెళ్లేందుకు వీలే లేని స్థితిలో ఉండేవి. చెంచువాళ్ళ భయం, అడవి జంతువుల భయం విస్తరించివుండేది. చెంచువాళ్ళు ఆటవికులైనా అప్పట్లో చాలామంది దారినపోయే యాత్రికులను యాచించి తినే అలవాటు పడ్డారని వ్రాసుకున్నారు. ప్రతిరోజూ పల్లకీసేవ జరిగేది. చైత్రమాసంలో భ్రమరాంబ అమ్మవారికి తామసపూజలు జరిగేవి. అర్చకులు ఒకరొకరు మార్చి మార్చి డ్యూటీలు చేసుకునేవారని ఉంది.

పూర్వం అరుణాసురడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రీ మత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపదాలచే, చతుష్పదాలచే మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతీ భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమయి అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంతవరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెపుతుంది. తర్వాత దేవతలు పధకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురడు దేవ గురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్త పరుచగా, బృహస్పతి అందుకు నమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నమని, కాబట్టి ఈరాకలో వింత ఏమి లేదని చెపుతాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర రూపం ధరించి అసంసాఖ్యకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని సంహరిస్తాయి.

శ్రీశైలానికే సిరిగిరి, శ్రీగిరి, శ్రీపర్వతము, శ్రీశైలము మొదలైన నామాతరాలున్నాయి. శ్రీ అనగా సంపద, శైలమంటే పర్వతం కనుక శ్రీశైలమంటే సంపద్వంతమైన పర్వతమని అర్థం. దీనికి శ్రీకైలాసం అనే పేరుతో వ్యవహారం వుండడమూ ఉంది. క్రీ.శ.1313లోని ఒక శాశనాన్ని అనుసరించి దీనికి శ్రీ కైలాసము అనే పేరూ ఉన్నట్టు తెలుస్తోంది. దానిలో మహేశ్వరులు శ్రీకైలాసము (శ్రీశైలం) పైన నివసించారని ఉంది.

శ్రీ శైలంలో వసతిగా దేవస్థానమువారి సత్రములు, అతి పెద్ద కాటేజీలు, హొటల్స్ ఉన్నాయి. ఆంధ్రదేశములో ఎక్కడా లేని విధంగా కులప్రాతిపదికగా ఎవరికి వారుగా ప్రతి కులపువారికీ ఒక సత్రం నిర్వహింపబడుతున్నది. శివరాత్రి పర్వదినములు, కార్తీకమాసం నందు తప్ప మిగిలిన రోజులలో ఏసత్రములోనైనా ఎవరికైనా వసతి లభించును. ఈ సత్రములే కాక మరికొన్ని కర్ణాటక వారి సత్రముల, ప్రైవేటువారి సత్రములతోనూ శ్రీశైలం భక్తజనులతో కళకళలాడుతుంటుంది.

శ్రీశైలం చుట్టు ప్రక్కల దాదాపు అయిదు వందల వరకూ శివలింగాలు ఉంటాయంటారు. పరిసర ప్రాంతాలలో చూడదగిన ప్రదేశాలు, దేవాలయాలు,మఠాలు, మండపాలు, చారిత్రక స్థలాలు అనేకాలు ఉన్నాయి. చూపులకు కానరానంతగా విస్తరించుకొన్న శ్రీశైలము క్షేత్రములోని దర్శనీయ ప్రదేశాలను ముఖ్యముగా నాలుగు భాగాలుగా విభజించవచ్చు.అవి 1.శ్రీశైల దేవాలయ ప్రాంతము. 2.సున్నిపెంట ప్రాంతము, 3.మండపాలు, పంచమఠాల ప్రాంతము, 4.అడవిలో గల పర్యాటక ప్రాంతములు, చారిత్రక ప్రదేశాలు

శ్రీశైలంలో దేవాలయాలలో భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినది. దీనిలో శివ పార్వతుల విగ్రహాలు వుంటాయి. ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడుగా,, మాత పార్వతి దేవిని భ్రమరాంబగా పూజిస్తారు. శివ భగవానుడికి గల 12 జ్యోతిర్ లింగాలలో శ్రీశైలం ఒకటి కావున, హిందువులు ఈ దేవాలయానికి చాల ప్రాముఖ్యతనిచ్చి దర్శనం చేసుకొంటారు. ఇక్కడ కల మల్లెల తీర్థం అనే జలపాతాలలో స్నానాలు ఆచరిస్తారు. ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని మోక్షం వస్తుందని భావిస్తారు.

పంచమఠాలు అని పిలువబడే మఠాలు ఇక్కడ ఉన్నాయి. 

శ్రీశైలం ప్రక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది. కాకపోతే శ్రీశైలము చాలా ఎత్తులో ఉన్నది, నది మాత్రము క్రింద లోయలో ప్రవహిస్తుంది. అందుకే శ్రీశైలము నుండి చాలా మెట్లు దిగి కృష్ణానదిలో స్నానం చెయ్యాలి. ఈ కృష్ణానదినే ఇక్కడ పాతాళగంగ అనే సార్థక నామధేయముతో వ్యవహరిస్తారు. ఆ మెట్లు అన్నీ దిగి కృష్ణలో మునిగి తిరిగి ఎక్కినపుడు పాతాళగంగ అనునది ఎంత సార్థక నామధేయమో తెలుస్తుంది. పాతాళ గంగ వద్ద నీరు నీలంగా కాక పచ్చగా ఉంటుంది నీటి క్రింద బండలపై నాచు నిలచి సూర్య కిరణాల వెలుగు వలన పచ్చగా కానవస్తుంది. అయితే అందరూ నీటి క్రిందగల దీనిని పచ్చల బండ అని వ్యవహరిస్తారు.

ఇది ముఖ్యాలయానికి కొద్ది దూరంలో ఉంటుంది. ఈ గణపతి ఆలయము ప్రత్యేకత ఏమిటంటే మనము శ్రీశైలములో శివుడిని దర్శించినంత మాత్రముననే కైలాస ప్రవేశానికి అనుమతి లభిస్తుంది. అప్పుడు మనకు ఈ సాక్షి గణపతే సాక్ష్యము చెపుతాడు, మనము శ్రీశైలము వచ్చినాము అని.ఇతనిని సాక్షి గణపతి అంటారు.

శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైనది, ఈ  శ్రీశైల శిఖరం. శ్రీశైలములో శిఖరదర్శనము చేసుకొంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖరదర్శనము అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు; దూరంగా ఉన్న ఈ ఎత్తైనకొండ శిఖరేశ్వరం పై నుండి దూరంగా ఉన్న ఆలయ శిఖరాన్ని చూడాలి. అలా చూస్తే, శిఖరం కనిపిస్తే పునర్జన్మ నుండి విముక్తులవుతారు.

శిఖరేశ్వరమునకు, సాక్షిగణపతి గుడికి మధ్యగా హటకేశ్వరానికి సమీపాన  అందమైన లోయలో ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్య తపమాచరించిన ప్రదేశము ఉంది. ఇక్కడి శిలపై శంకరుని పాదముద్రలు ఉన్నాయి. కొండపగులులనుండి పంచధార (ఐదుధార) లతో ఉరికివచ్చే జలాలు చల్లగా ఏ కాలంలోనైనా ఒకే మాదిరిగా ప్రవహిస్తూ ఒక్కొక్కథార ఒక్కొక్క రుచితో నుండుట ఇక్కడి ప్రత్యేకత. ఒకథార నుండి జలము సేవించి ప్రక్కమరొక దాని నుండి సేవిస్తే మార్పు తెలుస్తుంది.

దేశం రాజకీయంగా అల్లకల్లోల పరిస్థితులలో ఉన్నప్పుడు, వివిధ దార్శనికులు,మతప్రచారకులు అశాంతికి దోహదంచేస్తున్న సమయంలో,భారతీయ సంప్రదాయానికి ఆధారమైన వైదిక వాజ్మయాన్ని సరిగా అధ్యయనం చేసేవారుగాని, వాఖ్యానించగలిగేవారుగాని చాలా అరుదుగా ఉన్న సమయంలో జన్మించిన శ్రీశంకరులు పరిస్థితులను చక్కదిద్ది ప్రజలలో వైదికథర్మస్ఫూర్తిని వ్యాప్తి చేస్తూ దేశంనలుమూలలా నాలుగు ప్రప్రసిద్ధ పీఠాలను స్థాపించి విస్తృతంగా పర్యటిస్తూ ఉండేవారు. అలా పర్యటించే సమయంలోచాలా కాలం శ్రీశైల పరిసరములందు తపమాచరించారు. ఈయన తపమాచరించిన ఈ ప్రదేశానికి ఒక మంచి కథనము ఉంది.

శంకరులు ఇక్కడ తపస్సు చేసుకొంటూ ఈపరిసరాలలో అద్వైతమత వ్యాప్తి చేయుచున్నకాలమందు, శంకరులు చేయు కార్యములు నచ్చని కొందరు ఆయనను అంతమొందించు యత్నముతో ఆపరిసరాలయందు బీభత్సము సృష్టించుచున్న ఒకపెద్ద దొంగలముఠానాయకుని రెచ్చగొట్టి, కొంత సొమ్మిచ్చి పంపించారు.అతడు ఇదే ప్రదేశమున పెద్ద కత్తితో మాటువేసి తపమాచరించుకొనుచున్న శంకరుని వెనుకగా ఒకేవేటున తలఎగరగొట్టు ప్రయత్నమున ముందుకురికెను.ఇక్కడ ఇది జరుగుచున్న సమయమున శంకరుని ప్రధాన శిష్యుడైన పద్మపాదుడు మల్లికార్జునుని దేవాలయమున ఈశ్వరుని ధ్యానించుచూ కూర్చొని ఉండెను. ఈశ్వరునే మనసున ఉంచి ధ్యానిస్తున్న అతనికి హటాత్తుగా ఈ దృశ్యము కనిపించెను.వెంటనే అతడు మహోగ్రుడైన శ్రీలక్షీనరసింహుని వేడనారంభించెను. ఇక్కడ శంకరుని వధించుటకు ఉరికిన ఆ దొంగలనాయకునిపై ఎటునుండో హటాత్తుగా ఒక సింహము దాడి చేసి, అతడి శరీరాన్ని ముక్కలుముక్కలుగా చీల్చివేసి ఎట్లు వచ్చినదో అట్లే మాయమయినది.ఈ విషయము శంకరులకు ధ్యానమునుండి బయటకు వచ్చిన తరువాత తెలియజేసారు. అంతవరకూ ఆయనకు జరిగినది తెలియదు.అధిక కాలము ఈప్రాంతమందు తపమాచరించిన గుర్తుగా ఇక్కడ ఉన్న పెద్ద బండపై శంకరుని యొక్క పాదముద్రలు ఉన్నాయి.

శివాజీ గొప్ప దుర్గా భక్తుడు. శ్రీశైల దేవాలయమును ఎన్నోసార్లు దండయాత్రలనుండి కాపాడి శ్రీశైలంలో భ్రమరాంబికా అమ్మవారి స్వహస్తాలతో వీరఖడ్గం అందుకొన్న ఘనుడు.అతని పేరున ఇక్కడ ఇంకనూ తుదిమెరుగులు దిద్దుకొనుచూ రెండు అంతస్తులుగా నిర్మింపబడిన శివాజీ సాంస్కృతిక , స్మారక భవనంలో- అతడి జీవిత విశేషాల కథనం, చిత్రాల ప్రదర్శన కొరకు మొదటి అంతస్తునూ, శివాజీ కాంశ్యవిగ్రహం కొరకు రెండవ అంతస్తునూ కేటాయించారు. మూడు రూపాయల నామమాత్రపు రుసుముతో సందర్శకులను అనుమతించుచున్నారు.

హటకేశ్వరం, కర్నూలు జిల్లా, శ్రీశైలం మండలానికి చెందిన గ్రామం. శ్రీశైలమల్లికార్జునదేవస్థానమునకు మూడు కిలోమీటర్ల దూరములో కల మరొక పుణ్యక్షేత్రం హటకేశ్వరం. ఇక్కడ హటకేశ్వరాలయము ఉంది. ఈ పరిశరాలలోనే శ్రీ ఆది శంకరాచార్యులవారు నివసించారు. పరమశివుడు అటిక (ఉట్టి, కుండ పెంకు)లో వెలియడంతో ఈ ఆలయంలోని ఈశ్వరుని అటికేశ్వరుడు అనేవారు రానురాను అదేమెల్లగా హటికేశ్వరస్వామిగా మారిపోయింది. హటకేశ్వర నామంతో ఆప్రాంతానికి రాకపోకలు సాగించే భక్తుల మాటగా హటకేశ్వరంగా పిలువ బడుతోంది. ఇక్కడ చెంచులు అదివాశీలు నివసిస్తున్నారు. ఈ దేవాలయ పరిశరాలలో పలు ఆశ్రమములు, మఠములు ఉన్నాయి. ఇక్కడికి వచ్చెందుకు శ్రీశైలం దేవస్థానము నుండి ప్రతి అర గంటకు బస్సులు ఉన్నాయి.

శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైనది, ఈ శిఖరేశ్వరం. శ్రీశైలములో శిఖరదర్శనము చేసుకొంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖరదర్శనము అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు,అక్కడ ఉన్న నందిని రోలుమాదిరిగా నున్న దానిలో నవధాన్యాలు వేసి ఈశ్వరుని స్మరించి అటూ ఇటూ వీలుగా త్రిప్పుకొనుచూ సుదూరంగా ఉన్న శ్రీమల్లిఖార్జుని ఆలయపు విమానంపైనున్న శిఖరాన్ని చూడుటకు ప్రయత్నించాలి.అలా చూసే క్రమంలో ఆవ్యక్తికి గనుక శిఖరం కనిపిస్తే కొద్ది దినాలలో చనిపోతారు, పునర్జన్మ నుండి విముక్తులవుతారు.

శ్రీ దత్తాత్రేయ స్వామి అవతార పరంపరలో 3వ అవతార పురుషుడైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహారాష్ట్రలోని కరంజా నగరంలో జన్మించి నర్సోబవాడాలోను, కర్ణాటకలోని గాణాగాపురంలోనూ తపమాచరించి చివరకు కదళీవనంలో అంతర్ధానమయ్యారు. వీరశైవ సంప్రదాయానికి చెందిన అక్క మహాదేవి కూడా ఇక్కడే అవతార సమాప్తి గావించారని ప్రతీతి.

శ్రీశైలంలోని సాక్షి గణపతి గుడి దాటాక కుడివైపు పాపనాశనం తీర్థం ఉంటుంది. దీనికి ఎదురుగా ఉన్న కాలిబాట భీముని కొలనుకు దారితీస్తుంది. ఈ మార్గంలో శతాబ్దాల కిందట రెడ్డిరాజులు మెట్లు కట్టించడం విశేషం. మెట్ల దారిలో ఒక కిలోమీటర్‌ వెళ్లాక.. దట్టమైన అడవితో విశాలమైన లోయ కనిపిస్తుంది. ఇక్కడున్న మహాద్వారం.. అందమైన లోకంలోకి స్వాగతం పలుకుతుంది. పెద్ద పెద్ద మెట్లు.. వీటికి ఇరువైపులా చెట్లు.. వాటికి అల్లుకున్న లతలు.. మనిషంత ఎత్తుండే పుట్టలు.. దారి పొడుగునా కనిపించే దృశ్యాలివి. ఈ దారిలో రెండు కిలోమీటర్లు నడక సాగిస్తే.. త్రివేణీ, త్రి పర్వత సంగమానికి చేరుకుంటారు.వందల అడుగుల లోతున్న లోయల మధ్య తూర్పు నుంచి ఒక సెలయేరు, దక్షిణం నుంచి మరో సెలయేరు వచ్చి.. చిన్న చిన్న జలపాతాలుగా దూకుతుంటాయి
లపాతాలు ఏర్పరిచే కొలను మనోహరంగా ఉంటుంది. అదే భీముని కొలను. అంటే పెద్ద కొలనని అర్థం. అయితే ఇది మరీ అంత పెద్దగా ఏం ఉండదు. కానీ చాలా ప్రత్యేకమైనది. తూర్పు సెలయేరు, దక్షిణ సెలయేరు సంగమించి.. జలపాతంగా మారి ఒక గుండంలో దూకుతాయి. అక్కడ దూకిన జలాలు.. అనూహ్యంగా మాయమవుతాయి. ఒక పరుపు బండ కింది నుంచి రెండు వందల అడుగులు ప్రయాణించి మళ్లీ బయటకు వస్తాయి. భారీ పరుపు బండ మీద నిలబడితే.. దాని కింది నుంచి నీళ్లు పారుతున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. పరుపు బండ కింది నుంచి వెలుపలకు వచ్చిన నీళ్లు కొలనులోకి చేరడంతో నిరంతరం అలలు పుడుతుంటాయి. వేసవిలోనూ ఇక్కడ నీటి జాడ కనిపించడం విశేషం. అహోబిలం నరసింహస్వామి.. చెంచులక్ష్మిని వరించి భీముని కొలనులో సయ్యాటలాడాడని స్థానిక కథనం. కొలను ఒడ్డున భీమాంజనేయుల విగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడికి సమీప ంలోని పురాతన శివాలయం ఉంది. దీనిని సందర్శించి.. మరోసారి లోయల అందాలను చూస్తూ.. పొద్దుగూకే లోగా శ్రీశైల క్షేత్రానికి చేరుకోవచ్చు.

శ్రీశైలయాత్రకు తీసే హాశ్సీలు కందనూరునవాబుకు చేరుచున్నది. శివరాత్రి ఉత్సవములో శూద్రజనము 1కి ర్పూ 2, గురానికి ర్పూ 5, అభిషేకమునకు ర్పూ 3, వాహనోత్సవము చేయిస్తే ఉత్సవపు సెలవులు గాకగా 3, దర్మణసేవోత్సవమునకు ర్పూ 3. ఈప్రకారముగా పుచ్చుకొనుచున్నారు. శ్రీశైలమునకు నాలుగు భాటలు. ఎటుపోయినా నీశ్వర సంకల్పమేమో 4 ఆమడదూరము; ఛీకారణ్యమయిన దోవ. ఒక భాట నెల్లూరు మీద నచ్చి చుక్కల పర్వతము నెక్కవలసినది. మరియొకటి కంభం దూపాటి మీదవచ్చి చుక్కలకొండ నెక్కవలెను. మరియొక భాట పడమటి దేశస్థులు కృష్ణానది దాటి రావలసినది. ఆ కృష్ణ పాతాళగంగయని పేరువహించి శ్రీశైలము క్రింద ప్రవహింపుచున్నది. శ్రీశైలమునుంచి ఆగంగకు పోవలెనంటే రెండుకోసుల దూరము. దిగియెక్కవలెను. కొంతదూరము సుళువైన డోలీమీద పోవచ్చును. మెట్లు పొడుగుగనుక నెక్కడము, దిగడము కష్టము. నేను వచ్చిన యీ యాత్మకూరు భాట తప్పమిగతా మూడు భాటలు ఉత్సవకాలములలో నడవవల్సినది గాని తలుచుకొన్నప్పుడు నడవకూడదు. మృగభయము, చెంచువాండ్ల భయమున్ను విస్తరించియుండును. ఆ ఛెంచువాండ్లు అడివి మనుష్యులయినను యాత్రకు వచ్చేవారిని యాచించి తినే వాడికే పడియున్నారు. శివరాత్రి మొదలు చైత్రమాసమువరకు శ్రీశైలము మీద ప్రతిదినమున్ను పల్లకీసేవ అనే ఉత్సవము జరుగుచున్నది. ఛైత్రమాసములో భ్రమరాంబ యనే దేవికి తామసపూజ చేసి శ్రీశైలముమీద వచ్చియుండే జనులు విరామమును బొందుచున్నారు. అటుపిమ్మటనొకరిద్దరు అర్చకులు మాత్రము మార్చిమార్చి ఆయాత్మకూరు నుంచి వచ్చి యుంచున్నారు. ఎక్కువ నీళ్ళు ఒంటక జ్వరము, మహోదరము, సోభ మొదలయిన రోగములు కలుగుచున్నవి. శ్రీశైలమున గుడికి సమీప ముగా 20 చెంచుగుడిశేలున్నవి. వారున్న ఆ గుడిశెలు వదిలి బాధ్రపద మాసములో వలస పోవుచున్నారు. అప్పటికి వర్షాకాలము తీరి యీగెల ఉపద్రవము కలుగుచున్నది. అది సహించతగినది కాదు. గుడివద్ద స్వామికి ఆవులు 100 దనుక నున్నవి. కడప విడిచిన వెనుక ఆవుపాలు, పెరుగున్ను కండ్ల చూడవలెనంటే శ్రీశైలముమీద చూడవలసినది గాని ఇతర స్థలములలో ఆవులను మాత్రము కండ్ల చూడవచ్చును. ఆవుపాలు తీసుటలేదు, దూడలకు విడిచిపెట్టుచున్నారు. అంత జాగ్రత్తగా ఈ దేశస్థులు పసువులను కాపాడిన్ని, దున్నడముకు ఎద్దులు నెల్లూరుసీమనించి తెచ్చే వారివద్ద హమేషా వారికి కొనవలసి యున్నది. ఎనుములు పాడికే గాని అచ్చటి దున్నలు ఆభూమిని నిగ్గి దున్న నేరవు. తడవకు 18-20 వరహాలు పెట్టి యెద్దులను కొనుచున్నారు. ఆ యాత్మకూరి కాపురస్థులు అనేక పర్షన్ వాండ్లను గొప్ప, చిన్నలను చూచి మెరుగైనవారై యున్నారు. ముసాఫరులకు దేవి యాచకులయిన తెనుగు బ్ర్రాంహ్మణులు రెండిండ్లవారున్ను, స్వామి యాచకుడయిన జంగవాడొకడున్ను - వీరే స్థల మివ్వవలసినది గాని, యితరుల యిండ్లు గొప్పలయినను స్థల మివ్వరు. 2-3 చిన్న దేవస్థలములు, చావిళ్ళున్ను న్నవి. తప్పితే అందులో దిగవలసినది. ఆయాత్మకూరినించి పట్టణపు షవారీల మీద కష్టముగా శ్రీశైలపర్వతమునకు పోయి చేరవచ్చునని తెలియనందుచేత మూడు డోలీలు 2 రూపాయీలకు చేయించినాను. వాటిని నొక దినములో అక్కడి వడ్లవాడు చేసాడు. అక్కడి రూపాయికిన్ని చెన్నపట్టణపు రూపాయికిన్ని సుమారు కాలురూపాయి భేదమున్నది. పట్టణపు రూపాయి 1 కే అక్కడి రూపాయి12 ఎనిమిదిమంది కూలి బోయీలను అక్కడి వారిని శ్రీశైలమునకు పోయి రాగలందులకు జనము 1 కి రూపాయిలు 4 లెక్కను కుదుర్చుకొన్నాను. (పుటలు. 14-15)




#Article 50: తిరుమల (855 words)


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని పట్టణం తిరుపతి. ఈ పట్టణాన్ని ఆనుకొని ఉన్న కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న వూరు తిరుమల. ఈ రెండింటినీ కలిపి తిరుమల తిరుపతి అని వ్యవహరిస్తూ ఉంటారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రతిదినం లక్ష నుండి రెండు లక్షల వరకు భక్తులు సందర్శిస్తుంటారు. ప్రత్యేక దినాలలో 5 లక్షలమంది వరకూ దర్శనం చేసుకొంటారు..

 
 
శ్రీ వైఖానస భగవఛ్ఛాస్త్రోక్త మార్గాన్ననుసరించి తిరుమలలో శ్రీవారికి రోజుకు ఆరుసార్లు పూజలు జరుగుతాయి. దీనినే ఆగమ పరిభాషలో షట్కాల పూజ అని అంటారు. అవి... ప్రత్యూష, ప్రాత:కాలం, మధ్యాహ్న, అపరాహ్ణ, సాయంకాల, రాత్రి పూజలు. తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ ప్రత్యూష పూజలకు నాంది. 

రోజువారీ అర్చనలు, ధూపదీపనైవేద్యాలు కాకుండా సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో తిరుమలవాసుడికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. అవి సోమవారం విశేషపూజ, మంగళవారం అష్టదళ పాద పద్మారాధన, గురువారం సడలింపు,నేత్ర దర్శనం,తిరుప్పావడ, సాయంత్రం పూలంగిసేవ, శుక్రవారం అభిషేకం. స్వామికి రోజూ కల్యాణోత్సవం జరిపిస్తారు. డోలోత్సవం, సహస్రదీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు, ఆర్జిత వసంతోత్సవం ఇవన్నీ ఉత్సవమూర్తులకు ప్రతి నిత్యం జరిగేవి.

తిరుమల గుడికున్న ఓ ప్రాముఖ్యత కాలినడక! తిరుపతి నుండి పైన కొండలమీద ఉన్న తిరుమల పట్టణానికి చేరడానికి కొండపైన కాలినడక కోసం మెట్లదారి ఉంది, భక్తులు ఈ దారిగుండా వెళ్ళి స్వామి వారిని దర్శించుకోవడం ఒక మొక్కుగా భావిస్తారు. తిరుమలకి నాలుగు లేదా అంతకంటే ఎక్కువ కాలిబాటలు ఉన్నాయని అంటారు। ప్రస్తుతం మాత్రం రెండు ఎక్కువ వినియోగంలో ఉన్నాయి. మూడవది, కడప నుండి ఉందని ప్రతీతి.

(వీటిని ధ్రువీకరించవలసి ఉంది. పరిశీలించగలరు)

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయ గర్భగుడి లోని ఒక దైవీకమైన పిల్లి గురించి మీకు తెలుసా! 
శ్రీ వారి గర్భగుడిలో ఒక పిల్లి అనుచానంగా నివసిస్తు వస్తోంది. మాములుగా శ్రీ వారి ఆలయం బంగారు వాకిలి తలుపులు తెల్లవారు జామున 3 గంటలకు సుప్రభాత సేవ సమయంలో అర్చకుల చే తెరువబడుతాయి. ఆ సమయంలో బంగారు వాకిలి లోపలికి అర్చకులు, జీయంగారు స్వామి, ఏకాంగితో పాటుగా 'సన్నిధి గొల్ల' అనబడే ఒక యాదవుడూ మాత్రమే ప్రవేశిస్తారు. కాని అదే సమయంలో అశ్చర్యకరంగా ఒక దైవీకమైన పిల్లి క్రమం తప్పకుండా వీరితో పాటుగా బంగారు వాకిలిలో ప్రవేశిస్తుంది. ఇది శ్రీ వారి లీల మాత్రమే గాని మరియొకటి కాదు. ఈ పిల్లి (లేక పిల్లులు)సుమారుగా 100 సంవత్సరముల(ఈ గుడితో సంబధం ఉన్నటువంటి పూర్వికుల నుండి గ్రహించిన సమాచారం మేరకు) నుండి శ్రీ వారి గర్భాలయంలో వున్నట్టు తెలుస్తోంది. మాములుగా రాత్రి శ్రీ వారి ఏకాంత సేవ సమయంలో తలుపులు మూసి వేస్తారు. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలు శ్రీ వారిని అర్చిస్తారని ప్రతీతి. ఆ సమయంలో గర్భాలయం ఎట్టి పరిస్థితుల్లోను లోపల ఎవ్వరు ఉండకుడదు. ఇది అనుచానంగా శ్రీ వారి ఆలయంలో వస్తున్న సంప్రదాయం. ఆశ్చర్యకరంగా ఈ పిల్లి కూడా ఈ నిబంధనను క్రమంతప్పక పాటిస్తుంది. ఆ తర్వాత తిరిగి సుప్రభాత సమయంలో నే అర్చకులతో పాటు ఈ పిల్లి లోనికి ప్రవేశిస్తుంది. ఈ పిల్లి శ్రీ వారికి నివేదించిన తర్వాత మాత్రమే ప్రసాదం స్వీకరిస్తుంది అది కూడా అర్చకులు పిల్లి చేసే సంజ్ఞలను గుర్తించి ప్రసాదాన్ని పిల్లి కోసం పెట్టినప్పుడు మాత్రమే అది స్వీకరిస్తుంది.అలాగే రాత్రి ఏకాంత సేవ సమయంలో శ్రీ వారికి నివేదించబడిన పాలు అర్చకులు ఇవ్వగా స్వీకరిస్తుంది. శ్రీ వారికి నివేదించని ప్రసాదాన్ని ఇది స్వీకరించదు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. మరొక విషయమేంటంటే ఈ పిల్లి ఆయుర్దాయం తీరిన వెంటనే ఆ స్థానంలో మరొక పిల్లి శ్రీ వారి కైంకర్యం చేయడానికి సిద్ధంగా వుంటుంది. ఈవిధంగా శ్రీ వారు మనుష్యులతో పాటు జంతువులను కుడా కటాక్షిస్తున్నారు!

తిరుమల వెంకన్నకు దాదాపు 45 టన్నుల స్వర్ణాభరణాలు ఉన్నాయి. శ్రీవారికి 12వ శతాబ్ది నుంచే రాజులు విశేషంగా కానుకలు సమర్పించారని ఆలయంలోని శాసనాధారాల ద్వారా తెలుస్తోంది. విజయనగర రాజుల కాలం (1450)లో శ్రీవారికి ఆభరణాల వెల్లువ ప్రారంభమైంది. ప్రధానంగా శ్రీకృష్ణదేవరాయులు పాలించిన 21 ఏళ్లు (1509-1530) స్వర్ణయుగమేనని చెప్పవచ్చును. తిరుమల ఆలయాన్ని ఏడుసార్లు సందర్శించిన శ్రీకృష్ణ దేవరాయలు విశేష కానుకలతో స్వామివారి భాండాగారాన్ని స్వర్ణమయం చేశాడు. శ్రీకృష్ణ దేవరాయలు 10-02-1513న శ్రీవారి ఆలయాన్ని సందర్శించి కెంపులు, పచ్చలు, వజ్రాలు, నీలాలు, మాణిక్యాలు, వైఢూర్యాలు, గోమేధికాలతో పొదిగిన వజ్రకిరీటాన్ని కానుకగా సమర్పించాడు. 1513 మే 2 న నవరత్నఖచిత ఉడుధార, స్వర్ణఖడ్గం, నిచ్చెన కఠారి, , , భుజకీర్తులు, 30 తీగల పతకం కానుకగా సమర్పించాడు. తంజావూరు రాజులు పాండ్యన్‌ కిరీటాన్ని కానుకగా సమర్పించారు. రాజులు పోయినా... మహ్మదీయ రాజ్యం, బ్రిటిష్‌ పాలన, మహంతుల శకం, ప్రస్తుతం ప్రజాస్వామ్య భారతంలో పాలక మండళ్ల వ్యవస్థ ఇలా ఆలయ నిర్వహణ పలు పుంతలు తొక్కినప్పటికీ కాలమాన పరిస్థితులతో నిమిత్తం లేకుండా స్వామి వారికి కానుకల వెల్లువ పెరుగుతూనే ఉంది.

స్వామి వారికి ఉన్న విశేష ఆభరణాల్లో 500 గ్రాముల గరుడమేరు పచ్చ ప్రధానమైనది. ఉత్సవాల్లో శ్రీవారికి దీన్ని అలంకరిస్తారు. బ్రిటిష్‌ పాలనలో చిత్తూరు కలెక్టర్‌గా పనిచేసిన థామస్‌ మన్రో పెద్ద గంగాళాన్ని కానుకగా ఇచ్చారు. స్వామివారి పూజకు వాడే 108 బంగారు పువ్వులను గుంటూరు జిల్లాకు చెందిన షేక్‌ హుస్సేన్‌ సాహెబ్‌ అనే ముస్లిం సమర్పించడం విశేషం. అర్చన సేవలో ఉపయోగించే 108 పద్మాలను హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌ మీర్జా సమర్పించారు. వేంకటేశ్వర హెచరీస్‌ సంస్థ 13 కిలోల కిరీటం సమర్పించింది గోయెంకా కుటుంబం 10 కిలోల కిరీటాన్ని కానుకగా ఇచ్చింది. పెన్నా సిమెంట్స్ ‌ సంస్థ రూ.5 కోట్ల విలువైన వజ్రాలతో పొదిగిన కఠి, వరద హస్తాలను సమర్పించింది. తితిదే కూడా స్వామివారికి వజ్రాలతో కిరీటం, హారం, శంఖుచక్రాలు, కర్ణపత్రాలు తయారుచేయించింది స్వామి వారికి ప్రస్తుతం ముఖ్యమైన 6 కిరీటాలు, 20 ముత్యాల హారాలు, 50 కాసుల దండలు, ఉత్సవ విగ్రహాలకు 7 కిరీటాలు ఉన్నాయి. వాటిలో వజ్రాల కిరీటం, గద్వాల మహారాణి కిరీటం ముఖ్యమైనవి. ఇవే కాకుండా సువర్ణపద్మపీఠం, సువర్ణపాదాలు, ఉదర బంధము, దశావతార హారము, బంగారు పులిగోరు, సువర్ణ యజ్ఞోపవీతం, తులసీ పత్రహారం, 4 కిలోల చతర్భుజ లక్ష్మీహారం, 32 కిలోల సహస్రనామ హారం, సూర్య కఠారి (ఖడ్గం), కటి వరద హస్తాలు, నాగాభరణాలు, భుజకీర్తులు, ఆకాశరాజు కిరీటం వంటి అనేక ఆభరణాలున్నాయి. ఇవి కాకుండా ఉత్సవాల్లో అలంకరించేందుకు ప్రత్యేక ఆభరణాలు ఉన్నాయి. వాటిలో రత్నకిరీటం, మేరు పచ్చ, రత్నాలతో చేసిన శంఖుచక్రాలు, రత్నాల కరపత్రాలు, రత్నాల కటి వరద హస్తాలు, 7 కిలోల రత్నాల మకర కంఠి, బంగారు వస్త్రాలు తదితరాలు ముఖ్యమైనవి. 2009వ సంవత్సరంలో గాలి జనార్ధన రెడ్డి 42 కోట్లు విలువ చేసే వజ్రాల కీరీటాన్ని శ్రీవారికి సమర్పించాడు.

రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే బస్సుల కోసం తిరుపతిలో నాలుగు బస్టాండ్‌లు ఉన్నాయి. మొదటిది రైల్వే స్టేషను ఎదురుగా ఉండే శ్రీ వేంకటేశ్వర బస్‌స్టేషను. రైళ్లు వచ్చే సమయానికి అక్కణ్నుంచి తిరుమలకు వెళ్లే బస్సులు బయలుదేరేందుకు సిద్ధంగా ఉంటాయి. బెంగుళూరు వైపు నుంచి వచ్చే బస్సులు సరాసరి అలిపిరి టోల్‌గేటు వద్ద ఉండే బాలాజీ లింక్ బస్‌స్టేషను‌కు వస్తాయి. టూరిస్టు వాహనాలు నిలుపుకోవడానికి అక్కడ విశాలమైన ప్రదేశం ఉంది. చెన్నై, హైదరాబాదు, విజయవాడ నగరాల నుంచి వచ్చే బస్సులు సప్తగిరి లింక్ బస్‌స్టేషను (పెద్ద బస్టాండ్)కు చేరుకుంటాయి. బృందాలుగా ప్రైవేటు వాహనాల్లో వచ్చే పర్యాటకుల కోసం రైల్వేస్టేషను వెనకవైపు శ్రీ పద్మావతీ బస్‌స్టేషను ఉంది. వీటిలో ఎక్కడ దిగినా సమీపంలోనే సుదర్శనం కౌంటర్లు ఉంటాయి.

తిరుమలకు దగ్గరి లోని రైల్వే స్టేషను తిరుపతి. తిరుపతి స్టేషనుకు దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుండి రైళ్ళు నడుస్తాయి. రైల్వేస్టేషను నుంచి కొండమీదకు ఆర్టీసీ దాదాపు నిమిషానికో బస్సు నడుపుతోంది. ముందుగానే దర్శన టిక్కెట్లు, కాటేజీ వసతి రిజర్వు చేయించుకుంటే అంతగా ఇబ్బంది పడాల్సిన పనిలేదు. స్టేషను నుంచి బయటకు వచ్చి సరాసరి కొండమీదకు వెళ్లిపోవచ్చు.

తిరుపతికి సమీపాన ఉన్న రేణిగుంట, తిరుమలకు అతి దగ్గరి విమానాశ్రయం. ఇక్కడికి ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాదు నుండి నేరుగా విమాన సేవలు ఉన్నాయి.

వెంకటేశ్వర స్వామిని మొట్టమొదట దర్శించే యాదవుల కులానికి చెందిన మహిళా గుడి మందిరం గొల్లమండపం. గొల్ల కులానికి చెందిన ఓ మహిళా తిరుమలలో పాలు అమ్ముకొని, వచ్చిన ఆదాయంతో గొల్ల మండపాన్ని నిర్మించింది. 




#Article 51: అహోబిలం (2405 words)


అహోబిలం, కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ : 518 543. ఇక్కడ ప్రసిద్ధి చెందిన లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉంది.

ఇది మండల కేంద్రమైన ఆళ్లగడ్డ నుండి 22 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నంద్యాల నుండి 60 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1019 ఇళ్లతో, 3732 జనాభాతో 1350 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1898, ఆడవారి సంఖ్య 1834. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 371 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1494. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 594549.పిన్ కోడ్: 518543.

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి ఆళ్లగడ్డలో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఆళ్లగడ్డలోను, ఇంజనీరింగ్ కళాశాల కె. కందుకూరులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ నంద్యాలలో ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం నంద్యాలలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కర్నూలు లోనూ ఉన్నాయి.

అహోబిలంలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

గ్రామంలో 7 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ఇద్దరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీ చదివిన డాక్టర్లు ముగ్గురు, డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతి పంపుల ద్వారా నీరు అందుతుంది. బోరు బావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

మురుగు నీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగు నీటిని నేరుగా జల వనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

అహోబిలంలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగు తున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 7 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

అహోబిలంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

అహోబిలంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

అహోబిలంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

వరి, కందులు, మినుములు

అహోబలం హిందూ యాత్రికులకే కాక, పర్యాటక కేంద్రంగా, కొండలు, నదులు, ప్రకృతి అలంకారాలకు నైసర్గిక స్వరూపాలు. ఇది ముఖ్యంగా వైష్ణవ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రం. పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలాన్ని అహోబలం అని కూడా వ్యవహరిస్తారు. నరసింహుడి బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంశించడం వల్ల అహోబలమైనది. ఎగువ మహోబలంలో ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంభువుగా బిలంలో వెలిసినాడు కావున అహోబిలం అని కూడా పిలుస్తారు. నరహరి తన అవతారాన్ని భక్తుల కోసం తొమ్మిది ప్రదేశాలలో ప్రకటించాడు కావున నవనారసింహక్షేత్రం అని అంటారు. నవనారసింహులలో దిగువ అహోబిలంలో పేర్కొనబడలేదు. కాని ఈ ఆలయప్రాశస్తం అమోఘమైనది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎగువ దిగువ అహోబల పుణ్యక్షేత్రాలను సందర్శించి తరిస్తారు. 
ఈ క్షేత్రం కర్నూలు జిల్లాలోని నంద్యాల రైల్వేస్టేషన్ కు 68 కిలోమీటర్ల దూరంలోని ఆళ్ళగడ్డకు 24 కిలోమీటర్ల దూరములో ఉంది. అన్ని ప్రధాన క్షేత్రముల నుండి అహోబిలం చేరడానికి మార్గాలు, రవాణా సౌకర్యములున్నవి. ఈ క్షేత్రం సముద్రమట్టమునకు 2800 అడుగుల ఎత్తులో ఉంది. అహోబలంలో ప్రదానమయినది భవనాశిని నది. లక్ష్మినరసింహుని పద సరసజములు కడిగే పాద్యంగా గగన గంగ భువికి దిగి వచ్చింది. ఈ దివ్య తీర్థంలో స్వయంభువుగా వెలసిన దేవదేవుడు ఉగ్రనరసింహస్వామి. పరమ భాగవతుడయిన ప్రహ్లాదుని రక్షించడం కోసం హిరణ్యకశిపుణ్ణి వధించడం కోసం హరి నరహరిగా ఆవిర్భవించాడు. ఆ అవతార కథ సాగిన ప్రదేశమే ఈ అహోబలక్షేత్రం.
దిగువ అహోబలంలో వెలసిన ప్రహ్లాదవరదుని సన్నిధానం లక్ష్మీనరసింహస్వామి విశిష్ట అద్వైతాలకు కార్యకలాపాలకు కేంద్రం. వేద ఘోషలతో దివ్యప్రబంధ సూక్తులతో అర్చకుల ఆరగింపులతో కోలాహలంగా ఉంటుంది. శ్రీ కార్యపరుల పరమ భక్తుల ఏకాంత భక్తికి అమృతవల్లి సమేత నరసింహుడు పరవశించి సేవింపవచ్చిన వారికి కోరకనే వరాలు అనుగ్రహిస్తాడు. ప్రహ్లాద వరదుడు లక్ష్మీ సమేతుడై సుందరంగా శేషపీఠం మీద అవతరించాడు. వీరి సహితంగా అమృతవల్లి సన్నిధి అండాల్ సన్నిధి ఉన్నాయి. ఇక్కడ వైష్ణవ ఆచార్యులకు, అళ్వారులకు ప్రత్యేక సన్నిధాలున్నవి.
వేంకటేశ్వరునకు పద్మావతి వివాహ సమయమున శ్రీ నరసింహస్వామిని ప్రతిష్ఠించి ఆరాధించాడు కావున ఈ ఐతిహ్యానికి గుర్తుగా వెంకటేశ్వరుని సన్నిధి, కళ్యాణ మంటపం ఉంది. ప్రహ్లాద వరదుడు ఉభయనాంచారులయిన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు స్వర్ణ కవచాలతో మూలమూర్తులకు దివ్యాభిషేకాలతో, దివ్య ఆభరణములతో నేత్ర పర్వంగా నిలిచింది. ఈ క్షేత్రం 108 దివ్య క్షేత్రములలో ప్రముఖమైనది. వైష్ణవ ఆళ్వారులు దర్శించి స్తుతించిన క్షేత్రమును మాత్రమే దివ్యక్షేత్రములు అంటారు. ఈ క్షేత్రం నల్లమల అడవులలో ఉంది. ఆదిశేషుడు పర్వతాకృతి పొందినాడని పౌరాణిక విశ్వాసం. ఈ పర్వత ప్రకృతి సౌందర్యానికి మురిసిపోయిన ఆదిశేషుడు వయ్యారంగా పవళించారు. ఆ పడగలపై శ్రీనివాసుడు, నడుముపై నారసింహుడు, తోకపై మల్లిఖార్జునుడు ఆవిర్భవించారు. వీరు నల్లమల మగసిరులుగా మలచారు. తిరుమల, అహోబిలం, శ్రీశైలం స్వయం వ్యక్త క్షేత్రాలు.
అహోబిలక్షేత్ర ప్రసిద్ధికి, అభివృద్ధికి ఎందురో రాజులు, రాజన్యులు, ఎన్నో సేవలందించారు. పల్లవులు, చోళులు, విద్యానగరరాజులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగరరాజులు, రెడ్డిరాజులు అభివృద్ధికి వికాసానికి తోడ్పడినారు. 15వ శతాబ్దంలో తురుష్కుల దండయాత్రలో అహోబిలక్షేత్రం పడి నలిగిపోయింది. రంగరాయల ప్రభువు తురుష్కుల మీద విజయం సాధించి జీయరుగారికి అహోబిలక్షేత్రాన్ని అప్పగించి, జయానికి గుర్తుగా ఉన్నతోన్నత మయిన జయస్తంభాన్ని దేవాలయ చివరి ప్రాకారమందు స్థాపించాడు. ఇది ఇప్పటికి మనం చూడవచ్చు. పరమశివ భక్తుడయిన ప్రతాప రుద్రమహారాజు దినచర్య ప్రకారం శివలింగం పోతపోయగా నృసింహాకృతి వచ్చినందుకు ఆ విగ్రహాన్ని మొదటి అహోబిల పీఠాధిపతి వారికి అప్పగించి, జీవితాంతం నరసింహుని సేవించి పూజించాడు. ఈ క్షేత్రానికి నగరి, నిధి, తక్ష్యాద్రి, గరుడాద్రి, శింగవేళ్ కుండ్రం, ఎగువ తిరుపతి, పెద అహోబిలం, భార్గవతీర్థం, నవనారసింహ క్షేత్రం అనే పేర్లు కూడా కలవని పురాణములు చెప్పుచున్నవి. 
తురుష్కుల దండయాత్రలో విచ్ఛిన్నమయిన అహోబల్ క్షేత్రానికి 43వ పీఠాధిపతి పంచసంస్కారాలలో 44వ పీఠాధిపతి ఆశీస్సులతో మధురాంతకం నుండి అహోబలం మేనేజర్ గా నియమితులయిన ఆర్. లక్ష్మినారాయణ కాలమునుండి పూర్వవైభవాన్ని సంతరించుకుంటూ వస్తున్నది. ఇతను వేద, ప్రభంధము, అధ్యయనము, మూర్తులకు అలంకారము చేయడంలో నిష్ణాతులు. ఎన్నో ఉత్సవాలను భక్తుల సహాయంతో పూర్వ వైభవాన్ని సంతరించుకునేటట్లు చేశారు. అదే క్రమంగా పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నది.
అహోబిల నృసింహుని సుప్రభాత సుందర సేవలు, ఏకాంత సేవల వరకు సొగసులను నింపుకున్నది. నవరాత్రులు విశేష దినములలో అయ్యవారు, అమ్మవారు, అద్దాల మంటపంలో వింత వెలుగులు విరజిమ్ముతున్నారు. విజయదశమి, సంక్రాంతి పార్వేట ఉత్సవాలలో స్థానికులు, చెంచుల విన్యాసాలు, విల్లంబుల ప్రయోగాలు గ్రామీణ వాతావరణానికి అద్ధం పడతాయి. ఆలయ విధులలో పూజ పునస్కారములలో తెలిసో తెలియకో జరిగిన శైతిల్యాలకు ప్రాయశ్చిత్తంగా, వర్చస్వంతంగా క్షేత్రం విరాజిల్లడానికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఎన్నో నిత్య సేవలు, ఆర్జిత సేవలు, ఉత్సవాలు, అభిషేకాలు, వేదాంత ఘోషలు, ప్రభంధ పారాయణములు, కళ్యాణోత్సవములు, ఆలయపాలకులు అనితరసాధ్యంగా నిర్వహిస్తారు.
తీర్థయాత్రలలో ప్రధానమయిన మండపం (తలనీలాలు), స్నానం దర్శనం మొదలయిన వాటికిక్కడ అవకాశమేర్పడింది. దిగువ అహోబిలం చేరుకుని, ప్రహ్లాదవరదుని సేవించుకొని ఇక్కడికి 8 కి.మీ దూరములోనున్న ఎగువ అహోబిలంలోని గుహాంతర్భాగాన నిలిచిన అహోబల నృసింహుని అర్చించుకొని భవనాశిని జలాలతో సేద తీర్చుకొని ఓర్పుతో క్రమంగా నవనారసింహ క్షేత్రాలను దర్శించుకొని ప్రహ్లాద బడిలో బండ మీద నిలిచి భాగవత సుందర జ్ఞాపకాలను పొంది ఉగ్రస్తంభ ప్రదక్షిణలతో పుణీతమై తీర్ధయాత్రను ఫలవంతం చేసుకోవడానికి నేడు చక్కని అవకాశమున్నది.

ఈ క్షేత్రాన్ని 1830ల్లో కాశీయాత్రచేసి దానిని గ్రంథస్థం చేసిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రా చరిత్రలో వర్ణించారు. ఆయన వ్రాసిన ప్రకారం 1830 నాటికి ఎగువ అహోబిలానికి, దిగువ అహోబిలానికి నడుమ చీకటిగల అడవి ఉండేది. అప్పటికి ఈ స్థలం కుంభకోణం వద్దనుండే అహోబళం జియ్యరు వారి ఆధీనం. వారి ముద్రకర్త అహోబిలానికి రెండు క్రోసుల దూరానగల బాచపల్లెలో ఉండి ఈ స్థలాన్ని చూసుకునేవారు. ముద్రకర్త యెగువ, దిగువ స్థలాల్లో అర్చన చేసే అర్చకులిద్దరికీ అప్పుడప్పుడూ నెలకు రూ.6 చొప్పున జీతం ఇస్తూవుండేవారు. గుడి ఖర్చులకు జియ్యరు పంపే డబ్బు తప్ప మరే దారీ ఉండేది కాదు. హైదరాబాద్ రాజ్యపు దివాను పేష్కరు రాజా చందులాలా ఈ క్షేత్రానికి సంవత్సరానికి రూ. వెయ్యి చొప్పున ఇప్పించేవారు. దిగువ అహోబిలంలో కొన్ని పేదల గుడిసెలు ఉండేవని, ఎగువన అవీ లేవని, జలము రోగప్రదం కావడంతో మనుష్యులు నివసించేందుకు భయపడేవారని వ్రాశారు. ఫాల్గుణమాసంలో బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో 400 వరహాల హాశ్శీలు ఆదాయం వస్తూండేదని, దానిని కందనూరి నవాబు తీసుకుని గుడికి చేయాల్సిన సౌకర్యాల గురించి మాత్రం పట్టించుకునేవాడు కాదని వివరించారు. ఉప్పుతో సహా ఏమీ దొరకని ప్రాంతంగా ఉండేది. ఏవి కావాల్సినా బాచపల్లె నుంచి తెచ్చుకోవాల్సి వచ్చేది. అక్కడ ప్రతిఫలించియున్న పరమాత్మ చైతన్యము, స్వప్రకాశము చేత లోకులకు భక్తిని కలగజేయుచున్నది గాని, అక్కడ నడిచే యుపచారములు దానికి నేపాటికిన్నీ సహకారిగా నుండలేదు. అని ఆయన వ్రాశారు.

ఈ పుడమి మీద ఉన్న నాలుగు దివ్యమైన నరసింహ క్షేత్రాలలో అహోబిల క్షేత్రం ఒకటి. రాక్షసుడైన హిరణ్యకశ్యపుని సంహరించడానికి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభమునందు, ఉద్భవించిన స్థలమే ఈ అహోబిలక్షేత్రము. ఈ స్థల పురాణం గురించి వ్యాస మహర్షి సంస్కృతంలో బ్రహ్మాండపురాణం అంతర్గతంలో 10 అధ్యాయాలు, 1046 శ్లోకములతో అహోబిలం గురించి వ్రాయబడింది.

అహోబిల స్వామి వారు తన పెళ్ళికి తానే స్వయంగా భక్తులను అహ్వాఇస్తానని అన్నారట. ఆరు వందల సంవత్సరాల క్రితం ఆ నాటి ప్రప్రథమ పీఠధి పతి శ్రీ శఠ గోప యతీంద్ర మహదేశికన్ వారు ఈ బ్రహోత్సవానికి శ్రీకారం చుట్టారు. ఆ నాటి నుండి ఈ నాటివరకు పర్వేట ఉత్సవాలు ఘనంగా 45 రోజుల పాటు జరగడం ఒక విశేషము. తిరుమలలో కూడా శ్రీ వారికి పార్వేట ఉత్సవాలు జరుగుతాయి. అటు పిమ్మట బ్రహ్మోత్సవాలు జరిగి గరుడోత్సవంతో అనగా మర్చి 17 న ఈ వేడుకలు పూర్తవుతాయి. అహోబిల స్వామి వారు తన వివాహ మహోత్సవానికి భక్తులను ఆహ్వానించడానికి అహోబిల పరిసర ప్రాంతంలో సుమారు 35 గ్రామాల్లో ఈ నలబైదు రోజులు సంచరిస్తాడు. పర్వేట ఉత్సవాలు ఈ గ్రామాలలో ఆ నలబైదు రోజులు జరుగుతాయి. ఈ నెలన్నర రోజులు అన్ని గ్రామాల్లో అందరికి పండగే. అన్ని వేడుకలె. స్వామి వారి పల్లకి మోసే బాధ్యత ఇక్కడి కొన్ని కుటుంబల వారికి తరతరాలుగా వంశ పారంపర్యంగా వస్తున్న ఒక సంప్రదాయము. సుమారు 120 మంది ఈ విధంగా స్వామి వారి సేవలో తరిస్తున్నారు.

ఎగువ అహోబిలంలో వేంచేసియున్న మూల విరాట్ కు ఉగ్రనరసింహస్వామి అహోబిల, అహోబల, నరసింహస్వామి, ఓబులేసుడు అని పిలుస్తారు. గరుడాద్రి, వేదాద్రి పర్వతముల మధ్యన ఈ ఎగువ అహోబిల ఆలయము ఉంది.

శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించిన లక్ష్మీనరసింహస్వామి వేంచేసినదే దిగువ అహోబిలం.అక్కడ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి

శ్ల్లో. తీర్థై రింద్ర సుపావనాశ నరసింహాఖ్యానకై రంచితే
  లక్ష్మీం ప్రాస్య గుహం విమాన ముపయన్ శ్రీ నారసింహో హరి:|
  దివ్యేహోబిల పట్టణే విజయతే ప్రాచీ దిశాస్యాననో
  ప్రహ్లాదాక్షి పదం గత: కలిరిపు శ్శ్రీమచ్చఠారి స్తుత:||

పా. అజ్గణ్ -ఇల- అజ్గోరాళరియాయ్, అవుణన్
  పొజ్గవాగమ్‌ వళ్ళుగిరాల్; పోழ்న్ద పునిద నిడమ్;
  పైజ్గాణనై క్కొమ్బుకొణ్డు; పత్తిమైయాల్; అడిక్కిழ்చ్
  చెజ్గణాళియిట్టిఱై -మ్‌ శిజ్గవేழ்; కున్ఱమే.
     తిరుమంగై ఆళ్వార్లు-పెరియతిరుమొழி 1-7-1

ఈక్షేత్రమున నవనారసింహులు కలరు. ఇక్కడగల అహోబిల మఠములోను లక్ష్మీనరసింహర్ వేంచేసియున్నారు

అహోబిల పర్వతము చుట్టును అనేక సన్నిధులు తీర్థములు ఉన్నాయి.

అహోబిలంలో వసతి సౌకర్యములు ఇంకా సరిగ్గా లేవు. వసతి కోసం మూడు అవకాశములు ఉన్నాయి.

చెన్నై-బొంబాయి రైల్వేమార్గంలో గల కడప స్టేషన్‌లోదిగి అక్కడ నుండి బస్‌లో 90 కి.మీ.దూరంలోని ఆళ్లగడ్డ అనే చోటదిగి అక్కడ నుండి వేరేబస్‌లో 25 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం చేరవచ్చు. నంద్యాల నుండి 45 కి.మీ.దూరంలో ఉంది. బస్ సౌకర్యం ఉంది. అన్నివసతులు ఉన్నాయి.

అహోబిలం దగ్గరలోని విమానాశ్రయం కర్నూలు. అక్కడనుండి రోడ్డు మార్గం ద్వారా వెళ్ళవచ్చు. 

అహోబిల క్షేత్రమందు నవనారసింహులు నవవిధ రూపాలలో ఎగువ, దిగువ అహోబిల చుట్టు ప్రక్కల వెలసియున్నారు

 జ్వాలా అహోబిల మాలోల క్రోద కారంజ భార్గవ
 యోగానంద క్షాత్రవత పావన నవ మోర్థ్యః

అనగా

గరుత్మంతునికి దర్శనమిచ్చిన నరసింహ స్వామి.
ముక్కోటి దేవతలు స్తోత్రము చేసినా కోపము తగ్గని నరసింహస్వామి ప్రహ్లాదుడు తపస్సు చేయగా స్వయంభువుడిగా వెలిశాడు. 

లక్ష్మీదేవికి ప్రియమైన నరసింహస్వామి
వేదాద్రి పర్వతంమీద లక్ష్మీనృసింహ స్వామిగా మా అనగ లక్ష్మి లోల యనగ ప్రియుడు అని అర్ధం. ఈ దేవాలయానికి మార్కొండలక్ష్మమ్మపేటు అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 1 కి.మీ దూరంలో ఈ ఆలయం ఉంది. స్వామి వారు ప్రసన్నాకృతిలో దర్శనమిస్తారు. వేదాద్రి శిఖరాన చదునైన ప్రదేశంలో ఈగుడి నిర్మించబడింది. ఇక్కడి శిల్పము వామపాదాన్ని మడుచుకొని, దక్షిణపాదాన్ని వంచి కిందకు వదలి సుఖాసీనుడై ఉన్నాడు. స్వామివారి ఎడమ తొడపై లక్ష్మీదేవి స్వామివారి వామ హస్తము లక్ష్మీదేవిని ఆ లింగనము చేసుకొన్నట్లుగా యున్నది. స్వామి శంఖు, చక్ర, వరద, హస్తాలతో యున్నది. భూతలం నుండి ఆవిర్భవించిన తామరపై లక్ష్మీదేవి పాదాలు ప్రకాశిస్తున్నాయి. ఇదొక ప్రశంతమైన సుందరమైన చోటు, ధ్యాన అనుష్టాలకు చక్కని వేదిక. ఈ నరసింహా స్వామిని పూజించినవారికి శుక్రగ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుంది.

వేదాద్రి పర్వతముయందు వేదములను భూదేవిని సోమకాసురుడు అపహరించుకొని పోగా వరాహ నరసింహుడుగా శ్రీమన్నారాయణుడు అవతరించి భూలోకం కిందకు వెళ్ళి సోమకాసుని సంహరించి భూదేవి సహితంగా పైకితెచ్చినందుకు ఈ క్షేత్రానికి వరాహ నరసింహ క్షేత్రమని పేరు. భూదేవిని ఉద్ధరించిన వరాహస్వామి. ఈ నరసింహా మూర్తిని దర్శించిన రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి.

కారంజ వృక్ష స్వరూపిమైన శ్రీ కారంజ నరసింహ మూర్తికి కరంజ వృక్షము క్రింద పద్మాసనంతో వేంచేసియున్న స్వామికి కారంజ నరసింహస్వామి అని పేరు.పగడలువిప్పి నిలిచిన ఆదిశేషుని క్రింద ధ్యాననిమగ్నుడైన మూర్తి.గోబిలుడనే మహర్షి తపస్సు చేసినందుకు ఆయనకు ప్రత్యక్షమైనారని, శ్రీ ఆంజనేయస్వామి ఇక్కడ తపస్సు చేయగా నృసింహస్వామి దర్శనమివ్వగా అందుకు ఆంజనేయుడు నాకు శ్రీరామ చంద్రమూర్తి తప్ప వేరెవ్వరు తెలువదనగా నృసింహుడు నేనే శ్రీరాముడ నేనే నృసింహస్వామి సాంగ (ధనస్సు) హస్తములతో దర్శన మివ్వగా ఈ స్వామికి కారంస్వామి అని పేరు. ఈ స్వామికి పాలనేత్రము (త్రినేత్రము) కలదు. అందుకే అన్నమయ్య పాలనేత్రానల ప్రబల విద్ద్యులత కేళి విహార లక్ష్మీనరసింహ అని పాడారు. ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి చంద్రగ్రహ అనుగ్రహం లభించును.

పరశురాముడు ఈ అక్షయ తీర్ధ తీరమందు తపస్సు చేయగా శ్రీ నృసింహాస్వామి హిరణ్యకశిపుని సంహరం చేసే స్వరూపంగా దర్శనమిచ్చాడు. కావున ఈ క్షేత్రానికి భార్గవ నరసింహ క్షేత్రమని పేరు. ఈ స్వామిని భార్గోటి అని ప్రాంతీయ వాసులు పిలుస్తారు. పరశురాముని పూజలందుకున్న దివ్యధామము. ఈ ఆలయం దిగువ అహోబిలానికి 2 కి.మీ. దూరంలో ఉత్తర దిశ (ఈశాన్యము) యున్నది. స్వామి వారి విగ్రహం, పీఠంపై చతుర్బాహయుతమై శంఖు చక్రాన్వితములైన ఊర్ద్వబాహువుల, అసురుని ప్రేవువులను చీలుస్తు రెండు హస్తాలు, ఖడ్గహస్తుడైన హిరణ్య కశిపుడు, ప్రక్కలోనే అంజలి ఘటిస్తున్న ప్రహ్లాదుడు, ప్రభావళిలో దశావతారములతో ఈ విగ్రహము కలిగియున్నది. ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి సూర్యగ్రహ అనుగ్రహం లభించును

               ఈ ఆలయం 2 కిలోమీటర్ల దూరంలో దిగువ అహోబిలమ్ నుంచి ఆగ్నేయ దిశలో ఉంది. హిరణ్యకశిప్పుడును చంపిన తరువాత, నరసింహ ప్రహ్లాదుడు అనేక యోగ భంగిమలను బోధించాడు. అందువలన,  యోగానంద నరసింహ అని పిలుస్తారు.
యోగమునందు ఆనందమును ప్రసాదించుచున్నాడు. కాబట్టి స్వామివారికి యోగానంద నరసింహ స్వామి అని పిలవబడుచున్నాడు. యోగపట్టంతో, విలసిల్లినాడు, ప్రహ్లాదుని ఈ యోగ నృసింహుని అనుగ్రహంతో యోగాభ్యాసం చేసినాడట. మనశ్చాంచల్యము కలిగిన బ్రహ్మ నరసింహుని గురించి తపస్సు చేసి మన:స్ధిరత్వమును సాధించెను. ఈ ప్రదేశము యోగులకు, దేవతలకు నిలయం.ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి శనిగ్రహ అనుగ్రహం లభించును

దిగువ అహోబిలమ్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో, దేవత యొక్క చిత్రం ముతక పొదలతో చుట్టుపక్కల ఉన్న పెపల్ చెట్టు కింద ఏర్పాటు చేయబడింది. అందువల్ల  చాతురత నరసింహస్వామిగా పిలుస్తారు  పద్మాసనంతో అభయహస్తాలతో నల్లగా నిగనిగలాడుతున్న ఈమూర్తి చాలా అందమైన ఆకర్షణీయమైన మూర్తి. హా హా హుహ్వా అను ఇద్దరు గంధర్వులు అతి వేగముతో గానం చేసి నృత్యం చేయగా నృసింహస్వామిసంతోషించి వారికి శప విమోచనం గావించెను. కిన్నెర, కింపుర, నారదుల ఈ క్షేత్రంలో గానం చేసిరి. సంగీతాన్ని అనుభవించినట్లు ఉండే ఈ స్వామిని చత్రవట స్వామి అని పిలుస్తారు. ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి కేతుగ్రహ అనుగ్రహం లభించును

పరమపావన ప్రదేశంలో ఏడుపడగల ఆదిశేషుని క్రింద తీర్చిదిద్దిన మూర్తి ఈ స్వామివారి పేరులోనే సమస్త పాపములను, సంసారంలో జరిగే సుఖ:దుఖా:లను తొలగించ గలిగే వాడని అర్ధమగుచున్నది. భరద్వాజ ఋషి ఇచ్చట తపస్సు చేయగా స్వామి వారు మహాలక్ష్మీ సహితంగా వారికి దర్శనమిచ్చారు. కావున ఈ స్వామికి పావన నరసింహస్వామి అని పేరు. ఈ క్షేత్రానికి పాములేటి నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 6 కి.మీ. దూరములో దక్షిణ దిశలో యున్నది. పాపకార్యములు చేసినవారు ఈ స్వామిని దర్శించినంతనే పావనులగుదురు. బ్రహ్మోత్సవముల దగ్గరనుండి ప్రతి శనివారం నృసింహ జయంతి వరకు అద్భుతంగా వేడుకలు జరుగును. ఈ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో భక్తులు వారి వారి కష్టములను, పాపములను భగవంతుని ప్రార్థనా రూపముగా సేవించి దర్శించుకుంటారు. ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి బుధగ్రహ అనుగ్రహం లభించును.జ్వాలా నరసింహస్వామి క్షేత్రము దగ్గర భవనాశని అనే జలపాతము ఉంది. అక్కడ స్నానంచేస్తే సకల పాపాలు పోతాయి అని భక్తుల నమ్మకం.

ఇది చిన్న గుహ. దీనినే ప్రహ్లాద బడి అంటారు. ఈ గుహ ఎదురుగా కొండలపైనుండి నీరు పడుతూ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ గుహ ఎదురుగా విశాలమైన రాళ్ళ చప్టాలాగా సహజసిద్ద కొండ ఉంటుంది, దానిపైన రకరకాల అక్షరాలు వ్రాసినట్లు గీతలు ఉంటాయి. ఈ అక్షరాలలో చాలా వాటికి పోలికలు గమనించవచ్చు!
ఈ గుహలోకి ఒకేసారి కేవలం ఐదుగురు మాత్రమే వెళ్ళగలుగుతారు

అహోబిలం మఠం చాలా ప్రసిద్ధి పొందినది. ఇది వైష్ణవ మత వ్యాప్తిలో కీలక భూమిక పోషించింది. సంకీర్తనాచార్యుడు, అన్నమయ్య ఇక్కడనే దీక్షపొంది మంత్రోపదేశం పొందినాడు. (లేదా వారి గురుపరపంపర ఈ మఠానికి సంబంధించినది). ఇది దిగువ అహోబిలంలో ఉంది. ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయము చాలా అందంగా, శిల్పకళలతో విలసిల్లుతుంది. మఠంలోనూ నరసింహస్వామి విగ్రహాలు ఉన్నాయి. వీని పూజాపునస్కారాలు చూడదగ్గవి.

ఇది అహోబిలంలోని ఎత్తైన కొండ, దీనిని దూరం నుండి చూస్తే ఒక రాతి స్తంభం మాదిరిగా ఉంటుంది దీని రెండు చీలికలను రెండు భాగాలుగా విభజించడం చూడవచ్చు. ఇది చిరస్మరణీయ దృక్కోణం . దీనిని చేరుకోవడం కొంచెం కష్ష్టం, కానీ ఒకసారి దీనిని చేరుకుంటే మంచి ట్రెక్కింగు చేసిన అనుభూతినిస్తుంది.

దీని పైన ఒక జండా (కాషాయం), నరసింహస్వామి పాదాలు ఉంటాయి.ఎగువ అహోబిలమ్ ఆలయం నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో, స్తంభం

దీని నుండే నరసింహస్వామి ఉద్భవించినాడని ప్రతీతి.
జ్వాలానరసింహ, భవనాశని దగ్గరలోని చిన్న కొండ అధిరోహించు రహదారి గుండా దీనిని చేరుకోవాలి.
జ్వాలా, ఉగ్ర స్టాంబామ్ అనే రెండు సన్నివేశాలను మీరు ఒక గైడ్ ను తీసుకోవలసి ఉంది. మిగిలిన అన్ని ఇతర దేవుళ్ళు సాపేక్షంగా సులభంగా చూడవచ్చు. జ్వాలా, ఉగ్ర స్తంభముల మధ్య కూడా జ్వాలా మార్గంలో గుర్తించబడింది. మీరు జాగ్రత్తగా చూసుకోవాలి.
ఒక గైడ్ అద్దె గెస్ట్ హౌస్ మేనేజర్ సంప్రదించండి. సంప్రదింపు వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. ఒక మార్గదర్శిని తీసుకోవడానికి వ్యయం మారుతుంది.అంచనా సుమారు రూ. 500 (2018 సెప్టెంబరు ప్రకారం)

శ్రీ అహోబిల మట్ మలోలా గెస్ట్ హౌస్ గా పిలువబడే అతిథి గృహాన్ని మఠం నిర్వహిస్తుంది. మొత్తం 14 గదులు, 4 సింగిల్ గదులు, 6 డబుల్ గదులు, 4 ట్రిపుల్ గదులు ఉన్నాయి. వీటిలో రెండు డబుల్ గదులు, రెండు ట్రిపుల్ గదులు ఎయిర్ కండిషన్ ఉన్నాయి. అదనంగా, 10 వసతి గృహాల గదులు ఉన్నాయి.
ఈ సమయంలో మేము ఆన్లైన్ రిజర్వేషన్లు తీసుకోరు. 
రిజర్వేషన్ల కోసం దయచేసి బద్రి నారాయణ్ అని పిలవండి 
PH: -08519-252045 / 252024 

వరి, అపరాలు, కాయగూరలు

వ్యవసాయం, వ్యవసాయాదరిత వృత్తులు

బాచేపల్లి తాండ 4 కిమి.బాచేపల్లి 8 కిమి.ఆలమూరు 9 కి.మీ, ఆర్.కృష్ణాపురం 11 కి.మీ, టి.లింగందిన్నె 11 కి.మీ, నరసాపురం 11 కి.మీ, ముత్తలూరు 13 కి.మీ.

దక్షణాన చాగలమర్రి మండలం, పశ్చిమాన దొర్నిపాడు మండలం, ఉత్తరాన సిర్వేల్‌ మండలం.

శ్రీ అహోబిల నృసింహ చరిత్ర (సంకలన కర్త - శ్రీ కిడాంబి వేణుగోపాలాచార్య, ప్రధాన అర్చకులు, శ్రీ లక్ష్మీ నృసింహ దేవస్థానం, అహోబిలం) 




#Article 52: భద్రాచలం (648 words)


భద్రాచలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, భద్రాచలం మండలానికి చెందిన జనగణన పట్టణం. 

ఇది గోదావరి నది దక్షిణ తీరాన ఉంది.భద్రాచలం మండలానికి ఈ పట్టణం కేంద్రం. దీనికి మరో పేరు శ్రీరామ దివ్యక్షేత్రం.ఇది పూర్వపు జిల్లాకేంద్రమైన ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పట్టణం, భక్త రామదాసు నిర్మించిన రామాలయానికి పేరొందింది. జిల్లాలోని పారిశ్రామిక కేంద్రాలైన పాల్వంచ 27 కి.మీ., మణుగూరు 35 కి.మీ.,కొత్తగూడెం 40 కి.మీ. దూరంలోను ఉన్నాయి. భద్రాచలము తప్ప మిగిలిన పుణ్యక్షేత్రాలన్ని పోలవరం ముంపు ప్రాంతాలుగా మారాయి. భద్రాచలం రెవెన్యూ డివిజను మొదట తూర్పుగోదావరి జిల్లాలో భాగముగా ఉండేది. అంధ్ర, హైదరాబాదు రాష్ట్రాలు విలీనమయి కొత్తగా ఖమ్మం జిల్లా ఏర్పడిన సమయములో దీనిని ఖమ్మం జిల్లాలో విలీనం చేయటం జరిగింది. తెలంగాణ ఉద్యమం తీవ్రముగా ఉన్న రోజులలో ఇది వివాదాస్పదం అయ్యింది.

భద్రాచలం గ్రామ పంచాయితీ 1962లో మద్రాసు గ్రామ పంచాయితీ చట్టం క్రింద ఏర్పడింది. తరువాత 26.07.2001న వచ్చిన ప్రభుత్వం చట్టం GOMs.No.245 (PR  RD) ప్రకారం ఇది ఒక పట్టణంగా గుర్తించబడింది. G.O.Ms.No.118 (PR  RD) తేది. 08.04.2002న, ప్రకారం ఈ పట్టణం పేరు శ్రీరామ దివ్య క్షేత్రం అని మార్చబడింది. హర్షభద్రాచలం టౌన్షిప్ గా తరువాత మునిసిపాలిటిగా ఎదిగినప్పటికీ 1/70 ఆక్ట్ అనుసరించి మరల దీనిని గ్రామపంచాయితీగా మార్చుట జరిగింది.

పూర్వం భద్రుడు అను భక్తుడు శ్రీ రాముడుకి తపస్సు చేసి, తను ఒక కొండగా మారి తనపై శ్రీ రాముడు వెలసే విధముగా వరము పొందాడు అంటారు. ఆ కొండకు భద్రుడు పేరు మీద భద్రగిరి అని తరువాతి కాలంలో ఆ పట్టణానికి భద్రాచలం (భద్ర + అచలం) అని పేరు స్థిరపడింది.

రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ముంపు మండలాలతో పాటు ఆయా గ్రామాలను. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి విలీనం చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను. ఉభయ గోదావరి జిల్లాల్లోకి కలుపుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ లోకి బదలాయించేందుకు పునర్విభజన చట్టంలోని సెక్షన్- 3లో పేర్కొన్నారు. అందుకనుగుణంగా ఖమ్మం జిల్లా పరిధిలోని కుక్కనూరు, వేలేరుపాడు, భద్రాచలం, కూనవరం, చింతూరు, వరరామచంద్రాపురం మండలాలతోపాటు బూర్గుంపహాడ్ మండలంలోని ఆరు గ్రామాలను ఆంధ్రప్రదేశ్-లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ - జిల్లాల ఆవిర్భావ చట్టం ప్రకారం ఆయా గ్రామాలను రాష్ట్రంలో కలుపుకుంటున్నట్లు తగిన ప్రతిపాదనలతో కూడిన ప్రకటనను 2014  మే 29న గెజిట్-లో ప్రచురించారు.

గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానీషా పాలనా కాలంలో భద్రాచల ప్రాంతానికి తహశీల్దారుగా కంచెర్ల గోపన్న ఉండేవాడు. ఇక్కడికి సమీపంలోని నేలకొండపల్లి గ్రామానికి చెందిన గోపన్న శ్రీరామ భక్తుడు. తాను ప్రజల నుండి వసూలు చేసిన పన్ను (6 లక్షల రూపాయలు) సొమ్మును ప్రభుత్వానికి జమ చెయ్యకుండా,1645 - 1680 మధ్య కాలంలో భద్రగిరిపై శ్రీ రాముడు వెలసిన ప్రదేశమందు ఈ రామాలయాన్ని నిర్మించాడు. దేవునికి రకరకాల నగలు - చింతాకుపతకం, పచ్చలపతకం మొదలైనవి - చేయించాడు.

ఆ సొమ్ము విషయమై తానీషా గోపన్నను గోల్కొండ కోటలో బంధించగా, ఆ చెరసాల నుండి తనను విముక్తి చెయ్యమని రాముణ్ణి ప్రార్థించాడు, గోపన్న. ఆ సందర్భంలో రామునిపై పాటలు రచించి తానే పాడాడు. ఇవే రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి. గోపన్న కీర్తనలకు కరిగిపోయిన రాముడు, దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన ప్రభుత్వ సొమ్మును తానీషాకు చెల్లించి, గోపన్నకు చెరసాల నుండి విముక్తి ప్రసాదించాడని ఐతిహ్యం. ఆ విధంగా కంచెర్ల గోపన్నకు రామదాసు అనే పేరు వచ్చింది.

దేవాలయమందు సీతా, లక్ష్మణ, హనుమంత సమేతంగా శ్రీరామచంద్రుడు ఇక్కడ అత్మారాముని రూపంలో కొలువుతీరి ఉన్నాడు. సీత, రాముని తొడపై కూర్చొని ఉన్నట్లు ఇక్కడి విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. మరే దేవస్థానంలోనూ లేని ప్రత్యేకత ఇది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వైభవంగా జరిగే సీతారామ కళ్యాణ ఉత్సవానికి అశేష ప్రజానీకం వస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కళ్యాణోత్సవానికి ముత్యపు తలంబ్రాలు, పట్టు వస్త్రాలు పంపించడం సాంప్రదాయం. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి, ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. రామదాసు చేయించిన వివిధరకాల నగలు దేవస్థానపు ప్రదర్శనశాలలో ప్రదర్శనకు ఉంచారు.

భధ్రాచలంలోని శ్రీరాముడిని వైకుంఠ రాముడు అని అంటారు. ఎందుకంటే ఇక్కడి రాముడు వైకుంఠమునకు వెళ్ళిన తరువాత మరల భూమి మీదకి వచ్చి, తన భక్తుడైన భద్రుడి కోరిక తీర్చి భద్ర పర్వతంపై నిలిచాడు.

మండలకేంద్రమైన భద్రాచలం యాత్రాస్థలం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో రోడ్డు రవాణా సౌకర్యం బాగా ఉంది. హైదరాబాదు నుండి ఖమ్మం, కొత్తగూడెం మీదుగా, విజయవాడ నుండి కొత్తగూడెం మీదుగా, రాజమండ్రి నుండి మోతుగూడెం మీదుగా, విశాఖపట్నం నుండి సీలేరు, చింతపల్లి మీదుగా, వరంగల్లు నుండి మహబూబాబాద్, ఇల్లందు మీదుగా రోడ్డు మార్గాలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి.

భద్రాచలం రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుసౌకర్యం లేదు. ఇక్కడికి 35కి.మీ.ల దూరంలోని కొత్తగూడెంలో ఉన్న భద్రాచలం రోడ్  స్టేషను అతి దగ్గరలోని రైల్వే స్టేషను. ప్రతిరోజూ హైదరాబాదు నుండి మూడు (కొల్లాపూర్ ఎక్స్ ప్రెస్, మణుగూరు ఎక్స్ ప్రెస్, కాకతీయ ప్యాసింజర్), మణుగూరు , విజయవాడ నుండి ఒకటి, రామగుండం నుండి ఒక రైలు ఈ స్టేషనుకు వచ్చిపోతాయి.

గోదావరి నది పక్కనే భద్రాచలం ఉండడంతో రాజమండ్రి నుండి ప్రతిరోజూ లాంచీ ద్వారా రాకపోకలు సాగుతూ ఉంటాయి. ఈ మార్గంలోనే పాపికొండలు కానవస్తాయి. భద్రాచలం కేంద్రంగా జరిగే విహారయాత్రల్లో ఈ జలమార్గం ప్రముఖమైనది.

వృద్ధులు, వికలాంగులు, నడవలేని వారు భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి ఆలయం చేరటానికి లిఫ్ట్‌ సౌకర్యం కలదు దక్షిణం వైపు మెట్ల నుంచి ఈ లిఫ్ట్‌ ఆలయ గాలిగోపురం ముందుకు చేరుస్తుంది

భద్రాచలం పట్టణం పేరును ప్రభుత్వం 2002లో శ్రీరామ దివ్యక్షేత్రం పట్టణంగా మార్చింది. భద్రాచలం రెవిన్యూ మండల జనాభాలో దాదాపు మూడోవంతు గిరిజనులు. వ్యవసాయాధారిత ఆర్థికవ్యవస్థ. పర్యాటకం మరో ప్రధాన ఆర్థిక వనరు. ప్రతీ వర్షాకాలంలోను గోదావరికి వరదలు వచ్చి భద్రాచలం పట్టణపు పల్లపు ప్రాంతాలు జలమయం కావడం సర్వసాధారణంగా ఉండేది. పట్టణ అభివృద్ధిలో భాగంగా నదికి వరదకట్టను నిర్మించిన తరువాత ఈ బెడద బాగా తగ్గింది. ప్రభుత్వ సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం (ఐ.టి.డి.ఏ) భద్రాచలంలోనే ఉంది. 




#Article 53: నది (205 words)


వర్షపు నీటి వలన కాని, ఎత్తయిన పర్వతాలలో మంచు కరిగిన నీటి వలన కాని చిన్న చిన్న పాయలుగా ప్రవహిస్తూ అవి ఒకదానికొకటి ఏకమై పెద్ద ప్రవాహంగా మారడమే నదిగా పరిగణించబడుతుంది. సాధారణంగా పెద్ద నదులు పర్వత ప్రాంతాలలో పుట్టి వేల కిలోమీటర్లు ప్రవహించి చివరికి సముద్రాలలో అంతమౌతాయి. కొన్ని నదులు భూమిలోనే ఇంకిపోతాయి. పశ్చిమ అమెరికా లోని ఎడారులలోను, సౌదీ అరేబియా లోని ఎడారులలోను ఇలా భూమి లోకి ఇంకిపొయే నదులు ఉన్నాయి. ఇవి వర్షాలు పడ్డప్పుడు మాత్రం పొంగి పొర్లుతాయి. వర్షం ఆగిపోగానే మిగిలిన నీరు నేలలోకి ఇంకిపోయి ఎండి పోతాయి. మన వైపు దొంగేర్లు ఇలాంటివే. ఇలా ఇంకిపోని నదులనే మనం జీవనదులు అంటాం. నేల లోకి ఇంకి పోగా మిగిలిన నీరే జీవనదులలో ప్రవహించేది. ఎంత నీరు ఇంకుతుందీ అనేది నదీ గర్భం అడుగున ఉన్న రాతి పొరల లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. అడుగున సున్నపు రాయి (లైమ్‌ స్టోన్‌) ఉంటే ఎక్కువ నీరు ఇంకే సావకాశం ఉంది. అడుగున నల్లసేనపు రాయి (గ్రేనైట్‌) ఉంటే నీరు అంతగా ఇంకదు.

భారత దేశాన్ని నదుల దేశం అంటే అతిశయోక్తి కాదేమో! నదులు దేశ ఆర్థిక సాంస్కృతిక స్రవంతిలో భాగమై పోయినవి. నదుల అనుసంధానం వల్ల పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నదుల అనుసంధానానికి తాను వ్యతిరేకినంటూ ఏఐసీసీ ప్రధానకార్యదర్శి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి వ్యతిరేకించారు. నదులను అనుసంధానం చేయాలని ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే నిర్ణయించారని, యూపీఏ కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ) లో కూడా దీనిని చేర్చారని అన్నారు.నీటి కొరతను అధిగమించడానికి నదుల అనుసంధానం ఒక్కటే మార్గమని నిపుణులు అభిప్రాయపడుతున్నారని, నదుల అనుసంధానంపై పరిశీలనకు 1982లోనే ఇందిరాగాంధీ జాతీయ నీటి వనరుల అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారని చెప్పారు. 2007లో జరిగిన జాతీయ అభివృద్ధి వేదిక సమావేశంలో కూడా నదుల అనుసంధానం ప్రాజెక్టును అమలు చేయాలని కోరానని చెప్పారు.




#Article 54: కంపాక్ట్ డిస్క్ (269 words)


కంపాక్ట్ డిస్క్ లేదా సి.డి. (Compact Disc లేదా CD), డిజిటల్ డేటాను భద్రపరచడానికి వాడే ఒక ఆప్టికల్ డిస్క్. ఆరంభంలో ఇది డిజిటల్ ఆడియోను రికార్డు చేయడానికి, భద్రపరచడానికి తయారుచేయబడింది. అక్టోబరు 1982నుండి కంపాక్ట్ డిస్కులు మార్కెట్‌లో లభిస్తున్నాయి. ఇప్పటికీ ఇవి డేటా, ఆడియో ఫైళ్ళకు సర్వసాధారణంగా వాడుతున్నారు. సాధారణంగా వాడే సి.డి.ల వ్యాసం 120 మి.మీ. ఇందులో 80 నిముషాల నిడివి గల ఆడియోను భద్రపరచవచ్చును. 60 మి.మీ. - 80 మి.మీ. మధ్య వ్యాసం ఉండే మినీ సి.డి.లలో 24 నిముషాల ఆడియోను రికార్డు చేయొచ్చును.
సీడీ పై భద్రపరిచిన డేటా ను బట్టి, లేదా భద్రపరచిన విధానాన్ని బట్టి (FORMAT) రకరకాల ఆ సీడీని వీసీడీ, ఆడియో సీడీ లేదా డేటా సీడీ అని పిలుస్తారు. వీసీడీ అంటే వీడియో సీడీ. దీనిలో సుమారు ఒక గంట సేపు నిడివి గల వీడియో భద్రపరచవచ్చు.

సి.డి.లను రూపొదించడానికి వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానం తరువాత మరింత అభివృద్ధి చెందింది. తత్ఫలితంగా మరిన్ని ప్రత్యేక సదుపాయాలున్న డిస్కులు ఆవిర్భవించాయి. CD-ROM, CD-R (ఒకేమారు వ్రాయగలిగేవి), CD-RW (మళ్ళీ మళ్ళీ వ్రాయగలిగేవి), సూపర్ ఆడియో సిడి, విడియో కంపాక్ట్ డిస్క్ (VCD), సూపర్ విడియో కంపాక్ట్ డిస్క్ (SVCD), ఫొటో సిడి, పిక్చర్ సిడి, CD-i, Enhanced CD - ఇలా ఎన్నో రకాల డిస్కులు లభిస్తున్నాయి. CD-ROM , CD-R లు ఇప్పటికీ అత్యధికంగా వాడుతున్న మీడియా సాధనాలు. 2004లో ప్రపంచ వ్యాప్తంగా 30 బిలియన్ డిస్కులు (CD audio, CD-ROM, CD-R) అమ్ముడయ్యాయి.

అంతకు ముందు వెలువడినా గాని అంతగా విజయవంతం కాని లేజర్ డిస్క్ టెక్నాలజీయే కంపాక్ట్ డిస్క్ ఆవిర్భావానికి పునాది. 1977లో ఫిలిప్స్ కంపెనీ ఆప్టికల్ లేజర్ డిస్క్ టెక్నాలజీలను అభివృద్ధి చేసింది. 1979లో సోనీ , ఫిలిప్స్ కంపెనీలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన జాయింట్ టాస్క్ ఫోర్స్ ఈ కంపాక్ట్ డిస్కులను రూపొందించింది.
ఒక సంవత్సరం ప్రణాళిక , శ్రమ అనంతరం తయారైన ప్రమాణాలకు అనుగుణంగా తక్కిన పరిశోధన నడిచింది. ఈ ప్రయత్నంలో పారిశ్రామికంగా డిస్కులను తయారు చేయడానికి అవసరమైన నిర్మాణ పరిజ్ఞానాన్ని ఫిలిప్స్ అందించింది. ఇంకా ఫిలిప్స్ సమకూర్చిన  (EFM) మరింత ప్లే టైమ్ అందించడానికి, గీతలు, ముద్రలనుండి రక్షణ కల్పించడానికి ఉపయోగపడే విధానం. సోనీ నుండి  విధానం,  విధానం సమకూరాయి. ఇలా కంపాక్ట్ డిస్క్ అనేది పలువురి సమష్టి కృషి ఆధారంగా రూపొందిన విజ్ఞానం. Compact Disc Story, లో ఈ ప్రయత్నంలో జరిగిన ప్రయోగాలు, చర్చలు, నిర్ణయాల గురించి చెప్పబడింది.




#Article 55: శ్రీశ్రీ (1269 words)


ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ (ఏప్రిల్ 30, 1910 - జూన్ 15, 1983). శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా అతను ప్రసిద్ధుడు. శ్రీశ్రీ హేతువాది, నాస్తికుడు. మహాకవిగా శ్రీశ్రీ విస్తృతామోదం పొందాడు. మహాప్రస్థానం అతను రచించిన కావ్యాల్లో ప్రసిద్ధమైనది.

శ్రీశ్రీ - శ్రీరంగం శ్రీనివాసరావు - 1910 సంవత్సరం పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించాడు. శ్రీశ్రీ జన్మించింది 1910 అన్నది నిర్ధారణ అయిన విషయమే అయినా అతను ఏ తేదీన పుట్టారన్న విషయంపై స్పష్టత లేదు. శ్రీశ్రీ తాను ఫిబ్రవరి 1, 1910 న జన్మించానని విశ్వసించారు. ఐతే పరిశోధకులు కొందరు సాధారణ నామ సంవత్సర చైత్రశుద్ధ షష్ఠినాడు జన్మించారని, అంటే 1910 ఏప్రిల్ 15న జన్మించారని పేర్కొన్నారు. విశాఖపట్నం పురపాలక సంఘం వారు ఖరారు చేసిన తేదీ 1910 ఏప్రిల్ 30 అని విరసం వారు స్పష్టీకరించారు. శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడగుట వలన ఇతను ఇంటిపేరు శ్రీరంగంగా మారింది. ప్రాథమిక విద్యాభ్యాసం విశాఖపట్నంలో చేసాడు. 1925లో SSLC పాసయ్యాడు. అదే సంవత్సరం వెంకట రమణమ్మతో పెళ్ళి జరిగింది. 1931 లో మద్రాసు విశ్వ విద్యాలయంలో బియ్యే (జంతుశాస్త్రము) పూర్తి చేసాడు.

వివిధ దేశాల్లో ఎన్నోమార్లు పర్యటించారు. ఎన్నో పురస్కారాలు పొందాడు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మొదటి రాజా లక్ష్మీ ఫౌండేషను అవార్డు వీటిలో కొన్ని. అభ్యుదయ రచయితల సంఘానికి (అరసం) అధ్యక్షుడిగా పనిచేసాడు. 1970లో అతను షష్టిపూర్తి ఉత్సవం విశాఖపట్నంలో జరిగింది. ఆ సందర్భంగానే అతను అధ్యక్షుడుగా విప్లవ రచయితల సంఘం (విరసం) ఏర్పడింది.

కొంతకాలం క్యాన్సరు వ్యాధి బాధకు లోనై 1983 జూన్ 15 న శ్రీశ్రీ మరణించాడు.

విశాఖపట్నం లోని బీచ్ రోడ్డులో అతని నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

శ్రీశ్రీ చాలా చిన్న వయసులోనే తన రచనా వ్యాసంగాన్ని మొదలు పెట్టాడు. తన 18 వ ఏట 1928 లో ప్రభవ అనే కావ్య సంపుటిని ప్రచురించాడు. ఈ రచనను సాంప్రదాయ పధ్ధతిలోనే రాసాడు. తరువాతి కాలంలో సాంప్రదాయికమైన గ్రాంధిక శైలి, ఛందస్సు వంటి వాటిని పక్కన పెట్టి వాడుక భాషలో మాత్రా ఛందస్సులో కవిత్వం రాయడం - ఇది గురజాడ అడుగుజాడ అని అతను అన్నారు - మొదలు పెట్టి గొప్ప కావ్యాలను రచించాడు.

తెలుగు వారిని ఉర్రూతలూగించిన ఎన్నో గొప్ప సినిమా పాటలను అతను రచించాడు. అల్లూరి సీతా రామ రాజు సినిమాకు అతను రాసిన తెలుగు వీర లేవరా.. అనేది శ్రీశ్రీ రాసిన ఆణిముత్యాల్లో ఒకటి. రెండవ భార్య సరోజతో కలిసి సినిమాలకు మాటలు రాసాడు.

ప్రాసకూ, శ్లేషకు శ్రీశ్రీ పెట్టింది పేరు. అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించడంలో శ్రీశ్రీ మేటి. వ్యక్తికి బహువచనం శక్తి అనేది అతను సృజించిన మహత్తర వాక్యమే! శబ్ద ప్రయోగంలో నవ్యతను చూపించాడు. ప్రగతి వారపత్రికలో ప్రశ్నలు, జవాబులు (ప్రజ) అనే శీర్షికను నిర్వహించాడు. పాఠకుల ప్రశ్నలకు సమాధానాలిచ్చే శీర్షిక అది. చతురోక్తులతో, శ్లేష లతో కూడిన ఆ శీర్షిక బహుళ ప్రాచుర్యం పొందింది.

శ్రీశ్రీ తన రచనా వ్యాసంగాన్ని తన ఏడవ యేటనే ప్రారంభించాడు. తన మొదటి గేయాల పుస్తకం ఎనిమిదవ యేట ప్రచురింపబడింది. అందుబాటులో ఏదుంటే అది - కాగితం గాని, తన సిగరెట్ ప్యాకెట్ వెనుక భాగంలో గాని వ్రాసి పారేశేవాడు.

శ్రీశ్రీ రచనల జాబితా ఇక్కడ ఇవ్వబడింది

శ్రీశ్రీ తన ఆత్మ కథను అనంతం అనే పేరుతో వ్రాశాడు. దీనిలో శ్రీశ్రీ తన జీవితంలోని ముఖ్య ఘట్టాలు, ఒడిదుడుకులు వివరించాడు. అతడి సమకాలీన కవులు, రచయితలు, ప్రసిద్ధ వ్యక్తులు మనకు ఈ పుస్తకంలో పరిచయం చేశాడు.

ఇతడు మద్రాసులో ఉండడంతోనూ, ఆధునిక కవి కావడంతోనూ సినిమావారి పరిచయం బాగా వుండేది. ప్రత్యక్షంగా సినిమాలతో సంబంధం లేకపోయినా పరోక్షంగా సంబంధం వుండేది. 1950లో ఆ సంబంధం పూర్తిగా ప్రత్యక్షమయ్యింది. తెలుగులో మొట్టమొదటి డబ్బింగ్ సినిమా ఆహుతికి ఇతడు మాటలు పాటలు వ్రాశాడు. ఇది హిందీ చిత్రం నీరా ఔర్ నందాకి ఈ సినిమా తెలుగు అనువాదం. కవిత్వంలో రకరకాల ఫీట్లు చెయ్యడం ఇతడికి తెలుసు కాబట్టి డబ్బింగ్ ఫీట్ కూడా ఇతనుే చేయగల సమర్థుడని ఈ అవకాశం దక్కింది. ఇది డబ్బింగ్ సినిమా అయినా దీనిలో శ్రీశ్రీ మంచి పాటలు వ్రాశాడు. ఈ పాటల మూలంగానే ఇతడికి రోహిణి సంస్థలో హెచ్.ఎం.రెడ్డి నెలకు 300 రూపాయల జీతమిచ్చి ఇతనిని ఆస్థాన రచయితగా వేసుకున్నాడు. నిర్దోషి సినిమాకు కొన్ని పాటలు వ్రాశాడు. మూనాన్ ప్రపంచం అనే సినిమా తీస్తూ ఇతడిని రచయితగా నెలకు 200 రూపాయలు జీతంతో నియమించుకున్నాడు. ఆ విధంగా ఇతడికి నెలకు 500 రూపాయలు రాబడి రావడంతో సినిమాలలో స్థిరపడ్డాడు. అలా ఈ ఉద్యోగాలు మూడేళ్ళపాటు సాగాయి.

ఒక సారి ఒక కన్నడ చిత్రానికి తెలుగులో డబ్బింగ్ డైలాగులు వ్రాయడానికి మైసూరుకు వెళ్ళినప్పుడు అక్కడ ఇతనికి బి.విఠలాచార్యతో పరిచయం కలిగింది. అతను కన్నడలో తీసిన కన్యాదానం అనే సినిమాను తెలుగులో కూడా నిర్మించదలచి శ్రీశ్రీని రచయితగా నియమించుకున్నాడు. ఇతడు మైసూరులో వుండి ఒక్కరోజులో 12 పాటలు వ్రాశాడు. ఇది ప్రపంచ చలనచిత్రలోకంలో ఒక రికార్డు!

తరువాత ఇతడు డబ్బింగ్ రచయితగా, పాటల రచయితగా స్థిరపడ్డాడు. ఎన్నో డబ్బింగ్ సినిమాలకు పాటలు, మాటలు వ్రాశాడు. మామూలు చిత్రాలకు కూడా ఎన్నో పాటలు వ్రాశాడు. అన్ని రకాల పాటలు ముఖ్యంగా ఉద్రేకం, ఉత్తేజం కలిగించే పాటలు ఇతడు వ్రాశాడు. ఇతడు స్వయంగా చెవిలో రహస్యం అనే డబ్బింగ్ సినిమాను తీసి నష్టపోయాడు. తరువాత ఇతడు ఉషశ్రీ పిక్చర్స్ అన్న సంస్థను స్థాపించి రుక్మిణీ కళ్యాణం అనే సినిమాను తీయాలని ప్రయత్నించాడు కాని అది సఫలం కాలేదు.

మరో ప్రపంచం,మరో ప్రపంచం,మరో ప్రపంచం పిలిచింది 
పదండి ముందుకు, పదండి త్రోసుకు!
పోదాం, పోదాం పైపైకి! పదండి ముందుకు పదండి అని ఉవెత్తున లేచి గర్జించిన సింహం వలె అరిచాడు.

శ్రీశ్రీ వ్యక్తిత్వంలో ఎన్నో విరుధ్ధమైన భావాలు, విచిత్రమైన సంఘర్షణలు కనిపిస్తాయి. అతను మొత్తంగా బహిర్ముఖుడు. తీవ్రవిమర్శలకు, పసితనపు మాటలకు సమంగా ప్రసిద్ధుడు. సిద్ధాంతాల గురించి, తోటి కవుల గురించి అతను అభిప్రాయాలు అత్యంత వేగంగా, అతితక్కువ హేతుబద్ధంగా మారుతూండేవి. ఉద్యోగాల్లో ఇమడలేకపోవడం, మొదటి వివాహంలో పిల్లలు కలగకపోవడం, చివరి దశలో దాదాపు 50 ఏళ్ళ వయసు దగ్గరపడ్డాకే రెండో భార్యతో పిల్లలు పుట్టడం, సినిమాల్లో సంపాదించి, మొత్తం కోల్పోవడం, తన అస్థిరత వల్ల సాహితీసంఘాల్లో వివాదాలు రావడం ఇలా ఎన్నెన్నో ఒడిదుడుకులు అతను జీవితాన్ని తాకాయి. అతను గురించి జీవితచరిత్రకారుడు [బూదరాజు రాధాకృష్ణ] శ్రీశ్రీతో ఏ కొంతకాలమైనా పరిచయం గల వారెవరైనా అతడు వయసొచ్చిన పసివాడనీ, అమాయకుడైనా చురుకైనవాడనీ, అహంకారి అయినా తలవంచుతుంటాడనీ, విచారణశీలి అయినా తప్పించుకు తిరుగుతాడనీ, ఆకర్షకుడైనా ఏడిపించనూగలడనీ అంగీకరిస్తారు. కొన్ని అభిప్రాయాల విషయంలో అతడు జగమొండి. సరదా పడ్డప్పుడు అతణ్ణి అదుపుచేయడం కష్టం. విపరీతాలోచనా ధోరణిలో ఉన్నప్పుడు అతడు క్రమశిక్షణకు లొంగడు. దాపరికం లేకపోవడం, ఆలోచనలోనూ స్వభావంలోనూ చాటూమరుగూ లేకపోవడం విస్పష్టం. మాటల్లో మాత్రమే అతడు భయంకరుడు. మరో విధంగా పోరాడలేడు. వాస్తవజీవితంలో అతడు సమస్త సాంప్రదాయిక పద్ధతులకూ కట్టుబడ్డాడు. కానీ తన విప్లవభావాలతో వాటినెప్పుడూ వ్యతిరేకిస్తుండేవాడు అంటూ స్వభావాన్ని గురించి వ్యాఖ్యానించారు.
దాపరికంలేని స్వభావం వల్ల, అదొక చమత్కార ధోరణి అనుకోవడం వల్ల శ్రీశ్రీ స్వపర భేదం లేకుండా కఠోరమైన విమర్శలు, అనవసర వివాదాలకు కారణమైన వ్యాఖ్యలు ఎన్నో చేశారు. పైగా అతను రాసిన ఆత్మకథ అనంతం సాధారణ పరిస్థితుల్లో ఎవరూ ఊహించని, పాఠకులకు మింగుడు పడని విడ్డూరమైన ప్రసంగాలతో నింపారు. సమాచారం కూడా ఏ సందర్భశుద్ధీ లేకుండా నింపిన రచన అది. ఇవన్నీ కలిసి అతని వ్యక్తిత్వంపై ఎటువంటి వ్యతిరేక ప్రభావాలు వేసినా అతను ఆకర్షణను ఇసుమంతైనా తగ్గించలేదు.

తనకేది తోస్తే అది నిర్భయంగానే కాక సందర్భశుద్ధి కూడా పట్టించుకోకుండా మాట్లాడడం అటుంచితే శ్రీశ్రీ మాటల్లో ఒకవిధమైన శబ్దాలంకారాలు, చమత్కారాలు దొర్లుతూండేవి. చమత్కార సంభాషణల లోను, శ్లేషల ప్రయోగం లోను శ్రీశ్రీ ప్రసిధ్ధి చెందాడు. అతను చెణుకులు ఎన్నో లోకంలో వ్యాప్తిలో ఉన్నాయి. మచ్చుకు కొన్ని: 

విశ్వనాథ శ్రీశ్రీపై ఇంతగా ఆప్యాయత చూపినా, శ్రీశ్రీకి విశ్వనాథ కవితాశక్తిపై చిన్ననాటి నుంచి ఎంతో అభిమానం (కొన్నేళ్ళు హీరోవర్షిప్) ఉన్నా వారిద్దరి వ్యతిరేక భావాలు విభేదాలు తీసుకుచ్చాయి. భావాలకు మించి విశ్వనాథకున్న కుండబద్దలు గొట్టే మాట, శ్రీశ్రీలోని మాట తూలే లక్షణం మరింత ఆజ్యం పోశాయి. విశ్వనాథ రచించిన రామాయణ కల్పవృక్షం గొప్ప రచన కాదని శ్రీశ్రీ అభిప్రాయం. నిజానికి తన అన్ని రచనల్లోనూ విశ్వనాథకు రామాయణంపైనే అభిమానం ఒక పాలు ఎక్కువ. దీనిని వెక్కిరిస్తూ ఒక్కడైనా రామాయణ కల్పవృక్షం చదివానంటే విశ్వనాథ పొంగిపోతాడనీ, సంస్కృతం రాకున్నా వాల్మీకం అర్థమైంది గానీ తెలుగు వచ్చినా కల్పవృక్షం అర్థంకాలేదని చాలాచాలా మాటలే మాట్లాడారు. విశ్వనాథకు సంస్కృతం అంత బాగా రాదని చెప్పడం కోసం, 'సంస్కృతంలో విశ్వనాథ కంటే గుంటూరు శేషేంద్ర శర్మ గొప్ప పండితుడు' అని ప్రకటించాడు శ్రీశ్రీ. దీనిపై శ్రీశ్రీ జీవితచరిత్రకారుడు శ్రీశ్రీకి విశ్వనాథ సంస్కృత పాండిత్యం ఈర్ష్య పుట్టించిందనిపిస్తుందని, లేని పక్షంలో దీనికి మరోకారణం కనిపించదని వ్యాఖ్యానించారు. తనంతటి మహాకవి వెయ్యేళ్ళ వరకూ పుట్టడని విశ్వనాథ తన గురించి తానే ప్రకటించుకోగా, శ్రీశ్రీ నిజానికాయన వెయ్యేళ్ళ కిందటే పుట్టాడని అన్నాడు.
ఈ వాగ్వాదాలకు పరాకాష్ఠగా మొదటి తెలుగు మహాసభల వివాదం సాగింది. దీనిలో విశ్వనాథ, శ్రీశ్రీ పేరున ఈ మహాసభలను వ్యతిరేకిస్తూ ఒక లేఖ పత్రికలకు విడుదల కాగా తన సంతకాన్ని శ్రీశ్రీయే ఫోర్జరీ చేశారని విశ్వనాథ ఆరోపించారు. ఆ మహాసభలకు విశ్వనాథ హాజరుకాగా, శ్రీశ్రీ వ్యతిరేకించడం, బహిష్కరణకు పిలుపునివ్వడం వల్ల ఒక రాత్రి బొలారం పోలీస్ స్టేషన్లో నిద్రచేశారు. ఈ ఆరోపణ ప్రత్యారోపణలు వారిద్దరి నడుమ సత్సంబంధాలు పూర్తిగా దెబ్బతీశాయి. మళ్ళీ విశ్వనాథను నన్నయ ఉన్నంతకాలం ఉంటారని, ఐతే తిక్కన-వేమన-గురజాడ అనే కవిత్రయంలో మాత్రం చేరరని వ్యాఖ్యలూ చేశారు. విశ్వనాథ వారి కిన్నెరసాని పాటలను చివరి వరకూ ప్రశంసించారు. అతను మరణానంతరం విశ్వనాథను గొప్పగా ప్రశంసిస్తూ కొండవీటి పొగమబ్బు/తెలుగు వాడి గోల్డునిబ్బు/మాట్లాడే వెన్నెముక/పాటపాడే సుషుమ్న/మాట్లాడే ద్విపద/సత్యానికి నా ఉపద అంటూ రాసిన కవిత సుప్రఖ్యాతం. చివరి వరకూ వారిద్దరి నడుమ ఒకరు మరొకరి కవితా శక్తులను కొన్ని పరిమితులకు లోబడి ప్రశంసించుకోవడమూ, ఒక్కోమారు బయటపడి ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకోవడమూ, తుదకీ అనురాగం-ద్వేషాల దాగుడుమూతలాట సాగింది.

'అవును. కానీ ఇప్పుడు చెప్పే మూడ్ లేదు' అన్నారు. 'మరి మూడ్ ఎప్పుడు వస్తుందో చెప్పు. అప్పుడు వస్తాను' అన్నారు శ్రీ శ్రీ. 'సాయంత్రం' అన్నారు వనమాలి. మళ్లీ సాయంత్రం వచ్చారు శ్రీశ్రీ. ఇద్దరం కలిసి గోదావరి స్టేషను దగ్గర్లో ఉన్న ఒక లంకకు నావలో వెళ్లి, ఇసుకలో కూర్చురు. అప్పుడు చెప్పారు 'తనే శ్రీశ్రీ' అని. తనతో నండూరి ఎంకిపాటలు కూడా పాడించుకున్నారు శ్రీ శ్రీ . అలా మొదలయ్యింది వారిమధ్య స్నేహం. ఇద్దరి మధ్యా పదిహేనేళ్ల వయసు తేడా ఉన్నా మంచి స్నేహితులయ్యారు. సినిమా షూటింగ్ లేనప్పుడు ఇద్దరం కలుసుకునే వాళ్ళు. (జగన్నాథరావు వనమాలి జె.ఆర్. వనమాలిగా సుప్రసిద్ధుడు. అంచెలంచెలుగా ఎదిగి 20 ఏళ్లక్రితం 'వర్డ్స్ అండ్ వాయిసెస్' అనే సంస్థని ముంబాయిలో స్థాపించాడు. సినిమా, ప్రకటన రంగాల్లో ఇప్పుడు నిష్ణాతులుగా పేరుతెచ్చుకున్న ఎందరో కళాకారులకు వనమాలి తొలి గురువు. థియేటర్ ఆర్ట్స్ రంగంలో 'వాయిస్ ఆర్టిస్ట్'గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని కూడా పొందాడు. )

యోగ్యతా పత్రం - మహాప్రస్థానం పుస్తకానికి 1940 లో చలం రాసిన పీఠిక. తెలుగు సాహిత్యంలో వచ్చిన గొప్ప పీఠికలలో ఇది ఒకటి. ఆ పుస్తకం ఎవరు చదవాలో, ఎందుకు చదవాలో, ఎలా చదవాలో వివరించే పీఠిక అది. రాబందుల రెక్కల చప్పుడు పయోధర ప్రపంచ ఘోషం ఝంఝానిల షడ్జధ్వానం విని తట్టుకోగల చావ ఉంటే ఈ పుస్తకం తెరవండి. అంటూ పుస్తకం చదవడానికి పాఠకుడిని సమాయత్త పరచే పీఠిక అది. యోగ్యతాపత్రంలో చలం రాసిన కొన్ని వాక్యాలు మచ్చుకు:

శ్రీశ్రీ నిర్వహించిన ప్రజ  శీర్షిక లో పిచ్చయ్య అనే పాఠకుడు ఇలా ప్రశ్నించాడు యోగ్యతా పత్రం చదివితే మహాప్రస్థానం చదవనక్కరలేదని నేను అంటాను, మీరేమంటారు. అతిశయోక్తి అయినా, అంతటి గుర్తింపు పొందిన పీఠిక అది.

అయితే శ్రీశ్రీ ఆ పాఠకుడి ప్రశ్నకు ఇలా జవాబిచ్చాడు: మీరు సార్ధక నామధేయులంటాను




#Article 56: అల్లసాని పెద్దన (130 words)


ఆంధ్ర కవితా పితామహునిగా పేరుగాంచిన అల్లసాని పెద్దన శ్రీ కృష్ణదేవరాయల ఆస్తానంలోని అష్టదిగ్గజములలో అగ్రగణ్యుడు. సంస్కృతాంధ్ర కవిత్వం ఎలా ఉండవలెను అని ఒక ఉత్పలమాల చెప్పి రాయల చేత సన్మానం గండపెండేరం తొడిగించుకున్నవాడు. ఇతడు రచించిన మనుచరిత్ర ఆంధ్రవాఙ్మయములో ప్రథమ ప్రబంధముగా ప్రసిద్ధికెక్కినది. ఇతను కవి మాత్రమే కాక రాచకార్యాలలో కూడా రాయలవారికి సలహాలు ఇచ్చువాడు అందుకే ఇతనిని పెద్దనామాత్యుడు అని కూడా అంటారు.
ఒక గొప్ప యాంధ్రకవి. ఇతఁడు బళ్లారి కడప జిల్లాలప్రాంతములయందు దూపాడు అను దేశంబున దొరాళ అను గ్రామం వాసస్థలముగా కలవాఁడు. ఈయన శాలివాహనశకము 1430 సంవత్సరమున జన్మించినట్లు తెలియఁబడుచున్నది. కృష్ణదేవరాయలవారి ఆస్థానపండితులు ఎనమండ్రలోను ఈతఁడు ఒక్కఁడు అయి ఉండినదికాక ఆరాజుచే ఆంధ్రకవితాపితామహుఁడు అను బిరుదాంకము సహితము పడసెను. ఈతనికృతి స్వారోచిషమనుసంభవము. ఇది మిక్కిలి ప్రౌఢకావ్యము.

అల్లసాని వారిదే ప్రాంతం అన్న విషయం ప్రసక్తికి వచ్చినపుడు వేటూరు ప్రభాకరశాస్త్రిగారు ‘బళ్లారి ప్రాంతమందలి దోపాడు పరగణాలోని దోరాల గ్రామమీతని వాసస్థలము’ అన్నారు (సింహావలోకనము). కాని పరిశోధకులు అధిక సంఖ్యాకులు పెద్దన కోకటం గ్రామమన్నారు. వై.యస్‌.ఆర్‌ (కడప) జిల్లాలోని కమలాపురానికి సమీపంలో కోకట గ్రామం ఉంది. ఆ గ్రామంలో సకలేశ్వరుడూ ఉన్నాడు. ప్రక్కన పెద్దనపాడు ఉంది. ఆయన పేరు మీదనే పెద్దనపాడు ఏర్పడిందంటారు.




#Article 57: నంది తిమ్మన (385 words)


నంది తిమ్మనను ముక్కు తిమ్మన అని కూడా అంటారు. ఇతని ముక్కు పెద్దదిగా ఉండటంవల్ల, మరియూ ఇతని కవితలలో ముక్కును చక్కగా వర్ణించడంవల్ల!

ఇతను శ్రీ కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒకడు. ఇతను రాయల భార్య తిరుమల దేవికి అరణంగా విజయనగరం వచ్చిన కవి. నంది తిమ్మన, ఆరువేల నియోగ బ్రాహ్మణ కుటుంబంలో, నంది సింగన్న, తిమ్మాంబ దంపతులకు జన్మించాడు. ఈయన కౌశిక గోత్ర, అపస్తంభ సూత్రానికి చెందిన వాడినని చెప్పుకున్నాడు. ఈయన అనంతపురం పరిసర ప్రాంతానికి చెందిన వాడని భావిస్తున్నారు. ఈయన నివసించిన రాజ్యం, విజయనగర సామ్రాజ్యానికి సామంత రాజ్యంగా ఉండేది. ఆ సామంత రాజ్యపు యువరాణి తిరుమలాదేవి ఆ తరువాత కృష్ణదేవరాయల ధర్మపత్ని అయ్యింది.

తిమ్మన జన్మతః శైవుడు, అఘోర శివాచార్యుల శిష్యుడైనా, వైష్ణవ రాజాస్థానంలో ఉన్నందువలన, అప్పటి రాజకీయ-సామాజిక పరిస్థితుల వల్ల కొన్ని వైష్ణవ రచనలు కూడా చేశాడు. ఈయన తాత నంది మల్లయ్య, మేనమామ ఘంట సింగన్న (ఈయనకే మలయమారుత కవి అనికూడా మరోపేరు) కృష్ణదేవరాయల తండ్రి అయిన వీరనరసింహరాయల ఆస్థానంలో జంటకవులుగా ఉండేవారు.

తిమ్మన రచన పారిజాతాపహరణం ప్రసిద్ధి చెందింది. ఇతను వాణీ విలాసము అనే మరొక కావ్యాన్ని రచించినట్లు తెలుస్తున్నా అది లభ్యం కావడం లేదు.

తన సమకాలికుడైన అల్లసాని పెద్దన వలే క్లిష్టమైన పదప్రయోగాలకు పోకుండా సున్నితమైన, సులువైన పద్ధతిలోనే రచనలు చేశాడు. ఈయన రచనలు కేవలం పండితులకే కాక పామర జనులను సైతం విశేషంగా ఆకర్షించేవి. అందుకే ఆయన రచనలను ముక్కు తిమ్మన ముద్దు పలుకులు అని వ్యవహరిస్తారు. పారిజాతాపహరణంలో ఆయన రచించిన సుకుమారమైన శృంగార రసాత్మకమైన పద్యాలు ఇప్పటికీ పండితుల నోళ్ళలో నానుతూనే ఉంటాయి.

ఈ నానుడి తిమ్మన పద్యరచనారీతిని బట్టి, శైలీశయ్యాది సౌభాగ్యాన్ని బట్టి ఏర్పడి ఉంటుంది.పాత్రనుబట్టి శైలిని మార్చడం, నాటకీయతను పొందుపరచడం, సామెతలు, సూక్తులు ప్రయోగించడం, సమయోచిత ఉపమానాలు ప్రయోగించడం, తెలుగు నుడికారాన్ని వాడడం, చమత్కారంగా చెప్పడం మొదలైన వాటివల్ల ఇవి ముద్దు పలుకులు అనిపిస్తాయి.

ఏమేమీ కలహాసనుండచటికై యేతెంచి యిట్లాడెనా?
ఆ మాటల్చెవియొగ్గి తా వినియెనా ఆ గోపికా వల్లభుం
డేమేమాడెను రుక్మిణీ సతియు, నీ వింకేటికిన్ దాచెదే?
నీ మోమాటలు మాని నీరజముఖీ, నిక్కంబెరింగింపవే

ఈసున బుట్టి డెందమున హెచ్చిన శోకదవానలంబుచే
గాసిలి యేడ్చె ప్రానవిభు కట్టెదుటన్ లతాంగి పంకజ
శ్రీసఖమైన మోముపయి చేలచెఱంగిడి బాలపల్లవ
గ్రాస కషాయ కంఠ కలకంఠ వధూకల కాకలీ ధ్వనిన్

ఇది ఐదు అశ్వాసాలు గల ప్రబంధం. సంస్కృత భాగవతములోని మూడు పద్యాల కథని అద్భుతముగా పెంచి రచించాడు. నారదుడు పారిజాతం కృష్ణునకివ్వడం, ఆ సమయములో అతను రుక్మిణీదేవి మందిరములో ఉండటం, ఆ పారిజాతాన్ని కృష్ణుడు రుక్మిణికి ఇవ్వడం, దానిని తెలుసుకొని సత్య ఆగ్రహించడం, అటుపై రకరకాల మలుపులు, పాద పీడనం, చివరకు దేవతలతో యుద్ధం పారిజాత వృక్షం సత్య తీసుకోని రావడం, తులాభారంతో కథ సుఖాంతం అవుతుంది.

ఫారిజాతాపహరణానికి సంస్కృత భారతంలో మూడు శ్లోకాలే అనే అని అంటారు కాని నిజానికి దీనికిని, సంస్కృత హరివంశమున వజ్రనాభుని వధ యనెడి కథకును సాన్నిహిత్యం ఉంది. ఏమైనా చాలా చిన్నదైన ఈ కథకు నంది తిమ్మన సంతరించిన అలంకార సౌకర్యములు, ప్రబంధోచిత పాత్రచిత్రణము, ఆయా పాత్ర జీవన వర్ణనము దీనిని సుందరమైన ప్రబంధకావ్యంగా తీర్చిదిద్దాయి.

తిమ్మనగారి ముక్కు పెద్దది కావడం వలన ఆయనకి ముక్కు తిమ్మన అనే పేరు వచ్చి ఉండవచ్చును. ఆయన ముక్కు మీద చక్కని పద్యం వ్రాశారట. క్రింది ఆ పద్యాన్ని రామరాజ భూషణుడు కొనుక్కొని తన వసుచరిత్రములో చేర్చుకొన్నారట.

నానా సూన వితాన వాసనల నానందించు సారంగమే
లా నన్నొల్లదటంచు గంధఫలి బల్కాకం తపంబంది యో
షా నాసాకృతి బూని సర్వ సుమనస్సౌరభ్య సంవాసియై
పూనెం బ్రేక్షణ మాలికా మధుకరీ పుంజంబులిర్వంకలన్




#Article 58: శ్రీకాళహస్తీశ్వర శతకము (575 words)


ధూర్జటి తానీ శతకమును వ్రాసినట్టు గ్రంథములో ఎక్కడా పేర్కొనలేదు. కానీ క్రీ.శ. 1740 ప్రాంతము వాడైన ప్రసిద్ధ లాక్షణికుడు కస్తూరి రంగ కవి తన యానంద రంగ రాట్ఛందమున... ఈ శతకము లోని ఒక పద్యాన్ని ఉదహరిస్తూ దీనిని ధూర్జటి వారి కాళహస్తీశ్వర శతకమున  అని ప్రస్తావించినందున ఈ శతకాన్ని ధూర్జటి కవి యే రచించెననుట నిర్వివాదంశం.
శ్రీకాళహస్తీశ్వర శతక కవి ధూర్జటి. ఈతఁడు శ్రీకృష్ణ దేవరాయల సభలో అష్ట దిగ్గజములు అనబడు ఎనిమిది మందిలో ఒకడు అని వాడుక. శ్రీ కాళహస్తి మాహాత్మ్యమును బట్టి ఈ కవి సింగమ రమా నారాయణ (జక్కయ నారాయణ) తనూభవుడు అని తెలియును.
కవి సమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి మాటలలో ‘ఈ కాళహస్తి మాహాత్మ్యము వంటి గ్రంథము తెలుగులో మరియొకటి లేదు. తక్కినవారి కవిత్వము మనస్సునకు వాడి పెట్టి హృదయమును పాటునకు తెచ్చును. ఈ (ధూర్జటి) కవిత్వము మనస్సు వాడిమిని దాటి, గండె పాటు దాటి, దూరాన శివుడు కనిపించునట్లు చేయును’.
ధూర్జటి రచనలుగా మనకు లభించునవి రెండు. (1) శ్రీకాళహస్తి మాహాత్మ్యము (2) శ్రీకాళహస్తీశ్వర శతకము
భాష విషయమున ఈ రెండు రచనలును రెండు వేరువేరు మార్గములలో నడచినట్లు కనబడును. 
శ్రీకాళహస్తి మాహాత్మ్యము, శ్రీకాళహస్తి క్షేత్ర పతియగు శ్రీకాళహస్తీశ్వరుని మహిమమును బహువిధములుగా తెలుపు స్థల పురాణము. కావ్యముగా ఇది ప్రబంధము. ఎందుకంటే ఇది పంచభూత లింగములలో ఒకటిగా వాయు లింగ రూపుడగు శివుడు వర్ణనీయుడుగా రచించబడిన వస్తుప్రధాన కావ్యము.
శ్రీకాళహస్తీశ్వర శతకము, భక్తుడు తన మనస్సులోని భక్తి మొదలగు భావములను భగవంతునితో సూటిగా చెప్పుటకై రచించబడిన కావ్యము. కవి తన హృదయమును అనుదినమును 
మాటలాడు వాడుక భాషలోనే భగవంతుని ఎదుట ఉంచుటకై చేసిన రచన ఇది. అందుకు తగినట్లే ఈ శతక రచమలోని భాషను, అంటే వాక్యనిర్మాణాన్ని, వాడుక తీరులోనే చేయడమైంది.

శ్రీ కాళహస్తీశ్వరునకు

బహుశా దీనిని ధూర్జటి తన చివరి కాలములో వ్రాసి ఉండవచ్చును. ప్రఖ్యాత రాజుల్ మత్తుల్ వారిసేవ నరకప్రాయంబు, వారిచ్చు నంభోజాక్షు చతురంతయాన తురగ భూషాదులాత్మవ్యదాబీజంబుల్ అనే పద్యము ఈ శతకము లోనిదే!
ఇందు రాజులను రక రకాలుగా తిట్టినాడు.

ఏ వేదంబు ఫఠించె లూత భుజంగం బే శాస్త్రముల్ ల్సూచె తా

నేవిద్యాభ్యాసం బొనర్చె గరి చెంచే మంత్రం బూహించె భో

దావిర్భావ విధానముల్ చదువులులయ్యా కావు మీపాద

సంసేవా శక్తియే కాక జంతుతతికిన్ శ్రీ కాళహస్తిశ్వరా

దంతంబు ల్పడనప్పుడే తనువునందారూఢి యున్నప్పుడే

కాంతాసంఘము రోయనప్పుడే జరక్రాంతంబు గానప్పుడే

వితల్మేన జరించనప్పుడె కురుల్వెల్లెల్ల గానప్పుడే

చింతింపన్వలె నీపదాంభుజములన్ శ్రీ కాళహస్తీశ్వరా!

భావం:

శ్రీ కాళహస్తీశ్వరా! మానవులు ఎవ్వరే కాని తమ దంతములు రాలని స్థితియందు ఉండగనే, తన శరీరమునందు బలము బాగుగ ఉండగానే, స్త్రీలకు తన విషయమున ఏవగింపు కలుగుటకు ముందే, శరీరము ముసలితనముచే శిథిలము కాక ముందే, తన వెండ్రుకలు నెరసి తెలతెల్లన కాకుండగనే, తన శరీరమున మెరుగులు తగ్గని సమయముననే నీ పాదపద్మములను సేవించవలెను.

నిచ్చల్ నిన్ను భజించి చిన్మయమహా నిర్వాణపీఠంబు పై

రచ్చల్సేయక యార్జవంబు కుజన వ్రాతంబుచేఁ గ్రాంగి భూ

భృచ్చండాలురఁ గొల్చి వారు దనుఁ గోపింమన్ బుధుం డార్తుఁడై

చిచ్చారం జము రెల్లఁ జల్లుకొనునో శ్రీ కాళహస్తీశ్వరా!

శ్రీ కాళహస్తీశ్వరా! వివేకవంతులగు పండితులు, కవులు నిరంతరము నిన్ను సేవించుచు, నీ విమలజ్ఞానమను మోక్ష పీఠమునధిష్థించి నీ ఆదరము పొందుచుండవలెను. కాని వీరు అట్లు చేయకున్నారు. తమ పాండితీ ప్రతిభల సౌష్థవము చెడుదారిలోనికి గొనుపోవునట్లుగ దుర్జనసమూహముల చేత క్రాగిపోగా రాజులను ఛండలురను సేవించుచున్నారు. ఎన్నడు రాజులు కోపగించగా, ఎంత తప్పు చేసితిని, ఎంత కష్టపడుతున్నాను అని దుఃఖపదురు. ఇది మంటనార్పుటకు అందులో నూనె ప్రోసినట్లె. అనగా కష్టములు తీరకపోగా అవమానము మొదలైన దుఃఖములు అధిక మగును.

నీకుం గాని కవిత్వ మెవ్వరికి నేనీనంచు మీదెత్తితిన్

జేకొంటిన్ బిరుదంబు కంకణము ముంజేఁ గట్టితిం బట్టితిన్

లోకుల్ మెచ్చ వ్రతంబు నాతనువు కీలుల్ నేర్పులుం గావు ఛీ

ఛీ కాలంబులరీతి దప్పెడు జుమీ శ్రీ కాళహస్తీశ్వరా!

శ్రీ కాళహస్తీశ్వరా! నా కవిత్వము నిన్ను స్తుతించుటకే కాని మరి ఎవ్వరిని స్తుతించుటకుపయోగింపను. మరి ఎవ్వరికి అంకితమివ్వను. జనులు మెచ్చునట్లు ప్రతిజ్ఞ చేసితిని. కాని శివా నా శరీరావయవములు, శక్తి, నేర్పు, ప్రతిభ, పాండిత్యము మొదలగునవి ఆ ప్రతిజ్ఞ నిలుపుకొనుటకు చాలవేమో అనిపించుచున్నది. అన్ని అనుకూలించినను నేను నిన్ను సేవించజాలనేమొ. ఏలయన కాలములే తమ రీతిని తప్పుచున్నవి. నేను ఏమి చేయుదును. నాకోరిక తీరునట్లు నీవే అనుగ్రహించవలయును.

అంతా మిథ్య తలంచి చూచిన నరుండట్లౌ టెఱింగిన్ సదా

కాంత ల్పుత్త్రులు నర్థమున్ తనువు నిక్కంబంచు మోహార్ణవ

భ్రాంతిం జెంది జరించుఁ గాని పరమార్థంబైన నీయందుఁ దాఁ

జింతాకంతయుఁ జింత నిల్పడుగదా శ్రీకాళహస్తీశ్వరా!

శ్రీకాళహస్తీశ్వరా! ఆలోచించి చూస్తే, మనుజునకు అంతా మాయే అని తెలిసినప్పటికీ, తన కాంతలు (పతులు), పుత్రులు, ధనము, శరీరములే వాస్తవము, శాశ్వతములని తలచి వానికై తపిస్తూ మోహమనెడి సముద్రంలో కొట్టుమిట్టాడుతాడేగానీ, పరమార్థము, పరమాత్మవైన నీయందు చింతాకంతైననూ ధ్యానము నిలుపజాలకున్నాడు గదా.

కొడుకుల్ పుట్టరటంచు నేడ్తురవివేకుల్ జీవనభ్రాంతులై

కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్

వడసెం బుత్రులు లేని యా శుకునకున్ బాటిల్లెనే దుర్గతుల్ !

చెడునే మోక్షపదం బపుత్త్రకునకున్ శ్రీ కాళహస్తీశ్వరా !

ఐహికజీవనమనే మాయలో తగులుకున్న అవివేకులు తమకు పుత్ర సంతతి కలగలేదే అని చింతిస్తూ ఉంటారు. ఐతే, కౌరవ రాజగు ధృతరాష్ట్రునకు నూరుగురు పుత్రులు కలిగినా వారి వలన ఆతడు ఏ ఉత్తమలోకాలను పొందగలిగాడు? బ్రహ్మచారిగానే యుండి సంతతియే లేని శుకునకు దుర్గతి ఏమయినా కలిగిందా? పుత్రులు లేని వారికి మోక్షపదం సిద్ధించకుండా పోదుకదా శ్రీ కాళహస్తీశ్వరా !




#Article 59: స్వారోచిష మనుసంభవము (407 words)


మను చరిత్రము లేదా స్వారోచిష మనుసంభవము, అల్లసాని పెద్దన రచించిన ఒక ప్రబంధ కావ్యము. ఈ కావ్యం రచనా కాలం 1519-20 ప్రాంతం కావచ్చునని, అప్పటికి పెద్దనకు 45 యేండ్ల వయసు ఉండవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. పింగళి లక్ష్మీకాంతం అభిప్రాయంలో మనుచరిత్రము శాంత శృంగార రసములు సమ ప్రాధాన్యముతో సంగమించిన యొక తీర్థము. తత్కర్త సహజముగా శృంగార ప్రియుడు. ఆ చిత్తవృత్తి శాంతాభిముఖమయినప్పటి రచన యిది. శృంగారానుభవ రుచి, శాంతనిష్ఠయు రెండును మనోగోళమునావరించియున్నప్పటికిని శాంతివైపు చిత్తము మరలుచున్నదనవచ్చును 

అల్లసాని పెద్దన, కృష్ణదేవరాల ఆస్థానంలో ఆష్టదిగ్గజాలలో ఒకడు.

మారన మార్కండేయ పురాణంలో 150 పద్యాలలో చెప్పిన విషయము. ఇది వరూధినీ, ప్రవరాఖ్యుల ప్రేమ కథతో మొదలై స్వారోచిషునితో ముగుస్తుంది. కాశీ నగరం దగ్గర ప్రవరుడనే పరమ నిష్టాగరిష్ఠుడైన బ్రాహ్మణుడు, అతనికి అనుకూలవతియైన భార్య ఉండేవారు. వారు అతిథులను ఎంతగానో ఆదరించేవారు. వారి ఇంటికి వచ్చిన ఒక సిద్ధుడు ప్రవరునికి ఒక మహిమాన్వితమైన పసరును ఇచ్చాడు. ఆ పసరు కాళ్ళకు పూసుకొని ఆ దివ్య ప్రభావం వలన ప్రవరుడు హిమాలయ పర్వతాలకు పోయి అక్కడి సుందర దృశ్యాలను చూచి ఆనందిస్తాడు. అయితే ఎండకు ఆ పసరు మంచులో కరిగిపోయింది.

తిరుగి పోయే ఉపాయం కోసం చూస్తున్న ప్రవరుడిని చూచు వరూధిని అనే అప్సరస మనసు పడింది. అయితే ప్రవరుడు ఆమెను తిరస్కరించి వెళ్ళిపోయాడు. కామవిరహంతో ఉన్న వరూధినిని ఒక గంధర్వుడు ప్రవరుని వేషంలో సమీపించి తన కోరిక తీర్చుకున్నాడు. వారికి జన్మించిన స్వరోచి ఒక దేశానికి రాజయ్యాడు. ఆ స్వరోచి ఒకసారి వేటకు వెళ్ళి మనోరమ అనే యువతిని పెళ్ళాడాడు. వారి కొడుకే స్వారోచిష మనువు.

మనుచరిత్రంలో పెద్దన కథన కౌశలం, వర్ణనా చాతుర్యం పండితుల ప్రశంసలందుకొన్నాయి. పెద్దనను సమకాలికులు, అనంతర కవులు కూడా అనుసరించారు. మనుచరిత్రలోని కవితాశిల్పం అద్వితీయం. అక్షరాలా పెద్దన ఆంధ్ర ప్రబంధ కవితా పితామహుడే. మనుచరిత్రలో అనేక ఇతివృత్తాలున్నా గాని అందరినీ అలరించి పెద్దనకు కీర్తి తెచ్చిపెట్టినది వరూధినీ ప్రవరాఖ్యుల ఘట్టమే. పెద్దన రచనలో ముఖ్యాంశాలు

మచ్చుకు ఈ పద్యం చూడండి.

 అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కరకంపిత సాలము శీత శైలమున్.   ------------ పెద్దన మనుచరిత్రము నుండి.
 

చీమలమర్రి బృందావనరావు : మార్కండేయ పురాణం లోని ఒక చిన్న కథను తీసుకొని, దాన్ని విస్తరించీ ప్రస్తరించీ ఒక అపూర్వ కళాఖండాన్ని శిల్పించాడు పెద్దన. ఇది నిజంగా అపూర్వమే. పెద్దనకు పూర్వం తెలుగులో అంత కచ్చితమైన ప్రమాణాలతో రచింపబడిన కావ్యం లేదు. పెద్దన తర్వాత కవుల్లో కూడా మనుచరిత్రమును అనుకరించి రాయబడిన కావ్యాలే ఎక్కువ. మనుచరిత్రమును పెద్దన గారి “సకలోహ వైభవ సనాధము” అనవల్సిందే. కొద్దో గొప్పో సాహిత్యజ్ఞానం ఉన్నవారికి మనుచరిత్రం లోని చాలా పద్యాలు కంఠతా ఉంటాయనేది అతిశయోక్తి కాదు. ... కథా సంవిధానంలో గానీ, పాత్రల చిత్రణలో గానీ, సన్నివేశాలు కల్పించి సంభాషణలు నిర్వహించడంలో గానీ, పద్య నిర్వహణంలో గానీ దీనికి సాటి ఐన గ్రంథం నభూతో నభవిష్యతి అనీ అనిపించుకున్న కావ్యం ఈ మను చరిత్రము. అరుణాస్పదపురంలో ప్రవరుని గైహిక జీవనం, హిమాలయ ప్రాంతాల ప్రకృతి వర్ణన, వరూధినీ ప్రవరుల వాదోపవాదాలు గానీ, ఆమె దిగులు, ఆ తర్వాత ప్రకృతి వర్ణనా, స్వరోచి మృగయా వినోదం గానీ, ఎవరు ఎంతగా వర్ణించి చెప్పినా, రసజ్ఞుడైన పాఠకుడు, స్వయంగా చదివి అనుభవించే ఆనందం ముందు దిగదుడుపే.

ఇది తొలి తెలుగు ప్రబంధము, దీని తరువాత మొదలైనదే ప్రబంధ యుగము, తరువాతి ప్రబంధాలు దీని నుండి స్ఫూర్తిపొందినవే ఎక్కువగా ఉన్నాయి.ఇందు మొత్తం ఆరు అశ్వాసాలు ఉన్నాయి. ఈ ప్రబంధం తెలుగు పంచకావ్యాలలో మొదటిదిగా చెపుతారు.

వినాయక ప్రార్థన

హిమాలయ వర్ణన

ఎండకు మంచు కరిగి దానితో పాదములకున్న పసరు కరిగి వెళ్ళుటకు అశక్తుడైనప్పుడు ఈ విధంగా చింతించును,

నర్మగర్భంగా వరూధిని పలుకులు

ప్రవరుడు వరూధినిని తిరస్కరించుట




#Article 60: ప్రబంధము (196 words)


తెలుగు కవిత్వంలో 15వ శతాబ్ది నాటికి అభివృద్ధి చెందిన ప్రక్రియా భేదం ప్రబంధం. ప్రకృష్టమైన పదబంధమున్న కావ్యం ప్రబంధము.

ప్రబంధమంటే కావ్యమనే అర్థంలో తిక్కన తాను రచించిన 15 పర్వాలను ప్రబంధమండలి అన్నాడు. ఎర్రనకు 'ప్రబంధ పరమేశ్వరుడు' అనే బిరుదు ఉంది. అయితే ఈ ప్రబంధ శబ్దానికి ప్రక్రియపరమైన ప్రబంధ శబ్దానికి భేదం ఉంది. నన్నెచోడుడు అష్టాదశ వర్ణనలను పేర్కొనడమే కాక కుమార సంభవంలో అనేక వర్ణనలు చేశాడు. శ్రీనాథుడు, పిల్లలమర్రి పినవీరభద్రుడు అష్టాదశ వర్ణనల్లో కొన్నింటిని రసరమ్యంగా నిర్వహించారు. కొన్ని ప్రబంధ ప్రక్రియా లక్షణాలు లేకపోవడం వల్ల ఇవి ప్రబంధాలు కాలేకపోయాయి. అల్లసాని పెద్దన మనుచరిత్ర రచనతో ప్రబంధ ప్రక్రియకు అంకురార్పణ జరిగింది.
పెద్దన రాసిన మనుచరిత్ర బహుళ ఆదరణ సంపాదించి ప్రక్రియగా ప్రబంధానికి రాజాదరణ సాధించిపెట్టింది. వచ్చిన వసుచరిత్ర మనుచరిత్రకు మించిన కవిత్వం కలిగిన కావ్యమనే పేరు సంపాదించింది. తెనాలి రామకృష్ణుడు రాసిన పాండురంగ మహాత్మ్యం, పింగళి సూరన కళాపూర్ణోదయం, చేమకూర వెంకటకవి రాసిన విజయవిలాసం వంటివి ప్రబంధాలుగా ప్రసిద్ధి పొందాయి.

ప్రబంధ లక్షణాలను పలువురు విమర్శకులు ఇలా వివరించారు.

తెలుగు ప్రబంధాలకు అప్పటి స్థితిగతులను కాక కవుల ఊహాలోకాలనే అద్దంపట్టాయన్న అపప్రధ ఉన్నా చాలామంది పండితులు, చరిత్రకారులు వీటికి చరిత్ర రచనలో ఎంత ప్రాధాన్యత ఉందో, ఆనాటి స్థితిగతులు ప్రబంధాల్లో ఎలా ప్రతిబింబించాయో వివరించారు. ప్రబంధ యుగంగా వర్దిల్లిన విజయనగర సామ్రాజ్య కాలంలోని ఆచారాలు, వ్యవహారాలు, జీవనశైలి వంటివాటికి ప్రబంధాలు ప్రతిబింబాలుగా నిలిచాయి. విజయనగర సామ్రాజ్యంలో 15-16 శతాబ్దుల కాలంలో పర్యటించిన పలువురు విదేశీ యాత్రికులు నమోదుచేసిన చరిత్రలో ఏదైనా సంస్కృతికి సరిపోలని విషయం ఉన్నా, స్పష్టత కావాల్సివచ్చినా వారేమి సూచిస్తున్నారో అర్థం చేసుకునేందుకు ప్రబంధాలు పనికివచ్చాయి. ప్రబంధాల్లో జలక్రీడల వర్ణనం, సుగంధ ద్రవ్యాల వినియోగం, వారకాంతల వివరాలు, జాతరలు - మొక్కుబళ్ళు, సైనిక ప్రయత్నాలు వంటివాటి వర్ణనలు సామాజిక చరిత్ర నిర్మాణంలో ఉపకరిస్తున్నాయి.




#Article 61: దాశరథి రంగాచార్య (800 words)


దాశరథి రంగాచార్యులు (ఆగస్టు 24, 1928 - జూన్ 8, 2015) సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు.

దాశరథి రంగాచార్యులు 1928, ఆగస్టు 24 న మహబూబాబాదు జిల్లా, చిన్నగూడూర్ మండలం,చిన్నగూడూర్ లో గ్రామం జన్మించారు. ఆయన అన్న కవి, సాయుధపొరాట యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. సాయుధపోరాట కాలంలో ఉపాధ్యాయునిగా, గ్రంథపాలకునిగా పనిచేశారు. సాయుధపోరాటం ముగిసాకా సికిందరాబాద్ పురపాలక కార్పోరేషన్‌లో 32 ఏళ్ళు పనిచేసి ఉద్యోగవిరమణ చేశారు.

నైజాం రాజ్యంలో నిజాం పాలన కాలంలో జన్మించిన దాశరథి రంగాచార్య ఎదుగుతూండగా ఆంధ్రమహాసభ, ఆర్య సమాజాలు వేర్వేరుగా నిజాం పాలనలోని లోపాలను ఎదుర్కొంటున్న తీరుకు ఆకర్షితులయ్యారు. తండ్రి సనాతనవాది ఐనా అన్నగారు ప్రఖ్యాత కవి, అభ్యుదయవాది కృష్ణమాచార్యుల సాంగత్యంలో అభ్యుదయ భావాలను, విప్లవ భావాలను అలవర్చుకున్నారు. అసమానతలకు, అణచివేతకు నిలయంగా మారిన నాటి నైజాం సమాజాన్ని గమనించి పెరిగిన రంగాచార్యులు 1945ల్లో ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటంలో క్రియాశీలకమైన పాత్ర పోషించారు.
తండ్రి కుటుంబ కలహాల్లో భాగంగా తల్లినీ, తమనూ వదిలివేయడంతో అన్నతో పాటుగా ఉంటున్న రంగాచార్యులకు ఆపై సాయుధ పోరాటంలో కృష్ణమాచార్యులను అరెస్టు చేయడంతో కౌమార ప్రాయం ముగిసేలోపే కుటుంబ బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది.
కుటుంబ బాధ్యతల కారణంగా గ్రంథపాలకునిగా, ఉపాధ్యాయునిగా పనిచేస్తూనే ఆనాటి సమాజంలో అసమానతల గురించి ప్రజలను చైతన్యపరిచారు. ఆ క్రమంలో రంగాచార్యుల కుటుంబంపై నైజాం ప్రభుత్వ అనుకూలురు, భాగస్వాములు దాడిచేసినా వెనుదీయలేదు. పోరాటం కీలకదశకు చేరుకున్న కాలానికి లో చేరి సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో రంగాచార్యులు తుపాకీ బుల్లెట్టు దెబ్బ తప్పించుకుని ప్రాణాపాయాన్ని కూడా ఎదుర్కొన్నారు.

తెలంగాణా సాయుధ పోరాటం నాటి స్థితిగతులు, ఆ కాలంలోని దారుణమైన బానిస పద్ధతులను దాశరథి రంగాచార్యులు చిల్లర దేవుళ్ళు, మోదుగుపూలు, జనపదం నవలల్లో చిత్రీకరించారు. చిల్లర దేవుళ్లు నవలలో సాయుధపోరాటం ముందు స్థితిగతులు, మోదుగుపూలు నవలలో తెలంగాణ సాయుధ పోరాటకాలం నాటి పరిస్థితులు, అనంతర పరిస్థితులు జనపదంలో అక్షరీకరించారు.
వట్టికోట ఆళ్వారుస్వామి ప్రజల మనిషి, గంగు వంటి నవలల ద్వారా నాటి జీవన చిత్రణ చేయాలనే ప్రయత్నం ప్రారంభించారు. ఆ నవలల ప్రణాళిక పూర్తి కాకుండానే ఆళ్వారు స్వామి మరణించారు. సాయుధపోరాట యోధులుగా, సాహిత్యవేత్తలుగా ఆళ్వారుస్వామికీ, రంగాచార్యులకూ సాన్నిహిత్యం ఉండేది.   

దాశరథి రంగాచార్యులు రాసిన చిల్లర దేవుళ్లు నవల సినిమాగా తీశారు. టి.మధుసూదనరావు దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. పలు భాషలలోకి అనువాదమైంది. రేడియో నాటకంగా ప్రసారమై బహుళప్రాచుర్యం పొందింది.
దాశరథి రంగాచార్యులు విశిష్టమైన సాహిత్యాన్ని సృష్టించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. తెలంగాణ పోరాట క్రమానికి నవలల రూపం కల్పించడం, తెలంగాణ ప్రాంత చారిత్రిక, సామాజిక, రాజకీయ పరిణామాలకు ప్రతిబింబంగా రచించిన ఆత్మకథ జీవనయానం వంటివి సాహిత్యంపై చెరగని ముద్ర వేశాయి. వేదం లిపిబద్ధం కారాదనే నిబంధనలు ఉండగా ఏకంగా తెలుగులోకి అనువదించడం వంటి విప్లవాత్మకమైన పనులు చేపట్టారు. తెలుగులోకి వేదాలను అనువదించిన వ్యక్తిగా ఆయన సాహిత్యచరిత్రలో స్థానం సంపాదించుకున్నారు.

దాశరథి రంగాచార్యుల చిల్లర దేవుళ్లు నవలకు ఆంధ్ర సాహిత్య అకాడెమీ పురస్కారం పొందారు. వేదాలను అనువదించి, మహాభారతాన్ని సులభవచనంగా రచించినందు వల్ల రంగాచార్యులను అభినవ వ్యాసుడు బిరుదు ప్రదానం చేశారు. 21-1-1994న ఖమ్మంలో సాహితీ హారతి ఆధ్వర్యంలో వెండి కిరీటాన్ని పెట్టి రంగాచార్యులు దంపతులకు సత్కరించారు. వేదానువాదం, ఇతర విశిష్ట గ్రంథాల రచన సమయంలో దాశరథి రంగాచార్యులకు విశేషమైన సత్కారాలు, సన్మానాలు జరిగాయి.

గత కొంతకాలంగా అనారోగ్యానికి గురై హైదరాబాద్ సోమాజిగుడాలోని యశోదా ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న దాశరథి (86) 2015, జూన్ 8 సోమవారం ఉదయం కన్నుమూశారు.

రంగాచార్యులు నవలలు, ఆత్మకథ, వ్యాసాలు, జీవిత చరిత్రలు, సంప్రదాయ సాహిత్యం తదితర సాహితీప్రక్రియల్లో ఎన్నో రచనలు చేశారు. 

వట్టికోట ఆళ్వారుస్వామి నిజాం పాలనలో తెలంగాణా జనజీవితాన్ని ప్రతిబింబించే నవలలు రాయాలని ప్రారంభించి ప్రజల మనిషి, గంగు నవలలు రాసి మరణించారు. ఆయన ప్రారంభించి పూర్తిచేయని ప్రణాళికను రంగాచార్యులు స్వీకరించారు. ఆ క్రమంలో ప్రజలలో విప్లవబీజాలు పడుతున్నకాలాన్ని స్వీకరించి చిల్లరదేవుళ్ళు రాశారు. నిజాంపాలనలో ప్రజలపై జరిగిన దౌర్జన్యం, వెట్టిచాకిరీ, ఆడబాప వంటి వ్యవస్థలు, జనంలో పెరుగుతున్న అసహనం, అప్పటి ఆంధ్రోద్యమం, మతమార్పిడులు, వాటిని వ్యతిరేకిస్తూ తిరిగి హిందూమతంలోకి తెస్తున్న ఆర్యసమాజ్ వంటివన్నీ చిల్లరదేవుళ్ళు నవలలో చిత్రీకరించారు. విప్లవానికి నేపథ్యాన్ని చిత్రించేందుకు నవల పనికివచ్చింది. విప్లవబీజాలు ఎదిగి ప్రజాపోరాటానికి దారితీస్తున్న కాలాన్ని (1940 దశకం) స్వీకరించి తర్వాతి నవల మోదుగుపూలు రాశారు. ఈ నవలలో నిజాం రాజ్యంలో ఉండే జాగీర్దారు అధీనంలోని ప్రాంతాన్ని నేపథ్యంగా తీసుకున్నారు. పత్రిక చదవడం కూడా నిషేధమైన అనూహ్యమైన స్థితిగతుల్లో, ఊరికి వచ్చిన వ్యక్తి పత్రిక చదివించడమే కాక గ్రంథాలయం కూడా పెట్టించడం, అది తగలబడిపోతే అడవిలోని ఆటవికులను చేరదీసి విప్లవం రేకెత్తిస్తాడు. 1940ల్లో నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా నైజాం ప్రాంతంలో ఏర్పడిన సాయుధపోరాట కాలాన్ని నవల ప్రతిబింబిస్తుంది. తెలంగాణాలో సాయుధ పోరాటం అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలు, సాంఘిక స్థితిగతుల నేపథ్యంలో జనపథం నవల రాశారు. 1948లో తెలంగాణా నిజాం పరిపాలన నుంచి విముక్తం కావడం మొదలుకొని, 1970ల్లో అంకురించిన వామపక్ష తీవ్రవాద ఉద్యమాలు (నక్సలైట్ పోరాటాలు) వరకూ నవల సాగుతుంది. తెలంగాణా జనజీవితంలో 1938నాటి స్థితిగతులు ప్రతిబింబిస్తూ చిల్లర దేవుళ్లు, 1942 నుంచి 1948 వరకూ సాగిన తెలంగాణా సాయుధ పోరాటాన్ని చిత్రిస్తూ మోదుగుపూలు, 1948 నుంచి 1968 వరకూ జరిగిన పరిస్థితులు చూపిస్తూ జనపథం రాశారు. మొత్తంగా అలా తెలంగాణా సాయుధ పోరాటపు ముందువెనుకలను నవలల్లో చిత్రించాలన్న తన ప్రణాళిక నెరవేర్చుకున్నారు. దాశరథి రంగాచార్యులు సికిందరాబాద్ పురపాలక కార్పొరేషన్ సంస్థలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశాకా ఆయనకు ప్రభుత్వం వెస్ట్ మారేడ్ పల్లిలో భూమి కేటాయిస్తే, ఇల్లుకట్టుకున్నారు. దగ్గరలో స్థిరపడ్డ పేదల ఇళ్ళు, స్థలాలు ఆక్రమించుకుని ఒక గూండా వారిని అన్యాయం చేస్తుంటే రంగాచార్యులు అతన్ని ఎదరించి నిలిచారు. మురికివాడల్లోని పేదల్లో కొందరిని ఆ గూండా కొనేయడంతో విఫలమైన ఆ ఉద్యమం ఫలితంగా మాయ జలతారు నవల వెలువడింది. బతికేందుకు నగరం చేరుకుని మురికివాడల్లో నివసించే పేదల జీవితాలు, వాటి చుట్టూ అల్లుకున్న ధనరాజకీయాలు మాయ జలతారు నవలలో వస్తువుగా స్వీకరించారు. అమృతంగమయ నవలలో ఓ గ్రామం పుట్టుక నుంచి క్రమంగా అభివృద్ధి చెందుతూ పోవడాన్ని చిత్రీకరించారు. విశిష్టమైన శైలిలో రాసిన ఈ నవలలో మహాత్మా గాంధీ ప్రవచించిన గ్రామస్వరాజ్యం అంశాన్ని ప్రధానంగా స్వీకరించారు. గాంధేయవాదంతో పాటుగా నవలలో ఆధ్యాత్మికత వంటివి కూడా చూపించారు. గ్రామాల్లోని జనజీవనంలో ఆధునికత ప్రవేశించడంతో జరిగిన మార్పులు కథలో ముఖ్యంగా స్వీకరించారు. రానున్నది ఏది నిజం? నవలలో భారతదేశం భవిష్యత్తు గురించి కన్న కలలను అక్షరబద్దం చేశారు. ఆ నవల రెండు భాగాలుగా వెలువడ్డ జనపథం నవలకు కొనసాగింపు. 1970ల్లో తెలంగాణా ప్రాథమిక విద్యావ్యవస్థలో వచ్చిన గుణాత్మకమైన పరిణామాల నేపథ్యంలో ఒక ఉపాధ్యాయుని జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని చిత్రీకరిస్తూ రంగాచార్య రాసిన నవల పావని.

దాశరథి రంగాచార్య వేదాలను తెలుగులోకి సంపూర్ణంగా అనువాదం చేసిన తొలి వ్యక్తిగా పేరుపొందారు. స్వయంగా మార్క్సిజాన్ని నమ్మే రంగాచార్య, వేదాల బోధనలు సమసమాజానికి దారులని నమ్మారు. మార్క్సునూ మహర్షిగా గౌరవించారు. ఆ నేపథ్యంలో తెలుగువారికి వేదాల సారం అందాలన్న ఆశయంతో వేదాలను తెలుగులోకి అనువదించారు. ఎమెస్కో విజయకుమార్ వాటిని ప్రచురించారు. తొలిప్రతిని ఒక గిరిజనుడు, ఒక దళితుడు, ఒక స్త్రీ చేతులకు అందించారు. ఉర్దూ సాహిత్యంలో కళాత్మకమైన, చారిత్రిక నవలగా నిలిచిపోయిన మీర్జా రుస్వా ఉమ్రావ్ జాన్ అదా నవలను అదే పేరుతో తెలుగులోకి అనువదించారు. 19వ శతాబ్దికి చెందిన లక్నో నగరపు వేశ్యాగృహాలను, సంగీత, సాహిత్య, నృత్యప్రదర్శనల సంస్కృతిని ఆధారం చేసుకుని రాసిన నవల అది. ఉమ్రావ్ జాన్ అనే సంగీత, సాహిత్య, నృత్యకారిణి, వేశ్య జీవితాన్ని నవలలో చిత్రించారు. ఉర్దూ సాహిత్యంలోనే తొలినవలగా పేరుపొందిన ఉమ్రావ్ జాన్ అదాను దాశరథి రంగాచార్య అందం చెడకుండా తెలుగులోకి అనువదించారు.




#Article 62: పారిజాతాపహరణం (ప్రబంధం) (254 words)


నంది తిమ్మన

శ్రీ కృష్ణదేవరాయలు

ఐదు అశ్వాసాలు గల ప్రబంధం. సంస్కృత భాగవతములోని మూడు పద్యాల కథని అద్భుతముగా పెంచి రచించాడు. 
పారిజాతాపహరణానికి సంస్కృత భారతంలో మూడు శ్లోకాలే అని అంటారు. కాని నిజానికి దీనికిని, సంస్కృత హరివంశమున వజ్రనాభుని వధ యనెడి కథకును సాన్నిహిత్యం ఉంది. ఏమైనా చాలా చిన్నదైన ఈ కథకు నంది తిమ్మన సంతరించిన అలంకార సౌకర్యములు, ప్రబంధోచిత పాత్రచిత్రణము, ఆయా పాత్ర జీవన వర్ణనము దీనిని సుందరమైన ప్రబంధకావ్యంగా తీర్చిదిద్దాయి.

నారదుడు పారిజాతం కృష్ణులవారికి ఇవ్వడం, ఆ సమయములో వారు రుక్మిణీదేవి మందిరములో ఉండటం, ఆ పారిజాతాన్ని రుక్మిణికి ఇవ్వడం, దానిని తెలుసుకొని సత్య ఆగ్రహించడం, అటుపై రకరకాల మలుపులు, పాద పీడనం, చివరకు దేవతలతో యుద్ధం, పారిజాత వృక్షం సత్య తీసుకొని రావడం, తులాభారంతో కథ సుఖాంతం.

ఈ గ్రంథము వ్రాయడానికి నంది తిమ్మన గారికి ఒక కారణము ఉన్నది అంటారు. ఒక రోజు అనుకోకుండా తిరుమలదేవి రాయల వారిని పాదాలతో తాకుతుందట. దానితో రాయల వారు కోపగించుకొని, తిరుమలదేవిని చూడటం మానేస్తాడు, తిరుమలదేవికి అరణంగా వచ్చిన నంది తిమ్మన ఆ గొడవని రూపు మాపడానికి స్వయంగా కృష్ణులవారే తన్నించుకున్నారు మీదేముంది అని చెప్పడానికి ఈ కథ వ్రాసినాడు అని ఒక జనశ్రుతి.

అనవినివేటువ్రడ్డయురగాంగనయంవలెనేయివోయభ
గ్గన దరికొన్న హుతాశన కీల యనంగ లేచి హె
చ్చిన కనుదోయి కెంపు తన చెక్కిలి కుంకుమపత్రభంగ సం
జనితనవీన కాంతి వెదజల్లగ గద్గద ఖిన్న కంఠయై 
(తా. అలా చెప్పిన దానిని వినగా దెబ్బతిన్న పాము లాగ, నేయి పోయగానే భగ్గనే మంటవలె లేచి, కనులు ఎఱ్రబడడంతో ఆ కుంకుమ కాంతి చెక్కిలి మీద పడి కొత్త కాంతి వెదజల్లగా వణుకుతున్న కంఠంతో)చెలికత్తెను ఇలా ప్రశ్నించింది - 
ఏమేమీ కలహాసనుండచటికై యేతెంచి యిట్లాడెనా?
ఆ మాటల్చెవియొగ్గి తా వినియెనా ఆ గోపికా వల్లభుం
డేమేమాడెను రుక్మిణీ సతియు, నీ వింకేటికిన్ దాచెదే?
నీ మోమాటలు మాని నీరజముఖీ, నిక్కంబెరింగింపవే
చేరవచ్చిన శ్రీకృష్ణుని సత్యభామ 
జలజాతాసనవాసవాది సురపూజాభాంజనంబైతన
ర్చు లతాంతాయుధు కన్నతండ్రి శిరమచ్చో వామపాదంబునన్
తొలగంజేసె లతాంగి,యట్లయగు నాథుల్ నేరముల్ సేయపే
రలకంజెందినయట్టి కాంతలుచితవ్యాపారముల్ నేర్తురే?
సత్యభామ దండనకు శ్రీకృష్ణుని స్పందన 
ననుభవదీయదాసునిమనంబుననెయ్యపుకిన్కబూనితా
చినయదినాకుమన్ననయ,చెల్వగునీపదపల్లవంబుమ 
త్తనుపులకాంతకటంకవితానముతాచిననొచ్చునంచునే
ననియదయల్కమానవుకదాయికనైననరాళకుంతలా

ఈసున బుట్టి డెందమున హెచ్చిన శోకదవానలంబుచే
గాసిలి యేడ్చె ప్రాణవిభు కట్టెదుటన్ లతాంగి పంకజ
శ్రీసఖమైన మోముపయి చేలచెఱంగిడి బాలపల్లవ
గ్రాస కషాయ కంఠ కలకంఠ వధూకల కాకలీ ధ్వనిన్




#Article 63: ఉద్భటారాధ్య చరిత్ర (208 words)


ఉద్భటారాధ్య చరిత్ర తెనాలి రామలింగడు రచించిన తెలుగు కావ్యము. పాల్కురికి సోమనాధుడు రచించిన బసవ పురాణంలోని ఏడవ అశ్వాసంలో కల 38 పద్యాల ఉద్భుటారాద్య వృత్తాంతము ఆధారముగా రచించబడిన ఈ కావ్యము, మూడు అశ్వాసాలు, 842 పద్యాలు గల శైవ గ్రంథము. దీనిలో కథానాయకుడు ఉద్భటుడు. ఇందులో మదాలస చరిత్ర, ముదిగొండ వంశ మూల పురుషుని కథ ఉన్నాయి. రామలింగడు ఈ కావ్యాన్ని కొండవీటి దుర్గాధ్యక్షుడైన నాదెండ్ల గోపన వద్ద ముఖోద్యోగిగా ఉన్న ఊరదేచమంత్రికి అంకితమిచ్చాడు.

నైమిశారణ్యంలో శివపార్వతుల కేళీవిలాసానికి గంధర్వులు అంతరాయం కలిగించగా, శివుడు కోపించి, వాళ్లను పిశాచాలు కండని శపిస్తాడు. వాళ్లు శరణు వేడగా, శాంతించిన శివుడు కొంతకాలానికి తన మానసపుత్రుడైన ఉద్భటుడి వల్ల వారికి శాపవిమోచనం కలుగుతుందని అనుగ్రహిస్తాడు. శివుడి అంశతో పుట్టిన ఉద్భతుడు ముంజభోజుడనే రాజుకు దీక్షా గురువౌతాడు. ఇలా వుండగా, గంధర్వుల సంగతి గుర్తుకు వచ్చి, వాళ్ల శాపవిమోచనం కోసం ఉద్భటుడు ప్రాణత్యాగం చేస్తాడు. ఉద్భటుడి కుమారులు అతని దేహాన్ని అగ్నికి ఆహుతి చేస్తారు. అతని దేహం నుండి వచ్చిన ధూమప్రసరణం చేత పిశాచాలకు శాపవిముక్తి కలిగి శివసాయుజ్యాన్ని పొందుతారు. ఇది ఈ కావ్యంలోని ప్రధాన కథ.

కారణంబులు నీవ కార్యజాలము నీవ
  భావజ్ఞడవు నీవ భావమీవ
జనకుండవును నీవ జన్యవస్తువు నీవ
  ప్రాపకుండవు నీవ ప్రాప్య మీవ
ఆధారమును నీవ యాధేయమును నీవ
  భోక్తవ్యమును నీవ భోక్తవీవ
రక్షకుండవు నీవ రక్షణీయము నీవ
  హార్యంబు నీవ సంహర్త వీవ

పూజకుండ వీవ పూజ్యంపు బొడవు నీవ
వాచకుండ వీవ తలపోయ వాచ్యమీవ
జ్ఞానమును నీవ చూడంగ జ్ఞాని వీవ
నిటలలోచన సకలంబు నీవ నీవ.

తరుణ శశాంక శేఖర మరాళమునకు
  సారగంభీర కాసార మగుచు
కైలాస గిరినాథ కలకంఠ భర్తకు
  గొమరారు లేమావి కొమ్మయగుచు
సురలోక వాహినీధర షట్పదమునకు
  బ్రాతరుద్బుద్ధ కంజాత మగుచు
రాజరాజ ప్రియ రాజకీరమునకు
  మానిత పంజర స్థానమగుచు

నురగవల్లభ హార మయూరమునకు
జెన్ను మీరిన భూధర శిఖరమగుచు
లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి.....




#Article 64: పాండురంగ మహాత్మ్యము (165 words)


పాండురంగ మహాత్మ్యము తెనాలి రామలింగడు రచించిన ఐదు అశ్వాసాల గద్య పద్య కావ్యము. ఈ కావ్యంలో గత కవులు ఎవరూ వాడని కొత్త వర్ణనలు, అందునా తాను గతంలో వాడినవి మళ్ళీ వాడకుండా కవిత్వం చెప్పడంతో రామలింగడికి వికటకవి అన్న పేరువచ్చింది.

పాండురంగ మహాత్మ్యం ప్రకారం ప్రపంచ దిగ్విజయానికి బయల్దేరే ముందు మన్మధుడు కొంతకాలం వెలిగుడారంలో విడిసినట్టు చెప్పబడింది. 17వ శతాబ్ది నాటి విజయనగర సామ్రాజ్యపు అనే కవిలె, కృష్ణరాయలకు 50 ఏళ్ళ అనంతరపు రాయవాచకాల్లో రాయలు యుద్ధానికి వెళ్ళేప్పుడు అంత:పురం, నగరం వదిలి ఊరి బయట ఓ గుడారం వేసుకుని యుద్ధసన్నాహాలు పర్యవేక్షించేవారని, దానినే వెలిగుడారం అంటారని తెలుస్తోంది. ఇలాంటి చాలా విశేషాలు ఆనాటి సాంఘిక, రాజకీయ చరిత్రలను ప్రతిబింబిస్తున్నాయి.

ఇది ఐదు అశ్వాసాలు గో 1302 గద్య పద్యాలతో విలసిల్లు గొప్ప గ్రంథము. ఇందు ఇతివృత్తము పాండురంగని కథ. దీనిలోనుండి రెండు పద్యాలను చూడండి
తుంగభద్రానది వర్ణన:
గంగా సంగమ మిచ్చగించునె మదిన్ గావేరీ దేవేరిగా
నంగీకార మొనర్చునే యమునతో నానందముంబొందునే
రగత్తుంగ తరంగ హస్తముల నారత్నాకరేంద్రుండు నీ
యంగంబంటి సుఖించునేని గుణభద్రా తుంగభద్రానదీ!

అలాగే తెలుగు లిపి ఆ రోజులలోనే ఎంత అందంగా వ్రాసేవాళ్ళో చూడండి

పట్టె వ్ట్రువయును బరిపుష్టి తలకట్టు గుడుసున్న కియ్యయు సుడియు ముడియు
నైత్వంబు నేత్వంబు నందంబు గిలకయు బంతులు నిలుపు పొలుపు
నయము నిస్సందేహతయు నొప్పు మురువును ద్రచ్చి వేసిన యట్ల తనరుటయును
షడ్వర్గశుద్దియు జాతియోగ్యతయును వృద్దిప్రియత్వంబు విశదగతియు
గీలుకొవ రాయసంబుల వ్రాలు వ్రాయుగొంకుగొనరునుజేతప్పు గొనకయుండ
లలిత ముక్తాఫలాకార విలాసనమున మతియరున్మంత్రి వేదాద్రి మంత్రివరుడు




#Article 65: ఘటికాచల మహాత్మ్యము (134 words)


ఘటికాచల మహాత్మ్యము తెనాలి రామలింగడు రచించిన ప్రబంధ కావ్యము. ఇది మూడు ఆశ్వాసాల ప్రబంధము. ఈ గ్రంథములో మొత్తము 475 గద్య పద్యాలు ఉన్నాయి. బహుశా ఇది తెనాలి చివరి రచన అయి ఉండవచ్చు. ఈ కావ్యాన్ని రామకృష్ణుడు మహారాష్ట్రీయుడైన ఖండోజీకి అంకితమిచ్చాడు. ఘటికాచలము నేటి తమిళనాడులో ఉన్న చోళంగి పురము (షోలింగూరు). ఇది 108 దివ్య తిరుపతులలో ఒక్కటి. ఇక్కడి దైవము లక్ష్మీ నరసింహస్వామి.

అయోధ్యకు ప్రభువగు ధవళాంగుడు శాపముచే కిరాత రూపమును పొంది వశిష్ఠ మహర్షిని దర్శించుకొని శాపవిముక్తుడయ్యెను.

హరిశర్మ అను బ్రాహ్మణుడు, తరళయను పరిచారికను కామింపగా ఒక పుత్రుడు జన్మించెను. అతడు కౌండిన్యుని సేవించి, విష్ణుమంత్రమును ఉపదేశముగా పొంది ఘటికాచలమున ఘోర తపస్సు చేసి తరువాత జన్మలో బ్రహ్మ కుమారునిగా జన్మించి నారదునిగా ప్రసిద్ధి చెందెను.

సప్తఋషులు శతశృంగమున విష్ణువును గూర్చి తపస్సు చేయగా ఇంద్రుడు తపోభంగమునకు విఫలయత్నం చేసెను. సప్త ఋషులతో అశరీరవాణి ఘటికాచలమునకు పోయినచో తపస్సు సఫలమౌనని పలికెను. సప్తర్షులు పుణ్యక్షేత్ర దర్శణము చేయుచు జగన్నాథము, శ్రీకాకుళము, కృష్ణా తీరము, శేష శైలము, కాంచీపురం దర్శించి ఘటికాచలము చేరి తపస్సు చేసిరి. వారికి నరసింహుడు ఉగ్రరూపమున ప్రత్యక్షమయ్యెను. వారిని వరములు కోరుకోమనగా జీవులకు భక్తి, జ్ఞాన, వైరాగ్యములనొసగు శక్తిని ఘటికాచలమునకు కలిగించమని కోరారు.




#Article 66: కందర్పకేతు విలాసము (328 words)


కందర్పకేతు విలాసము తెనాలి రామకృష్ణుడు రాసిన రచన. తెనాలి రామకృష్ణుడు కందర్ప  కేతు విలాసము, హరిలీల విలాసము వంటి రెండు రచనలు చేసినట్లు  పెదపాటి జగ్గన్న కవి తాను రాసిన  ప్రబంధ రత్నకరములో, ఉటంకించాడు. ఈ గ్రంథం  కథాకావ్యం. 

ప్రథమాంధ్ర కవిజీవిత చరిత్రనిర్మాత  గురజాడ శ్రీరామమూర్తి 1893లో ప్రకటించిన తమ కవిజీవితములు సంపుటంలో చెన్నపురి ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలోని వ్రాతప్రతుల ఆధారంగా, రామకృష్ణుని చాటుధారాపద్యములు అని ఉదాహరించిన వాటిలో కందర్పకేతు విలాసము లోని పద్యం ఉదాహరణగా చూడవచ్చు.

ఉ.ఆ నలినాక్షి వేనలికి _నంబుధరంబు సమంబు గామిచేఁ

కందర్పకేతు విలాసం లోని నాయకుడు కందర్పకేతుడు చింతామణి మహారాజు కొడుకు. ఒకనాటి రాత్రి కలలో ఒక లోకోత్తరసౌందర్యరాశి సాక్షాత్కరించి అతని మనసు దోచుకొంటుంది. తెల్లవారగానే అతను మకరందుడనే తన ప్రియసఖుణ్ణి వెంటబెట్టుకొని ఊరుపేరులు తెలియని ఆమె కోసం గాలిస్తూ, రోజంతా ప్రయాణించి వింధ్య పర్వతాన్ని చేరుకొని అక్కడ ఒక చెట్టుకింద సేద తీరుతున్నప్పుడు ఆ చెట్టు కొమ్మల మీద వాలిన చిలుక, గోరువంకలు మాట్లాడుకోవటం వినిపిస్తుంది. 

కుసుమపుర మహారాజు  శృంగారశేఖరుని కుమార్తె వాసవదత్త వంటి అందగత్తె మూడు లోకాలలోనూ లేదట. యుక్తవయసు వచ్చిన తర్వాత తండ్రి ఆమెకు వివాహం చేయదలిచి, స్వయంవరణాన్ని ప్రకటించాడట. దేశదేశాల నుంచి వచ్చిన రాకుమారులలో ఏ ఒక్కరూ ఆమెకు నచ్చలేదట. ఆ మునుపటి రోజే ఆమెకు రాత్రి కలలో కందర్పకేతుడనే అందగాడు కనిపించాడట. ఆమె అతనికి తన ప్రేమను వెల్లడిస్తూ ఉత్తరం వ్రాసి, తమాలిక అనే ప్రియమైన గోరువంక పక్షి  ద్వారా అతనికి పంపించిందట. 

అదృష్టవశాత్తు అదే చెట్టుమీద వాలిన తమాలిక – ఆ మాటలను శ్రద్ధగా వింటున్న వాడు కందర్పకేతుడని గుర్తించి, అతనికి లేఖను అందించి, కుసుమపురానికి తీసుకొనివెళ్తుంది. అక్కడొక దివ్యసౌధంలో నాయికా నాయకులు కలుసుకొంటారు. కాని, అదే రోజున శృంగారశేఖరుడు వాసవదత్తను విద్యాధర రాజకుమారుడు పుష్పకేతునికి ఇచ్చి పెళ్ళి చేయాలనుకొంటాడు. ప్రేమికులిద్దరూ మకరందుని ఎప్పటికప్పుడు వర్తమానాలు కనుక్కొంటుండమని రాజధానిలోనే ఉంచి, మనోజవమనే మాయాశ్వాన్నెక్కి వింధ్యాద్రికి వెళ్తారు. రాత్రంతా వారికి ఏకాంత ప్రణయలీలలతో గడిచిపోతుంది.

తెల్లవారేసరికి వాసవదత్త నిద్రలేచి, ప్రియునికి పండ్లను తేవటానికి అడవిలోకి వెళ్తుంది. అక్కడ ఘోరయుద్ధం చేస్తున్న ఆటవికసైన్యాల మధ్య చిక్కుకొంటుంది. ఆమె అందానికి ముగ్ధులై వారు తమ కలహం మాట మరచి ఆమె వెంటపడతారు. వాసవదత్త ఒక యోగసిద్ధుని ఆశ్రమంలో తలదాచుకోబోతుంది. ఆటవికులు ఆశ్రమంలోకి జొరబడి కనబడినదల్లా చిందరవందర చేస్తారు. ఆ దురాగతానికి కారణం ఆమేనని మండిపడి ముని ఆమెను శిలామూర్తివి కమ్మని శపిస్తాడు. ఆ తర్వాత ఆమె దీనంగా వేడుకొనగా అతని మనస్సు కరిగి, ప్రియుని స్పర్శ సోకితే శాపమోక్షం కలుగుతుందని అనుగ్రహిస్తాడు.

కందర్పకేతుడు మేలుకొన్నాక వాసవదత్త కనబడకపోయేసరికి సమీప ప్రాంతాలలో వెదకి  నిరాశచెంది ఆత్మహత్య చేసుకోబోతాడు. ఆకాశవాణి అతనిని వారించి, ప్రేయసీ పునస్సమాగమం సిద్ధిస్తుందని చెబుతుంది. కందర్పకేతుని మనస్సు కుదుటపడుతుంది. ప్రాణేశ్వరిపై మళ్ళీ కోరిక ఉదయిస్తుంది. అపుడు అతను 

లలితాస్యాంబురుహంబు నీలకచరోలంబంబు నేత్రాసితో
త్పల ముచ్చైఃస్తనకోక మోష్ఠవిలసద్బంధూక ముద్యత్కటీ 
పులినం బుద్గతచిత్తజాతరసవాఃపూరంబు ప్రాణేశ్వరీ 
జలజావాసము సొచ్చియాడక మనోజాతానలం బాఱునే’    అని అనుకుంటాడు.

కందర్పకేతు విలాసము తెనాలి రామకృష్ణకవి రచనమేనని, అది సంస్కృతంలో సుబంధుని వాసవదత్తా కథకూ, కన్నడంలో నేమిచంద్రుని లీలావతీ ప్రబంధానికీ సంయుక్తానువాదమని ఏల్చూరి మురళీధరరావు ప్రతిపాదించారు.




#Article 67: దిగంబర కవులు (123 words)


అది 1965, తెలుగు విప్లవ కవి లోకం నిశబ్దంగా ఉన్న రోజులు. ఒక కెరటం ఉవ్వెత్తున ఎగిసిపడి మూడు సంవత్సరాలు అందరినీ ఆలోచింపచేసినది. అదే దిగంబర కవులు. వారికి వారే చెప్పుకున్నట్లు ఆ మూడు సంవత్సరాలు దిగంబర కవుల యుగము. 1960 ల్లో ’దిగంబర కవిత్వం’ తెలుగు సాహిత్యరంగంలో ప్రవేశించింది.

దిగంబర కవులు మొత్తము ఆరుగురు. స్వంత పేర్లతో కవిత్వం రాయకూడదన్నది ఈ కవుల నియమం. ఆ కవులు, వారి కలం పేర్లు ఇవి:

వీరి కవితలు చాలా ఘాటుగా ఉంటాయి. వీరు తమ కవితల తొలిసంపుటిని 1965లో, రెండో సంపుటిని 1966 డిసెంబర్లో, మూడో సంపుటిని 1968 జూన్‌లో వెలువరించారు. మొదట సంపుటి దిగంబరశకం, నగ్ననామ సంవత్సరం ఆశ రుతువులో ఆవిష్కృతమయిందని వీరు ప్రకటించారు. 1970 లో ఈ దిగంబర ఉద్యమం ఆగిపోయింది. తరువాత వీరు విడిపోయి, నలుగురు విరసం లోను, ఇద్దరు అరసం లోనూ చేరారు.

ఒక కవిత

ఆకలి, కామం, కలలూ, కన్నీళ్ళూ 
మనిషిలోని మర్మజ్ఞానమంతా ఒక్కటే
దేశమేదైతేనేం? మట్టంతా ఒక్కటే
అమ్మ ఎవరయితేనేం?
చనుబాలు తీపంతా ఒక్కటే
బిక్క ముఖాలతో చూస్తారేం?
పిచ్చివాణ్ణిగా కేసుపుటప్ చెయ్యండి
నన్నెక్కనివ్వండి బోను




#Article 68: చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (567 words)


చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (ఆంగ్లం:Charles Phillip Brown) (నవంబర్ 10, 1798 - డిసెంబర్ 12, 1884) తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు. తొలి తెలుగు శబ్దకోశమును ఈయనే పరిష్కరించి ప్రచురించాడు. బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికి తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు. తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ఆంగ్లేయులలో ఒకరిగా బ్రౌన్ ను పరిగణిస్తారు. మిగతా ముగ్గురి పేర్లు ఆర్థర్ కాటన్, కాలిన్ మెకెంజి, థామస్ మన్రోలు. ఆంధ్ర భాషోద్ధారకుడు అని గౌరవించబడిన మహానుభావుడు.

వేమన పద్యాలను సేకరించి, ప్రచురించి, ఆంగ్లంలో అనువదించి ఖండాంతర వ్యాప్తి చేశాడు.

సి. పి. బ్రౌన్ 1798 నవంబర్ 10న కలకత్తాలో జన్మించాడు.  ఈయన తండ్రి డేవిడ్ బ్రౌన్ పేరొందిన క్రైస్తవ విద్వాంసుడు. తండ్రి మరణించిన తరువాత బ్రౌను కుటుంబం ఇంగ్లండు వెళ్ళిపోయింది. తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో సీపీ బ్రౌన్ గ్రీక్, లాటిన్, పారశీ, సంస్కృత భాషల్లో ఆరితేరాడు, బ్రౌను అక్కడే హిందూస్థానీ భాష నేర్చుకున్నాడు. తరువాత 1817 ఆగష్టు 4 న మద్రాసులో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా మద్రాసులో కోదండరామ పంతులు వద్ద తెలుగులో ప్రాథమిక జ్ఞానాన్ని సంపాదించాడు. వేమన, సుమతి శతకాలతోపాటుగా పల్నాటి యుద్ధం లాంటి చారిత్రిక కావ్యాలను నన్నయ్య, తిక్కన, గౌరన, శ్రీనాథుడు, పోతన, పెద్దన, రామరాజ భూషణుల కృతుల పరిష్కరణ - ప్రచురణల ముద్రింపచేసాడు. 

]

కడపలోను, మచిలీపట్నంలోను కూడా పాఠశాలలు పెట్టి ఉచితంగా చదువు చెప్పించాడు. విద్యార్థులకు ఉచితంగా భోజనవసతి కూడా కల్పించాడు. దానధర్మాలు విరివిగా చేసేవాడు. వికలాంగులకు సాయం చేసేవాడు. నెలనెలా పండితులకిచ్చే జీతాలు, దానధర్మాలు, పుస్తక ప్రచురణ ఖర్చుల కారణంగా బ్రౌను ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. అప్పులు కూడా చేసాడు. 1834లో ఉద్యోగం నుండి తొలగించడంతో ఇంగ్లండు వెళ్ళిపోయి, తిరిగి 1837లో కంపెనీలో పర్షియను అనువాదకుడిగా ఇండియా వచ్చాడు.
బ్రౌను మానవతావాది. 1832-33లో వచ్చిన గుంటూరు కరువు లేదా డొక్కల కరువు లేదా నందన కరువు సమయంలో ప్రజలకు బ్రౌను చేసిన సేవలు ప్రశంసలందుకున్నాయి. ఆ సమయంలో కరువును కరువుగా కాక కొరతగా రాయాలని అధికారులు చెప్పినా, అలానే పేర్కొనడంతో వారి అసంతృప్తిని ఎదుర్కొన్నాడు. పందొమ్మిదో శతాబ్ది తొలిపాదం చివర్లో తాను తెలుగు సాహిత్యంలో కృషి మొదలుపెట్టేనాటికి నెలకొని వుండిన స్థితిగతులను గురించి బ్రౌన్ స్ఫుటమయిన మాటల్లో అభివర్ణించాడు. ‘అప్పటికి తెలుగు సాహిత్యం కొనప్రాణంతో కొట్టుకులాడుతోంది. 1825 నాటికి ప్రమిదలో దీపం కొడిగట్టిపోతోంది. తెలుగు సాహిత్యం దాదాపు అంతరించిపోతూ ఉండడం నా కళ్లబడింది. నేను 30 ఏళ్లు కృషి చేసి, దాన్ని పునఃప్రతిష్ట చేశాన’న్నాడు బ్రౌన్. నిరలంకారంగా మాట్లాడ్డం బ్రౌన్ శైలి. ఈ మాటల్లో కూడా అందుకే అతిశయోక్తులు కనిపించవు. 1827 నాటికే, బ్రౌన్ ‘ఆంధ్ర గీర్వాణ ఛందము’ అనే పుస్తకం రాసినప్పటికీ, ఆయనకి మంచి గుర్తింపు తెచ్చిన పుస్తకం 1829 నాటి ‘వేమన శతకం’. అప్పటికి బ్రౌన్ అయిదేళ్లుగా వేమన సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఇందులో దాదాపు ఏడొందల పద్యాలకి ఆంగ్లానువాదాలతోపాటు విస్తృతమయిన పదకోశం కూడా సమకూర్చారు. మరో పదేళ్ల తర్వాత, 1164 పద్యాల మేరకి విస్తరింపచేసి, తిరిగి ‘వేమన శతకం’ అచ్చువేశారు.
పదవీ విరమణ తరువాత 1854లో లండన్‌లో స్థిరపడి, 1865లో లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసరుగా నియమితుడైనాడు. బ్రౌన్ 1884 డిసెంబర్ 12 న తన స్వగృహము 22 కిల్డారే గార్డెన్స్, వెస్ట్‌బార్న్ గ్రోవ్, లండన్లో అవివాహితునిగానే మరణించాడు. ఈయనను కెన్సెల్ గ్రీన్ శ్మశానంలో సమాధి చేశారు.

బ్రౌన్ కొలువులో తొలి తెలుగు కథకుడు తాతాచారి అనే పేరుతో ప్రాచుర్యం పొందిన నేలటూరు వేంకటాచలం. తాతాచారి చెప్పిన కథలను విన్న సి. పి. బ్రౌన్ అందులోంచి 24 కథలను, దానితోపాటు శ్రీకృష్ణమాచారి చెప్పిన రెండు కథలను కలిపి 1855లో పుస్తకంగా ముద్రించారు. అదే సంవత్సరం వీటి ఆంగ్లానువాదాన్ని 'పాపులర్ తెలుగు టేల్స్' అనే పేరుతో ప్రచురించారు. 1916లో 'తాతాచారి కథలు ' గిడుగు వేంకట అప్పారావు సంపాదకత్వంలో ద్వితీయ ముద్రణ పొందాయి. 1951లో వావిళ్ల వారి తృతీయ ముద్రణ, 1974లో బంగోరె సంపాదకుడిగా చతుర్థ ముద్రణ పొందాయి. నెల్లూరు జిల్లా గూడూరు తాలూకా గునుపాడు గ్రామవాసి. తిరుపతి బాలబాలికలకు వీధి బడుల్లో చదువు చెబుతూ జీవితం సాగించారు. 1848లో చెన్నపట్నం వెళ్లి బ్రౌను కొలువులో ఏడేళ్లు తాను బ్రతికి వుండిన పరియంతరమున్నాడు. పల్నాటి వీర చరితం, వసు చరిత్ర మొదలైన గ్రంథా ల పరిష్కార కృషిలో ఆయనకు సాయపడ్డారు. తాతాచార్యులు కావ్య తర్క వ్యాకరణముల యందు ప్రవీణత గలవాడు. తాతాచారి కథలు నీతి బోధకాలే కాక, ఆనాటి సామాజిక స్థితికి దర్పణంగాను ఉన్నాయి. అందులోని శైలి శుద్ధ వ్యావహారికమైనందు వల్ల పండిత శైలికి దూరంగా ఉందనే బ్రౌన్ ప్రశంసకు యోగ్యమైంది. తాతాచారి కథల్లో- గ్రామశక్తికి పొంగలి పెట్టిన కథ, దేవరమాకుల కథ, వెట్టి వాండ్ల పట్టీ కథ, వాలాజీపేట రాయాజీ మసీదు కథ, హాలింఖాన్ మోసపోయిన కథ, మనిషి సద్గతి దుర్గతి తెలిపే కథ, పొగచుట్ట కథ- లాంటివి ఉన్నాయి.

సి.పి.బ్రౌన్‌కు తెలుగులో తొలి యాత్రాచరిత్రకారుడు, పండితుడు ఏనుగుల వీరాస్వామయ్యతో సాన్నిహిత్యం ఉండేది. వీరాస్వామయ్యకు, బ్రౌన్‌కు నడుమ తరచు ఉత్తరప్రత్యుత్తరాల్లో వారి అభిరుచియైన సారస్వత సంరక్షణలో జరిగిన ప్రగతి, చేసిన పనులు వంటివి పంచుకుంటూండేవారు. వీరాస్వామయ్య బ్రౌన్‌కు రాసిన లేఖలో తాను సంపాదించిన అరుదైన స్కాందం అనే గ్రంథమూ, దానికి గల తెలుగు అనువాదం గురించిన వివరాలు తెలిపి, వీటిని ప్రచురించగలరేమో పరిశీలించమన్నారు. తాను వ్రాసిన అపురూపమైన యాత్రాచరిత్ర కాశీయాత్ర చరిత్రను ప్రచురించగలరేమో పరిశీలించవలసిందిగా బ్రౌన్‌ను కోరారు.




#Article 69: గోన బుద్ధారెడ్డి (312 words)


గోన బుద్ధారెడ్డి ఒక తెలుగు కవి. పదమూడవ శతాబ్దమునకు చెందిన ఇతను కాకతీయుల సామంతరాజుగా పనిచేశాడు. కందూర్ రాజధానిగా పాలిస్తూ తన తండ్రి పేర రంగనాథ రామాయణము గ్రంథాన్ని రచించాడు. ఇది పూర్తిగా ద్విపద ఛందస్సులో క్రీ.శ.1294-1300 కాలంలో రచించబడింది. యుద్ధకాండ వరకు ఇతను రచించగా మిగిలిన భాగాన్ని ఇతని కుమారులు పూర్తిచేశారు. ఇతని కుమారుడు గోన గణపతిరెడ్డి తండ్రిపేరిట బుద్ధేశ్వరాలయాన్ని నిర్మించాడు. ఉత్తరకాండ కర్తలయిన కాచ, విఠలనాథులు ఇతని కుమారులేనని కొందరు పరిశోధకులు పేర్కొన్నారు. ఐతే ప్రముఖ సాహిత్య విమర్శకుడు వేటూరి ప్రభాకరశాస్త్రి గోన బుద్ధారెడ్డి పినతండ్రి కుమారుడైన మరో గన్నారెడ్డి కుమారులే ఉత్తర రంగనాథరామాయణ కర్తలను పరిశోధన వెలువరించారు. గోన బుద్ధారెడ్డి రచించిన రామాయణమే తెలుగులో తొలి రామాయణ కావ్యంగా ప్రశస్తి వహించింది. అంతకుముందు తిక్కన రచించినది నిర్వచనోత్తర రామాయణమే కాని సంపూర్ణ రామాయణం కాదు.

కాకతీయుల సైన్యంలో సేవలందించే ఉన్నతోద్యోగాలకు చెందిన కుటుంబంలోనివారు గోన గన్నారెడ్డి రచించిన రంగనాథ రామాయణం అనుసరించి ఆయన పూర్వీకుల విశేషాలు తెలుసుకోవచ్చు. రామిరెడ్డి తండ్రి పేరు విట్ఠలభూపతి (లేదా విట్ఠలరెడ్డి). ఆయన తండ్రి పేరు కూడా బుద్ధారెడ్డియే. బుద్దారెడ్డి ముత్తాత పేరు గోన రుద్ర. తండ్రి గోనరెడ్డి.

కాకతీయ రుద్రదేవుడు కందూరు చోడులను (నేటి మహబూబ్ నగర్ జిల్లా) లోని వర్ధమానపురం (నేటి నందివడ్డేమాన్,మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నది) నుంచి పారద్రోలడంతో, ఆ స్థానంలో గోరెడ్డిని తన సామంతుడిగా నియమించాడు. ఇతని కుమారుడు గన్నారెడ్డి రాజధానిగా పాలించాడు. ఇతని అల్లుడు మాల్యాల గుండ దండధీశుడు వర్థమానపురం పాలకుడైనాడు. ఇతని మరణానంతరం గోన బుద్ధారెడ్డి  గుండేశ్వరాలయం నిర్మించింది. ఈమె తొలి తెలుగు కవయిత్రిగా ఖ్యాతి చెందింది.

గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం తెలుగులో తొలి సంపూర్ణ రామాయణంగా సుప్రఖ్యాతి చెందినది. అంతకుమునుపు తిక్కన వ్రాసిన నిర్వచనోత్తర రామాయణం సంపూర్ణమైన రామాయణంగా చెప్పేందుకు వీలులేని రచన. రంగనాథ రామాయణాన్ని ద్విపద ఛందస్సులో రాశారు. తెలుగులో ద్విపద ఛందస్సును ఉపయోగించి ప్రధానమైన కావ్యాన్ని రచించడంలో పాల్కురికి సోమనాథుని తర్వాత రెండవవారిగా బుద్ధారెడ్డి నిలుస్తున్నారు.

గోన బుద్ధారెడ్డి వ్రాసిన రంగనాథ రామాయణం తెలుగు నాట అత్యంత ప్రాచుర్యం వహించిన గ్రంథాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఆంగ్ల విద్య తెలుగు నాట ప్రవేశించని రోజుల్లో సంస్కృత భాషా పాఠకులు తప్ప తక్కిన విద్యార్థులందరికీ చిన్నతనంలోనే పెద్ద పుస్తకం పట్టించి చదివించేవారు. ఇంతకీ ఈ పెద్ద పుస్తకం అంటే మూడు పుస్తకాలకు సామాన్య నామం. ఆ మూడు పుస్తకాలు ఇవి:

గోన బుద్ధారెడ్డి ములికినాటి సీమకు రాజధాని అయిన గండికోటకు అతిచేరువలోని పెద్దపసుపల లేదా  కొట్టాలపల్లెకు చెందినవాడు. నేటికీ గోనా వంశస్ధులు ఆగ్రామాలలో మరియూ జమ్మలమడుగులో నివసించుచున్నారు.

కాకతీయ పరిపాలన కాలం (995-1323) లో గోన బుద్ధారెడ్డి మహాబూబ్ నగర్ జిల్లాలోని రాజ్యాలైన వర్ధమానపురం (ప్రస్తుతం నంది వడ్డెమాన్), ఖిల్లా ఘన్‌పూర్ (ఘనపూర్ కోట) నుండి పరిపాలన చేసాడు. అతని కుటుంబం, గోన సంస్థానం కాకతీయ సామ్రాజ్యంలో ప్రసిద్ధమైనది. అతని మరణం తరువాత అతని సోదరుడూ గోన లుకుమా రెడ్డి రాజ్యపాలన భాద్యతలను స్వీకరించాడు.




#Article 70: రంగనాథ రామాయణము (105 words)


వర్థమానపురాన్ని ఏలిన గోన బుద్దారెడ్డి తండ్రి కోరిక మేరకు క్రీ.శ.1294-1300 కాలంలో ఈ రామాయణాన్ని రచించాడు. పాల్కుర్కి సోమనాథుడు తర్వాత ద్విపద కవితను రచించిన వారిలో గోనబుద్దారెడ్డి రెండవవాడు. యుద్ధకాండ వరకు ఇతను రచించగా మిగిలిన భాగాన్ని ఇతని కుమారులు పూర్తిచేశారు. ఇతని కుమారుడు గోన గణపతిరెడ్డి తండ్రిపేరిట బుద్ధేశ్వరాలయాన్ని నిర్మించాడు. ఉత్తరకాండ కర్తలయిన కాచ, విఠలనాథులు ఇతని కుమారులేనని కొందరు పరిశోధకులు వ్రాశారు. ఐ సాహిత్య విమర్శకుడు వేటూరి ప్రభాకరశాస్త్రి గోన బుద్ధారెడ్డి పినతండ్రి కుమారుడైన మరో గన్నారెడ్డి కుమారులే ఉత్తర రంగనాథరామాయణ కర్తలను పరిశోధన వెలువరించారు.

గోన బుద్ధారెడ్డి వ్రాసిన రంగనాథ రామాయణం తెలుగు నాట అత్యంత ప్రాచుర్యం వహించిన గ్రంథాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఆంగ్ల విద్య తెలుగు నాట ప్రవేశించని రోజుల్లో సంస్కృత భాషా పాఠకులు తప్ప తక్కిన విద్యార్థులందరికీ చిన్నతనంలోనే పెద్దపుస్తకం పట్టించి చదివించేవారు. ఇంతకీ ఈ పెద్ద పుస్తకం అంటే మూడు పుస్తకాలకు సామాన్య నామం. ఆ మూడు పుస్తకాలు ఇవి:




#Article 71: సిద్దేంద్ర యోగి (945 words)


 సిద్ధేంద్ర యోగి (1672 - 1685) ప్రసిద్ధ కూచిపూడి నాట్యాచార్యుడు. కూచిపూడి నాట్యానికి ఇతను మూలపురుషుడని జనశ్రుతిలోని మాట. ఇతడు ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లాకు చెందిన కూచిపూడి గ్రామానికి చెందినవాడు. ఇతని గురువు నారాయణ తీర్థులు.

సిద్ధేంద్రయోగి జీవితాన్ని గురించి స్పష్టమైన ఆధారాలు లేవు. కనుక జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న కథలే ప్రస్తుతం లభించిన ఆధారాలు. సిద్ధేంద్రయోగి పూర్వనామం సిద్ధప్ప అనీ, ఇతడు కూచిపూడి వాస్తవ్యుడనీ అనుకోవచ్చును. కూచిపూడి, మొవ్వ, శ్రీకాకుళం, ఘంటసాల ప్రాంతాలు అప్పుడు సమీపంలోనే ఉన్న సాంస్కృతిక కేంద్రాలు. సిద్ధేంద్రయోగి గురువైన నారాయణ తీర్ధులు 1580-1680 మధ్యకాలంవాడు కావడం వలనా, సిద్ధేంద్రయోగి సమకాలికుడైన క్షేత్రయ్య 1590-1675 కాలంలో ఉన్నాడనడంవల్లా, సిద్ధేంద్రయోగి 1600-1700 మధ్యకాలంలో జీవించినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు.

ఈయన గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. సిద్ధేంద్ర కాశీలో చదువుకుంటున్నప్పుడు, భార్య గర్బాధానానికి సిద్ధమైనది అని కబురు వస్తుంది. యువ రక్తంలోని సహజ సిద్దమైన తొందరతో, ఆతురతతో, వేగంగా, ఉత్సాహంగా భార్య కడకు బయలుదేరి వస్తాడు, కాని, కూచిపూడి దగ్గరకు రాగానే కృష్ణానది పొంగి పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది. అలలమీద అయినా నదిని దాటుదామని సిద్ధేంద్ర నదిలోకి దూకుతాడు. కాని దురదృష్టవశాత్తూ నది మధ్యలోకి రాగానే, నదిలో మునిగిపోవడం మొదలెడతాడు. 'ఇక ఎలాగైనా చావు తప్పదు' అని అనుకొని కనీసం పుణ్యమైనా దక్కుతుందని అక్కడికక్కడే తనకు తానే మంత్రం చెప్పుకొని సన్యాసం స్వీకరిస్తాడు. సంసార సాగరాన్ని దాటించగల ఆ కృష్ణ భగవానుడు, సిద్ధేంద్రను కృష్ణా నది కూడా దాటిస్తాడు. ఇక ఇంటికి వెళ్ళి, భార్యను పీటలపై కూర్చోమంటే, భార్య సిద్ధేంద్రను ఇతనెవరో గడ్డాలు, మీసాలు ఉన్న సన్యాసి, నా మొగుడు కాదు అని అంటుంది. అప్పుడు జరిగిన కథ చెప్పి, భార్యకి కృతజ్ఞతలు చెప్పి, మరలా పెద్దలందరి అనుమతితో సన్యాసం తీసుకుంటాడు. ఈ కథకే చిన్న చిన్న రూపాంతరాలున్నాయి.

మరొక కథ ప్రకారం సిద్ధప్ప తల్లిదండ్రులు నిరుపేదలు, అంధులు కూడాను. ఎలాగోలా తల్లిదండ్రులను పోషిస్తున్న సిద్ధప్పను మెచ్చి శంకరాచార్యుడనే గురువు (లేక నారాయణ తీర్థులు) సిద్ధప్పకు కృష్ణమంత్రోపదేశం చేశాడట. మంత్రోపదేశం పొందిన సిద్ధప్ప శ్రీకృష్ణునిగురించి ఆడుతూ పాడుతూ ఉండేవాడట. శ్రీకృష్ణుడే స్వయంగావచ్చి అతనితో ఆడిపాడేవాడట. వారి సాంగత్యం మూలంగా సిద్ధప్ప తల్లిదండ్రులకూ శ్రీకృష్ణుని దర్శనమూ, ముక్తీ లభించాయట. ఆవెనక కూచిపూడి భాగవతులు భాగవతవేషం కట్టడం పరిపాటి అయినదట.

మరొక కథప్రకారం సిద్ధప్ప శ్రీకాకుళంలోని పేదబ్రాహ్మణుడు. ఇల్లువదలివెళ్ళి ఉడిపిలో గురుశుశ్రూష చేసి సంగీత నృత్య పాండిత్యాలలో నిష్ణాతుడయ్యాడు. గురువు ఆశీస్సులతో తిరిగి శ్రీకాకుళం వచ్చి కృష్ణానదిని దాటే సమయంలో ఆపద్ధర్మంగా సన్యాసం తీసుకొన్నాడు. మరొక కథ ప్రకారం సిద్ధప్ప రాయలసీమనుండి దేశాటనచేస్తూవచ్చిన బ్రహ్మచారి. కూచిపూడిలో సువాణం జోగావధానులు తన కుమార్తెనిచ్చి పెండ్లి చేశాడు. వివాహానంతరం అక్కడే స్థిరపడిన సిద్ధప్ప శాస్త్రాలను అభ్యసించి, అభినయంలో అద్భుతమైన పాండిత్యాన్ని గడించి క్రమంగా సిద్ధేంద్రయోగి అయ్యాడు.

ఆంధ్రదేశంలో నృత్యసంప్రదాయం రెండు పద్ధతులలో వర్ధిల్లింది (1) నట్టువమేళ సంప్రదాయము - ఆలయాలలో జరిగే ఆరాధనా నృత్యాలు, కళ్యాణ మంటపాలలో చేసే నృత్యాలు. (2) నాట్యమేళ సంప్రదాయము - భరతుని నాట్యశాస్త్రంలో చెప్పిన విధానికి అనుగుణంగా ఉంది. ఇది నృత్యనాటకము. ఇందులో నర్తకుల సంఖ్య ఎక్కువ. నాట్యమేళాలలో కలాపములు ప్రసిద్ధి చెందినవి. వీటిలో భామాకలాపము రచించి, ప్రచారంలోనికి తెచ్చినవాడు సిద్ధేంద్రయోగి. ఈ కూచిపూడి గ్రామం కృష్ణాజిల్లాలోని దివిసీమలో ఉంది. దీనికి సమీపంలోనే మొవ్వ, పెదపూడి, ఘంటసాల, శ్రీకాకుళం వంటి ప్రసిద్ధ సాంస్కృతిక, చారిత్రిక ప్రదేశాలున్నాయి.

ప్రస్తుత కూచిపూడి నాట్యరీతి, సిద్ధేంద్ర యోగి స్థాపించిన నృత్యనాటక సంప్రదాయం, భాగవత మేళనాటకం నుండి ఆవిర్భవించింది. సిద్ధేంద్రయోగికి ముందే, అనగా 14వ, 15వ శతాబ్దాలలో కూచిపూడి భాగవతులు ఊరూరా ప్రదర్శనలిచ్చేవారని మాచపల్లి కైఫీయతు ద్వారా తెలుస్తున్నది. రకరకాలుగా విస్తరించిన కూచిపూడి నాట్యాన్ని సిద్ధేంద్రయోగి క్రమబద్ధం చేశాడని మనం గమనించవచ్చును.

కూచిపూడి నృత్యానికి ఆద్యుడై సిద్ధేంద్ర యోగి భామా కలాపం రచించాడు. ఇందులో కృష్ణుడు, సత్యభామ, రుక్మిణి ప్రధాన పాత్రలు. తన ఊరిలోని మగవారితోనే ఆడవేషాలు వేయించి ఆడించాడు. సిద్ధేంద్ర యోగి యక్షగానాలకు మెరుగులు దిద్ది, భరతుని నాట్యశాస్త్ర రీతులను తన కూచిపూడి నాట్యంలో ప్రవేశపెట్టాడు. శాస్త్రీయ నాట్యరీతుల్ని జానపదకళా నృత్యాలతో మేళవించాడు. తనను కృష్ణానదిలో మునిగి పోకుండా కాపాడిన ఆ కృష్ణుని స్తుతిస్తూ, సిద్ధేంద్ర యోగి పారిజాతాపహరణం నృత్యనాటికను వ్రాశాడనీ, అది కూచిపూడి నృత్యనాటకాలలో అతి పురాతనమైనదనీ చెబుతారు. .

సిద్ధేంద్రయోగి అంతకుముందే భాగవతులచేత అనేక వేషాలు వేయించియున్నాడు. శ్రీకాకుళంలోని ఆంధ్రవిష్ణువు దేవాలయంలో దేవదాసీలు భగవంతుని సేవగా చేసే నృత్యాన్ని పరిశీలించియున్నాడు. ఉడిపిలో సంగీత, సాహిత్య అభినయాలను కూలంకషంగా అభ్యసించాడు. సిద్ధేంద్రయోగి గురువైన నారాయణతీర్ధులు సంస్కృతంలో రచించిన కృష్ణలీలా తరంగిణి, తెలుగులో రచించిన పారిజాతాపహరణమూ దక్షిణదేశంలో అప్పటికే ప్రచారంలో ఉన్నాయి. పారిజాతాపహరణం కథనే తెలుగులో పారిజాతం అనే పేరుతో నృత్యనాటికగా సిద్ధేంద్రయోగి రచించాడు. అదే భామాకలాపంగా ప్రసిద్ధి చెందింది. ఆ భామాకలాపాన్ని కూచిపూడిలోని బ్రాహ్మణుల పిల్లలకు బోధించాడు. కూచిపూడిలో పుట్టిన ప్రతిమగపిల్లవానికి సిద్ధేంద్రుని పేరుచెప్పి, ముక్కు కుట్టి, కాలిగజ్జె కట్టి, ఆ పిల్లవాడు పెద్దయ్యాక ఏ వృత్తిని అవలంబించినా గాని స్వామి సన్నిధిలో భామవేషం వేసి తీరాలని, స్త్రీలకు ఈ కళలో ప్రవేశం ఉండరాదని సిద్ధేంద్రుడు శాసించాడు. ఆ నియమం చాలాకాలంవరకూ కొనసాగింది. భామాకలాపం రచనావిధానం యక్షగానరీతిలో ఉన్నాగాని దాని ప్రదర్శన రీతి విశిష్టమైనది. భామాకలాపంలో నృత్యము, సంగీతము ప్రాధాన్యం వహిస్తాయి. ఇందులో నాయిక సత్యభామ. నాయకుడు కృష్ణుడు. చెలికత్తె మాధవి మరో ముఖ్యమైన పాత్ర. 'కలాపము' అంటే 'కలత' లేదా 'కలహము' అని అర్ధము.భామాకలాపము విఘ్నేశ్వరస్తుతితో (శ్రీ విఘ్నేశ్వర పాదపద్మములనే సేవించి నా యాత్మలో అని)ఆరంభమవుతుంది. ఆ వెనుక సరస్వతీప్రార్ధన ఉంటుంది. వెన్నెలపదం పాడుతూ సత్యభామ ప్రవేశించడంతో కథ ఆరంభమవుతుంది. నేవెవరవు అని చెలికత్తె అడుగుతుంది. అప్పుడు సత్యభామ

అనే దరువును పాడుతుంది. ఆ వెనుక అత్తమామల ప్రశస్తి చెప్పి, సత్యభామ హరి ఎక్కడున్నాడని అడిగి, అనంతరం భుదేవిని ప్రశస్తిస్తుంది. తరువాత దరువు, వెన్నెల పదము, మరికొన్ని దరువులు శ్రీకృష్ణునితో కలిసి పాడుతుంది. ఈ సందర్భంలోనే దశావతార వర్ణన సంవాదపూర్వకంగా సాగుతుంది. మంగళహారతితో భామాకలాపం ముగుస్తుంది. భామాకలాపం కొన్నిమార్పులు పొందింది. సిద్ధేంద్రుని పారిజాతంలో తొలిఘట్టమే భామాకలాపం. అయితే అనంతర ప్రదర్శనలలో పారిజాతం కథను తీసివేసి, సత్యభామ అష్టవిధ కథానాయికలుగా అభినయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలా మార్పులు చేసినవారిలో ముఖ్యుడు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఆకివీడు వాస్తవ్యుడు మంగు జగన్నాధ పండితుడు. సిద్ధేంద్రునికి రెండువందల సంవత్సరాల తరువాతివాడు. తరువాత క్రమంగా మహిళలు భామాకలాపం ప్రదర్శనలో అగ్రగాములైనారు.

సిద్ధేంద్రయోగి గొల్లకలాపాన్ని కూడా రచించాడు. కాని గొల్లకలాపము భాగవతుల రామయ్య రచన అని మరికొందరి అభిప్రాయము. (ఇది సిద్ధెంద్రయోగి రచన అనడంలో సందేహం లేదని డా. ఎన్. గంగప్ప తన రచనలో పేర్కొన్నాడు.) గొల్లకలాపంలో నాయిక రేపల్లెవాడలోని గొల్లభామ. చల్లోయమ్మ చల్ల అంటూ గొల్లవనిత బ్రాహ్మణ పండితులతో వివాదంలో పడడం ఈ రచన ఇతివృత్తం. ఈ వివాదంలో మానవుని జననంనుండి మరణంవరకు, చల్లనుండి వెన్న తీయడం మొదలు జీవాత్మ పరమాత్మల సంబంధం వరకు మానవజీవితాన్ని గురించి, సృష్టిని గురించి చర్చిస్తారు.

హంసలదీవి దీవి సుబ్బారావు రచించిన కవితల పుస్తకం నుండి

చెప్పబోయేది
సుమారు మూడు వందల యేబది యేళ్ళ క్రితం సంగతి

చదువు కోసం కాశీ వెళ్ళి
కూచిపూడి నుండి ఓ అబ్బాయి
అక్కడే వున్నాడు పదిపన్నెండేళ్ళు

అక్కడుండగా వచ్చింది కబురు
ఇంటి దగ్గర భార్య ఈడేరిందనీ
గర్బాధానానికి ముహూర్తం కూడా కుదిరిందనీ

ఇంకేం బయలుదేరాడు సంతోషంగా
ఉరుకులు పరుగులు దారంతా
ఊరు దగ్గర పడుతుండగా
కృష్ణ కనిపించింది వురవళ్ళు పరవళ్ళుగా

యువకుడు గదా
దిగాడు ధైర్యం చేసి
తెలిసింది గాదు వరద వుధృతం దిగాక గాని
సగం దూరం పనికి వచ్చింది వచ్చిన ఈత
ఇక ఖాయమనుకొన్నాడు మునక

సన్యాసం పుచ్చుకొన్నాడు అక్కడికక్కడ
తనకు తానే మంత్రం చెప్పుకొని
పోయే ముందు పుణ్యమన్నా దక్కుతుందని

ఒకే సారి జరిగాయి
అట్లా ఆయన చేతులెత్తేయటం
ఇట్లా ఒక పెద్ద కెరటం వచ్చి ఒడ్డుకు తోసెయ్యటం
ఇంటికొచ్చి పడ్డాడు
బ్రతుకు జీవుడా అంటూ

పీటల మీదకొచ్చి కూర్చోవాల్సిన భార్య
ససేమిరా రానన్నది
అనుకొన్న ముహూర్తానికి
ఈయన ఎవరో గడ్డాలూ మీసాలూ ఉన్న సన్యాసిగాని
నా భర్తకాదు పొమ్మన్నది

అంతా తలో మాటా అన్నారు
చిన్నపిల్ల మంకుపట్టు పట్టిందని కొందరు
గాలో ధూళో సోకిందని ఇంకొందరు
ఆ పిల్లదొక్కటే పాట
ఎవరెన్ని అన్న
ఈయనెవరో సన్యాసి
నా భర్త కానే కాదు అని

అప్పుడు
పీటల మీద కూర్చొన్న యువకుడు
పంచె వుత్తరీయం తీసి పక్కన పెట్టాడు
వట్టి గోచీతో లేచి నుంచొన్నాడు
అక్కడున్న పెద్దలందరికీ నమస్కారాలు చెప్పాడు

వరదతో వున్న కృష్ణను
దాటలేక పోయిన వైనమూ
ఆఖరు క్షణంలో
ఆతుర సన్యాసం తీసుకొన్న తీరూ
దాచకుండా చెప్పాడు
ఇంకా

శ్రీ కృష్ణ భగవానుడే తనను
సంసారం నుండి రక్షించి ఒడ్డున పడేశాడనీ
తన భార్యే తనను
అధోగతి పాల్గోకుండా రక్షించిందనీ
చెప్పాడు

అట్లా చెప్పి అన్ని విషయాలు
సన్యాసం స్వీకరించాడు యథావిధిగా
అందరి అంగీకారంతో మరలా
అతడే యోగి సిద్దేంద్రుడు
జగన్నాటకంలో నిమిత్తమాతృడు

యౌవనంలో శృంగార వాంఛ పూర్తిగా పోక
అది పోయేటందుకుగా
శృంగార రసప్రధానంగా
సత్యభామా శ్రీ కృష్ణులు నాయికా నాయకులుగా
పారిజాతాపహరణం యక్షగానం కూర్చాడనీ
అదే భామాకలాపమనీ
ఆ వూరి మగవాళ్ళతోనే వేషం కటించి ఆడింపజేస్తూ వచ్చాడనీ
చెబుతారు విజ్ఞులు




#Article 72: తాళ్ళపాక చిన తిరు వేంగళనాథుడు (130 words)


గమనిక: విషయం సరి చూడాలి. చిన తిరువేంగళనాధుడు, చిన తిరుమలాచార్యుడు వివరాలు కలగలిసినట్లున్నాయి.

తాళ్ళపాక చిన్నన్నగా పేరొందిన తాళ్ళపాక చిన తిరు వేంగళనాథుడు, తాళ్ళపాక అన్నమయ్య మనుమడు.

అన్నమయ్య వంశం తెలుగు సాహిత్యానికి ఆభరణం. అన్నమయ్య భార్య తిమ్మక్క తెలుగులో తొలి కవయిత్రి. సుభద్రా కళ్యాణం మంజరి ద్విపద కావ్యం రచించింది. ఈమె కుమారుడు నరసింహుడు సంగీత సాహిత్య కళా కోవిదుడు. నరసింగన్న భార్యలు నాచ్చారమ్మ, అనంతమ్మ. వారి పుత్రులు నారాయణుడు, అప్పలార్య, అన్నలార్య.

తిరుమలాచార్యుడు తండ్రి వలెనే సంకీర్తనా యజ్ఞం నిర్వహించాడు. ఇతని ఆధ్యాత్మ శృంగార సంకీర్తనలతో పాటు మరికొన్ని లఘురచనలు లభించాయి. ఇతని భార్య తిరుమలమ్మ. వారి కొడుకులు చిన తిరుమలయ్య, అన్నయ్య, పెదతిరువెంగళ నాధుడు, చినతిరువెంగళనాధుడు (చిన్నయ్య లేదా చిన్నన్న) , కోనేటి తిరువేంగళనాధుడు. చినతిరుమలయ్య తన తండ్రి, తాతలవలెనే ఆధ్యాత్మ, శృంగార సంకీర్తనలు రచించాడు. ఇంకా అష్టభాషా దండకం, సంకీర్తన లక్షణం (తండ్రి, తాతల సంస్కృత రచనలకు అనువాదం) వ్రాశాడు.

ఇలా తాళ్ళపాక కవులు తెలుగు భాషకు, ప్రత్యేకించి పదకవితకు, ద్విపద కవితకు ఎనలేని సంపదను ఒనగూర్చారు.

అని తెనాలి రామకృష్ణుని చాటువు.

తాళ్ళపాక చిన్నన్న ఎనిమిది భాషలలో పండితుడు. ఇతని రచనలు 

ఇంటర్నెట్ ఆర్చీవులలో లభిస్తున్న రచనలు




#Article 73: అష్టభాషా దండకం (176 words)


అష్టభాషా దండకము శ్రీవెంకటేశ్వరునిపై ఎనిమిది భాషలలో చెప్పిన దండకం. దీనిని క్రీ.శ 1537లో తాళ్ళపాక చినతిరుమలాచార్యుడు రాసాడు.

ఇది శ్రీ వేంకటేశ్వరుని పై చెప్పిన దండకము, మొత్తము ఎనిమిది భాషలలో చెప్పబడింది. ఆ భాషలు 

అనునవి అష్ట భాషలుగా పేర్కొనబడినవి.

అప్పకవి క్రీ.శ 1656లో తన గ్రంథమున అష్టభాషలను ఈ క్రింది విధంగా నిర్వచించాడు.

సంస్కృతము, పాకృతంబును, శౌరసేని
జగైపై మాగథియును బైశాచికయును
జూళీకయు నవభ్రంశంబు సొరిది నంధ్ర
భాషయును నివి చను నష్ట భాష లనగ

అతని ప్రకారం సంస్కృతము, ప్రాకృతము, శౌరసేని, మాగథి, పైశాచి, చూళీక, అపభ్రంశము, ఆంధ్రభాష అనునవి అష్ట భాషలు

అప్పకవి తెలుగును అష్ట భాషలల్ చేర్చాడు. కానీ తాళ్లపాక చిన తిమ్మాచార్యుడు తెలుగును చేర్చలేదు. సార్వదేశీ తెనుగు భాష కాదు. అది ప్రాకృత భాషా భేదమే. అప్పకవి సమకాలికురాలు - రంగాజమ్మ మున్నారు దాస విలాసమను గ్రంథమున 1.చూళిక, 2. అపభ్రంశము, 3. ప్రాకృతము, 4. పైశాచి, 5. శౌరశేని, 6. మాగధి, 7. దేశ, 8. సంస్కృతము అని అష్ట భాషలలో సమస్యా పూరణము జరిగినట్లు స్పష్టపరచింది.

సంస్కృతంధ్రములు - షడ్విధ ప్రాకృతములు ( ప్రాకృతము, శూరసేని, మాగధీ, పైశాచి, చూళీక, అపభ్రంశము) లను అష్ట భాషలు అంటారు.

ఈ అష్ట భాషా ప్రశక్తి తెలుగున 14వ శతబ్దిన ప్రారంభమైనది. అంతకు ముందు లేదు 

కేవలం భాషా విషయమునే ఇతి వృత్తముగా తీసుకొని దండకము రచించిన వారిలో ప్రథముడు చిన తిరుమలాచార్యుడే. 19వ శతాబ్దిలో దీణి ననుసరించి గుండ్లూరి నరసింహ కవి భాషీయ దండకం రచించాడు. ఇందు తెలుగు దేశమున నాయా వర్ణమూల్ వారి వ్యవహారిక భాష చక్కగ ఉదాహరణలతో చూపబడినవి.




#Article 74: జీవ శాస్త్రం (104 words)


జీవుల అధ్యయనానికి సంబంధించిన శాస్త్రాన్ని  జీవశాస్త్రం (ఆంగ్లం biology) అంటారు. జీవుల ఉద్భావన, లక్షణాలు, వర్గీకరణ, జీవకోటిలో జాతులు, పర్యావరణ చట్రంలో వాటి మనుగడ, ఇలా ఎన్నో కోణాల నుండి జీవశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యవచ్చు. కనుక జీవ శాస్త్రము యొక్క పరిధి చాలా విస్త్రుతమైనది. వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, వైద్యశాస్త్రం మొదలైన వర్గాలు చాలరోజులబట్టీ వున్నవే. ఈ రోజులలో ఈ వర్గీకరణ కూడ బాగా వ్యాప్తి చెందింది. జీవి లక్షణాలని అణు (atomic), పరమాణు (molecular) ప్రమాణాలలో అధ్యయనం చేస్తే దానిని అణుజీవశాస్త్రం (మాలిక్యులార్ బయాలజీ) అనీ, జీవరసాయనశాస్త్రం (బయోకెమిస్ట్రీ) అనీ, జీవసాంకేతిక శాస్త్రం (బయోటెక్నాలజీ) అనీ, అణుజన్యుశాస్త్రం (మాలిక్యులార్ జెనెటిక్స్) అనీ అంటున్నారు. జీవి లక్షణాలని జీవకణం స్థాయిలో చదివితే దానిని కణజీవశాస్త్రం (సెల్ బయాలజీ) అనీ, అంగము (organ) స్థాయిలో పరిశీలిస్తే దానిని శరీర నిర్మాణ శాస్త్రము (అనాటమీ) అనీ, జన్యువు నిర్మాణాన్ని, అనువంశికతను జన్యుశాస్త్రం (Genetics), ఇలా రకరకాల కోణాలలో జీవశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యవచ్చు. 




 




#Article 76: చిక్కుడు (608 words)


చిక్కుడు ఫాబేసి కుటుంబానికి చెందినవి.

లేత చిక్కుడులో గింజలుండవు, తొక్కలతో తక్కువ సెల్యులోస్ ఉంటుంది, కనుక త్వరగా ఉడికి రుచిగా ఉంటుంది. మధ్యరకంగా ఉన్నవాటిలో గింజలు, తొక్కలు త్వరగా ఉడికి కూర రుచిగా ఉంటుంది. ముదిరిన చిక్కుడు ఉడకవు, సెల్యులోస్ గట్టిగా పీచువలె ఉంటుంది. అందువల్ల జీర్ణం కాదు.

భారత దేశమున చాలా చోట్ల సాగు చేయబడు దేశీ కూరగాయ. భౌతిక వివరములు--ఇది చిక్కుడు జాతికి చెందినది. సుమారు రెండు మీటర్ల ఎత్తువరకు పెరుగును. కొన్ని అనుకూల పరిస్థితుల యందు ఇది మూడు మీటర్ల ఎత్తువరకు పెరుగును. గోరుచిక్కుడు సామాన్యముగా విత్తిన ఆరు ఏడు వారముల లోపున పూయనారంభించును. సాగు చేయు పద్ధతి---దీనిని అన్ని నేలలయందూ, అన్ని కాలములందూ సాగు చేయవచ్చు. దీనిని ఒంటిగా కానీ, అంతర పంటగా కానీ, మిశ్రమ పంటగా కానీ సాగు చేయవచ్చు. బాగుగ దున్ని సాగు చేయవలెను. దీనికి ఎరువు అంతగా అవసరములేదు, ఎందుకంటే ఇది సూక్ష్మ జీవుల సహాయముతో నేలలోని నత్రజని స్వీకరించును.

సామాన్యముగా పులుసు, బెల్లముపెట్టి వండెదరు. ఇంకా కొబ్బరి చేర్చి ఇగురు లేదా వేపుడు చేయుదురు. ఇది మంచి బలవర్థకమైన ఆహారము. --

చిక్కుడు జాతులలో ఒకటి. ఇది బలమైన ఆహారము. అధికంగా అమెరికా, బ్రెజిల్, అర్జెంటినా, చైనా, ఇండియాలు సోయాను ఉత్పత్తి చెస్తున్నాయి. అమెరికాలో లోవా, మిన్నెసొటా, ఇండియానా లలో, బ్రెజిల్లో మాంటాగొస్సా, పరగ, రియో గ్రాండెసుల్లలో సొయాను పండిస్తున్నారు. భారతదేశంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలు. సోయామొక్క--విరివిగా కొమ్మలుండి గుబురుగా పొదలా పెరుగుతుంది. విత్తన రకాన్ని బట్టి 0.3-1.5 మీటర్ల ఎత్తు వుంటుంది. కాండం, ఆకులు, కాయమీద సన్నని కేశంల వంటి నూగును కల్గివుండును. ఆకులు 5-15 సెం.మీ. పొడ వుండును. గుల్లగా, పొడవుగా వుండు కాయ (pod) లో వరుసగా సాయా గింజలుండును. కాయ 5-10సెం.మీ వుండి, కాయలో 2-4 గింజలుండును.సోయా గింజ గోళాకారంగా వుండి (కొద్దిగా అండాకరంగా) 5-10 మి.మీ.ల వ్యాసం వుండును. సోయాబీన్స్ పసుపురంగులో, చిక్కటి బ్రౌను రంగులో వుండును (వంగడం రకాన్ని బట్టి). పసుపురంగు సొయాలో నూనె శాతం ఎక్కువగా వుండును.సొయాసాగుకు ఉష్ణమండల ప్రాంతాలు అనుకూలం. సోయాలో అధిక దిగుబడికై చాలా వంగడాలను అభివృద్ధి చేసారు.ఆయా దేశాలలోని భూసార లక్షణాలను బట్టి వంగడ రకాలను ఎన్నుకొనెదరు. సొయ గింజలో నూనె శతం 18-20% వరకు వుండును.సొయాలో ప్రోటీనులుకూడా అధికమే.నూనె తీసిన సొయా మీల్ (soya meal) లో ప్రొటిన్ శాతం 45-48%. ఉపయోగాలు 1. సొయా గింజలను ముఖ్యంగా నూనెను తీయుటకు వాడుచున్నారు. ఉత్పత్తి అయిన సొయాలో85-90%ను సోయానూనెను తీయుటకు వినియోగిస్తున్నారు. 2.5-10% వరకు సొయాను సొయా పిండి (flour), సొయా మీల్ చెయ్యుటకు వాడెదరు. 3.5-10% వరకు ఆహరపధార్దంలలో నేరుగా వాడెదరు. సొయా నుండి 'పిల్లల ఆహరపధార్దంలు, బిస్కత్తులు, ఫ్లోర్‌మీల్, బ్రెడ్ల తయారిలో వాడెదరు.అలాగే సొయామిల్క్ క్రీమ్, సొయాచీజ్, తయారు చెయ్యుదురు. సొయాలోని ప్రొటీన్లు (మాంసక్రుత్తులు), మాంసంలోని ప్రోటిన్లవంటివే. అందుచే సొయాసీడ్స్తో 'సొయమీట్‌ మీల్' చెయ్యుదురు. భారతదేశంలో కూడా వెజిటెరియన్ బిర్యానిలో సొయామీట్ మీల్ ను వుపయోగిస్తారు. నూనె తీసిన సొయ మీల్్‌ను పశువుల, కోళ్ల మేతలో వాడెదరు. సొయ గింజలలోని పోషక విలువలు

పధార్ధం శాతం
తేమ 9.5-14%
ఫ్యాట్‌/నూనె 18-24
ప్రొటిను 39-47
పిండి పధార్ధం 3-20
పీచు పధార్ధం 4-8

పందిరి చిక్కుడును ప్రాచీనకాలం నుండి పండిస్తున్నారు. తమిళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో దీన్ని విస్తారంగా సాగుచేస్తున్నారు. ఇప్పుడిప్పడే ఉత్తర భారతదేశంలో ఇది ప్రాచుర్యం పొందుతోంది. రాష్ట్రంలో చిక్కుడుజాతి కూరగాయలు 12వేలకు పైగా హెక్టార్లలో పండిస్తూ ఏటా 70వేలకు పైగా టన్నుల దిగుబడిని సాధిస్తున్నారు. పందిరి చిక్కుడు కాయలను కూరగాయగా, ఎండిన విత్తనాలను పప్పుదినుసుగా వాడతారు. ఫ్రెంచిచిక్కుడుతో పోల్చితే దీనిలో పోషక విలువలు అధికం. ప్రతి వంద గ్రా. చి క్కుడు 48 కేలరీల శక్తిని ఇస్తుంది. -- బీన్స్ ఎక్కువగా, వరి అన్నం తక్కువగా తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చునని కోస్టా రికా అధ్యయనంలో తేలింది. దాదాపు రెండువేల మంది మహిళలు, పురుషుల మీద నిర్వహించిన పరిశోధనలో ఎక్కువ బీన్స్‌ను తక్కువ మోతాదులో అన్నాన్ని తీసుకునే వారిలో మధుమేహం తగ్గుముఖం పట్టిందని తేలింది. బీన్స్‌ను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా 25 శాతం వరకు డయాబెటిస్‌ను నియంత్రించవచ్చునని తెలిసింది. అలాగే వరి అన్నం శరీరంలో చక్కెర శాతాన్ని పెంచుతుంది కాబట్టి రైస్‌ను కాస్త తక్కువ మోతాదులో తీసుకోవడం ఎంతో మంచిదని బోస్టన్‌లోని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు ఫ్రాంక్ హు తెలిపారు. వరి అన్నం కంటే బీన్స్‌లో ఫైబర్, ప్రోటీన్స్ ఉండటంతో మధుమేహం, రక్తపోటును నియంత్రిస్తుందని ఫ్రాంక్ వెల్లడించారు.

అనపకాయ లేదా అనుములు అనేది చిక్కుడు జాతికి చెందిన ఒక కాయ. ఇది తీగ చిక్కుడు జాతికి చెందినది. (గోరు చిక్కుడు కాదు) దీని కాయలు పలచగా చిక్కుడు కాయల వలేనుండి. దీని మొక్క తీగ జాతికి చెందినది. దీనిని ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో వర్షాధార పంటగా - వేరుశనగలో అంతర పంటగా - పండిస్తారు. దీని గింజలను అనేక విదములుగా ఉపయోగిస్తారు. కూరలకు, గుగ్గిళ్ళు చేయడానికి ఎక్కువగా వుపయోగిస్తారు.

'వారంలో కనీసం మూడు కప్పుల బీన్స్‌ తినగలిగితే ఆరోగ్యానికి ఎంతో మేలు' అంటున్నారు పోషకాహార నిపుణులు. బీన్స్‌లో ఉండే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో తయారయ్యే క్యాన్సర్‌ కారకాలతో పోరాడతాయి. గుండె ఆరోగ్యానికెంతో మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు పెరగకుండా చూస్తాయి. సన్నబడాలని డైటింగ్‌ చేసే వాళ్లూ బీన్స్‌ని తినేయొచ్చు. అరకప్పు బీన్స్‌లో ఏడు గ్రాముల ప్రొటీన్లు లభ్యమవుతాయి. అంటే ముప్ఫై గ్రాముల చికెన్‌, మటన్‌లో లభించే పోషకాలతో సమానం అన్నమాట. వీటిని కూరల్లోనే కాదు సూపులూ, ఇతర టిఫిన్ల తయారీలోనూ ఉపయోగించవచ్చు. బీ కాంప్లెక్స్‌లోని ఎనిమిది రకాల విటమిన్లూ బీన్స్‌లో లభిస్తాయి. ఉడికించిన తరువాత కూడా వీటిలోని డెబ్భై శాతం పోషకాలు మిగిలే ఉంటాయి. కాలేయం, చర్మం, కళ్లు, వెండ్రుకలు లాంటి అనేక భాగాలకు వీటినుంచి శక్తి అందుతుంది.

 




#Article 77: బెండకాయ (578 words)


అమెరికా ఖండమందలి ఉష్ణ ప్రదేశములు బెండకు (Okra, Lady Finger) జన్మ స్థానము అని ఒక అభిప్రాయం ఉంది. గోగు, ప్రత్తి, మందార, గంగరావి, మొదలగు పెక్కు జాతులును బెండయు జేరి బెండ కుటుంబముగా వ్యవహరింపబడును. బెండ వార్షిక కూరగాయ పంట. ఉష్ణ సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనిని పండిస్తారు. లేత బెండకాయలను కూరగా వండుతారు. బెండకాయల్లో ఎ, బి, సి విటమిన్లు, పలు పోషక పదార్థాలతోపాటు అయోడిన్‌ ఎక్కువగా ఉన్నందువల్ల గాయిటర్‌ వ్యాధి రాకుండా చేస్తుంది. బెండకాయలను కూరగాయగా, సలాడ్‌గా ఎండబెట్టి వరుగులను తయారుచేయడంలో వాడతారు. వీటి కాండాన్ని కాగితపు పరిశ్రమలో, నారతీయటానికి ఉపయోగిస్తారు. బెండకాయలను క్యానింగ్‌ చేసి, ఎండబెట్టిన వాటిని ఎత్తయిన ప్రాంతాల్లో వున్న సైనికులకు అవి దొరకని కాలంలో కూడా ఎగుమతి చేస్తారు. తాజా బెండకాయలకు గల్ఫ్‌ దేశాల్లో మంచి గిరాకీ ఉంది. బెండను భారతదేశంలో వ్యాపార సరళిలో గుజరాత్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పండిస్తున్నారు. 2007 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 21,569 హెక్టార్లలో సాగువుతూ 1.72 లక్షల టన్నుల దిగుబడి లభిస్తోంది. సగటు దిగుబడి హెక్టారుకు 8 టన్నులు. బెండను చలికాలం తప్ప సంవత్సరం పొడవునా సాగు చేసుకోవచ్చు. వేడి వాతావరణం ఈ పంటకు అనుకూలం.

బెండ మొక్క సామాన్యముగా 1 నుండి రెండు మీటర్లు ఎత్తు పెరుగును. అనుకూల పరిస్థితులలో నాలుగు మీటర్లల వరకూ పెరుగును. మొక్క యందలి లేత భాగములందు బిరుసుగా ఉండు నూగు ఉండును. పై అంచులయందు తాళ పత్ర వైఖరి చీలి సంయుక్తమౌగా ఉండును. అండాశయము ఐదు అరలు కలిగి ఉండును. కీలము కొన ఐదుగా చీలి నిడివిగ ఉండును. కాయము ఐదు గదులు కలిగి ఉండును. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క వరుస గింజలు ఉండును. ఎండిన వెనుక కాయ పై నుండి క్రిందికి క్రమముగా ఐదు (అప్పుడప్పుడూ 10) భాగములుగ పగులు ఉండును. గింజలు చిన్న కందిగింజలంతేసి యుండును. గ్రామునకు 12 15 తూగును. నీల వర్ణముతో కూడిన ధూమ్రవర్ణము కలిగి బొడ్డు వద్ద మాత్రము తెల్లగ ఉండును.

చల్లటి వాతావరణంలో పంట సరిగా రాదు. పగటి ఉష్ణోగ్రత 25-40 డిగ్రీల సెం.గ్రే. రాత్రి 22 డిగ్రీల సెం.గ్రే. ఉంటే మొక్క పెరుగుదల బాగుంటుంది. 40 డిగ్రీల సెం.గ్రే. కన్నా ఎక్కువైతే పిందె కట్టడం తగ్గి పూత రాలి, దిగుబడులు తగ్గిపోతాయి. అందువల్ల ఈ పంట వర్షాకాలం, వేసవిలో పండించటానికి అనువైనది.

సారవంతమైన నీరు ఇంకే తేలికపాటి నేలలు, మురుగునీరు పోయే సౌకర్యం గల తేలికపాటి నల్లరేగడి నేలలు, గరుప నేలలు బెండ సాగుకు అనుకూలం. గుల్లగా ఉండే సారవంతమైన ఒండ్రు నేలల్లో అధిక దిగుబడి వస్తుంది. నేల ఉదజని సూచిక 6 నుంచి 6.8 వరకు ఉండాలి.

ఖరీఫ్‌ పంటను జూన్‌-జులై (వర్షాధారపు పంట) మాసాల్లోను, వేసవి పంటగా ఫిబ్రవరి - మార్చి మాసాల్లోనూ విత్తుకోవాలి. వర్షాకాలంలో ఆలస్యంగా (ఆగస్టులో) విత్తుకుంటే మొక్కలు సరిగా పెరగవు. బూడిద తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. వేసవిలో ఆలస్యంగా పంట విత్తితే మొక్క పెరుగుదల తగ్గి, పల్లాకు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది.

బెండకాయలో 90 శాతం నీరు, 6.4 శాతం పిండి పదార్థాలు, 1.9 శాతం మాంసకృత్తులు, 0.2 శాతం కొవ్వుపదార్థాలు, 1.2 శాతం పీచు, 0.7 శాతం ఖనిజలవణాలు ఉండి, 33 కిలో కేలరీలు శక్తిని ఇస్తాయి. 66 మి.గ్రా. సున్నం, 56 మి.గ్రా. భాస్వరం, 0.30 మి.గ్రా. ఇనుము ఉన్నాయి. కెరోటిన్‌ 52 మైక్రోగ్రాములు, 0.07 మి.గ్రా. థయమిన్‌, 0.1 మి.గ్రా. రైబోఫ్లేవిన్‌, 0.6 మి.గ్రా. నియసిన్‌, పోలిక్‌ ఆమ్లం 105 మైక్రో గ్రాములు, 'సి' విటమిను 13 మి.గ్రా.లు ఉన్నాయి. ఇవేగాక సూక్ష్మధాతువులైన మెగ్నీషియం (53 మి.గ్రా.), సోడియం (6.9 మి.గ్రా.), పొటాషియం (103 మి.గ్రా.), రాగి (113 మి.గ్రా.), మాంగనీస్‌ (149 మి.గ్రా.), జింక్‌ (417 మి.గ్రా.) లాంటి సూక్ష్మ పరిమాణంలో ఉంటాయి.

బెండకాయలోని మ్యూకస్ వంటి పదార్ధము కడుపులో మంటనుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పీచు, విటమిన్‌ ' సి ' దీనిలో చాలా ఎక్కువ . మ్యూకస్ పదార్ధము గాస్ట్రిక్ సమస్యలను, ఎసిడిటీకి చక్కని పరిష్కారము . దీనిలోగల డయూరిటిక్ లక్షణాలవల్ల యూరినరీ ట్రాక్ట్ ఇంఫెక్షన్‌ను నయము చేయడములో సహకరిస్తుంది. బెండకాయ డికాక్షన్ తాగితే జ్వరము తగ్గుతుంది. చిన్న చిన్న ముక్కలుగా కోసి నీటిలో మరిగించి చల్లారేక తాగితే టెంపరేచర్ తగ్గును . చెక్కెర (డయాబిటీస్ ) నియంత్రణలోనూ సుగుణం చూపుతుంది. బెండకాయ నిలువుగా చీల్చి రెండు సగాల్ని గ్లాసు నీటిలో రాత్రంతా ఉంచి, మరునాటి ఉదయము ముక్కలు తీసివేసి ఆ నీటిని త్రాగాలి. ఇలా రెండు వారాలు పాటు త్రాగితే సుగర్ స్థాయిలు తగ్గుతాయి. దీనిలో ఉండే పెక్టిన్‌ .. బ్లడ్ కొలెస్టిరాల్ ను తగ్గించును. బెండకాయ విటమిన్ సి కలిగి ఉంటుంది. ఇది ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది.

బెండలో హైబ్రిడ్‌ (సంకర) రకాలకు దీటుగా సాధారణ రకాలు దిగుబడినిస్తాయి. 

ఎగుమతికి కాయలు లేతగా, ఆకుపచ్చగా 6-8 సెం.మీ. పొడవుతో ఉండాలి. 

బెండకాయల పంటను వివిధ రకాల పురుగులు, తెగుళ్లు ఆశించి నష్టపరుస్తుంటాయి. వీటిని సకాలంలో గుర్తించి నివారించుకోవాలి.

బెండ పైత్యాన్ని తగ్గిస్తుందని, వాతాన్ని నివారిస్తుందని, వీర్య వృద్ధిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. బెండకాయలో జిగురు ఉండటంవల్ల విరివిగా అన్ని వంటలలో వీటిని వాడటం కుదరకపోయినా ఆంధ్రప్రదేశ్‌లో బెండకాయను చాలా ఎక్కువగా వంటలలో వాడతారు.

Lady's finger - Abelmoschus esculentus, 
N.O. Malvaceae 

తమిళము వెండై; 
కన్నడము బెండె;
మలయాళము వెండ; 
హింది ఖిండీ, ఖేండా, ఓక్రా; 
సంస్కృతము చతుష్పద.




#Article 78: కాబేజీ (421 words)


కాబేజీ (Cabbage) మధ్యధరా సముద్ర ప్రాంతములో కనిపించే ఆకులు మెండుగా ఉన్న అడవి ఆవాల మొక్క నుండి 100 వ సంవత్సరము ప్రాంతములో ఉద్భవించింది. కాబేజీ అన్న పదము నార్మన్-పికార్డ్ పదము కబోచే (తల) నుండి వచ్చింది. 

ఎందుకంటే సాధారణముగా కాబేజీ మొక్కలో ఆకులతో నిండిన శీర్ష భాగము మాత్రమే తింటారు. ఇంకా ఖచ్ఛితముగా చెప్పాలంటే వృత్తాకారములో ఉండలా ఉండే లేత ఆకులు మాత్రమే ఉపయోగిస్తారు. విచ్చుకొని ఉన్న బయటి ముదురు ఆకులను తీసేస్తారు. ఈ క్యాబేజీ తలను పచ్చిగా, ఉడకబెట్టి లేదా ఊరబెట్టి అనేక వంటకాలలో ఉపయోగిస్తారు. పచ్చి కాబేజీని చేత్తోనే తినేస్తారు కానీ కానీ చాలా ఇతర ఉపయోగాలకు దీన్ని చిన్న ముక్కలుగా లేదా పట్టీలుగా తురుముతారు. కాబేజీ పైన ఉన్న తొక్కలు గట్టిగా అంటుకొని ఆకులు పచ్చగా ఉండవలె, పగుళ్ళు ఉన్న క్యాబేజీ త్వరగా చెడిపోతుంది. ఎరుపురంగు క్యాబేజీ కొన్ని ప్రదేశాలలో మాత్రమే లభిస్తుంది. ముదురు ఆకుపచ్చ రంగు బాగుంటుంది. రక్తములో చెక్కెరస్థాయి సమతుల్యము చేస్తుంది . శరీరములో కొవ్వు నిల్వలు పేరుకు పోకుండాచేస్తుంది . రక్తములో చెక్కెర స్థాయిని అదుపు చేసేందుకు గ్లూకోజ్ టోలరెన్స్ (glucose tolarence) లో భాగమైన ' క్రోమియం ' ఈ లెట్యూస్ లో పుష్కలముగా ఉంటుంది . నిద్ర పట్టేందుకు దోహదం చేసే  లాక్ట్యుకారియం (Lactucarium) అనే పదార్ధము ఇందులో ఉంటుంది .

కాయగూరల్లో క్యాబేజీ అతి శ్రేష్టమైనదనీ ముఖ్యంగా క్యాన్సర్‌ను నిరోధించటంలో ఇది క్రియాశీలకంగా పనిచేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. క్యాబేజీ ద్వారా శరీరానికి అవసరమైన ప్లేవనాయిడ్స్ సమృద్ధిగా అందుతాయనీ, తద్వారా పాంక్రియాటిక్ గ్రంథి క్యాన్సర్ ప్రభావాన్ని తగ్గించవచ్చునని వారు చెబుతున్నారు. ఈ క్యాన్సర్ రావటం అరుదుగా సంభవిస్తుందనీ, అయితే క్యాబేజీతో దానికి చెక్ పెట్టవచ్చు క్యాబేజీని ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే అధిక బరువుకు చెక్ పెట్టవచ్చునని వైద్యులు చెబుతున్నారు. అంతేగాకుండా.. పిల్లలకు పాలిచ్చే తల్లులు ఎక్కువగా క్యాబేజీని తిన్నట్లయితే పాలు బాగా పడతాయి. క్యాజేజీ దగ్గుకు కూడా మంచి మందుగా పనిచేస్తుంది. క్యాబేజీ ఆకులను నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసం తీసి తాగిన దగ్గు మటుమాయమవుతుంది. క్యాబేజీ ఆకుల రసాన్ని అలాగే తాగలేనివారు కాస్త పంచదార కలుపుకుంటే సరి. అదే విధంగా అతిగా పొగతాగే పొగరాయుళ్లను ఆ అలవాటునుంచి మాన్పించేందుకు నానా కష్టాలు పడేవారికి క్యాబేజీ సాయపడుతుంది. అయితే వారిని పూర్తిగా పొగతాగటం మాన్పించటం కాదుగానీ.. పొగ తాగినప్పుడు శరీరానికి కలిగే దుష్ఫలితాల తీవ్రతను తగ్గించుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా క్యాబేజీ తినాల్సిందే.

క్యాబేజీ ఒక ఆకుకూర. ఎందుకంటే సాధారణముగా కాబేజీ మొక్కలో ఆకులతో నిండిన శీర్ష భాగము మాత్రమే తింటారు. ఇంకా ఖచ్ఛితముగా చెప్పాలంటే వృత్తాకారములో ఉండలా ఉండే లేత ఆకులు మాత్రమే ఉపయోగిస్తారు. విచ్చుకొని ఉన్న బయటి ముదురు ఆకులను తీసేస్తారు. ఈ క్యాబేజీ తలను పచ్చిగా, ఉడకబెట్టి లేదా ఊరబెట్టి అనేక వంటకాలలో ఉపయోగిస్తారు.

పచ్చి కాబేజీని చేత్తోనే తినేస్తారు కానీ కానీ చాలా ఇతర ఉపయోగాలకు దీన్ని చిన్న ముక్కలుగా లేదా పట్టీలుగా తురుముతారు. కాబేజీ పైన ఉన్న తొక్కలు గట్టిగా అంటుకొని ఆకులు పచ్చగా ఉండవలె, పగుళ్ళు ఉన్న క్యాబేజీ త్వరగా చెడిపోతుంది. ఎరుపురంగు క్యాబేజీ కొన్ని ప్రదేశాలలో మాత్రమే లభిస్తుంది. ముదురు ఆకుపచ్చ రంగు బాగుంటుంది.




#Article 79: వంకాయ (1450 words)


వంగ - వంకాయ (Brinjal) - తెలుగు దేశములో చాలా ప్రముఖమైన, విరివిగా పెంచబడుతున్న కూరగాయల రకాలలో ఒకటి. దీని చరిత్ర సరిగ్గా తెలీదు, కానీ హిందూ మత శ్రాద్ధ కర్మలందు దీనిని కూడా నిషేధించి ఉన్నందువల్ల దీనిని భారతదేశానికి ఇతర దేశములకు వచ్చినదిగా భావింపబడుతున్నది, కానీ ఎప్పుడు ఎలా భారత దేశానికి వచ్చినదో సరిగ్గా తెలీదు. వంకాయలు రకరకాలుగా - చిన్న వంకాయలు, పొడుగు వంకాయలు, తెల్ల వంకాయలు, ఎర్ర వంకాయలు, గుత్తి వంకాయలు - లభిస్తున్నాయి.

వంగ సుమారుగా ఒకటి, ఒకటిన్నర మీటర్ల యెత్తెదుగు చిన్న గుల్మము. సామాన్యముగా ఒక సంవత్సరము పెంచబడిననూ, పరిస్థితులు అనుకూలంగా ఉన్నచో ఒకటి కన్నా ఎక్కువ సంవత్సరములు ఈ మొక్క పెరుగును. వేళ్ళు మొక్క యొక్క పైభాగమునకు తగినంత విరివిగ వ్యాపించవు. కాండము సామాన్యముగా 1.25 - 2.50 సెం. మీ. లావుగా పెరుగును. దీనికి చాలా కొమ్మలూ, రెమ్మలూ వచ్చును. ఆకులు పెద్దవిగా ఉంటాయి. సుమారుగా 15 సెంటీమీటర్లు పొడువూ, 10 సెంటీమీటర్లు వెడల్పు కలిగిఉంటాయి. అంచుకు కొద్ది గొప్ప తమ్మెలుగ చీలి ఉంటాయి. కొన్నిటిలో ఏకముగా ఉండుటనూ చూడవచ్చు.

ఆకులు అంతటనూ మృదువయిన నూగు కలిగిఉండును. కొన్ని రకములలో ఆకులయందలి యీనెల పైననూ, కాండము మీదనూ, కాయల తొడిమల మీదనూ, ముచికలమీదను వాడియయిన ముళ్ళు స్వల్పముగా ఉండును. పూవులు తొడిమెలు కలిగి ఆకు పంగలందునూ, కొమ్మల చివరనుకూడా సామాన్యముగా జంట గుత్తులు బయలుదేరును. ఒక్కొక్క గుత్తిలో 1-3 వరకు పూవులుండును. ఒక్కొక్కచోట బయలుదేరు రెండు గుత్తులలో ఒకదానియందు సామాన్యముగ పిందె కట్టుటకు తగిన ఒకటే ఉండును, రెండవ గుత్తియందు పూవులు సాధారణంగా పిందెకట్టవు. ఇందు అండాశయము నామమాత్రముగా ఉండును. కానీ ఒకే గుత్తియందు కానీ, రెంటిలోనూ కలిపికానీ పిందెలు కట్టు పూవులు 2-3 ఉండుటయూ ఉంది. పుష్పకోశము సంయుక్తము. తమ్మెలు ఐదు. నీచమైనను కాయలతో కూడా పెరిగి తుదివరకూ ఉండును. దళ వలయమునూ సంయుక్తమే.

తమ్మెలిందునూ ఐదే. ఎరుపుతో కూడిన నీలవర్ణము కలిగియుండును. కింజల్కములు ఐదు. వీని కాడలు దళవలయము నధిష్టించి యుండును. అండాశయము ఉచ్చము. కీలము పొడవుగ ఉండును. కాయలు అనేక గింజలు కలిగి యుండు కండకాయ. గింజ చిన్నది. గుండ్రముగానూ, బల్లపరుపుగానూ ఉండును. పది గ్రాములకు సుమారుగా 1600 గింజలు తూగును.

ఇందు గుండ్రని కాయలు, నిడివి కాయలు, పొట్టిశీఘ్రకాలపు కాయలు అని మూడు ఉపజాతులు గుర్తింపభడినాయి.

కాయల ఆకార, పరిమాణ, వర్ణభేదములనుబట్టియూ, ఆకులందును కాయల ముచికలందును ముళ్ళుండుటను లేకుండుటను బట్టియు, సాగున కనుకూలించు పరిస్థితులనుబట్టియునూ వంగలో అనేక రకములు గుర్తింఫబడుచున్నవి. ఆకారమును తరగతులుగ విభజించవచ్చును. 

తూనికలో 25 గ్రాముల లోపునుండి 1000 గ్రాముల వరకు తూగు రకములు ఉన్నాయి. కాయల రంగులో ఆకుపచ్చ ఊదా రంగులు ముఖ్యములు. తెల్లని లేక దంతపు రంగు రకాలును ఉన్నాయి. ఆకుపచ్చ వర్ణములలో చాలా లేబనరు రంగు మొదలు, కారుపసరు రంగు వరకు కన్పడును. కొన్నిటిలో దట్టమగు ఆకుపచ్చ రంగుపైన లేత ఆకు పచ్చ రంగు చారలు కానీ, పట్టెలు కానీ ఉండును. ఇట్టే ఊదా రంగు నందును లేత ముదురు భేదములే కాక ఆకుపచ్చకును, ఊదా రంగుకును మధ్య అంతరములు అనేకములు ఉన్నాయి. సాగున కనుకూలించు పరిస్థితుల ననుసరించి వంగలో మెట్టవంగలనియూ, నీటి వంగలనియూ రెండు తరగతులేర్పడుచున్నవి. వంగపూవు పరసంపర్కమునకు అనుకూలించుటచే స్వతస్సిధ్ధ్ముగనూ మానవ కృషివలన కూడా అనేక రకములును, ఉపరకములునూ పుట్టుచున్నవి. వ్యవసాయదారులచే ప్రత్యేకముగ వ్యవహరింపవడు తోటలలోనే యిట్టివి కలసియుండుట ఉంది.

ఆంధ్ర దేశమున ఆయా ప్రదేశములందు ప్రత్యేక రకములుగ పరగణింపబడుచున్న కొన్నిటిని గురించి ఈ క్రింద క్లుప్తముగా తెల్సుకుందాము.

దీనిని నీరు పెట్టకుండానే వర్షాధారమున సాగుచేయ వీలగును. మిగుల తక్కువ తేమతో పెరగగలుగును. ఆకులందు కాయలు తొడిమలందు, పుష్పకోశములపైనఊ ముండ్లుండును. కాయ గుండ్రముగ నుండును. పెద్దదిగ ఎదిగి ఒక్కొక్కసారి 1కి.గ్రా. వరకూ తూగు కాయలు వచ్చును. పచ్చికాయపైన ఆకుపసరుగ ఉండి క్రింది భాగమున తెలుపుగా ఉండును. కొన్ని కాయలపై చారలుకానీ, మచ్చలు కాని ఉండును, కొండెవరం మొదలగు కొన్ని ప్రదేశములంము ముఖ్యముగా పాటినేలలందు పెంచవడును. ఈ రకపు వంగ మిగుల రుచివంతముగా ఉండుటచే చాలా ప్రసిద్ధి పొందినది. ఈ రకము వర్షాకాలాంతమున నాతి పెంచవడును . ఆయా ప్రదేశములందు వర్షాధారమున పెంచబడు రకములలో ఈ ముండ్ల రకమే చాలా శ్రేష్టమైనది.

ఇది పొడువుగాను, సన్నముగాను ఉండు కాయలను కాయును. ఇది కూడా మెట్ట ప్రాంతములలో పండించు వంగ రకమే. ముండ్లుండవు. తూర్పుగోదావరి జిల్లాఅలోని మధ్య డెల్టాయందలి ఆత్రేయపుర ప్రాంతములందలి మెట్ట భూములలో కొంత విరివిగా పెంచబడి యీ పండ్ల నుండి వరుగు తయారు చేయబడెను, అందువల్లే ఈ పేరు వచ్చింది. పచ్చి కాయలు ఆకుపచ్చవానూ, చారలు కలిగియూ ఉండును. ఇదియూ వర్షాకాలాంతమున నాతి పెంచబడు రకమే. 

ఇది తొలకరిలో నాటి పెంచదగు ముళ్ళు లేని మెట్టవంగ. కాయ మధ్యమ పరిమాణముగలిగి కోలగా ఉండును. ఆకు పసరువర్ణపు చారలు, బట్టలు కలిగి ఉండును. క్రిందిభాగము లేబసరుగ కానీ, త్లెఉపుబా కానీ ఉండుటయు ఉంది. వర్షాకాలమున పుట్టుటచే ఈ కాయలు మెట్టవంగ కాయలంత రుచికరముగా ఉండవు

ఇది శీతాకాలాంతమున నాటి నీరుకట్టి పెంచబడు, ముళ్ళులేని రకము. ఇందు కాయలు సుమారొక అంగుళము లావువరకూ, 25-30 సెం.మీ. పొడవు వరకునూ పెరిగి ఊదారంగు కలిగి యుండును. కానీ యీ రంగునందు రకభేధమునుబట్టి లేత ముదురు భేదములునూ, పసరువర్ణమిశ్రణములును కానవచ్చును. కాయల పొడువునందు కూడా రకభేధములను బట్టి కాల భేదములను బట్టీ నేల యొక్క సత్తువను బట్టి కురుచ పొడవు తారతమ్యములుండును. నీరు కట్టి పెంచబడుటచేత ఈ కాయలు సామాన్యముగ రుచివంతముగా ఉండవు. కానీ గుంటూరు జిల్లాలో కొన్నిచోట్ల పెంచబడు తోటలలో ఫలించు మధ్యమరకము పొడవుగ ఎదుగు కాయలు రుచికి ప్రసిద్ధముగా ఉన్నాయి.

ఇది మిగుల చిన్నవిగా ఉండు కోల కాయలను గిత్తులుగగాయు మరియొక నీటివంగ రకము. సామాన్యముగా ఇతర రకములలో కూడా - ముఖ్యముగా నీటి వంగలోనూ, కస్తూరివంగలోనూ అరుదుగా రెండేసి కాయలొకే గెలలో బయలుదేరుచుండును, కాని యిందు తరచూ 2, 3 కాయలుగల గెలలు బయలుదేరును. కాయలసంఖ్య హెచ్చుగా ఉన్ననూ మొత్తమూపి దిగుబడి తక్కువగుటచే నీరకము విరివిగా సాగుచేయుటకు అనుకూలము కాదు. ఆంధ్రదేశమున ఈ గుత్తివంకాయ కూర బహుప్రసిద్ధి. ఈ కాయపైననే సినిమాలలో ఎన్నో పాట్లూ, డైలాగులూ చేర్చబడినాయి.

పోచావారి గుండ్రకాయలు రకము ఊదారకమును, దొడ్లలోనూ పెరళ్ళలోనూ నాటి పెంచదగిన ప్రశస్తమగు రకము. ఇవి రాష్ట్రములకు విదేశములనుండి తెప్పించబడింది. ఈ రకము వ్యాపకములో వ్యవసాయ శాఖవారు శ్లాఘనీయమైన పాత్ర పోషించారు.

ఇది చిక్కటి ఊదారంగు కలిగి 8 - 10 అంగుళముల వరకు పొడవు ఉండును. ఈ రకము మంచి రుచి కలిగి యెక్కువ దిగుబడి నిచ్చును. ఇది వేసవి సాగుకు మిగుల ప్రశస్తమైనది. 
నాటిన 100 రోజులకు కాపు వచ్చును, తరువాత 75 రోజులవరకూ కాయలు విపరీతముగా కాయును. ఈ రకము కాండము తొలిచే పురుగును తట్టుకొనగలదు. ఇది మొదట కాపు తగ్గిన తరువాత ఆకులను దూసి రెమ్మలను కత్తిరించి యెరువులు వగైరా దోహాదము చేసిన మరల చిగిర్చి కాపు కాయును. దీనిని 21/2 అంగుల వరసలలో 1 1/2 అడుగు దూరములో ఒక్కొక్క మొక్క చొప్పున నాటిన చాలును. ఢిల్లీ పరిశోధనా కేంద్రమువారు నాటిన రెండవ రోజూననే పారుదల నీటిని పెట్టి సాగు చేస్తున్నారు.

ఈ రకము కాయలు అర కేజీ వరకూ తూగును. ! కానీ మొక్కకు 10 వరకు కాయలు మాత్రమే వచ్చును. ఈ రకము కాండము తొలిచే పురుగును తట్తుకొనగలదు. కానీ కొక్కెర తెగులునకు తట్టుకోలేదు.

వంగను వర్షాకాలపు పైరుగా సాగుచేసినయెడల ఆ సంవత్సరము దాని తరువాత మెట్ట నేలలో మరియొక సస్యమౌను సాగు చేయుటకు సామాన్యముగా వీలుపడదు. దానిని శీతాకాలపు పైరుగా పెట్టుకొనినచో తొలకరిని నూవు, మెట్టవరి మొదలగువానిని సాగు చేయవచ్చును. కానీ వీనిని కోసిన వెనుక నేలను బాగుగ తయారుచేయుట కంతగా వ్యవధియుండదు. కనుక వంగకు ముందే పైరును పెట్టకుండుటయే మంచిది. తోటభూములలో పై సస్యములనే కాక అరటి, మిరప, పొగాకు మొదలగు వానితో కూడా వంత్గను మార్చి పెట్ట వచ్చును. నీటివంగ తోటలను సామాన్యముగా దంపనేలలో వరితో రెండవ పంటగ పరివర్తనము కావించుదురు.

విత్తులను చిన్న చిన్న మళ్ళలో జల్లి నారు పెంచి ఆ మొక్కలను నాటుటయే వంగ తోటలను పెంచు సామాన్యమైన విధానము. విత్తులను జల్లుటకు కొంతకాలము ముందు నారు మడిని బాగుగ ద్రవ్వి పెంట విస్తారముగ బోసి కలిపి తయారు చేయవలెను. మొక్కలు నాటు దూఋఅమును బట్టి 400-600 గ్రాముల విత్తులను 1/2 - 3/4 సెంట్లు విస్తీరణమున వేసిన యెడలలో బాగుగ నెదిగిన మొక్కలోక ఏకరమునకు సరిపోవును. చిన్న పెరళ్ళలో 6 గ్రాముల విత్తులను 50 చదరపు మీటర్ల మడిలో పోసి పెంచీననారు ఒక సెంటునకు సరిపోవును. బలిష్ఠముగా ఎదిగిన మొక్కలనే నాటి తక్కిన వానిని వదలివేయవచ్చును.ల్‌ ముళ్ళు కట్టి చదును చేసి విత్తులను సమముగ జల్లి కలిపి పైన నీరు చల్లవలెను. గింజలు మొలచుటకు 7 - 10 రోజులు పడుతుంది. అంతవరకు నారుమడి పైన యీతాకులు కానీ యితర ఆకులుగానీ పరచి కప్పవలెను. పదును కనిపెటి అప్పుడప్పుడు నీరు చల్లుచుండవలెను. గింజలు మొలకలెత్త నారంభించగనే పై కప్పు తీసివేసి యెండ క్రమముగ తౌగ్లనీయవలెను. అవసరమగునపుడెల్ల కుండలతో నీరు చిమ్ముచుండవలెను. సామాన్యముగ 6 వారములు మొదలు 2 నెలల వరకు నెదిగిన పిమ్మట నారు నాతుట కర్హముగ నుండును. మిగుల లేత వంగనారు కంటే కొంచెము ముదురునారే ప్రశస్తముగ నెంచవడును. వంగ ముదురు, వరి లేత అని సామెత. నారుమడిలో వారం పదిరోజుల కొకసారిగా మాత్రము నీరుపోసి నారును రాటు దేల్చినచో పంట హెచ్చుగా వచ్చునని తెలియుచ్చున్నది.

వంగ మొక్కలను నాటు నేలను కూడా నా రెదుగు లోపల తరచు బాగుగ ద్రవ్విగానీ, దున్నిగాని సిద్ధము చేయవలెను. శీతాకాలమున పెంచబడు మెట్టవంగతోటలకు నేలలను మరింత సమగ్రముగ తయారుచేయవలెను. లేనిచో నేలయందు తగిన పదును నిలచిన తోటయంత బాగుగ గాని హెచ్చు కాలముగాని కాయదు.

పది టన్నుల వంగపంట నేలనుండి 120 కిలోగ్రాముల నైట్రోజనును, 80 కిలోగ్రాముల ఫాస్పారిక్‌ ఆసిడును తీసికొనును. సామాన్యమయిన పంటకు హెక్టారుకు 50 కి. గ్రాముల నైట్రోజనును 60 ఫాస్ఫారిక్‌ ఆసిడును, 60 పొటాషును వేయుట మంచిదని కొందరి అభిప్రాయము.

(Epilachna beetle) పైన నల్లని చుక్కలు కలిగి చిన్నవిగను, గుండ్రముగనుండి ఒక జాతి పురుగు. (Epilachna vigintiocto punctata) వంగ మొక్కల ఆకులపై పచ్చని పొరను డింభదశయందునూ, పూర్ణదశయందునూ కూడా తినివేయును. డింభదశలో ఈ పురుగు ఎగురలేవు, కావున ఈ దశలో వీనిని సులభముగ ఏరి చంపవచ్చును. ఈ పురుగు చిస్తారముగా వ్యాపించినప్పుడు ఉల్లి పాషాణమునుగానీ, ఖటికపాషాణమునుకానీ చల్లి చంపవచ్చును. పేలు, ఎర్రపేలు లేని చోట్ల డి డి టి 0.16 % చిమ్మవచ్చును. మాలాథియాన్‌ 0.16% నుకూడా దీనిని నివారించుటకు వాడవచ్చును

(the shoot borer).. ఇంచుక గులాబి వర్ణము కలిగియుండు ఒక దీపపుపురుగు. (Leucinoides orbonalis) డింభము మొక్కల చిగుళ్ళను ఒక్కొక్కప్పుడు కాయలనుకూడా తొలచును. పుప్పిపట్టిన చిగుళ్ళను, కాయలను వెంటనే కోసి గోతిలోవేసి కప్పవలెను. ఎండ్రిన్‌ 0.032% కాయలన్నిటిని కోసివేసిన పిదప చిమ్మవచ్చును. పిందెలను తీసివేసిన పిమ్మటనే దీని చిమ్మదగును. 0.25% కార్బరిల్‌ కూడా పనిచేయును.

step borer 
ఇది కూడా దీపపు పురుగు. (Euzophera perticella) ఇది కూడా డింభము కాండమును తొలిచి మొక్కను చంపును. ఈ పురుగుపట్టి చచ్చిన మొక్కలను కాల్చివేయుటయు, కాపు ముగిసిన వెనుక మోళ్ళను వెంటనే పీకి తగులబెట్టుటయు ఈ తెగులు బాధను తగ్గించుకొనుటకు చేయవలసిన పనులు. ఎండ్రిన్‌, ఉపయోగించవచ్చు. నువాన్‌ కూడా ఉపయోగించవచ్చును

(Brinjal mealy bug) ఒక జాతి పిండిపురుగు. (Phenacoccus insolitus ) మొక్కల లేత భాగములకు బట్టి యందలి రసమును పీల్చుకొనును. ఇది చురుకుగ ఎదుగు మొక్కలను సామాన్యముగ పట్టదు. ఎపుడైన అచటచట ఒక మొక్కకు బట్టినచో అట్టి మొక్కలను కనిపెట్టి వెంటనే లాగివ్యవలెను. చాలా మొక్కలను బట్టినచో 0.05% పారాథియాను చిమ్మవలెను. కాయలు ఏర్పడియున్నచో నువాను చల్లవచ్చును. సామాన్యముగ ఈ చీడ కాపు ముగిసి మరళ విగుర్చు ముదితోటలలోని లేతకొమ్మలకే పట్టును. డి.డి.టీ. చల్లిన పిమ్మట ఈ పురుగులు అధికమగును. క్రిస్టోలీమసు అను పెంకుపురుగులను తెచ్చివివ్డిచినచో అవి పిండిపురుగులను అదుపులో ఉంచును.

వంగ తోటలకు వచ్చు తెగుల్లలో వెర్రితల రోగము ముఖ్యము. ఇది సూక్ష్మదర్శని సహాయముననైనను కంటికి కానరాని వైరసువలన వచ్చు తెగులు. ప్రథమ దశలో తెగులుబట్టిన కొమ్మలను హెచ్చుగ బట్టిన యెడల మొక్కలను తీసివేసి తగులబెట్టవలెను. ఈ వైరసును ఒక మొక్కనుండి మరియొక దానికి మోసుకొనిపోవు జాసిడులవంటి పురుగులను డి.డి.టి. చల్లి నివారించుటచే ఈ తెగులుయొక్క వ్యాప్తిని అరికట్టవచ్చును.

ఈ తెగులు తట్టుకోగల వంగడములు వాడుట శ్రేష్టము.

వంకాయ వంటి కూర, పంకజముఖి అయిన సీత వంటి భార్య, భారతం వంటి కథ ఉండవని ఒక నానుడి. అల్లాగే వంకాయతో వెయ్యి రకాలు అని కూడా ఒక నానుడి. వంకాయలను చప్పిడి కూరగకానీ, పులుసుపెట్టి కానీ వండి తినవచ్చును. ముదురుకాయలును, గిజరుకాయలను కారము పులుసుపెట్టి వండిననేగాని తిన బాగుండవు. ఇటువంటి కాయలను ముందు ఉడుకబెట్టి వార్చి వేసినచో అందలి గిజరు మరికొంత తగ్గును. లేత కాయలను ముందు ఉడకబెట్టకుండ పోపులోనూనెవేసి మ్రగ్గనీయవచ్చును. లేక చమురులో వేచి పైన మసాలాపొడి చల్లవచ్చును. నిడివిగనుండు నీటివంకాయలను ముచికవద్ద కొంతభాగము విడిచి క్రింది భాగమును నాలుగు లేక ఆరు చీలికలుగ దరిగి యందు మసాలా పొదిని కూరి మువ్వలేక గుత్తివంకాయగ కూడా వండి తినవచ్చును. గుండ్రని మెట్ట వంకాయను కాల్చి అల్లమును చెఏర్చి యిగురు పచ్చడిగగానీ, పులుసు పచ్చడిగ గానీ పెరుగుపచ్చడిగగానీ చేయవచ్చును. వంకాయ ముక్కలను సామాన్యపు పులుసులోనూ, మజ్జిగ పులుసులోనూ కూడా తరచు వేయుచుందురు. వంకాయ ముక్కలను వాంగీబాత్ మొదలను చిత్రాన్నములలో కూడా ఉపయోగింతురు. బంగాళాదుంప మొదలగు ఇతర కూరలతో కలిపి వండుటయు ఉంది. వంకాయ ముక్కలను పలుచని బిళ్ళలుగ తరిగి సెనగవగైరా పిండితో చేసిన చోవిలో ముంచి చమురులో వేచి బజ్జీలుగ చేయవచ్చు

కం।। 
వంకాయ వంటి కూరయు 
పంకజముఖి సీతవంటి భామా మణియున్ 
శంకరుని వంటి దైవము 
లంకాధిపు వైరి వంటి రాజును గలడే!!

గుత్తి వంకాయ కూరోయ్ మామా............... కోరి వండి నాను మామా.........

జాగ్రత్తలు :




#Article 80: దోసకాయలు (423 words)


దోస (అయోమయ నివృత్తి)

కుకుర్బిటేసి కుటుంబంలో కొన్ని ప్రజాతులకి చెందిన కూరగాయల్ని దోసకాయలు అంటారు.

చల్లగా చూడగానే తినాలపించే కీరదోస వేసవిలో సాంత్వన నివ్వడమే కాదు దానిలోని పుష్కలమైన పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. రీహైడ్రేటింగ్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండటంతో రక్తపోటుతో బాధపడేవారికి ఇది చక్కని ఆహారం. స్వేదం ద్వారా కోల్పోయిన నీటిని, లవణాలను శరీరానికి తిరిగి అందించడంలో కీరదోస చక్కని పాత్ర పోషిస్తుంది. రోజూ కప్పు కీరదోస రసం తాగితే మేని నిగారింపు సంతరించుకుంటుంది. దీని నుంచి ఆవస్యక ఫొలేట్‌తో పాటు విటమిన్‌- ఎ, సిలు పుష్కలంగా లభిస్తాయి.

శక్తి: 13కి.కెలోరీలు;
మాంసకృత్తులు: 0.4గ్రా;
కార్బోహైడ్రేట్లు: 2.5గ్రా;
కొవ్వు: 0.1 గ్రా;
పీచు: 2.6;
సోడియం: 10.2మి.గ్రా;
పొటాషియం: 50మి.గ్రా

రక్తపోటులో తేడా ఏర్పదినవారికి దోసకాయలో ఉన్న పొటాసియం  రక్తపోటులోని హెచ్చు తగ్గులను సవరిస్తుంది.

దోస లోని లవణాలు గోళ్ళను అందంగా, చిట్ల కుండా ఉంచుతాయి .

కళ్ళ కింద నల్లటి చారలను కీరదోసకాయ ముక్కలు తొలగించును, కళ్లు ఉబ్బినట్లు ఉంటే వాటిమీద తాజా కీరదోసకాయ ముక్కలను కాటన్ వేసి పెట్టుకుంటే చక్కటి ఫలితమిస్తాయి .
శిరోజాల ఎదుగుదలకు దోసలోని సల్ఫర్, సిలికాన్, దోహదపడి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది .
దోస కడుపులోని మంటను తగ్గిస్తుంది, జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది .
దోస తొక్కలో  విటమిన్ 'కే'  సమృద్ధిగా ఉన్నందున చేర్మానికి మేలుచేకురుతుంది.
ఒక దోసకాయ ముక్కని 30 సెకన్ల పాటు నాలుకతో నోటి మీద పట్టుకొని ఉంటే చెడు శ్వాసకి కారణమైన బ్యాక్టీరియాను చంపేస్తుంది.

దోసకాయను తోక్కతోనే తినాలి, దోసకాయను ఉరగాయగా చేసి తినకూడదు . ఆరోగ్య ప్రయోజనాలు : ఎసిడిటీ : కీరదోసకాయ జ్యూస్ తాగడం ద్వారా అందులో ఉండే ఖనిజాలలోని ఆల్కలైన్‌ స్వభావమువల్ల రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది.   దీంతో ఎసిడిటీ సమస్య తగ్గుతుంది . అలాగే కీరదోసకాయ జ్యూస్ గ్యాస్ట్రిక్, డియోడినం అల్సర్లకు చికిత్సగా ఉపయోగపడి ఉపశయనం కలిగిస్తుంది . రక్తపోటు : ఎటువంటి రంగులు లేని కీరదోసకాయ జ్యూస్ వలన  రక్తప్రసరణ క్రమ బద్ధంగా ఉంటుంది . ఇందులోని ఖనిజాలు సోడియాన్ని నియంత్రణకు దోహదపడుతుంది. చలువ : వాతావరణం పొడిగా, వేడిగా ఉన్న రోజుల్లో కీరదోషకాయ జ్యాస్ ఏవైనా ఆకుకూరల రసంతో కలిపి తీసుముంటే చలువ చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను సమతుల్యముగా ఉండేలా చేస్తుంది . మూత్ర విసర్జన : మూత్రపిండాలలో రాళ్ళు కరిగిపోవడానికి, మూత్ర విసర్జన చక్కగా జరగడానికి దోహదపడుతుంది . నొఫ్ఫితో కూడిన వావు : కీళ్ళలో ఉండే యూరిక్ యాసిడ్ ను తొలగించడం వల్ల వాపు, నొప్పి తగ్గిపోతాయి. ఆర్త్రైటిస్, గౌట్ వ్యాధులలో ఇది మంచి చేస్తుది. జట్తు పెరుగుదల : కీరదోసకాయలో గల సిలికాన్‌, సల్ఫర్ ఖనిజలవణాలు జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది చర్మం మెరుగుదల: ఇందులోగల అధిక ' సి ' విటమిన్‌ వల్ల చర్మ పరిస్థితిని మెరుగుపరుస్తుంది . సౌందర్య పోషకాలలో కీరదోషకాయ తప్పక ఉంటుంది . ఎగ్జిమ, తామర, సోరియాసిస్ వంటి చర్మ వ్యాదులకు చికిత్సకోసం కీరదోషకాయ వాడవచ్చును . ఎండలో చర్మము కమిలిపోవడం : తీవ్రమైన ఎండవలన చర్మమము కమిలి పోతుంది. అప్పుడు కీరదోషకాయ రసం తీసి కమిలిన చోట రాస్తే చల్లగా ఉండి శరీరానికి ఉపశయనం కలుగుతుంది. శరీరంలో నీటినిల్వ : కీరదోషకాయ రసంలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి అందువలన శరీరంలో తగిన మోతాదులో నీటి నిల్వకు దోహదం చేస్తాయి. కళ్ళు చలువ : కీరదోషకాయ గుండ్రని ముక్కలుగా తరిగి కళ్ళపై ఉంచితే మంటలు తగ్గి ఉపశయనంతో పాటు కళ్ళు చల్లగా ఉంటాయి. వేడి తగ్గుతుంది. కళ్ళ వాపు తగ్గుతుంది. 
దోస ఈ దేశమున ప్రాచీన కాలము నుండియూ సాగునందుండిన తీగ జాతి చెట్టు. గట్టిగా చర్మంలో ముడతలు లేనివి చూసి ఎంచుకోవలెను. దోసకాయ మెత్తదైతే పండినదని అర్థము.దోస (cucumber) శాస్త్రీయ నామం - కుకుమిస్ సటైవస్ (Cucumis sativus), కుకుర్బిటేసి (cucurbitaceae) కుటుంబానికి చెందినవి.

చిన్న కాయలు, 5 - 10 సెం.మీ. పొడవు, 4 - 8 సెం. మీ లావు కలిగి ఉంటాయి.




#Article 81: బంగాళదుంప (1118 words)


బంగాళదుంప (Potato) అనేది దుంప జాతికి చెందిన ఒక కూరగాయ. ఒక్కో ప్రాంతములో ఒక్కోక పేరుతో ఈ దుంప కూర పిలవబడుతున్నది. కొన్ని చోట్ల ఆలు గడ్డ అని లేదా ఉర్ల గడ్డ అని మరికొన్ని ప్రాంతములలో బంగాళదుంప లేదా బంగాల్ దుంప అని పిలుస్తారు. ఈ మొక్క సొలనేసి కుటుంబానికి చెందిన గుల్మము.

అయితే, ఐరోపాలో దాదాపు ఒకటిన్నర రెండు శతాబ్దాలవరకు ఈ దుంపకూరను ఆదరించలేదు. ఇంగ్లాండులో నయితే, ఈ దుంపను స్పడ్ (SPUD - Society for Pevention of Unhealthy - అనారోగ్య ఆహార అలవాట్ల నిరోధనా సంఘము) గా వ్యవహరించారట. కాని కొంతకాలమునకు, ఈ విధమయిన విపరీత వర్ణనల ప్రభావంనుండి బయటపడి, బంగాళాదుంప ఒక ముఖ్య భోజ్య పదార్థముగా మారినది. చరిత్రకారులు చెప్పిన ప్రకారం, పారిశ్రామిక విప్లవం విజయవంతము కావటానికి ఈ దుంపకూర ఎంతగానో దోహదపడినదట. బవేరియన్ యుద్ధాన్ని పొటాటో యుద్ధంగా అభివర్ణించారు. కారణం, యుద్ధం జరుపుతున్న దేశాల దగ్గర బంగాళాదుంపల నిల్వలు ఉన్నంతవరకే ఆ యుద్ధం జరిగినదట. అలాగే, దక్షిణ అమెరికాలో జరిగిన ఇంకా తెగల యుద్ధాలలో కూడ, మధ్యలో కొంత విరామం తీసుకుని, ఈ దుంపకూర పంటను ఇళ్ళకు చేర్చిన తరువాత మళ్ళీ కొనసాగించేవారట.

బంగాళాదుంప ఐరోపా ప్రాంతానికి ఎలా వచ్చింది అన్న విషయం మీద అనేక వాదనలు ఉన్నాయి, అందులో ప్రధానమైనవి, పైన ఉదహరించటం జరిగింది. భారతదేశంలోకి బంగాళాదుంప దాదాపు 17వ శతాబ్దపు మొదటి అర్ధ భాగములోనే వచ్చిందనటానికి కొంత ఆధారాలు ఉన్నాయి. అందులో ప్రధానమయినది, సర్ థామస్ రో (Sir Thomas Roe) 1615లో ఇంగ్లాడ్ రాయబారిగా మొఘల్ వంశస్తుడు జహంగీర్ పరిపాలిస్తున్న సమయంలో భారతదేశానికి వచ్చాడు. అతనితో పాటుగా అతని స్వంత పూజారి ఎడ్వర్డ్ టెర్రీ (Edward Terry) కూడా వచ్చాడు. అతనికి కొత్త ప్రదేశాలలో తను చూసిన విషయాలమీద వ్రాయటం ఒక అభిరుచి. అతని తూర్పు భారతావని యాత్ర  (Voyage to East India) అనే పుస్తకాన్ని వ్రాశాడు. ఆ పుస్తకంలో అతను అప్పటికే భారతదేశంలో బంగాళదుంప ఉన్నట్టు వ్రాశాడు. భారతదేశంలో ఈ దుంపకూర గురించి చెయ్యబడ్డ మొట్టమొదటి ప్రస్తావన ఇదే. అప్పట్లో, ఈ మొక్కని పెరటి తోటలలో వేడుకగా పెంచేవారట. పూర్తిగా ఒక పంటగా 1822 వరకు పండించబడలేదు. మనదేశంలో సిమ్లా నగరంలో కేంద్రీయ బంగాళదుంప పరిశోధనా సంస్థ (Central Potato Research Institute-CPRI)  ఉంది. ఈ సంస్థకు చెందిన ఎస్.కె.పాండె (S.K.Pandey) చెప్పిన ప్రకారం, 1822వ సంవత్సరమువరకు, మనదేశములో బంగాళదుంపను ఒక పంటగా పండించలేదట. మొట్టమొదట, సల్లివాన్ అనే అంగ్లేయుడు, మద్రాసుకు దగ్గరలో తన వ్యవసాయ క్షేత్రంలో పంటగా మొదలు పెట్టాడట.

బంగాళాదుంప పంట నుండి 2006వ సంవత్సరములో మొత్తం ప్రపంచములో 315 మిలియన్ టన్నుల దిగుబడి వచ్చింది. ఈ విధంగా చూస్తే, మొత్తం పంటలలో బంగాళదుంప నాలుగవ స్థానాన్ని అక్రమిస్తుంది - వరి, గోధుమ, మొక్కజొన్న తరువాత. ప్రపంచవ్యాప్త బంగళాదుంప పంటలో నాలుగవ వంతు చైనా దేశంలో పండించబడుతున్నదట

 

ఈ పంటకు పగలుపూట తక్కువ సూర్యకాంతి, రాత్రిళ్ళు చల్లటి వాతావరణము కావాలి. ఈ విధమైన వాతావరణ పరిస్థితులు భారతదేశంలో చలికాలంలోనే ఉండటం వలన, ఈ పంటను భారతదేశంలో చలికాలంలోనే పండిస్తారు. ఈ పంటకు 90 నుండి 100 రోజుల సమయం చాలు. ఆందువలన, బంగాళాపంటను స్వల్ప కాలిక పంటగా పరిగణిస్తారు. వేడి ప్రాంతాలలో కూడా బంగాళదుంపను పండించటం జరుగుతున్నది కాని, అది మొత్తం దిగుబడిలో 8 నుండి 10 శాతము మాత్రమే. మన దేశంలో దాదాపు 25 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతున్నది. భారతదేశంలో ఈ పంటను ముఖ్యంగా బీహార్, ఉత్తర ప్రదేశ్ లలో పండిస్తారు. 1995లో బంగాళదుంపను స్పేస్ సెంటర్లో కూడా పండించారు. కాబట్టి, అంతరిక్షంలో పండించబడ్డ మొట్టమొదటి కూరగాయగా పేర్కొనవచ్చును.

బంగాళదుంపలు చెట్టుకు పండవు. పేరులోనే ఉన్నట్టు, దుంపగా భూమిలోపల, చెట్టు వేళ్ళకు పెరుగుతాయి. బంగాళదుంపలలో 80 శాతము నీరు మిగిలిన 20 శాతము ఘన పదార్ధములు. సాధారణంగా బంగాళదుంప మొక్కలు 60 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతాయి. బంగాళాదుంప మొక్కలు భూమిపై కొంత ఎత్తుకు పెరిగి, పసుపు రంగు కేసరాలు కలిగిన పూలు పూస్తుంది. పూలు పూచిన తరువాత, కొన్ని జాతి మొక్కలు చిన్న, ఆకుపచ్చని (చిన్న టొమాటో సైజు) పళ్ళు కాస్తాయి. ఒక్కో పండులోను 300 దాకా గింజలుంటాయి. ఈ బంగాళదుంప పళ్ళలో విషపదార్ధాలుంటాయి గనుక అవి తినడానికి పనికిరావు. ఈ మొక్కలు తుమ్మెదల ద్వారా పరపరాగసంపర్కం చెందడమే కాకుండా స్వజాతి సంపర్కం కూడా చెందుతాయి. ఏ బంగాళాదుంప రకాన్నైనా శాఖీయంగా, దుంపలను, కళ్ళు కలిగి ఉన్న దుంప ముక్కలను నాటడం ద్వారా ప్రవర్ధనం చేయవచ్చు. అంతే కాకుండా కత్తిరింపుల ద్వారా కూడా మంచి విత్తన దుంపలను పొందవచ్చు. ఈ పద్ధతిన హరిత గృహాలలో వినియోగిస్తారు. ఆధునిక రకాల మొక్కలను దుంపల కళ్ళ నుండి కాక గింజలనుండి పెంచుతున్నారు. గట్టిగా లోపలి భాగము సాధ్యమైనంత వరకు తెల్లగా ఉండాలి, ఆకుపచ్చనివి అసలు బాగుండవు. ఎక్కువ ఆలుగడ్డలు కొన్నచో వీటిని చల్లని చీకటి ప్రదేశాలలో దాచి ఉంచాలి.

పండిన బంగాళాదుంపలను తవ్వి తీయటానికి ప్రత్యేక పనిముట్లు ఉపయోగిస్తారు. వీటి సహాయంతో భూమిలోని దుంపలను బయటికి తీస్తారు. పెద్దపెద్ద బంగాళాదుంప సాగుదారులు, దుంపలను భూమినుండి వెలికి తీయటానికి యంత్రాలను ఉపయోగిస్తారు.

సామాన్యంగా బంగాళాదుంపలను భూమిలోనుండి తీసిన వెంటనే అమ్మకం చేయరు. కొంతకాలం నిల్వ ఉంచిన బంగాళాదుంపలకు ఎక్కువ ధర పలుకుతుంది. కొన్నిసార్లు పంటను వెంటనే కొత్త బంగళాదుంపలుగా అమ్మటం జరుగుతుంది. బంగాళదుంపలను నిలువ ఉంచేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవటం ఎంతయినా అవసరం. నిల్వ చేసే ప్రదేశం వెలుగు తక్కువగా, మంచి గాలి తగిలేట్టుగా ఉండాలి. ఎక్కువకాలం నిల్వ ఉంచాలనుకుంటే, నిలవ ప్రదేశంలో 40°ఫా ఉష్ణోగ్రత ఉంచాలి. వ్యాపారపరంగా నిల్వచేసే గిడ్డంగులలో అయితే అరు నెలల వరకు, ఇళ్ళల్లో అయితే కొన్ని వారాలవరకు నిల్వచెయ్యవచ్చు.

ఆహార, వ్యవసాయ సంస్థ FAO లెక్కల ప్రకారం, 2006వ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా 315 మిలియన్ టన్నుల బంగాళదుంపల దిగుబడి వచ్చినదట. ఈ దిగుబడిలో నాలుగవ భాగం దిగుబడి ఛైనాలో జరిగినదట.

బంగాళదుంపతో రుచికరమైన వంటలు, కూరలు, చట్నీలు, ఫలహారాలు, ఇతర ఆహార పదార్ధాలు తయారుచేయవచ్చును. ఉడకబెట్టిన కూర, వేపుడు, కుర్మా వంటివి తరచు తెలుగు నాట చేసే కూరలు. ఇంకా బజ్జీల వంటి తినుబండారాలు చేస్తారు. ఊరగాయలు కూడా పడుతుంటారు. బంగాళదుంప చిప్స్ వంటి తినుబండారాలు మార్కెట్లో లభిస్తాయి. పాశ్చాత్య దేశాలలో బంగాళ దుంపతో చేసే పదార్ధాలు అక్కడి అలవాట్లకు తగినవిగా ఉంటాయి. ఇవి భారతీయ వంటకాలకంటే భిన్నమైనవి. ఏమైనా బంగాళ దుంపను తరిగి, లేదా ఉడకబెట్టి లేదా వేయించి అనేక రకాలైన, రుచికరమైన పదార్ధాలు తయారు చేయడం చాలా సమాజాలలో సర్వసాధారణం అయింది.

ఆహార పౌష్టికత పరంగా బంగాళదుంపలలో పిండి పదార్ధాలు (కార్బోహైడ్రేటులు) ప్రధానమైన ఆహార పదార్థం. ఒక మధ్య రకం సైజు దుంపలో 26 గ్రాములు పిండిపదార్థం ఉంటుంది. ఇది ముఖ్యంగా స్టార్చ్ రూపంలో ఉంటుంది. ఈ స్టార్చి‌లో కొద్ది భాగం పొట్టలోను, చిన్న ప్రేవులలోను స్రవించే ఎంజైములు వలన జీర్ణం కాదు. కనుక ఈ జీర్ణం కాని స్టార్చి భాగం పెద్ద ప్రేవులోకి తిన్నగా వెళ్ళిపోతుంది. ఈ జీర్ణం కాని స్టార్చి () వలన శరీరానికి ఆహార పీచు పదార్ధాలు () వల్ల కలిగే ఉపయోగాలవంటి ప్రయోజనాలే కలుగుతాయని భావిస్తున్నారు (శరీర పౌష్టికత, కోలన్ క్యాన్సర్ నుండి భద్రత,  గ్లూకోజ్ ఆధిక్యతను తట్టుకొనే శక్తి,  కొలెస్టరాల్ తగ్గింపు, ట్రైగ్లిజరైడులు తగ్గింపు వంటివి). దుంపను ఉడకపెట్టి ఆరబెడితే ఇలా జీర్ణంకాని స్టార్చి ఎక్కువవుతుంది. ఉడికిన వేడి దుంపలో ఉండే 7% జీర్ణంకాని స్టార్చి, దానిని ఆరబెట్టినపుడు 13%కు పెరుగుతుంది.

బంగాళ దుంపలలో పలువిధాలైన విటమిన్‌లు, ఖనిజ లవణాలు () ఉన్నాయి. 150 గ్రాముల బరువుండే ఒక మాదిరి బంగాళ దుంపలో 27 మిల్లీగ్రాముల విటమిన్-సి (ఒక రోజు అవసరంలో 45%), 620 మి.గ్రా. పొటాషియం ( అవసరంలో 18%), 0.2 మి.గ్రా. విటమిన్-B6 (అవసరంలో 10%) మాత్రమే కాకుండా కొద్ది మోతాదులలో థయామిన్, రైబోఫ్లావిన్, ఫోలేట్, నియాసిన్, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి పదార్ధాలు లభిస్తాయి. ఇంతే కాకుండా బంగాళదుంప తొక్కలో ఉన్న పీచు పదార్థం కూడా చాలా ఉపయోగకరం. ఒక మాదిరి బంగాళ దుంప తొక్క బరువు 2 గ్రాములు ఉంటుంది. ఇందులో ఉన్న పీచు ఎన్నో ధాన్యపు గింజల ద్వారా వచ్చే పీచుకు సమానం. ఇంకా బంగాళదుంపలో ,  వంటి  ఉన్నాయి. బంగాళ దుంపలో లభించే ఇన్ని పోషక పదార్ధాల వినియోగం దానిని ఉడకపెట్టే విధానంపై బాగా ఆధారపడి ఉంటుంది.

బంగాళాదుంప తినేందుకు రుచిగా ఉండటమే కాదు, అందానికి అడ్డుగా నిలిచే ఎన్నో సమస్యల్ని తీరుస్తుంది. కళ్ల నుంచి జుట్టు వరకు అందాన్ని పెంపొందించడంలో ముందుటుంది.

కళ్లకి మెరుపు : ఎవరి ముఖంలోనైనా మొదట ఆకర్షించేవి కళ్లే. అయితే కళ్ల చుట్టూ నల్లటి వలయాలు రావడం, కళ్లు ఉబ్బడం లాంటివి ఇబ్బంది పెట్టే సమస్యలు. బంగాళాదుంపని ముక్కలుగా చేసి జ్యూసర్‌లో వేస్తే కొంచెం జ్యూస్‌ వస్తుంది. దానిలో దూది ముంచి, కళ్లపై పావుగంట సేపు ఉంచుకోండి. ఇలా రోజూ చేస్తూ ఉంటే నల్లని వలయాలు తగ్గుతాయి.

ముడతలు పోయేలా : బంగాళాదుంప రసంతో రోజూ ముఖాన్ని కడుక్కుంటే ముడతలు రావడం తగ్గుతుంది. ముఖంపై వచ్చే తెల్లమచ్చల్లాంటివి కూడా పోతాయి. ఎండకి కమిలిపోయి బొబ్బలెక్కిన చర్మానికి బంగాళాదుంప రసాన్ని రాసిన చర్మం మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తుంది.

చక్కని ఛాయకి : బంగాళాదుంపని మిక్సీలో వేసి మెత్తగా చేసేయండి. ఆ పేస్టుని ముఖానికి రాసుకుని అరగంటపాటు వదిలేయండి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువు అవడంతో పాటు, ఛాయ పెరుగుతుంది. చర్మంపై ఉన్న జిడ్డుని కూడా అది పీల్చేసుకుంటుంది. దాంతో ముఖం తాజాగా మారుతుంది. అలాగే బంగాళాదుంప రసానికి కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి పట్టించి, పావుగంట తరువాత కడిగేసుకుంటే చర్మం రంగు తేలుతుంది. .

ఫేస్‌మాస్క్‌లు : ఒక స్పూను బంగాళాదుంప రసానికి స్పూను ముల్తానీ మట్టిని కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరే వరకూ ఉంచండి. మొదట గోరువెచ్చటి నీళ్లతో, తరువాత చన్నీళ్లతో కడిగేసుకోండి. అలాగే బంగాళాదుంపని బాగా ఉడకబెట్టి ముద్దలా చేయండి. చల్లారాక ఒక స్పూను పాల పౌడర్‌ని, ఒక స్పూను బాదం నూనెని కలిపి పేస్టులా చేయండి. దానిని ముఖానికి రాసుకుని పావుగంట తరువాత శుభ్రపరుచుకోండి.

పొడి చర్మము ఉన్నవాళ్ళు తురిమిన బంగాళాదుంప, అర చెంచా పెరుగు కలిపి దానిని మూకానికి రాసుకొని 20 నిమిషాల తరువాత కడుగుకుంటే మృదువుగా తయారవుతుంది.

ఐక్య రాజ్య సమితి 2008 సంవత్సరాన్ని అధికారికంగా అంతర్జాతీయ బంగాళాదుంప సంవత్సరం గా ప్రకటించింది. వర్ధమాన దేశాలలో బంగాళాదుంప యొక్క ఆహారపు ప్రాముఖ్యతను చాటి చెప్పడానికే ఈ ప్రయత్నం. గతంలో 2004 సంవత్సరాన్ని అంతర్జాతీయ వరి సంవత్సరంగా ప్రకటించింది. ఒక సంవత్సరానికి బంగాళదుంప పేరు పెట్టి గుర్తించడంలో విశేష కారణాలు ఈ విధంగా ఉన్నాయి:




#Article 82: చిలగడదుంప (191 words)


చిలగడదుంప (Sweet Potato) ఒక విధమైన దుంప. దీని శాస్త్రీయ నామము ఐపోమియా బటాటాస్ (Ipomea batatas). దీనినే కొన్ని ప్రదేశములలో గెనసుగడ్డలు, మొహర్రంగడ్డ, ఆయిగడ్డ, రత్నపురిగడ్డ, కంద గడ్డ అని కూడా అంటారు.
ఇవి రకరకాల రంగులలో లభిస్తున్నాయి

చిలగడ దుంపలను చాలామంది పెద్దగా పట్టించుకోరు గానీ వీటిల్లో పోషకాలు దండిగా ఉంటాయి. ఉడికించుకునో, ఆవిరిపై ఉడికించో, కాల్చుకునో, కూరగా వండుకునో.. రకరకాలుగా వీటిని తినొచ్చు. సలాడ్లకూ ఇవి మరింత రుచిని తెచ్చిపెడతాయి. కాబట్టి వీటిని వారానికి కనీసం రెండు సార్లయినా తినటం మేలని నిపుణులు సూచిస్తున్నారు. ---

బంగాళాదుంప కన్నా చిలగడదుంపల్లో పీచు మోతాదు చాలా ఎక్కువ. దీంతో నెమ్మదిగా జీర్ణమవుతూ ఎక్కువసేపు కేలరీలు విడులయ్యేలా చేస్తాయి.

చిలగడదుంపల్లో విటమిన్‌ బీ6 దండిగా ఉంటుంది. రక్తనాళాలు బలంగా ఉండేందుకు తోడ్పడే హోమోసిస్టీన్‌ను విటమిన్‌ బీ6 విడగొడుతుంది. అందువల్ల వీటితో గుండె, రక్తనాళాల సమస్యలు దూరంగా ఉంటాయి.

ఒంట్లో ఎక్కువగా ఉన్న ఉప్పును తొలగించి, నీటి మోతాదును నియంత్రిస్తూ అధిక రక్తపోటును తగ్గించటంలో పొటాషియం కీలకపాత్ర పోషిస్తుంది. చిలగడదుంపల్లో పొటాషియం మోతాదూ అధికంగానే ఉంటుంది.

చిలగడదుంపల్లో విటమిన్‌ ఏ లేదా బీటా కెరటిన్‌ ఎక్కువ. ఇది ఎండకు చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది. చూపు తగ్గిపోకుండా చూస్తుంది.

పిండి పదార్థాల జీవక్రియల్లో చాలా కీలమైన మాంగనీసు కూడా వీటిల్లో అధికం. అందువల్ల ఇవి రక్తంలో గ్లూకోజు మోతాదులు సాధారణ స్థాయిలో ఉండేలా తోడ్పడతాయి.

వీటిల్లోని విటమిన్‌ సి రోగనిరోధకశక్తిని పెంచితే.. విటమిన్‌ ఈ మన చర్మం ఆరోగ్యంగా, నిగనిగలాడేందుకు తోడ్పడుతుంది.

లగడదుంపల్లో దండిగా ఉండే సహజ చక్కెరలు రక్తంలో నెమ్మదిగా కలుస్తాయి. అందువల్ల రక్తంలో ఒకేసారి చక్కెర మోతాదు పెరగకుండా చూస్తాయి. ఇలా బరువు పెరగకుండా, నిస్సత్తువ రాకుండా కాపాడతాయి. 
నలుపు మరకలు లేని, గట్టి దుంపలు మంచి రుచిగా ఉంటాయి




#Article 83: టమాటో (264 words)


టమాటో (ఆంగ్లం: Tomato) సొలనేసి కుటుంబములో జేరిన యొక విదేశీయపు కాయగూరజాతి. మొదట ప్రపంచంలో ఎక్కడ పెరిగినదో సరిగ్గా తెలీదు. కానీ అమెరికాలోని పెరువియా, మెక్సికో ప్రాంతములనుండి ఇది వ్యాపించినదని ఊహించబడుతున్నది. దీనికి సీమ వంగ, రామ ములగ అని చక్కని తెలుగు పేర్లు కూడా ఉన్నాయి. టమాటో (Tomato) సొలనేసి కుటుంబములో జేరిన యొక విదేశీయపు కాయగూరజాతి. మొదట ప్రపంచంలో ఎక్కడ పెరిగినదో సరిగ్గా తెలీదు. కానీ అమెరికాలోని పెరువియా, మెక్సికో ప్రాంతములనుండి ఇది వ్యాపించినదని ఊహించబడుతున్నది. దీనికి సీమ వంగ, రామ ములగ అని చక్కని తెలుగు పేర్లు కూడా ఉన్నాయి.ఇంగ్లాండునకు 16 వ శతాబ్దమున ప్రవేశించింది. భారతదేశములో సుమారుగా 1850 లలో ప్రవేశించింది. త్వరగా ఇది దేశీ కూరగాయల స్థానములో ఆక్రమించింది. ఇప్పుడు టమాటో కూరలేని ఇల్లు, టమాటో కూరలేని దుకాణము చూడలేము. మనకు ఎక్కువగా లభించే ఎర్రగా అందంగా చూడముచ్చటగా కనిపించే టమాటోలు ఆరోగ్యానికు మేలు చేసస్తాయి . శక్తివంతమైన యాంటి ఆక్షిడెంట్ గా పనిచేస్తాయి .సాధారణంగా రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ అవసరం లేదని చెపుతారు . . . కాని అన్ని కాలాల్లో లభించే టమాటోలు తీసుకుంటే డాక్టరుతో అవసరముండదని చెప్పవచ్చు. దీనిలో లైకోపీన్ (Lycopene) అనే పదార్ధము శక్తి వంతమైన anti- oxydent గా పనిచేస్తుంది .

ఇంగ్లాండునకు 16 వ శతాబ్దమున ప్రవేశించింది. భారతదేశములో సుమారుగా 1850 లలో ప్రవేశించింది. త్వరగా ఇది దేశీ కూరగాయల స్థానములో ఆక్రమించింది. ఇప్పుడు టమాటో కూరలేని ఇల్లు, టమాటో కూరలేని దుకాణము చూడలేము.

ఇది నేలపై ఎక్కువ ఎత్తు పెరగక, నేలపై పడి పెరుగును. ఈ మొక్కలు సామాన్యముగా ఒకటి, ఒకటిన్నర మీటర్ల ఎత్తువరకు పెరుగును. అనేక శాఖలను ఉపశాఖలగా పెరుగును. వేళ్ళు మొక్క పెరిగినంత త్వరగా వ్యాపించవు. కాండము బలహీనమయినది. లేత భాగమున నూగు కలిగి కొంచెమించుమించు గుండ్రముగ నుండును. ఆకు 10-20 చెంమీ వెడల్పు కలిగి ఉండును.

అనగా మొదట ఐరోపా నుండి దేశానికి తెచ్చిన రకము. బాగుగా కాయలు కాయును. ఈ రకపు పండ్లు ఎరుపు రంగును కలిగి మధ్మ పరిమాణమున ఉండును. ఇందు రసము తక్కువ లోన అవకాశము ఉండుటయు ఉంది. చర్మము జిగియైనది. వీటిని కొన్ని ప్రాంతాలలో రామములక్కాయలు అని కూడా అంటారు.

ఇది ఒక అమెరికా దేశపు రకము. కాయ మధ్యమ పరిమాణము కలిగి గుండ్రముగను నునుపుగాను ఉండును. లోన గుల్ల యుండదు. రసమయము. 

టమాటోను నిజంగా ఎన్నిరకముల కాంబినేషనులలో వాడవచ్చో తెలిస్తే మీరు ముక్కుమీద వేలు వేసుకుంటారు, 




#Article 84: నీరు (524 words)


నీరు, ఉదకం లేదా జలx (సాంకేతిక నామం H2O) జీవులన్నింటికి అత్యవసర పదార్థం. భూమిమీద వృక్షాలు, జంతువులు, మానవాళి మనుగడకు, వాటి పెరుగుదలకు గాలి తరువాత ముఖ్యమైనది నీరు. గ్రామాల్లో, పట్టణాల్లో నివసించే కోట్లాది ప్రజలకు త్రాగునీరు సరఫరా చేయడం ఎన్నో ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. వివిధ పంటల సాగుబడికి నీటి-పారుదల సౌకర్యాలు అత్యంత అవసరమైనవి. ఏ పరిశ్రమ కూడా తగినంత నీటి సరఫరా లేకపోతే స్థాపించడంగాని, నడపడంగాని సాధ్యపడదు. ఇది ప్రకృతి సమస్త జీవులకు ప్రసాదించిన ఒక అపరూపమైన పదార్థము: నీరు ప్రకృతిలో ఉన్న సమస్త జీవులకు ప్రాణాధారము. ప్రప్రథమ జీవి పుట్టుక నీటినోనే జరిగింది. నీరు ఈ భూమండలంపే 71 శాతానికి పైగా ఆవరించి యున్నది. ఈ భూమి పై నీరు మూడు రూపములలో ఉంది. 1. ఘన రూపము. అనగా మంచు గడ్డల రూపంలోను, (గ్లేసియర్స్), (మంచు కొండలు) 2. ద్రవ రూపం (సముద్రాలు, నదులు, తటాకములు మొదలగునవి) వాయు రూపంలో ( మేఘాలు, ఆవిరి ) భూతలం నాల్గింట మూడు వంతులు మహాసముద్రాలు, నదులు, తటాకాలు వంటి ఉపరితల జలాలతో నిండి ఉంది. ప్రకృతిలో లభ్యమయ్యే నీటిలో అతిశుద్ధమైనది వర్షపు నీరు.

తెలుగు భాషలో నీరు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి. నీరే ప్రాణాధారము  అని ఒక పద్యంలో ప్రయోగమున్నది. భగవత్గీతలో...... యజ్ఞమువల వర్షము, వర్షమువలన నీరు లభింస్తుందని చెప్పబడింది.

నీరు ఈ భూమండలంపై 71 శాతానికి పైగా ఆవరించి ఉంది. ఈ భూమి పై నీరు మూడు రూపములలో ఉంది. 1. ఘన రూపము. అనగా మంచు గడ్డల రూపంలోను, (గ్లేసియర్స్), (మంచు కొండలు) 2. ద్రవ రూపం ( సముద్రాలు, నదులు, తటకములు మొదలగునవి) వాయు రూపంలో ( మేఘాలు, ఆవిరి ) ఈ నీటి చక్రము అనగా నీరు ద్రవరూపంనుండి వాయు రూపంలోకి, అక్కడి నుండి తిరిగి ద్రవ రూపంలోనికి నిరంతరము మారుతూ వుంటుంది.

భూమిపై నీరు మూడు స్థితులలో కాన వస్తుంది. ఘన, ద్రవ, వాయుస్థితులు.అనగా నీరు సూర్యుని వేడిమికి ఆవిరి రూపం ధరించి, (వాయు రూపం) మేఘాలుగా మారి చల్లదనానిని ద్రవ రూపంలోనికి మారి ఆకాశం నుండి వర్ష రూపంలో తిరిగి భూమికి చేరుతుంది. ఆ ప్రక్రియలో ప్రకృతిలోని సమస్త జీవరాసులకు నీటిని అందించి భూగర్బజలం, నదులు, జలాశయాలు.... ఇలా ప్రవహించి తిరిగి సముద్రములో కలుస్తుంది. ఈ ప్రక్తియ నిరంతరము కొనసాగు తుంది.

నాగరికథ అభివృద్ధి చెందుతున్న క్రమంలో క్రొత్త క్రొత్త సమ్మేళన పదార్థములతోను, విష పూరిత రసాయన పదార్థాల తోను నీరు కలుషిత మౌతున్నది. అలా కలుషితమైన జలము జల చక్రముద్వారా తిరిగి ఆవిరి రూపం ధరిస్తుంది. ఈ క్రమంలో ఆ జలం తనలోని ఇతర కలుషిత పదార్థములను, అనగా రసాయన పదార్థములను కూడా కలుపుకొని వాయురూపంలో మేఘాలుగా మారి అక్కడి వాతావరణం అనుకూలించగానే ద్రవించి తిరిగి వర్షరూపంలో తిరిగి భూమిని చేరుతున్నది. ఆకలుషిత మేఘాలు వర్షించినపుడు రంగు రంగులలో వర్షము కురవడము, ఆమ్ల వర్షాలు కురవడము సర్వ సాధారణము. దాంతో ప్రకృతికి అపార నష్టము జగురుతున్నది.

జీవం నీటి నుంచి మొదలైంది. జీవుల్లో జీవ రసాయన క్రియలన్నీ నీటి వల్లనే సంభవం. జంతువుల శరీరంలో 70-90 శాతం నీరు ఉంటుంది. నీరు ముఖ్యంగా రెండు రకాలు. అవి సముద్రపు నీరు, మంచి నీరు. మంచినీటి కంటే సముద్రపు నీరు చాలా ఎక్కువ పరిమాణంలో ఉంది. ఎక్కువగా జీవులు సముద్రంలోనే వేరువేరు లోతులలో జీవించడానికి తగిన వాతావరణ పరిస్థితుల్లో ఉంటాయి. జంతువులు నీటిని చర్మం ద్వారా పీల్చుకోవడం, తాగడం, ఇంకా జీవ ప్రక్రియలలో వెలువడిన నీటిని వాడుకోవడం చేస్తాయి.

జీవ వ్యవస్థలో నీరు మంచి ద్రావణి, ఇందులో చాలా వరకు లవణాలు కరుగుతాయి. అందుకే దాన్ని విశ్వవ్యాప్త దావణి అంటారు. ఇంచుమించు అన్ని జీవరసాయనాలు నీటిలో కరుగుతాయి. ఇందువల్ల నీరు జీవపదార్ధాల రవాణాకు తోడ్పడుతుంది. ఉదా: రక్తం, శోషరసం, మూత్రం.

మనిషి శరీరములో 2/3 వ వంతు నీరే.

మనకు నీళ్ళవల్ల చాలా లాభాలు ఉన్నాయి

నీరు లభించే ప్రదేశాలు భౌగోళిక పరిస్థితులను బట్టి మారుతుంది. వీటిని అన్నింటిని ఆ ప్రాంతపు నీటివనరులు (Water Resources) అంటారు. 

స్వచ్ఛమైన నీరు త్రాగుటకు అవసరము. మనకు అందుబాటులో వున్న నీరు వివిధ రకాలుగా కలుషితమైనది. దీనిని త్రాగుటకు యోగ్యమైనదిగా చేయటానికి చాలా రకాల పద్ధతులున్నాయి.

గ్రామాలలో రక్షిత మంచినీటి కేంద్రం ద్వారా త్రాగు నీటిని తక్కువ ఖర్చుతో ప్రజలకు అందచేస్తున్నారు.

స్వచ్ఛమైన త్ర్రాగు నీరు ఎలా ఉండాలంటే?:

ముంబయిలో ఎవరైనా తాగునీటిని వృథా చేస్తే జైలు శిక్ష అనుభవించడం లేదా జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నీటిని వృథా చేయడాన్ని క్రిమినల్‌ నేరంగా పరిగణిస్తారు. ఉద్యాన వనాల్లో మొక్కలకు నీరు పట్టడం, భవన నిర్మాణాల ప్రయోజనం నిమిత్తం, కార్లను శుభ్రం చేసేందుకు కొళాయి నీటిని ఉపయోగిస్తే వృథాగా పరిగణించనున్నారు. తాగునీరు అరుదైన వస్తువుగా మారింది. నగరానికి సరఫరా అవుతున్న నీటిలో 30 శాతం చౌర్యానికి గురవుతున్నది. ముంబయిలో దేశం అంతాట జరుగాలి. తాగునీటిని నిత్యావసర వస్తువుల చట్టం కిందకు తీసుకురావాలని డిమాండ్‌ ఉంది.




#Article 85: ధాన్యము (180 words)


ధాన్యాలు  అనునవి గట్టిగా, పొడిగా గల విత్తనాలు (పైకప్పు కల లేదా పైకప్పు లేనివి). యివి మానవుని లేదా జంతువుల ఆహారంగా ఉపయోగపడతాయి . వ్యవసాయ శాస్త్రవేత్తలు ధాన్యాలను యిచ్చే మొక్కలను ధాన్య పంటలుగా పిలుస్తారు.

కోతలు కోసిన తర్వాత పొడిగా ఉన్న ధాన్యాలు యితర ఆహార పదార్థాలు అనగా పిండిపదార్థాలు కలవి ఉదా:అరటి పండ్లు, రొట్టెపండు) , వేర్లు (ఉదా:బంగాళా దుంపలు), దుంపలు, పెండలం దుంప, వంటి వాటికంటే నిల్వ ఉండటానికి, ఉపయోగించటానికి, , ఎగుమతులకు ఉపయోగకరంగా ఉంటాయి. ప్రత్యేకముగా ఈ లక్షణాలు యంత్రాలతో కోయుటకు, రైలు, ఓడలలో రవాణాకు, అనేక రోజులు నిల్వ ఉంచుటకు, అధిక పరిమాణంలో నూర్చుటకు , పారిశ్రామిక వ్యవసాయానికి ఉపయోగపడతాయి. సాధారణంగా మొక్కజొన్న, వరి, సోయాబీన్స్, గోధుమ , యితర ధాన్యాలు వంటివి అధిక సంఖలో ఎగుమతి, దిగుమతులు జరుగుతాయి. కానీ కాయగూరలు, దుంపలు , యితర పంటలు ఎగుమతులు తక్కువగా జరుగుతాయి.

వృక్ష శాస్త్రంలో ధాన్యాలు , పప్పులు కెరీయోప్‌సెస్ గా పిలువబడుతాయి. గడ్డిజాతి కుటుంబ ఫలాలుగా వ్యవసాయ శాస్త్రంలో , కామెర్స్ లోనూ, యితర కుటుంబాలలో గల విత్తనాలు , ఫలాలు గానూ పిలుస్తారు. ఉదాహరణకు అమరనాథ్ అమ్మిన వాటిని గ్రైన్ అమరనాథ్ అనీ,, అమరనాథ్ ఉత్పత్తులను హోల్ గ్రైన్స్ అనీ పిలుస్తారు.

పప్పు ధాన్యాల పంటలు అన్నీ గడ్డి జాతి కుటుంబానికి చెందుతాయి. పప్పు ధాన్యాలలో అధిక పిండి పదార్థం, శక్తినిచ్చే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి.

ఆకలితో అలమటించే జనం ఉన్న ఈ దేశంలో ఒక్క తిండిగింజను వృథాచేసినా అది నేరమేనని, ప్రజాపంపిణీ వ్యవస్థ ధాన్యాన్ని కొల్లగొట్టేవారిని ప్రాసిక్యూట్‌ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
వృథా అయ్యే ధాన్యం విలువ రూ.17వేల కోట్లు




#Article 86: బియ్యము (329 words)


బియ్యం, భారతదేశ౦ ప్రధాన ఆహారపంట వరిమొక్క కంకుల నుండి వేరుచేస్తారు.

ఇందులో 75% కార్బోహైడ్రేటులు ఉంటాయి.

సాధారణంగా దీనిని నీటిలో వండి అన్నం తయారుచేసి, కూరలతో కలిపి తింటారు.

గంజి వంపక పోవడము మంచిది, కనుక బియ్యాన్ని తగినన్ని నీటిలో వండవలెను

ఇంకా ఇతర పదార్దములు కూడా తయారు చేసుకొని తినవచ్చు

తెల్లటి పాలిష్ వరి అన్నాన్ని తింటే టైప్‌-2 మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని గోధుమ రంగులో ఉండే ముతకబియ్యపు అన్నం తినడం వల్ల ఈ ముప్పు తగ్గుతుంది. పాలిష్డ్‌ బియ్యం బదులు ముడి బియ్యం వినియోగిస్తే టైప్‌-2 మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. పీచుపదార్థం, ఖనిజాలు, విటమిన్లు, ఫైటోకెమికల్స్‌ వంటి అవసరమైన పోషకాలు గోధుమరంగు బియ్యంలో ఎక్కువగా ఉంటాయి.భోజనం చేశాక.. రక్తంలో చక్కెర పరిమాణాన్ని కూడా ఎక్కువగా పెంచదు. బియ్యాన్ని పాలిష్‌ చేయడం వల్ల విటమిన్లు, ఖనిజాలు, పోతాయి.

తెల్లగానే కాదు... నల్లగానూ ఉంటాయని మీకు తెలుసా..? చైనాలో ఎప్పట్నుంచో వినియోగిస్తున్న ఈ నల్ల బియ్యాన్ని శాస్త్రవేత్తలు ఇప్పుడు సూపర్ ఫుడ్గా అభివర్ణిస్తున్నారు. వీటిలో చక్కెర తక్కువగా ఉండటమే కాదు ఆరోగ్యాన్ని కాపాడే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా దండిగా ఉంటాయని లూసియానా రాష్ట్ర విశ్వవిద్యాలయం చేసిన అధ్యాయనంలో వెల్లడైంది. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్లతో పోరాడటంలో దోహదం చేస్తాయని పరిశోధక్లు చెబుతున్నారు. చెంచాడు నల్లబియ్యం తవుడులో బ్లాక్‍బెర్రీల్లో కన్నా అధికంగా యాంతోసైయానిన్ ఆక్సిడెంట్లు ఉంటాయి. చక్కెర మోతాదు తక్కువగానూ పీచు, విటమిన్ ఈ ఎక్కువగానూ ఉన్నాయని అధ్యయానానికి నేతృత్వం వహించిన డాక్టర్ జిమిన్ జు పేర్కొన్నారు. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు తీసుకోవటాన్ని ప్రోత్సాహించటానికి నల్లబియ్యం తవుడు ప్రత్యేకమైన, చవకైన మార్గమని ఆయన సూచించారు.

బ్లూబెర్రీలు, ఎండు మిరప వంటి పండ్లు, కూరగాయలకు ఈ యాంతోసైయానిన్లు ముదురురంగును తెచ్చిపెడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు అయిన ఇవి రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. డీఎన్‍ఏ దెబ్బతినకుండా కాపాడుతూ క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయని పరిశోధకులు వివరించారు. పూర్వకాలంలో ఈ నల్లబియ్యాన్ని నిషిద్ద బియ్యం అని పిలుచుకునేవారు. పురాతన చైనాలో కేవలం గొప్పవారికే వీటిని తినటానికి అనుమతి ఉండేది! 
'నిషిద్ధ బియ్యం' అని పిలిచే నల్లబియ్యాన్ని తినటానికి పూర్వం చైనాలో కేవలం గొప్పవారికే అనుమతి ఉండేదట.వీటిల్లో చక్కెర తక్కువ.పీచు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగాఉంటాయి.ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్లను రానివ్వవట.నల్లబియ్యం తవుడులో బ్లాక్‌బెర్రీల్లో కన్నా అధికంగా యాంతోసైయానిన్‌ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.పండ్లు, కూరగాయలకు యాంతోసైయానిన్లు ముదురురంగును తెచ్చిపెడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి.డీఎన్‌ఏ దెబ్బతినకుండా కాపాడుతూ క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి.

రాష్ట్రంలో ఏటా కోటి టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతోంది. రాష్ట్ర అవసరాలకు 75 లక్షల టన్నులు సరిపోతాయి. 25 లక్షల టన్నులు మిగులుండాలి. అవసరానికి మించి ఉత్పత్తి అవుతోంది గనక ధరలు పెరగాల్సిన పరిస్థితేలేదు. అయితే, భారీఎత్తున బియ్యం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండటంతో రాష్ట్రంలో ధరలు పెరుగుతున్నాయి.మిల్లర్లు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) కి 75 కిలోల బియ్యం లెవీ కింద ఇస్తే 25 కిలోలు బహిరంగ మార్కెట్లో (రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా) అమ్ముకోవచ్చు.ఇతర రాష్ట్రాలకు తరలించినందుకు వీటిపై ఒకశాతం పన్నును మిలర్ల నుంచి వసూలు చేయాలి.అయితే 2005నుండి పన్ను రాయితీ ఇచ్చారు.

సోనా మసూరి




#Article 87: పాలు (1248 words)


పాలు లేదా క్షీరము (Milk) శ్రేష్ఠమయిన బలవర్ధక ఆహారము. ఇందులో అన్ని రకాలైన పోషక విలువలు ఉన్నాయి. కొద్దిగా విటమిన్ సి, ఇనుము తక్కువ. అన్ని వయసులవారూ తీసుకోదగ్గ ఉత్తమ ఆహార పదార్ధము. పాలను ఉత్పత్తి చేసే జంతువులు ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు. హిందువులు పవిత్రంగా పూజించే ఆవు యొక్క పాలు అన్ని రకాల పూజా కార్యక్రమాలలోనూ వాడతారు.

తెలుగు భాషలో పాలు అనే పదానికి వివిధ ప్రయోగాలున్నాయి. పాలు నామవాచకంగా పాలు, పాలవంటి ద్రవాలకు ఉపయోగిస్తారు,

సంస్కృతంలో క్షీరము [ kṣīramu ] అనగా n. Milk, పాలు. The milky sap of plants. జిల్లేడు మొదలైన వాటి పాలు. Water ఉదకము. క్షీరాన్నము rice and milk boiled together. పరమాన్నము. క్షీరోదక న్యాయము intimate union as milk and watesr mixed with each other. నీళ్లును పాలును కలిసినట్లు ఒక్కటిగా కలిసియుండు ధర్మము. వారు క్షీరోదక న్యాయముగా నున్నారు they are intimately associated or related. క్షీరాబ్ధి or క్షీర సాగరము kshīr-ābdhi. n. The sea of milk పాల సముద్రము. క్షీరాబ్ధి తనయ the goddess who sprung from this sea, i.e., Lakshmi. పాల సముద్రం నుండి జన్మించిన లక్ష్మి.

మనిషి పాలలో 71 కిలో కేలరీలు, ఆవు పాలలో 69 కిలోకేలరీలు, గేదె పాలలో 100 కిలో కేలరీలు, మేక పాలలో 66 కిలో కేలరీలు శక్తి ఉంటుంది.


పిల్లల ఆరోగ్యానికీ, ఎదుగు దలకూ పాలు చాలా అవసరం. అయితే, పిల్లలకు ఏ పాలు ఇవ్వడం మంచిదన్న విషయాన్ని పరిశీలించాలి. ఆవు, గేదె, మేకపాలు, స్కిమ్డ్‌ మిల్క్‌ లభిస్తాయి. ఆవుపాలు పిల్లలకు ఎంతో శ్రేష్టమయినవి. కొంతమంది, పాలు పిండగానే అలాగే త్రాగేస్తారు. ఆ పాలను గుమ్మపాలు అంటారు. పొదుగు నుంచీ పిండగానే అలాగే పచ్చిపాలను త్రాగడం మంచిది కాదు. ఆరోగ్యం మాట అటుంచి ఎన్నెన్నో అనారోగ్యాలు ఏర్పడే ప్రమాద ముంటుంది. ఆ పాలల్లో ప్రమాదకర మైన సూక్ష్మక్రిములు ఉండే అవకాశం ఎక్కువ. ఆ పాలు త్రాగిన పిల్లలకు సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించి ఇన్‌ఫెక్షన్‌ను, వ్యాధిని కలిగిస్తాయి. ఏ పాలనయినా బాగా కాగి (వేడి చేసి) పొంగిన తర్వాతనే పిల్లలకు త్రాగించడం ఆరోగ్యకరం. పాశ్చరైజ్డ్‌ మిల్క్‌ను కనీసం పదినిముషాలయినా కాచినట్ల యితే అందులోని బాక్టీరియా నశిస్తుం ది. ఆ పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడే పిల్లలకు త్రాగించాలి. చల్లారిపోయిన పాలను, నిలవ ఉన్న పాలను పిల్లలకు త్రాగించకూడదు. చిక్కగా ఉన్న పాలల్లో నీళ్ళు కలిపి త్రాగించాలంటే పాలు కాగుతున్నప్పుడే కొంచెం నీటిని కలపాలి. వేడిపాలల్లో చన్నీళ్ళు కలిపితే, ఆ నీటి ద్వారా బాక్టీరియా పాలల్లోకి ప్రవేశించి పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. పిల్లలకు పాలు పడకపోతే వాంతులు, విరేచనాలు, అజీర్తి వ్యాధులు కలుగుతాయి. పిల్లల వైద్యుని సంప్రదించి, పిల్లలకు ఏ పాలు త్రాగించాలన్నదీ తెలుసుకోవాలి. పశువులపాలు త్రాగించేటప్పుడు పశువులకు చేపువచ్చి పాలివ్వటానికి ఇంజెక్షన్‌ ఇస్తారు కొంతమంది పాలవ్యాపారస్తులు. ఆ ఇంజెక్షన్‌లోని రసాయనిక మందు పాలలో ప్రవేశిస్తుంది. పశువులకు వ్యాధులోస్తే, ఆ సంగతి తెలియక పిల్లలకు ఆ పాలను త్రాగించినట్లయితే పిల్లలకు అనారోగ్యాలు కలుగుతాయి. ముఖ్యంగా పసిబిడ్డకు త్రాగించే పాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఈ రోజుల్లో, పట్టణాల్లో పశువుల పాలవాడకం తగ్గిపోయి బూత్‌పాలను ఉపయోగిస్తున్నారు. స్కిమ్డ్‌ మిల్క్‌నే అందరూ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే, ఆ పాలల్లోంచి కొవ్వు తొలగించబడు తోంది. పిల్లలకు ఆ పాలు త్రాగించడం ఆరోగ్య కరమే. ఆ పాలల్లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. ఆ పాలల్లోంచి కొవ్వు పొర మాత్రమే తొలగిపోతుంది, పోషక పదార్థాలేమీ తొలగిపోవు. ఆ పాలల్లో ఖనిజాలు అల్లాగే నిక్షిప్తమై ఉంటాయి. కొవ్వుద్వారా లభించేది ఎ, డి విటమిన్‌లు. 'ఎ' విటమిన్‌ ఆహార పదార్థా ల ద్వారా లభిస్తుంది. డి విటమిన్‌ సూర్యరశ్మి ద్వారా శరీరానికి అందు తుంది. ఆ విధంగా ఆ రెండు విటమినులను వారి శరీరానికి భర్తీ చేయవచ్చు. స్కిమ్డ్‌ మిల్క్‌లో పిల్లలకు అవసరమయ్యే కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పిల్లలు పాలు త్రాగటానికి ఇష్టపడకపోతే, ఏ రూపంలోనైనా పాలతో తయారుచేసిన పదార్థాలను ఇవ్వవచ్చు, పెరుగు, మజ్జిగ, పాయసం, పాలకోవా, జున్నులాంటి ఎన్నెన్నో పదార్థాలను పాలతో తయారు చేసి పిల్లలకు ఇవ్వవచ్చు. పిల్లల ఎదుగుదలకూ, నూతన శక్తికీ, శారీరకదృఢత్వానికీ వారికి ప్రతిరోజూ పాలను లేదా పాలతో తయారయ్యే పదార్థాలను ఇవ్వడం ఎంతో ముఖ్యం. పసిపిల్లలకు పోతపాలు వచ్చేటప్పుడు, అవి ఆవుపాలు, గేదెపాలు, మేకపాలు, బూత్‌పాలు ఏవయినా కానీ, పలుచని వస్త్రంలో చిటికెడు వామును వేసి మూటకట్టి, పాలను కాచేట ప్పుడు, ఆ మూటను ఆ పాల ల్లో వేసి కాచినట్లయితే పాపాయికి అరుగుదల బాగా ఉండి, అజీర్తి బాధలు కలుగవు. జీర్ణక్రియ బాగుం టుంది. ఆకలికూడా బాగా ఏర్పడుతుంది.

పాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇది అందరికీ తెలుసు. పాలవలన బరువు తగ్గడము కూడా సాధ్యమే ... మధ్య వయసులో పాలు తగినంత తాగుతూ, డి-విటమిన్‌ సమృద్ధిగా తీసుకునేవారు బరువు తగ్గుతారని నిరూపించబదింది . ఇజ్రాయిల్ పరిశోధకులు భారీ కాయము కలిగిన 300 మంది మీద జరిపిన పరిశోధనా ఫలితం ఇది. వీరి వయసు 45-60 మధ్య ఉంది . ప్రతిరోజూ 2 గ్లాసుల పాలు త్రాగడంతో పాటు పిండి పదార్ధము ఉన్న ఆహారము తక్కువగా తీసుకున్న వీరు 2 ఏళ్ళ కాలములో 5.5 కిలోల బరువు తగ్గడము గమనించారు . అదేసమయములో ఇతర పద్ధతుల ద్వారా బరువు తగ్గేందుకు ప్రయత్నించినవారు కేవలము 3 కిలోల బరువు మాత్రమే తగ్గారు . అందుకే పాలలోని కాల్సియం, విటమిన్‌ డి-బరువుతగ్గడములో కీలక పాత్ర వహిస్తాయని పరిశోధనల ద్వారా స్పష్టమైనది .

పాలు పౌష్టికాహారమన్న సంగతిని మనం తరచూ వింటుంటాము. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక్క రూపంలో పాలను తమ ఆహారంగా స్వీకరిస్తూ ఉంటారు. ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ, రోగాల్ని కుదర్చడంలోనూ పాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే పాలను ప్రకృతి సిద్ధమైన 'పరిపూర్ణ పౌష్టి కాహారం' కింద చెబుతుంటారు. పాలను మానవులు అనాది నుంచి వాడుతూ వస్తున్నారు. ముఖ్యంగా ఆవుపాలు, బర్రెపాలు, మేకపాలు మొదలైనవి. ఆవుపాలలో తల్లి పాలలో కంటే రెట్టింపు ప్రొటీన్లు ఉంటాయి. కాని చక్కెర తక్కువ ఉంటుంది. బర్రె పాలలో ఆవు పాలలో కంటే కొవ్వు అధికంగా ఉంటుంది.

కొందరి వొంటికి పాలు సరిపడవు. అలాంటి వాళ్ళకు పాలు తాగగానే కడుపులో గ్యాస్‌ ఉత్పత్తి అయి కడుపు ఉబ్బరించినట్లుగా అవుతుంది. ఇందుకు కారణం ఏమిటంటే... పాలలో ఉన్న కార్బోహైడ్రేట్ జీర్ణం గావించే లాక్టోస్‌ అనబడే ఎంజైమ్‌ వీళ్ళలో సరిగా ఉత్పత్తి కాకపోవటం! లాక్టోస్‌ సరిగా ఉత్పత్తి కాని మనుషులకు కడుపులో గ్యాస్‌ అధికంగా ఉత్పత్తి కావటం, కడుపు ఉబ్బరించటం, కడుపులో నొప్పి, అజీర్ణం, విరేచనాలు లాంటి ఇబ్బందులు ఎదరవుతాయి.

పాలు తాగగానే లేక పాల ఉత్పత్తి పదార్థాలను తినగానే ఇలాంటి ఇబ్బంది ఏర్పడే వాళ్ళు తమకు తాము ఒక సింపుల్‌ టెస్ట్‌ను చేసుకోవచ్చు. వీళ్ళు ఒక పది రోజుల పాటు పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవటం మానేసి పై లక్షణాలు తొలగి పోతాయేమో చూడాలి. పాలు మానేయగానే పై లక్షణాలు తొలగి పోయి, తిరిగి పాల ఉత్పత్తులను తీసుకోవటం మొదలటెటగానే మళ్ళీ ఆ లక్షణాలు మొదలైతే తమకు పాలు పడవని అర్ధం చేసుకుని పాలను మానేయాలి.

ఇలా పాలు పడని వాళ్ళు శాకాహారులైతే వాళ్ళు తమ ఆహారంలో గుడ్లు, సోయా చిక్కుళ్ళు, మిగతా పప్పు ధాన్యాల ద్వారా తమ శరీరానికి అవసరమైన పాల ద్వారా లభించని ప్రొటీన్లను పొందటానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ప్రొటీన్లు తక్కువయితే శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడి త్వరగా అతను అంటురోగాల బారినపడే అవకాశం ఉంది.

లావెక్కడానికి : బక్కగా బలహీనంగా ఉన్న వాళ్ళకు లావెక్కటానికి పనికివచ్చే ఆహారం పాలు! ఉండాల్సిన బరువుకంటే తక్కువ బరువున్న వాళ్ళు సరిపడా పాలు తాగటం ద్వారా వారానికి 3 నుంచి 5 పౌన్ల దాకా బరువెక్క గలుగుతారు. నిదానం మీద శరీరం బరువు ఉండాల్సిన స్థి తికి వచ్చేస్తుంది.

పాలు తాగటం వల్ల కళ్ళు తేటగా ప్రకాశవంతంగా అవుతాయి. శరీరానికి ఆరోగ్యకరమైన మెరుపు వస్తుంది. శరీరంలోని అవయవాలన్నిటిలోకి సరిపడా శక్తి చేరుకుంటుంది.

సజావుగా రక్తప్రసరణ : శరీరంలో రక్తప్రసరణ సరిగా లేని వాళ్ళకు పాలు అద్భుతమైన ఆహారం! పాలు తాగటంవల్ల కడుపు, ప్రేవులలోని ద్రవాంశం వృద్ధిచెంది శరీరంలో రక్తప్రసరణ సహ జసిద్ధంగా మెరుగుపడుతుంది.రక్త ప్రసరణ సరిగా లేకపోవటంవల్ల చేతులు, పాదాలు చల్లగా ఉంటాయి. రక్తప్రసరణ సజావుస్ధి తికి చేరుకున్నాక ఇవి మళ్ళీ జవాన్ని పుంజుకొని కొద్ది రోజులకే ఆ వ్యక్తి నవనవలాడే చైతన్యంతో కనిపిస్తాడు.

కడుపులో వాయువు : కడుపులో యాసిడ్‌ తయారవుతూ హైపర్‌ ఎసిడిటీతో బాధపడే వాళ్ళకు పాలు మంచి ఆహారం. పాలు జీర్ణం కావటానికి యాసిడ్‌ అధికంగా కావాల్సివస్తుంది. పాలలో ఉండే ఆల్కలైన్‌ని తయారుచేసే పదార్థాల వల్ల శరీరంలోని యాసిడ్‌ స్థితిని ప్రేరేపించే పరిస్థి తులు చాలా త్వరగా సాధారణ స్థి తికి వచ్చేస్తాయి.

నిద్రలేమి : నిద్రలేమితో బాధపడే వాళ్ళకు పాలు పరప్రసాదం లాంటివి. నిత్యం నిద్రపట్టక బాధపడే వాళ్ళు రోజూ రాత్రి పడుకోబోయే ముందు గ్లాసెడు పాలలో తేనెను కలుపుకుని తాగాతే కొన్నాళ్టికి కమ్మని నిద్రకు చేరువవుతారు!

శ్వాస సంబంధవ్యాధులు : జలుబు, గొంతు బొంగురుపోవటం, ఉబ్బసం, టాన్సిలైటిస్‌, బ్రాంకైటిస్‌ లాంటి వ్యాధులకు పాలు దివ్యౌవషధంలా పనిచేస్తాయి. గ్లాసెడు మరగ కాచిన పాలలో చిటికెడు పసుపు, కొద్దిగా మిరియాల పొడి కలుపుకుని రోజూ రాత్రుల తాగితే శ్వాసకోశ సంబంధ ఇబ్బందులకు మూడు రోజులలో సత్ఫలితం లభిస్తుంది.

ఎముకల ఆరోగ్యానికి: పాలు విటమిన్ డి, ప్రోటీన్, కాల్షియంని కలిగివుంటాయి. ప్రతిరోజు పాలు తగడము వలన ఎముకలు బలముగ తయారు అవుతాయి.గర్భిణీ స్త్రీలు ప్రతి రోజు మూడు కప్పుల పాలు తాగాలని  USDA సిఫార్సు చేసింది.
హృదయ వ్యాధి : ఇటీవల జరిగిన వెల్ష్ మెన్ అధ్యయనం ప్రకారం పాలు ఎక్కువ తాగే వాళ్ళలో కంటే తక్కువ తాగే వాళ్ళలో గుండె పోటు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.చర్మవ్యాధులు : పాలపైని మీగడలో కొద్దిపాటి వినెగార్‌, చిటికెడు పసుపు కలిపి గాయాలు, పుళ్ళు, గజ్జి మొదలైన వాటిమీద పూస్తే అవి త్వరలోనే తగ్గిపోతాయి.

సౌందర్య సాధనంగా : కాస్మెటిక్స్‌లాంటి సౌందర్య సాధనాలలో కూడా పాలు చక్కగా ఉపకరిస్తాయి. రాత్రులు మరగ కాచిన గ్లాసెడు పాలలో ఒక తాజా నిమ్మకాయ రసాన్ని పిండి పది నిమిషాల తర్వాత చేతులు, మొహం, మెడ, భుజాలకు రాసుకుని ఆరబెట్టాలి. అలాగే పడుకుని మర్నాడు ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుగుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే కొన్నాళ్టికి శరీరంలో మెరుపు, మృదుత్వం వస్తాయి. పచ్చిగుడ్డు సొనను పాలలో కలుపుకుని ప్రతిరోజూ ఆ మిశ్రమంతో తలంటుకంటే జుట్టు పెరగటమే కాదు. ఏరకమైన మాడుకు సంబంధించిన చర్మవ్యాధులూ ఇంక మీ దరికి చేరవు.

పాడి పరిశ్రమలో ఆవుపాలు, గేదెపాలు ఉత్పత్తి చేసినా ప్రపంచ వ్యాప్తంగా ఆవు పాలు మాత్రమే అధిక స్థాయిలో ఉత్పత్తిచేస్తున్నారు. ఇదే ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. అమెరికా, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలలో 90 శాతం పాలు జెర్సీ ఆవులనుంచే తయారౌతుంది. పాల ఉత్పత్తిలో భారతదేశం, అమెరికా మొదటి, రెండు స్థానాలలో ఉన్నాయి. భారతదేశంలో అమూల్ సహకార సంస్థ అత్యంత విస్తృతమైనది.

గ్రామాల్లో గతంలో ఏ ఇంట చూసినా పాడిగేదెల పోషణ ఉండేది. గ్రామీణ ప్రాంతాల్లో అప్పట్లో కొనేవారు తక్కువగా ఉండేవారు. అప్పట్లో పాలు, పెరుగు అమ్ముకోవడం నామోషిగా భావించేవారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా గేదెల పెంపకం తగ్గిపోవడంతో పాలకు కొరత ఏర్పడుతోంది. అమ్మకాలకు అనుగుణంగా పాల ఉత్పత్తికావడం లేదు.లీటరు పాల ధర రూ. 45లకు విక్రయిస్తేనే గిట్టుబాటవుతుందని ఉత్పత్తిదారులు వాపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గేదెలను పోషించే వారు తాము వినియోగించుకోగా మిగిలిన పాలను విక్రయిస్తున్నందువలన గిట్టుబాటు ధర గురించి ఆలోచించడం లేదు.
అయితే వ్యాపార ధోరణితో ఈ వృత్తిని చేపట్టినవారు గిట్టుబాటు కాకపోవడంతో ఆ వృత్తిని వదిలేస్తున్నారు.గ్రామీణ ప్రాంతాల్లోని పాల కేంద్రాల వద్ద ప్రస్తుతం పాలు పోసేవారి కంటే పాలు కొనేవారే ఎక్కువ సంఖ్యలో క్యూ కడుతున్నారు.




#Article 88: పండు (180 words)


ఫలాలు లేదా పండ్లు (జర్మన్: Früchte, ఫ్రెంచ్, ఆంగ్లం: Früits, స్పానిష్: Frutas ) చెట్టు నుంచి వచ్చు తిను పదార్దములు. రకరకాల పండ్లు వివిధ రుచులలో మనకు ప్రకృతిలో లభిస్తున్నాయి. ఆవృత బీజ మొక్కలలో ఫలదీకరణం తర్వాత అండాశయం ఫలంగాను, అండాలు విత్తనాలుగాను అభివృద్ధి చెందుతాయి. ఫలం లోపల విత్తనాలు ఏర్పడడం ఆవృతబీజాల ముఖ్య లక్షణం. ఇలా ఫలాలు ఏర్పడడానికి కొన్ని వారాల నుంచి కొన్ని సంవత్సరాల వరకు పడుతుంది.

ఫలదీకరణ ఫలితంగా అండాశయంతో పాటు మరియే ఇతర పుష్పభాగం అయినా ఫలంగా పెరిగితే దానిని 'అనృత ఫలం' అంటారు. ఉ. ఆపిల్లో పుష్పాసనం, జీడిమామిడిలో పుష్పవృంతం ఇలా ఏర్పడిన అనృత ఫలాలు.

నిజ ఫలాలు ఫలదీకరణ చెందిన అండాశయం నుంచి ఏర్పడతాయి. నిజఫలాలలో ఫలకవచం, విత్తనాలు అనే రెండు భాగాలుంటాయి. నిజఫలాలు మూడు రకాలు.  

ఒక పుష్పంలోని సంయుక్త అండకోశంలోని అండాశయం నుంచి ఏర్పడే ఫలాన్ని 'సరళ ఫలం' అంటారు. సరళ ఫలాలలోని ఫలకవచ స్వభావాన్ని బట్టి రెండుగా విభజించారు.

ఒకే పుష్పంలోని బహుఫలదళ అసంయుక్త అండకోశంలోని అండాశయాల నుంచి ఏర్పడే నిజఫలాలు. ప్రతిఫలదళంలోని అండాశయం ఒక చిరుఫలంగా (Fruitlet) అభివృద్ధి చెందుతుంది. ఈ చిరుఫలాలన్నీ ఒకే పుష్పవృంతం మీద సంకలితం చెంది (గుమిగూడి) ఒక సంకలిత ఫలాన్ని ఏర్పరుస్తాయి. ఉ. సీతాఫలం

పుష్పవిన్యాసం, దాని అనుబంధ భాగాలు మొత్తం ఒకే ఫలంగా అభివృద్ధి చెందితే దాన్ని 'సంయుక్త ఫలం' అంటారు. అన్ని పుష్పాల నుంచి ఏర్పడే ఫలాలన్నీ కలసిపోయి, పక్వదశలో ఒకే ఫలంగా మారతాయి. ఇవి రెండు రకాలు.

Lenovo laptop === ఆహార పదార్ధాలు ===

నేను

పండ్లను కాల్షియం కార్బైడ్‌తో మగ్గబెట్టడం స్థానే ఇథలీన్‌ను ఉపయోగించడం సురక్షితమని భావిస్తున్నారు.




#Article 89: అరటి (657 words)


అరటి ఒక చెట్టులా కనిపించే మొక్క (హెర్బ్) మాత్రమే. ఇది మూసా అను ప్రజాతికి, మ్యుసేసియె కుటుంబానికి చెందినది

అరటికి చీడపీడల బెడద కొద్దిగా ఎక్కువ. దానికి కారణాలలో ఒకటి జన్యుపరమైన వైవిధ్యము లేకపోవడము అని భావిస్తారు. ఇవి ఎక్కువగా స్వపరాగ సంపర్కము వల్ల వృద్ధిపొందటము వల్ల జన్యుపరమైన వైవిధ్యము లేకపోవడానికి కారణంగా భావిస్తారు. కాండము ద్వారా ఫలదీకరణము చేయుపద్ధతి వల్ల వైరసులు చాలా తేలికగా వ్యాపిస్తాయి. 

అరటిపండులో ముందే చెప్పుకున్నట్లు 74% కన్నా ఎక్కువగా నీరు ఉంటుంది. 23% కార్బోహైడ్రేటులు, 1% ప్రోటీనులు, 2.6% ఫైబరు ఉంటుంది. ఈ విలువలు వాతావరణాన్ని, పక్వదశనుబట్టి, సాగు పద్ధతిని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. పచ్చి అరటిపండులో కార్బోహైడ్రేటులు స్టార్చ్ రూపములో ఉంటాయి, పండుతున్న కొద్దీ ఇవి చక్కరగా మార్పుచెందబడతాయి. అందుకే పండు అరటి తియ్యగా ఉంటుంది. పూర్తిగా మాగిన అరటిలో 1-2% చక్కర ఉంటుంది. అరటిపండు మంచి శక్తిదాయకమైనది. అంతే కాకుండా ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. అందువల్ల ఇది రక్తపోటుతో బాధపడుతున్నవారికి చాలా విలువైన ఆహారం. అరటిపండు, పెద్ద పేగు వ్యాధిగ్రస్తులకు చాలా చక్కని ఆహారం. అందుకే అరటి పండు పేదవాడి ఆపిలు పండు అని అంటారు. ఎందుకంటే, రెండింటిలోనూ పోషక విలువలు సమానంగానే ఉంటాయి. కాని, అరటి పండు చవక, ఆపిలు పండు ఖరీదు.

అరటితో రకరకాలైన వంటకాలు చేసుకోవచ్చు. అరటి కూర, అరటి వేపుడు, అరటి బజ్జీ మొదలైనవి. అరటితో అల్పాహారాలు, అరటి పండు రసాలు కూడా చేసుకోవచ్చు. బనానా చిప్స్‌ అనునది అరటి కాయ నుండి తయారు చేయు ఓ అల్పాహారం. ఇది ప్రపంచ వ్యాప్తంగా బహు ప్రసిద్ధి. చాలా కంపెనీలు దీని వ్యాపారం లాభదాయకంగా నిర్వహిస్తున్నాయి. భారతదేశంలో, ముఖ్యముగా ఆంధ్ర ప్రదేశ్ లోని నగరాలు, పట్టణాలలో ఇవి చాలా విరివిగా లభిస్తాయి. మామూలు బంగాళదుంప లేదా ఆలూ చిప్స్‌ కన్నా కొద్దిగా మందంగా ఉంటాయి. కేరళ వాళ్ళు వీటిని కొబ్బరి నూనెతో వేయించి తయారు చేస్తారు. అవి ఓ ప్రత్యేకమైన వాసన, రుచి కలిగి ఉంటాయి. అరటి పండ్లను జాం తయారు చెయ్యడంలో కూడా ఉపయోగిస్తారు. అరటి పండ్లను పండ్ల రసాలు తయారు చేయడం లోనూ, ఫ్రూట్‌ సలాడ్‌ లలోనూ, ఉపయోగిస్తారు. అరటి పండ్లలో సుమారుగా 80% నీళ్ళు ఉన్నప్పటికీ, చారిత్రకంగా వీటినుండి రసం తీయడం అసాధ్యంగా ఉండినది, ఎందుకంటే వీటిని మిక్సీలో పట్టినప్పుడు అది గుజ్జుగా మారిపోతుంది. కానీ 2004 వ సంవత్సరంలో భాభా ఆటామిక్‌ పరిశోధనా సంస్థ (బార్క్‌) వారు ఓ ప్రతేకమైన పద్ధతి ద్వారా అరటి పండ్లనుండి రసాలు తయారు చేయడం రూపొందించి, పేటెంటు పొందినారు. ఈ పద్ధతిలో అరటి పండ్ల గుజ్జును సుమారుగా నాలుగు నుండి ఆరు గంటల పాటు ఓ పాత్రలో చర్యకు గురిచేయడం ద్వారా పండ్ల రసాన్ని వెలికితీస్తారు.

పూర్వం అతిథులు ఇంటికి వచ్చినప్పుడు అరటి ఆకులో భోజనం పెట్టేవారు. అరటి ఆకులోని భోజనంలో విషం కలిపితే ఆకు నల్లగా మారిపోతుంది. అందుకే ఇంటికి వచ్చిన అతిథుల మనసులో అనుమానం రాకూడదనే ఉద్దేశంతోనే అరటి ఆకులో భోజనం పెట్టేవారు 

ఇతరుల ఇండ్లకు లేదా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు భోజనం చేసిన తరువాత అరటి ఆకు మనవైపు మడవాలి. అటువైపు మడిస్తే సంబంధాలు చెడిపోతాయని నమ్మకం.  

ఓ దశాబ్దంలో ఆహారంగా స్వీకరించు అరటి జాతి అంతరించు ప్రమాదంలో ఉంది. ప్రస్తుతము ప్రపంచ వ్యాప్తముగా తిను కావెండిషు అరటి (మన పచ్చ అరటి ?) జన్యుపరంగా ఎటువంటి వైవిధ్యాన్నీ చూపలేకపోవడం వల్ల వివిధ రకాల వ్యాధులకు గురిఅవుతుంది. ఉదాహరణకు 1950 లో పనామా వ్యాధి, ఇది నేల శిలీంధ్రము (ఫంగస్) వల్ల వచ్చి ‌బిగ్ మైక్ రకానికి చెందిన అరటి జాతిని పూర్తిగా తుడిచిపెట్టినది. నల్ల సిగటోక (black sigatoka) వ్యాధి. ఇది కూడా మరో రకం శిలీంధ్రము వల్ల వచ్చిన వ్యాధే కానీ చాలా త్వరితగతిన వ్యాపించింది. ముఖ్యముగా మధ్య అమెరికా లోనూ ఆఫ్రికా, ఆసియా ఖండములలో ఇది వ్యాపించింది.

ట్రోపికల్ జాతి 4 అనబడు ఓ క్రొత్త వ్యాధికారకము కావెండిషు (పచ్చ అరటి?) జాతికి చెందిన అరటితోటలపై ప్రభావం చూపుతుంది. దీని ప్రభావము వల్ల... వాయువ్య ఆసియాలో అందువల్ల ఇక్కడినుండి వచ్చే అరటి ఎగుమతులపై కొద్దిగా జాగ్రత్త వహించడం ప్రారంభం అయింది. ఈ వ్యాధి వ్యాపించకుండా ఇతర దేశాలవాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకొంటూ మట్టినీ, అరటి పండ్లను జాగ్రత్తగా పరిశీలించసాగారు.

గ్రాస్ మికేలు లేదా బిగ్ మైక్ అను రకానికి చెందిన అరటిది ఒక విషాద కథ. ఇది పనామా వ్యాధి వల్ల 1950లో పూర్తిగా తుడిచిపెట్టబడింది. ఈ బిగ్ మైక్ రకం సమ శీతల, లేదా శీతల దేశాలకు ఎగుమతి చేయడానికి చాలా అనువుగా ఉండేది. కొంతమంది ఇప్పటికీ దీని రుచిని మరిచిపోలేక ప్రస్తుతము లభిస్తున్న పచ్చ అరటి కన్నా బిగ్ మైక్ రుచికరంగా ఉంటుంది అంటూ వాదిస్తుంటారు! అంతే కాకుండా రవాణాకు కూడా బిగ్ మైక్ చాలా అనుకూలంగా ఉండేది, అదే పచ్చ అరటి రవాణా విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉంది.

అరటి ప్రపంచంలో ఎక్కువగా తినే పండు. కానీ చాలామంది అరటి సాగుబడిదారులకు మాత్రం మిగిలేది, లేదా గిట్టుబాటయ్యేది చాలా స్వల్ప మొత్తాలలోనే. మధ్య అమెరికా ఎగుమతులలో అరటి, కాఫీ సింహభాగాన్ని ఆక్రమిస్తున్నాయి. ఎగుమతులలో ఇవి రెండు కలిపి 1960లో 67 శాతం వాటా కలిగిఉన్నాయి. బనానా రిపబ్లికు అను పదం స్థూలంగా మధ్య అమెరికాలోని అన్ని దేశాలకూ వర్తించినప్పటికీ నిజానికి కోస్టారికా, హోండూరస్, పనామాలు మాత్రమే నిజమైన బనానా రిపబ్లికులు. ఎందుకంటే వీటి ఆర్థికవ్యవస్థ మాత్రమే అరటి వ్యాపారంపై ఆధారపడి ఉంది.

అరటి పండు చాలా ప్రముఖమైన, ప్రసిద్ధి పొందిన పండు. ఇది చాలా మందికి ఇష్టమైన పండు. కానీ కోతులు, కొండముచ్చులు అరటిపండును రకరకాల పద్ధతిలో తినే ఫోటోలు చాలా ప్రసిద్ధి పొందటంవల్ల ఈ అరటి పండు అనే పదాన్ని కొన్ని ప్రాంతాలలో జాతిపరమైన అపహాస్యములకు ఉపయోగించారు. ముఖ్యముగా ఆటగాళ్ళపై అరటిపండు తొక్కలు విసిరివేయడం, కుళ్ళిన టమాటాలు, కోడిగుడ్లు అంత ప్రసిద్ధి. 
మలేషియాలోనూ, సింగపూరులోనూ అరటిపండును చైనీసు భాష రాని, లేదా ఎక్కువగా ఆంగ్లేయుడిలాగా ప్రవర్తిస్తున్న చైనీయునికి పర్యాయపదంగా వాడతారు. ఎందుకంటే అరటిపండుకూడా పైన పసుపు, లోన తెలుపు కాబట్టి.

బాల సాహిత్యంలో అరటిపాట అనే పాట ప్రాచుర్యం పొందింది. సరళమైన ఈ పాట ఆరంభ తరగతుల పుస్తకాలలో పాఠ్యాంశంగా కూడా చేర్చారు.




#Article 90: జానపద గీతాలు (186 words)


జానపదమనగా జనపదానికి సంబంధించింది. జనపదమనగా పల్లెటూరు. జనపదమున నివసించు వారు జానపదులు, వారు పాడుకొను పాటలు జానపదములు. జానపద గీతాలు: జానపదులు పాడుకునే గీతాలను జానపద గీతాలు leda jaanapada geyalu ani అంటారు. వీటినే ఆంగ్లములో folk songs అని అంటారు. తెలుగు జానపద గీతాలు చాలా పురాతన కాలమునుండి వస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయము ఏమిటంటే ఈ జానపదగీతాలలో కొన్నిసార్లు చక్కని ఛందస్సు కూడా ఉంటుంది. పదకవితా పితామహుడు అన్నమాచార్యుల వారు ఆ కాలంలో ప్రసిద్ధములైన జానపద బాణీలలో చాలా పదములు రాసారు. 
(వర్గం:జానపద సాహిత్యం)




#Article 91: యాదగిరిగుట్ట (493 words)


యాదగిరిగుట్ట, తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఒక మండల కేంద్రం.ఇది జనగణన పట్టణం

ఇది హైదరాబాదు నుండి వరంగల్లు వెళ్లు రహదారిలో 50 కి.మీ. దూరంలో ఉంది.తెలంగాణలో పేరు పొందిన ఆద్యాత్మిక పుణ్యక్షేత్రం యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఇక్కడ ఉంది.

 

పూర్వం యాద మహర్షి అనబడే ముని ఇచ్చట తపస్సు చేసి ఆ నారసింహుని దర్శనం పొందాడు. ఆ ముని కోరిక ప్రకారంగా ఈ కొండ యాదగిరి అని పిలవబడుతుంది. 

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక దివ్య క్షేత్రం. యాదాద్రికి సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలో ఉంది. విభాండక ఋషి కుమారుడు రుష్యశృంగుడు. అతని కుమారుడు హాద ఋషి. అతనినే హాదర్షి అని కూడా అంటారు. అతను నరసింహ స్వామి భక్తుడు. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. ఆంజనేయస్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నరసింహ మూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని యాదర్షి కోరగా స్వామి వారు కరుణించి లక్ష్మి సమేతుడై దర్శన మిచ్చి ఏంకావాలో కోరుకో మంటే యాదర్షి స్వామి వారికి శాంత మూర్తి రూపంలోనె కొలువై కొండపై ఉండి పొమ్మని కోరాడు. ఆవిధంగా లక్ష్మి నరసింహ స్వామి కొండపై అలా కొలువై ఉండి పోయాడు. కొన్నాళ్ళకు స్వామివారిని వేర్వేరు రూఫాల్లో చూడాలనిపించి యాదర్షి మరలా తపస్సు చేశాడు. అతని కోరిక మేరకు స్వామి వారు జ్వాలా, యోగా, నంద, గండబేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచ నారసింహ క్షేత్రం అంటారు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరుమీద ప్రసిధ్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ క్రింద వున్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయస్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా ఉన్నాడు. చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడా నివారణ, వగైరా కోరికలతో కొన్నాళ్ళపాటు ఇక్కడ వుండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు. అంతేగాక ఇప్పటికీ రోజూ రాత్రుళ్ళు ఆ చుట్టుప్రక్కల కొండలమీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని అర్చిస్తారుట. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పడు మృదంగ ధ్వనులువినిపిస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారుట. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనమంటారు.
యాదగిరి గుట్టకు ప్రవేశ ద్వారము

మెట్ల మార్గాన వెళ్తే దోవలో శివాలయం కనబడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభూగా వెలిశాడు. ఇంకో విశేషం .. ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించినవారి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రములో రెండు లక్ష్మీ నరసింహస్వామి ఆలయములు ఉన్నాయి. పాత లక్ష్మీనరసింహస్వామివారి ఆలయము. కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయము.

మరొక కథనం ప్రకారం లక్ష్మీ నరసింహస్వామివారు మొదట పాత లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వెలసి తరువాత కొత్త లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయమునకు గుర్రముమీద వెళ్ళేవారు. మనము ఇప్పటికీ ఆ గుర్రపు అడుగులు ఆదారిన చూడవచ్చు. ఈ గుర్తులు పాత లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం నుండి కొత్తలక్ష్మీనరసింహస్వామివారి ఆలయము వరకు ఉన్నాయి. పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయంనందు, ఆంజనేయ స్వామి వారి ఆలయము కూడా ఉంది. అక్కడ గోడ మీద ఉన్న చిత్రములు చాలా అద్భుతముగా ఉన్నాయి. అక్కడ నుండి కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయమునకు వెళ్ళు దారిలో ఆంజనేయ స్వామి వారి మరొక ఆలయము కూడా ఉంది. ఈ ఆలయగర్భగుడిలో స్వామివారి వద్ద నిత్యము ఒక జల ప్రవాహము ఉంది. ఆ జలముతోనే నిత్యము స్వామివారికి అభిషేకం చేస్తారు.

ప్రధాన వ్యాసం: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం 

రాయగిరి రైల్వేస్టేషను ఇక్కడికి చాలా దగ్గరలో ఉంది. యాదగిరి బస్టాండుకు హైద్రాబాదు, వరంగల్, నల్గొండల నుండి చాలా బస్సులు ఉన్నాయి.హైదరాబాదు మహాత్మా గాంధీ ప్రయాణ ప్రాంగణము (ఎంజి.బి.ఎస్) నుండి యాదగిరిగుట్టకు ఉదయము గం.4.30 ని.లకు మొదటి బస్సు ఉంది.

భువనగిరి డివిజన్ మొత్తానికి యాదగిరిగుట్టలోనే బస్ డిపో ఉంది. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం కావడంతో ఇక్కడికి నిత్యం భక్తుల రద్తీ ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఉన్న బస్సులు వచ్చిపోయే ప్రయాణికులకే సరిపోని పరిస్థితి నెలకొంది. ఈ డిపోలో 101 బస్సు ఉన్నాయి. మరో 8 ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకొని నడుపుతున్నారు. వీటిలో 34 ఎక్స్‌ప్రెస్‌లు, 4 డీలక్స్ బస్సులున్నాయి. ప్రయాణికుల అవసరాలు తీర్చాలంటే కనీ సం మరో 70 బస్సులు కావాల్సి ఉంది. గుట్ట నుంచి వేములవాడ, కాళేశ్వరం, భద్రాచలం, ధర్మపురి తదితర పుణ్యక్షేత్రాలకు బస్సులు నడపాల్సిన అసరం ఉంది. వీటితో పాటు హై దరాబాద్ నుంచి హన్మకొండ వరకు బస్సులను నడపాలని అధికారులు యోచిస్తున్నారు. గుట్ట నుంచి తిరుపతి పుణ్యక్షేత్రానికి నేరుగా బస్ సౌకర్యం లేకపోవడం దురదృష్టకరం.




#Article 92: కంప్యూటరు భాషలు (326 words)


భాష నునది మనిషి మనిషి మాట్లాడుకోవడానికే కాకుండా కంప్యూటర్లుతో మాట్లాడటానికి కూడా ఉపయోగ పడతాయి అసలు కంప్యూటరునకు అర్దమవ్వునది రెండే రెండు సున్నా, ఒకటి
వీటినుండి మెషను భాష లేదా యాంత్రిక భాష తయారు చేసారు కాని వీటిలో మనము కంప్యూటరుతో మాట్లాడటం కష్టం కనుక ఇతర భాషలు తయారు చేసారు వీటిని మూడు రకాలగా విభజించవచ్చు భాష రకాలు. మెషిన్ మరియు అసెంబ్లీ భాషలు. అల్గోరిథమిక్ భాషలు.  వ్యాపార ఆధారిత భాషలు. COBOL. ఎస్ క్యూఎల్. విద్య-ఆధారిత భాషలు. హైపర్ టాక్. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ భాషలు. డిక్లేరేటివ్ భాషలు మొదలైనవి . ఇవి కంప్యూటర్ కు ఆదేశాలను కమ్యూనికేట్ చేయడం కొరకు డిజైన్ చేయబడ్డ కృత్రిమ భాషలు.

ఇవి కంప్యూటరు నేరుగా అర్దము చేసుకొను భాషలు

ఇవి మిడిల్ లెవెలు భాషలు అన్నమాట, వీటిని మనుషులు కూడా తేలికగా అర్ధము చేసుకొనవచ్చు. కంప్యూటర్లు ఈ భాషలను అర్ధము చేసుకొవాలంటే పూర్తిగా మెషిను భాషలోనికి మార్చుకొని మాత్రమే అర్ధము చేసుకుంటాయి
ఉదాహరణ: సీ, సీ ప్లస్ ప్లస్, ఇతరములు

ఇవి మనకు తేలికగా అర్ధము అవ్వడానికి

కన్ స్ట్రక్షన్ లాంగ్వేజ్, కాన్ఫిగరేషన్, టూల్ కిట్ మరియు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లను కలిగి ఉండే ఒక సాధారణ కేటగిరీ

కమాండ్ లాంగ్వేజ్, ఇతర ప్రోగ్రామ్ లను ప్రారంభించడం వంటి కంప్యూటర్ యొక్క విధులను నియంత్రించడానికి ఉపయోగించే భాష.

ఆకృతీకరణ భాష, ఆకృతీకరణ ఫైళ్లను వ్రాయడానికి ఉపయోగించే భాష

ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మెషిన్ కు, మరిముఖ్యంగా కంప్యూటర్ కు ఆదేశాలను కమ్యూనికేట్ చేయడం కొరకు డిజైన్ చేయబడ్డ ఫార్మల్ లాంగ్వేజ్.

అసెంబ్లీ లాంగ్వేజ్, మెషిన్ లాంగ్వేజ్ యొక్క ఒక కుటుంబానికి దగ్గరగా ఉండే భాష, మరియు ఇది రాయడం సులభతరం చేయడానికి నిమోనిక్స్ ని ఉపయోగిస్తుంది.

స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, టాస్క్ ల యొక్క అమలును ఆటోమేట్ చేసే ప్రత్యేక రన్ టైమ్ ఎన్విరాన్ మెంట్ కొరకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్; మానవ ఆపరేటర్ ద్వారా ఒక-ద్వారా అమలు చేయబడ్డ టాస్క్ లను ప్రత్యామ్నాయంగా అమలు చేయవచ్చు.

మెషిన్ లాంగ్వేజ్ లేదా మెషిన్ కోడ్, కంప్యూటర్ యొక్క సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా నేరుగా అమలు చేయబడ్డ ఆదేశాల సెట్

మార్కప్ లాంగ్వేజ్, HTML వంటి టెక్ట్స్ నుంచి సింటాక్టికల్ గా వేరు చేసే విధంగా డాక్యుమెంట్ ని యానోటేట్ చేయడానికి ఒక గ్రామర్.

లైట్ వెయిట్ మార్కప్ లాంగ్వేజ్

మోడలింగ్ లాంగ్వేజ్, సమాచారాన్ని లేదా పరిజ్ఞానాన్ని వ్యక్తీకరించడానికి ఉపయోగించే ఒక సంప్రదాయ భాష, తరచుగా కంప్యూటర్ సిస్టమ్ రూపకల్పనలో ఉపయోగించడానికి

ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ లను మోడల్ చేయడానికి ఉపయోగించే హార్డ్ వేర్ వివరణ భాష

పేజీ వివరణ భాష, వాస్తవ అవుట్ పుట్ బిట్ మ్యాప్ కంటే అధిక స్థాయిలో ప్రింట్ చేయబడ్డ పేజీ యొక్క అప్పియరెన్స్ ని వివరిస్తుంది.

క్వైరీ లాంగ్వేజ్, డేటాబేస్ లు మరియు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ల్లో క్వైరీలను చేయడానికి ఉపయోగించే భాష.

అనుకరణ భాష, అనుకరణలను వర్ణించడానికి ఉపయోగించే ఒక భాష

స్టైల్ షీట్ లాంగ్వేజ్, సిఎస్ ఎస్ వంటి నిర్మాణాత్మక డాక్యుమెంట్ ల యొక్క ప్రజంటేషన్ ని వ్యక్తీకరించే కంప్యూటర్ లాంగ్వేజ్.




#Article 93: కాణిపాకం (613 words)


ఈ పుణ్యక్షేత్రం బాహుధా నది ఉత్తరపు ఒడ్డున, తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై, చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉంది. కాణిపాకంలో అనేక ప్రాచీన ఆలయాలున్నాయి. ఇక్కడ జనమేజయుడు కట్టించాడని అనుకునే ఒక పాత దేవాలయము ఉంది. మణికంఠేశ్వర స్వామి ఆలయాన్ని చోళ రాజైన రాజరాజేంద్ర చోళుడు కట్టించాడు. ఈ ఆలయంలోని అద్భుతమైన శిల్పసంపద చోళ విశ్వకర్మ శిల్పిశైలికి తార్కాణంగా పేర్కొనబడుతుంది. ఇటీవల కాలంలో వరసిద్ధి వినాయకుని ఆలయం ప్రశస్తి పొందింది.

కాణి అంటే పావు ఎకరా మడిభూమి లేదా మాగాణి అని, పారకం అంటే నీళ్లు పొలంలోకి పారటం అని అర్ధం. చరిత్ర ప్రకారం ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు వుండేవారు. వారు ముగ్గురు మూడు రకాల అవిటితనాలతో బాధపడేవారు, ఒకరు గుడ్డి, ఇంకొకరు మూగ మరొకరికి చెవుడు. వారికి వున్న చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. పూర్వకాలంలో నూతి నుండి ఏతాంలతో నీటిని తోడేవారు. ముగ్గిరిలో ఒకరు క్రింద వుంటే ఇద్దరు ఏతాం పైన వుండి నీరు తోడేవారు. అలా వుండగా ఒక రోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానితో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా త్రవ్వటం మొదలు పెట్టాడు. కాసేపటి తరువాత గడ్డపారకు రాయిలాంటి పదార్దం తగలటంతో ఆపి క్రింద జాగ్రత్తగా చూశాడు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూసి నిశ్చేత్రుడయ్యాడు. కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయింది.మహిమతో ముగ్గిరి అవిటితనం పూర్తగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. ఈ విషయం విన్న చుట్టుప్రక్కల గ్రామస్థులు తండోపతండోలుగా నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతు త్రవ్వటానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయాంభు విగ్రహం వూరే నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభువుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. ఈ కొబ్బరి నీరు ఒక ఎకరం పావు దూరం చిన్న కాలువలా ప్రవహించింది. దీన్ని కాణిపరకం అనే తమిళ పదంతో పిలిచేవారు, రానురాను కాణిపాకంగా పిలవసాగారు. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే వుంటుంది. అక్కడ ప్రాంగణములోనే ఒక్క బావి కూడా వున్నది దానిలో స్వామి వారి వాహనము ఎలుక ఉంది. అక్కడ స్వామివారికి, మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలి వెస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి.

 కొత్తపల్లె 1 కి.మీ. చిగరపల్లె 1 కి.మీ. కొత్తపల్లె 2 కి.మీ. ఉత్తర బ్రాహ్మణ పల్లె 2 కి.మీ. పట్నం 2 కి.మీ. దూరములో ఉన్నాయి.

ఈ గ్రామములో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది.

కాణిపాకం ప్రాంతంలో వివిధ దేవతల ఆలయాలు ఉన్నాయి.వరసిద్ది వినాయకుని ఎదురుగా ఒక మంచి నీటి కోనేరు,ఒక విన్నూతమైన మండపం ఉన్నాయి

చెరకు, వరి, మామిడి, వేరుశనగ కూరగాయలు ఇక్కడి ప్రధాన పంటలు.

ఇక్కడి ప్రధాన వృత్తులు, వ్యవసాయము, వ్వవసాయాధార పనులు, వ్యాపారము.

కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు. సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామి వారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్థి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామి వారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్దీకులు సిద్ధం కారు. కాణిపాకంలో ప్రమాణం చేస్తారా? అంటూ సవాల్ విసురుతారు. ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు.
స్వయంభువు వరసిద్ధి వినాయకస్వామి గుడికి వాయవ్య దిశగా ఉన్న మణికంఠేశ్వరస్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం.బ్రహ్మహత్యా పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారని ప్రసిద్ధిచెందింది
ఇక్కడే వరసిద్ది వినాయక ఆలయంతో పాటు అదే కాలంలో నిర్మించిన శివాలయం, వరదరాజ స్వామి ఆలయాలు ఉన్నాయి. స్వామి వారి ఆలయానికి వాయువ్వ దిశలో మరకతాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయం, ఈశాన్య దిశలో వరదరాజ స్వామి ఆలయం ఉన్నాయి. వరదరాజస్వామి ఆలయంతో కాణిపాకం హరిహర క్షేత్రమైనది. ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే ద్వారపాలకునిగా వీరాంజనేయ స్వామి ఆలయం, నవగ్రహ ఆలయాలున్నాయి.

కాణిపాకంఅన్నది చిత్తూరు జిల్లాకు చెందినా ఐరాల తాలూకాలోని గ్రామం, ఇది 2011 జనగణన ప్రకారం 1267 ఇళ్లతో మొత్తం 4960 జనాభాతో 729 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన చిత్తూరు 12 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2500, ఆడవారి సంఖ్య 2460గా ఉంది. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1531 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 21. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 596496[1].

ఈ గ్రామములో 6 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 1 ప్రైవేటు ప్రాథమిక పాఠశాల, 2 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు, 1 ప్రైవేటు మాధ్యమిక పాఠశాల, 1 ప్రభుత్వ సీనియర్ మాధ్యమిక పాఠశాలలు, ఉన్నాయి.
సమీప బాలబడి, అనియత విద్యా కేంద్రం (ఐరాలలో), సమీప ఆర్ట్స్, సైన్స్, కామర్సు డిగ్రీ కళాశాల, సమీప ఇంజనీరింగ్ కళాశాలలు (చిత్తూరులో), వైద్య కళాశాల, మేనేజ్మెంట్ సంస్థ తిరుపతిలో,, పాలీటెక్నిక్, వృత్తి విద్యా శిక్షణ పాఠశాల,, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, ఈ గ్రామానికి 10 కి.మీ కన్న దూరంలో ఉన్నాయి.

గ్రామంలో వ్యవసాయానికి నీటి పారుదల వనరులు ఇలా ఉన్నాయి (హెక్టార్లలో):
బావులు/గొట్టపు బావులు: 76.49

ఈ గ్రామంలో ఈ కింది వస్తువులను ఉత్పత్తి అవుతున్నవి (పై నుంచి కిందికి తగ్గుతున్న క్రమంలో):
చెరకు, బెల్లం, వేరుశనగ
వర్గం:చిత్తూరు వర్గం:ఐరాల మండలంలోని గ్రామాలు) వర్గం:జిల్లా గ్రామాలు)




#Article 94: శ్రీకాళహస్తి (1894 words)


శ్రీకాళహస్తి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాలో ఒక పట్టణము, ఒక మండలం. ఈ పట్టణం స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే ప్రాచీనమైన, పంచభూతలింగము లలో నాల్గవ దైన వాయు లింగము గల గొప్ప శైవ పుణ్యక్షేత్రము. ఇక్కడ రెండు దీపాలలో ఒకటి ఎప్పుడూ గాలికి కదులుతూ ఉంటుంది, మరొకటి ఎల్లప్పుడు నిశ్చలముగా ఉంటుంది. ఇక్కడ ఉండే కళ్ళు చెదిరే మూడు గోపురాలు ప్రాచీన భారతీయ వాస్తు కళకు నిదర్శనాలుగా, విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల యొక్క పనితనానికి కాణాచిగా నిలుస్తాయి. వీటిలో ఎత్తైన గాలి గోపురం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడింది. బాగా పెద్దదిగా కనిపించే వెయ్యి కాళ్ళ మంటపం కూడా ప్రధాన ఆకర్షణే. కళంకారీ కళకు కాళహస్తి పుట్టినిల్లు.

సువర్ణముఖీ నదీ తీరమున వెలసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు. స్వయంభువు లింగము, లింగమునకెదురుగా వున్న దీపము లింగము నుండి వచ్చు గాలికి రెపరెపలాడును. శ్రీకాళహస్తిని 'దక్షిణ కాశీ ' అని అంటారు.
ఇక్కడి అమ్మవారు జ్ఞానప్రసూనాంబ, అంబాత్రయములలో ఒకరు. శివలింగము ఇక్కడ వర్తులాకారము వలె గాక చతురస్రముగ వుంటుంది. స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానమును ప్రసాదించిన ప్రదేశం. వశిష్ఠుడు, సాలెపురుగు, పాము, ఏనుగు, బోయడు అయిన తిన్నడు (కన్నప్ప), వేశ్య కన్యలు, యాదవ రాజు, శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మం వ్రాసిన దూర్జటి) వంటి వారి కథలు ఈ క్షేత్ర మహాత్మ్యంతో పెనవేసుకొని ఉన్నాయి.

కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తుండేవాడు . అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటినుండి నెత్తురు కార్చేడట. వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి కంటికి అమర్చాడట. అప్పుడు స్వామి రెండవకంటి నుండి కూడా నెత్తురు కారటం మొదలయింది. భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవకన్ను కూడా పీకి స్వామికి అమర్చాడు. స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తి ప్రసాదించాడు.

ఈ దేవాలయము చాలా పెద్దది, పై కప్పుపై రంగులతో చిత్రించిన అనేకములయిన చిత్రములు ఉన్నాయి.  మణికుండేశ్వరాఖ్య  అనే మందిరమువున్నది. కాశీ క్షేత్రములో వలె ఇక్కడ చనిపొయే వారికి పరమశివుడు ఓంకార మంత్రమును, తారకమంత్రమును ఉపదేశించి మోక్షము ఇచ్చునని భక్తుల నమ్మకము. దేవాలయ ప్రాంతములోనే పాతాళ విఘ్నేశ్వరాలయము ఉంది. దేవాలయమునకు సమీపములోగల కొండపై భక్త కన్నప్పకి చిన్న ఆలయము నిర్మించారు. శ్రీకాళహస్తీశ్వరాలయము రాజగోపురము యొక్క సింహద్వారము దక్షిణాభిముఖము. స్వామి వారు ఉత్తరాభిముఖులై వుంటారు. ఆదిశంకరులు ఇక్కడ శ్రీ చక్రము స్థాపించారు. ఈ క్షేత్రమునకు గల ఇతర నామములు దక్షిణకైలాసమనియు, సత్య మహా భాస్కరక్షేత్రమనియు, సద్యోముక్తిక్షేత్రమనియు, శివానందైక నిలయమనియు పేర్కొనటం జరిగింది. మహా శివరాత్రినాడు ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది.

ధూర్జటి శ్రీకాళహస్తీశ్వరుడు మీద శతకం వ్రాశాడు. అందులో శ్రీ కాళహస్తి స్థలపురాణం స్పృశిస్తూ 

ఏవేదంబు పఠించెలూత భుజంగంబే శాస్త్రముల్ చదివె తా
నేవిద్యాభ్యాసమొనర్చె కరి చెంచే మంత్రమూహించె బో 
ధావిర్భావ విధానముల్ చదువులయ్యా కావు మీపాద సం
సేవా శక్తియె కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా!

 
క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో తమిళ సంగం వంశానికి చెందిన నక్కీరన్ అనే తమిళ కవి రచనల్లో శ్రీకాళహస్తి క్షేత్రమును గురించి దక్షిణ కాశీగా చారిత్రక ప్రస్తావన ఉంది. ఇంకా తమిళ కవులైన సంబందర్, అప్పర్, మాణిక్యవాసగర్, సుందరమూర్తి, పట్టినత్తార్, వడలూర్ కు చెందిన శ్రీరామలింగ స్వామి మొదలగు వారు కూడా ఈ క్షేత్రమును సందర్శించారు.

ఆలయానికి ఆనుకుని ఉన్న కొండ రాళ్ళపై పల్లవుల శైలిలో చెక్కబడిన శిల్పాలను గమనించవచ్చు. తరువాత చోళులు పదకొండవ శతాబ్దంలో పల్లవులు నిర్మించిన పాత దేవాలయాన్ని మెరుగు పరచడం జరిగింది. ఒకటవ కులోత్తుంగ చోళుడు ప్రవేశ ద్వారం వద్దగల దక్షిణ గాలి గోపురాన్ని నిర్మించాడు. మూడవ కులోత్తుంగ చోళుడు ఇతర ఆలయాల్ని నిర్మించాడు. క్రీస్తుశకం 12వ శతాబ్దానికి చెందిన వీరనరసింహ యాదవరాయ అనే రాజు ప్రస్తుతం ఉన్న ప్రాకారాలను, నాలుగు ద్వారాలను కలిపే గోపురాలను నిర్మించాడు. క్రీస్తుశకం 1516 విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయల రాతిపై చెక్కించిన రచనల ఆధారంగా ఆయన వంద స్తంభాలు కలిగిన మంటపం, అన్నింటికన్నా తూర్పు పడమర దిక్కుల వైపుకు ఉన్న ఎత్తైన గాలిగోపురం నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ గోపురాన్ని 1516 వ సంవత్సరంలో గజపతులపై విజయానికి సూచనగా నిర్మించినట్లు తెలియజేస్తుంది. ఈ గోపురం 2010 మే 26 న కూలిపోయింది. పది సంవత్సరాలుగా గోపురంలో అక్కడక్కడా పగుళ్ళు కనిపిస్తున్నప్పటికీ దానికి ఆలయ అధికారులు మరమ్మత్తులు చేస్తూ వస్తున్నారు అయితే కూలిపోక ముందు కొద్ది రోజుల క్రితం సంభవించిన లైలా తుఫాను కారణంగా ఒక వైపు బాగా బీటలు వారింది. మరో రెండు రోజులకు పూర్తిగా కూలిపోయింది. ఆలయ అధికారులు ముందుగా అప్రమత్తమై ముందుగా చుట్టుపక్కల కుటుంబాలను దూరంగా తరలించడంతో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు కానీ రెండు రోజుల తర్వాత శిథిలాల క్రింద ఒక వ్యక్తి మృతదేహం లభ్యమయింది.

ఈ దేవాలయం దేశంలోని అతి పెద్ద దేవాలయాలలో ఒకటి. ఆలయం లోపల అమ్మవారి సన్నిధికి సమీపంలో ఒక ప్రదేశం నుంచి భక్తులు కొన్ని ప్రధాన గోపురాలను సందర్శించవచ్చు. ఇలాంటి సదుపాయం భారతదేశంలో కేవలం కొన్ని ఆలయాలకు మాత్రమే ఉంది. రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోష నివృత్తి కావించుకుంటారు. ఇంకా రుద్రాభిషేకం, పాలాభిషేకం, పచ్చ కర్పూరాభిషేకం మొదలైన పూజలు కూడా జరుగుతాయి. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి అనుబంధంగా నెలకొన్న శ్రీకాళహస్తీశ్వరస్వామి సాంకేతిక కళాశాలను 1997లో స్థాపించారు.

శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్ధ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖునిగాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళ హస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను దక్షిణామూర్తి దక్షిణ ముఖం (మహా ద్వారం ఎదురు) గాను ఉన్నారు. కాళహస్తిలోని శివలింగం పంచ లింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. (కంచి ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగము, శ్రీరంగం వద్ద జంబుకేశ్వరుడు జలలింగము, అరుణాచలంలో తేజోలింగము, చిదంబరంలో ఆకాశలింగము). స్వామి వాయుతత్వరూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న రెండు దీపాలు ఎప్పుడూ చలిస్తూ ఉంటాయని చెబుతారు.

ఆలయానికి నాలుగు దిక్కులా నాలుగు గోపురాలు,, 120 అడుగుల ఎత్తుగల రాజగోపురం (కృష్ణదేరాయలు కట్టించినది) ఉన్నాయి. స్వామి గ్రామోత్సవం ఈ గోపురంనుండే మొదలవుతుంది. ఆలయానికి చేరుకోవడానికి ముందుగా తేరు వీధికి ఎదురుగా ఉన్న భిక్షాల గోపురంనుండి వస్తాడు. జంగమరూపుడైన శివుని సేవించి తరించిన దేవదాసి బిచ్చాలు దీనిని కట్టించిందట. ఈ గోపుర నిర్మాణం యాదవ నరసింహరాయల కాలంలో జరిగిందని అంటున్నారు. తూర్ప గోపురాన్ని బాల జ్ఞానాంబి గోపురం అని, ఉత్తరం గోపురాన్ని శివయ్య గోపురం అని, పశ్చిమ దిక్కు గోపురాన్ని తిరుమంజన గోపురం అని అంటారు. తిరుమంజన గోపురానికి కుడినైపున సూర్య పుష్కరిణి, ఎడమవైపున చంద్ర పుష్కరిణి ఉన్నాయి. స్వామి అభిషేకానికి, వంటకు నీటిని సూర్యపుష్కరిణి నుండి తీసుకెళతారు. ఈ గోపురంనుండి సువర్ణముఖి నదికి వెళ్ళవచ్చును. దక్షిణం గోపురంనుండి భక్త కన్నప్ప గుడికి, బ్రహ్మ గుడికి వెళ్ళవచ్చును.

ఇక్కడ అనేక శివలింగాలు మహర్షులు లేదా దేవతలచే ప్రతిష్ఠింపబడినవిగా భావిస్తారు. భృగు మహర్షి - అర్ధ నారీశ్వర లింగము; అగస్త్యుడు - నీలకంఠేశ్వర లింగము; ఆత్రేయుడు - మణి కంఠేశ్వర లింగము; ఇంకా వ్యాసుడు, మార్కండేయుడు (మృత్యంజయేశ్వర లింగము), రాముడు, పరశురాముడు, ఇంద్రాది దేవతలు, సప్తర్షులు, యమధర్మరాజు, చిత్రగుప్తుడు, ధర్మరాజు ప్రతిష్ఠించినవనే లింగాలున్నాయి. వర్షాల కోసం మృత్యుంజయేశ్వరునికి సహస్రలింగాభిషేకం చేస్తారు. కాశీ విశ్వేశ్వరుడు కూడా మూర్తి స్వరూపుడై యున్నాడు.

ఇక్కడ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. వివిధ గణపతి మూర్తులు, సుబ్రహ్మణ్య స్వామి, సూర్య, శని గ్రహ మూర్తులు ఉన్నారు. వేంకటేశ్వర స్వామి, వరదరాజ స్వామి, వీరరాఘవ స్వామి మూర్తులు ఉన్నారు. నిలువెత్తు కన్నప్ప విగ్రహం ఉంది. శంకరాచార్యుల స్ఫటిక లింగము, 64 నాయనార్ల లోహ విగ్రహాలున్నాయి.

ఆలయంలో శిల్పకళతో శోభించే స్తంభాలు, మంటపాలు ప్రత్యేకంగా చూపరులను ఆకర్షిస్తాయి. ఇంకా అనేక వర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి. నగరేశ్వర మంటపము, గుర్రపుసాని మంటపము, నూరుకాళ్ళ మంటపము (రాయల మంటపము), పదునారు కాళ్ళ మంటపము, కోట మంటపము వాటిలో కొన్ని. నూరుకాళ్ళ మంటపం చక్కని శిల్పాలకు నిలయం. పదహారు కాళ్ళ మంటపంలో 1529లో అచ్యుత దేవరాయలు (కృష్ణదేవరాయలు సోదరుడు) పట్టాభిషేకం జరిగింది. అమ్మవారి ఆలయం ఎదురుగా అష్టోత్తర లింగ ముఖద్వారం పైకప్పులో చక్కని చిత్రాలున్నాయి.

ఇది రాహు కేతు క్షేత్రమని ప్రసిద్ధి పొందింది. పుత్ర శోకానికి గరైన వశిష్ట మహర్షికి పరమేశ్వరుడు పంచముఖ నాగలింగేశ్వరునిగా దర్శనమిచ్చాడట. ఈ నాగరూపమునే బ్రహ్మదేవుడు కూడా అర్చించాడట. ఈ నాగరూపం కారణంగా ఈ క్షేత్రానికి రాహు కేతు క్షేత్రము అని పేరు వచ్చింది. సర్ప దోషము, రాహు కేతు గ్రహ దోషాలనుండి నివారణ కోసం ఈ స్వామిని పూజిస్తారు. స్వామి కవచము నవగ్రహ కవచమునకు అలంకారములు చేస్తారు.

దక్షిణాభిముఖంగా ఉన్న ఆలయ ప్రవేశ ద్వారంనుండి లోనికి ప్రవేశించగానే ఉత్తరముఖంగా కొలువైయున్న దక్షిణామూర్తిని దర్శించవచ్చును. దక్షిణామూర్తి పూజలందుకొనడం కారణంగా ఇది జ్ఞాన ప్రధానమైన క్షేత్రం అయ్యింది. ఈ విధమైన దక్షిణామూర్తి విగ్రహం వేరెక్కడా కనుపించదు. ఇక్కడ వైదిక సంప్రదాయానికి ప్రముఖస్థానం ఉంది.

ఆలయంలో జరిగే కొన్ని సేవలు - కర్పూర హారతి, అష్టోత్తర అర్చన, సహస్ర నామార్చన, త్రిశతి అర్చన, పాలాభిషేకము, పచ్చ కర్పూరాభిషేకము, కాశీ గంగాభిషేకము, రుద్రాభిషేకము, నిత్యదిట్ట అభిషేకము, శ్రీ శనేశ్వరస్వామి అభిషేకము, శుక్రవారం అమ్మవారి ఊంజలి సేవ, వివాహ కట్నం, పంచామృతాభిషేకము, అఖండ దీపారాధన కట్నం, నిత్యోత్సవం (ఉదయం), ప్రదోష నంది సేవ, ఏకాంత సేవ, వాహన పూజ, సుప్రభాత సేవ, శని నివారణ జ్యోతిదీప కట్నం, తళిగ కట్నం, సర్పదోష (రాహు కేతు) పూజ, పౌర్ణమినాడు ఊంజల్ సేవ, నంది సేవ, పెద్ద వెండి సింహ వాహనము

ఆలయం పరిసరాలలో 36 తీర్ధాలున్నాయి. సహస్ర లింగాల తీర్ధము, హరిహర తీర్ధము, భరద్వాజ తీర్ధము, మార్కండేయ తీర్ధము, మూక తీర్ధము, సూర్య చంద్ర పుష్కరిణులు వాటిలో ముఖ్యమైనవి. దేవాలయంలోని పాతాళ గంగ లేదా మూక తీర్థములోని తీర్థాన్ని సేవిస్తే నత్తి, మూగ లోపాలు పోయి వాక్చాతుర్యం కలుగుతుందటారు.

ధర్మ కర్తల మండలి పరిపాలనలో, దేవాదాయ శాఖ అధ్వర్యంలోఆలయ నిర్వహణ జరుగుతుంది. యాత్రికుల కొరకు శ్రీకాళహస్తీశ్వరస్వామి వసతి గృహం, జ్ఞానప్రసూనాంబ వసతి గృహం, బాలజ్ఞానాంబ సత్రము, శంకరముని వసతిగృహము, త్రినేత్రనటరాజ వసతిగృహము, తిరుమల తిరుపతి దేవస్థానం వసతిగృహము ఉన్నాయి. పట్టణంలో ప్రైవేటు వసతిగృహాలున్నాయి. (2007 నాటికి) దేవస్థానానికి ఆదాయం షుమారు 7 కోట్ల రూపాయలు ఉంది. శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి నిత్యాన్నదాన పధకం ద్వారా భక్తులందరికీ ఉచిత భోజన సదుపాయం కలిగించే ప్రయత్నం జరుగుతున్నది.

శ్రీకాళస్తీశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీకాళహస్తీశ్వర స్వామి సాంకేతిక కళాశాల చాలా ప్రసిద్ధి గాంచినది. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల , మునిసిపల్ ప్రాథమికోన్నత పాఠశాల శ్రీకాళహస్తిలో చాలా కాలంగా ఉన్న పాఠశాలలు. ఇవికాక కేవలం బాలికల కోసమే గల బాలికల ఉన్నత పాఠశాల, సంక్షేమ పాఠశాలలు కూడా ఉన్నాయి.
కళాశాల విషయానికొస్తే బాలురకు, బాలికలకు ప్రత్యేకమైన జూనియర్ కళాశాలలున్నాయి.ప్రైవేటు పాఠశాలల్లో ఎంజీఎం, విశ్వభారతి, వివేకానంద, ది స్కూల్, ఆర్.సీ.పీ గురుకులం, రాజా ఉన్నత పాఠశాల, మొదలైనవి ప్రధానమైనవి.

బస్ స్టాండుకు సమీపంలోనున్న అయ్యలనాయుడు చెరువులో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. ఇక్కడ ప్రధాన బ్యాంకులైన భారతీయ స్టేట్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఆంధ్రా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు,మొదలైనవి తమ కార్యాలయాలను కలిగి ఉన్నాయి. కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు, గ్రామీణ బ్యాంకు లాంటి ప్రాంతీయ బ్యాంకులు కూడా ఉన్నాయి.

ఇక్కడి ప్రజల ప్రధాన ఆదాయ మార్గాలు వ్యవసాయం, వ్యాపారం , పర్యాటకం. ప్రధాన పంటలు వరి, వేరుశనగ, , చెరకు. వందల కొద్దీ కలంకారీ కళాకారులు కూడా ఆదాయాన్ని చేకూరుస్తున్నారు. ఇంకా చేనేత కళాకారులు కూడా చెప్పుకోదగిన సంఖ్యలోనే ఉన్నారు. వీరు ప్రధానంగా పట్టణంలోగల సాలిపేట అనే ప్రాంతమందు కేంద్రీకృతమై ఉన్నారు. పట్టణంలో జరిగే నిర్మాణాల పనులకు, ఇతర కూలిపనులకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వస్తారు. బీడీ కార్మికులు కూడా ఎక్కువే.

శ్రీకాళహస్తి ఒక శాసనసభ నియోజక వర్గం. దీనికి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నది తెలుగుదేశం పార్టీకి చెందిన బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి. ఇది తిరుపతి పార్లమెంటు నియోజక వర్గం క్రిందకు వస్తుంది. దీనికి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్కి చెందిన వరప్రసాద్ రావు.

ఇక్కడి ప్రజలు ప్రధానం తెలుగు మాట్లాడుతారు. కానీ తమిళనాడుకు దగ్గరలో ఉండటం వలన చాలామంది తమిళం కూడా మాట్లాడుతారు. విద్యా రంగంలో మంచి అభివృద్ధిని సాధించడం వలన చాలామంది ఆంగ్లమును కూడా అర్థం చేసుకోగలరు. వస్త్రధారణలో పంచె, చీరలు, లుంగీలు, ధోతీలే కాకుండా ఆధునిక వస్త్రధారణలైన ప్యాంటు, చొక్కా, చుడీదార్ వంటివి కూడా సాధారణమే.

ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకం శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ పట్టణం యొక్క సంస్కృతిని ప్రతిబింబజేస్తుంది. కర్ణాటక సంగీత మొట్టమొదటి స్వరకర్తలలో ఒకడైన ముత్తుస్వామి దీక్షితార్ శ్రీకాళహస్తీశ అనే భజనల్లో ఈ ఆలయాన్ని కీర్తించాడు.

క్రికెట్ ఇక్కడి ప్రజలు బాగా ఆడే, అభిమానించే క్రీడ. అంతేకాక కొన్ని ప్రాంతీయ క్లబ్బులు టెన్నిస్ ను కూడా ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో ముఖ్యమైనది 1916లో స్థాపించబడిన రిపబ్లిక్ క్లబ్. ఈ క్లబ్ 2004లో 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఆల్ ఇండియా టెన్నిస్ టోర్నమెంటును కూడా నిర్వహించింది. ఇంకా గ్రామీణ క్రీడలైన కబడ్డీ, ఖోఖో మొదలైనవి కూడా ఒక మాదిరి ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.

తెలుగులో ప్రధాన పత్రికలైన ఈనాడు, వార్త, ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి మొదలైన అన్నీ పత్రికలు ఇక్కడ తమ కార్యాలయాలను కలిగి ఉన్నాయి. ఇంతేకాక ప్రాంతీయంగా వెలువడే చైతన్య,  ఆదర్శిని వంటి కొన్ని చిన్న వార్తాపత్రికలు కూడా ఉన్నాయి. ఈటీవీ, జెమిని టివి, తేజ టివి, మా టివి మొదలైన ఛానళ్ళు ప్రధానంగా వీక్షించబడుతున్నాయి. ఇవి కాక ప్రాంతీయ కేబుల్ ఛానల్ కూడా కొద్ది మంది వీక్షిస్తుంటారు.

 
పండుగల విషయానికొస్తే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వారం రోజులపాటు అంగరంగ వైభోగంగా జరుగుతాయి. ఈ రోజులలో ఆలయం లోపలనే కాకుండా నాలుగు ప్రధాన వీధులైన నెహ్రూ వీధి, కుంకాల వీధి, తేరు వీధి, నగరి వీధులు జనంతో కిటకిటలాడుతుంటాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ ఉత్సవం ప్రధానమైన మూడు రోజులు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా నిర్వహిస్తుంది. అన్నింటి కన్నా ఎక్కువగా మహాశివరాత్రి రోజున సుమారు లక్షకు పైగా భక్తులు స్వామి దర్శనార్థం విచ్చేస్తారు. ఈ రద్దీని తట్టుకోవడానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. శివుడు కళాప్రియుడు కాబట్టి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన గాయకులు, హరికథకులు, నాట్య కళాకారులు, నర్తకీమణులు, భజన కళాకారులు, మిమిక్రీ కళాకారులు, సంగీత వాయిద్య కారులు, భక్తులను తమ కౌశలంతో రంజింప జేస్తారు.

సినీ సంగీత దర్శకుడు మణిశర్మ, నటి, భరత నాట్య కళాకారిణి శోభన, నేపథ్య గాయకులు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, మొదలైనవారు ఇక్కడికి వచ్చారు. మహాశివరాత్రి పర్వదినాన జరిగే నందిపై ఊరేగింపు కన్నుల పండుగగా ఉంటుంది. నంది వాహనమెక్కి ఊరేగు శివుని ముందు అనేక జానపద కళా బృందాలు ప్రదర్శించే కళలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మహాశివరాత్రి తరువాతి రోజు జరిగే రథ యాత్రలో కూడా ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇంకా నారద పుష్కరిణిలో జరిగే తెప్పోత్సవం కూడా ఉత్సవాల్లో ప్రధాన వేడుక. అందంగా అలంకరించిన తెప్పలపై స్వామి వారిని, అమ్మవారిని కోనేటిలో విహారం చేయిస్తారు. పట్టణం నడిబొడ్డులోగల పెళ్ళి మంటపంలో జరిగే కళ్యాణోత్సవంలో వేలాది భక్తులు పాల్గొంటారు. పెద్ద ఖర్చులు భరించి పెళ్ళి చేసుకోలేని పేదలు స్వామి, అమ్మవారి కళ్యాణంతో పాటుగా పెళ్ళి చేసుకోవడం ఇక్కడ తరతరాలుగా ఇక్కడ వస్తున్న ఆనవాయితీ.

ఇంకా ఆలయానికి సమీపంలో ఉన్న దుర్గాంబ కొండపై వెలసిన కనక దుర్గమ్మ అమ్మవారికి ఏటా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. ఈ తొమ్మిది రోజులపాటు కూడా భక్తులు విశేషంగా అమ్మవారిని దర్శించుకుంటారు. ఇంతకు మునుపు చిన్నదిగా ఉన్న ఆలయాన్ని 2006లో విస్తరించడం జరిగింది. మరి కొంత దూరంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి కొండపై కూడా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.

ధర్మరాజుల స్వామి తిరునాళ్ళు కూడా ఐదు రోజులపాటు విశేషంగా జరుగుతాయి. ద్రౌపదీ అమ్మవారు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. ఈ ఉత్సవాల సమయంలో ప్రతిరోజు భారత పారాయణం జరుగుతుంది. విరాటపర్వం చదివిన రోజున పట్టణంలో కచ్చితంగా వర్షం కురవడం ప్రజలు విశేషంగా చెప్పుకుంటారు. ఉత్సవాలలో ప్రధాన భాగంగా ఐదవరోజున సుమారు 2000 మంది భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేస్తారు.

ఇంకా ప్రతీ సంవత్సరం డిసెంబరు నెలలో జరిగే ఏడు గంగల జాతర కూడా చెప్పుకోదగ్గ ఉత్సవమే. ఈ ఉత్సవాలలో భాగంగా పట్టణం లోని ఏడు వీధులలో ఏడు రూపాలలో ఏర్పాటు చేసిన గంగమ్మలను ప్రతిష్ఠిస్తారు. ముత్యాలమ్మ గుడి వీధిలో గల గంగమ్మ దేవాలయం నుంచి ఈ ఏడు విగ్రహాలు ఊరేగింపుగా బయలుదేరి ఆయా వీధులలో ప్రతిష్ఠిస్తారు. ఆ గంగమ్మ విగ్రహాలు జీవం ఉట్టి పడేలా తయారు చేయడం ఆ కళాకారుల నైపుణ్యానికి నిదర్శనం.

విజయలక్షి సినిమా హాలు అన్నింటికన్నా ప్రాచీనమైనది.దీనిని సుమారు 80 సంవత్సరాలకు మునుపు నిర్మించి ఉన్నారు. 

 
ధూర్జటి, శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి, మాజీ శాసన సభ్యులు ఎస్సీవీ నాయుడు, శాంతారాం పవార్, మాజీ శాసన సభ్యులు తాటిపర్తి చెంచురెడ్డి, ప్రముఖ విద్వాంసులు పూడి వెంకటరామయ్య గారు. ప్రముఖ కళాకారులు మోహన్ భార్గవ్, గురప్ప చెట్టి (పద్మశ్రీ). ప్రముఖ నేపథ్య గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఒక సంవత్సరం పాటు పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో చదవడం విశేషం.

శ్రీకాళహస్తి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రమైన తిరుపతికి ముఫ్ఫై ఎనిమిది కి.మీ.ల దూరంలో నెల్లూరుకు సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నుంచి ఇక్కడికి ప్రతి ఐదు నిమిషాలకు బస్సు సౌకర్యం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లోని దాదాపు అన్ని ముఖ్య పట్టణాల నుండి ప్రతిరోజు బస్సు సదుపాయం ఉంది. గూడూరు-తిరుపతి దక్షిణ రైలు మార్గంలో శ్రీకాళహస్తి రైల్వే స్టేషను ఉంది. గూడూరు చెప్పుకోదగ్గ జంక్షన్ కాబట్టి చాలా రైళ్ళు ఇక్కడ ఆగుతాయి. గూడూరు రైల్వే స్టేషను నుంచి తిరుమలకు ప్రతి అర్థగంటకు ఒక బస్సు ఉంటుంది. ఇక్కడకి దగ్గరలోని విమానాశ్రయం తిరుపతి దగ్గరలోని రేణిగుంట. కానీ అక్కడకు విమానాలు ఇంకా ప్రతిరోజూ లేవు. కనుక చెన్నై, విజయవాడ లేదా బెంగళూరు లకు వచ్చి అక్కడ నుండి రోడ్డుమార్గములో రావచ్చు.




#Article 95: కూర్మావతారము (226 words)


హిందూ ధర్మ పురాణాల లో శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాల లో రెండవ అవతారం కూర్మావతారము. కూర్మము అనగా తాబేలు. దేవదానవులు అమృతము కోసము పాలసముద్రాన్ని మథించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా నిర్ణయించి, పాలసముద్రంలో వేస్తే అది కాస్తా ఆ బరువుకి పాలసముద్రంలో మునిగిపోతుంటే, విష్ణుమూర్తి కూర్మావతారములో దానిని భరిస్తాడు. ఇది కృతయుగం లో సంభవించిన అవతారం.

ఒకమారు దేవేంద్రుని ప్రవర్తనకు కోపించిన దూర్వాస మహర్షి దేవతలు శక్తిహీనులగుదురు అని శపించాడు. అందువలన దానవులచేతిలో దేవతలు పరాజయం పొందసాగారు. వారు విష్ణువుతో మొరపెట్టుకోగా సకల ఔషధులకు నిలయమైన పాలకడలిని చిలికి అమృతాన్ని సాధించండి అని విష్ణువు ఉపాయాన్ని ఉపదేశించాడు.

దేవతలు ఆ బృహత్కార్యం కోసం అందుకు తమకంటె శక్తివంతులుగా ఉన్న దానవులతో సంధి కుదుర్చుకొన్నారు. మందర పర్వతం కవ్వంగా, వాసుకి త్రాడుగా క్షీరసముద్ర మథనం మొదలయ్యింది. కాని మందరగిరి బరువుకి మునిగిపోసాగింది. కార్యం నిష్ఫలమయ్యే పరిస్థితి ఉత్పన్నమైంది.

అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారమును ధరించి ఆ కొండను భరించెను. ఆ అవతారాన్ని పోతన తన భాగవతంలో ఇలా వర్ణించాడు.

సవరనై లక్ష యోజనముల వెడల్పై కడు గఠోరంబైన కర్పరమున
నదనైన బ్రహ్మాండమైన నాహారించు ఘనతరంబగు ముఖ గహ్వరంబు
సకల చరాచర జంతురాసులనెల్ల మ్రింగి లోగొనునట్టి మేటి కడుపు
విశ్వంబుపై వేఱు విశ్వంబు పైబడ్డ నాగిన గదలనియట్టి కాళ్ళు
వెలిగి లోనికి జనుదెంచు విపుల తుండ
మంబుజంబుల బోలెడి యక్షియుగము
సుందరంబుగ విష్ణుండు సురలతోడి
కూర్మి చెలువొందనొక మహా కూర్మమయ్యె.

అలా దేవదేవుని అండతో సముద్రమథన కార్యం కొనసాగింది. ముందుగా జగములను నాశనము చేయగల హాలాహలము ఉద్భవించింది. దేవతల మొర విని, కరుణించి, పరమశివుడు హాలాహలాన్ని భక్షించి, తన కంఠంలోనే నిలిపాడు. అందుచేత ఆయనను గరళకంఠుడు అనీ, నీలకంఠుడు అనీ అంటారు. తరువాత సుర (మధువు), ఆపై అప్సరసలు, కౌస్తుభము, ఉచ్ఛైశ్రవము, కల్పవృక్షము, కామధేనువు, ఐరావతం వచ్చాయి. ఆ తరువాత త్రిజన్మోహినియైన శ్రీలక్ష్మీదేవి ఉద్భవించింది. సకలదేవతలు ఆమెను అర్చించి, కీర్తించి, కానుకలు సమర్పించుకొన్నారు. ఆమె శ్రీమహావిష్ణువును వరించింది. చివరకు ధన్వంతరి అమృత కలశాన్ని చేతబట్టుకొని బయటకు వచ్చాడు. తరువాత విష్ణువే మోహినిగా ఆ అమృతం దేవతలకు దక్కేలా చేశాడు.

జయదేవుని స్తోత్రంలో కూర్మావతార వర్ణన




#Article 96: వామనావతారము (503 words)


వామనుడు లేదా త్రివిక్రముడు, హిందూ పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాలలో ఐదవ అవతారం.

వామనుడు అదితి కి పుత్రునిగా జన్మించి, బలి చక్రవర్తి దగ్గరనుండి మూడు అడుగుల నేల అడిగి త్రివిక్రముడై మొత్తం జగత్తునంతా రెండు అడుగులతో, మిగిలిన ఒక అడుగుతో బలి చక్రవర్తిని పాతాళానికి పంపించి అక్కడ రాజుని చేసి తానే స్వయంగా వరాహ రూపంలో ఆ రాజ్యానికి కాపలాగా మారతాడు. వామనుడు అనగానే తెలుగు వారికి ఇంతై ఇంతై వటుండంతై  అన్న పోతన భాగవత పద్యము తెలుగునాట సుపరిచితం.

దేవాసుర యుద్ధంలో ఇంద్రునితో ఓడి పోయిన బలి, రాక్షస గురువైన శుక్రాచార్యుల దయ వలన బ్రతికి, గురూపదేశంతో విశ్వజిత్‌యాగం చేసి బంగారు రథము, మహాశక్తివంతమైన ధనుస్సు, అక్షయతూణీరములు, కవచము, శంఖములు పొందుతాడు. బలగర్వితుడై ఇంద్రుని మదమణిచేందుకు, రాక్షసులనందరినీ ఒకచోటచేర్చి, యుద్ధమునకు సంసిద్ధం చేసి అమరావతిపై దండెత్తుతాడు. ఆ దుర్భర దానవ శంఖా విర్భూత ధ్వనులు నిండి, విభుదేంద్ర వధూగర్భములు పగిలి, లోపలి శిశువులు ఆవురని ఆక్రోశించుచుండ, దేవతలు బృహస్పతి వచనములు విని అమరావతి వీడి పారిపోయారు. 

ఈ వామనావతార గాథను విన్న వారు, చదివిన వారు సకల శుభాలను పొందుతారు. దైవారాధన సమయంలో ఎవరైతే త్రివిక్రమ పరాక్రమాన్ని స్మరించుకుంటారో వారికి నిత్య సౌఖ్యాలు కలుగుతాయని ప్రతీతి.

దేవతల దుస్థితిని చూసి, సురమాత అదితి, తన భర్తయైన కశ్యపబ్రహ్మను వేడుకున్నది. అంతట కశ్యపుడు అదితికి పయోభక్షణ వ్రతాన్ని ఉపదేశిస్తాడు. ఆమె ఫాల్గుణ మాసం, శుక్లపక్ష పాడ్యమి నుంచి 12 రోజులు హరిసమర్పణంగా వ్రతం చేసి భర్తను చేరగా, భగవదంశతో, శ్రవణ ద్వాదశి (శ్రవణ నక్షత్రంతో కూడిన భాద్రపద బహుళ ద్వాదశిని శ్రవణద్వాదశి అంటారు), ఆనాడు  శ్రోణ అభిజిత్‌ సంజ్ఞాత లగ్నంలో, రవి మధ్యాహ్నమున చరించునప్పుడు, గ్రహ తారా చంద్ర భద్రస్థితిలో వామనుడు జన్మించాడు.

వామనుడు పుట్టినప్పుడు శంఖ, చక్ర, గదా కమల కలిత, చతుర్భుజునిగా, బిశంగ వర్ణ వస్త్రాలతో, మకరకుండల మండిత గండ భాగుడై, శ్రీ విరాజిత లోలంబ, కదంబ వనమాలిగా సమస్త అలంకారాలతో, నిఖిల జన మనోహరుడిగా అవతరించాడు. రూపాంతరంబున తన దివ్యరూపాన్ని ఉపసంహరించుకొని, కపట వటుని వలె, ఉపనయ వయస్కుండై వామన బాలకుడయ్యాడు.

అతనిని చూచి జనులు గుజగుజలు పోవుచూ, గజిబిజి పడుచూ, కలకలములై ఎవరీ పొట్టి బాలుడు? శివుడా? హరియా? బ్రహ్మయా? సూర్యుడా? అగ్నియా? ఈ బ్రహ్మచారి ఎవరు? అని విస్మయం చెందారు. కొందరితో చర్చించుచూ కొందరితో జటలు చెప్పుచూ, గోష్ఠిలో పాల్గొనుచూ, తర్కించుచు, ముచ్చటలాడుచు, నవ్వుచూ అనేక విధంబుల అందరికీ అన్ని రూపులై వినోదించుచూ, వెడవెడ నడకలు నడుచుచూ, బుడి బుడి నొడువులు నొడుచుచు, జిడిముడి తడబడగ, వడుగు రాజును సమీపించి స్వస్తి ! జాగత్త్రయీ భావన శాసన కర్తకు! హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు, ఉదారపద వ్యవహర్తకు, మునీంద్ర స్తుత మంగళాధ్వ విధాన విహర్తకు, దానవ లోక భర్తకు స్వస్తి అని దీవించెను.

బలి అతనికి సముచితాదరమిచ్చి గౌరవించి...వడుగా ! ఎవ్వరి వాడవు? నీకేమి కావలయును కోరుకొమ్మన్నాడు.

అది పాపము కాదు. అని శుక్రాచార్యుడు వివరించెను. దానికి బలి చక్రవర్తి ..కారే రాజులు రాజ్యముల్‌ కలుగవే, గర్వోన్నతింబొందరే వారేరీ? సిరి మూట గట్టుకొని పోవంజాలిరే? భూమిపై పేరైనంగలదే! శిబి లాంటి దాతల పేరు ఈనాటికీ స్థిరములైనవి కదా! భార్గవా! అని పలుకుతూ తన మాటను తోసి పుచ్చిన రాజును పదభ్రష్ఠునివి గమ్మని శుక్రాచార్యుడు శపించాడు.

అయినను బలిచక్రవర్తి హరిచరణములు కడిగి, త్రిపాద ధరిణిం దాస్యామి అనుచు నీటిధార విడిచాడు. ఆ కలశములో సూక్ష్మకీటక రూపమున చేరి శుక్రాచార్యుడు నీటిధారను ఆపబోయాడు. అప్పుడు హరి కుశాగ్రముతో కలశరంధ్రమును బొడువగా కన్ను పోగొట్టుకొని శుక్రాచార్యుడు ఏక నేత్రుడయ్యెను. పుట్టి నేర్చుకునెనో, పుట్టక నేర్చెనో.. ఈ పొట్టి వడుగునకీ చిట్టి బుద్ధులెట్లబ్బెనో, ఈతని పొట్టనిండా అన్నీ భూములే.. అని నవ్వుతూ మూడడుగుల నేలను బలి వడుగుకు దానమిచ్చెను.

అలా ధారా పరిగ్రహంబు చేసి, ఇంతితై వటుడింతయై, దానింతై, నభో వీధిపైనంతై, తోయద మండలాగ్రమున కల్లంతై, ప్రభారాశి పైనంతై, చంద్రునికంతయై, ధ్రువునిపైనంతై, మహర్వాటి పైనంతై, బ్రహ్మాండాంత సంవర్థియై, సత్యపదోన్నతుడైన విష్ణువునకు అప్పుడే ఉదయించిన సూర్యబింబము మొదట గొడుగులా, తదుపరి శిరోరత్నమై, చెవి కుండలమై, మెడలోని ఆభరణమై, బంగారు కేయూరమై, కంకణమై వడ్డాణపు ఘంటమై, నూపురప్రవరమై, చివరకు పాదపీఠమై ఒప్ప అతడు బ్రహ్మాండము నిండినాడు - అని బమ్మెర పోతన భాగవతంలో పద్య రచన అద్భుతంగా చేశాడు.

ఒక పాదంబులో భూమిని కప్పి, దేవ లోకమును రెండవ పాదమున నిరోధించి, జగములెల్ల దాటి చనిన త్రివిక్రముడు మరల వామనుడై బలినవలోకించి నా మూడవ పాదమునకు స్థలము జూపమన్నాడు. అప్పుడు బలి వినయముతో నీ తృతీయ పాదమును నా శిరమున ఉంచమని వేడుకొనగా సమ్మతించిన హరి బలిని ఆశీర్వదించి, ప్రహ్లాదునితో సుతలలోకమునకు పంపి, తానే ఆలోకమునకు ద్వారపాలకుడాయెను. బలి నడిగి సంపాదించిన లోకములను తన సోదరుడైన ఇంద్రున కిచ్చి సంతోషపరిచాడు శ్రీహరి.

వామనుడు దేవాలయాలు ఉన్నాయి




#Article 97: రామావతారము (1321 words)


రామావతారము త్రేతాయుగములోని విష్ణు అవతారము. రాముడు హిందూ దేవతలలో ప్రముఖుడు. 

వాల్మీకి వ్రాసిన రామాయణం రాముని కథకు ప్రధానమైన ఆధారం. ఇంతే గాక విష్ణుపురాణములో రాముడు విష్ణువు యొక్క ఏడవ అవతారము అని చెప్పారు. భాగవతం నవమ స్కంధములో 10, 11 అధ్యాయాలలో రాముని కథ సంగ్రహంగా ఉంది. మహాభారతంలో రాముని గురించిన అనేక గాథలున్నాయి.

భారత దేశమంతటా వాల్మీకి రామాయణమే కాకుండా అనేక అనువాదాలు, సంబంధిత గ్రంథాలు, జానపధ గాథల రూపంలో ప్రాచుర్యంలో ఉన్నాయి. మధ్వాచార్యుని అనుయాయుల అభిప్రాయం ప్రకారం మూల రామాయణం అనే మరొక గ్రంథం ఉంది గాని ప్రస్తుతం అది లభించడం లేదు. వేదవ్యాసుడు వ్రాసినట్లు చెప్పబడే ఆధ్యాత్మ రామాయణం మరొక ముఖ్య గ్రంథం. 7వ శతాబ్దిలో గుజరాత్ ప్రాంతంలో నివసించిన భట్టి రచించిన భట్టికావ్యం రామాయణ గాథను తెలుపుతూనే వ్యాకరణ కర్త పాణిని రచించిన అష్టాధ్యాయిని, ప్రాకృత భాషకు సంబంధించిన అనేక భాషా విశేషాలను వివరిస్తున్నది. 
ఇతర భారతీయ భాషలలో ఉన్న కొన్ని ప్రధాన రచనలు - 12వ శతాబ్దికి చెందిన తమిళ కవి పంబన్ వ్రాసిన పంబ రామాయణము; 16వ శతాబ్దికి చెందిన తులసీదాస్ రచన రామచరిత మానసము.

తెలుగులో లెక్క పెట్టడం కష్టమైనన్ని రామాయణ రచనలు, అనుబంధ రచనలు వచ్చాయి. వాటిలో కొన్ని - తిక్కన రచించిన నిర్వచనోత్తర రామాయణము; గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాధ రామాయణము; భాస్కరుడు రచించిన భాస్కర రామాయణము; విశ్వనాధ సత్యనారాయణ రచించిన రామాయణ కల్పవృక్షము.

రామాయణ కథ భారతదేశం ఎల్లలు దాటింది. అగ్నేయాసియాలో అనేక జానపద గాథలు, కళారూపాలుగా ప్రసిద్ధి చెందింది. అక్కడి స్థానిక గాథలు, ప్రదేశాలు, భాష, సంస్కృతులతో కలిసి ప్రత్యేకమైన ఇతిహాసంగా రూపుదిద్దుకొంది. జావా దీవి (ఇండొనీషియా) లోని , బాలి దీవిలోని రామకవచ, మలేషియాలోని హికయత్ సెరి రామ (Hikayat Seri Rama), ఫిలిప్పీన్స్లోని మరదియా లవన (Maradia Lawana), థాయిలాండ్‌లోని  - ఇవన్నీ రాముని కథనే ఆయా ప్రదేశాల సంస్కృతితో రంగరించి చెబుతాయి.బ్యాంగ్‌కాక్ నగరంలోని  మందిరంలో రామాయణ గాథకు చెందిన అనేక దృశ్యాలు అద్భుతంగా చిత్రీకరింపబడిఇఉన్నాయి. మయన్మార్ దేశపు జాతీయ ఇతిహాసం  కూడా బర్మా భాషలో రూపుదిద్దుకొన్న రామాయణమే అనవచ్చును. ఈ కథలో రాముని పేరు యమ. కంబోడియాలోని  లో రాముని పేరు ఫ్రీ రీమ్ (Preah Ream). లావోస్కు చెందిన  కథలో రాముని అవతారమే గౌతమ బుద్ధుడు అని చెప్పబడింది.

సీతారాముల జీవితం రామాయణంగా ప్రసిద్ధి చెందిన కథ. దీనిని సీతాయాశ్చరితం మహత్ అని వాల్మీకి అన్నాడు. 24,000 శ్లోకములతో కూడిన రామాయణము భారతదేశము, హిందూ ధర్మముల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగియున్నది. రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడింది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు - వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శజీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును. రామాయణ మహాకావ్యము ఆరు కాండములు (భాగములు) గా విభజింప బడింది.

ఆయోధ్యా నగరం రాజధానిగా, కోసలదేశాన్ని ఇక్ష్వాకువంశపు రాజైన దశరథుడు పాలిస్తున్నాడు. పిల్లలు లేని కారణంగా దశరథుడు పుత్రకామేష్టి యాగం చేశాడు. తరువాత ఆ రాజుకు నలుగురు బిడ్డలు జన్మించారు. వారికి రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు. రావణుడు అనే రాక్షసుడు బ్రహ్మవద్ద వరాలుపొంది దేవతలను జయించి మునులను వేధిస్తున్నాడు. వానికి దేవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల చావులేదు. దేవతల ప్రార్థనలు మన్నించి శ్రీ మహా విష్ణువు వానిని హతంచేయడానికి నరుడై జన్మింపనెంచాడు. విష్ణువు రామునిగా, ఆదిశేషుడు లక్ష్మణునిగా, శంఖ చక్రములు భరత శత్రుఘ్నులుగా అవతరించారు. శ్రీమహాలక్ష్మి సీతగా అయోనిజయై జనక మహారాజు ఇంట పెరుగుతున్నది. రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు కిష్కిందలో ఉన్నాడు.

కులగురువు వశిష్టుని వద్ద రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు సకల విద్యలనూ అభ్యసించారు. ఒకనాడు విశ్వామిత్ర మహర్షి దశరథుని వద్దకు వచ్చి తన యాగసంరక్షణార్ధమై రామ లక్ష్మణులను తనతో పంపమని కోరాడు. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు ఎన్నో అస్త్రవిద్యారహస్యాలను బోధించాడు. దారిలో రామ లక్ష్మణులు తాటకి అనే రాక్షసిని సంహరించారు. గంగానదిని దర్శించారు. రాముని పాదము సోకి అహల్యకు శాపవిమోచనమైనది. రామ లక్ష్మణుల రక్షణలో యాగము జయప్రథముగా జరిగింది. మారీచ సుబాహులూ, ఇతర రాక్షసగణములూ దండింపబడ్డారు. తిరుగుదారిలో వారు జనకుని రాజధానియైన మిథిలానగరం చేరారు. అక్కడ సీతా స్వయంవరంలో రాముడు శివుని విల్లు విరచి, సీతకు వరుడైనాడు. సీతారాములు, ఊర్మిళా లక్ష్మణులు, మాండవీ భరతులు, శృతకీర్తి శతృఘ్నుల వివాహం కనుల పండువుగా జరిగింది. తిరుగుదారిలో రాముని ఎదిరించిన పరశురామనకు తాము ఇద్దరూ విష్ణుస్వరూపులే అని తెలిసింది. మహా వైభవముగా నలుగురు జంటలూ అయోధ్యకు తిరిగి వచ్చారు.

దశరథుడు రాజ్యభారాన్ని పెద్దకొడుకైన రామునకప్పగింపవలెనని సంకల్పించాడు. పట్టాభిషేకానికి సర్వమూ సిద్ధమైనది. అంతటా వేడుకలు జరుగుతున్నాయి. రాముని సవతి తల్లియైన కైకేయి దశరథుని రెండు కోరికలు కోరింది - (1) భరతుని పట్టాభిషేకము (2) రామునకు 14 ఏండ్ల వనవాసము. రాముడు తండ్రి మాట నిలబెట్టడానికి వనవాసానికి బయలుదేరాడు. రామునితోబాటు ఆత్మయైన సీతా, నీడయైన లక్ష్మణుడూ వనవాసానికి బయలుదేరారు. దారిలో గుహుడనే నిషాదరాజు వారిని గంగానది దాటించాడు. రామునికై విలపిస్తూ అయోధ్యలో దశరథుడు మరణించాడు.

భరతుడు సైన్యంతో అడవికి వెళ్ళి - నీకు చెందవలసిన రాజ్యం నావంటి అల్పుడు పాలించలేడు. నా తల్లి తప్పును మన్నించి, అయోధ్యకు తిరిగివచ్చి మమ్మలనందరినీ ఏలుకో అని ప్రార్థించాడు. తండ్రి మరణవార్త విన్న రాముడు దుఃఖించాడు. కాని తండ్రి మాట నిలబెట్టడం మన కర్తవ్యం. వనవాస దీక్ష ముగియవలసిందే అని నిశ్చయించాడు. అప్పుడు భరతుడు - 14 సంవత్సరాల తరువాత నీవు అయోధ్యకు రావడం ఒక్కరోజు ఆలస్యమైనా నేను ప్రాణాలు త్యజిస్తాను. అంత వరకు నీ పాదుకలను సింహాసనంపై ఉంచి, భృత్యునిగా నేను రాజ్యపాలన నిర్వహిస్తాను అని అయోధ్యకు తిరిగి వెళ్ళాడు.

సీతారామ లక్ష్మణులు మందాకినీ తీరాన చిత్రకూటం అనే సుందర ప్రదేశంలో ఒక పర్ణశాలను నిర్మించుకొని జపతపాది కార్యములు నిర్వహిస్తూ కాలం గడుపుతున్నారు. వారు అత్రి మహాముని ఆశ్రమాన్ని దర్శించినపుడు సీతమ్మవారు అనసూయ ఉపదేశములు, ఆశీర్వచనములు గ్రహించింది.

సీతారామలక్ష్మణులు మహర్షుల ఆశ్రమాలను దర్శించి, పిదప గోదావరి తీరాన పంచవటి వద్ద పర్ణశాలను నిర్మించుకొని అక్కడ నివసింపసాగారు. అక్కడకి 8శూర్పణఖ అనే కామరూపియైన రాక్షసి వచ్చి రామ లక్ష్మణులను మోహించి సీతను తినివేయడానికి సన్నద్ధమైనది. లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి పంపాడు. రోదిస్తున్న శూర్పణఖ కసి తీరడానికి తన సోదరులైన ఖర దూషణులనే రాక్షసులు 14 వేల మందిగల రాక్షస సైన్యముతో రామునిపై దండెత్తారు. రాముడొకడే వారందరిని హతం చేశాడు. శూర్పణఖ వెళ్ళి రావణునితో మొరపెట్టుకొంది. కసితో రావణుడు మారీచుడిని మాయలేడి రూపంలో పంపి రామ లక్ష్మణులను దూరంగా వెళ్ళేలా చేసి, తాను సీతను ఎత్తుకుపోయాడు. సీత కనిపించక హతాశులైన రామలక్ష్మణులు ఆమెను వెతుకనారంభించారు. కొనవూపిరితోనున్న జటాయువు వారికి సీతాపహరణం గురించి తెలిపి రాముని చేతిలో కన్నుమూశాడు. రామలక్ష్మణులు మాతంగముని ఆశ్రమంలో వారికోసం ఎదురు చూస్తున్న శబరి ఆతిథ్యం స్వీకరించి, ఋష్యమూకపర్వతానికి బయలుదేరారు.

రాముడూ, వానరుడైన సుగ్రీవుడూ అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. వాలిని వధించి రాముడు సుగ్రీవునకు వానర రాజ్యం కట్టబెట్టాడు. తరువాత సుగ్రీవుడు వానరులను నలుదిక్కులకూ సీతాన్వేషణ నిమిత్తమై పంపాడు. అలా దక్షిణదిశకు వెళ్ళినవారిలో అంగదుని నాయకత్వంలో హనుమంతుడూ, జాంబవంతుడూ, నీలుడూ, మైందుడూ, ద్వివిధుడూ, సుషేణుడూ వంటి మహావీరులున్నారు. వారు అనేక అవాంతరాలను అధిగమించిదక్షిణసముద్ర తీరానికి చేరుకొన్నారు. ఇక నూరు యోజనాల విస్తీర్ణమున్న సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళి సీతను వెదకడానికి హనుమంతుడు మహాతేజంతో సిద్ధమయ్యాడు.

హనుమంతుడు దేవతలకు మ్రొక్కి, మహేంద్రగిరిపైనుండి లంఘించి, రామబాణములా లంకలో వ్రాలాడు. చీకటి పడిన తరువాత లంకిణిని దండించి, లంకలో ప్రవేశించి, సీతను వెదుకసాగాడు. రామలక్ష్మణులకు, జానకికి, రుద్రునకు, ఇంద్రునకు, యమునకూ, వాయువునకూ, సూర్య చంద్రులకూ, మరుద్గణములకూ, బ్రహ్మకూ, అగ్నికీ, సకల దేవతలకూ నమస్కరించి అశోకవనంలో సీతను వెదకడానికి బయలుదేరాడు. అక్కడ శింశుపా వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, భీతయై కృశించిన సీతను చూచాడు. ఈమె సీతయే అని నిర్ధారించుకొన్నాడు. సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమునూ, రాముని దుఃఖమునూ వివరించి, రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. సీత దుఃఖించి, అందరి క్షేమసమాచారములు అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది. హనుమంతుడు భక్తితో ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, శుభలక్షణములు గలవాడు, అనన్య సుందరుడు అయిన రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించగా విని సీత ఓరడిల్లినది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చింది. ఒక్క నెలలో రాముడు తనను కాపాడకున్న తాను బ్రతుకనని చెప్పినది.

ఇక హనుమంతుడు ఉగ్రాకారుడై వనమునూ, అడ్డు వచ్చిన వేలాది రాక్షసులనూ, రావణుడు పంపిన మహా వీరులనూ హతముచేసి, చివరకు [ఇంద్రజిత్తు] వేసిన [బ్రహ్మాస్త్రము|బ్రహ్మాస్త్రానికి]వివశుడైనట్లు నటించి రావణుని వద్దకు వెళ్ళాడు. సీతమ్మను అప్పజెప్పి రాముని శరణువేడి, లంకను కాపాడుకోమనీ, ప్రాణాలు దక్కించుకోమనీ హితవు చెప్పాడు. రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి, మరొక్కమారు సీతను దర్శించి, మరల వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరిపై వ్రాలాడు.

హనుమంతుడు చేసిన మహోపకారానికి రాముడు ఇంతటి క్లిష్టకార్యమును మరెవ్వరు సాధింపలేరు. మా అందరి ప్రాణములను నిలిపిన ఆప్తుడవు నీవు. నీవంటి దూత మరొకరు లేరు. గాఢాలింగనము కంటె నీకు నేనేమి బహుమానము ఇవ్వగలను అని హనుమను కౌగిలించుకొనెను. తరువాత అందరూ తర్కించి యుద్ధమునకు నిశ్చయించారు. సరైన సమయము చూసి, నీలుని నాయకత్వములో బ్రహ్మాండమైన కపిసేన దక్షిణమునకు పయనమై సాగరతీరము చేరుకొన్నది. రావణుని తమ్ముడైన విభీషణుడు రావణునితో విభేదించి, సాగరముదాటి, రాముని శరణు జొచ్చెను. కానున్న లంకాధిపతివని రాముడు విభీషణునకు ఆశ్రయమిచ్చి, కానున్న లంకాధిపతిగా సాగరజలాలతో అభిషిక్తుని చేయించెను. ఇక సాగరమును దాటుటకు అద్భుతమైన వారధి నిర్మాణము విశ్వకర్మ కొడుకైన నలుని పర్యవేక్షణలో జరిగింది. వానర భల్లూకసేనల, రామలక్ష్మణులు వారధి దాటి లంకను చేరారు. 

ఇరు పక్షాలవారూ వ్యూహాలు సన్నద్ధం చేసుకొన్నారు. చిట్టచివరి ప్రయత్నంగా రాముడు పనిచిన అంగదరాయబారం విఫలమైనది. 

అంటూ వానరసేన లంకను ముట్టడించింది. మహాయద్ధం జరిగింది. వానరులచేతిలో రాక్షసవీరులు భంగపడ్డారు. దానితో ఇంద్రజిత్తు మాయాయుద్ధమారంభించి నాగాస్త్రంతో రామలక్ష్మణులను వివశులను చేసి శతృసైన్యాన్ని భయకంపితులను చేశాడు. అంతా విషణ్ణులైన సమయానికి గరుత్మంతుడు మహాప్రభంజనంలా వచ్చి వారిని నాగబంధాలనుండి విముక్తులను చేశాడు.

అనేకమంది రాక్షస వీరులు వానరుల చేత, రామలక్ష్మణులచేత హతులయ్యారు. రావణుడు స్వయంగా మహావీరులైన రాక్షసగణాలను వెంటబెట్టుకొని యుద్ధానికి వెడలాడు. అప్పుడు జరిగిన భీకరసంగ్రామంలో రావణుని కిరీటము నేలబడింది. ధనుసు చేజారింది. విశ్రాంతి తీసికొని మరునాడు యుద్ధానికి రమ్మని రాముడు రావణుని పంపేశాడు. అవమాన భారంతో కృంగిన రావణుడు తన సోదరుడైన కుంభకర్ణుని నిదురలేపి యుద్ధానికి పంపాడు. కుంభకర్ణుడు వానరులను కరకర నమలి మ్రింగుతూ, ఎండు అడవిని అగ్ని కాల్చినట్లుగా వానరసేనను నాశనం చేయసాగాడు. లక్ష్మణునిబాణాలు కుంభకర్ణుని నిలువరించాయు. రాముడు దివ్యాస్త్రాలతో వాని బాహువులనూ, ఊరువులనూ ఖండించగా వాడు పర్వతంలా క్రిందపడ్డాడు.

మరునాడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి అందరూ వివశులయ్యారు. హనుమంతుడు పర్వతసమేతంగా ఓషధులను తెచ్చి అందరినీ పునరుజ్జీవితులను చేసి, మరల పర్వతాన్ని యధాస్థానంలో ఉంచి వచ్చాడు. లక్ష్మణుడు అన్న ఆశీర్వాదము పొంది, హనుమంతుని భుజాలపై ఆసీనుడై వెళ్ళి, ఇంద్రజిత్తును చంపేశాడు.

ఇక రావణుడు మహోదరాది మహావీరులతో యుద్ధానికి వెడలాడు. లక్ష్మణుడు దారుణంగా గాయపడ్డాడు. అప్పుడు రాముడు తనవారిని ఉద్దేశించి - మీరు సౌమిత్రిని రక్షిస్తూ, యుద్ధం చూస్తూ ఉండండి. నేను రాముడంటే ఏమిటో చూపిస్తాను. రావణ సంహారం చేసి వస్తాను అన్నాడు. రామ రావణ సంగ్రామం ప్రళయకాలాగ్నివలే చెలరేగినది. రావణుని అస్త్రంతో లక్ష్మణుడు కూలిపోయాడు. రాముడు విలపించసాగాడు. హనుమంతుడు మరల గిరిశిఖరానికి వెళ్ళి, శిఖరంతో సహా ఓషధులను తెచ్చి వాసన చూపగా లక్ష్మణుడు లేచి నిలబడి, అన్నా! ఈ సాయంసంధ్యలో రావణుడు కడతేరాలి అన్నాడు.

రామునకు సహాయంగా ఇంద్రుడు మాతలిని సారథిగా పంపాడు. యుద్ధ పరిశ్రాంతుడై యున్న రామునకు అగస్త్యుడు ఆదిత్య హృదయమును ఉపదేశించాడు. రాముడు దానిని మూడు మార్లు జపించాడు. రాముడు, రావణుడు శరవర్షాన్ని కురిపింపసాగారు. రామరావణ యుద్ధం రామరావణ యోరివ - వారి యుద్ధానికి మరొకటి పోలిక లేదు - అని దేవగణాలు ఘోషిస్తున్నాయి. రావణుని తలలు తెగి పడుతున్నా మరల మరల మొలుస్తూనే ఉన్నాయి. రామా! ఇలా కాదు. బ్రహ్మాస్త్రాన్ని సంధించు అని మాతలి అన్నాడు.

రాముడు సంధించిన బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణుని గుండెను చీల్చి, తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరింది. రాముడు ఎరపెక్కిన కన్నులతో, శరదళితదేహంతో, కోటి సూర్యుల ప్రకాశంతో, ధనుస్సును నేలకానించి, మరో చేత బాణాన్ని త్రిప్పుతూ వీరశ్రీబంధురాంగుడై త్రిదశపతినుతుడై శోభిల్లాడు. సకలదేవతలు రామునకు అంజలి ఘటించారు.

అనంతరం రాముని నిరాకరణతో క్రుంగిపోయిన సీత అగ్ని ప్రవేశం చేసి తన ధర్మనిరతిని లోకానికి నిరూపించింది. సీతారామలక్ష్మణులు సపరివారంగా అయోధ్యకు తిరిగివచ్చారు. వైభవంగా సీతారాముల పట్టాభిషేకం జరిగింది.

రావణాది దుష్టులెల్లరును మడసిరి కావున రామా నీవీ అవతారమును చాలింపుము అని యముడు అనెను.రాముడు, ఆతని సోదరులెల్ల సరయూనదిలో దిగి వారి అవతారములు చాలించిరి.




#Article 98: కల్క్యావతారము (228 words)


కల్కి అవతారము, దశావతారములలో పదవ అవతారము అని హిందువుల విశ్వాసము. కలియుగాంతములో విష్ణువు కల్కిగా అవతరించనున్నట్లు భావిస్తారు. ఇతను శంభల అను గ్రామములో విష్ణుయశస్సు అను బ్రాహ్మణుని ఇంటిలో జన్మిస్తాడు. వీర ఖడ్గం ధరించి, తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ, దోపిడీ దొంగలుగా మారిన అందరు నాయకులను సంహరించి తిరిగి సత్య యుగమును ధరణి పై స్థాపిస్తాడు.

పురాణాలలో బాగా ముందు వచ్చిందని (7వ శతాబ్దపు గుప్తులనాటిదని) చెప్పబడే విష్ణు పురాణంలో కల్క్యావతారం ప్రస్తావన ఉంది. అగ్ని పురాణం (గౌతమ బుద్ధుడు దశావతారాలలో ఒకడని అగ్నిపురాణంలో మొదటిసారిగా వ్రాశారు) లో కూడా కల్కి గురించి చెప్పారు. వీటికి చాలా తరువాతి కాలందని భావింపబడే కల్కి పురాణంలో కల్కి అవతారం గురించి విపులంగా చెప్పారు. 

అగ్ని పురాణం - దుష్టులు (అనార్యులు) సత్పురుషులను పీడించే సమయంలో, కల్కి భగవానుడు విష్ణుయశుని పుత్రునిగా, యాజ్ఞవల్క్యుని శిష్యునిగా అవతరిస్తాడు. చతుర్వర్ణ వ్యవస్థను పునరుద్ధరిస్తాడు. జనులు తిరిగి సన్మార్గోన్ముఖులవుతారు.(16.7-9). అనంతరం కల్కి అవతారాన్ని సమాప్తి గావించి హరి వైకుంఠానికి వెళతాడు. తిరిగి సత్యయుగం ఆరంభమవుతుంది. (16.10)

విష్ణు పురాణం - వేదోక్త ధర్మ విధులు క్షీణించినపుడు కలికాలాంతం సమీపిస్తుంది. అపుడు విరాట్పురుషుడు కల్కిగా శంభల గ్రామంలో విష్ణుయశుని ఇంట అవతరిస్తాడు. తన పరాక్రమంతో మ్లేచ్ఛులను, చోరులను నాశనం చేస్తాడు. దర్మాన్ని పునరుద్ధరిస్తాడు. జనులు సన్మార్గాన్ని అనుసరించ మొదలు పెడతారు. అలాంటివారి సంతానం కృతయుగ ధర్మాన్ని ఆచరిస్తారు. సూర్యుడు, చంద్రుడు,  lunar asterism Tishya, బృహస్పతి ఒకే రాశిలో ఉన్నపుడు కృతయుగం ఆరంభమవుతుంది.(4-24)

పద్మ పురాణం - కల్కి దేవుడు కౄరులైన మ్లేచ్ఛులను సంహరించి, విపత్తులను తొలగించి సద్బ్రాహ్మణులకు సత్యం బోధిస్తాడు. వారి క్షుధార్తిని పరిహరిస్తాడు. అప్రతిహతంగా ధర్మరాజ్యాన్ని పరిపాలిస్తాడు.(6.71.279-282)

భాగవతం - కలియుగాంతంలో సాధువుల ఇంట కూడా దైవచింతన నశిస్తుంది. శూద్రులు ఎన్నుకొన్న వారే పాలకులౌతారు. యజ్ఞయాగాదులు మచ్చునకైనా కానరావు. అపుడు భగవంతుడు అవతరించి ఈ విపత్తును దూరం చేస్తాడు.(2.7.38) భగవానుడు దేవదత్తమనే తెల్లని గుర్రాన్ని అధిరోహించి, ఖడ్గము చేతబట్టి భూమండలంపై విహరిస్తూ సకలసద్గుణైశ్వర్యాలను ప్రదర్శిస్తాడు. రాజులుగా నటించే దుష్టులను హతమారుస్తాడు (12.2.19-20)

కల్కి పురాణం -లో ఈ భావాలన్నీ కలిసి ఉన్నాయ. కల్కికి పరశురాముడు యుద్ధవిద్యలు బోధిస్తాడని చెప్పబడింది.




#Article 99: సప్త ద్వీపాలు (1011 words)


బ్రహ్మాండ పురాణములోను, మహాభారతంలోను, భాగవతం సప్త ద్వీపాలగురించి ఉంది.

బ్రహ్మాండపురాణంలో సూతుడు ప్రపంచములోని భూభాగములు, జలభాగముల గురించి ఇలా చెప్పాడు - స్వాయంభువమనువు కొడుకు ప్రియవ్రతుడు. ఈయనకు మొదటి భార్యవలన ఉత్తమ, తామస, రైవతులు జన్మించారు.రెండవ భార్య బర్హిష్మతి. ఈమెవలన అగ్నీధ్ర, ఇధ్మజహ్వ, యజ్ఞబాహు, మహావీర, హిరణ్యరేతస, గృహపుష్ఠ, సవన, మేధాతిధి, వీతిహోత్ర, కలి, ఊర్జస్వతీ, అనేవారు జన్మించారు.వీరిలో మహావీర, సవన, కలి అనేవారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు.స్వాయంభువ మనువు తన మనుమలలో ఏడుగురిని ఏడు ద్వీపములకు చక్రవర్తులను చేసెను. వారు తమ తమ సంతానానికి ఆయా ద్వీపాలను పంపకం చేయడం వలన అనేక రాజ్యాలు ఏర్పడినాయి.
అలా ముందుగా వివిధ ద్వీపాలకు చక్రవర్తులైన మనువు మనుమలు

ఈ క్రిందివే సప్త ద్వీపాలు :

(ప్రస్తుతం మనము ఉంటున్నది) జంబూ అనగా నేరేడు పండ్లు, లేదా గిన్నెకాయలు. ఇవి ఎక్కువగా ఉంటాయి కనుక ప్రస్తుతము మనము ఉంటున్న ద్వీపాన్ని జంబూద్వీపము అంటారు. జంబూద్వీపము 9 వర్షాలు లేదా భాగాలుగ విభజించబడింది. అవి

ఈ ద్వీపము చుట్టు లవణాంబుధి యున్నది. ఈ ద్వీపంలో 6 పర్వతాలు - హిమాలయము, మేరు పర్వతము, నీలాచలము, హిమాచలము, శ్వేతాచలము, మాల్యవంతము, గంధమాదనము, వింధ్యపర్వతము.

తన తండ్రి ఆస్తిలో జంబూద్వీపానికి అగ్నీధ్రుడు అధికారి అయినాడు.ఈయనకు 9 మంది పిల్లలు కలిగి ఉన్నారు.మొదటివాని పేరు అజ, అజనాభి, నాభి అని కంపిస్తుంది. మిగిలినవారి పేర్లను బట్టి కింపురుష, హరి, ఇలావృత, రమ్యక, హిరణ్మయి, కురు, భద్రాశ్వ, కేతుమాల వర్షాలు వచ్చినవి.అజ శబ్దమునుంచి ఆసియా వచ్చింది.

జంబూ శబ్దము వృక్షనామము. ఈ వృక్షాలు విరివిగా కంపించే దేశము జంబూద్వీపము.నేటికి కూడా మనదేశములో ఒక భాగాన్ని జమ్ము అనిపిలుస్తున్నాము.హిమాలయాలలో ప్రవహించే నదులకు టిబెట్ దేశస్థులిచ్చినపేరు చివర సంపో లేక త్సంసో అనే శబ్దం కంపిస్తుంది. ఇది జంబూ శబ్దమే.

ఇది జంబూద్వీపంకంటే రెండురెట్లు పెద్దది. ఇందు ప్లక్ష (జువ్వి) చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ ద్వీపానికి ఒకవైపు ఉప్పునీటి సముద్రము, మరొకవైపు రససముద్రము ఉన్నాయి. 

ఇది ప్లక్ష ద్వీపంకంటే పెద్దది. ఇందులో ఒక మహోన్నతమైన శాల్మలి (బూరుగు) వృక్షం ఉంది. ద్వీపానికి ఒక ప్రక్క ఇక్షుసముద్రము, మరొక ప్రక్క సురసముద్రము ఉన్నాయి.

ఇది శాల్మలీ ద్వీపంకంటే రెట్టింపు పెద్దది. ద్వీపానికి ఒక ప్రక్క ఘృతసముద్రము, మరొక ప్రక్క సురసముద్రము ఉన్నాయి.

ఈ ద్వీపానికి ఒక ప్రక్క ఘృతసముద్రము, మరొక ప్రక్క దధిసముద్రము ఉన్నాయి.

ఇది క్రౌంచ ద్వీపంకంటే రెట్టింపు పెద్దది. వలయాకారంలో ఉంది. కేతువు అనే మహావృక్షం ఉంది. ద్వీపానికి ఒక ప్రక్క మంచినీటి సముద్రము, మరొక ప్రక్క పెరుగు సముద్రము ఉన్నాయి.

ఇది శాక ద్వీపంకంటే రెట్టింపు పెద్దది. ద్వీపానికి ఒక ప్రక్క మంచినీటి సముద్రము, మరొక ప్రక్క క్షీర సముద్రము ఉన్నాయి.

జంబూ ద్వీపస్థులు ఈజిప్టు దాకా వలసపోయినారని చెప్పటానికి చాలా ఆధారాలున్నాయి.ఈజిప్టు చరిత్రలో కంపించే హోవనిభు శబ్దము అజనాభా శబ్దమునుంచి వచ్చినదే.గ్రీకు దేశపు దేవుడగు బాకస్, ఈజిప్టులోనున్న ఒసిరస్ అనే దేవత ఒకటె.మేరోస్ అనే పర్వతం మీద ఈ దేవత విద్యనభ్యసించచెనని లెంప్రీర్ నిఘంటువులో సహితం చెప్పబడింది.ఇది మేరు పర్వతము. ప్లినీ ఈ ప్రదేశమున నైస అని పిలిచినప్పుడు నిషధశబ్దభవము.

ఈజిప్టులో నైలునది ప్రధానమైనది. దీనిని వారు నీలపునైల్ అని ఆప్యాయంగా పిలుస్తారు.వస్తుతః నైల్ శబ్దము సంస్కృత నీలశబ్దము నుంచి వచ్చినదే కావటముచేత నీలపునైల్ అనేవారు.అసలు అయిప్టస్ 
నైలునది మొదటి పేరు. ఈ శబ్దము అజశాబ్దమునుంచి వచ్చింది.అజమనగా మేక.ఖ్నుము అనే దేవతకు వెనుక రోజులలో ఈజిప్ట్ దేశస్థులు మేకతలనిచ్చారు.అమలెయియా అనే మేక పెంచటం చేతను, మేకతోలును డాలుగా కట్టుకొనటం చేతను జుపిటర్ అనే దేవతను వీరు జుపిటర్ అయియోకప్ అన్నారు.మేకపాదాలుండటం చేతను పాక్ అనే దేవుడిని పాక్ ఆయిపాక్ అన్నారు.దక్ష ప్రజాపజాపతికి మేకతల ఉన్నట్లు ఖ్నుము అనే దేవతకు మేకతల నిచ్చారు.ఈజిప్టును పాలించిన ఫారోలుర అనే సూర్యదేవుని సంతతివారుట!ఈర అనే దేవతను రని అంటారు. ఈ రనిని ఈజిప్టుదేశంలో వానరాలని పోలిన రెండు జంతువులతో పోలుస్తారు.నాగలోకంలో సూర్యుని హయశిరస్ అని అంటారని ఉద్యోగపర్వం (99.5) చెప్పుతున్నది. ఈజిప్టులో సూర్యుడికి మరొక పేరు హోరుస్ అనే గరుడుడు, ఉరెయిస్ అనే ఉరగము కూడా ఉండేవి. పరశురాముడు, ఆయన గండ్రగొడ్డలి లేకపోతే ఈజిప్టుదేశపు ప్రాచీన చరిత్రయే లెదని అంటారు.గరుడుడు, నాగులు శాల్మలీ ద్వీపానికి వలసపోయినారని సంప్రదాయమే చెబుతున్నది.

ఈజిప్టును క్రీ.పూ 7వ శతాబ్దములో తర్హక అనే ఇధియోపియా రాజు పాలించాడు.ఇది తారకాసుర శబ్దముమనటంలో సందేహములేదు.అజనాభాుని సంతతివారైన భారతీయులు ఆఫ్రికాలో కూడా స్థిరనివాసులైరి అని చెప్పవచ్చును.

అగ్నీధ్రుని సంతతిలో ఇలావృత శాబ్దము కనిపిస్తున్నది.అలై పర్వతాలకు చెందిన జుంగరియా శ్రేణిలో ఇలి అనే నది ఉంది. దీని ఉపనది ఒడ్డున వెర్నో అనే నగరమున్నది.ఇది వరుణ శబ్దము. వరుణిని నగరమును నిమలోనని భాగవతము పేర్కొన్నది.ఇది అస్సీరియాలో నిమ్రోద్ అనిపిస్తున్నది.దీనికి దక్షిణముగా యముడు నగరమైన సంయమని పురమున్నదన్నారు.అరేబియా సముద్రము లోకి దారితీసే సొన్మియస్ అఖాతపు తెరములో సాన్మియని ఊరు నేటికి ఉంది.

ఇలావృత వర్షములలో మధ్యగా మహామేరు ఉంది. దీనికి తూర్పుగా భద్రాశ్వ వర్షము, పశ్చిమంగా కేతుమూలవర్షము లున్నవని వాయు పురాణము, మత్స్య పురాణములు చెప్పుచున్నవి. ఈ మేరు పర్వతం నుంచి అనేక పర్వతాలు బయలు దేరినవి.వీటిలో కురంగ (కుయుక్లెన్), కురకర (కరకోరం), కుసుంభ (హిందుఖుష్), వైకంటక (విటిం), శంఖ (ఖింగన్), రుచక (రుష్య), అనే పేర్లు కనిపిస్తున్నవి.

ఇధ్మజిహ్వునకు సంక్రమించినది ప్లక్ష ద్వీపము.అస్సీరియా దేశచరిత్రలో ఇష్మిదగోన్ అనే మొట్ట మొదటి రాజు కనిపిస్తాడు.ఈయన కుమారుడు షమష్ రమన్. ఈపేరునకు పూర్వరూపము క్షేమ శబ్దంలో కనిపిస్తుంది.ఇధ్మజిహ్వునకు శివ, యశస్య, సుభద్ర, శాంతక్షేమ, అభయ, అమృతులనే 7గురు కొడుకులునారని భాగవతు చెబుతున్నది.అస్సీరియా పాలించిన రెండవరాజు షమష్ రమన్.ఇంతే కాకుండా నిమ్రోద్ పాలించిన మేషరాజు పూజించిన దేవుళ్ళలో ఖేమోష్ అనే దెవుడున్నాడు.అసియాలో గల తుర్కిస్థానును శివులు పాలించారు.సుభద్ర శబ్దము కబర్దగాను, అభయ శబ్దము అరేబియాగాను మారింది. అమృతశబ్దము అర్మీనియా కావచ్చును.ఇర్మక్ నదీ తీరము అమెసియాలో నున్నది.

ప్లక్ష ద్వీపానికి లవణ సముద్రమును చెప్పినారు. దీనిని క్షార సముద్రమని అంటారు.నేడు ఖొరొసాక్ అని పిలువబడేది క్షారసముద్రమే.ఈద్వీపంలో అరుణ, అంగిరసీ, సత్యంభరా, సుప్రభాతా, సృమణ అనే నదులుండేవి.సిరియాలోని ఒరెంటిస్కు ప్రాచీన నామము అరుణ.అంగిరసీ నది - అనటోలియాలోని సింగరియస్.నేడు టైగ్రిస్ అని పిలవబడే నదిని ప్రాచీనకాలంలో షత్తెలమర అన్నారు.ఇసి సత్యంభర.సుప్రభాత నది యూప్రటిస్ గా మారినది.స్మర్నా అనే నగరము నేడుండేచోట సృమణానది ఉండవచ్చును.ఈద్వీపంలో మణికూట (మనిష్ట్) ధూమ్రపర్ణ (ధూమన్లు) మేఘమాల (మేర్ఖుంచ్) ఇంద్రసేన (అందిష్) వజ్రకూట (బజర్గొట్ప) పర్వతాలున్నవి.ఈ పేర్లను పరిశీలిస్తే అర్ధవంతమైన నామములు సంస్కృతములో కనిపిస్తున్నవి.భారతీయులే ఈపేర్లను స్థిరపరచినారని స్పష్టముగా తెలియుచున్నది.

శాల్మలీ ద్వీపము యజ్ఞబాహువునకు వచ్చింది.ఇచ్చట ఇస్ఖుసముద్రమున్నదన్నారు.ఈజియన్ సముద్రములో ఒకభాగానికి నేటికీ మర్క్ ఇకారియం అని పేరున్నది.ఇక్షు శాబ్దము ఇక అని మారినది.ఉత్తర ఆఫ్రికాలోని నూబియా ప్రాంతంలో శాల్మి, ఎల్ సొలిమనిష్లు ఉన్నాయి.సొమాలి దేశముకూడా ఉంది.యజ్ఞబాహువు యొక్క 7గురు కొడుకులు వారి వారిపేర్లను ఆయా ప్రాంతా ల కిచ్చారు.సోమాలికి పడమరగా సురొ ఉంది.ఇది సురొచునకి చెందినది.సౌమనస్యుని ద్వారా సొనాన్, రమణకుని వలన మూరాకోలోని రిహ్మన, దేవబర్హుని నుంచి ధేబయిద్ అని పిలవడు ఉత్తర ఈజిప్ట్, పరిబర్హుని వలన బర్చరి, ఆప్యాయునినుంచి అబిస్సీనియా, అభిజ్ఞాతుని ద్వారా అబైనది ప్రవహించు ప్రాంతము అంవర్ధములైనవి.దక్షిణ ఈజిప్ట్ లో చాలా కాలము వరకు గరుడుడే పతాకచిహ్నముగా గ్రహించబడినాడు.

హిరణరేతుసునికి వచ్చినది కుశద్వీపము.ఇచట ఘృతోదధి ఉన్నదన్నారు.ఘృతశబ్దము నేడు క్రీట్ అని పిలవబడి కృతశబ్దమునకు మూలరూపము.హిరణ్యరేతుసునకు 7గురు పుత్రులున్నారు.వసుదానుడు మసెదోనియాను, గుప్త అనువాడు కోపియస్ ను, సత్యవ్రతుడు స్పార్టాను, లిప్రుడు ఎపిరస్ ను, వామదేవుడు ఎమధియా అనబడ్డ ధెస్సలీని బయటకు తెచ్చారు.కుశద్వీపానికి చివర దధిమంతో దధి ఉంది.ఇది నేటి దల్మాషియా కావచ్చును. వస్తుతః హిరణ్యరేతశబ్దము ట్రోజను వీరుడగు ఈనియంపేరులో కనిపించును.ఈ శబ్దాలు సంస్కృత భాషను భారతదేశమును సూచించేవి.

గృహపృష్టునకు క్రౌంచద్వీపము వచ్చింది.దధి మంధసముద్రము ఇచ్చట గలదన్నారు.మెడిట రేనియన్ సముద్రమున గల మొదటపదానికి అంతర్మధనమని అర్ధము సరిపోతుంది.ఈతని 7గురు కొడుకులు మధువహుని నుంచి మాల్బేలియా, సుదాముని ద్వారా స్వీడన్ ఋషిజ్యుని వలన రష్యా, లోహితార్ధుని ద్వారా లిధునేనియా వనస్పతినుంచి ఆస్త్రియాలోని బనత్ బయలుదేరినవి.మేఘపృష్టుడు పాలించిన ప్రాంతము ప్రష్యా కావచ్చును.

శకద్వీపాన్ని గ్రహించినవాడు మేధాతిధి.ఈయన సంతతిలో పురోజన (బరీషేవ), మనోజవ ( మెజెక్), విశ్వచార (పెట్చొర), వేపమాన, ధూంరానీక, చిత్రరధ, బహురూపులున్నారు.ఈ ప్రాంతంలో ఊరుశృంగ (ఊరల్) పర్వతమున్నది.ఈశాన, బలభద్ర, శతకేసర, సహస్రస్రోత, దేవపాల, మహాన పర్వతాలు ఆల్ప్స్ లోని, రష్యా, జర్మనీలలో ఉండవీలున్నది.దీనికి ఉత్తరముగా శ్వేతద్వీపమున్నది. ఇది విపరీతమైన ఉష్ణగోళమని శాంతిపర్వము (335,335) చెప్పుతున్నది.

వీతిహోత్రునకు పుష్కరద్వీపం వచ్చింది.ఇది అత్యుత్తర ప్రాంతం కావచ్చును.కాని ఇతనిపుత్రులు రమణక, ధాతకులని చెప్పబడుటచేత ఇది ధనునికోహ్ ప్రాంతం కావచ్చును.ఇచట కనిపించే అర్వాచీన పర్వతమే అరల్, ఐరుక పర్వతములు.ప్రాచీన పర్వతము పరక్టెచేసెగా కనిపిస్తున్నది.ఇచ్చట సాగ్దియానమున్నది.దీనినే భారతీయులు స్వర్గదేవయాన మని అంటారు.ఈ పుష్కర ద్వీపంలో లోకపాలుర నగరాలునాయన్నారు.

ఆర్యులు భారతదేశము నుండి పశ్చిమముగాను, ఉత్తరముగాను మాత్రమే ఇతర దేశాలను కనుగొనలేదు.ఆ ప్రాచీన భారతీయులు దక్షిణంగాను, తూర్పుగాను కూడా వెళ్ళినారు.భారతదేశానికి దక్ష్ణంగా మహాసముద్రంలో విద్యుత్వాక్ పర్వతశ్రేణులలో అనేక ద్వీపాలు బయలుదేరినవి.ఇందలి ప్రజలు పొట్టివారు, మేఘశ్యామ వర్ణము కలవారు.ఫలపుష్పాలను తినువారు. అల్పాయువు గలవారని వాయుపురాణము చెప్పినది.ఇవి కాక బర్హణద్వీపముతో కలసిన 7 ద్వీపాలు ఇచట ఉన్నవన్నారు.బర్హణ (బోర్నియా), అంగ, యవ (జావా), మలయ, శంఖ (సయూం, కుముద (కాంబోడియా), కుశ (కూప్), వరాహ (ఆస్ట్రేలియా) ద్వీపాలిక్కడ ఉన్నాయి.అంగ ద్వీపము బాలిద్వీపము కావచ్చును.నాగజాతికి ప్రధానమైన కేంద్రము అంగ ద్వీపమని, ఇచట మ్లేఛ్చులున్నారని, చక్ర పర్వతాలిక్కడ కలవని వాయుపురాణము (48,17-18) చెప్పినది.వెండి బంగారు గనులు, గంధపుచెట్లు, మహామలయపర్వతము గల మలయ ద్వీపమున మ్లేఛ్చులు గలరని, ఇచటనే అగస్యుని ఆశ్రమము కలదని వాయు పురాణము (48,20-29), మత్స్య (163,74-78) చెప్పినవి.

ఈవిధంగా రేఖాంశలను నిఋనయించినవారు భారతీయులే అని కొందరి అభిప్రాయము. భూమిపై పలు ప్రాంతాలకు వీరు గావించిన నామములే నేటికీ ప్రసిద్ధిలో ఉన్నవందురు.ఇతూవంటి సందర్భములో ఆర్యులు భారతదేశానికి ఎక్కడనుండో వలసవచ్చినవారు కారని వారిది భారతదేశమే స్వదేశమని, వీరే ఇచట నుండి ఇతరదేశాలకు వలసవెళ్ళిరని పలువురి అభిప్రాయము.




#Article 100: సి (917 words)


సి ఒక కంప్యూటర్‌ భాష. దీనిని మధ్య స్థాయి భాషగాను లేదా క్రింది స్థాయి భాషగాను ఉపయోగించుకోవచ్చు. 'సి' ని 1970లో కెన్ థాంప్సన్, డెన్నిస్ రిచీ అను శాస్త్రవేత్తలు తయారు చేసారు. ఇప్పుడు ఈ భాషను కంప్యూటింగ్ రంగంలో చాలా విస్త్రుతంగా వాడుతున్నారు. అంతే కాదు, ఈ భాషకు ఉన్న కొన్ని ప్రత్యేకతల వలన క్రింది స్థాయి అప్లికేషన్ల డెవలప్మెంట్ కు చాలా మంచి భాషగా ప్రాముఖ్యత పొందింది.

ప్రోగ్రామింగ్ భాష అంటే ఒక యంత్రానికి (ముఖ్యంగా కంప్యూటరుకు) అది చేయవలసిన పనులను తెలియచెప్పడానికి రూపకల్పన చేసిన కృత్రిమమైన భాష. ప్రోగ్రామింగ్ భాషలతో యంత్రము యొక్క ప్రవర్తనను నియంత్రించడానికి ప్రోగ్రాములు తయారుచేయవచ్చు. అంతేగాక వీటిని మనిషికి-యంత్రానికి మధ్య సంభాషణ కొరకు ఒక మార్గముగా పరిగణించవచ్చు. ఇవి అనేక రకాలు. ఉదాహరణకు

సి భాష మొట్టమొదట ఏటీ  టీ బెల్ పరిశోధనాలయంలో (ATT Bell Labs) 1969కు 1973 మధ్యన తయారు చేయటం జరిగింది. ఎక్కువ భాగం 1972లో తయారయింది. 'సి' కంటే ముందు 'బి' అనే కంప్యూటరు భాష ఉండేది. 'సి'కి సంబంధించిన చాలా విశేషాలను 'బి' నుండే తీసుకున్నారు. ఆంగ్లములో 'బి' తరువాత 'సి' వస్తుంది. ఈ రెండు కారణాల వలన 'సి' కి ఆ పేరు పెట్టడము జరిగింది. 1973 వచ్చేసరికి సి భాష మంచి రూపును సంతరించుకుంది, అటు తరువాత సి భాషను ఉపయోగించి యునీక్సు (ఆపరేటింగ్ సిస్టమ్) కెర్నలుని మరలా నిర్మించారు.

సి-భాష నేర్చుకొనేముందు మీకు కంప్యూటరు గురించి ప్రాథమిక పరిజ్ఞానము ఉండవలెను. అయితే మీకు ప్రోగ్రామింగుకి సంబంధించిన పరిజ్ఞానము పెద్దగా అవసరము లేదు.
సి-భాష నేర్చుకొనేందుకు మీకు ఒక సి-కంపైలరు (సాఫ్ట్వేర్) కావలెను.
మీరు విండోసు ఆపరేటింగ్ సిస్టం వాడుతున్నట్లయితే

మీరు లినక్స్ ని వాడుతున్నట్లయితే gcc ఈపాటికే మీ కంప్యుటరులో ఉండాలి.

సి కంఫైలర్ ఉపయెగించే పద్థతి
'సి' భాష అసెంబ్లీ భాష (assembly language)కు బాగా దగ్గరగా ఉంటుంది. అందుకనే, సి భాషను అప్పుడప్పుడు portable assembly అని పిలుస్తారు. ఒకసారి సి భాషలో రాసిన ప్రోగ్రాముని దాదాపు ఏ యంత్రములోనయినా కంపైలు (compile) చేసుకొని వాడుకోవచు. కానీ అసెంబ్లీ భాషలో ఇలా అన్ని యంత్రాలకు సరిపోయేటట్లు ప్రోగ్రాములను వ్రాయటము కుదరదు.

అసలు 'సి' భాషను సులువుగా నేర్చుకోడానికి, ముందుగా మనకు అల్గారిథం (algorithm), క్రమచిత్రం (flowchart) ల గురించి తెలియాలి.

ఆల్‌గారిధమ్ (ALGORITHM):

 కంప్యూటర్ పై ఒక సమస్యను పూరించేందుకు మనం ఆజ్ఞల సమితిని జారి చేయడానికి వాడే సోపాన క్రమవిధానాన్ని సాంకేతికంగా ఆల్‌గారిధమ్ అంటారు.
(లేదా)
 ఒక పనిని పూర్తి చేయడానికి కొన్ని సూచనలను ఒక క్రమ పధ్ధతిలో ఉపయోగించుకోనే విధానాన్ని ఆల్‌గారిధమ్ అంటారు

ఆల్‌గారిధమ్ అనేది ఏ కంప్యూటర్ భాషకుకి అయిన పునాది వంటిది. ఆల్‌గారిధమ్ (algorithm) ను కంప్యూటర్ అర్దం చేసుకొలేదు, ఏందుకు అంటే ఆల్‌గారిధమ్ (algorithm) ను మనం మన సొంత భాషలో వ్రాసుకొవచ్చు. ఆల్‌గారిధమ్ (algorithm) ను కంప్యూటర్ అర్దం చేసుకోవాలి అంటే దానిని మనం కంప్యూటర్ అర్దం చేసుకునే విధంగా వ్రాయలి. కంప్యూటర్ అర్దం చేసుకునే భాషను ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ (Programming language) అంటారు.

ఒక సమస్యను తీసుకుంటే దానికి ఆల్‌గారిధమ్ ఏలా వ్రాస్తారు ఇప్పుడు చూద్దాం..
ఇచ్చిన రెండు సంఖ్యలను కూడడం (add) :

వివరణ:
మనం ఏద్తెన పనిని చేయాలి అంటే ముందు దానిని start చేయాలి. అందుకే ప్తెన problem1 లో step1 అనేది start చేయడం. తర్వాత steps అనేవి మనం Slove చేసే Problem మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏద్తెన పనిని start చేస్తే దానికి Ending కూడా ఉంటుంది. అందుకే last step (step6)అనేది End చేయడం

క్రమచిత్రం (FLOW CHAT):

సమస్య సాధనకు రాసిన ఆల్‌గారిధమ్ కి బోమ్మలతో కూడిన వర్ణనను క్రమచిత్రం అనవచ్చు. క్రమచిత్రం (flowgraph)ని వివిధ రకాల boxes, symbols తో గీయాలి చేయవలసిన పనిని (operation)box లోపల వ్రాస్తారు. మొత్తం boxes, symbols అనేవి Arrow ద్వారా connect చేయబడి వుంటాయి .ఈ విధంగా arrow తో connect చేయడం వలన algorithm యొక్క క్రమాన్ని మనం తేలుసుకోవచ్చు.
క్రింది figure క్రమచిత్రంలో ఉపయోగించే వివిధ రకాల symbols and boxes గురించి చేబుతుంది..

ఇచ్చిన రెండు సంఖ్యలను add చేయడం (a=2 b=3 c=a+b) ?
దీనికి క్రమ చిత్రం ఎలా గీయలో చూద్దాం..
(Draw a Flow Chat Diagram For Addition Of Two Numbers)

వివరణ: మనం ఏద్తెన పనిని చేయాలి అంటే ముందు దానిని start చేయాలి. అందుకే ప్తెన సమస్యలో step1 అనేది start చేయడం. అందుకని దీనిని oval లో వ్రాసం .తర్వాత 2  3 steps అనేవి values ని తీసుకొవడం అందుకని 
సమాంతచతురస్రం [parallelogram] లో వ్రాసం. తర్వాత 4 step అనేది కూడికని perform చేయడం అందుకని దీర్ఘచతురస్రం [Rectangle] లో వ్రాసం .తర్వాత 5th steps అనేది output ని print చేయడం. అందుకని సమాంతచతురస్రం [parallelogram] లో వ్రాసం. మనం ఏద్తెన పనిని start చేస్తే దానికి Ending కూడా ఉంటుంది .అందుకే last step (step6) అనేది End చేయడం అందుకని దీనిని oval లో వ్రాసం.

మామూలుగా ఎవరయినా చిన్నపిల్లలకు భాషను నేర్పేటప్పుదు అమ్మ అనో, ఓం నమఃశివాయ అనో (ఓనమాలు అనే పదం ఇక్కడనుండే వచ్చినది అని చెప్తారు)వ్రాయించి ఓనమాలు దిద్దిస్తారు. అలాగే కంప్యూటరు భాషలను నేర్చుకునేటప్పుడు ఈ హలో, ప్రపంచం! ఉదాహరణతో మొదలు పెడతారు. ఈ ప్రోగ్రాము హలో, ప్రపంచం! అని మీ కంప్యూటరు మానిటరు మీద చూపిస్తుంది. సి భాషలో హలో, ప్రపంచం! ఉదాహరణ ఈ క్రింది విధముగా ఉంటుంది.


పైన ఇచ్చిన ప్రోగ్రాము దాదాపు అన్ని కంపైలరు (compiler)లలో పని చేయక పోవచ్చును. ఎందుకనగా అది ANSI C ప్రమాణాల ప్రకారం రాయబడలేదు. ఆ ప్రోగ్రాముకు చిన్నచిన్న మార్పులు చేర్పులు చేస్తే, ప్రమాణాలకు తగ్గట్లుగా మార్చు కోవచును.

తరువాతి వాక్యములో main అను ఒక ఫంక్షనుని వివరించటం (define) జరిగింది. సి-భాషలో main-ఫంక్షనుతో ఒక ప్రత్యేక ఉపయోగము ఉంది. ప్రోగ్రాముని ఎక్సిక్యూట్ చేసినప్పుడు ఈ ఫంక్షనునే మొటమొదట కాల్ చేస్తారు. కాబట్టి ఈ main-ఫంక్షను ప్రతీ ప్రోగ్రాములో తప్పని సరిగా ఉండాలి. int అనునది ఆ ఫంక్షను తిరిగి పంపించు సమాచారము యొక్క రూపును తెలుపును. ఇక్కడ int అనగా ఆ సమాచారము integer రూపములో ఉంటుందని అర్థము. (void) అనగా main-ప్రోగ్రామును పిలుచుటకు ఎటువంటి ఆర్గ్యుమెంట్సు (agruments)ని పంపించనవసరము లేదు అని తెలుపుతున్నది.

తెరుచుకునే మీసాల బ్రాకెట్లు main-ఫంక్షను మొదలును సూచించును.

ఈ వాక్యము printf అను ఫంక్షనుని కాల్ (call) చేయును. ఈ ఫంక్షను stdio.h అను హెడ్డరు ఫైలులో నిర్మింపబడింది. ఈ ఫంక్షను, దానిలోకి పంపించిన సమాచారాన్ని ఒక క్రమ పద్ధతిలో అమర్చి మీ మానిటరు పైన చూపించును. హలో, ప్రపంచం!\nలో \n అనునది ఎస్కేప్ సిక్వెన్స్ (escape sequence) అని అంటారు, అది కర్సరుని ఇంకో క్రొత్త లైనులోకి వెళ్ళుటకు అదేశించును. ఇచట మామూలు సమాచారము మధ్యలో అడెశములు కూడా ఉండటము వలన ఎస్కేప్ సిక్వెన్స్ అని పిలవటం జరుగుతుంది. printf-ఫంక్షను int రూపములో ఉన్న సమాచారమును తిప్పి పంపించును, కానీ దాని వలన మనకు పెద్ద ఉపయోగములు ఏమీ ఉండవు.

ఈ వాక్యము main-ఫంక్షను ఎక్సిక్యూషన్ని అంతము చేసి '0' అనే సంఖ్యను తిప్పి పంపించును.

మూసుకునే మీసాల బ్రాకెట్లు main-ఫంక్షను చివరను సూచించును.

సి భాషను కంఫ్యూటర్ కీ అర్థమయ్యే భాషలొకి మార్చాలంటే కంపైలర్ వుండాలని ఇంతకు ముందు చదివాం.

సాధారణంగా కొన్ని వాక్యముల ప్రోగ్రాముని రాసి, ఆ వాక్యములు ఏమి చేస్తాయి అనే దానిని మనము ఈ వ్యాఖ్యలుగా రాసుకోవచ్చును. సి-భాషలో వ్యాఖ్యలను /*, */ ల మధ్యన ఉంచవలెను. కావున /* */ మధ్యన ఏమి ఉన్నా కంపైలరు అసలు పట్టించుకోదు. అయితే అభిప్రాయములు తెలుపుటకు మనము // కూడా ఉపయోగించ వచ్చును. కాక పోతే // ఉపయోగించినప్పుడు వాటి తరువాత ఆ లైనులో ఉన్నదంతా వ్యాఖ్య కిందకు వస్తుంది.




#Article 101: సంస్కృతి (278 words)


సంస్కృతి (లాటిన్, స్పానిష్, పోర్చుగీస్ Cultura, ఫ్రెంచ్, ఆంగ్లం Culture, జర్మన్, స్వీడిష్ Kultur) అనేది మానవ సమాజం జీవన విధానంలో ప్రముఖమైన విషయాలను - అనగా జీవనం, ఆచారాలు, వ్యవహారాలు, ప్రమాణాలు, మతం, సంబంధాలు, పాలన - వంటివాటిని సూచించే పదం. దీనికి ఆంగ్ల పదమైన కల్చర్ (సంస్కృతి) లాటిన్ పదం కల్చుర లేదా కొలెరె అనేవి పండించడం అనగా వ్యవసాయం చేయడం నుండి ఉద్భవించాయి. ఒక సమాజంలో ముఖ్యమైన పద్ధతులు, నిర్మాణాలు, వ్యవస్థలు ఆ సమాజం యొక్క సంస్కృతిని సూచిస్తాయి. సంస్కృతిని సూచించే సంకేతాలు, నిర్మాణాలు, వ్యవస్థలు, ఆచారాలు, వ్యవహారాలు ఇదమిత్థమైన హద్దులు లేవు, అవి నిరంతరాయంగా మారుతుంటాయి. ఒకదానితో ఒకటి కలుస్తూ, విడిపోతూ పరిణామం చెందుతుంటాయి.

ఒక సమాజం జీవనంలో మిళితమైన కళలు, నమ్మకాలు, సంస్థలు, తరాలలో జరిగే మార్పులు, తరాల మధ్య వారసత్వంగా కొనసాగే విధానాలు అన్నీ కలిపి సంస్కృతి అంటారు. ఒక సమాజం యొక్క సంపూర్ణ జీవన విధానమే ఆ సమాజపు సంస్కృతి అని నిర్వచింపవచ్చును. ఆ సమాజంలో పాటించే ఆచారాలు, పద్ధతులు, అభివాదాలు, వస్త్రధారణ, భాష, మతం, ఆటలు, విశ్వాసాలు, కళలు - అన్నీ కలిపి సంస్కృతి అవుతాయి. గతించిన కాలం గురించి భవిష్యత్ తరాలకు అందించే వారధి సంస్కృతి

ఒక సమాజం చేసిన, వాడిన పరికరాలు, నిర్మించిన కట్టడాలు, వారి సంగీత, కళ, జీవన విధానం, ఆహారం, శిల్పం, చిత్రం, నాటకం, నాట్యం, సినిమా - ఇవన్నీ ఆ సమాజపు సంస్కృతిని సూచిస్తాయి. ఒక సమాజంలో ఉన్న వస్తు వినియోగం, సంపన్నత, జానపద వ్యవహారాలు కూడా సంస్కృతిగా భావింపబడుతాయి. వస్తువుల వినియోగమే కాకుండా ఆటి ఉత్పత్తి విధానం, వాటిని గురించిన దృక్పధం, సమాజంలో ఆ వస్తువులతోపాటు పెనవేసుకొని పోయిన సంబంధాలు, ఆచారాలు కూడా సంస్కృతిలోనివే అని మానవ శాస్త్రజ్ఞులు భావిస్తారు. కనుక కళలు, విజ్ఞానం, నైతికత కూడా సంస్కృతేనని వీరి అభిప్రాయం.

ఐక్య రాజ్య సమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ (యునెస్కో) వారు సంస్కృతిని ఇలా వర్ణించారు - ఒక సమాజానికి లేదా సమూహానికి చెందిన ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, లౌకిక, వైజ్ఞానిక, బావోద్వేగ అంశాలు ఆ సమాజపు (సమూహపు) సంస్కృతి అవుతాయి. కళలు, జీవన విధానం, సహజీవనం, విలువలు, సంప్రదాయాలు, విశ్వాసాలు ఈ సంస్కృతిలోని భాగాలే. ఇంకా సంస్కృతిని చాలా విధాలుగా విర్వచించారు. 1952లో ,  అనే రచయితలు తమ సంకలనంలో సంస్కృతికి 161 నిర్వచనాలను సేకరించారు

ప్రపంచదేశాలలో భారతీయ సంస్కృతికి విశిష్టమైన స్థానం ఉంది. భారతీయ సంస్కృతి సనాతనమైనది

వినాయకచవితి, ఉగాది, ఏరువాక, అట్ల తద్దె, భోగి, సంక్రాంతి, కనుమ, బోనాలు, bathukamma, graama devathala poojalu, తెలుగు నెలలు పండుగలు, దీపావళి




#Article 102: తుంగభద్ర (162 words)


తుంగభద్ర నది కృష్ణా నదికి ముఖ్యమైన ఉపనది. రామాయణ కాలంలో పంపానదిగా పిలువబడిన తుంగభద్ర నది కర్ణాటకలో పడమటి కనుమలలో జన్మించిన తుంగ, భద్ర అను రెండు నదుల కలయిక వలన ఏర్పడినది. భౌగోళికంగానే కాకుండా చారిత్రకంగానూ ఈ నదికి ప్రాధాన్యత ఉంది. దక్షిణ భారతదేశ మధ్యయుగ చరిత్రలో వెలిసిన విజయనగర సామ్రాజ్యం ఈ నది ఒడ్డునే వెలిసింది. హంపి, మంత్రాలయం లాంటి పుణ్యక్షేత్రాలు ఈ నది ఒడ్డున వెలిశాయి.

పెద్దలు తుంగభద్రను భారతదేశంలోని పంచగంగల్లో ఒకటిగా పేర్కొన్నారు. 

కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో పుట్టిన తుంగ, భద్ర వేరువేరుగా ప్రవహిస్తూ శిమోగా జిల్లా కూడ్లి వద్ద ఏకమౌతాయి. అక్కడ నుండి శృంగేరి పీఠం, హంపి ల మీదుగా కర్నూలు జిల్లా కౌతాలం మండలం వద్ద ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. తరువాత మంత్రాలయం మీదుగా ప్రవహించి కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అలంపూర్‌ (తెలంగాణ) వద్ద కృష్ణా నదిలో కలిసిపోతుంది.

తుంగభద్రా నది మీద కర్ణాటక రాష్ట్రంలో హోస్పేట వద్ద ఆనకట్ట నిర్మించబడింది.

పుష్కరాలు హిందువులకు పవిత్రమైన పుణ్యదినాలు. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే తుంగభద్రనది పుష్కరాలు 2008 డిసెంబర్ మాసంలో తుంగభద్ర నది యొక్క ప్రముఖ తీరప్రాంతాలలో జరిగాయి. ఆంధ్ర ప్రదేశ్ లో కర్నూలు, తెలంగాణలో మహబూబ్‌నగర్‌ జిల్లాలలో మాత్రమే నది ప్రవహిస్తుంది. ఈ నది ఒడ్డున ఉన్న ప్రముఖ ప్రాంతాలలో పుష్కరఘాట్‌లు ఏర్పాటుచేసి పర్యాటకుల సందర్శనానికి వసతులు కల్పించి రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాలు నిర్వహించింది. కర్నూలు, మంత్రాలయం, ఆలంపూర్ తదితర ప్రాంతాలలో పుష్కరాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.




#Article 103: విజయవాడ (2506 words)


విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసంఖ్య పరంగా రెండవ పెద్దనగరం.ఇది కృష్ణా జిల్లా లో,   కృష్ణా నది ఒడ్డున, పడమర సరిహద్దుగాఇంద్రకీలాద్రి పర్వతం, ఉత్తర సరిహద్దుగాబుడమేరు నది ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక, రాజకీయ, రవాణా, సాంస్కృతిక కేంద్రంగా నిలుస్తోంది. మద్రాసు-హౌరా, మద్రాసు-ఢిల్లీ రైలు మార్గములకు విజయవాడ కూడలి. విజయవాడకు ప్రస్తుత నామము, ఇక్కడి అధిష్టాన దేవత కనక దుర్గ ఆమ్మవారి మరో పేరు అయిన విజయ (విజయవాటిక) నుండి వచ్చింది. ఎండాకాలంలో మండిపోయే ఇక్కడి ఎండలను చూసి కట్టమంచి రామలింగారెడ్డి ఇది బెజవాడ కాదు బ్లేజువాడ అన్నాడట.

మహాభారతంలో పాండవులు వనవాసానికి దారుకావనానికి వచ్చినప్పుడు వేదవ్యాసుని సలహా మేరకు శివుని గూర్చి తపస్సు చేసి, పాశుపతాస్త్రాన్ని సంపాదించడానికి అర్జునుడిని ఎన్నుకుంటారు. ఇంద్రకీలాద్రిపై ఘోరమైన తపస్సుచేయగా, శివుడు పరీక్షించడానికి నిర్ణయించాడు. ఆ పరీక్ష మేరకు, మాయా మృగాన్ని ఒకదాన్ని సృష్టించి అర్జునుడు, తాను ఒకేసారి దాన్ని బాణాలతో కొట్టేలా చేస్తాడు. ఆపైన నాదంటే నాదని తగవు ప్రారంభమై అది యుద్ధంలోకి దిగుతుంది. చివరకు శివుడు తనతో సమానంగా యుద్ధం చేసిన అర్జునుడి వీరత్వానికి, ఘోరమైన తపస్సుకు మెచ్చి పాశుపతాస్త్రాన్ని ప్రసాదిస్తాడు.

అర్జునుడు తపస్సుచేసిన ఇంద్రకీలాద్రి పర్వతం విజయవాడలో నేడు కనకదుర్గ ఆలయం కొలువైన చోటనే స్థలపురాణం ప్రాచుర్యంలో ఉంది. 11వ శతాబ్దిలోనూ, బహుశా 12వ శతాబ్దిలోనూ వేసిన రెండు శాసనాలు విజయవాడకు ఈ స్థలపురాణాన్ని ఆపాదిస్తున్నాయి. కవిత్రయం వారు తమ ఆంధ్ర మహా భారత ప్రస్తావనలో ఇదేమీ చెప్పకపోవడంతో పాటు ఇతర పురాణాధారాల్లోనూ దీనికి మూలాలు లభించవు. ఇలా సాహిత్యాధారాలు లోపించి కేవలం రెండు శాసనాల ఆధారంగా చలామణి అవుతున్న ఈ కథ ప్రజల నమ్మకాల్లో మాత్రం స్థానం బాగా సంపాదించుకుంది.

విజయవాడ అన్న పేరు ఇటీవల ప్రాచుర్యం చెందగా పూర్వం నుంచీ బెజవాడ అన్న పేరు ఉంది. ఇక్కడి శాసనాల్లో ప్రాచీనమైన యుద్ధమల్లుని శాసనం, కొండవీడులోని మరో శాసనం ఈ ప్రాంతాన్ని బెజవాడగానే పేర్కొన్నాయి. ఈ రెండు పేర్లలో ఏది ఎలా వచ్చిందన్నదానిపై పలు కథలు, సిద్ధాంతాలు ఉన్నాయి.

అర్జునుడు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శివునికై తపస్సుచేసి, కిరాతరూపంలోని శివునితో పోరాడాడని చెప్పే స్థలపురాణం ఉంది. దీనితో విజయుడన్న అర్జునుడి పేరుమీదుగానే విజయవాడ వచ్చిందని చెప్తారు. అర్జునుడి పాశుపతాస్త్ర సంపాదన ఇక్కడే జరిగిందనే స్థలపురాణం వివరించే ఓ శాసనంలో ఈ ప్రాంతాన్ని వెచ్చవాడ అని వ్యవహరించారు. జల మార్గంలోనూ, భూమార్గంలోనూ కూడా కీలకమైన కూడలిగా నిలిచిన విజయవాడ ప్రాచీన కాలం నుంచీ వాణిజ్య కేంద్రంగా ఉండేది. ఈ కారణంగా వెచ్చాలు అధికంగా లభించే ప్రాంతం కావడంతో వెచ్చవాడ అయిందని జాన్సన్ చోరగుడి అభిప్రాయపడ్డాడు.

బెజవాడ అన్న పేరు బ్లేజ్ వాడ నుంచి వచ్చిందనీ, విపరీతమైన ఎండలు ఉండడంతో దీన్ని బ్రిటీష్ వారు బ్లేజ్ వాడ అని పిలవగా పిలవగా జనవ్యవహారంలో బెజవాడ అయిందనీ కొందరు చెబుతారు. అయితే ఇది జన నిరుక్తే. బ్రిటీష్ వారి రాకకు వేల సంవత్సరాల క్రితమే దీనికి బెజవాడ అన్న పేరు శాసనాల్లో కనిపిస్తూ ఉంది. నిజానికి విద్యావేత్త, రాజకీయవేత్త కట్టమంచి రామలింగారెడ్డి ఒకమారు బెజవాడను బ్లేజ్ వాడ అని మార్చి చమత్కరించగా, ఆ చమత్కారం జన నోళ్ళలో నాని ఈ కథగా తయారైంది.

విజయవాడ విష్ణుకుండినుల్లో కొందరి రాజధానిగా ఉండేది. క్రీ.శ.565 ప్రాంతంలో విష్ణుకుండిన వంశ రాజైన మాధవ వర్మ విజయవాడ కేంద్రంగా పరిపాలించాడు. అతని కుమారుడు నగరంలో రథం నడుపుతూ బాటపక్కన చింతచిగురు అమ్మే ముసలమ్మ కుమారుడిపై రథాన్ని ఎక్కించాడు. ఆ పిల్లాడు చనిపోయాడు. మహారాజు పుత్రవాత్సల్యాన్ని పక్కనపెట్టి శిక్షగా అదే రథం మీద ఎక్కించి రాకుమారుడిని చంపాలని ఆజ్ఞాపించాడు. మల్లీశ్వరాలయంలో బయటపడ్డ విష్ణువర్ధనుని శాసనం, మరోచోట లభించిన కల్యమబోయ శాసనం, విజయనగరం జమీందారుల వంశ చరిత్ర, మరికొన్ని చాటువులు ఈ సంఘటనను పేర్కొంటున్నాయి.

అక్కన్న, మాదన్న గుహలు,మొగల్రాజపురం గుహలు 3, 4 శతాబ్దాలకు చెందినవి. ఇవి బౌద్ధారామాలనీ, తర్వాతి కాలంలో శైవులకు ఆలవాలమై శైవ దేవతా ప్రతిమలు అక్కడ ఏర్పడ్డాయని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. మరికొందరు ఆ వాదాన్ని తిరస్కరిస్తూ ఇవి హిందూ సంబంధ ఆరాధనా స్థలాలేనని వాదిస్తున్నారు. వీటిని విజయవాడను పరిపాలించిన శాలంకాయనులు కానీ, కృష్ణకు దక్షిణాన పాలించిన పల్లవులు కానీ నిర్మించారని భావిస్తున్నారు. క్రీ.శ. 739లో చైనీస్ యాత్రికుడు యుఁఆన్‌ చ్వాంగ్‌ బెజవాడను సందర్శించాడు. ఈ నగరం తెనకచక రాజ్యంలో భాగంగా ఉండేదని రాసుకున్నాడు. ఈ తెనకచక అంటే ధాన్యకటకానికి రూపాంతరం. యుఁఆన్ చ్వాంగ్ ఇక్కడ బెజవాడ, సీతానగరం, ఉండవల్లి కొండల మీద గుహల్లో ఎందరో బౌద్ధ భిక్షువులు ఉండేవారని, సాయంత్రం అయితే అక్కడ వెలిగించిన దీపాల వెలుగులో బెజవాడ ప్రాంతమంతా కన్నుల పండువగా ఉండేదని రాసుకున్నాడు. ఇంద్రకీలాద్రి కొండమీద బౌద్ధ భిక్షువులు నివసించేందుకు కొండను తొలిపించి పలు చావడులు, వసారాలు నిర్మించి ఉన్నాయని రాశాడు. ఇక్కడి బౌద్ధ తంత్రజ్ఞుల నుంచి మాయలు, మహత్తులు ప్రసాదిస్తాయని నమ్మే ధారణ మంత్రాలను అతను నేర్చుకున్నాడు. నదీతీరాన సకల వ్యాధులను హరింపజేసే వనౌషధాల పర్వతం ఉండేదనీ, దానిని వైద్యులు వినియోగించుకునేవారనీ, ఇక్కడ పర్వత సానువుల్లో సంచరించే సాధువులకు బంగారం తయారుచేసే హేమవిద్య ఉండేదనీ రాశాడు.

వేంగి చాళుక్యుల కాలంలో విజయవాడ రాజకీయంగానూ ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇదే సమయంలో విజయవాడ మీద రాష్ట్రకూటులు పలు దండయాత్రలు చేశారు. నగరం యుద్ధాల్లో చిక్కుబడిపోయి ఉండేది. పలుమార్లు చేతులు మారింది. క్రీ.శ.927లో వేంగి చాళుక్య రాజు రెండవ యుద్ధమల్లుడు రాష్ట్రకూటులతో ఒప్పందం చేసుకుని వారి సహాయంతో విజయవాడను తిరిగి ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత చోళులకు, చాళుక్యులకు మధ్య యుద్ధాలతో విజయవాడ రణరంగంగా మారింది. 70 సంవత్సరాల పాటు సాగిన పోరాటాలు, యుద్ధాల్లో విజయవాడ అరాచకంగా ఉండేది. పౌరులకు శాంతి భద్రతలు కరువై జీవితం దుర్భరమైంది. క్రీ.శ.999లో చోళ చక్రవర్తి రాజరాజ చోళుడు చాళుక్యులతో జరిగిన యుద్ధంలో నిర్ణయాత్మకంగా జయించి, విజయవాడను ఆక్రమించాడు. రాజరాజ చోళుడు మొదటి శక్తివర్మను విజయవాడలో తనకు సామంత రాజుగా నియమించాకా ఈ రాజకీయ అనిశ్చితి, అరాచక పరిస్థితులు తొలగిపోయాయి. వేంగి చాళుక్యులు ఆ ఓటమితో తమ రాజధానిని రాజమహేంద్రవరానికి మార్చారు.

వ్యాపారపరంగా విజయవాడకు ఎంత ప్రఖ్యాతి ఉన్నా 11 శతాబ్ది నుంచి ఏ సామ్రాజ్యానికీ రాజధానిగా ఉండేది కాదు. కాకతీయులు, రెడ్డి రాజులు, గజపతులు వంటి పలువురు శక్తిమంతులైన రాజ్యాలు, సామ్రాజ్యాలు విజయవాడను ఒక వ్యాపార కేంద్రంగానే పరిగణించేవారు. రాజకీయంగా ప్రాముఖ్యత ఉండేది కాదు. పలువురు సామంత రాజుల పరిపాలనలో నగరం ఉండేది. 15వ శతాబ్దిలో ఆంధ్ర క్షత్రియులులో వశిష్ట గోత్రానికి చెందిన పూసపాటి రాజ వంశస్తులు విజయవాడ నగరాన్ని పాలించారు.

గజపతులపై తీరాంధ్ర ప్రాంతం మీదుగా దండయాత్రకు తరలివెళ్లినప్పుడు శ్రీ కృష్ణదేవ రాయలు విజయవాడలో విడిది చేశాడు. సమీపంలోని శ్రీకాకుళ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణువును సందర్శించి, ఆంధ్ర విష్ణువు ఆనతి మేరకు ఆముక్తమాల్యద కావ్యాన్ని ప్రారంభించినట్టుగా అవతారికలో రాసుకున్నాడు.

విజయవాడ 16వ శతాబ్ది తర్వాత పూర్తిగా తన ప్రాధాన్యత కోల్పోయింది. 2 శతాబ్దాల పాటు తన పూర్వ వైభవం పోగొట్టుకుని కొద్దిపాటి ప్రాంతానికి పరిమితమైపోయింది. ఈస్టిండియా కంపెనీ పాలనా కాలంలో 1832లో సంభవించిన తీవ్రమైన కరువు తర్వాత ఆర్థర్ కాటన్ 1839లో కృష్ణా నదిపై ఆనకట్ట నిర్మించి నదీ జలాలతో సేద్యాన్ని అభివృద్ధి చేయాలని నివేదిక తయారుచేశాడు. ఈ నివేదిక 1850లో లండన్లోని కంపెనీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ల ఆమోదంతో పాటుగా అనువైన స్థలాన్ని ఎంపికచేయమన్న ఆదేశం వెలువడింది. కాటన్ నేటి పలనాటి ప్రాంతంలోని గనికొండ ప్రాంతంలో, ముక్త్యాలలో, ఇబ్రహీంపట్నంలోనూ పరిశీలించి, వాటన్నిటినీ పక్కనపెట్టి తుదకు విజయవాడను బ్యారేజికి అనువైన స్థలంగా ఎంపిక చేశాడు. 19వ దశకం మధ్యలో జరిగిన ఈ పరిణామం తిరిగి విజయవాడకు ప్రాధాన్యత తెచ్చిపెట్టడానికి ఒక ముఖ్యకారణమైంది.

విజయవాడ నగర పశ్చిమ సరిహద్దులలో 11 కి.మీ. దూరన కొండపల్లి రిజర్వు అడవులు, 121.5 చ.కి.మీ. (30,000 ఎకరములు) విస్తీర్ణములో గలవు. ఈ అడవులు విజయవాడకు 'పచ్చని ఊపిరి' లాంటివి. ఈ అడవులలో చిరుతపులులు, అడవి కుక్కలు, నక్కలు, అడవి పందులు, తోడేళ్ళు మొదలగునవి ఉన్నాయి.

జనాభాపరంగా ఆంధ్ర ప్రదేశ్‌లో విజయవాడ రెండవ పెద్ద నగరం. చదరపు కిలో మీటరుకు 31,200 జనసాంద్రతతో ప్రపంచంలో ఎక్కువ జనసాంద్రత గల నగరాలలో మూడవది.

నగరంలో వాడబడే ప్రధాన భాష తెలుగు. 2011 జనగణన ప్రకారం నగరం (పరిసరాలలో నగరం పెరిగిన ప్రాంతాలతో కలిపి) జనాభా  కాగా, తెలుగు భాషీయులు , ఉర్దూ భాషీయులు . అత్యల్పంగా హిందీ, తమిళ, ఒడిషా, గుజరాతీ, మరాఠీ భాషీయులు కూడా ఉన్నారు.. అదే జనగణన ప్రకారం హిందువులు  (85.16%), ముస్లింలు  (9.12%), క్రైస్తవులు (3.64%), జైనులు  (0.50%), మతం వివరాలు తెలపని వారు  (1.59%).

కీలకమైన భౌగోళిక స్థానంలో నెలకొనివుండడంతో విజయవాడ పలు వ్యాపారాలకు కేంద్రమైంది. నీటి పారుదల సౌకర్యాలు పెరిగి వ్యవసాయ ప్రధాన జిల్లాలుగా రూపుదిద్దుకున్న కోస్తాంధ్ర జిల్లాలకు రవాణాపరంగా కేంద్రమైన విజయవాడ సహజంగానే వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ అయింది.

చెరకు, వరి, మామిడి పంటల ఉత్పత్తులకు ఇది చాలా పెద్ద వాణిజ్యకేంద్రం. ఇందుకు తోడు వినియోగదారుల అవసరాలను తీర్చే వర్తకం, రవాణా, ప్రయాణ, విద్య, వైద్య సదుపాయాలు నగరం వ్యాపారానికి పట్టుకొమ్మలు. ఇంకా మోటారు వాహనాల విడిభాగాలు (ఆటోనగర్), ఇనుప సామాను, గృహనిర్మాణ సామగ్రి, దుస్తులు తయారీ, మరకొన్ని చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. అధికంగా వ్యాపారం పాత నగర భాగం (వన్ టౌన్), కాళేశ్వరరావు మార్కెట్‌ లలో జరుగుతుంది. గవర్నర్ పేట, బీసెంట్‌రోడ్‌లు దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర గృహ వినియోగ వస్తువుల వ్యాపారానికి కేంద్రాలు. లబ్బీపేట, ఎమ్.జి.రోడ్‌లలోను, మరికొన్ని చోట్ల పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్సులు వెలిశాయి

తెలుగు సినిమా నిర్మాణం మొదట మద్రాసులో, తర్వాత హైదరాబాద్ లో కేంద్రీకృతమై ఉన్నా, తొలి నుంచీ పంపిణీ వ్యవస్థకు విజయవాడ కేంద్రంగా నిలిచింది. రెండు దశాబ్దాల పాటు ఇబ్బడిముబ్బడిగా తెలుగు సినిమా పంపిణీ వ్యాపారం జరిగింది. నవయుగ పిక్చర్స్, పూర్ణా పిక్చర్స్, అన్నపూర్ణా ఫిలింస్, లక్ష్మీ ఫిలింస్, లక్ష్మీ చిత్ర, రాజశ్రీ, విజయా వంటి పంపిణీ సంస్థలన్నీ ఇక్కడ నెలకొన్నాయి.

విజయవాడ నగరం తెలుగు ముద్రణ, ప్రచురణ రంగాలకు ముఖ్యకేంద్రం. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో (ముఖ్యంగా నాలుగు జిల్లాలకు) హోల్‌సేల్ వ్యాపారం విజయవాడనుండి పెద్దయెత్తున జరుగుతుంది. వస్త్రాలు, ఇనుప సామానులు, పప్పుధాన్యాలు, ఎరువులు, మందులు వంటివి ఇక్కడినుండి సరఫరా చేయబడుతాయి.

విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను, దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రైల్వే జంక్షన్.

విజయవాడ నగర పౌర పరిపానా బాధ్యతలు విజయవాడ నగర పాలక సంస్థవి. భారతదేశంలోకెల్లా ఐఎస్ఓ 9001 సర్టిఫికేషన్ సాధించిన స్థానిక సంస్థల్లో ఇది మొట్టమొదటిది. 1888 ఏప్రిల్ 1న పురపాలక సంఘం ఏర్పడగా, 1960లో సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ హోదా లభించింది. 1981లో నగర పాలక సంస్థ ఏర్పడింది. 2012 నాటికి నగరపాలక సంస్థ 61.8 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. 2017లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ నగరం, చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుకుని గ్రేటర్ విజయవాడ (మెట్రో) ఏర్పాటుచేసింది. దాని పరిధి 160 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించింది.

మెట్రోనగరంలో విజయవాడ నగరపాలకసంస్థతో పాటు కలిసిపోయిన అంబాపురం, బుద్దవరం, దోనేటికూరు, ఎనికేపాడు, గంగూరు, గన్నవరం, గొల్లపూడి గ్రామాలు, మెట్రోపాలిటన్ ప్రాంతంలో గూడవల్లి, జక్కంపూడి, కానూరు, కీసరపల్లి, నిడమానూరు, నున్న, పాతపాడు, పెనమలూరు, ఫిర్యాదీనైనవరం, పోరంకి, ప్రసాదంపాడు, రామవరప్పాడు, తాడిగడప, యనమలకుదురు వుంటాయి.

విజయవాడ నగరం కృష్ణా జిల్లా పరిపాలనా కేంద్రం కాదు. విజయవాడ నగరం పరిపాలనా బాధ్యతలు విజయవాడ నగరపాలక సంస్థ (మునిసిపల్ కార్పొరేషన్)చే నిర్వహించబడుతాయి.. నగరంలోని 59 వార్డులనుండి ఒక్కో కార్పొరేటర్ ఎన్నికోబడుతారు. నగరానికి ఒక మేయర్‌ను ఎన్నుకొంటారు. ప్రభుత్వం ఒక మునిపల్ కమిషనర్‌ను నియమిస్తుంది. విజయవాడ నగరంలో ఒక సబ్-కలెక్టర్ ఉంటారు. టి. వెంకటేశ్వరరావు (1981-83) అయితా రాములు (1983-84) లంకా గోవిందరాజులు (1984-85), అయితా రాములు (1985-86),  జంధ్యాల శంకర్ (1987-92), టి. వెంకటేశ్వరరావు (1995-2000), పంచుమర్తి అనూరాధ (2000-05), తాడి శకుంతల (2005-06), మల్లికా బేగం (2006) విజయవాడ నగరానికి మేయర్లుగా పనిచేశారు. నగరపాలక సంస్థ కార్యనిర్వహణ బాధ్యతలు మున్సిపల్ కమీషనర్ వి. కమీషనర్ కింద రెవెన్యూ, ఇంజనీరింగ్, మంచినీటి సరఫరా, క్రీడలు మొదలైన 13 విభాగాల అధికారులు పనిచేస్తారు. వి.జి.టి.ఎం.వుడా విజయవాడ ద్వారా నగరంలో పచ్చదనం పార్కులు రహదారులు ఫ్లై ఓవర్లు నిర్మించబడ్డాయి.

నగరంలో నాలుగు (ఎస్‌టీపీ) సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఉన్నాయి. వీటితో పాటు శివారు ప్రాంతాల్లో మరికొన్ని సీవేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో ఏర్పాటు చేసిన సంప్‌లకు వివిధ ప్రాంతాల్లోని మురుగునీరు వచ్చి చేరుతుంది. సంప్‌ల నుంచి ఎస్‌టీపీలకు మురుగునీరు చేరుతుంది.అక్కడ మురుగునీరు శుద్ధి అవుతోంది. నగరంలో సాగునీటిని విడుదల చేసే కాలువలు ప్రధానంగా మూడు ఉన్నాయి. నగరంలోని చాలా ప్రాంతాల నుంచి డ్రెయినేజి నీరు ఈ కాలువలలోకి పోతోంది. డ్రెయినేజి కాలవలలోకి కలిసే విధానాన్ని రూపుమాపి, మురుగునీరంతా ప్రాజెక్టుకు మళ్ళిస్తారు.నగరంలోని మురుగునీటినంతటిని సంగ్రహించి పలు దశ ల్లో గ్రేడింగ్, ప్యూరిఫయింగ్ చేస్తారు. ముగుగునీరంతా పూర్తిగా శుద్ధి అయి రిజర్వాయర్‌లోకి వెళుతుంది. ఇక్కడ మళ్ళీ మంచినీటిని వివిధ దశల్లో శుభ్ర పరిచిన తర్వాత రా వాటర్‌గా మరొక రిజర్వాయర్‌లోకి మళ్ళిస్తారు. చివరకు క్రిస్టల్ వాటర్ దశకు తీసుకొస్తారు.ఆ నీటిని గార్డెన్ల పెంపకానికి, పంట పొలాలకు, ఇండస్ట్రీలకు ఉపయోగిస్తారు.

విజయవాడ 1940ల నుంచీ కొన్ని దశాబ్దాలుగా కమ్యూనిస్టుల కంచుకోటగా కొనసాగింది.

నగరంలో  రొడ్డ్లు ఉన్నయి, వీటికి తోడు వందలాది ప్రైవేటు బస్సులు హైదరాబాదుకు, ఇతర ప్రధాన నగరాలకు నడుస్తుంటాయి. నగర ప్రయాణంలో, బందర్, ఏలూరు మరియూ రైవేస్ కాలవలపై ఉన్న 16 వంతెనలు కీలకం. నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు ఉడా చేపట్టిన ఇన్నర్‌రింగ్‌రోడ్డు నైనవరం గేటు (వైవీరావు ఎస్టేట్స్) నుంచి పైపులరోడ్డు సెంటర్ వరకు ప్రారంభించిన తొలి విడత పనులు]హైదరాబాద్, కోల్‌కతా జాతీయ రహదారికి అనుసంధానంగా చేపట్టిన ఇన్నర్‌రింగ్‌రోడ్డు రెండవ విడత కూడా పూర్తయి తే నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గడంతో పాటు శివారు ప్రాంతాలకు మహర్దశ వరించినట్లే. పాయకాపురం నుంచి రామవరప్పాడు రింగ్‌రోడ్డు పూర్తి చేయాల్సిఉంది.. హైదరాబాద్ నుంచి కోల్‌కతా వెళ్ళే వాహనాలు గొల్లపూడి, నైనవరం ఫ్లై ఓవర్ మీదుగా ఇన్నర్ రింగ్‌రోడ్డుకు చేరి నగరంతో సంబంధం లేకుండా రామవరప్పాడు రింగురోడ్డుకు చేరుకుంటాయి. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వెళ్ళే వాహనాలు రామవరప్పాడు రింగు నుంచి నేరుగా గొల్లపూడికి చేరుకుంటాయి. నగరానికి బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు ప్రధాన రహదారులు.

జాతీయ రహదారి 16, జాతీయ రహదారి 65, నగరాన్ని ఇతర రాష్ట్రాలతో కలుపుతుంది. జాతీయ రహదారి 30, చత్తీస్‌గఢ్లొని జగదల్‌పుర్ని నగర సమీపంలోని ఇబ్రహీంపట్నం వరకు కలుపుతుంది. నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు, ఇన్నర్‌ రింగు రోడ్డు, జాతీయ రహదారి 16, 65కు అనుసంధానంగా అయ్యి ఉంది. హైదరాబాద్ నుంచి కోల్‌కతా వెళ్ళే వాహనాలు గొల్లపూడి, నైనవరం ఫ్లై ఓవర్ మీదుగా ఇన్నర్ రింగ్‌రోడ్డుకు చేరి నగరంతో సంబంధం లేకుండా రామవరప్పాడు రింగురోడ్డుకు చేరుకుంటాయి. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వెళ్ళే వాహనాలు రామవరప్పాడు రింగు నుంచి నేరుగా గొల్లపూడికి చేరుకుంటాయి.

గతంలో తాడేపల్లి మీదుగా కృష్ణానది కరకట్ట మీదుగా బైపాస్‌ నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి బదులుగా ప్రతిపాదిస్తున్న బైపాస్‌ రోడ్డు మంగళగిరి ఎన్‌.ఆర్‌.ఐ. కళాశాల నుంచి ప్రారంభమై పెదవడ్లపూడి, నూతక్కి గ్రామాల మీదుగా కృష్ణానది దాటి విజయవాడ, మచిలీపట్నం (ఎన్‌.హెచ్‌-9) దాటి ఎన్‌.హెచ్‌-5లో నిడమానూరు వద్ద కలుస్తుంది.

సిటీ బస్సులు మరయు ఆటొలు ప్రాథమికంగా నగర అంతర్గత ప్రజా రవాణా సేవలు. ఇవి కాకుండా మొటారు బైకులు, రిక్షాలు, సైకిళ్ళు కూడా రవాణా వ్యవస్థలో భాగం. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను రొడ్డు, రైలు రవాణాకు సంబంధించిన మౌలిక సదుపయాలు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన విజయవాడ సిటీ డివిజణ్, రొజూ 400 వరకు బస్సులను నడుపుతూ, 300,000 మందిని గమ్యస్తానాలకు చేరుస్తుంది. విజయవాడ బీ.ఆర్.టి.ఎస్ కారిడార్లు వేగవంతమైన సిటీబస్సు ప్రయాణానికి సహకరిస్తాయి. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లొ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన ప్రదాన కార్యాలయం ఉంది. పండిట్ నెహ్రూ బస్ స్టేషను, దేశంలోనే నాలుగొవ అతి పెద్ద బస్సు టెర్మినల్.

సబర్బన్ రైళ్ళు విజయవాడ నుండి గుంటూరు, తెనాలి వరకు సేవలు అందిస్తునాయి. కొత్త సర్కులర్ రైలు ప్రాజెక్టును ప్రతిపాదించారు, ఇది రాజధాని అమరావతి వరకు ఉంటుంది. విజయవాడ మేట్రొ ప్రాజెక్టు రెండు కారిడార్లలో కడుతున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ A1గా గుర్తింపు పొందింది,, భారతీయ రైల్వేల్లో అత్యంత రద్ది జంక్షను. విజయవాడ రైల్వే డివిజను ప్రదాన కార్యాలయం కూడా ఇక్కడే ఉంది.

విజయవాడకు 19 కి.మీ. దూరంలో ఉన్న గన్నవరం దేశీయ విమానాశ్రయం నుండి హైదరాబాద్, బెంగుళూర్, చెన్నై, ముంబై, జైపూర్, వైజాగ్, తిరుపతి, ఢిల్లీ నగరములకు విమాన సౌకర్యము ఉంది. 3 May 2017న, విమానాశ్రయాన్ని ఆధునీకరించారు, అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో, 622,354 మంది దేశీయ ప్రయాణీకులు ప్రయానించారు, ఇది గత సంవత్సరంతొ పోలిస్తే 56.1% ఎక్కువ. అదే ఆర్థిక సంవత్సరంలో, 10,333 విమానాలతో, 54.8% వృద్ధి నమోదు చేసింది.

దేశంలోనే మొదటి ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం. ఇక్కడ ఉన్న ఒకే ఒక విశ్వవిద్యాలయం ఎన్.టి.ఆర్.యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. కాని ఇంటర్మీడియట్ స్థాయిలో విజయవాడ రాష్ట్రంలో పెద్ద విద్యా కేంద్రంగా స్థానం సాధించింది. ఇబ్బడి ముబ్బడిగా స్థాపించబడిన ప్రైవేట్ రెసిడెన్షియల్ కాలేజీలు, ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా ఇందుకు దోహదం చేశాయి.

సిద్ధార్థ పబ్లిక్ పాఠశాల విజయవాడ మొగల్రాజపురములో ఉంది. సిద్ధార్థ ఎకాడెమీ వారిచే 1977లో స్థాపించబడింది. వీరమాచినేని పద్దయ్య దానమిచ్చిన భూమిలో ప్రారంభమైంది.

సాధారణ ప్రభుత్వ వైద్యశాలని మరిన్ని సూపర్ స్పెషాలిటీ విభాగాలతో అత్యాధునిక ఆసుపత్రిగా తీర్చిదిద్దే ప్రతిపాదన కార్యరూపం దాల్చనుంది.
ప్రైవేట్ రంగంలో అత్యాధునిక ఆసుపత్రులున్నాయి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేడియో శ్రోతలకు తెలుగు ప్రసారాలను అందించడంతో పాటు అందులో పనిచేసిన పలువురు సాహిత్యకారులు, కళాకారులకు విజయవాడను స్థిరనివాసం చేసింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం 1948 డిసెంబరు 1 న ప్రారంభించబడింది. దీని భవనం జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పేరుబెట్టారు.
ఆకాశవాణి ప్రసారాలు విజయవాడ, వివిధభారతి (రెయిన్ బౌ కృష్ణవేణి ఎఫ్ ఎమ్102.2 MHz) .

ఇవి కాక ప్రైవేట్ రంగంలో, రేడియో మిర్చి ఎఫ్‌ఎమ్ (98.3 MHz), రెడ్.ఎఫ్.ఎమ్. (RED FM) (93.5 MHz) ప్రసార కేంద్రాలున్నాయి.

దూరదర్శన్ సప్తగిరి విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్నది.

విజయవాడ నగర సంస్కృతిలో సినిమాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. 1921లోనే నగరంలో ప్రారంభమైన మారుతీ హాలుతో సినిమాల ప్రదర్శన ప్రారంభమైంది. దుర్గా కళామందిరం (1923), రామా టాకీసు (1929) వంటి సినిమా హాళ్ళు తెలుగు సినిమా టాకీలు ప్రారంభం కావడానికి ముందే విజయవాడలో వెలిశాయి. తెలుగు సినిమా రంగం ప్రారంభమయ్యాకా నిర్మాణ కేంద్రం కాలేకపోయినా పంపిణీ కేంద్రంగా విజయవాడ అభివృద్ధి చెందింది. దానితో పాటుగా తెలుగు సినిమా రంగంపై చర్చాగోష్టులు, సమావేశాలు, అభిమాన సంఘాలు,. సినిమా పత్రికలు వంటివాటన్నిటికీ కూడా స్థానంగా నిలిచింది. తెలుగు సినిమాల్లో విజయవాడతోనూ, పరిసర ప్రాంతాలతో అనుబంధం ఉన్న ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి వంటి నటీనటులు మంచి పేరు సంపాదించారు. నగరంలో విజయవాడ ఫిలిం సొసైటీ ఏర్పడి ఉత్తమ చిత్రాలను ఆదరించేలా ప్రేక్షకుల్లో అభిరుచి పెంపొందించాలన్న లక్ష్యంతో చాలాకాలం పనిచేసింది. ఈ పరిణామాలన్నీ నగర జన జీవితంలో సినిమా ప్రభావం చూపడానికి దోహదపడ్డాయి.

విశాలాంధ్ర విజయవాడ నుండి ప్రారంభమైన తొలి తెలుగు వార్తాపత్రిక. 2013–14 వార్షిక ప్రెస్ నివేదిక ప్రకారం, విజయవాడనుండి వెలువడే పెద్ద, మధ్యమ వార్తాపత్రికలలో ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, సూర్య, ఆంధ్రప్రభ, వార్త, ప్రజాశక్తి, ఉదయ భారతం ఉన్నాయి. టీవీ ఛానెళ్ళు అభివృద్ధి చెంది వాటి స్థానాన్ని తీసుకునేవరకూ విజయవాడ నగరంలో పలు పత్రికల సాయంకాలం ఎడిషన్లు, కొన్ని ప్రత్యేకమైన సాయంకాలం పత్రికలు తాజా వార్తలు అందించేవి.

విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్ లో ప్రచురితమయ్యే అనేక ప్రచురణల కేంద్రం. ఓ అంచనా ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లో ప్రచురితమయ్యే పుస్తకాలలో 90% పుస్తకాలు ఇక్కడినుండే ముద్రితం, ప్రచురితమౌతున్నాయి. విజయవాడ పుస్తక ఉత్సవం, ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుంది. ఈ ఉత్సవం దేశంలోనే కోల్కతా తరువాత, రెండవ అతిపెద్ద ఉత్సవం. విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవోదయ, జయంతి,అరుణ ప్రచురణ సంస్థలు ఉన్నాయి.

విజయవాడలో పుస్తక ప్రచురణ సంస్థలు, పుస్తకాల షాపులు, గ్రంథాలయాలు సాహిత్య వాతావరణాన్ని కల్పించాయి. 1903లో ఇ.సుబ్బుకృష్ణయ్య ఆస్తిక పుస్తక భాండాగారం పేరిట గ్రంథాలయాన్ని స్థాపించాడు. 1916లో దీనిని బకింగ్ హాం పేటలోని శాశ్వత భవనంలోకి మార్చి, శ్రీ రామ్మోహన ధర్మ పుస్తక భాండాగారంగా పేరు మార్చారు. దీన్నే సాధారణంగా శ్రీ రామ్మోహన గ్రంథాలయంగా వ్యవహరిస్తారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిని, జైల్లో మరణించిన వెలిదండ్ల హనుమంతరావు పేరుమీదుగా హనుమంతరాయ గ్రంథాలయం 1934 డిసెంబరు 2న ప్రారంభమైంది. చిరకాలం నుంచి ఈ గ్రంథాలయాలు నగరంలో సాంస్కృతిక కేంద్రాలుగా విలసిల్లాయి. హనుమంతరాయ గ్రంథాలయానికి అధ్యక్షులుగు నగరంలో పలువురు రాజకీయవేత్తలు, విద్యావేత్తలు వ్యవహరించి అభివృద్ధి చేశారు.

విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాజకీయ కేంద్రంగా పేరొందింది.

ఈనగరంలో దాదాపు 20 ఐ.టీ. సంస్థలున్నాయి, 2006-07 ఆర్థిక సంవత్సరంలో ఇవి 42 కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెట్టాయి. ఆం.ప్ర.ఐ.ఐ.సి. సంస్థ గన్నవరంలో ఐ.టీ. పార్కు, ఎస్.ఇ.జెడ్. (స్పెషల్ ఎకనామిక్ జోన్) ఏర్పాటు చేసింది. వీటి నిర్మాణాలకోసం ఎల్.‍ టి. కంపెనీ కాంట్రాక్టు తీసుకుంది, దీని బడ్జెట్ 300 కోట్ల రూపాయలు. ఈ ఐ.టీ. పార్కులు దాదాపు 10,000 మంది ఐ.టీ. ప్రొఫెషనల్స్ కు ఉద్యోగావకాశాలు కలుగజేస్తుంది. ఇంకో ఐ.టీ.పార్కు, మంగళగిరిలో ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నవి.

విజయవాడ నగరంలో ప్రాచీన కాలం నుంచి బౌద్ధం, జైనం, తర్వాత శైవం వృద్ధిచెందాయి. విజయనగర సామ్రాజ్య పరిపాలన అనంతరం 16వ శతాబ్దం నాటికి కొంతమేరకు వైష్ణవాలయాలు కూడా ఉండేవి. రామ, రాఘవ, కృష్ణ ఆలయాలు, వాటి మాన్యాలు కూడా శాసనాల్లో కనిపిస్తాయి. ఏ సంక్షోభం కారణంగా ఆ వైష్ణవాలయాలు రూపుమాశాయన్న చరిత్ర కూడా లేకుండా అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. వైశ్యులు వైష్ణవాన్ని పుచ్చుకుని, దాని అభివృద్ధికి దానధర్మాలు చేయడం ప్రారంభించడంతో నగరంలో 19వ శతాబ్ది నుంచి తిరిగి వైష్ణవాలయాలు ఏర్పడడం కనిపిస్తుంది. విజయవాడ జనాభాలో చెప్పుకోదగ్గ స్థాయిలో ముస్లింలు ఉన్నారు. దాదాపు 15 శాతం అని 2000 నాటి ఒక అంచనా. 19వ శతాబ్దిలో విజయవాడ వన్ టౌన్లో సంఖ్యాధిక్యతే కాక సాంస్కృతిక ఆధిపత్యం కూడా ముస్లింలదే. షియా ముస్లింలకు సంబంధించిన పంజాలు, సూఫీలకు సంబంధించిన దర్గాలు విజయవాడ వ్యాప్తంగా పలు ప్రదేశాల్లో కనిపిస్తాయి. ఆనాడు విజయవాడలో కీలకమైన ప్రాంతాల్లో ఆస్తుల్లో ఎక్కవ భాగం వీరివి. మొదట్లో బంగారు, వెండి దుకాణాలన్నీ వీరి చేతిలోనే ఉండేవి. కాలక్రమేణా ఆస్తులు చేతులు మారి, ముస్లింలు ప్రస్తుతం పాత ఇనుము, టైర్లు తిరిగి అమ్మకం, టైలరింగ్ వంటి వ్యాపారాల్లో ఎక్కువగా స్థిరపడ్డారు. ఇంకా పెద్ద సంఖ్యలోనే ఉన్నా విజయవాడ ముస్లింలు ఒకప్పటి సిరిసంపదలు వారిచేతిలో లేదని లంక వెంకటరమణ వ్యాఖ్యానించాడు. వీరు ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్న విజయవాడ పశ్చిమ శాసన సభ నియోజక వర్గంలో రాజకీయంగానూ ప్రభావం చూపుతున్నారు. సిక్ఖులూ నగరంలో నివసిస్తున్నారు. ఆటోనగర్ సమీపంలో ఒక కాలనీకి గురునానక్ కాలనీ అని పేరుపెట్టుకున్నారు. 2000 ప్రాంతంలో ఖల్సా 300 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నగరంలో వైభవోపేతంగా ఉత్సవాలు నిర్వహించారు.

కనకదుర్గ అలయం, దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్ధానం కృష్ణావది ఒడ్డువే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కెన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు.రాక్షసుల బాధ భరించ లేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమవి ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి.

ఆధునిక యుగంలో అపురూపమైన తో తయారైన గొప్ప దేవస్ధానం. అమ్మవారి మూర్తి అపురూపమైన మరకత శిలతో (పచ్చ) చెక్కబడింది. అంతేకాక, ఆలయవు గోడలన్నీ రాతితో చెక్కబడి శ్రీచక్రం లోని వివిధ చక్రాలు, వాటిలోని దేవతలను అద్భుతంగా దర్శింపజేస్తూ ఉంటాయి. ఆలయ శిఖరం సుమేరు శ్రీచక్ర అకారంలో ఉంటుంది. అమ్మ వారి ముందు కూర్మం (తాబేలు) పై మాణిక్యం (కెంపు) తో చేసిన శ్రీచక్రం అలరారుతూ ఉంటుంది. 2002 లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ చే ఈ గుడి కుంభాభిషేకం, ప్రతిష్ఠ జరుపబడింది.




#Article 104: సామెతల జాబితా (348 words)


సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు అంటారు. సామెతలు మాటల రుచినిపెంచే తిరగమోత, తాలింపు దినుసులు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు కాబట్టి సామెతలు ప్రజల అనుభవ సారాలు. సామెతలు నిప్పులాంటి నిజాలు. నిరూపిత సత్యాలు. ఆచరించదగ్గ సూక్తులు.

సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు (ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు (ఊరక రారు మహానుభావులు). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును (క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును (ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి, కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును (అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును (మనసుంటే మార్గముంటుంది) ప్రమాదమును హెచ్చరించవచ్చును (చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును (తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి). హాస్యాన్ని పంచవచ్చును (ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట).

ఇక్కడ కొన్ని సామెతల జాబితా ఇవ్వబడ్డది. మరిన్ని సామెతల కొరకు, వాటి వివరణ కొరకు ఒక్కో అక్షరానికి చెందిన పేజీ చూండండి.

రచయితలు గమనించండి: సామెతల ఉదాహరణ కోసం ఉద్దేశించిన పాక్షిక జాబితా ఇది. దీనిని ఇంకా పెద్దగా విస్తరించడం వల్ల పేజీ సైజు మరీ పెద్దదవుతుంది. అందుకు బదులుగా భాషా సింగారం మూసలో అకారాది క్రమంలో సామెతలకు ప్రత్యేక పేజీలు కేటాయించబడ్డాయి. ఆ పేజీలలో సామెతలు, వాటి వివరణలు కూర్చవచ్చును.

ఆంగ్ల భాషలో జాతీయము అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్ధం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్ధం వేరు. ఉదాహరణకు చేతికి ఎముక లేదు అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్ధం ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి కాని ఈ జాతీయానికి అర్ధం ధారాళంగా దానమిచ్చే మనిషి అని.

జాన్ సయీద్ అనే భాషావేత్త చెప్పిన అర్ధం - idiom as words collocated together happen to become fossilized, becoming fixed over time.[1]. అనగా తరతరాల వాడుక వలన భాషలో కొన్ని పదాల వాడుక శిలావశేషంగా ఘనీభవించింది. కనుక భాషతో పరిచయం ఉన్నవారికే ఆ భాషలో ఉన్న జాతీయం అర్ధమవుతుంది. నీళ్ళోసుకోవడం, అరికాలి మంట నెత్తికెక్కడం, డైలాగు పేలడం, తు చ తప్పకుండా - ఇవన్నీ జాతీయాలుగా చెప్పవచ్చును. జాతీయాలు సంస్కృతికి అద్దం పట్టే భాషా రూపాలు అనవచ్చును.

(అకారాది క్రమంలో వివిధ జాతీయాలు ఇవ్వబడ్డాయి. ప్రక్కనున్న లింకుల ద్వారా ఆయా వ్యాసాలకు వెళ్ళవచ్చును)




#Article 105: పొడుపు కథలు (784 words)


తెలుగు భాషా సాహిత్యంలో పొడుపు కథలకు ప్రత్యేక స్థానం ఉంది. వీటి సృష్టి కర్తలు పల్లె ప్రజలే. పండితులకు కూడా వీటిపై ఆసక్తి కలగడం వల్ల పద్యాలలోనూ పొడుపు కథలు ఉన్నాయి. విజ్ఞానం, వినోదం, ఆశక్తీ కలిగించే పొడుపు కథలంటే యిష్టపడని వారుండరు. ఇది పల్లె ప్రజలకు ఒక వినోదంతో కూడిన ఆట. పొడుపు కథలో చమత్కారం, నిగూఢ భావం యిమిడి ఉండటమే దీనికి కారణం. ఎలాగైనా ఇందులో రహస్యం తెలుసుకోవాలనె కుతూహలం ఒకవైపు, దీని గుట్టు విప్పి తన తెలివితేటలు నిరూపించుకోవాలనె తపన ఒకవైపు పొడుపు కథల వైపు మనిషి ఆకర్షించబడతాడు.

ఆలోచనా శక్తిని పదును పెట్టే పొదుపు కథలంటే పిల్లలు ఎక్కువ యిష్టపడతారు. పిల్లలకు రకరకాల పొడుపు కథలు చేసి వారి మెదడును పదును పెట్టాలి.సాంప్రదాయకంగా వస్తున్న పొడుపు కథలనె కాకుంటే ఆధునిక కాలానికి సంబంధించిన విషయాలపైన పొదుపు కథలు తయారు చేసి పిల్లల్లో ప్రచారం చేయాలి.పిల్లల చేత వారి సృజనాత్మకత పెంచుటకు కొన్ని పొడుపు కథలు తయారు చేయించాలి.

పొడుపు కథలను తయారు చేయటం కష్టం కాదు. పొడుపు కథలో లయ, ప్రాస, రాగం, వంటివి ఉంటాయి. జ్ఞాపకం పెట్టుకోవటానికి అనువైన పద వాక్య విన్యాసం ఉండాలి. మరీ కష్టంగా ఉండకూడదు. చాలా సులభంగా ఉండకూడదు. కొద్ది సేపు ఆలోచించగానే అర్థమత్తేటట్లు ఉన్నప్పుడే ఆసక్తి కలుగుతుంది.మరీ కష్టంగా ఉంటే మనం చెప్పలేమనే ఆలోచన వచ్చి ఆసక్తి కోల్పోతారు.

ముందుగా ఏ విషయం పై పొడుపు కథ తయారు చేయాలనుకుంటామో దాని గుణగణాల గురించి నాలుగు వాక్యాలు రాసుకోవాలి. ఆ వాక్యాలను లయ బద్దంగా ఉండేటట్లు తయారు చేసుకోవాలి. ఒక వాక్యం లోనూ రెండు, మూడు వాక్యాలలోను ఉండవచ్చు. పేనా, చాక్లెట్, టీచర్, సైకిల్, సినిమా, రేడియో, టి.వి.టెలిఫోన్, ఇలాంటి వాటిపై పొడుపు కథలు పిల్లలలు సన్నిహితంగా ఉంటాయి.

పొడుపు కథగా మారిస్తె, 

ఇందులో ఒకటి రెండు అక్షరాలు అదనంగా చేర్చితే చాలు మనకు కావలసిన జవాబు దొరుకుతుంది. ప్రశ్నలోనే జవాబు ఉంటుంది. ఎక్కువ పద పరిచయం ఏర్పడుతుంది. కొన్నింటికి రెండు మూడు జవాబులు కూడా ఉండవచ్చు.

కొన్ని ఆధారాలు యిచ్చి దాని ఆధారంగా పొడుపు కథ విప్పటం

చాలా వివరంగా వర్ణించి పొడుపు కథను విప్పమని చెప్పటం

మొదటి వాక్యంలో ఆథారం ఉంటుంది. రెండవ వాక్యంలో నిషేధం ఉంటుంది.

పైన సూచించిన పట్టికలో మనకు ఏ అక్షరంతో ప్రారంభమైన పొడుపు కథ కావాలో ఆ అక్షరాన్ని క్లిక్ చేస్తే మనకు కావాల్సిన ప్రారంభ అక్షరంతో పొడుపు కథలను సులువుగా చూడవచ్చు.

అన్నదమ్ములం ముగ్గురం మేముశుభవేళల్లో కనిపిస్తూ వుంటాము;అయితే బుద్ధులు వేరు -నీళ్ళలోమునిగే వాడొకడుతేలే వాడొకడు కరిగే వాడొకడుఅయితే మేమెవరం?
జవాబు:ఆకు, వక్క, సున్నం

చెట్టుకి కట్టిన ఉట్టి, ఎంత దూరం నెడితే అంత దగ్గర అవుతుంది? (ఊయల)
పచ్చటి దుప్పటి కప్పుకొని తియ్యటి పండ్లు తింటుంది? (చిలుక)
ఎంత ప్రయత్నించినా చేతికి చిక్కదు, ముక్కుకి మాత్రమే దొరుకుతుంది. ఏమిటది ? (వాసన)
పిఠాపురం చిన్నవాడా, పిట్టల వేటగాడా బతికిన పిట్టను కొట్టవద్దు, చచ్చిన పిట్టను తేనువద్దు, కూర లేకుండా రానువద్దు, మరేం తెచ్చాడు? (కోడి గుడ్డు )
మూతి వేలెడు, తోక బారెడు? (సూది, దారం)
ఆకాశాన వేలాడే వెన్నముద్దలు ? (వెలగ పండ్లు)
ఆకు బారెడు తోక మూరెడు ? (మొగలి పువ్వు)
ఆకు చిటికెడు కాయ మూరెడు? (మునగ కాయ)
చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు? (అద్దం)
అమారా దేశం నుంచి కొమారా పక్షి వచ్చింది. ముక్కుకి ముత్యం కట్టుకొని తోకతో నీళ్లు తాగుతుంది. (ప్రమిద)
ఆకు వక్క లేని నోరు ఎర్రన, నీరు నారు లేని చేను పచ్చన (రామచిలుక)
మేసేది కాసింత మేత, కూసేది కొండంత కూత (తుపాకి)
కోట గాని కోట ఇంటికో కోట? (తులసి కోట)
కన్నులు ఎర్రగా ఉంటాయి, రాకాసి కాదు, తలనుండి పొగొస్తుంది, భూతం కాదు
చరచర పాకుతుంది పాముకాదు ( రైలు )
కత్తులు లేని భీకర యుద్ధం, గెలుపూ ఓటమి చెరిసగం (చదరంగం)
కతకత కంగు, మాతాత పింగు, తోలు తీసి మింగు (అరటి పండు)
పైనొక పలక, కిందొక పలక, పలకల నడుమ మెలికల పాము (నాలుక)
అమ్మ కడుపున పడ్డాను, అంతా సుఖాన ఉన్నాను, నీచే దెబ్బలు తిన్నాను,
నిలువున ఎండిపోయాను, నిప్పుల గుండు తొక్కాను, గుప్పెడు బూడిద అయినాను (పిడక)
అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, మహాలక్ష్మిలాగుంది. (గడప)
అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది. (చల్లకవ్వం)
అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు, కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు,
అన్నిపువ్వుల్లో రెండేకాయలు (ఆకాశం, చుక్కలు, సూర్యుడు)
సముద్రంలో పుట్టి, సముద్రంలో పెరిగి, ఊళ్లోకొచ్చి ఉరుముతుంది. ఏమిటది? (శంఖం)
ముగ్గురన్నదమ్ములు, రాత్రింబవళ్ళు నడుస్తూనే ఉంటారు. ఎవరువారు? (గడియారం ముళ్ళు) 


#Article 106: చిట్కా వైద్యాలు (128 words)


పల్లెటూళ్లలో, మారుమూల ప్రాంతాలలో ప్రజలు తమకు వచ్చిన జబ్బులను తమకు అందుబాటులో ఉన్న వాటితో నయం చేసుకొనే గృహవైద్యమే చిట్కావైద్యం. పురాతన కాలం నుంచి కొన్ని రుగ్మతలకు నాయనమ్మ అమ్మమ్మలు ఇంట్లో లభ్యమయ్యే పదార్ధాలతోనో పెరటిలో దొరికే ఆకులతోనో చికిత్స చేసి స్వస్థత కలిగించడం అందరికి తెలిసినదే. నాగరికత పెరిగే కొలది ఇంటి వైద్యం విలువ కోల్పోయింది. చాలా జబ్బులకు ఇంట్లో తేలిగ్గా లభించే పదార్ధాలు వాడితే స్వస్థత చేకూరుతుంది. ఇంటివైద్యం రోగాలు ప్రారంభదశలో వున్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. రోగం తీవ్రత పెరిగితే తప్పని సరిగా డాక్టర్ని సంప్రదించాలి.

ఇంటి వైద్యం ద్వారా తగ్గించగలిగే జబ్బులుః

ఎండు మిరపకాయల గింజలు కొన్ని పావు గ్లాసు నీళ్ళల్లో వేసి కొంచెం ఉప్పు కలిపి తాగితే కడుపు నొప్పి మాయం.

ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా చక్కెర, ఒక చిటికెడు ఉప్పు వేసి, బాగా కలియబెట్టి త్రాగవలెను.

నీళ్లు ఎక్కువగా త్రాగాలి భోజనం అయిన వెంటనే సోపు గింజలు తినాలి

వచ్చినప్పుడు చెవిలో నీరు పోకుండా చూసుకోవాలి. వీలైనంత త్వరగా డాక్టర్ వద్దకు వెళ్ళాలి

మేహము, నివారణ===

గ్లాసు మజ్జిగలో ఒక స్పూను నల్లఉప్పు కలుపుకొని తాగవలెను.

వేప ఆకులను తిన వలెను.




#Article 107: కల్లు (278 words)


కల్లు ఒక ఆల్కహాలు కలిగిన పానీయము. దీనిని తాటి చెట్టు, ఈత చెట్టు మొదలైన పామే కుటుంబానికి చెందిన అనేక చెట్ల నుండి తీస్తారు. ఇది చిక్కని, తెల్లని ద్రవం. కల్లును ఆఫ్రికా ఖండము, దక్షిణ భారతదేశము, ఫిలిప్పీన్స్ మొదలైన ప్రాంతాలలో వాడతారు. దీని లాంటి మరికొన్ని మత్తు పానీయాలు భంగు, సారాయి. దీనిని వారుణి అని కూడా పిలుస్తారు.

ఈత చెట్లనుండి ఈ కల్లు లభిస్తుంది. ఈత చెట్లకు కల మట్టలలను నాలుగైదు సార్లు చెక్కడం ద్వారా ఆమట్టల నుండి వచ్చే కల్లును కుండలు కట్టి సేకరిస్తారు. మొదటగా లోపలి మట్టను చెక్కి వారం రోజుల పాటు దానిని అలాగే వదిలిపెడతారు. వారం రోజుల అనంతరం మళ్ళీ చెక్కుతారు. అప్పటి నుండి కల్లు కారడం మొదలవుతుంది. మట్టలకు కట్టిన కుండను మూడు రోజుల తరువాత తీస్తారు. అప్పటి ముందు కారిన కల్లు పులిసి తరువాత కారిన కల్లుతో కలసి మరింత నిషానిచ్చేదిగా మారుతుంది.

తాటి చెట్లనుండి లభించే ఈ కల్లు కూడా దాదాపు ఈతకల్లు మాదిరిగానే లోపలి మట్టలను చెక్కడం ద్వారానే తీస్తారు. కాకుంటే ఈ రోజు కట్టిన కుండ మరుసటి రోజు తీసివేస్తారు. నిలవ కల్లు తాగటం తక్కువ. తాటి చెట్టు నుండి తీయ బడిన వెంటనే వచ్చే కల్లు నిషాలేకుండా సాధారణ లిమ్కా రుచిని కలిగి ఉంటుంది. 
కొబ్బరి కల్లు
కొబ్బరి చెట్లకున్న మువ్వలకు కొస భాగాన్ని కోసి అక్కడ కల్లు కుండను కడతారు: ఈత, తాటి మొదలైన చెట్లకు ఒక కుండనే కడ్తారు. కాని కొబ్బరి చెట్లకు ఎన్ని మువ్వలు వుంటే అన్ని కుండలను కడతారు. ఇది దీని ప్రత్యేకత: ఇది చాల రుచిగాను నిషా తక్కువగను వుంటుంది. తాజా కొబ్బరి కల్లు ఆరోగ్యానికి ఎంతో మేలు. తాజా కొబ్బరి కల్లును నీరా అంటారు.
అత్తి కల్లు
అత్తి చెట్ల నుండి దీనిని సేకరిస్తారు: విప్ప చెట్టు సమీపంలో ఒక గొయ్యి త్రవ్వి అక్కడ కనిపించిన విప్ప చెట్టు వేరును కొంత మేర కోసి దానికింద ఒక చిన్న కుండను కట్టి పైన మూత పెడతారు. ఆ వేరులో నుండి కారిన రసాన్ని సేకరిస్తారు. ఇది గిరిజనులు ఎక్కువగా తయారు చేస్తారు: ఇది ఆరోగ్యానికి చాల మంచిది.

ఇది సర్వసాధారణంగా ఈత, తాటి చెట్లు లేని పట్టణ ప్రాంతాలలో తయారు చేస్తారు. ఒకరకమైన పౌడర్ నీటిలో కలిపి తయారు చేసే ఇది ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకారి. ఇటువంటి కల్లు పట్టణాల మధ్య ప్రధాన రహదారులలో బాటిళ్ళలో నింపి, బల్లలపై ఉంచి అమ్మడం చూడవచ్చు.

జలిగ కల్లు 
ఇది అడవి ప్రాంతంలో దొరుకుతుంది

ఫిలిప్పీన్స్ లో దీనిని 'టూబా' అని వ్యవహరిస్తారు.




#Article 108: సీ భాషకు ముందుమాట (806 words)


సి భాష, అందులోని వ్యాకరణము వగైరా, నేర్చుకునే ముందు మీరు ఆ భాషలోని కొన్ని పదాల (terms) కు అర్ధం తెలుసుకోవటం మంచిది. అవి సీ-భాషను మరింత బాగా నేర్చుకోవడానికి పనికివస్తాయి.

ఇతర ప్రోగ్రామింగు భాషలలాగానే సీ-భాషను కంప్యూటరు సరాసరి అర్ధం చేసుకోవాలంటే కుదరదు. సి-భాష ముఖ్యోద్దేశము మనుషులచే కంప్యూటరుకు సూచనలు ఇచ్చుటకు, అదే సమయములో మనము ఇచ్చిన సూచనలను కంప్యూటరుకు అర్ధం అయ్యే యాంత్రిక భాష లోకి మార్చే ప్రక్రియను సులభంచేయటం. మీరు వ్రాసిన సి-భాష ప్రోగ్రామును, నడిపించగలిగే (executable) యాంత్రిక భాషలోకి మార్చుటకుగాను కంపైలరు అనే ప్రోగ్రామును ఉపయోగించవలెను. మనము సీ-భాషలో వ్రాసిన ప్రోగ్రామును యాంత్రిక భాషలోకి మార్చుటకు కంపైలరు అనే ప్రోగ్రామును ఉపయోగించాలి. మీరు సీ-భాషలో వ్రాసిన ప్రోగ్రాము ఒకటి కంటే ఎక్కువ ఫైళ్ళలో ఉంటే, వాటిని కలిపి ఒక నడిపించగలిగే ప్రోగ్రాముగా లేదా లైబ్రరీగా తయారు చేయుటకుగాను లింకర్ (linker) అను ప్రోగ్రామును వాడాలి. లైబ్రరీ అనునది ఇతర ప్రోగ్రాములలో వాడుకొనుటకు అవసరమైన చిన్న చిన్న ప్రోగ్రాములను దాచుకొనుటకు ఉపయోగిస్తారు, అంతేగానీ దానిని ఒక్కదానినే నడిపించటం కుదరదు. అయితే సాధారణముగా కంపైలు చేయటం, లింకు చేయటం అనేవి చుట్టాల వంటివి. ఉపయోగించినప్పుడు రెండింటినీ ఉపయోగించవలసి వస్తుంది. కాబట్టి చాలామంది ఆ రెండిటినీ ఒకే పనిగా చూస్తారు. మీరు ఒక విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, అది ఏమిటంటే - సీ-భాషలో ఒక దిక్కులోనే కంపైలు చేయవచ్చు: అనగా మీ సీ ప్రోగ్రామును యాంత్రిక భాషలోకి కంపైలు చేయవచ్చు, ఇది సులభమే. కాని డీకంపైలు (యాంత్రిక భాష నుండి సీ-భాష ప్రోగ్రామును పొందటం) మాత్రం చాలా కష్టం. డీకంపైలర్లు ఉన్నాయి, కానీ అవి పెద్దగా ఉపయోగపడే సీ-ప్రోగ్రాములను సృష్టించలేవు. మీకు అత్యంత నాణ్యమైన, ప్రముఖమైన GNU సీ-కంపైలరు లో దొరుకుతుంది.

ఇంటిగ్రేటెడ్ డవలప్‌మెంట్ ఎన్విరాన్‌మెంట్ అనేవి మీ ప్రోగ్రాములు వ్రాసుకొని భద్రపరచుకొనుటకు, కంపైలు చేసుకొనుటకు, లింకు చేసుకొనుటకు కావలిసిన వివిధ ప్రోగ్రాముల సమూహము అని చెప్పవచ్చు. మనము ఒక ప్రోగ్రాము తయారు చేయుటకు కావలిసినవి అన్నీ ఒకే దగ్గర దొరకటం వలన IDEలు ప్రోగ్రాముల తయారీకి చాలా సౌకర్యవంతముగా ఉంటాయి. అంతేకాదు, మనము వ్రాసిన ప్రోగ్రాములో ఉన్న తప్పులను కనిపెట్టుటకు సహాయపడు డిబగ్గరు (debugger) అను ప్రోగ్రాము కూడా IDE లలో ఉంటాయి. ఈ డిబగ్గరుతో మనము ఒక్కొక్క వాక్యమును నడిపి, అసలు తప్పు ఏ వాక్యములో ఉన్నదో మనము తెలుసుకునేటట్లు చేయును. IDEలలో Microsoft Visual C++ (MS VC++) చాలా పేరెన్నికగన్నది, కానీ ఉచితముగా లభించదు. ఉచితముగా దొరికే IDEలలో DevC++ ప్రముఖమయినది, మీకు లభించగలదు. లభించు Pelles C కూడా మంచి IDE. అన్నీ సీ-ప్లస్.ప్లస్ అని ఉన్నాయి కదా మరి సీ-భాషకు పని చేస్తాయా అని మీరు సందేహ పడనవసరం లేదు, ఎందుకంటే సీ-భాషలో ఉన్న అన్ని ప్రత్యేకతలు మనకు సీ-ప్లస్.ప్లస్ భాషలో కూడా ఉంటాయి. కాబట్టి చాలా సి-ప్లస్.ప్లస్ కంపైలరులు సీ-కంపైలరుతో బాటుగా వస్తాయి. మీరు సీ-భాషను నేర్చుకునే ముందు ఒక మంచి IDE ని సమకూర్చుకోవటం ఎంతయినా మంచిది.

మనము ఇప్పుడు సీ-ప్రోగ్రాము యొక్క స్వరూపము యొక్క ప్రాథమిక అంశాల గురించి తెలుసుకుందాము. బ్లాకు అనగా కొన్ని వాక్యముల సమూహము. వీటిని మనము ఒకే ఒక్క వాక్యముగా పరిగణించ వచ్చు. సీ-భాషలో బ్లాకులు తెరుచుకునే మీసాల బ్రాకెట్లతో { మొదలు అయ్యి మూసుకునే మీసాల బ్రాకెట్లతో } ముగుస్తాయి. బ్లాకులలో బ్లాకులు, వాటిలో లోపల మళ్ళీ బ్లాకులు ఇలా కూర్చుకుంటూ వెళ్ళిపోవచ్చు.

సమాచారము లేదా ఫంక్షనులు ఏ రకంగా వాడబడుతున్నాయో లేక చూడబడుతున్నాయో తెలుపుటను మనము స్కోపు అని వ్యవహరిస్తాము. సీ-భాషలో రెండు రకాల స్కోపులు ఉన్నాయి. local (ప్రాంతీయం), global (విశ్వవ్యాప్తం). మనము దేని గురించయినా గ్లోబల్ అని మాట్లాడుతున్నప్పుడు దానిని ప్రోగ్రాములో ఎక్కడయినా చూడవచ్చు లేదా వాడుకోవచ్చు. దేనినయినా లోకల్ అని పిలిచినచో అప్పుడు వాటిని అవి పుట్టిన (declared) బ్లాకులో మాత్రమే చూడవచ్చు లేదా వాడుకోవచ్చు. (బయట బ్లాకులలో ఉన్న వాటిని లోపలి బ్లాకులలో కూడా వాడవచ్చు, కానీ లోపలి వాటిని బయట వాడుట కుదరదు.)

ఫంక్షనులు సీ-భాషలో చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఫంక్షను అనునది కొన్ని పనులు చేయుట కోసం తయారు చేయబడిన ఒక ప్రత్యేక బ్లాకు అని చెప్పవచ్చు. ఫంక్షనుని బాగా తయారు చేసినచో ఇతర ప్రోగ్రామరులు, అది చేయు పనిని, ఎలా చేస్తుంది అనేది తెలుసుకోనవసరము లేకుండా, ఉపయోగించుకోగలుగుతారు. ఫంక్షను చేయు పనిని ఉపయోగించుట అను క్రియను ఫంక్షను-కాల్ (function call) అని పిలుస్తారు. చాలా ఫంక్షనులు వాటికి నిర్దేశించిన పనిని చేయుటకు కొంత సమాచారము అవసరం పడుతుంది, ఆ సమాచారమును ఆర్గుమెంట్సు (arguments) అని పిలుస్తారు. చాలా ఫంక్షనులు వాటి ఫలితమును ఒక విలువగా వాటిని పిలిచిన దానికి తిరిగి పంపిస్తాయి, వీటిని రిటర్న్ వాల్యు (return value) అని పిలుస్తారు

ఒక ఫంక్షనుని పిలిచే ముందు మీరు ఆ ఫంక్ష గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి:

అన్ని ఫంక్షనులను గ్లోబల్ సమాచారముగా పరిగణిస్తారు. అంటే ఒక ఫంక్షను లోపల ఇంకో ఫంక్షనుని రాయటం కుదరదు. గ్లోబలు సమాచారము కాక మిగతా సమాచారమునంతటినీ ఫంక్షను లోపలే సృష్టించాలి.

ప్రతీ నడిపించగలిగే ప్రోగ్రాములో main () అను ఒక ఫంక్షను తప్పని సరిగా ఉండాలి.

అభిప్రాయములు (comments) మనము వ్రాసిన ప్రోగ్రాము గురించి వివరించుటకు ఉపయోగించు కోవచ్చు. మనము వ్రాసే ప్రోగ్రాములో సందర్భానుసారముగా ఎక్కడయినా అభిప్రాయములను ఉంచవచ్చును. సీ-భాషలో అభిప్రాయమును /*తో మొదలు పెట్టి */తో ముగిస్తాము. మంచి పద్ధతిలో అభిప్రాయములను చేర్చటం అనేది సాఫ్టువేరు తయారీలో చాలా ముఖ్యమైన అవసరంగా పరిగణిస్తారు. అభిప్రాయములను చేర్చటం అనేది ఇతరులు మీ ప్రోగ్రామును అర్ధము చేసుకోవటనికే కాదు భవిష్యత్తులో మీ ప్రోగ్రామును మీరే తొందరగా అర్ధము చేసుకోవటానికి, అది ఎలా పనిచేస్తుందో గుర్తుకు తెచ్చుకోవడానికి చాలా పనికి వస్తాయి. సాధారణముగా ఏవయితే అంత తొందరగా అర్ధమవవు అని అనుకుంటామో అక్కడ అభిప్రాయమును చేర్చటం అనునది చాలా మంచి ఆలోచన. అయితే అలాగని ప్రతీ వాక్యానికి అభిప్రాయమును చేర్చటం అనేది మంచి ఆలోచన కాదు. అలా చేయటం వలన మీ ప్రోగాము చదువుటకు కష్టం అయిపోయే అవకాశం కూడా ఉంది మరి.

మంచి ప్రోగ్రామింగు పద్ధతి అవలంభించటం అనేది ప్రోగ్రాములను సులువుగా చదువుటకు, అర్ధవంతముగా ఉంచుటకు మరియూ మంచి ప్రోగ్రాము అన్న భావన కల్పించుటకు ఎంతయినా అవసరము. ఇది అన్ని ప్రోగ్రామింగు భాషలకు వర్తిస్తుంది అని చెప్పవచ్చు. సాధారణముగా అయితే, సరిపడా ఖాళీలను వదలటం, క్రొత్త బ్లాకులను మొదలు పెట్టినప్పటి నుండి మూసివేసే వరకు అన్ని వాక్యములను ఒకే స్థానములో మొదలు పెట్టటం (aligning), ఉపయోగించే ఫంక్షనులకు, వేరియబుల్సులకు అర్ధవంతమైన పేర్లు పెట్టటం, మొదలయినవన్ని చాలా అవసరం.

కొన్ని సార్లు మీరు కంపైలరుకు ప్రత్యేకమైన సూచనలు ఇవ్వాలని అనుకుంటారు. ఈ సూచనలను మనము ప్రీప్రాసెసర్ డైరెక్టీవులు అను ప్రోగ్రాములో కూర్చి ఇవ్వవచ్చు. మీరు మీ ప్రోగ్రామును కంపైలు చేయటం మొదలు పెట్టినప్పుడు, ప్రీప్రాసెసరు అనబడే ఒక ప్రోగ్రాము మీ ప్రోగ్రాములో ఉన్న ఈ సూచనల కోసం వెతికి, ఆ సూచనలకు అనుగుణముగా మీ అసలు ప్రోగ్రామును మారుస్తుంది, ఆ తరువాతే మీ ప్రోగ్రాము కంపైలు చేయబడుతుంది. మీరు ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే ప్రీప్రాసెసరు డైరెక్టీవులు ప్రోగ్రాములో ఉన్నా కూడా, వాటిని మీ ప్రోగ్రాముతో పాటుగా కంపైలుచేయ బడవు, వాటిని కంపైలు ప్రక్రియకు సూచనలు ఇచ్చుటకు మాత్రమే ఉపయోగించుకోవచ్చును. సీ-భాషలోని అన్ని ప్రీప్రాసెసరు డైరెక్టీవులు కూడా # ('హాష్' అని పలుకుతారు) అనే అక్షరముతో మొదలవుతాయి. మీరు Hello, World! ప్రోగ్రాములో ఇది వరకే #include అను ప్రీప్రాసెసరు డైరెక్టివుని చూసి ఉంటారు. #include అను ప్రీప్రాసెసరు డైరెక్టీవు ఒక ఫైలుని తెరిచి అందులో ఉన్న సమాచారమును #includeకి బదులుగా చేర్చును. #define అను ప్రీప్రాసెసరు డైరెక్టీవు కూడా చాలా విరివిగా ఉపయోగించుతారు.




#Article 109: భారత దేశం (2109 words)


భారత గణతంత్ర రాజ్యము నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో  రెండో స్థానం కలిగి వుంది, వైశాల్యములో ప్రపంచంలో ఏడవది. భారత ఆర్ధిక వ్యవస్థ స్థూల జాతీయోత్పత్తి (పర్చేసింగ్ పవర్ పారిటీ) ప్రకారం నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచంలో అతివేగంగా వృద్ధి చెందుతున్న వ్యవస్థలలో భారత దేశం ఒకటి. ప్రపంచం లోనే అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యము ఐన భారతదేశం, ప్రపంచంలోనే అతి పెద్ద సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో  ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఆవిర్భవించింది.

దక్షణాసియాలో ఏడు వేల కిలోమీటర్లకు పైగా సముద్రతీరము కలిగి ఉండి, భారత ఉపఖండములో అధిక భాగాన్ని కూడుకొని ఉన్న భారతదేశం, అనేక చారిత్రక వాణిజ్య రహదారులను కలిగి ఉంది. దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన (అరేబియా సముద్రము అరేబియా సముద్రం), తూర్పున బంగాళాఖాతం ఎల్లలుగా ఉన్నాయి. పాకిస్తాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ ఆఫ్ఘానిస్తాన్ దేశాలతో సరిహద్దులను పంచుకుంటోంది. శ్రీలంక, మాల్దీవులు ఇండోనేసియా భారతదేశం దగ్గరలో గల ద్వీప-దేశాలు. భారతదేశము కొన్ని పురాతన నాగరికతలకు పుట్టిల్లు నాలుగు ముఖ్య ప్రపంచ మతాలకు (హిందూ మతము, బౌద్ధ మతము, జైన మతము సిక్కు మతము) జన్మనిచ్చింది. 18 వ శతాబ్దం నుండి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ క్రమంగా స్వాధీనం చేసుకోవడంతో భారతదేశం బ్రిటీష్ కంపెనీ పరిపాలన కిందకు వచ్చింది. 19 వ శతాబ్దం మధ్య నుండి నేరుగా యునైటెడ్ కింగ్డమ్ నుండే పాలించబడింది. మహాత్మా గాంధీ నాయకత్వాన స్వాతంత్ర్యం కోసం చేసిన అహింసాయుత పోరాటం తర్వాత 1947 లో ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. 1947లో బ్రిటీష్ పాలన నుండి విముక్తి పొందింది.

భారత ఆర్థిక వ్యవస్థ నామమాత్ర GDP కొనుగోలు శక్తి తుల్యత (PPP) ద్వారా మూడవ అతిపెద్ద ద్వారా ప్రపంచ పదకొండో స్థానంలో ఉంది. 1991 లో మార్కెట్ ఆధారిత ఆర్థిక సంస్కరణలు అనుసరిస్తూ, భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక దేశాలలో ఒకటి అయింది.భారత దేశాన్ని కొత్తగా పారిశ్రామీకరణ జరిగిన దేశంగా భావిస్తారు. అయితే, పేదరికం, నిరక్షరాస్యత, అవినీతి, పోషకాహార లోపం, తగని ప్రజా ఆరోగ్య సవాళ్లను ఎదుర్కుంటూ ఉంది. ఒక అణ్వాయుధ ప్రాంతీయ శక్తి, ప్రపంచంలో మూడవ అతిపెద్ద సైన్యం కలిగి ఉంది. ప్రపంచ దేశాల సైనిక వ్యయంలో ఎనిమిదవ స్థానంలో ఉంది. భారతదేశం 28 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య రాజ్యాంగ గణతంత్రం. భారతదేశం ఒక, బహుభాషా, బహుళ జాతి సొసైటీ. ఇది వివిధ వన్యప్రాణుల వైవిధ్యం గల దేశము.

భారత దేశానికి మొత్తం నాలుగు పేర్లు ఉన్నట్లు చెప్పుకోవచ్చు. వీటిలో మొదటిది జంబూ ద్వీపం. ఇది వేదాలలో భారతదేశానికి ఇవ్వబడిన పేరు, ఇప్పటికీ హిందూ మత ప్రార్థనలలో ఈ పేరు ఉపయోగిస్తారు (ఉదా: జంబూ ద్వీపే, మేరో దక్షిణభాగే, శ్రీశైల ఉత్తర భాగే, కృష్ణా గోదావారీ మధ్య స్థానే...). జంబూ అంటే నేరేడు పండు లేదా గిన్నె కాయ, ఈ దేశంలో ఎక్కువగా నేరేడు పండ్లు ఉంటాయి కనుక దీనికి ఈ పేరు వచ్చింది.ఆ తరువాత వచ్చిన పేరు భారతదేశం లేదా భరతవర్షం, ఈ పేరు నాటి రాజు పేరు మీదగా వచ్చినది, ఈ రాజు పేరు భరతుడు. ఇతను విశ్వామిత్ర, మేనకల కుమార్తె అయిన శకుంతల కుమారుడు.

తరువాతి పేరు హిందూదేశం, ఇది సింధుానది పేరు మీదగా వచ్చినది, పూర్వపు పర్షియనులు, గ్రీకులు సింధుానదికి ఆవల ఉన్న దేశం కనుక ఈ పేరుతో పిలిచారు.

తరువాత హిందూదేశం రూపాంతరం ఐన ఇండియా అనే పేరు, బ్రిటీషు వారి వలన ప్రముఖ ప్రాముఖ్యతను పొందినది, ప్రస్తుతము భారతదేశానికి రెండు ప్రభుత్వ గుర్తింపు పొందిన పేర్లు ఉన్నాయి. అవి ఇండియా, భారతదేశం. ఇంకా హిందూస్తాన్ అనునది కూడా హిందూదేశం రూపాంతరమే.

మధ్య ప్రదేశ్‌ లోని భింబెట్కా వద్ద లభ్యమైన రాతియుగపు శిలాగృహాలు, కుడ్యచిత్రాలు భారతదేశంలో మానవుని అతి ప్రాచీన ఉనికికి ఆధారాలు. మొట్టమొదటి శాశ్వత నివాసాలు 9,000 సంవత్సారాల కిందట ఏర్పడ్డాయి. క్రి.పూ. 7000 సమయంలో, మొట్టమొదటి నియోలిథిక్ స్థావరాలు పశ్చిమ పాకిస్తాన్ లో మెహర్గర్ , ఇతర ఉపఖండపు ప్రాంతాల్లో కనిపించింది. ఈ విధంగా సింధుాలోయ నాగరికత అభివృద్ధి, దక్షిణ ఆసియాలో మొదటి పట్టణ సంస్కృతి అభివృద్ధి చెందాయి. ఇదే క్రీ.పూ.26 వ శతాబ్దం , క్రీ.పూ.20 వ శతాబ్దం మధ్య కాలంలో వర్ధిల్లిన సింధులోయ నాగరికత. క్రీ.పూ.5 వ శతాబ్దం నుండి, ఎన్నో స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయిxe. ఉత్తర భారతంలో, మౌర్య సామ్రాజ్యం, భారతీయ సాంస్కృతిక వారసత్వానికి విలువైన సేవ చేసింది. అశోకుడు ఈ వంశంలోని ప్రముఖ రాజు. తరువాతి వచ్చిన గుప్తులకాలం స్వర్ణ యుగం గా వర్ణించబడింది. దక్షిణాన, వివిధ కాలాల్లో చాళుక్యులు, చేర, చోళులు, పల్లవులు, పాండ్యులు మొదలగువారు పాలించారు. విజ్ఞాన శాస్త్రము, కళలు, సారస్వతం, భారతీయ గణితం, భారతీయ ఖగోళ శాస్త్రం, సాంకేతిక శాస్త్రం, భారతీయ మతములు, భారతీయ తత్వ శాస్త్రం మొదలైనవి ఈ కాలంలో పరిఢవిల్లాయి. రెండవ సహస్రాబ్దిలో తురుష్కుల దండయాత్రలతో, భారతదేశంలో ఎక్కువ భాగాన్ని ఢిల్లీ సుల్తానులు, తరువాత మొగలులు పాలించారు. అయినా, ముఖ్యంగా దక్షిణాన స్థానిక సామ్రాజ్యాలు అధికారాన్ని నిలబెట్టుకున్నాయి.

రెండవ సహస్రాబ్ది మధ్యల, పోర్చుగల్, ఫ్రాన్స్, ఇంగ్లండు వంటి ఐరోపా రాజ్యాలు వ్యాపారం చేసే తలంపుతో భారతదేశం వచ్చి, చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న ఇక్కడి పరిస్థితి గమనించి, ఆక్రమించుకున్నారు. బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీపై 1857లో జరిగిన విఫల తిరుగుబాటు (ఇదే, ప్రఖ్యాతి గాంచిన ప్రథమ స్వాతంత్ర్య సమరం) తరువాత, భారతదేశంలోని అధిక భాగం బ్రిటిషు సామ్రాజ్యం కిందకు వచ్చింది. జాతిపిత మహాత్మా గాంధీ నాయకత్వంలో జరిగిన సుదీర్ఘ స్వాతంత్ర్య సమరం ఫలితంగా 1947 ఆగష్టు 15న భారతదేశానికి స్వతంత్రం సిద్ధించింది. 1950 జనవరి 26న సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది.

విభిన్న జాతులు, విభిన్న మతాలతో కూడిన దేశంగా భారతదేశం – జాతి, మత పరమైన సంఘర్షణలను చవిచూసింది. అయినా, తన లౌకిక, ప్రాజాస్వామ్య లక్షణాన్ని కాపాడుకుంటూనే వచ్చింది. 1975, 1977 మధ్యకాలంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలంలో మాత్రమే పౌర హక్కులకు భంగం వాటిల్లింది. భారత దేశానికి చైనాతో ఉన్న సరిహద్దు వివాదం కారణంగా 1962లో యుద్ధం జరిగింది. పాకిస్తాన్తో 1947, 1965, 1971లోను యుద్ధాలు జరిగాయి. అలీనోద్యమంలో భారతదేశం స్థాపక సభ్యురాలు. 1974లో, భారత్ తన మొదటి అణు పరీక్షను నిర్వహించింది. 1998లో మరో ఐదు పరీక్షలు నిర్వహించింది. 1991లో జరిగిన ఆర్ధిక సంస్కరణలతో ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా మారింది.

ఇంకా చూడండి:

భారత దేశం ఒక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా 1950 జనవరి 26న అవతరించింది. భారత రాజ్యాంగం ప్రకారం అధికారం లెజిస్లేచర్, న్యాయవ్యవస్థ, నిర్వహణ వ్యవస్థల ద్వారా అమలవుతుంది.

ఇది పలు రాష్ట్రాల సమాఖ్య. దేశాధినేత అయిన రాష్ట్రపతి పదవి అలంకార ప్రాయమైనది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులు పరోక్ష పద్ధతిలో ఎలక్టోరల్ కాలేజి ద్వారా 5 సంవత్సరాల కాలపరిమితికి ఎన్నుకోబడతారు.

ప్రధానమంత్రి కార్యనిర్వాహక అధికారాలు గల పదవి. లోక్‌సభలో అత్యధిక సంఖ్యాక రాజకీయ పార్టీ, లేదా సంకీర్ణం సభ్యులు ప్రధానమంత్రిని ఎన్నుకుంటుంది. ప్రధానమంత్రి సలహా మేరకు, రాష్ట్రపతిచే నియమించబడ్డ మంత్రివర్గం ప్రధానమంత్రికి తన విధి నిర్వహణలో సహాయకారిగా ఉంటుంది. మంత్రులచే రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

భారత దేశపు శాసన వ్యవస్థలో ద్విసభా పద్ధతి ఉంది. ఎగువ సభను రాజ్య సభ అని, దిగువ సభను లోక్ సభ అని అంటారు. లోక్ సభ సభ్యులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. రాజ్య సభ సభ్యులు ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నుకోబడతారు.

న్యాయవ్యవస్థలో పరమోన్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు, అప్పిలేట్ కోర్టులు, హైకోర్టులు ఉంటాయి. కోర్టులకు సూచనలు, ఆదేశాలు, రిట్లు ఇచ్చే అధికారం ఉంది. రిట్లలో హెబియస్ కార్పస్, మాండమస్, నిషేధం, కోవారంటో, సెర్టియోరారి అనే వివిధ రకాలుగా ఉన్నాయి. భారతీయ కోర్టులు రాజ్యాంగ శక్తులు; ఇవి రాజకీయ జోక్యం లేనివి. న్యాయ వ్యవస్థకు, శాసన వ్యవస్థకు అరుదుగా ఏర్పడే ఘర్షణను రాష్ట్రపతి మధ్యవర్తిత్వం వహించి నివారిస్తారు.

స్వతంత్ర భారత చరిత్రలో అత్యధిక భాగం, కేంద్ర ప్రభుత్వంలో భారత జాతీయ కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉంటూ వచ్చింది. స్వాతంత్ర్యానికి పూర్వం అతిపెద్ద రాజకీయ పక్షం కావడం చేత, స్వాతంత్ర్యం తరువాత దాదాపు 40 ఏళ్ళపాటు దేశరాజకీయాల్లో కాంగ్రెసు గుత్తాధిపత్యం వహించింది. 1977లో జనతా పార్టీగా ఏర్పడ్డ ఐక్య ప్రతిపక్షం కాంగ్రెసును ఓడించి, మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పరచింది. ఇటీవలి కాలంలో, భారత ఓటర్లపై గల పట్టును కాంగ్రెసు పార్టీ కోల్పోతూ వచ్చింది. 2004 సార్వత్రిక ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలిచిన కాంగ్రెసు పార్టీ, వివిధ చిన్న పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హిందూ వాద పార్టీ అయిన భాజపా ప్రధాన ప్రతిపక్షమైంది. ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం కారణంగా 1996 తరువాత ఏర్పడిన ప్రభుత్వాలన్నీ సంకీర్ణాలేకాగా 2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలయింది .ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పదిశాతం లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడం కూడా కష్టంకాగా భారతీయ జనతా పార్టీ మాత్రం మొదటిసారిగా అత్యధిక స్థానాలను గెలుచుకోవడం విశేషం.

 

భారతదేశం విశిష్ట లక్షణాలు గల ఒక ఉపఖండం అని పేర్కొనవచ్చు. భారతదేశంలో అనేక భౌతిక, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక తారతమ్యాలున్నాయి. భారతదేశంలో ఆనాది నుంచి అనేక మతాలు, జాతులు, కులాలు,భాషలు, కులాలు, ఆచారాలు, సంప్రదాయాలు ఉండుటచే దీన్ని భౌగోళిక బిన్నత్వంలో ఏకత్వంగల దేశంగా గుర్తించవచ్చు.

భారతదేశపు ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలు హిమాలయ పర్వతాలతో కూడుకుని ఉన్నాయి. మిగిలిన ఉత్తర భారతం, మధ్య, ఈశాన్య ప్రాంతాలు సారవంతమైన గంగా మైదానంతో కూడి ఉన్నాయి. పశ్చిమాన, పాకిస్థాన్కు ఆగ్నేయ సరిహద్దున థార్ ఎడారి ఉంది. దక్షిణ భారత ద్వీపకల్పం దాదాపు పూర్తిగా దక్కను పీఠభూమితో కూడుకుని ఉంది. ఈ పీఠభూమికి రెండువైపులా తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు ఉన్నాయి.

భారతదేశంలో ఎన్నో ప్రముఖ నదులు ఉన్నాయి. వాటిలో కొన్ని: గంగ, యమున, బ్రహ్మపుత్ర, కృష్ణ, గోదావరి.

దేశపు దక్షిణాన ఉష్ణ వాతావరణం ఉండగా, ఉత్తరాన సమశీతోష్ణ వాతావరణం నెలకొని ఉంది. హిమాలయ ప్రాంతాల్లో అతిశీతల వాతావరణం (టండ్రా) ఉంది. భారత దేశంలో వర్షాలు ఋతుపవనాలు వలన కలుగుతాయి.

భారతదేశం 28రాష్ట్రాలుగా విభజించబడింది (రాష్ట్రములు కొన్నిజిల్లాలుగా విభజించబడినవి), 9 కేంద్రపాలిత ప్రాంతములు , జాతీయ రాజధాని ప్రాంతము, ఢిల్లీ. రాష్ట్రాలకు స్వంతంగా ఎన్నికైన ప్రభుత్వము ఉండును, కానీ కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వముచే నియమించబడిన ప్రతినిధిచే పరిపాలించ బడతాయి.

రాష్ట్రాలు:

కేంద్రపాలిత ప్రాంతాలు:

జాతీయ రాజధాని ప్రాంతం:

భారతదేశం అంటార్క్‌టికాలో ప్రాదేశిక వాదన చేయలేదు కానీ దక్షిణ గంగోత్రి , మైత్రి అను రెండు శాస్త్రీయ స్థావరాలు ఉన్నాయి.

చూడండి: జనాభా వారిగా భారతదేశ రాష్ట్రాల జాబితా

చారిత్రకంగా భారత ఆర్ధిక వ్యవస్థ ఆధారపడిన వ్యవసాయం పాత్ర ప్రస్తుతం తగ్గిపోయింది. ప్రస్తుతం ఇది దేశ స్థూలాదాయంలో 25% కంటే తక్కువే. ముఖ్యమైన పరిశ్రమలు గనులు, పెట్రోలియం, వజ్రాలు, సినిమాలు, జౌళి, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, హస్త కళలు. భారత్ దేశపు పారిశ్రామిక ప్రాంతాలు ఎక్కువగా ప్రధాన పట్టణాల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలలో సాఫ్ట్‌వేర్, బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సొర్సింగ్ రంగాల్లో ప్రపంచంలోని పెద్ద కేంద్రాల్లో ఒకటిగా రూపొందింది. 2003–2004 లో ఈ రంగాల ఆదాయం 1250 కోట్ల డాలర్లు. చిన్న పట్టణాలు, పల్లెల్లోని ప్రజలకు స్థిరమైన ఉపాధి కల్పించే ఎన్నో లఘు పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఏటా దేశాన్ని సందర్శించే విదేశీ యాత్రికులు 30 లక్షల మంది మాత్రమే అయినప్పటికీ, జాతీయాదాయంలో ఈ రంగం పాత్ర ప్రముఖమైనదే. అమెరికా, చైనా, యు.ఏ.ఇ , ఐరోపా సమాఖ్యలు భారత దేశపు ముఖ్య వ్యాపార భాగస్వాములు.

భారత దేశం, చైనా తరువాత ప్రపంచంలోని రెండో అత్యధిక జనాభా గల దేశం. ఎన్నో భిన్నత్వాలు గల జనాభా సామాజిక, రాజకీయ వర్గీకరణలో భాష, మతం, కులం అనే మూడు ప్రముఖ పాత్ర వహిస్తాయి. దేశంలోని అతిపెద్ద నగరాలు – ముంబై (వెనుకటి బాంబే), ఢిల్లీ, కోల్కతా (వెనుకటి కలకత్తా), చెన్నై (వెనుకటి మద్రాసు), హైదరాబాద్

భారత దేశం ఆక్షరాస్యత 74,04%, ఇందులో పురుషుల అక్షరాస్యత 82,14% , మహిళల అక్షరాస్యత 53,7%. ప్రతి 1000 మంది పురుషులకు 940 మంది స్త్రీలు ఉన్నారు.

దేశంలోని 80.5% ప్రజలు హిందువులైనప్పటికీ, ప్రపంచంలోని రెండో అత్యధిక ముస్లిము జనాభా ఇక్కడ ఉన్నారు (13,4%). ఇతర మతాలు: క్రైస్తవులు (2,33%), సిక్కులు (1,84%), బౌద్ధులు (0,76%), జైనులు (0,40%), యూదులు, పార్సీలు, అహ్మదీయులు, బహాయీలు. దేశంలో ఎన్నో మత సంబంధ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా, బహిరంగంగా జరుపుకుంటారు. అనేక మతాల కలగలుపు అయిన భారత దేశంలో పండుగలు అందరూ కలిసి జరుపుకుంటారు. వీటిలో బాగా విస్తృతంగా జరుపుకునే హిందూ పండుగలు శ్రీరామనవమి,వినాయక చవితి,సంక్రాంతి,దీపావళి, హొలీ , దసరా.

భారత దేశం రెండు ప్రముఖ భాషా కుటుంబాలకు జన్మస్థానం. అవి, ఇండో-ఆర్యన్ , ద్రావిడ భాషలు. భారత రాజ్యాంగం 22 భాషలను అధికారికంగా గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం అధికార కార్యక్రమాలలో హిందీ, ఇంగ్లీషు భాషలను ఉపయోగిస్తుంది. దేశంలోని నాలుగు ప్రాచీన భాషలు సంస్కృతం, తెలుగు,కన్నడం , తమిళం. దేశంలో మొత్తం 1652 మాతృ భాషలు ఉన్నాయి.

దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర వహించే రవాణా సౌకర్యాలలో భారత దేశం మంచి ప్రగతిని సాధించింది. మొత్తం 4 రకాల రవాణా సౌకర్యాలు భారత దేశంలో ఉన్నాయి.

దేశంలో రైలు మార్గాలు అతిముఖ్యమైన రవాణా సౌకర్యము. 1853 లో ముంబాయి నుండి థానే మధ్య ప్రారంభమైన రైలు మార్గము ప్రస్తుతం 62 వేల కిలోమీటర్లకు పైగా నిడివిని కల్గి ఉంది. భారతీయ రైల్వే 17 జోన్లుగా విభజితమై ఉంది.

ఢాకా-ఢిల్లీ-లాహోర్ రైలు. ఇస్లామాబాద్: భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల మధ్య తిరిగే రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. దక్షిణాసియా దేశాల మధ్య రైలు సర్వీసులు ప్రారంభించాలనే భారత ప్రతిపాదనకు పాకిస్థాన్ పచ్చజెండా వూపింది. మూడు దేశాలను కలుపుతూ రైళ్లను నడిపిస్తామని భారత రైల్వేశాఖ పంపిన ప్రతిపాదనకు పాక్ రైల్వే మంత్రిత్వ శాఖ సాంకేతిక అనుమతిని మంజూరు చేసింది.ఢాకా-ఢిల్లీ-లాహోర్‌ల మధ్య రైలు నడిపించటం లాభదాయకమేననీ, అవసరమైతే కరాచీ, ఇస్లామాబాద్ వరకూ పొడిగించుకోవచ్చని నిపుణులు సూచించినట్లు పాక్ రైల్వే అధికార వర్గాలు పేర్కొన్నాయి. ముందుగా కంటైనెర్ రైళ్లను నడిపించి, తర్వాతి దశలో ప్రయాణికుల బండ్లను నడిపించాలనే యోచనలో ఉన్నారు. ఇటీవల ఇస్లామాబాద్-టెహ్రాన్-ఇస్తాంబుల్ రైలు సర్వీసును ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేయటంతో భారత రైల్వేశాఖకు ఈ కొత్త ఆలోచన వచ్చింది. దక్షిణాసియా రైళ్ల వల్ల పాకిస్థాన్, ఇతర సార్క్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ప్రయోజనాలు నెరవేరతాయని మనదేశం ప్రతిపాదనల్లో వెల్లడించింది. దీనివల్ల నేపాల్, భూటాన్ వంటి దేశాలకూ రైలు సర్వీసులు నడిపించవచ్చని సూచించినట్లు తెలిసింది. దక్షిణాసియా రైలు సర్వీసులు వాణిజ్యపరంగా ప్రయోజనకరమేనని నిపుణులు సైతం కితాబునిస్తున్నారు. ఈ మార్గంలో రైళ్లను నడిపించటమూ తేలికేననీ పేర్కొంటున్నారు. భారత్, పాక్, బంగ్లాదేశ్‌లలో బ్రిటిష్ పాలకులు రైలు మార్గాలను నిర్మించినందువల్ల మూడు దేశాల్లోనూ బ్రాడ్‌గేజి రైలు పట్టాలు ఉండటం, నిర్వహణ శైలీ ఒకేమాదిరిగా ఉండటం కలిసివస్తుందని అభిప్రాయపడుతున్నారు.

మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించిన రవాణా మార్గాలు రోడ్డు మార్గాలే. రోడ్డు మార్గాలలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులు, గ్రామ పంచాయతి రహదారులు అని 4 రకాలు. దేశంలోని మొత్తం రోడ్ల నిడివిలో కేవలం 2% ఆక్రమించిన జాతీయ రహదారులు, ట్రాఫిక్ లో మాత్రం సుమారు 40% ఆక్రమిస్తున్నాయి.

ఆతి వేగంగా జరిగే రవాణా వ్యవస్థగా వాయు మార్గాలు పస్రిద్ధి చెందాయి. మనదేశంలో రాష్ట్ర రాజధానులు , ప్రధాన పట్టణాలను కల్పుతూ విమాన మార్గాలు ఉన్నాయి. ఇది అధిక వ్యయంతో కూడుకొనినప్పటికినీ సౌకర్యవంతంగా , అతి వేగంగా ఉంటుంది. కేవలం దేశంలోని పట్టణాలు, నగరాలనే కాకుండా దేశంలోని ప్రధాన నగరాలనుండి ఇతరదేశాలను కూడా కల్పే అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి.

జల మార్గాలు రవాణా సౌకర్యాలలో ఆలస్యం అయినప్పటికినీ తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి ముడి చమురు, ఇతర ఖనిజాలు తెప్పించుకోవడానికి, మనదేశం నుంచి ఇతరదేశాలకు ముడి ఇనుము, ఇతర ఖనిజాలు ఎగుమతి చేయడానికి ఈ రవాణా మార్గం చాలా అనువైనది.

 

భారతదేశం తన ఉత్కృష్టమైన, ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వాన్ని, తరతరాలుగా కాపాడుకుంటూ వచ్చింది. ఆక్రమణదారులు, వలస వచ్చినవారి సంప్రదాయాలను కూడా తనలో ఇముడ్చుకుంది. తాజ్‌మహల్ వంటి కట్టడాలు, మరెన్నో సంస్కృతీ, సంప్రదాయాలు మొగలు పాలకులనుండి వారసత్వంగా స్వీకరించింది.

భారతీయ సమాజము భిన్న భాషలతో, భిన్న సంస్కృతులతో కూడిన బహుళ సమాజం. వివిధ మత కార్యక్రమాలు సంఘ దైనందిన జీవితంలో ఒక భాగం. అన్ని సామాజిక, ఆర్ధిక వర్గాలలోను విద్యను ఉన్నతంగా భావిస్తారు. సాంప్రదాయికమైన సమష్టి కుటుంబ వ్యవస్థలోని ఆర్ధిక అవరోధాల దృష్ట్యా చిరు కుటుంబాలు ఎక్కువైపోతున్నప్పటికీ, సాంప్రదాయిక కుటుంబ విలువలను పవిత్రంగా భావిస్తారు, గౌరవిస్తారు.

భారతీయ సంగీతం వివిధ రకాల పద్ధతులతో కూడినది. శాస్త్రీయ సంగీతంలో రెండు ప్రధాన పద్ధతులున్నాయి. దక్షిణాదికి చెందిన కర్ణాటక సంగీతం ఒకటి కాగా, ఉత్తరాదిన చెందిన హిందూస్తానీ సంగీతము రెండోది. ప్రజాదరణ పొందిన మరో సంగీతం సినిమా సంగీతం. ఇవికాక ఎన్నో రకాల జానపద సంగీత సంప్రదాయాలు కూడా ఉన్నాయి. శాస్త్రీయ నృత్య రీతులు కూడా ఎన్నో ఉన్నాయి – భరతనాట్యం, ఒడిస్సీ, కూచిపూడి, కథక్, కథకళి మొదలైనవి. ఇవి ఇతిహాసాలపై ఆధారపడిన కథనాలతో కూడి ఉంటాయి. ఇవి ఎక్కువగా భక్తి, ఆధ్యాత్మికత మేళవింపబడి ఉంటాయి.

ప్రాచీన సారస్వతం ఎక్కువగా మౌఖికమైనది. తరువాతి కాలంలో అది అక్షరబద్ధం చేయబడింది. దాదాపుగా ఇవన్నీ కూడా హిందూ సంస్కృతిలో నుండి ఉద్భవించినవే. పవిత్ర శ్లోకాలతో కూడిన వేదాలు, మహాభారతం , రామాయణం వీటిలో ఉన్నాయి. తమిళనాడుకు చెందిన సంగమ సాహిత్యం భార్తదేశపు ప్రాచీన సాంప్రదాయిక లౌకిక తత్వానికి అద్దం పడుతుంది. ఆధునిక కాలంలో, భారతీయ భాషలలోను, ఇంగ్లీషు లోను కూడా రాసిన ప్రసిద్ధి చెందిన రచయితలెందరో ఉన్నారు. నోబెల్ బహుమతి సాధించిన ఒకేఒక భారతీయుడైన రవీంద్రనాథ్ టాగోర్ బెంగాలీ రచయిత.

ప్రపంచంలోనే అత్యధికంగా సినిమాలు నిర్మించేది భారతదేశమే. దేశంలో అన్నిటికంటే ప్రముఖమైనది ముంబైలో నెలకొన్న హిందీ సినిమా పరిశ్రమ. అధిక సంఖ్యలో సినిమాలు నిర్మిస్తున్న ఇతర భాషా పరిశ్రమలు – తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ , బెంగాలీ. బెంగాలీ సినిమా దర్శకుడైన సత్యజిత్ రే ప్రపంచ సినిమా రంగానికి భారత్ అందించిన ఆణిముత్యం.

వరి అన్నం , గోధుమ (బ్రెడ్, రొట్టెల రూపంలో) లు ప్రజల ముఖ్య ఆహారం. విభిన్న రుచులు, మసాలాలు, పదార్థాలు, వంట విధానాలతో కూడిన భారతీయ వంటలు ఎంతో వైవిధ్యమైనవి. ఎన్నో రకాల శాకాహార వంటలకు దేశం ప్రసిద్ధి చెందింది. భారతీయ ఆహార్యం కూడా ఆహారం వలెనే బహు వైవిధ్యమైనది. చీర, సల్వార్ కమీజ్ స్త్రీలు ఎక్కువగా ధరించే దుస్తులు. పురుషులు పంచె, కుర్తా ధరిస్తారు

జనాభా పరంగా రెండో పెద్ద దేశమైననూ ప్రపంచ క్రీడా రంగంలో భారతదేశానికి సముచిత స్థానం లేదు. ఒలంపిక్ క్రీడలలో 8 పర్యాయాలు హాకీలో బంగారు పతకాలు సాధించిన భారత దేశానికి ప్రస్తుతం చెప్పుకోదగిన ఘనత లేదు.

చదరంగంలో విశ్వనాథన్ ఆనంద్ రెండు పర్యాయాలు ప్రపంచ టైటిల్ సాధించగా, టెన్నిస్లో లియాండర్ పేస్,మహేష్ భూపతి, సానియా మీర్జాలు డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిళ్ళు సాధించిపెట్టారు.ప్రస్తుతము ఆడుతున్నవార్లలో సైన నెహవల్ చెప్పుకోదగినది. భారతదేశము ఒలింపిక్‌ క్రీడలు లాంటి అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీలలో పెద్దగా రాణించలేదు. గత మూడు ఒలంపిక్‌ క్రీడలలో కేవలం ఒక్కొక్కటే పతకం సాధించగలిగినది. ఆసియా క్రీడల లో కూడా చిన్న చిన్న దేశాల కంటే మన పతకాలు చాలా తక్కువ. కబడ్డీలో మాత్రం వరుసగా బంగారు పతకాలు మనమే సాధించాము.

కొన్ని సాంప్రదాయ ఆటలు అయిన కబడ్డీ, ఖో-ఖో , గోడుంబిళ్ళ (గిల్లీ-దండా) లకు దేశమంతటా బహుళ ప్రాచుర్యము ఉంది. చదరంగము, క్యారమ్‌, పోలో, బ్యాడ్మింటన్‌ మొదలైనటువంటి అనేక క్రీడలు భారతదేశంలో పుట్టాయి. ఫుట్‌బాల్‌ (సాకర్‌) కు కూడా యావత్‌ భారతదేశంలో చాలా ప్రజాదరణ ఉంది.

భారతదేశంలో జాతీయ శెలవుదినాలు మూడే. పండుగలు, పర్వదినాలు, నాయకుల జన్మదినాలకు సంబంధించిన ఇతర శెలవుదినాలు ఆయా రాష్ట్రాల పరిధిలో ఉంటాయి.

జమ్మూ కాశ్మీరు పూర్తిగా భారత్‌లో భాగమేనని భారత ప్రభుత్వం భావిస్తున్నది. ఈ రాష్ట్రానికి ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒక సరిహద్దుగా ఉంది. 1948లో ఐక్యరాజ్యసమితి కుదిర్చిన సంధి ప్రకారం భారత, పాక్ అధీనంలో ఉన్న భూభాగం యథాతథ స్థితి కొనసాగుతోంది. ఈ కారణంగా, ఆఫ్ఘనిస్తాన్‌కు సరిహద్దుగా నున్న ఈ రాష్ట్రపు భూభాగం ప్రస్తుతం పాకిస్తాన్ ఆధీనములో ఉంది.




#Article 110: మహాభారతం (1396 words)


ఇది మహాభారత గాథను గురించిన వ్యాసం. తెలుగులో కవిత్రయం వ్రాసిన గ్రంధాన్ని గురించిన వ్యాసాన్ని శ్రీ మదాంధ్ర మహాభారతం వద్ద చూడవచ్చు.  భారతము అయోమయ నివృత్తి పేజీ కూడా చూడండి

మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. సాహిత్య చరిత్ర (History of Epic Literature) పక్రారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 4000 సామాన్య శకానికి పూర్వం.లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది  మహాభారత మహాకావ్యాన్ని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో (74,000 పద్యములతో లేక సుమారు 18 లక్షల పదములతో) ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలో ఒకటిగా అలరారుచున్నది. ఈ మహా కావ్యాన్ని 14వ శతాబ్దంలో కవిత్రయముగా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రన (ఎఱ్ఱాప్రగడ) లు తెలుగు లోకి అనువదించారు.

ఇతిహాసం సాంప్రదాయకంగా వ్యాసుడు అనే ఋషికి ఆపాదించబడింది. ఆయన ఇతిహాసంలో ప్రధాన పాత్ర కూడా వహించాడు. వ్యాసుడు దీనిని ఇతిహాసం (చరిత్ర) గా అభివర్ణించాడు. ఆయన గురువులందరిని గురించి వేద కాలంలోని వారి విద్యార్థులను గుర్తించే గురు-శిష్య పరంపర గురించి కూడా వివరించాడు.మహాభారతం మొదటి విభాగం వ్యాసుడి పఠిస్తుండగా గణపతి (శివ పార్వతుల కుమారుడు) గ్రంథాన్ని లిఖించాడని పేర్కొనబడింది.

ఇతిహాసం కథను కథా నిర్మాణంలో ఉపయోగిస్తుంది. లేకపోతే దీనిని ఫ్రేమెటెల్సు అని పిలుస్తారు. ఇది అనేక భారతీయ మత మతేతర రచనలలో ప్రసిద్ధి చెందింది. ఇది మొదట తక్షశిల వద్ద వ్యాసమహర్షి శిష్యుడు వైశంపాయన అనే ఋషి,  
పాండవవంశస్థుడు అర్జునుడి మనవడు అయిన జనమేజయ రాజుకు వినిపించాడు. ఈ కథను చాలా సంవత్సరాల తరువాత సౌనకుడు అనే సౌతి అనే పురాణ కథకుడు తిరిగి వినిపించాడు. నైమిశారణ్యం అనే అడవిలో సౌనక కులపతి ఋషులకు తెలియజేసాడు.

ఈ వచనాన్ని 20 వ శతాబ్దం ప్రారంభంలో పాశ్చాత్య ఇండోలాజిస్టులు నిర్మాణాత్మకంగా, అస్తవ్యస్తంగా అభివర్ణించారు. అసలు కవిత ఒకప్పుడు అపారమైన విషాద శక్తిని కలిగి ఉండాలని హెర్మను ఓల్డెనుబర్గు భావించాడు. కాని పూర్తి వచనాన్ని భయంకరమైన గందరగోళం అని కొట్టిపారేశాడు. అసమాన మూలం భాగాలను క్రమం లేని మొత్తంగా ముద్ద చేయగలిగారు. మోర్టిజు వింటర్నిట్జి (గస్చిచ్తె డరు ఇండిస్చెను లిటరాటురు 1909) ఇది  కవిత్వరహిత థియాలజిస్టులు - క్లంసీ స్క్రైబ్సు విడివిడిగా క్రమరహితంగా ఉన్న మూల భాగాలను ఒకేకథగా కూర్చాడని పేర్కొన్నాడు.

మహాభారతంపై పరిశోధన వచనంలోని పొరలను గుర్తించడానికి, ఎడిటింగు చేయడానికి అపారమైన ప్రయత్నం చేయబడింది. ప్రస్తుత మహాభారతంలోని కొన్ని అంశాలను వేద కాలానికి చెందినవిగా గుర్తించవచ్చు. మహాభారతం నేపథ్యం ఇతిహాసం మూలం  ప్రారంభ వేద కాలం తరువాత, మొదటి భారతీయ 'సామ్రాజ్యం' క్రీ.పూ. 3 వ శతాబ్దం ఇది క్రీ.పూ. 8 లేదా 9 వ శతాబ్దం నుండి చాలా దూరం తొలగించబడని తేదీ.గా ఉండే  అవకాశం ఉంది. మహాభారతం రథసారధులు మౌఖికంగా ప్రచారం చేయబడిన కథగా ప్రారంభమైంది. అక్షర-పరిపూర్ణతను సంరక్షించాల్సిన వేదాల మాదిరిగా కాకుండా ఇతిహాసం ఒక ప్రసిద్ధ రచన. దీని పఠనం అనివార్యంగా భాష, శైలిలో మార్పులకు అనుగుణంగా ఉంటుంది కాబట్టి దీని ప్రారంభ 'మనుగడ' భాగాలు ప్రభావవంతమైన పురాణానికి మనకు ఉన్న 'బాహ్య' ప్రపంచవ్యవహారాల కంటే పాతది కాదని విశ్వసిస్తున్నారు. ప్రారంభ గుప్తులకాలం నాటికి (క్రీ.శ 4 వ శతాబ్దం) సంస్కృత రూపం తుది రూపంకు చేరుకుందని అంచనా. మహాభారతం మొదటి గొప్ప విమర్శనాత్మక ఎడిషను సంపాదకుడు విష్ణు సూక్తంకరు ఇలా వ్యాఖ్యానించారు: ఒక ద్రవ వచనాన్ని అక్షరాలా అసలు ఆకారంలో ఒక ఆర్కిటైపు, స్టెమా కోడికం ఆధారంగా పునర్నిర్మించడం గురించి ఆలోచించడం పనికిరానిది. అప్పుడు ఏమి సాధ్యమవుతుంది? మనది ఏమిటి? అందుబాటులో ఉన్న వ్రాతప్రతుల అంశం ఆధారంగా చేరుకోగలిగే టెక్స్టు పురాతన రూపాన్ని పునర్నిర్మించడం మాత్రమే లక్ష్యం.  ఆ వ్రాతప్రతుల సాక్ష్యం కొంతవరకు ఆలస్యం అయ్యింది. దాని భౌతిక కూర్పు, భారతదేశ వాతావరణం ఆధారంగా కానీ అది చాలా విస్తృతమైనది.

మహాభారతం (1.1.61) 24,000 శ్లోకాల ప్రధాన భాగాన్ని వేరు చేస్తుంది: భారత సరైనది. అదనపు ద్వితీయ విషయాలకు విరుద్ధంగా అవాల్యాన గ్యాయసత్ర (3.4.4) ఇదే విధమైన వ్యత్యాసాన్ని కలిగిస్తుంది. రచన కనీసం మూడు పునరావృత్తులు సాధారణంగా గుర్తించబడతాయి: 8,800 శ్లోకాలతో జయ (విక్టరీ) వ్యాసవిరచితం, వైశంపాయనుడు పఠించిన భారతంలో 24,000 శ్లోకాలు, చివరికి ఉగ్రశ్రవ సూతుడు పఠించిన మహాభారతం 100,000 పద్యాలు. అయినప్పటికీ జాను బ్రోకింగ్టను వంటి కొంతమంది పండితులు, జయ, భారతం ఒకే కథనాన్ని సూచిస్తుందని వాదించారు. ఆదిపర్వం (1.1.81) లోని ఒక పద్యం పొరపాటుగా జయ సిద్ధాంతాన్ని 8,800 శ్లోకాలతో పేర్కొన్నారు. ఈ మహాఇతిహాస గ్రంథం విస్తరించిన రూపంలో 18 పర్వాలు ఉన్నాయి. 12 సంఖ్యలను నొక్కిచెప్పే అధికారిక సూత్రాల తరువాత ఈ పెద్ద రచన పునర్నిర్మాణం జరిగింది. స్పిట్జరు వ్రాతప్రతులలో అనుశాసన-పర్వం విరాట పర్వాలు లేకపోవడం వల్ల తాజా భాగాల కలయిక తేదీని సూచిస్తుంది. మనుగడలో ఉన్న పురాతన సంస్కృత రచన కుషాను కాలం (క్రీ.పూ. 200) నాటిది.

మహాభారతంలోని ఒక పాత్ర చెప్పినదాని ప్రకారం. 1.1.50, ఇతిహాసం మూడు వెర్షన్లు ఉన్నాయి. ఇవి వరుసగా మను (1.1.27), అస్తికా (1.3, ఉప పర్వ 5) లేదా వాసు (1.57) తో మొదలయ్యాయి. ఈ సంస్కరణలలో ఒకటి మరొక 'ఫ్రేం' సెట్టింగుల కలయికకు అనుగుణంగా ఉంటాయి. వాసు వెర్షను ఫ్రేం సెట్టింగులను వదిలివేసి, వ్యాసుడు పుట్టినకాలంతో ప్రారంభమవుతుంది. ఆస్తిక వెర్షను బ్రాహ్మణ సాహిత్యం సర్పయాగం అంశాలను జోడించి మహాభారతం అనే పేరును పరిచయం చేస్తుంది. వ్యాసుడిని రచన రచయితగా గుర్తిస్తుంది. ఈ చేర్పుల రచయితలు బహుశా పెకారాట్రిను పండితులు, వారు ఒబెర్లీసు (1998) అభిప్రాయం ఆధారంగా దాని చివరి పునర్నిర్మాణం వరకు రచన మీద నియంత్రణను కలిగి ఉంటారు. భీష్మ-పర్వంలో హునా గురించి ప్రస్తావించినప్పటికీ, ఈ పర్వం 4 వ శతాబ్దంలో సవరించబడిందని సూచిస్తుంది..

ఆది-పర్వంలో జనమేజయ సర్పయాగం (సర్పసత్ర) ప్రస్తావన ఉంది. దాని ప్రేరణను వివరిస్తుంది. ఈ యాగం ఉనికిలో ఉన్న అన్ని సర్పాలను ఎందుకు నాశనం చేయాలని ఉద్దేశించిందో వివరిస్తుంది. ఇది ఉన్నప్పటికీ ఇప్పటికీ పాములు ఎందుకు ఉన్నాయి. ఈ సర్పయాగం అంశం మహాభారతం సంస్కరణకు నేపథ్య ఆకర్షణ (మింకోవ్స్కి 1991) గా జోడించబడిన స్వతంత్ర కథగా పరిగణించబడుతుంది. వేద (బ్రాహ్మణ్యం) సాహిత్యానికి ప్రత్యేకించి దగ్గరి సంబంధం ఉందని భావించారు. పాకవిమ్య బ్రాహ్మణ్యం (25.15.3 వద్ద) ఒక సర్పయాగం! అధికారిక పూజారులను వివరిస్తాడు. వీరిలో ధతరాత్ర, జనమేజయ పేర్లు, మహాభారత సర్పయాగంలోని రెండు ప్రధాన పాత్రలు. అలాగే మహాభారతంలో ఒక పాము పేరు తక్షకుడు.

సుపర్ణోఖ్యానం కవిత్వం తొలి ఆనవాళ్ళలో ఒకటిగా పరిగణించబడే పద్యం, విస్తరించిన గరుడపురాణానికి ఇది పూర్వగామి, ఇది మహాభారతం ఆదిపర్వంలో, ఆస్థికపర్వంలో చేర్చబడింది.

మహాభారతం దాని ప్రధాన భారత గురించి మొట్టమొదటి ప్రస్తావనలు పాణిని అష్టాధ్యాయి సూత్రం (సూత్రం 6.2.38) (క్రీ.పూ. 4 వ శతాబ్దం) అశ్వలాయన గృహ్యసూత్రాలు (3.4.4) ఉన్నాయి. దీని అర్థం భారతం అని పిలువబడే ప్రధాన 24,000 శ్లోకాలు, అలాగే విస్తరించిన మహాభారతం ప్రారంభ వెర్షను, క్రీస్తుపూర్వం 4 వ శతాబ్దం నాటికి కూర్చబడ్డాయి. గ్రీకు రచయిత డియో క్రిసోస్టోం (మ .40 - సి. 120 CE) ఇచ్చిన నివేదిక హోమరు కవిత్వం భారతదేశంలో కూడా పాడటం గురించి వివరించింది. ఇలియడు సంస్కృతంలోకి అనువదించబడిందని సూచిస్తుంది. అయినప్పటికీ భారతీయ అధ్యయనకారులు సాధారణంగా ఈ తేదీలో ఒక మహాభారతం ఉనికికి సాక్ష్యంగా తీసుకున్నారు. దీని ఎపిసోడ్లు డియో లేదా అతని మూలాలు ఇలియడు కథగా గుర్తించాయి.

మహాభారతంలోని అనేక కథలు శాస్త్రీయ సంస్కృత సాహిత్యంలో వారి స్వంత ప్రత్యేక గుర్తింపులను పొందాయి. ఉదాహరణకు గుప్తరాజవంశం యుగంలో నివసించినట్లు భావిస్తున్న ప్రఖ్యాత సంస్కృత కవి కాళిదాసు (క్రీ.పూ. 400) అభిజ్ఞానశాకుంతలం, మహాభారతానికి పూర్వగామి అయిన కథ ఆధారంగా రూపొందించబడింది. కాళిదాసుకు ముందు నివసించినట్లు భావిస్తున్న భాసమహాకవి రాసిన సంస్కృత నాటకం ఊరుభాగా, భీముడి తొడలను చీల్చడం ద్వారా దుర్యోధనుడిని హతమార్చడం మీద ఆధారపడింది.

ఖోహు (సత్నా జిల్లా, మధ్యప్రదేశు) నుండి వచ్చిన మహారాజా శర్వనాథ (క్రీ.శ 533–534) రాగి పలక శాసనం మహాభారతాన్ని 100,000 పద్యాల సమాహారం (శత- సహశ్రీ సహ్హిత) గా అభివర్ణిస్తుంది.

ఈ కావ్యవైభవాన్ని నన్నయ:

మహాభారత గాథను వ్యాసుడు ప్రప్రథమంగా తన శిష్యుడైన వైశంపాయనుడి చేత సర్పయాగం చేయించేటపుడు జనమేజయ మహారాజుకి చెప్పించగా, అదే కావ్యాన్ని తరువాత నైమిశారణ్యంలో శౌనక మహర్షి సత్రయాగము చేయుచున్నప్పుడు సూతమహర్షి అక్కడకు వచ్చిన ఋషులకు చెప్పాడు.

మహాభారతాన్నిచెరకుగడతో పోల్చారు. పర్వము అంటే చెరకు కణుపు. 18 కణుపులు (పర్వములు) కలిగిన పెద్ద చెరకుగడ, మహాభారతం. చెరకును నములుతున్న కొద్దీ రసం నోటిలోకి వచ్చి, నోరు తీపి ఎక్కుతుంది. అలాగే భారతాన్ని చదివిన కొద్దీ జ్ఞానం పెరుగుతుంది.

మహాభారతంలో 18 పర్వములు, వాటిలో జరిగే కథాక్రమం ఇది:
 

హరివంశ పర్వము: శ్రీకృష్ణుని జీవితగాథ
వీటిలో మొదటి అయిదు పర్వాలను ఆదిపంచకము అనీ, తరువాతి ఆరు పర్వాలను యుద్ధషట్కము అనీ, ఆ తరువాతి ఏడు పర్వాలను శాంతిసప్తకము అనీ అంటారు.

భారతీయ కొలమానంలో అక్షౌహిణి ఒక కొలత. సైన్యాన్ని అక్షౌహిణిలో కొలుస్తారు. కంబ రామాయణంలో ఆ లెక్కలు ఇలా ఉన్నాయి. ఆదిపర్వం బట్టి సైన్యగణాంకాలలో పునాది నిష్పత్తి 1 రథము : 1 ఏనుగు : 3 గుర్రాలు : 5 కాలిబంట్లు.

ఇటువంటి అక్షౌహిణులు 18 కురుక్షేత్ర యుద్ధములో పాల్గొన్నాయి. అంటే - 3,93,660 రథములు + 3,93,660 ఏనుగులు + 11,80,980 గుర్రాలు + 19,68,300 కాలిబంట్లు

ఒక్కొక్క రథం మీద యుద్ధవీరునితో పాటు సారథి కూడా ఉంటాడు. సారథులను కూడా లెక్కలోనికి తీసుకుంటే, రథబలం 7,87,320 కి చేరుకుంటుంది. అలాగే గజబలంతో యుద్ధవీరునితో పాటు మావటిని లెక్కలోనికి తీసుకుంటే, గజ బలం 7,87,320 కి చేరుకుంటుంది.

అంటే 36,691,71,39,200 సైన్యాన్ని వెల్లువ అంటారు.

ఇటు వంటివి 70 వెల్లువలు సుగ్రీవుని దగ్గర ఉన్నట్లుగా కంబ రామాయణం చెపుతుంది. అంటే 366917139200 X 70 = 256842399744000 మంది వానర వీరులు సుగ్రీవుని దగ్గర వుండేవారు. వీరికి నీలుడు అధిపతి.

కథల్లోను, కావ్యాల్లోను నిజమైన ప్రదేశాల పేర్లను పేర్కొనడం ఎక్కువమంది రచయితల్లో కనిపించే లక్షణం. రచయిత చనిపోయిన లక్షల సంవత్సరాల తర్వాత త్రవ్వకాల్లో బయల్పడిన ఆ రచయిత వ్రాతల ప్రకారం పరిశోధిస్తే ఆ ప్రదేశాలు అలాగే ఉంటాయి కనుక ఎవరైనా ఆ వ్రాతలు చదివినప్పుడు అందులోని కథ నిజంగా జరిగినట్లు అనిపిస్తుందని ఒక అభిప్రాయం ఉంది.  క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల వరకూ ఆర్యుల భాష అయిన సంస్కృత భాష భారతదేశంలో లేదని, మహాభారత కావ్యం వేద కాలం తర్వాత, అనగా సుమారు క్రీస్తు పూర్వం 800 - క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల మధ్య ఆర్యుల తెగకు చెందిన వేదవ్యాసుడు అను కవి రచించిన కావ్యము అని, మహా భారతములోని సన్నివేశాలు కల్పితాలు అని, హిందువులకు తమ మతముపై యున్న గట్టి విశ్వాసాలే కల్పిత కావ్యాన్ని చరిత్రగా చేశాయని పరిశోధకుల భావన. గుజరాత్ రాష్ట్రంలో ఇటీవల ద్వారకా నగరం వద్ద అరేబియన్ సముద్ర తీర గర్భంలో బయల్పడిన ఓడ రేవు క్రీస్తుపూర్వం 3000 సంవత్సారాలనాటిదని, అది సింధూ (హరప్పా) నాగరికతకు చెందినది అని, ఆ కాలంలో భాషకు లిపి లేదని పరిశోధనలు తెలుపుతున్నాయి 

మహాభారత కథ ఇతివృత్తంగా ఎన్నో తెలుగు సినిమాలు వెలువడ్డాయి. పౌరాణిక ఇతివృత్తాలను తెరకెక్కించడంలో తెలుగువారికున్న నైపుణ్యం కారణంగా వాటిలో చాలా సినిమాలు చిరస్థాయిగా జనాదరణ పొందాయి. వాటిలో కొన్ని:




#Article 111: ఆది పర్వము (203 words)


వ్యాసుడు రచించిన, మహాభారతములో మొత్తం 18 ఉపపర్వాలు, 8 అశ్వాసాలు ఉన్నాయి. 
సంస్కృత భారతంలోని ఆది పర్వంలో మొత్తం 9,984 శ్లోకాలు ఉంటే, శ్రీమదాంధ్ర మహాభారతంలోని ఆది పర్వంలో మొత్తం పద్యాలు, గద్యాలు కలిపి 2,084 ఉన్నాయి.

మహాభారతంలోని పద్ధెనిమిది పర్వాలలో విషయ క్రమణిక ఇలా ఉంది.

వీటిలో మొదటి అయిదు పర్వాలను ఆదిపంచకము అనీ, తరువాతి ఆరు పర్వాలను యుద్ధషట్కము అనీ, 
ఆ తరువాతి ఏడు పర్వాలను శాంతిసప్తకము అనీ అంటారు. ఇవి కాక తరువాతి కథ అయిన శ్రీకృష్ణుని జీవితగాథను తెలుగు మహాభారతంలో భాగంగా కాక హరివంశ పర్వము అనే ప్రత్యేక గ్రంథంగా పరిగణించారు. నన్నయ మొదలుపెట్టిన కథావిభాగాన్నే తిక్కన, ఎఱ్ఱన అనుసరించారు.

ఆది పర్వం ఈ క్రింది సంస్కృత మంగళ శ్లోకంతో ప్రారంభం అవుతుంది. ఈ సంస్కృత శ్లోకం తెలుగు సాహిత్యానికే మంగళ శ్లోకం అనవచ్చును. 

శ్రీవాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాజ్గేషు యే
లోకానాం స్థితి మావహ న్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం
తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషా స్సంపూజితా వస్సురై
ర్భూయాసుః పురుషోత్తమామ్బుజభవశ్రీకన్ధరా శ్శ్రేయసే.

ఆ తరువాత ఒక వచనం, తరువాత ఈ క్రింది ఉత్పలమాలతో ప్రారంభం అవుతుంది.

రాజకులైకభూషణుడు, రాజమనోహరు, డన్యరాజతే
జోజయశాలిశౌర్యుడు, విశుద్దయశశ్శరదిందు చంద్రికా
రాజితసర్వలోకు, డపరాజితభూరిభుజాకృపాణధా
రాజలశాంతశాత్రవపరాగుడు రాజమహేంద్రుడున్నతిన్

ఈ ఆదిపర్వంలో నన్నయ తాను ఎందుకు ఈ మహా భారతాన్ని తెలుగు సేయుచున్నాడో, అందుకు ఎవరు తోడ్పడుతున్నారో వివరించాడు. అంతే కాకుండా మహాభారత ప్రశస్తిని, అందులో ఏయే విభాగాలలో ఏ కథాంశం ఉన్నదో కూడా వివరించాడు. ఇది తరువాతి కవులకు, పరిశోధకులకు ఎంతో మార్గదర్శకంగా ఉంది. 

మహా భారతంలోని మొత్తం 100 ఉపపర్వాలలో 19 ఉప పర్వాలు ఆది పర్వంలో ఉన్నాయి. కాని తెలుగు మహా భారతంలో ఉప పర్వాల నియమాన్ని పాటించలేదు.

సంస్కృత మూలంలో ఉన్న ఉపపర్వాలు

అవతారిక, మొదలగున్నవి, శమంత పంచకాక్షౌహిణీ సంఖ్యా కథనము, ఉదంకుడు కుండలాలు తెచ్చి గురుపత్నికిచ్చు కథ, సర్పయాగముకై ఉద్ధవుడు జనమేజయుడిని ప్రోత్సహించుట మొదలగునవి కలవు




#Article 112: తెనాలి రామకృష్ణుడు (438 words)


తెనాలి రామకృష్ణుడు శ్రీ కృష్ణదేవరాయలు ఆస్థానములోని కవీంద్రులు. స్మార్తం శాఖలోని నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అష్టదిగ్గజములలో సుప్రసిద్ధులు. ఈయనని తెనాలి రామలింగ కవి అని కూడా అంటారు. అవిభాజ్య విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఈయన ప్రముఖులు. తొలుత సాధారణ వ్యక్తి అయిన రామకృష్ణులు, కాళీమాత వర ప్రసాదం చేత కవీశ్వరులయ్యారు. గొప్ప కావ్యాలు విరచించారు. కానీ తెలుగు వారికి ఆయన ఎక్కువగా హాస్య కవిగానే పరిచయం. ఆయనకు వికటకవి అని బిరుదు ఉంది. ఆయనపై ఎన్నో కథలు ఆంధ్ర దేశమంతా ప్రాచుర్యములో ఉన్నాయి.మొదట్లో రామకృష్ణుడి ఇంటి పేరు గార్లపాటి అని, తెనాలి నుండి వచ్చారు కనుక తరువాతి కాలంలో తెనాలి అయినది అని ఒక నానుడి. సత్తెనపల్లి మండలంలోని లక్కరాజుగార్లపాడు గ్రామానికి చెందిన గార్లపాటి రామయ్య, లక్ష్మాంబల సంతానం రామలింగయ్య. ఆయన తాత సుదక్షణా పరిణయం రాసిన అప్పన్న కవి. వీరికి ఇద్దరు సోదరులు వరరాఘవకవి, అన్నయ్య. రామకృష్ణుడి స్వస్థలం తెనాలి. ఇదే గ్రామాన్ని ఆయన అగ్రహారంగా పొందినాడు. రామలింగయ్య తాత, ముత్తాతలు గార్లపాడు లోనే నివసించారు. ప్రస్తుతం గ్రామ బొడ్రాయి ప్రతిష్ఠించిన ప్రాంతంలోనే రామకృష్ణుల వారి ఇల్లు ఉండేదని గ్రామస్తుల నమ్మకం. క్రీ.శ. 1514 నుంచి 1575 వరకు రామలింగయ్య జీవించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో మేనమామ తెనాలి అగ్రహారమైన తూములూరుకు తీసుకువెళ్లారు. అక్కడే వారి సంరక్షణలో విద్యాబుద్ధులు నేర్చుకున్నారు.

ఉద్బటారాధ్య చరిత్ర ఉద్భటుడు అనే యతి గాథ. ఘటికాచల మహాత్మ్యము తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు మండలంలోని ఘటికాచల (ప్రస్తుతం షోళింగుర్) క్షేత్రంలో వెలసిన శ్రీ నరసింహ స్వామి వారిని స్తుతిస్తూ వ్రాసిన కావ్యం. పాండురంగ మహాత్మ్యము స్కాంద పురాణము లోని విఠ్ఠలుని మహాత్మ్యాలు, ఇతర పాండురంగ భక్తుల చరిత్రల సంపుటం.

ఇవి అలభ్య గ్రంథములు. జగ్గన గారి ప్రబంధ రత్నాకరము లోని కొన్ని పద్యాల వల్ల ఈ గ్రంథ వివరాలు తెలుస్తున్నాయి.

తెనాలి వారు ప్రబంధ శైలిని అనుసరించేవారు. ఇంకనూ వారి కవిత్వంలో హాస్యము, వ్యంగ్యము రంగరించబడి ఉంటాయి

వీరు చాటువులు చెప్పడంలో బహు నేర్పరి.

ఒకమారు అల్లసాని పెద్దన వారు ఒక కవితలో అమావాశ్యనిశిని ఛందస్సు కోసం అమవసనిసి అని వాడగా దానికి రామలింగకవి చెప్పిన అద్భుతమైన చాటువు,

ఎమి తిని సెపితివి కపితము
బెమ పడి వెరి పుఛ్చ కాయ మరి తిని సెపితో
ఉమెతకయలు తిని సెపితో
అమవస నిసి యనుచు నేడు అలసని పెదనా ||

ఇక్కడ అలసని అని హేళన చేస్తూ, అమవసనిసి అనేది స్వచ్ఛత లేని పదం అని కవీంద్రులు ఘాటుగానే సెలవిచ్చారు.

ధూర్జటి వారిని స్తుతిస్తూ రాయలు : 
స్తుతమతి యైన యాంధ్ర కవి ధూర్జటి పల్కుల కేల కల్గెనీ
యతులిత మాధురీ మహిమ ?

దానికి రామకృష్ణుని చమత్కార సమాధానం:
హా తెలిసెన్! భువనైక మోహనో
ద్ధత సుకుమార వార వనితా జనతా ఘన తాప హారి సం
తత మధురాధరోద్గత సుధా రస ధారల గ్రోలుటం జుమీ !!

అంటూ ధూర్జటి వారి వేశ్యా సాంగత్యాన్ని ఎత్తి చూపారు.

మరొకమారు వాకిటి కావలి తిమ్మడికి రాయలిచ్చిన పచ్చడాన్ని కాజేయటానికి ముగ్గురు ఇతర దిగ్గజాలతో పథకం వేసి 
వాకిటి కావలి తిమ్మా ! 
ప్రాకటముగ సుకవివరుల పాలిటి సొమ్మా !
నీకిదె పద్యము కొమ్మా !
నాకీ పచ్చడమె చాలు నయముగ నిమ్మా !!

అంటూ చివరి పాదంతో పచ్చడం కొట్టేసాడు రామకృష్ణ కవి

చీపర బాపర తీగల
చేపల బుట్టల్లినట్లు చెప్పెడి నీ యీ
కాపు కవిత్వపు కూతలు
బాపన కవి వరుని చెవికి ప్రమదంబిడునే !!

ఒకమారు, ప్రెగడరాజు నరస కవి అనే ఒక ఉద్దండ పండితుడు రాయల వారి కొలువు సందర్శించి, వారికి ఒక క్లిష్ట సమస్య ఇచ్చారు. అదేమంటే, ఈ కొలువులో ఎవరైనా తను రాయలేనంత కఠినమైన చాటువు చెప్పగలరా అని. ఆ సమయములో రాయలు వారు మొదట అల్లసాని పెద్దన వారి వైపు చూసారట. అల్లసాని వారు కొంత సమయము తీసుకొంటుండగా, తెనాలి వారు అందుకొని పండితుల వారిని తికమక పెట్టేలా ఈ చాటువు వల్లించారట.
త్బృ....వ్వట బాబా తల పై
బు....వ్వట జాబిల్లి వల్వ బూదట చేదే
బువ్వట చూడగ హుళులు....
క్కవ్వట నరయంగ నట్టి హరునకు జేజే !!.




#Article 113: ప్రకాశం జిల్లా (976 words)


ప్రకాశం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము యొక్క తొమ్మిది కోస్తా ప్రాంతపు జిల్లాల్లో ఒకటి. 

ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణము ఒంగోలు. ఒంగోలు జిల్లా ఫిబ్రవరి 2,1970వ తేదీన, నెల్లూరు, కర్నూలు, గుంటూరు జిల్లాల యొక్క కొంత భాగముల నుండి ఆవిర్భవించింది. తరువాత డిసెంబర్ 5,1972వ తేదీన, జిల్లాలోని కనుపర్తి గ్రామములో పుట్టిన గొప్ప దేశభక్తుడు, ఆంధ్ర నాయకుడైన, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జ్ఞాపకార్ధము ప్రకాశం జిల్లాగా నామకరణము చేయబడింది.

స్వాతంత్ర్యోద్యమ సమయంలో ఈ జిల్లాలో జరిగిన చీరాల పేరాల ఉద్యమం పేరుగాంచింది. భారతాన్ని తెనిగించిన కవిత్రయాల్లో ఒకరైన ఎర్రాప్రగడ,సంగీత విద్వాంసుడు త్యాగరాజు, శ్యామశాస్త్రి, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ జిల్లా వారే. వరి, సజ్జలు, రాగులు, జొన్నలు, చెరకు, వేరుసెనగ, ప్రత్తి, పొగాకు ప్రధానపంటలు. మార్కాపురం పలకలకు, చీమకుర్తి గ్రానైట్ గనులకు ప్రసిద్ధి. ప్రకాశంజిల్లా అనగానే గుర్తుకు వచ్చేవి ఒంగోలు జాతి గిత్తలు. 

జిల్లా చరిత్రకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కర్నూలు జిల్లా , గుంటూరు జిల్లాల  చరిత్రే ఆధారం. ఈ ప్రాంతాన్ని ఇక్ష్వాక, పల్లవ, చాళుక్య,కాకతీయ రాజ వంశాలు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు, గోల్కొండ, కర్ణాటక నవాబులు పరిపాలించారు. భారతాన్ని తెనిగించిన కవిత్రయములో ఒకరైన ఎర్రాప్రగ్గడ, సంగీతంలో పేరుగాంచిన శ్యామశాస్త్రి, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ ప్రాంతానికి చెందినవారే.

స్వాతంత్ర్యోద్యమ సమయంలో చీరాల పేరాల ఉద్యమం నడిపిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, కొండా వెంకటప్పయ్య, నరసింహరావు ప్రసిద్దులు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రావతరణ తర్వాత మొదటిగా ఒంగోలు జిల్లా ఏర్పడింది. ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా యొక్క మూడు తాలూకాలు (అద్దంకి, చీరాల, ఒంగోలు), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యొక్క నాలుగు తాలూకాలు (కందుకూరు, కనిగిరి, పొదిలి, దర్శి), కర్నూలు జిల్లా యొక్క రెండు తాలూకాలతో (మార్కాపురం, గిద్దలూరు) ఏర్పడినది. 1972 లో టంగుటూరి ప్రకాశం పంతులు గుర్తుగా ప్రకాశం జిల్లాగా  పేరు మార్చబడింది.

ప్రకాశం జిల్లా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రపు దక్షిణ కోస్తాలో సుమారు 15.09, 16.00 డిగ్రీల ఉతర అక్షాంశాలు, 79, 80 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య నెలకొని ఉంది. ఉత్తరాన మహబూబ్ నగర్ జిల్లాకు , గుంటూరు జిల్లాలు, పశ్చిమాన కర్నూలు జిల్లా, దక్షిణాన కడప జిల్లా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు, తూర్పున బంగాళా ఖాతము సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లాలోని మధ్య ప్రాంతం చిన్న చిన్న పొదలతో, కొండలతో, రాతి నేలలతో కూడి జిల్లాకు ఒక ప్రత్యేకతను ఆపాదిస్తున్నాయి.

త్యాగరాజు నల్లమల, వెలుగొండలు జిల్లాలోని ముఖ్యమైన కొండలు. నల్లమల కొండలు గిద్దలూరు, మార్కాపురం మండలాలలో వ్యాపించి ఉండగా, వెలుగొండ కర్నూలు, కడప జిల్లాల సరిహద్దులలో ఉన్నాయి. నల్లమలలో నంది కనుమ, మాబాల కనుమ అనే రెండు ముఖ్యమైన కనుమలు ఉన్నాయి. నంది కనుమ పశ్చిమాన గల కర్నూలు,బళ్ళారి జిల్లాలకు, తూర్పున కోస్తా జిల్లాలకు ప్రధాన మార్గం కాగా, మాబాల కనుమ పశ్చిమాన ఆత్మకూరు, కర్నూలును తూర్పున దోర్నాల, యర్రగొండపాలెం, మార్కాపురం లను కలుపుతుంది.

గుండ్లకమ్మ, మూసీ, మానేరు, పాలేరు, రొంపేరు, జిల్లాలో ప్రవహించే ముఖ్యమైన నదులు. వీటిలో 220 కి మీలు ప్రవహించే గుండ్లకమ్మ నది జిల్లా యొక్క తాగునీటి, సాగునీటి అవసరాలకు తల్లి వంటిది. మానేరు, పాలేరు, రొంపేరు సాగు తాగు నీటి అవసరాలు తీరుస్తాయి. కంభం వెలిగొండ, గుండ్లకమ్మ, మోపాడు, రాళ్లపాడు చెరువులు తాగు సాగునీటి అవసరాలకు ప్రధాన నదులపై నిర్మించారు. తమ్మిలేరు, సగిలేరు ఈగిలేరు, గుడిశలేరు అనే చిన్న నదులు, వాగేరు వాగు, నల్లవాగు, వేడిమంగల వాగు వంటివి కూడా జిల్లాలో పరిమితంగా ప్రవహిస్తున్నాయి.

ఒంగోలు శాఖా కాలువ M. 16-5-330 వద్ద 1.514 టిఎంసి నీటిని నిల్వకు రిజర్వాయర్ కట్టబడింది. ఇది ఓబచెత్తపాలెం గ్రామం, చీమకుర్తి మండలం దగ్గర 2009 లో నిర్మించబడింది. 72,874 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ఉద్దేశించగా, 32,475 ఎకరాలు 2013-14లో స్థిరీకరించబడింది. దీనికి 47.61కోట్లరూపాయలు 2015 మే వరకు ఖర్చయ్యింది.56గ్రామాలకు మంచినీటి సౌకర్యం లభిస్తుంది.

జిల్లా లోని కోస్తా ప్రాంతాల్లో సముద్రపు గాలి వలన అన్నికాలాల్లోను వాతావరణం ఒకే రకంగా ఉంటుంది. ఇతర ప్రాంతాల్లో, ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో వేసవి కాలం చాలా తీవ్రంగా ఉంటుంది. జూన్‌- సెప్టెంబరులో నైరుతి ఋతుపవనాలు, అక్టోబరు - డిసెంబరులో ఈశాన్య ఋతుపవనాల వలన వర్షాలు కురుస్తాయి. జిల్లా సగటు వర్షపాతం 764మిమి.

ఎర్ర, నల్ల రేగడి, ఇసుక నేలలు క్రమంగా 51%, 41%, 6% వరకు జిల్లాలో ఉన్నాయి.

జిల్లా విస్తీర్ణంలో 4,42,500 హెక్టార్లలో (25.11% )అడవులు ఉన్నాయి. కోస్తా ప్రాంతంలో చీరాల, వేటపాలెం, చిన్నగంజాం, కొత్తపట్నం, సింగరాయకొండ, ఉలవపాడులో జీడి మొదలైన చెట్లతో కూడిన అడవులు ఉన్నాయి. ఉలవపాడు మామిడి, సపొటా తోటలకు ప్రసిద్ధి.

పలకలు, బలపాలకు పనికివచ్చే రాయి విస్తారంగా గిద్దలూరు మండలంలోని ఓబయనాపల్లి నుండి మార్కాపురం మండలంలోని కుళ్లపేట వరకు దొరుకుతుంది. భారతదేశం వుత్పత్తిలో దాదాపు 80 శాతం ఇక్కడేజరుగుతుంది. కోగిజేడు, మార్లపాడు గ్రామంలో మాగ్నటైట్, ముడి ఇనుము నిక్షేపాలున్నాయి. ఇంకా క్వార్ట్జ్, జిప్సం, సిలికా, సున్నపురాయి, బేరియం సల్ఫేట్ దొరుకుతున్నాయి. ప్రపంచంలోనే అతి శ్రేష్ఠమైన గాలక్సీ గ్రానైటు జిల్లాలో దొరుకుతుంది.

జిల్లా విస్తీర్ణంలో 37 శాతం మాత్రమే వ్యవసాయభూమి. 72 శాతం ఆహర పంటలు,28శాతం అహారేతర పంటలు పండుతున్నాయి. 3,10,433 కమతాలున్నాయి. 
వర్జీనియా పొగాకు ఉత్పత్తిలో జిల్లా ప్రసిద్ధి చెందింది. వరి, జొన్న, రాగి, మొక్కజొన్న, కొర్రలు, పప్పు ధాన్యాలు, మిరప, పత్తి,శనగ, వేరుశనగ, ఆముదం ఇక్కడ పండే ఇతర పంటలు. పత్తివుత్పత్తిలో నాలుగో స్థానంలో ఉంది.

మొత్త సాగుభూమిలో 24 శాతానికి నీటి పారుదల సౌకర్యం ఉంది. కాలువల ద్వారా 71000 హెక్టార్లు, చెరువుల ద్వారా 34000 హెక్టార్లు, గొట్టపు బావులద్వారా 65000 హెక్టార్లు భూమి సాగవుతున్నది.

జిల్లాలోని 102 కి మీల సముద్ర తీరంలో సముద్ర ఉత్పత్తులు విరివిగా అవకాశాలున్నాయి.

జిల్లాలో ఐరన్‌ ఓర్‌, గ్రానైట్‌, ఇసుక, సిలికా, బైరటీస్‌, సున్నపురాయి, పలకలకు సంబంధించిన గనులు ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గెలాక్సీ గ్రానైట్‌ నిక్షేపాలు చీమకుర్తి, ఆర్‌.ఎల్‌.పురం, బూదవాడల్లో 8.60 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు, వివిధ రంగుల గ్రానైట్‌ నిక్షేపాలు జిల్లాలోని ఉప్పుమాగులూరు, ఏల్చూరు, దర్శి, కనిగిరి, అద్దంకిల్లో 13.86 మిలియన్ల క్యూబిక్‌ మీటర్లు, బ్లాక్‌ పెరల్‌ గ్రానైట్‌ నిల్వలు 0.435 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు ఉన్నట్లు అంచనా.ఇవేగాక ప్రత్తి జిన్నింగ్, పొగాకు, మంగుళూరు టైల్స్, పలకల తయారీ, జీడిపప్పు పరిశ్రమలు ఉన్నాయి. దేశానికి అవసరమైన రాతి పలకలో 80% మార్కాపురం నుండే 100కు పైగా పరిశ్రమలలో వుత్పత్తి చేయబడుతుంది. సముద్ర తీరం (చినగంజాం,పాకల,ఊళ్ళపాలెం,కేసుపాలెం,కరేడు ....మొదలైనవి. )పొడుగునా 5000 ఎకరాల విస్తీర్ణంలో ఉప్పును పండిస్తారు. 
అవస్థాపన:
జిల్లాలో ఆరు పారిశ్రామిక వాడలు ( ఒంగోలు, మార్కాపురం, గిద్దలూరు, ఒంగోలు అభివృద్ధి కేంద్రము, ఒంగోలు ఆటోనగర్, వుడ్ కాంప్లెక్స్)  ఉన్నాయి.

 

నాగులుప్పలపాడు, చినగంజాం మండలం,జరుగుమల్లి, ముండ్లమూరు, టంగుటూరు, కందుకూరు మండలాల ప్రధాన భాగంలో కలవని కొన్ని భూభాగాలు ఆయా మండలాలలో చేర్చబడ్డాయి. (ప్రకాశం మండలాల పటం చూడండి).

 

ఎన్.హెచ్.16. జాతీయ రహదారి (ఆరు దారుల) జిల్లాలో 117 కిమీ, రాష్ట్ర రహదారులు 570 కిమీ, జిల్లా పరిషత్ రహదారులు 1786 కిమీ, ఇతర జిల్లా రహదారులు 936 కిమీ వున్నాయు.చెన్నై - ఢిల్లీ రైలు మార్గం, గుంతకల్లు -గుంటూరు రైలు మార్గం జిల్లాలోని ప్రాంతాలకు రవాణా సౌకర్యం కలిగిస్తున్నాయి. రైల్వే లైను పొడవు 242 కిమీ.

ప్రకాశం సంస్కృతి రెండు ప్రాంతాల (రాయలసీమ, కోస్తా) మేళవింపుగావుంది. ఒంగోలు డివిజన్ లోని ఈశాన్య భాగం గుంటూరుకు దగ్గరగా వుండే వ్యవసాయాధారిత ప్రధాన సంస్కృతికాగా, కందుకూరు డివిజన్ లో అలాలేదు. మార్కాపూర్ డివిజన్ లో కర్నూలు ప్రాంత, గుంటూరు ప్రాంత సంస్కృతులు కలసినవున్నాయి. ఒంగోలు, కందుకూరు డివిజన్లలో ప్రధానంగా బియ్యం ఆహారం తీసుకోగా, మార్కాపూర్ డివిజన్లో రాగి, మొక్కజొన్న, బియ్యం ఆహారంగావాడుతారు. ఈ జిల్లా తీరంలో వున్న మత్స్యకారుల సంస్కృతి ఈ జిల్లాకు వైవిధ్యాన్ని పెంచుతుంది. ఈ జిల్లా తెలుగు మాండలికం, బాగా ఎక్కువగా అర్థమయ్యే తెలుగు మాండలికాల్లో రెండవది.

ఒంగోలు గిత్త ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. అమెరికా, హాలండ్. మలేషియా, బ్రెజిల్, అర్జెంటీనా లాంటి చాలా దేశాలకు ఎగుమతి చేయబడింది. మలేషియాలో ఒక ద్వీపం ఒంగోలు ద్వీపంగా పేరుపెట్టారు. ఈ జాతి పశువులు ప్రపంచంలో లక్షలలో వుంటాయి . 2002 భారత జాతీయ పోటీల చిహ్నం ఐన వీర1 ఒంగోలు గిత్త. పొట్టి కొమ్మల ఒంగోలు జాతి గిత్తలు, నంది శిల్పాలలాగా వుంటాయి.

ఒంగోలు ప్రాంతంలో బాలికలకు ప్రత్యేకంగా పాఠశాలలు లేని కాలంలో మొదటిసారిగా 1867లో అమెరికన్ బాప్టిష్ట్ మిషన్ కు చెందిన డాక్టరి క్లైవ్, శ్రీమతి క్లైవ్లు ఒక బాలికల పాఠశాలను 1867లో స్థాపించుటయే గాక, ఒక లోయర్ గ్రేడ్ ట్రైనింగ్ స్కూలు కూడా 1892లో స్థాపించారు.

జిల్లాలో ఎండాకాలంలోపలు చోట్ల ఎడ్ల బలప్రదర్శన నిర్వహిస్తారు . జిల్లా నలుమూలలనుండి రైతుల పాల్గొంటారు.

ఆంధ్రకేసరి బిరుదాంకితులు ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి స్వాతంత్ర్య సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు, కమ్యూనిస్టు నాయకుడు పూల సుబ్బయ్య. శాసనసభ స్పీకర్ దివికొండయ్య,పిడతల రంగారెడ్డి ప్రపంచ ప్రఖ్యాత ఇంజినీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పూర్వీకులు ఈ జిల్లావారే. సంగీత ప్రపంచంలో పేరుగాంచిన వారిలో త్యాగరాజు, శ్రీరంగం ఆలయంలో ఆస్థాన నాదస్వర విద్వాంసుడుగా పనిచేసిన షేక్ చినమౌలానా . సినీరంగంలో ప్రముఖులు దగ్గుబాటి రామానాయుడు అత్యధిక చలన చిత్రాలు నిర్మించిన నిర్మాతగా పేరుతెచ్చుకున్నాడు. ఇంకా గిరిబాబు,రఘుబాబు గోపిచంద్, టి.కృష్ణ ఈ జిల్లా వారే.




#Article 114: ఒంగోలు (427 words)


ఒంగోలు నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణం, ఒంగోలు మండలానికి కేంద్రం. ఈ నగరం పరిపాలన  ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ (O.M.C) ద్వారా చేయబడుతుంది. 

ఒంగోలు సమీపంలోని చినగంజాంలో దొరికిన ఆధారాలను అనుసరించి మౌర్య, శాతవాహనుల పాలన కాలంలోనే ఈ పట్టణం రూపుదిద్దుకున్నట్లు ఋజువౌతుంది. శాతవాహనుల తరువాత కాకతీయుల పాలనలో ఈ పట్టణం వెలుగులోకి వచ్చింది. ఆ సమయలో మోటుపల్లి, వాడరేవు ప్రసిద్ధ రేవు పట్టణాలుగా ఉన్నాయి. రెడ్డి రాజులు మొదట ఒంగోలు సమీపములోని అద్దంకిని రాజధానిగా పాలించారు. వంగవోలు రాజులు పరిపాలించారు కాబట్టి ఈ ప్రాంతానికి వంగవోలు అనే పేరు వచ్చింది . కాలక్రమేణా వంగవోలు పేరు ఒంగోలుగా స్థిరపడి పోయింది కడప నవాబుల పాలనలో ఉన్న ఒంగోలు పట్టణాన్ని కర్ణాటక నవాబు హైదర్ అలీకి దత్తం చేయబడింది. 1801లో టిప్పూ సుల్తాన్ వద్ద నుండి బ్రిటీషు పాలనలోకి వచ్చింది. ఒంగోలు పట్టణాన్ని మునిసిపాలిటీగా 1876లో వ్యవస్థీకరించారు. ఆంధ్ర కేసరిగా సుప్రసిద్ధులైన శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి బాల్యం ఒంగోలులోనే గడిచింది.

ఒంగోలుజాతి ఎద్దులు ప్రపంచంలోనే పేరెన్నిక కలిగిన ఎద్దులు. ప్రఖ్యాతిచెందిన జేబూ (Zebu) జాతి ఎద్దులలో ఇవి ఒకటి.

ఒంగోలు పురపాలక సంస్థ 1876లో స్థాపించారు. దీని ప్రస్తుత అధికార పరిది . ఎస్.వెంకట కృష్ణా ప్రస్తుత పురపాలక సంస్థ కమీషనర్.

జాతీయ రహదారి 16, జాతీయ రహదారి 216 నగరంగుడా వెళ్ళే జాతీయ రహదార్లు. ఒంగోలు బస్ స్టేషన్ నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు నడుపుతుంది.

ఒంగోలు రైల్వే స్టేషను హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము పై ఉంది. ఇది విజయవాడ రైల్వే డివిజను లోని దక్షిణ మధ్య రైల్వే జోన్కు చెందిన A-గ్రేడ్ రైల్వే స్టేషను.

ఒక కొత్త గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఫిబ్రవరి 2014లో ఆమోదించారు.

రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్,, క్యు.ఐ.ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ,
దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, పి.వి,ఆర్ బాలికల ఉన్నత పాఠశాల, సెయింట్ థెరెస్సా ఉన్నత పాఠశాల, లూయీస్ బ్రెయిలీ అంధుల పాఠశాల 

భరద్వాజ మహర్షి వేద విద్యా మండలి (అలూరి సీతారామమ్మ-రామకోటేశ్వరరావు పాఠశాల)

ప్రభుత్వ ఆసుపత్రి రిమ్స్ తో పాటు పలు అల్లోపతి ప్రైవేటు ఆసుపత్రులున్నాయి.

ఆంధ్ర ప్రదేశ్లో వర్జీనియా రకం పొగాకు పంటకు ఒంగోలు ఒక ప్రధాన ఉత్పత్తి, వాణిజ్య కేంద్రము. గ్రానైటు గనులకు ప్రసిద్ధి చెందినది.

ఒంగోలులోని పెద్ద వ్యాపార సంస్థలు రైతుకుటుంబాలచే స్థాపించబడ్డాయి. పొగాకు కంపెనీలు, పంట, వ్యాపారం బాగా జరుగుతూ వచ్చింది. 1970, 80 దశాబ్దాలలో షూ, పెయింట్, మందులకంపెనీ, పివిసి మొదలైన పరిశ్రమలు ప్రారంభించబడ్డాయి. కానీ వీటిలో చాలావరకు ఆంధ్ర ప్రదేశ్ లోపల వెలుపల ప్రాతాలలోని పోటీకి నిలిచి మనుగడ సాగించడంలో విఫలమయ్యాయి. మానవశక్తి, పెట్టుబడులు, విజయవంతంగా నడపటానికి కావలసిన నాయకత్వం కొరతే దీనికి కారణం. ఎనభై (80), తొభైయవ (90)దశాబ్దంలో నూతన సెకండరీ, ఇంటర్మీడియట్ కళాశాలలు, ఆసుపత్రుల స్థాపనలు అధికమైనాయి. ఒంగోలు విద్యాపరంగా అభివృద్ధిలో ఉన్న ప్రదేశం. ఎనభైయ్యవ (80) దశకంలో ఒంగోలు పశ్చిమ దిశలో గ్రానైట్ నిక్షేపాలు వెలుగు చూడటంతో వ్యాపార పరంగా సరికొత్త అధ్యాయం మొదలైంది.

ప్రతి దీపావళికి ముందు నరకాసుర వధ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. పట్టణంలో ఈ సాంప్రదాయం 1902 నుంచి కొనసాగుతుండటం విశేషం. నరక చతుర్దశి రోజు అర్ధరాత్రి ఈ ప్రదర్శన మొదలై తెల్లవారు జామున నాలుగు గంటలకు ముగుస్తుంది. ఒంగోలుకే చెందిన శ్రీయువజన మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరుగుతాయి. పట్టణంలోని తూర్పుపాలెం నివాసి సింగరాజు సుబ్బయ్య నేతృత్వంలో ఈ కార్యక్రమం మొట్టమొదటి సారిగా ప్రారంభమైంది.

ప్రతీ యేడు ఇక్కడ ఎన్.టి.ఆర్ కళా పరిషత్, ఒంగోలు ఆధ్వర్యంలో జరిగే నాటకోత్సవాలకి వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన కళాకారులు ప్రజలను అలరిస్తారు. ఒంగోలు నుండి ఎంతో మంది ప్రముఖులు నాటక, చిత్ర రంగమందు ప్రిసిద్ధి చెందారు. దిగ్గజ నటులు కంచు కంఠంగా పేరొందిన నటుడు కొంగర జగ్గయ్య ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించి భారత లోక్ సభకు ప్రాతినిధ్యం వహించిన తొలి భారతీయ కళాకారునిగా కూడా చరిత్రకెక్కారు.




#Article 115: కవి (191 words)


కవిత్వము రాసేవాడు కవి. 'రవిగాంచని చోట కవి గాంచును ' అని తెలుగులో ఒక నానుడి ఉంది. అంటే ప్రపంచంలో జరిగే అనేక మార్పులు, నేరాలు, ఘోరాలు, అన్యాయాలు సూర్యుడైనా చూడకపోవచ్చేమో కానీ, కవి కంటి నుండి ఏ సంఘటన, ఏ వస్తువూ తప్పించుకోలేవని భావం. కవి అన్నిటినీ కవిత్వరీకరించి వెలుగులోకి తీసుకవచ్చి సమాజహితానికి దోహదకారి అవుతాడు. కవులలో చాలా గొప్పవారిని మహాకవిగా గౌరవిస్తారు. తెలుగు సాహిత్యంలో గురజాడ అప్పారావు, శ్రీరంగం శ్రీనివాసరావులకు మహాకవి గౌరవం లభించింది.
 
కవిత్వంలో వచ్చిన మార్పులు, వివిధ కాలాలలో చేపట్టిన ప్రక్రియలు, పలురకాల భావజాలం ఆధారంగా తెలుగులో కవులను పలు విభాగాలుగా చెప్పుకుంటారు. వాటిలో కొన్ని...

ఇద్దరు కవులు కలిసి ఏకాభిప్రాయంతో కావ్య రచన చేసినచో వారిని జంట కవులు అంటారు.

సంస్కృతంలో వ్యాసుడు రచించిన భారతాన్ని తెలుగులోకి అనువదించిన కవులు భారత కవులు.

వాల్మీకి సంస్కృత రామాయణాన్ని తెలుగులోకి అనువదించిన కవులు రామాయణ కవులు.

శివునిపై భక్తితో కవిత్వం రాసిన కవులు శివ కవులు. 12, 13 వ శతాబ్దిలో ఈ సాహిత్యం ఎక్కువ వెలువడింది.

వంద లేదా అంతకు ఎక్కువ పద్యాలను ఒక మకుటం రాసే రచన శతకం. శతకాలు రాసిన కవులు 
.

అది 1965, తెలుగు విప్లవ కవి లోకం నిశబ్దంగా ఉన్న రోజులు. ఒక కెరటం ఉవ్వెత్తున ఎగిసిపడి మూడు సంవత్సరాలు అందరినీ ఆలోచింపచేసింది. అదే దిగంబర కవులు. వారికి వారే చెప్పుకున్నట్లు ఆ మూడు సంవత్సరాలు దిగంబర కవుల యుగము. దిగంబర కవులు మొత్తము ఆరుగురు. 1. నగ్నముని - మానేపల్లి హృషికేశవరావు; 2. నిఖిలేశ్వర్ - యాదవ రెడ్డి; 3. చెరబండరాజు - బద్దం బాస్కరరెడ్డి; 4. మహాస్వప్న - కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు; 5. జ్వాలాముఖి - వీరరాఘవాచార్యులు, 6. భైరవయ్య - మన్మోహన్ సహాయ




#Article 116: వేమన శతకము (269 words)


వేమన శతకం యోగి వేమన ఆటవెలది పద్యాలలో ఆశువుగా చెప్పిన పద్యాలు. వేమన సుమారు 1652 - 1730 మధ్య కాలములో జీవించాడు. 

వేమన పద్యాలలో ఎక్కువగా లోక నీతులు, సామాజిక చైతన్యంనకు సంబంధించినవి ఉంటాయి. అతను  సృశించని అంశం లేదు. సమాజంలోని అన్ని సమస్యలు భిన్న కోణాల్లోంచి దర్శించి ఆ దర్శన వైశిష్ట్యాన్ని వేమన తన పద్యాలలో ప్రదర్శించాడు. కుటుంబ వ్యవస్థలోని లోటు పాట్లు, మతం పేరిట జరుగుతున్న దోపిడీలు, విగ్రహారాధనను నిరసించడం, కుహనా గురువులు, దొంగ సన్యాసులు ఒకటేమిటి కనిపించిన ప్రతి సామాజిక అస్థవ్యస్థత మీద వేమన కలం ఝళిపించాడు. ఈ పద్యాలకు బహుళ ప్రచారం లభించటానికి కారణాలు చాలా ఉన్నాయి. సామాన్య నీతులను ప్రజల హృదయాలకు హత్తుకొనేటట్లు వారికి పరిచితమైన భాషలో, స్పష్టమైన రీతిలో సూటిగా, తేటగా, శక్తివంతంగా వ్యక్తీకరించటం, సామాన్యులైన వారిలో తనను ఒకనిగా భావించుకొని నీతి ఉపదేశం చేయటం వేమన నీతులలోని ప్రధాన గుణం. సునిశితమైన హాస్య, వ్యంగ్య, అధిక్షేప చమత్కృతులతో కల్పించి, నవ్వించి ఎదుటివారి లోపాలను, తన లోపాలను, గుర్తెరిగి ఉపదేశించిన రీతిని గమనించేటట్లు చేసే శైలిని ఆయన ప్రదర్శించాడు.  సామాన్యాలు మనోజ్ఞాలు అయిన ఉపమాన దృష్టాంతాలతో సూక్తిప్రాయంగా నీతులను బోధించాడు.

వేమన పద్యాలన్నీ  ఆటవెలది ఛందంలోనే చెప్పాడు. ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో, చక్కటి ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పాడు. సాధారణంగా మొదటి రెండు పాదాల్లోను నీతిని ప్రతిపాదించి, మూడో పాదంలో దానికి తగిన సామ్యం చూపిస్తాడు. నాలుగో పాదం విశ్వదాభిరామ వినుర వేమ అనే మకుటం. 
ఉదాహరణకు:

అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను
సజ్జనుండు పలుకు చల్లగాను
కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ.

కొన్ని పద్యాల్లో ముందే సామ్యం చెప్పి, తరువాత నీతిని చెబుతాడు. ఉదా:

అనగననగరాగ మతిశయించునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ.

బ్రౌన్ కూడా ఈ రెండో అర్థాన్నే తీసుకుని పద్యాలను ఇంగ్లీషులోకి అనువదించాడు.

వేమన పద్యాలు వందల సంవత్సరాల వరకు గ్రంథస్తం కాకుండా కేవలం సామాన్యుల నోటనే విలచి ఉన్నాయి. 1731లో ఫాదర్ లెగాక్ తొలిసారిగా వేమన పద్యాలు సేకరించాడని పరిశోధకులు భావిస్తారు. 1816లో ఒక ఫ్రెంచి మిషనరీ, తరువాత ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఎన్నో వేమన పద్యాలను సేకరించారు. తాను వేమనను కనుగొన్నానని బ్రౌన్ దొర సాధికారికంగా ప్రకటించుకొన్నాడు. అతను వందల పద్యాలను సేకరించి వాటిని లాటిన్, ఆంగ్ల భాషలలోకి అనువదించాడు. అలాగే హెన్రీ బ్లూచాంస్ (1897), విలియమ్ హోవర్డ్ కాంబెల్ (1910), జి.యు.పోప్, సి.ఇ.గోవర్ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు వేమనను లోకకవిగా కీర్తించారు.




#Article 117: విప్లవ రచయితల సంఘం (234 words)


విప్లవ రచయితల సంఘం (వి.ర.సం.) మార్క్సిజం - లెనినిజం - మావో ఆలోచ‌నతో భార‌త‌దేశంలో జ‌రుగుతున్న నూత‌న ప్ర‌జాస్వామిక విప్ల‌వ కార్య‌చ‌ర‌ణ‌ను ఎత్తిప‌డుతూ సాహిత్య సాంస్కృతిక రంగాల్లో కృషి చేస్తున్న సంస్థ‌. 

తెలుగు సాహిత్యంపై నక్సల్బరీ పతాకం. ఈ మాట ప్రతీకాత్మకం కాదు. వర్ణనామయం అంతకంటే కాదు. భారత సామాజిక చరిత్ర నక్సల్బరీలోకి ప్రవహించి విరసానికి జన్మనిచ్చింది. తెలుగు సాహిత్య కళా, మేధో రంగాల్లో నక్సల్బరీ చైతన్యానికి విరసం తల్లి వేరుగా నిలిచింది. శ్రీకాకుళ విస్ఫోటనలోంచి ప్రజ్వరిల్లిన ప్రత్యామ్నాయ పంథాను విరసం సాహిత్య రంగంలోకి తీసుకొని వచ్చి నక్సల్బరీకి సాంస్కృతిక ప్రతినిధి అయింది. సమూల మార్పు లక్ష్యంగా సాయుధపోరాటాన్ని స్వీకరించిన సామాజిక, రాజకీయ ఉద్యమంలో తాను అంతర్భాగమని సగర్వంగా ప్రకటించుకుంది. సాహిత్యంలో సాహసానికి, తిరుగుబాటుకు, ధిక్కారానికి చిరునామాగా నిలిచింది. అందువల్లే తీవ్ర అణచివేతను, నిర్బంధాన్ని, చివరికి నిషేధాన్ని ఎదుర్కొన్నది. ప్రజల మనిషిగా పునర్జీవమైంది.

నక్సల్బరీ శ్రీకాకుళ ఆదివాసీ విప్లవ శిశువుగా విరసం.. విప్లవోద్యమం వెనువెంట నడుస్తూ భారత పోరాట ప్రజల చరిత్రలో విస్తరిస్తోంది. సమాజంలోని ధిక్కారధారలన్నిటినీ ప్రభావితం చేస్తూ తాను వాటితో ప్రభావితమవుతోంది. విప్లవమంటే.. ప్రగతి దిశగా నేర్చుకోవడం, నేర్పించడం, మార్చడం, మార్పుకు లోనుకావడం అనే గతితర్క భావనకు సాహిత్య, మేధో రంగాల్లో తానే ఒక ఉదాహరణగా నిలిచింది. నిరంతరం సామాజిక వైరుధ్యాలను తట్టి లేపడం, వాటి బృహద్రూపాలను వెలికి తీయడం, వాటితో తలపడుతూ ప్రజలను పరిష్కర్తలుగా తీర్చిదిద్దడం, ప్రజల నేతృత్వంలో మార్పు దిశగా సాగడం.. అనే విప్లవాచరణలో విరసం ఎల్లవేళలా విద్యార్థి. తెలుగు నేల సరిహద్దులు దాటి సువిశాల మధ్య భారతదేశంమంతా, ఉత్తరాంధ్ర నుంచి ఒడిషా మీదుగా లాల్‌గడ్‌ అంతా విప్లవోద్యమం సాధించిన విస్తృతిని విరసం తన చైతన్యంలో అంతర్వాహినిగా మార్చుకున్నది. ప్రత్యామ్నాయ సామాజిక అభివృద్ధికి ప్రయోగశాలగా దండకారణ్యం ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న తరుణంలో విరసం తన సృజనశక్తినంతా ధారపోసి దాన్ని విశ్లేషిస్తున్నది. చిత్రిస్తున్నది. ఉత్పత్తి, వర్గపోరాటం, సాంఘిక విముక్తి లక్ష్యంగా సాగుతున్న దండకారణ్య విప్లవోద్యమంలోని సాహిత్య కళా వికాసాన్ని తెలుగు సాహిత్య సాంస్కృతికోద్యమంలో అంతర్భాగం చేస్తున్నది. ప్రజాసైన్యం, ప్రజాయుద్ధం అనే నుడికారం వాప్తవరూపం ధరించిన ఈ వర్తమానంలో ప్రజలపై భారత ప్రభుత్వం చేస్తోన్న యుద్ధంలో విప్లవం పక్షాన నిలబడదామని ఆలోచనాపరులతో చేయి కలపడమే విరసం తన ఏకైక సాంస్కృతిక కర్తవ్యంగా భావిస్తోంది.




#Article 119: గజేంద్ర మోక్షము (551 words)


 
స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ మనువుల కాలం గడిచి తామసుడు మనువుగా ఉన్న సమయంలో శ్రీమహావిష్ణువు గజేంద్రుడిని రక్షించడానికి భూలోకానికి దిగి వచ్చాడు అని శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు పల్కుతాడు. అది విని పరీక్షిత్తు ఆ గజేంద్రుని కథను వివరంగా చెప్పుమని అడుగగా ఆ మహర్షి గజేంద్ర మోక్షం గాథను వివరిస్తాడు . ఇది పోతన రచించిన భాగవతం లోనిది.

క్షీరసాగర మధ్యంలో త్రికూటం అనే పర్వతం ఉంది. ఆ పర్వతానికి మూడు శిఖరాలు ఉన్నాయి. ఒక శిఖరం బంగారంతో, ఇంకో శిఖరం ఇనుముతో, మరొకటి వెండితో అలరారుతూండేవి. ఆ కొండల మీద రకరకాలైన గగన చారులు కిన్నెరలు విహరిస్తూ ఉండేవారు. ఆ పర్వతం మీద ఉన్న అడవులలో అడవి దున్నలు, ఖడ్గమృగాలు, ఎలుగు బంట్లు మెదలైన క్రూర మృగాలతో పాటు ఏనుగులు కూడా ఉండేవి. ఆ ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటే ఆ ప్రదేశంలో అంధకారం అలముకొనేది. ఒకరోజు ఆ గుంపులు ఆహారం గ్రహించి దాహ బాధతో తిరుగుతూ సరోవరానికి చేరుతూ ఉన్నపుడు ఒక ఏనుగుల గుంపు చీలిపోయింది. అందులోని ఆడ ఏనుగులు గజరాజును అనుసరించి ఇంకో సరోవరాన్ని చేరుకొన్నాయి.

అలా ఏనుగులు చేరుకొన్న ఆ సరోవరం అతి విశాలమైనది, ఆ సరోవరం నిండా వికసించిన కలువలు, తామరలు, ఇంకెన్నో జలచరాలు నివసిస్తూ ఉన్నాయి. వాటిలో కొన్ని మొసళ్ళు కూడా ఉన్నట్లు ఏనుగులకు తెలియదు. ఆడ ఏనుగులు దాహ బాధ తీర్చుకొని, జలక్రీడలు జరిపి బయటికి వచ్చిన తరువాత గజరాజు కూడా సరోవరం లోకి ప్రవేశించి నీళ్ళు తాగి, తొండం నిండా నీరు నింపి గగనవీధికి చిమ్ముతున్నాడు. అలా నీరు చిమ్ముతూ ఇంతే సరోవరంలోని కర్కాటక మీనాలు, రోదసిలోని మీన కర్కాటాకాలను చేరినట్లు కనిపించింది.

ఇలా ఆ గజరాజు జలక్రీడ జరుపుతూ ఉన్న సమయంలో ఆ చెరువులో ఉన్న ఒక మొసలి ఆ గజరాజు కాలు పట్టుకొంది. పట్టు విడిపించుకొని తొండంతో దెబ్బ తీయాలని ఆ ఏనుగు చూసింది. వేంటనే ఆ మెసలి ఏనుగు ముందు కాళ్ళు పట్టింది. ఆ ఏనుగు తన దంతాలతో మెసలిని కుమ్మి విడిచింది. అప్పుడు ముసలి వెనుకవైపు వచ్చి ఏనుగు తోకను కుమ్మి చీల్చింది. అలా ఆ కరి, మకరం ఒక దానిని ఒకటి కుమ్మి చీల్చుకొంటుండగా కరి బలం సన్నగిల్లుతోంది. జలమే తన నివాసస్థానం అవడం వల్ల మకరం బలం అంతకంతకు పెరుగుతూ ఉండడంతో గజరాజు నీరసిస్తోంది. ఈ సందర్భాన్ని పోతన తన గజేంద్ర మోక్షం కావ్యంలో ఇలా వర్ణించాడు.కరి దిగుచు మకరి సరసికిగరి దరికిని మకరి దిగుచు గరకరి బెరయన్గరికి మకరి మకరికి గరిభర మనుచును నతల కుతల భటు దరుదు పడన్.మొసలితో పోరు సాగించలేక దీనావస్థలో పడిన ఆ గజరాజు, మకరాన్ని గెలవడం తనవల్ల కాదు అని నిశ్చయించి తనను రక్షించమంటూ సర్వేశ్వరుడైన నారాయణుడుకి ఈ విధంగా మ్రెక్కింది.కలఁ డందురు దీనులయెడఁ,గలఁ డందురు పరమయోగి గణములపాలంగలఁ డందు రన్ని దిశలను,గలఁడు గలం డనెడువాఁడు గలఁడో లేఁడో
లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్చె; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్;నీవె తప్ప నిత:పరం బెఱుగ; మన్నింపందగున్ దీనునిన్;రావే ఈశ్వర; కావవే వరద; సంరక్షింపు భద్రాత్మకా;

అలా మొరపెట్టుకొన్నప్పుడు శ్రీమహావిష్ణువు వైకుంఠంలోని మందార వనాంతరంలో ఉన్న సరోవర సమీపంలోని చంద్రకాంత వేదికపై శ్రీమహావిష్ణువు లక్ష్మీ దేవితో సరస సల్లాపాలాడుతున్న సమయంలో గజరాజు పాహి పాహి అన్న మాట చెవిని పడింది. వెంటనే ఉన్నఫళాన గజరాజు రక్షణ కోసం బయలు దేరినాడు.సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడేపరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాంతర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచోపరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై.అలా వెళ్తున్న నారాయణుడుని చూసి మహాలక్ష్మి తన మనస్సులొ ఈ విధంగా ఆలోచించింది. ఏ దుష్ట దుశ్శాసనుడు కబంధ హస్తాలలోనైన చిక్కుకొని ద్రౌపది దేవి వంటి ఇల్లాలు మెర పెట్టుకొంటోందా! మళ్ళి పరమ మూర్ఖుడైన సోమకాసురుడు వేదాలు దొంగిలించడానికి వచ్చాడా! అసురులు అమరావతి పైకి దండెత్తి వస్తున్నారా! ప్రహ్లాదుని వంటి భక్తులను హింసించే హిరణ్యాక్షుడు మళ్ళీ బయలుదేరాడా అని సంశయించి ఆయన వెంట బయలుదేరింది.

ఆ విధంగా గజరాజు ఉన్న సరోవరాన్ని చేరీచేరుతూనే తన సుదర్శన చక్రాన్ని విడిచి పెట్టగానే విస్ఫులింగాలు చిమ్ముతూ ఆ సుదర్శనం మరుక్షణంలో సరోవరంలోకి ప్రవేశించి ఆ మొసలి తలను ఖండించింది. అప్పుడు గజేంద్రుడు ఊపిరి పీల్చుకొని కొలను నుండి వెలువడి కరిణీ బృందాన్ని చేరి సంతోషంతో తొండం ఎత్తి పలకరిస్తాడు. అప్పుడు శ్రీహరి తన పాంచజన్యాన్ని (శంఖం) పూరిస్తాడు. ఆ పాంచజన్యం ధ్వని శత్రు జనానికి హృదయవిదారకం, సజ్జనులకు ఉల్లాస భరితం కలిగిస్తుంది. నారాయణుడు తన కర స్పర్శతో ఆ కరిని అనుగ్రహిస్తాడు. ఆ అనుగ్రహంతో ఆ గజరాజు వైకుంఠాన్ని చేరుకొంటాడు. నిరంతరం ఎవరైతే శ్రీహరిని స్మరిస్తారో వారిని ఎప్పుడు నేను విస్మరించను అని శ్రీదేవికి చెప్పగా, ఆ లక్ష్మి దేవి దీనుల మొర విని వారిని రక్షించే శ్రీమహావిష్ణువుతో రావడం కంటే భాగ్యం ఎమి ఉంటుందని అంటుంది.

దేవలుడు అనే ముని శాపం వల్ల హూహూ అనే గంధర్వుడు మొసలి రూపం ఎత్తి పరమేశ్వరుని కరుణతో శాపవిమౌచనం పోంది తన పూర్వ గంధర్వరూపాన్ని పోందాడు. ఇంద్రజ్ఞమునుడు అనే రాజు అగస్త్యమహర్షిని ఉదాసీనంగా చూసిన కారణంగా ఏనుగు జన్మ ఎత్తి నానాబాధలు పోంది శ్రీహరి అనుగ్రహంతో శాపవిముక్తుడై వైకుంఠం చేరుకొన్నాడు.




#Article 120: భారతీయ నాట్యం (384 words)


భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న నాట్య, నృత్య రీతులను భారతీయ నాట్యం /భారతీయ నృత్యం అంటారు. భారతదేశంలో అనేక నాట్యరీతులు కానవస్తాయి.శాస్త్రీయంగా చూస్తే,ప్రతి రాష్ట్రంలోనూ సాంస్కృతిక నాట్యంలు ఉన్నాయి.అలాగే బాలీవుడ్లో నాట్యం ప్రత్యేకత సంతరించుకొని, ప్రపంచవ్యాప్తంగా అభిమానాన్ని చూరగొన్నది.

భారతీయ నాట్యరీతులు అనేక విధాలు. వీటిని ప్రధానంగా రెండు విధాలుగా వర్గీకరించవచ్చు 

ఇవే కాకుండా ప్రస్తుతం అన్ని రీతులనూ, ప్రధానంగా పాశ్చాత్య, దేశీయ విధానాలను మేళవించి రూపొందించిన నృత్య విధానాలు ప్రస్తుతం జనాదరణ కలిగి ఉన్నాయి. సినిమా రంగంలో ఇవి ప్రముఖమైన స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. వీటిని ఆధునిక నృత్యాలు అనవచ్చు.

నాట్యం (ఆంగ్లం :Dance) (ఫ్రెంచి పదం డాన్సెర్ నుండి ఉద్భవించింది): సాధారణంగా సంగీతానికి పారవశ్యమై శరీరంలో ఏర్పడే కదలికలు, లేదా లయబద్ధ సంగీతానికి, శరీరం లయబద్ధంగా కదలడం అని చెప్పుకోవచ్చు

భారతదేశం శాస్త్రీయ నాట్యాలకు పుట్టినిల్లు, అలాగే ఇక్కడ అనేక రకాల నాట్య కళలుతో కళకళలాడుతోంది. భారతదేశంలో అనేక శాస్త్రీయ నృత్యం సంస్కృతిలో ఒక భాగం. బిన్న సంస్కృతులతో నిండిన భారతదేశంలో సంస్కృతికి అనుగుణంగా బిన్న శాస్త్రీయ నృత్య కళలతో నిండి ఉంది, ప్రతి శాస్త్రీయ నృత్యం సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. నాట్యం శాస్త్రీయ నృత్యం కావాలంటే భరతముని బోదించిన నాట్యశాస్త్ర విధంగా అభినయం,నాట్యం కలిసిన విధంగా వుంటుంది 



#Article 121: చేతి పనులు (234 words)


చేతివృత్తులు , కులవృత్తులు మన సమాజంలో అనాదిగా ఉన్నాయి. ఆయా వృత్తుల పేర్లతోనే కులాలు ఏర్పడ్డాయి. అయితే ఈనాడు కులవృత్తులు కుప్పకూలుతున్నాయి. ఈ వృత్తుల్నే నమ్ముకున్న వారి జీవితాలు తెల్లారిపోతున్నాయి. ఆధునిక పనిముట్లు ఉన్న ఉపాధిని దెబ్బతీస్తున్నాయి. చేతిలో చేవఉన్నా పనిలేక బలహీనవర్గాలు నలిగిపోతున్నాయి. ఆధునిక పరిస్థితులకు తగ్గట్లుగా చేతివృత్తుల్ని తీర్చిదిద్ది ఉపాధి కల్పించాలి. 11 బీసీ కులాలకు సమాఖ్యలు ఏర్పాటుచేసింది ప్రభుత్వం.ప్రభుత్వం

రజక వృత్తి , చాకలిపని: డ్రై క్లీనింగ్ కేంద్రాలు, ఆధునిక వాషింగ్ యంత్రాలు చాకలివాళ్ళకు ఉపాధి అందనియ్యలేదు. డ్రై క్లీనింగ్ కేంద్రాలు పెడదామంటే పెట్టుబడిపెట్టే స్తోమతలేని బడుగు బతుకులు వీరివి. 1982లో రజక సహకార సంఘాల సమాఖ్యఏర్పడింది. రజక సహకార సంఘాల సమాఖ్య ద్వారా ఏటా రూ.50 లక్షలు దోభీ ఘాట్ల నిర్మాణానికి రుణాలు అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సమాఖ్య పరిధిలో మూడున్నర వేలకు పైగా రజక సహకార సంఘాలున్నాయి. 

నాయి బ్రాహ్మణ వృత్తి, మంగలిపని, క్షౌరం చేయటం.1989లో నాయి బ్రాహ్మణ సహకార సంఘాల సమాఖ్య ఏర్పాటయింది రాష్ట్ర నాయిబ్రాహ్మణ సహకార సంఘాల సమాఖ్యలో 2 వేల నాయిబ్రాహ్మణ సంఘాలున్నాయి. ఒక్కో సభ్యుడికి రూ. 10 వేల ఋణం ఇస్తారు. కార్పొరేట్ కంపెనీలు కూడా ఈ రంగంలోకొస్తున్న నేపథ్యంలో ఆధునిక సెలూన్లు పెట్టుకోవడానికి రుణాలివ్వాలని ఆ వర్గాలు కోరుతున్నాయి.

వడ్డెర సహకార సంఘాల సమాఖ్య లో రాష్ట్రవ్యాప్తంగా 2016 సంఘాలున్నాయి. సంఘంలో ఒక్కో సభ్యునికి రూ.10వేలు రుణం వస్తోంది. వీటితో పలుగు, పార కొని, మట్టిపని, రాళ్లపని, కంకర తదితర పనులు చేసే వడ్డెర్లకు జేసీబీ, క్రషర్ల రూపంలో ఉపాధి గండిపడుతోంది. ఒక్కో యంత్రానికి రూ.3 లక్షలకు పైగా అవసరం. సంఘాలకు సంయుక్తంగా ఆధునిక యంత్రాలు అందించాలని వడ్డెర్లు కోరుతున్నారు.

కలంకారీ , కొండపల్లి బొమ్మలు ,నక్కపల్లి లక్క బొమ్మలు తయారీలో అన్ని కులాలవాళ్ళూ ఉన్నారు.

సమాఖ్యలకు కార్యాలయాలు, సిబ్బంది , బడ్జెట్‌ కేటాయింపులు జరగాలి.
ఒక్కో సమాఖ్యకు రూ.కోటి చొప్పున కేటాయిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ గత ఏడాది అసెంబ్లీలో ప్రకటించారు. 
చేతి, వృత్తిదారులను ఆదుకునే పేరుతో 2005-06లో 'రాజీవ్ అభ్యుదయ యోజన'ను ప్రవేశపెట్టింది. పథకం కింద కులవృత్తులు చేసుకునే వారికి ఆధునిక పనిముట్లు, ఆర్థిక సహాయం అందజేస్తారు. ఒక్కో యూనిట్ కింద రూ.3 వేలకు మించి మంజూరుచేయడం లేదు.




#Article 122: జాతీయములు (266 words)


ఆంగ్ల భాషలో జాతీయము అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్థం వేరు. ఉదాహరణకు చేతికి ఎముక లేదు అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్థం ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి కాని ఈ జాతీయానికి అర్థం ధారాళంగా దానమిచ్చే మనిషి అని.

 అనే భాషావేత్త చెప్పిన అర్థం - idiom as words collocated together happen to become fossilized, becoming fixed over time.. అనగా తరతరాల వాడుక వలన భాషలో కొన్ని పదాల వాడుక శిలావశేషంగా ఘనీభవించింది. కనుక భాషతో పరిచయం ఉన్నవారికే ఆ భాషలో ఉన్న జాతీయం అర్ధమవుతుంది. నీళ్ళోసుకోవడం, అరికాలి మంట నెత్తికెక్కడం, డైలాగు పేలడం, తు చ తప్పకుండా - ఇవన్నీ జాతీయాలుగా చెప్పవచ్చును. జాతీయాలు సంస్కృతికి అద్దం పట్టే భాషా రూపాలు అనవచ్చును.

సామాన్యంగా జాతీయాలను పని గట్టుకొని ఎవరు పుట్టించరు. అలా పుట్టించినా అవి కలకాలం ప్రజల నోళ్ళలో వుండవు. జాతీయములు ఒక భాషలో సహజంగా పుట్టి ప్రజల నోళ్ళలో నానుతుంటాయి. తరతరాలుగా అలా వాడుకలో వుంటూనే వుంటాయి.

కొన్ని జాతీయాలను సామెతగాను, సామెతలను జాతీయాగాను పొరబడు సందర్భాలున్నాయి. నిజానికి ఈ రెండు వేరు వేరు. సామెతలోని అర్థం సంపూర్ణము. ఉదాహరణ: సామెత. గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిందట./ కాకిపిల్ల కాకికి ముద్దు. / తిన్నింటి వాసాలు లెక్కపెట్టడము. ఇలా... ఇందులో అర్థ సంపూర్ణము. దాన్ని అన్వయించడములో కొంత తేడా కనబడుతుంది. జాతీయములో అర్థం అసంపూర్ణం. సగం వాఖ్యమే వుంటుంది. జాతీయము: ఉదాహరణ:..కడతేర్చాడు / కడుపు మంట. / కన్నాకు./ అగ్గినిప్పు./ పంటపండింది. పంటికిందరాయి./పక్కలోబల్లెం ఇలా వుంటాయి. పైగా వాటి నిజార్థాలు వేరుగా వుంటాయి. మరొక అర్థంలో వాటిని వాడతారు. ఉదాహరణకు.... పంట పండింది. అనగా అతని వరిపంట పండిందని అర్థం కాదు. అతనొక గొప్ప విజయము సాదించాడని అర్థము. పప్పులో కాలేశాడు. అనగా పప్పులో నిజంగా కాలేశాడని కాదు గదా. అనగా పొరబడ్డాడు అని అర్థము. ఇంతటి గూడార్థమున్నా జాతీయాలు సామాన్య మానవులు.... చదువులేని వారికి సైతం అర్థం అయి వారే ఎక్కువగా వాడు తుంటారు.  అందుచేత జాతీయాలు ఆ భాషకు ఆభరణాలు అని చెప్పవచ్చు. 

(అకారాది క్రమంలో వివిధ జాతీయాలు ఇవ్వబడ్డాయి. ప్రక్కనున్న లింకుల ద్వారా ఆయా వ్యాసాలకు వెళ్ళవచ్చును)




#Article 123: వరంగల్ పట్టణ జిల్లా (745 words)


వరంగల్ పట్టణ జిల్లా, భారతదేశం, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.

ఈ జిల్లా పరిపాలన కేంద్రం వరంగల్ పట్టణం.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో లోగడ ఉన్న వరంగల్ జిల్లాను వరంగల్ పట్టణ జిల్లాగా, వరంగల్ గ్రామీణ జిల్లాగా విభజించారు.ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదునకు ఉత్తర దిశలో 157 కి.మీ. దూరంలో ఉంది.  

క్రీ.శ.12-14 శతాబ్దాలలో పరిపాలించిన కాకతీయుల రాజ్యానికి వరంగల్ రాజధాని. కాకతీయుల నిర్మించిన ఎన్నో కట్టడాలు, పర్యాటక ప్రాంతాలు ఈ జిల్లాలో ఉన్నాయి.కాకతీయుల పాలనా దక్షత గురించి ఇటలీ యాత్రికుడు మార్కోపోలో తన రచనలలో రాసాడు. కాకతీయ పాలకులు - కాకర్త్య గుండన, మొదటి ప్రోలరాజు (1050-1080), రెండవ బేత రాజు (1080 - 1115), రెండవ ప్రోల రాజు (1115-1158), రుద్ర దేవుడు (1158-1195), మహా దేవుడు (1195-1199), గణపతిదేవ చక్రవర్తి (1199-1261), రుద్రమ దేవి (1258-1290), ప్రతాపరుద్రుడు ( 1290-1326).

వరంగల్ జిల్లా 12,846 చ.కి.మీ.లలో వ్యాపించి 32,31,174 (2001 లెక్కలు) జనాభా కలిగి ఉంది. బొగ్గు, గ్రానైటు గనులకు (నలుపు, బ్రౌను రకాలు) జిల్లా ప్రాముఖ్యత చెందింది. వరి, మిరప, పత్తి, పొగాకు పంటలు విరివిగా పండుతాయి.
గాలిలోని తేమశాతం సగం మాత్రమే ఉండే తెలంగాణా భూభాగంలో ఉన్న కారణంగా వరంగల్ వాతావరణం వేడివాతావరణం కలిగి ఉంటుంది. మార్చి మాసంలో ఆరంభం అయ్యే వేసవి కాలం మే మాసానికి 42 ° (108 ° ఫారెన్ హీట్ ) సెంటీగ్రేడుల శిఖరాగ్రం చేరుకుంటుంది. జూన్ మాసానికంతా ఆరంభం అయ్యే వర్షాలు సెప్టేంబర్ వరకు కురుస్తుంటాయి. వర్షపాతం 22 మిల్లీమీటర్ల (22 అంగుళాలు) వరకు కురుస్తుంది. నవంబరు మాసం నుండి మంచుకురవని తేమలేని స్వల్పమైన శీతాకాలం ఆరంభం అయి ఫిబ్రవరి మాసం ఆరంభం వరకు ఉంటుంది. శీతాకాలం సరసరి ఉష్ణోగ్రత 22-23 ° సెంటీగ్రేడులు (72-73 ఫారెన్ హీట్ ) వరకు ఉంటుంది. వరంగల్ జిల్లా సందర్శనానికి ఇది తగిన సమయం. వరంగల్ జిల్లా సముద్రమట్టానికి 302 మీటర్ల (990 అడుగులు) ఎత్తులో ఉంటుంది. భారతదేశంలోని భూపర్యవేష్టిత జిల్లాలలో ఇది ఒకటి. అలాగే అటవీ ప్రాంతం అధికంగా ఉన్న జిల్లాలలో కూడా ఇది ఒకటి.

పూర్వపు వరంగల్ జిల్లాలోని 4 మండలాలు కాగా, 3 మండలాలు కరీంనగర్ జిల్లా నుండి ఈ జిల్లాలో కలపబడ్డాయి.నాలుగు మండలాలు కొత్తగా ఏర్పడ్డాయి.ఇది వరంగల్ పట్టణ జిల్లాగా ది.11.10.2016న అవతరించింది.

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (4)

వరంగల్ నగర శివార్లలో ఈశాన్యంలో ఉన్న మామ్నూరు గ్రామం వద్ద వరంగల్ ఖమ్మమ్ రహదారిలో వాయుసేన గ్లైడర్ శిక్షణా కేంద్రంగా ఉపయోగపడుతుంది. నిజాం నవాబు కాగజ్ నగర్ పేపర్ మిల్లు, అజం జాహీ మిల్లుకు చేరడానికి అనుగుణంగా నిర్మించబడిన ఈ విమానాశ్రయం 1947 వరకు దేశంలోనే పెద్ద విమానాశ్రయంగా ఉంటూ వచ్చింది. సమీపంలో ఉన్న విమానాశ్రయం వరంగల్ పట్టణానికి 160 కిలోమీటర్ల దూరంలో హైదరాబాదులో ఉన్న రాజీవ్ గాంధీ విమానాశ్రయం. 

వరంగల్ రైలు మార్గం ద్వారా భారతదేశంలోని అనేక ప్రముఖ నగరాలతో అనుసంధానించబడింది. ఇది భారతీయ రైల్వేలో దక్షిణ మధ్య రైల్వే విభాగానికి చెందినది.వరంగల్‌కు సమీపంలో 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖాజీపేట రైల్వే జంక్షన్ ఉంది. ఇది హైదరాబాదు, న్యూ ఢిల్లీ, విజయవాడ, చెన్నై, కొలకత్తా రైలు మార్గంలో ప్రముఖ రైలు కూడలి (రైలు జంక్షన్) ఖాజీపేట రైల్వే జంక్షనే. వరంగల్ రైలు స్టేషను హైదరాబాద్, విజయవాడ, చెన్నై రైలు మార్గంలో ఉంది. ప్రతి రోజు ఈ స్టేషను ద్వారా గూడ్స్ రైళ్ళు కాక 132 రైళ్ళు దాటి వెళుతుంటాయి. దేశంలో రైలు స్టేషనులలో పెద్ద రైలు స్టేషనులలో వరంగల్ రైలు స్టేషను ఒకటి.

హైదరాబాదు నుండి భోపాలపట్నం వరకు వేస్తున్న జాతీయరహదారి 202 నిర్మాణదశలో ఉంది. ఈ రహదారిలో వరంగల్ నుండి పోతుంది. వరంగల్, హనుమకొండ వద్ద రెండు ప్రధాన బస్సు స్టాండ్లు ఉన్నాయి. వరంగల్ నుండి దూరప్రాంతాలకు వెళ్ళే డీలక్స్ బస్సులు బెంగుళూరు, మద్రాసు, హైదరాబాదు, తిరుపతి, అనంతపూరు, హుబ్లి, బెల్గాం లకు ఉన్నాయి. అలాగే స్టాండెడ్ ఎక్ష్ప్రెస్స్ బస్సులు గుంటూరు వయా విజయవాడ, చెన్నై, చెరియాల్ మార్గంలో వరంగల్ ను చేరుకుంటాయి.

వరంగల్ ఆర్థికంగా వ్యవసాయం మీద ఆధాపడి ఉంది. వరంగల్ సమీపంలో దేశాయిపేట వద్ద ఉన్న ఎనుమాముల గ్రామం వరంగల్ జిల్లా ధాన్యపు వాణిజ్య కేంద్రంగా ఉంది. ఇక్కడ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఉంది. ఈ ప్రాంతం బియ్యపు వ్యాపారానికి ప్రధాన కేంద్రం. ప్రాంతీయ అవసరాలకు, వెలుపలి వాణిజ్యానికి అవసరమైన బియ్యం వ్యాపారం ఇక్కడ ప్రధానంగా జరుగుతుంది. 1990 వరకు ఈ ప్రాంతంలో పత్తి ఉత్పత్తి ప్రధానంగా జరిగింది. ఇటీవలి కాలంలో పత్తి ఉత్పత్తిలో సమస్యలు ఎదురైయ్యాయి. ఈ జిల్లాలో 1997-1998 మధ్య పత్తిరైతుల ఆత్మహత్యలు అత్యధికంగా నమోదు అయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం ఈ జిల్లాలో పరిశ్రమలకు ముఖ్యత్వం ఇవ్వడంలో శ్రద్ధవహించ లేదు. నిజాం కాలం నుండి సాగుతున్న కొన్ని పరిశ్రమలు మాత్రమే ఉన్నాయి. అజం జాహి క్లోత్ మిల్లు మూతపడింది. జిల్లాలో చిన్నతరహా పరిశ్రమలు మాత్రం నడుస్తున్నాయి. రెండవ స్థాయి నగరాలు సాంకేతిక రంగంలో జరుగుతున్న విప్లవాత్మక ఫలాలని అందునే ప్రయత్నంగా సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్ టి పి ఐ) వరంగల్ జిల్లాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్థాపించాలని అనుకుంటున్నారు. చక్కని ప్రయాణ వసతులు, నాణ్యమైన విద్యాసంస్థల నుండి విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు, మంచి భవనవసతులు, తక్కువగా ఉన్న వాహనాల రద్దీ, హైదరాబాదుకు అందుబాటు దూరంలో ఉన్న కారణంగా వరంగల్ ఇందుకు తగి ఉంది. విదేశాలలో స్థిరపడిన ప్రవాసభారతీయుల నుండి ఈ జిల్లాకు విదేశీ పెట్టుబడులు అందుతున్నాయి.

వరంగల్ జిల్లాలో ప్రజలు అధికంగా తెలుగు భాషను మాట్లాడుతుంటారు. వరంగల్ ప్రజలు సంప్రదాయమైన చీరె, ధోవతి వంటి దుస్తులతో అధునిక వస్త్రాలను కూడా ధరిస్తుంటారు.వరంగల్ జిల్లా నుండి అత్యధికంగా యువత విదేశాలలో పనిచేస్తున్నారు. ప్రధానంగా అమెరికా వంటి దేశాలలో అధికంగా పనిచేస్తున్నారు. అత్యధికంగా సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్న వారే. అనేకంగా ప్రతి ఇంట్లో విదేశాలలో నివసిస్తున్న సభ్యులు ఉన్నారు. యువతలో అధికులు సాంకేతిక రంగంలో నైపుణ్యం ఉన్న కారణంగా ఐ.టి. సంస్థలు ఇక్కడ తమ శాఖలను స్థాపించడానికి ఉత్సుకత చూపుతున్నారు. వరంగల్ జిల్లాలో ని ప్రజల అభిరుచులను తెలంగాణ సమాజం లోని ప్రజలు ఒక రకంగా ప్రామాణికంగా పరిగణిస్తారు. చుట్టూ పక్కల గ్రామీణ ప్రాంతాల నుండి వలస వచ్చి స్థిర పడిన వారి సంఖ్యనే అధికం.

వరంగల్ జిల్లాలో దేశంలో ఉత్తమమైనవిగా గుర్తింపు పొందిన విద్యాసంస్థలు ఉన్నాయి. వరంగలు తెలంగన జిల్లాలలో 2 ఉంది. 1959లో పండిత జవహర్లాల్ నెహ్రుచే పునాది రాయి స్థాపించబడిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, వరంగల్ (పాత పేరు ఆర్.ఇ.సి వరంగల్), కాకతీయ మెడికల్ కాలేజీ ఉంది. ఎన్ ఐ టి భారతదేశం అంతా చక్కగా అభివృద్ధి చెందింది. వరంగల్ నిట్ (ఎన్ ఐ టి) దేశంలో అత్యుత్తమమైనదిగా భావిస్తున్నారు. 1959 లో దీనిని స్థాపించినప్పటి నుండి ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు అనేకులు దేశ విదేశాలలో ఉన్నారు. ఈ సంస్థ దేశం మొత్తం నుండి ప్రతిభావంతులని అనేక మందిని ఆకర్షిస్తుంది.




#Article 124: రాశి (185 words)


జ్యోతిష శాస్త్రంలో రాశులు పన్నెండు ఉంటాయి. ఒక్కొక్క రాశిలో తొమ్మిది నక్షత్రపాదాలు ఉంటాయి. ఇలా పన్నెండు రాశులలో కలిసి నూట ఎన్మిమిది నక్షత్ర పాదాలు ఉంటాయి. రాశి నక్షత్ర సమూహాలను ఉహా రేఖతో కలిపి ఆ ఆకారం పోలికను అనుసరించి ఋషుల చేత నిర్ణయించబ్నడినవే మేషము, మీనము మొదలగు రాశులు.

సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక మాస కాలం ఉంటాడు. ఆతరువాత రాశి మారుతూ ఉంటాడు. దానిని మాస సంక్రాంతి అంటారు. అలాగే ఒక రోజుకు ఒక లగ్నానికి రెండు గంటలు చొప్పున ఇరవైనాలుగు గంటల కాలాన్ని పన్నెండు లగ్నాలుగా విభజిస్తారు.

ఒక రోజులో పన్నెండు లగ్నాలు ఉంటాయి. ప్రతి రెండు గంటల సమయానికి లగ్నం మారుతూ ఉంటుంది. పుట్టిన సమయాన్ని అనుసరించి లగ్న నిర్ణయం జరుగుతుంది. జాతకుడు పుట్టిన లగ్నం అతడికి మొదటి రాశి లేక స్థానం లేక లగ్నం ఔతుంది. మేషమునకు అధిపతి కుజుడు, వృషభముకు అధిపతి శుక్రుడు. మిధునముకు అధిపతి బుధుడు. కటకముకు అధిపతి చంద్రుడు. సింహముకు అధిపతి సూర్యుడు. కన్యకు అధిపతి బుధుడు.
తులకు అధిపతి శుక్రుడు. వృశ్చికముకు అధిపతి కుజుడు. ధనస్సుకు అధిపతి గురువు. మర, కుంభములకు వరుసగా శని అధిపతి. చివరి రాశి అయిన మీనముకు అధిపతి గురువు.

నవాంశచక్రము జాతక నిర్ణయంలో ప్రధానపాత్ర పోషిస్తుంది. ఉత్తరభారతదేశంలో నవాంశను ఆధారంగా చేసుకుని జాతక నిర్ణయం చేస్తారు. ఫలితాలు తుల్యంగా ఉంటాయని పండితుల అభిప్రాయం. రాశిలోని తొమ్మిది నక్షత్ర పాదాలను తొమ్మిది భాగాలుగా విభజిస్తారు. ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క రాశి ఆధిపత్యం వహిస్తుంది. మేషం, కటకం, తుల, మకరం వరుసగా నవాంశ ఆరంభ రాశులు. నవాంశను గ్రహం ఉపస్థిత రాశిని దానికి ఒక్కొక్క పాదంలో స్థానంలో ఉన్న రాశిని స్థానంలో ఉన్న రాశిని అనుసరించి నిర్ణయిస్తారు.




#Article 125: నెల్లూరు (548 words)


నెల్లూరు భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణతీరప్రాంతపు అయిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముఖ్య పట్టణం, రాష్టృంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నెల్లూరు నగరం ఒకటి. జనాభా సుమారు 6 లక్షలు.

నెల్లూరుకు విక్రమసింహపురి అనే పేరు కూడా ఉంది. విక్రమసింహ మహావీర, మనుమసిద్ధి మహారాజు సింహపురి రాజధానిగా నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించాడు. మనుమసిద్ధి కాలంలో ఈ ప్రాంతం సస్యశ్యామలమై అత్యధిక వరి ధాన్యపు ఉత్పత్తితో విలసిల్లేది. అందుకే ఈ ప్రాంతానికి నెల్లి (తమిళ భాషలో వరి అని అర్ధం) అల్లా నెల్లివూరు అనే పేరు వచ్చింది. ఈ ప్రదేశ స్థలపురాణం, చరిత్రల ప్రకారం కాలక్రమంలో నెల్లివూరు నెల్లూరుగా రూపాంతరం చెందింది.

ఇంకో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. నెల్లూరుజిల్లా జిల్లా కేంద్రమైన నెల్లూరు పట్టణ మందు శ్రీ మూలస్థానేశ్వర ఆలయం ఉంది.ఇది చాలా ప్రాచీనమైన ఆలయం.దీనిని ఆంధ్రరెడ్డిపాలకుడైన ముక్కంటి రెడ్డిరాజుగారు కట్టించెరని ఒక కథద్వారా తెలియుచున్నది, స్థల పురాణం విషయానికొస్తే ఆ రాజుకి ఒక నాడు కలలో పరమశివుడు కనిపించి రాజా!నేను ఈ ప్రాంతమున వున్న ఉసిరిక చెట్టుమూలమున వెలసివున్నాను. నేను ఇప్పుడు భక్తకోటిని రక్షించుటకు రాదలచాను. కనుక అచట నాకొక ఆలయమును కట్టించు అని ఆజ్ఞాపించాడట.మరుసటి రోజు ఉదయమే ఆ రాజు ఉసిరిచెట్టు దగ్గరకు వెళ్లి పరిశీలించిచూడగా అచట లింగాకృతిలో వృక్షమూలమున పరమేశ్వరుడు కనపడగానే ఆనందంతో ఆ రాజు వెంటనే ఆలయాన్ని కట్టించి అందులో ఆ శివలింగమును ప్రతిష్ఠింపచేసి భక్తిప్రపత్తులతో ఆరాధించారు.ఈ ఆలయంలోని శివలింగం ఉసిరిచెట్టు మూలమున వెలసింది. ఉసిరిచెట్టును తమిళమున నెల్లి అని అంటారు. ఆనాడు తమిళభాషా ప్రభావం ఎక్కువగా వున్నందున ఆ ప్రదేశంలో ఉసిరిచెట్టు నెల్లి అని పిలిచేవారు.ఆ నెల్లిపేరు మీదుగానే అచ్చట వెలసిన గ్రామం నెల్లూరుగా ప్రఖ్యాతిగాంచిందని ప్రతీతి.

ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో నెల్లూరు, ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రముఖ విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. పొట్టి శ్రీరాములు పేరుతో పిలవబడే నెల్లూరు జిల్లా, 1953 అక్టోబరు 1 దాకా సంయుక్త మద్రాసు రాష్ట్రం లో భాగంగా ఉంది. 1956 నవంబరు 1 న భాషాప్రయుక్తంగా రాష్ట్రాల పునర్విభజన జరిగినపుడు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో భాగమైంది. ఈ నగరం లోని మూలాపేట ప్రాంతము అత్యంత పురాతన ప్రశస్తి కలిగి ఉంది.

తెలుగు సాంస్కృతిక సేవలో నెల్లూరు పేరు గాంచింది. కవిత్రయంలోని తిక్కన మహాభారతంలోని 15 పర్వాలు ఈ ప్రదేశం లోనే రచించారు.

అభ్రకం ఉత్పత్తిలో అగ్రగామి. పింగాణి, ముడి ఇనుము, జిప్సం, సున్నపురాయి నిధులున్నాయి. జిల్లాలో ట్రేడింగ్ రైసు మిల్లులు, నాన్ ట్రేడింగ్ రైసు మిల్లులు, షుగర్ మిల్లులు ఉన్నాయి.

ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు జిల్లాలో 91 శాఖలు కలిగి అత్యధిక బ్యాంకు శాఖలు ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకు. కేవలం నెల్లూరు నగరంలో 15 శాఖలు ఉన్నాయి. ఇంకా పలు ప్రభుత్వ, ప్రైవేటు బాంకులు కూడా ఉన్నాయి.

పలు సినిమాహాళ్లు, మల్టిప్లెక్స్లు ఉన్నాయి. యామ్ జి బి మాల్ మల్టీప్లెక్స్ అయిదు ప్రదర్శన తెరలు కలిగివున్నది.

నెల్లూరు నగరం చెన్నై-కోల్‌కత్తా జాతీయ రహదారి (NH-5) మీద చెన్నై-ఒంగోలు ల మధ్య ఉంది. ప్రస్తుతం ఈ రహదారి నాలుగు మార్గాలతో ఉంది. 2011 కల్లా ఇది ఆరు మార్గాలుగా విస్తరింపబడుతుంది. తిరుపతి, విజయవాడ, చెన్నై,హైదరాబాదు, కర్నూలు, కడప, అనంతపురం, ఒంగోలు,విశాఖపట్టణం,బెంగళూరు .. మొదలగు ప్రదేశములకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు విరివిగా ఉన్నాయి.

నెల్లూరు నగరం గూడూరు-విజయవాడ రైలు మార్గములో ప్రధాన స్టేషను. ఇక్కడ నుండి తిరుపతి, విజయవాడ, చెన్నై, హైదరాబాదు, విశాఖపట్టణం, బెంగళూరు, న్యూఢిల్లి, హౌరా, తిరువనంతపురం,కన్యాకుమారి మొదలగు ప్రదేశములకు నిత్యం రైళ్ళ రాకపోకలు ఉన్నాయి. నెల్లూరు పాతపేరైనా సింహపురి పేరు మీద సింహపురి ఎక్స్‌ప్రెస్ అనే సూపర్ ఫాస్ట్ రైలు గూడూరు-సికింద్రాబాద్ ల మధ్య నడుస్తుంది. నెల్లూరు సమీపంలో ఉన్న కడపకు రైల్ మర్గం లేదు కనుక నెల్లూరు నుండి కడపకు కేవలం బస్సు మార్గము మాత్రమే ఉంది.

నెల్లూరులో జరుపుకొనే ముఖ్యమైన పండుగలు:

ఇప్పటి సంతపేటరేవు హరిహరనాధాలయం ఉన్నచోటని చరిత్రకారుల అభిప్రాయము.ఈ స్వామినే తిక్కన, నాచన సోమనలు ఆరాధించారు.పెన్నానది పూర్వం ఇక్కడనే ఇంకొకపాయగాచీలి, చిత్రకూటం-ఇసుకడొంక-జేంస్ గార్డెన్-ఉదయగిరివారి తోట (ఇప్పటి లక్ష్మీపురం) నవలాకుతోటల (9 లక్షల ఫలవృక్షాలను ఇచట నెల్లూరు, సర్వేపల్లి నవాబులు పెంచినారట) మీదుగా తూర్పుగా పారి, కొత్తూరు, ఇందుకూరుసేట మడుగులై, క్రింద మొత్తలు అనే కూడలిచోట ఉత్తరముఖమై, ఊటుకూరు దగ్గర మొదటి పినాకినీ శాఖలోకలసి, సముద్రంలో సంగమించింది. దీనికి భౌగోళిక ఆధారాలున్నాయి. ఈఏటిపాయ, పేరుకొని పోతూవచ్చి ఎప్పుడు పూర్తిగా పూడిపోయిందో చెప్పలేరు. ఈ పూడిపోయిన శాఖను వృద్ధ పినాకినీ అని అంటూ, నేటికి పెద్దకారువారూఅంవాలు చూపుతారు.

పూర్వం పెన్న- ఇప్పటి రంగనాయకుల గుడికి పడమట, ఎగదలలో రెండుగా చీలి ఈ ప్రదేశానంతా ఒక అంతర్వేదిగా (Doab-దో ఆప్=రెండు నీళ్ళ పాయలు) చేసిఉన్నట్లు కనబడుచున్నది. శయన నారాయణ స్వాములు వెలసిఉన్న శ్రీరంగం, శ్రీరంగపట్నం మొదలైనవన్నీ ఇట్టి ఏటిపాయల నడిబుడ్డుననే ఉన్నాయి. జక్కన విక్రమార్క చరిత్ర, ఒక కథా సంబర్భమున ఈ దోఆబును వర్ణించి, వినికిడిగా సాగవచ్చే ఒకభౌగోళికాంశమును స్థిరీకరిస్తున్నది. జక్కన క్రీ.శ.1410 ప్రాంతంవాడు. ఈయన తాత పెద్దయామాత్యుని కాలంనుండి (క్రీ.శ.1279) ఈకవి వంశానికి నెల్లూరుతో సంబంధముంది. తిక్కభూపతి మనుమసిద్దికొడుకు. రెండవ తిక్కరాజు జక్కనకవి తాతను ఆదరించి ఉండినాడు. మల్లినాధ సూరి ఈ అదనునే సంస్కృతాంధ్ర వ్యాఖ్యానము వ్రాయించాడు.జక్కన, కవిసార్వభౌమ శ్రీనాధుని కాలమువాడు.




#Article 126: కర్నూలు జిల్లా (316 words)


కర్నూలు జిల్లా దక్షిణ భారతదేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజధాని. జిల్లాలో ఆపరేషన్ టైగర్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేసిన, ప్రపంచంలోకెల్లా పెద్దదైన, వన్యమృగ సంరక్షణ కేంద్రం (శ్రీశైలం - నాగార్జునసాగర్) ఉంది. ఎప్పుడో అంతరించి పోయిందని భావించబడిన బట్టమేక పిట్ట ఇటీవల జిల్లాలోని రోళ్ళపాడు వద్ద కనిపించడంతో ఆ ప్రాంతాన్ని అభయారణ్యంగా ప్రకటించారు. అక్టోబరు 2, 2009న భారీ వర్షాలు, హంద్రీ, తుంగభద్ర నదుల వరద నీటివల్ల కర్నూలు పట్టణంలో వందల ఇళ్ళు మునిగిపోయి వేలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

మధ్వాచార్యులు అయిన రాఘవేంద్ర స్వామి పుణ్యక్షేత్రం మంత్రాలయం కర్నూలు జిల్లాలోదే. మంత్రాలయం తుంగభద్రా నదీ తీరంలో ఉన్న పుణ్యక్షేత్రం. అహోబిలంలో నరసింహస్వామి దేవాలయం ఉంది. ఇక్కడ నరసింహస్వామిని నవరూపాలుగా కొలుస్తారు. మహానందిలో నందీశ్వరుడు ఉన్నాడు. ఇక్కడి కోనేరులో అన్ని కాలాల్లోను నీరు ఒకే మట్టంలో ఉంటుంది. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం ఈజిల్లాలోదే. ఇక్కడ మల్లికార్జున స్వామి, భ్రమరాంబ దేవాలయాలు ఉన్నాయి. కృష్ణా నదిపై ఇక్కడ నిర్మించబడ్డ ఆనకట్ట దేశంలోని అతిపెద్ద వాటిలో ఒకటి. లక్షలాది ఎకరాలకు నీరందించడమే కాక, విద్యుదుత్పత్తిలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే ప్రధాన వనరుగా ఉంది. 

బాదామి చాళుక్యులు, తెలుగు చోళులు, కాకతీయులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లుగా చరిత్ర చెబుతోంది. అటు తర్వాత విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని జయించి తమ ఆధీనం లోనికి తెచ్చుకొన్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రస్తుత జిల్లా అంతా ఆయన ఏలుబడి లోనికి వచ్చింది. కర్నూలులో ప్రఖ్యాతి గాంచిన కొండారెడ్డి బురుజు, అచ్యుతదేవరాయలు విజయనగర రాజుగా ఉన్నప్పుడు కట్టబడిన కోటలో ఓ భాగం మాత్రమే, ఆ తర్వాత ఎప్పుడో కొండారెడ్డి అనే విప్లవవీరుణ్ణి అక్కడ బంధించడం వల్ల ఆ పేరు వచ్చింది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలలాగే కర్నూలు జిల్లాలో కూడా వ్యవసాయమే ప్రధాన వృత్తి.

ఇక్కడ ఎక్కువ భాగం వ్యవసాయం వర్షాధారితమే అయినా కె.సి. కెనాల్, తెలుగుగంగ కింద చాలా ప్రాంతం సాగుబడికి వస్తుంది. వీటి పరీవాహక ప్రాంతాల్లో వరి పండిస్తారు. ఇవి కాకుండా వెలుగోడు ప్రాజెక్టు, అవుకు, పోతిరెడ్డిపాడు, శ్రీశైలం జలాశయాల కింద చాలా ప్రాంతం సాగుబడికి వస్తుంది. 
ఇక్కడ బేతంచెర్ల ప్రాంతంలో సున్నపు రాయి విరివిగా లభిస్తుంది. ఇళ్లలో ఫ్లోరింగుకు ఉపయోగించే నాపరాయి కూడా ఇక్కడ విరివిగా లభిస్తుంది. ఇక్కడ లభించే సున్నపురాయి ఆధారంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పాణ్యం సిమెంట్ స్దాపించింది.

టిజివి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, చెప్పుకోదగిన వ్యాపార సంస్థలు. తాడిపత్రి దగ్గరి ఎల్ అండ్ టిలో కొంత భాగం కర్నూలు భూభాగంలోనే ఉంది.

కర్నూలు ఎ.పి.ఎస్.ఆర్.టీ.సీ బస్టాండు రాష్ట్రములో మూడో పెద్ద బస్టాండు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి రాష్ట్రములో రెండో పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి.

ముగ్గురాయి, రంగురాయి, సీసము మొదలగు ఖనిజములు జిల్లాలో లభ్యమగును. పూర్వము రత్నాలకోట (ప్రస్తుత రామళ్ళకోట), జొన్నగిరి గ్రామాలలో రత్నములు లభ్యమయ్యేవి.

భౌగోళికంగా కర్నూలు జిల్లాను 54 రెవిన్యూ మండలాలుగా విభజించారు. ()

కర్నూలు జిల్లాలోని రోళ్ళపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అంతరించిపోతున్న బట్టమేక పక్షులకు ఆవాసము.




#Article 127: కరీంనగర్ జిల్లా (1011 words)


కరీంనగర్ జిల్లా, తెలంగాణా రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.

భౌగోళికంగా కరీంనగర్ జిల్లాలో పునర్య్వస్థీకరణకు ముందు 57 మండలాలు ఉన్నాయి.పునర్య్వస్థీకరణలో భాగంగా కరీంనగర్ జిల్లాలోని 57 పాత మండలాలు నుండి, కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లా 15 మండలాలతో, పెద్దపల్లి జిల్లా 11 మండలాలతో, రాజన్న సిరిసిల్ల జిల్లా 9 మండలాలతో కొత్త జిల్లాలుగా ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 4 మండలాలు, సిద్దిపేట జిల్లాలో 3 మండలాలు, వరంగల్ పట్టణ జిల్లాలో 3 మండలాలు కలిసాయి.

 

 

 

 

 

 

పునర్య్వస్థీకరణ తరువాత కరీంనగర్ జిల్లాపరిధిలో 12 పాత మండలాలకు అదనంగా 4 కొత్త మండలాలు ఏర్పాటుతో కలిపి 16 మండలాలు, రెండు రెవెన్యూ డివిజన్లు (కరీంనగర్,హుజారాబాద్), 210 రెవెన్యూ గ్రామాలతో అవతరించింది.అందులో 5 నిర్జన గ్రామాలు. 

 
 
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (4)

కరీంనగర్ హైదరాబాదుకు 162 కిలోమీటర్లు, వరంగల్లు 70 కిలోమీటర్లు, నిజామాబాదు నుండి150 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదిలాబాదు, నిజామాబాదు, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ జోనల్ ప్రధాన కార్యాలయం కరీంనగర్ జిల్లాలో ఉంది. రోజుకు 2,500 బస్సులు దాటి వెళ్ళే చురుకైన బస్సు స్టేషను‌లలో కరీంనగర్ బస్‌స్టేషను ఒకటి. . ఇక్కడి నుండి హైదరాబాదు, సికింద్రాబాద్కు మాత్రం వాల్వో బస్సుల వంటి అధునాతన బస్సులతో పాటు300 బస్సులను నడుపుతుంటారు. అలాగే అదిలాబాదు, నిజామాబాదు, వరంగల్లు, ఖమ్మం, నల్గొండ, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, పిడుగురాళ్ళ, ఒంగోలు, కావలి, కందుకూరు,నెల్లూరు, పుట్టపర్తిమరియు తిరుపతి మొదలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలోని ఊర్లకు బస్సులు నడుస్తుంటాయి . అలాగే ఇతర ప్రాంతాలైన ముంబాయి, భివంది, సిరిడి, చంద్రపూరు, గద్చిరోలి, గొండియా, రామ్‌టెక్, అహిరి వంటి మహారాష్ట్రంలోని ఊర్లకు బస్సులను నడుపుతుంటారు. అలాగే కర్నాటక రాష్ట్రంలోని బెంగుళూరుకు వాల్వో బస్సులను నడుపుతుంటారు.

కరీంనగర్ సింగిల్ రైల్వే బ్రాడ్ గేజి లైన్ చేత ఉత్తర తూర్పు రైల్వే (ఢిల్లీ నుండి చెన్నై) 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దపల్లి వద్ద అనుసంధానించబడి ఉంది.
అలాగే కరీంనగర్ నుండి 48 కిలోమీటర్లదూరంలో ఉన్న జగిత్యాల వద్ద ఉత్తర పడమట రైల్వే లైన్‌తో అనుసంధానించబడి ఉంది. ప్రతిరోజు (జగిత్యాల-సిరిపుర్‌కు పుష్-పుల్ పాసింజర్ అప్ అండ్ డౌన్), వారానికి ఒక సారి జగిత్యాల-విజయవాడలకు రైళ్ళను నడుపుతున్నారు. ఈ రైలు ప్రతి మంగళ, గురువారాలలో కరీంనగర్ రైల్వే స్టేషను ద్వారా పోతుంది. గ్రానైట్ రవాణా ద్వారా భారతీయ రైల్వేకు ఆదాయాన్ని సమకూర్చే అతి తక్కువ పట్టణాలలో కరీంనగర్ జిల్లా ఒకటి. అతి సమీపంలోని రైల్వే కూడలి ఖాజీపేట. అక్కడ నుండి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌తో సహా 147 రైళ్ళు ఈ రైలు మార్గం నుండి నడుస్తుంటాయి. ఈ మార్గం గుండా రాజధాని ఎక్స్‌ప్రెస్, ఎ పి ఎక్స్‌ప్రెస్ నడుస్తుంటాయి. 2009లో భారతీయ రైల్వే గుడ్స్- ఫ్రైట్ రవాణా సమయంలో కరీంనగర్ - జగిత్యాల రైల్వే ప్రథమ స్థానంలో ఉంది. భారతప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రణాళికను అనుసరించి, కరీంనగర్ రైల్వే లైన్ల నిర్మాణం పూర్తి అయినట్లైతే, కరీంనగర్ రైల్వే జంక్షన్ తూర్పు- పడమర, ఉత్తర దక్షిణాల రైలు మార్గాను అనుసంధానించే పెద్ద రైల్వే కూడలిగా మారుతుంది.

కరీంనగర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామగుండంలోని బసంత నగర్ కేశోరామ్ సిమెంట్ ఫ్యాక్టరీ  వద్ద ఉన్న విమానాశ్రయం నుండి భారత ప్రభుత్వ సంస్థ ఎయిర్ ఇండియాలో అంతర్భాగంగా ఉన్న వాయుదూత్ విమానాలు నడిపే సమయంలో సర్వీసులు ఉండేవి. వాయుదూత్ విమాన సేవలను నిలిపి వేసిన తరువాత ఈ విమానాశ్రయం వాడుకలో లేదు. 2010 లో ఈ విమానాశ్రయం చాలా ప్రముఖ వ్యక్తుల విమానాలు నిలపడానికి అత్యవసర పరిస్థితిలో ఎయిర్ ఇండియా విమానాలు నిలపడానికి వాడబడుతుంది. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణాలోని రెండవ విమానాశ్రయంగా ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని యోచిస్తుంది. కరీంనగర్‌కు సమీపంలోని ముఖ్య విమానాశ్రయం 162 కిలోమీటర్ల దూరంలో హైద్రాబాదు శివార్లలో గల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం .

కరీంనగర్ జిల్లాలో అత్యధికులు మాట్లాడే భాష తెలుగు. సంప్రదాయవస్త్రాలైన చీర, ధోవతి లే కాకుండా అధునిక వస్త్ర ధారణ కూడా చేస్తుంటారు.

కరీంనగర్ ప్రత్యేకత అయిన బతుకమ్మ పండుగను ఇక్కడి ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంలో బతుకమ్మను అందమైన స్థానికంగా లభించే పూలతో అలకంకరించి సామూహికంగా సాంప్రదాయకమైన గీతనృత్యాలతో స్త్రీలు వేడుక చేసుకుంటారు. ఇతర హిందూ పండుగలైన ఉగాది, శ్రీరామనవమి, వినాయకచవితి, హోలి, శ్రీకృష్ణ జన్మాష్టమి, దసరా, దీపావళి, సంక్రాంతి, మహాశివరాత్రి పండుగలు జరుపుకుంటారు. అలాగే ముస్లిములు రంజాన్, మొహరమ్ వంటి పండుగలు జరుపుకుంటారు. అలాగే క్రైస్తవులు క్రిస్‌మస్, గుడ్‌ఫ్రైడే జరుపుకుంటారు.

కరీంనగర్ జిల్లా ప్రత్యేక ఆహారం పిండివంటలలో సకిలాలు ఒకటి. సాధారణంగా సంక్రాంతి పండుగ సందర్భంలో వీటిని ప్రతి ఇంట చేసుకుంటారు. బియ్యపు పిండి, నువ్వులు కలిపి తయారు చేసిన పిండిని నూనెలో దేవి వీటిని తయారు చేస్తారు.

కరీంనగర్‌లో అత్యధికులు హిందువులు. అయినా ఈ ప్రదేశం భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు గుర్తించతగిన ముస్లిం పాలకుల చేత పాలించబడింది. కరీంనగర్‌లో హిందువుల శాతం 80%, ముస్లిముల శాతం 4%, సిక్కులు 1%. కరీంనగర్ జిల్లా అంతటా అనేక హిందూ ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు ఉన్నాయి. ప్రజలు ప్రతి మతాన్ని గౌరవిస్తూ ఒకరితో ఒకరు సహకారంతో జీవిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ వాయవ్యదిశలో ఉన్న విద్యావిషయ ప్రధాన కేంద్రాలలో కరీంనగర్ ఒకటి. కరీంనగర్ అనేక మేధావులను, రాజకీయ నాయకులను, కవులను, సాంకేతిక నిపుణులను పలు దశాబ్ధాలుగా తయారు చేసింది. ప్రధానమంత్రిగా సేవలందించిన పి. వి. నరసింహారావు వారిలో ఒకరు.

కరీనగర్ జిల్లాలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు.

కరీంనగర్ జిల్లాలో అనేక విధాల పర్యాటకుల ఆకర్షించే అనేక పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. వీటిలో అతి ప్రధానమైనవి క్రింద వర్ణించ బడ్డాయి.

చొప్పదండి శివకేశవాలయంఎక్కడా లేని విధంగా శివుడు విష్ణువు ముఖద్వారం ఎదురెదురుగా ఉంటాయి  
చొప్పదండి సరస్వతి ఆలయంనిర్మాణంలో ఉంది

కరీంనగర్ జిల్లాలో సున్నితమైన లోహకళ అయినటువంటి వెండి నగిషీ పనిలో (సిల్వర్ పిలిగ్రి) నాణ్యమైంది.వెండి తీగతో అపురూప కళాఖండాలను సృష్టించే ఈ కళకు కరీంనగర్‌ ప్రసిద్ధి .

కరీంనగర్ జిల్లాలో కరీంనగర్‌కు 10 కిలోమీటర్ల దూరంలో కామారెడ్డి రోడ్డు మార్గంలో మానేరు నదీతీరంలో తాటిచెట్ల మధ్య సుందర ప్రకృతిక నేపథ్యంలో ఎల్గండల్ కోట నిర్మించబడి ఉంది. చారిత్రకంగా ఈ ప్రదేశం అయిదు సామ్రాజ్యాల చేత పాలించబడింది. పురాతన జ్ఞాపక చిహ్నాలు కొండశిఖరాన ఉన్న కోట, తూర్పు ద్వారానికి వెలుపల ఉన్న బృందావన సరసు 1774 ఎ డి ఫాఫర్ -ఉద్ - దౌలా చేత నిర్మించబడింది. ముస్లిమ్ సన్యాసులైన సైయద్ షాహ్ మునావర్ క్వాద్రి సాహెబ్, దూలా షాహ్ సాహెబ్, సయద్ మరూఫ్ సాహెబ్, షాహ్ తాలిబ్ బిస్మిల్లా సాహెబ్, వాలి హైదర్ సాహెబ్ సమాధులు కదిలించినప్పుడు అక్కడ ఉన్న మినార్లు ఉఉగుతాయి. ఉన్నత పాఠశాల వద్ద మరోరెండు మీనార్లు ఉన్నాయి. ఈ మీనార్లు ఎక్కడానికి లోపలి నుండి మెట్లు ఉన్నాయి.

కరీంనగర్ జిల్లా ఆకర్షణలలో ఉజ్వలా పార్కు ఒకటి. 2001లో ఈ పార్క్‌కు ప్రారంభోత్సవం జరిగింది. పొన్నం ప్రభకర్ పర్యవెక్ష్నలో ఉంధి ప్రకృతి మనోహరమైన వాతావరణంలో ఉన్న ఈ పార్క్‌ను సందర్శించడానికి కరీంనగర్ నుండి పర్యాటకులు అధికంగా వస్తుంటారు. కరీంనగర్ పర్యాటకులు అధికంగా సందర్శించే ప్రదేశం ఇది.

దిగువ మానేరు రిజర్వాయర్ 1974లో ప్రారంభించబడి 1985లో నిర్మాణపు పనులు పూర్తి చేయబడ్డాయి. వర్షాకాలంలో ఈ రిజర్వాయర్ నీటి మట్టం అత్యధికంగా పెరుగుతుంది.

దిగువ మానేర్ రిజర్వాయర్ సమీపంలో ఉన్న 30 ఎకరాల వైశాల్యంలో రాజీవ్ డీర్ పార్కు  కరీంనగర్ పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ఇది కరీంనగర్ శివార్లలో ఉంది. 

కరీంనగర్ పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేములవాడలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరీ ఆలయం హిందువులను విశేషంగా ఆకర్షించే అధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతుంది. ఈ దేవాలయ కూడలికి అనేక మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు.

కరీంనగర్ జిల్లాలోని ధర్మపురిలో హిందూ ఆలయాలకు ప్రసిద్ధి. ఇక్కడ విష్ణుమూర్తి అవతారలలో ఒకటి అయిన నరసింహస్వామి ఆలయం, దక్షిణామూర్తితో ఉన్న శివాలయం, ఏక శిలలో చెక్కబడిన వినాయకుడు, సప్త మాతృకల శిల్పాలు, మహిషాసుర మర్ధిని అరవై స్తంభాలు కలిగిన ఆలయంలో ఉన్నారు, 5 వందల సంవత్సరాల పూర్వపు శ్రీ సీతారామ ఆలయం, అక్కాపల్లే రాజన్న మొదలైన పవిత్రక్షేత్రాలు ఈ జిల్లాను అధ్యాత్మిక సుసంపన్నం చేస్తున్నాయి.

కరీంనగర్ 35 కిలోమీటర్లదూరంలో ఉన్న కొండగట్టు వద్ద ఉన్న ఆంజనేయుడి ఆలయం ఉంది. ఈ ఆలయం 300 సంవత్సరాల క్రితం ఒక కౌహర్డ్ చేత నిర్మించబడినదని భావిస్తున్నారు. 160 సంవత్సరాల క్రితం తిరిగి ఈ ఆలయం కృష్ణారావ్ దేశ్‌ముఖ్ గారి చేత పునరుద్ధరణ చేయబడింది. ఈ ఆలయంలో 40 రోజుల దీక్ష వహించి పూజ చేసిన స్త్రీ మాతృమూర్తి ఔతుందని విశ్వసిస్తున్నారు. వేములవాడకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం కరీంనగర్‌ జిల్లాలో ప్రాముఖ్యత కలిగిన ఆలయాలలో ఒకటి.

కరీంనగర్కు 60 కిలోమీటర్లదూరంలో ఉన్న ఎల్లారెడ్డిపేటలో పూర్వం రాజులు నివసించిన రాజ భవనం, ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలగా రూపుదిద్దుకుంది. ఈ పాఠశాల నుండి దక్షిణన ఉన్న జక్కుల చెరువుకు మధ్యలో ఒక సొరంగం ఉంది. అలాగే ఊరికి తూర్పున శ్రీ రేణుఖామాత ఆలయం ఉంది. ఆ దేవత ఊరి జనాలకు అండగా ఉండి అందరి బాధలను తీరుస్తూ నిత్యపూజలతో కొలువబడుతుంది.

వరంగల్ జిల్లా కేంద్రానికి 43 కిలోమీటర్ల దూరంలో వరంగల్ అర్బన్ కరీంనగర్ జిల్లా ల సరిహద్దుల్లో సైదాపురం దట్టమైన పచ్చని అటవీ ప్రాంతంలోని కొండకోనల నుంచి హోరెత్తే నీటి హొయల నిండైన జలపాతం ఇది. 170 అడుగుల ఎత్తులో నుండి కిందికి దూకుతున్న ఈ జలపాతం చుట్టుప్రక్కల ప్రాంతంలోని ఈ సుందర ప్రదేశం పర్యాటకులకు, ప్రకృతి ప్రేమికులకు కనులవిందును కలిగిస్తుంది.

ధూళికట్ట, పడుకాపూర్ బౌద్ధక్షేత్రాలు కూడా పరిఢవిల్లాయి.

కరీంనగర్ జిల్లా అనేక క్రీడా సౌలభ్యాలు ఉన్నాయి. జాతీయ అంతర్జాతీయ స్థాయి వివిధ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. 




#Article 128: చిత్తూరు (369 words)


చిత్తూరు, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక నగరం. ఆంధ్రప్రదేశ్ కు దక్షిణాన, పెన్నానదిలోయలో, బెంగుళూరు-చెన్నై రహదారి మీద ఉంది.చిత్తూరు ద్రవిడ ప్రాంతం.ఇక్కడ తెలుగు, తమిళం, కన్నడ భాషలు మాట్లాడుతారు. ఈ జిల్లా మూడు రాష్ట్రాల సరిహద్దులలో ఉంది.ఇది ధాన్యము, చెరకు, మామిడి, వేరుశనగలకు వ్యాపార కేంద్రము. ఇక్కడ నూనెగింజలు, బియ్యం మిల్లింగ్‌ పరిశ్రమలు ఉన్నాయి.

జనాభా 252,654 (2001 గణాంకాలు).

గతంలో ఈ ఊరి పేరు చిట్ర ఊర్ అని అరవంలో అనేవారు. అది ఆనాడు తమిళ దేసములో ఒక భాగము. చిట్ర అంటే చిన్నది, అనీ, ఊర్ అనగా గ్రామం అని అర్థము. ఆ పేరు కాలక్రమములో చిత్తూరుగా మార్పు చెందిందని వేంపల్లి గంగాధరం తన రాయలసీమ కథాసాహిత్యం    ఒక పరిశీలన  అనే సిద్ధాంత గ్రంథంలో వ్రాశారు. తమిళనాడులోని ఈ ప్రాంతము తర్వాతి కాలములో జిల్లాగా ఏర్పడి (1911) ఆంధ్ర ప్రదేశ్ లో కలిసింది.

బెంగుళూరు-చెన్నై రహదారి మీద ఉంది. ఇక్కడ పాకాల - కాట్పాడి రైలు మార్గములో చిత్తూరు రైల్వే స్టేషను ఉంది. ఇక్కడినుండి చెన్నై, బెంగుళూరు, హైదరాబాదుకు మంచి రవాణా సౌకర్యము ఉంది.

చిత్తూరు పట్టణంలో అనేక విద్యాలయాలున్నాయి. వాటిలో కొన్ని :
ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలలు :

పట్టణంలో మంచి వైద్య సదుపాయములు గలవు, ఒక ప్రభుత్వ ఆసుపత్రి, 10 ప్రైవెటు ఆసుపత్రులు కూడా ఉన్నాయి.

వినోదం కొరకు సినిమా టాకీసులు ఉన్నాయి.

ఆర్ధికంగా చెప్పుకోదగ్గ పరిశ్రమలు లేవుకాని చుట్టుప్రక్కల పంటలకు మార్కెట్ యార్డ్ గా ఉంది

రైతులు ప్రధానముగా ధాన్యము, చెరకు, మామిడి, వేరుశనగ ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు.

చిత్తూరు పట్టణం జిల్లాలో వ్యాపారంనకు కేంద్రముగా ఉంది. ఇక్కడి వ్యాపారస్తులు బెంగుళూరు - చెన్నై దగ్గరగా ఉన్నందున అక్కడనుండి సరుకులు దిగుమతి, ఇక్కడి నుండి ఆక్కడికి సరుకులు ఎగుమతి చేసుకుంటారు. ముఖ్యంగా బెల్లము, మామిడి కాయల ఎగుమతికి చిత్తూరు పేరు గాంచింది.

కాణిపాక గణపతి :చిత్తూరుకు దగ్గరలో 10 కి.మీ దూరమున స్వయంభువుగా వెలసిన కాణిపాక గణపతి గుడి ఉంది. చిత్తూరు నుండి ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు కలదు . ఇక్కడ అసత్యప్రమాణాలు చెయడానికి భక్తులు జంకుతారు, ఇక్కడ అపద్దపు ప్రమాణం చెసినవారికి ఏదోఒక కీడు జరుగుతుంది అని భక్తుల నమ్మకం. అందుకే ఈయనను సత్యప్రమాణాల కాణిపాక గణపతిగా పిలుస్తారు. ఏదైనా కార్యము మొదలుపెట్టినప్పుడు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే ఆ కార్యము విఘ్నములు లేకుండా సాఫీగా సాగుతుంది అని ప్రజల నమ్మకం. ఇక్కడ స్వామి వారు దినదినమూ పెరుగుతూ ఉంటారు దానికి సాక్షాలు చాలా ఉన్నాయి.

అర్ధగిరి వీరాంజనేయ స్వామి : చిత్తూరుకు దగ్గరలో 20 కి.మీ దూరమున అరగొండ ఊరిలో అర్ధగిరి వీరాంజనేయ స్వామి గుడి ఉంది ఇక్కడ పుష్కరిణిలోని నీటికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. తటాకము లోని నీరు ఎన్ని సంవత్సరాలు అయిన చెడిపోవు. ఇక్కడి మట్టిని మండలం రోజులు పాటు శరీరానికి రాసుకొని స్నానం చేస్తే చర్మ వ్యాధులు దరిచేరవని, ఉన్న చర్మ వ్యాధులు పొతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ ప్రతి పున్నమి నాడు ఓంకార నాదం వినబడుతుందని భక్తులు చెపుతుంటారు.

మొగిలి : చిత్తూరుకు 20 కి.మీ. దూరంలో మొగిలీశ్వరాలయం ఉంది ఇక్కడ ఈశ్వరుడు ప్రధాన ఆలయ గర్భగుడిలో వెలసి ఉన్నాడు. ఇక్కడ ఉన్న నందీశ్వరుడి నోటిలో నుంచి ప్రతీ క్షణము నీరు వస్తుంటుంది. ఈఆలయం చిత్తూరు - బెంగుళూరు రహదారిలో ఉంది.

జిల్లా కేంద్రమైనందున, జిల్లా అధికారుల కార్యాలయాలన్నీ చిత్తూరులో ఉన్నాయి.జిల్లాలో 4 రెవిన్యూ డివిజన్లు ఉన్నాయి.. చిత్తూరు నుండి చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.




#Article 129: అనంతపురం జిల్లా (711 words)


అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాల్లో విస్తీర్ణంలో అతి పెద్దది, అనంతపురం జిల్లా 1882లో బళ్లారి జిల్లా నుండి విడదీసి ఏర్పాటు చేసారు. ఈ ప్రాంతంలోని వ్యవసాయం ప్రధానంగా వర్షాధారితం. ఇక్కడ పండించే ముఖ్య పంటలు వేరుశనగ, వరి, పత్తి, జొన్న, మిర్చి, నువ్వులు, చెరుకు. పట్టు, సున్నపురాయి, ఇనుము, వజ్రాల త్రవ్వకం ముఖ్యమైన పరిశ్రమలు 

అనంతపురం చరిత్ర విజయనగర సామ్రాజ్యం ఆరంభంతో మొదలైంది. ఈ నగరానికి కర్ణాటకకు చెందిన వడియార్ వంశమునకు చెందిన అనంతరసు అనే రాజు పేరు మీద అనంతపురము అనే పేరు వచ్చింది. అంతకు ఎంతో కాలం ముందు విజయనగర సామ్రాజ్య సంస్థాపకులైన హరిహరరాయలు బుక్కరాయలలోని బుక్కరాయల పేరు మీదుగా ఇక్కడ ఒక చెరువు త్రవ్వించిన కారణంగా బుక్కరాయసముద్రం అను పట్టణం ఏర్పడింది. 

జిల్లా విస్తీర్ణం: 18,231 చదరపు కిలో మీటర్లు: శాసనసభ నియోజక వర్గాలు: 14, లోక్ సభ నియోజిక వర్గాలు: 2,

మొట్టమొదటగా ఈ ప్రదేశాన్ని అశోకుడు పాలించాడని తెలుస్తుంది. క్రీ.పూ.258 ప్రాంతంలో అశోకుడు ఈ ప్రాంతాన్ని పాలించినట్టు తెలుస్తుంది. అశోకుడి తర్వాత నలలు ఏడవ శతాబ్దం ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని మడకశిర తాలూకాలోని రత్నగిరి నుండి పాలించారు. ఆ తరువాత నొలంబులు అనంతపురం జిల్లాని తమ స్వాధీనం లోకి తెచ్చుకున్నారు. ఈ నొలంబులు పల్లవుల తెగకు చెందిన వారు. బళ్ళారి జిల్లా నుండి పాలిస్తున్న రాష్ట్రకూటులకు వీరు సామంతులు. గుత్తి వరకు వీరి రాజ్యం వ్యాపించి ఉందని తెలుస్తోంది.

పదవ శతాబ్దంలో నొలంబులను జయించి అనంతపురం జిల్లాను గంగరాజులు స్వాధీనం చేసుకున్నారు. అమరసింహుడు వీరిలో ముఖ్యుడు. ఆపై తంజావూరు నుండి చోళులు వచ్చి వీళ్ళని జయించారు. పదవ శతాబ్దం నుండి పదకొండవ శతాబ్దం నడుమ పశ్చిమ చాళుక్యులు నైజాములోని కళ్యాణి నుండి ఈ ప్రాంతాన్ని పాలించారు. ఆపై హోయసలులు, యాదవులు మొదలగు వారి తరువాతి శతాబ్ద కాలం ఈ జిల్లాను పాలించారు.

తర్వాత ఢిల్లీ నుండి పరిపాలన చేస్తున్న అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ దేశంపై దండయాత్ర చేసాడు. అతని సేనాధిపతి మాలిక్ కాఫర్ వచ్చి హోసలులను, యాదవులను తరిమివేసాడు. 1310లో నైజాం రాజ్యంలో ఉన్న ఓరుగల్లులోని ద్వారసముద్రాన్ని కొల్లగొట్టి స్వాధీనం చేసుకున్నాక ప్రతాపరుద్రుడ్ని ఖైదీగా చేసి పట్టుకుపోయారు. ప్రతాపరుద్రుని ధనాగారంనకు కాపలాగా ఉన్న హరిహరరాయలు, బుక్కరాయలు లను కూడా బంధించి తీసుకుపోగా సుల్తాను వారిని కొంత సైన్యమిచ్చి తిరిగి కర్నాటక రాజ్యమునకు పంపివేసాడు. అలా తిరిగి వచ్చిన హరిహరబుక్కరాయలిరువురు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. 1258 నుండి పదహారో శతాబ్దం వరకూ విజయనగరాధీశుల పాలనలో ఈ జిల్లా ఉంది.

అనంతపురం జిల్లాకు ఉత్తరాన కర్నూలు జిల్లా, తూర్పున వైఎస్ఆర్ జిల్లా,కడప, ఆగ్నేయమున చిత్తూరు జిల్లా, పశ్చిమాన, నైఋతిన కర్ణాటక రాష్ట్రము సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లాకు ఉత్తరాన మధ్యభాగంలో పెద్ద పెద్ద నాపరాళ్ళ మయమైన ఎత్తైన మెలికలు తిరిగిన పీఠభూమి లేదా చిన్న పర్వతశ్రేణులతో నిండిఉన్నది. దక్షిణ భాగం ఎత్తైన కొండలమయమై ఇక్కడ పీఠభూమి సముద్రమట్టమునకు 2600 అడుగుల ఎత్తుకు చేరుకొనును. పెన్నా, చిత్రావతి, వేదవతి, పాపాఘ్ని, స్వర్ణముఖి, తడకలూరు మొదలైన ఆరు నదులు జిల్లా గుండా ప్రవహిస్తున్నాయి. జిల్లాలో సంవత్సరానికి 381 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం కురుస్తుంది. రాజస్థాన్ లోని జైసల్మేరు తరువాత దేశంలో అత్యల్ప వర్షపాతం కలిగిన జిల్లా ఇది.

భౌగోళికంగా జిల్లాను 5 రెవెన్యూ డివిజన్లుగాను,63 మండలాలుగా విభజించారు.

 

జాతీయ రహదారులు యన్.హెచ్. 44, యన్.హెచ్ 43, అనంతపురం గుండా పోతున్నాయి. అనంతపురం నుండి హైదరాబాదు, బెంగుళూరు,ముంబాయి, న్యూ ఢిల్లీ,అహ్మదాబాద్, ఆదోని, జైపూర్, భువనేశ్వర్, పూనా, విశాఖపట్నం, చెన్నై మొదలైన నగరాలకు నేరుగా రైళ్ళు ఉన్నాయి. అనంతపూరుకు దక్షిణంగా 80 కిలోమీటర్ల దూరంలో పుట్టపర్తి విమానాశ్రయం ఉంది. అలాగే 168 కిలోమీటర్ల దూరంలో బెంగుళూరు లోని దేవనహళ్ళి వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. దక్షిణ మధ్య రైల్వేలో 3 వ పెద్ద డివిజన్ గుంతకల్లు ఇదే జిల్లాలో ఉంది.ఇక్కడినుండి ప్రతి రోజు వేల సంఖ్యలో ప్రయాణిస్తూంటారు. ముంబై-చెన్నై ప్రధాన రైలు మార్గం గుంతకల్లు డివిజన్ గుండా వెళ్తుంది. అంతే కాకుండా గుంతకల్లు రైల్వే స్టేషను నుండి నాలుగు ప్రధాన రైలు మార్గాల ద్వారా ప్రయాణికుల రైళ్ళు వెళతాయి. దక్షిణ మధ్య రైల్వేలో ఎక్కువ ఆదాయం వచ్చే డివిజన్ గా గుంతకల్లుకు మంచి పేరు ఉంది. అనంతపురం నుండి గుంతకల్లు 85 కిలోమీటర్ల దూరంలో ఉంది.

అనంతపురం జిల్లా ప్రస్తుతం కరువు జిల్లాగా ప్రసిద్ధి చెందినప్పటికీ రాయల వారి కాలంలో సకల సంపదలతో విరాజిల్లింది.

అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ కు దక్షిణ భాగాన వ్యాపించి ఉంది. జిల్లా 14-40, 15-15 ఉత్తర అక్షాంశాలు, 76-50, 78-31 తూర్పు రేఖాంశాల మద్య విస్తరించి ఉంది.

అనంతపురం లోని గవర్న్‌మెంట్ ఆర్ట్స్ కాలేజిని 1916లో స్థాపించారు.సర్వేపల్లి రాధాకృష్ణన్, నీలం సంజీవరెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కరరెడ్డి వంటి వ్యక్తులు ఈ కాలేజీలో చదివారు. 
 

అనంతపురం జిల్లా లోని పర్యాటక ఆకర్షణల్లో

అనంతపురం జిల్లాలో క్రీడలకు అధికమైన వసతులు ఉన్నాయి. 1963-1964 లో ఇరానీ కప్పుకు ఆతిధ్యం ఇచ్చి క్రీడలను నిర్వహించింది. సంజీవరెడ్డి స్టేడియంలో జరిగిన రంజీ ట్రోఫీలో విజేతలైన ముంబాయి జట్టుకు ఎదురుగా ఆడిన రెస్టాఫ్ ఇండియా అతి తక్కువ స్కోరు 83 మాత్రమే చేసింది. అలాగే పలు బాస్కెట్ బాల్, బ్యాట్మింటన్ రంజీ ట్రోఫీ క్రీడలు రంజీ ట్రోఫీ టోర్నమెంట్స్‌కు అనంతపురం ఆతిథ్యం ఇచ్చింది. స్పెయిన్ దేశ టెన్నిస్ క్రీడాకారుడైన రఫేల్ నాడల్ అనంతపురం లోని స్పోర్ట్స్ విల్లేజ్ లో నాడల్ టెన్నిస్ పాఠశాలను (ఎన్ టి ఎస్) స్థాపించాడు. ఇలాంటి పాఠశాల ప్రపంచంలో ఇదే మొదటిది.

ది అనంతపుర్ స్పోర్ట్స్ విలేజ్ (ఎ ఎస్ వి) జాతీయ రహదారి 7 పక్కగా ఉంది. ఇక్కడ ప్రధాన క్రీడా లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన సదుపాయాలు ఉన్నాయి. 40 ఎకరాలలో ఏర్పాటు చేసిన అనంతపురం క్రికెట్ గ్రౌండ్ అనంతపురంలో ఉంది.

అనంతపురం సంవత్సరమంతా వేడి, పొడి వాతావరణం కలిగి ఉంటుంది. ఫిబ్రవరి చివరలో మొదలైయ్యే వేసవి, మే మాసానికి తీవ్రస్థాయికి చేరుకుంటుంది. సరాసరి ఉష్ణోగ్రత 37° సెల్సియస్ ఉంటుంది. అనంతపురంలో కేరళ నుండి వీచే నైరుతీ ఋతుపవనాల ద్వారా ముందుగానే వర్షాలు మొదలౌతాయి. సెప్టెంబరులో ఆరంభం అయ్యే వర్షాలు నవంబరు ఆరంభం వరకు ఉంటాయి. సరాసరి వర్షపాతం 250 మిల్లీ మీటర్లు ఉంటుంది. నవంబరు చివరిలో ఆరంభం అయ్యే శీతాకాలం ఫిబ్రవరి ఆరంభం వరకు కొనసాగుతుంది. శీతాకాల సరాసరి ఉష్ణోగ్రత 22-23°సెల్సియస్ ఉంటుంది. అనంతపురం సందర్శించడానికి ఇది అనువైన కాలం. సంవత్సర సరాసరి వర్షపాతం 560 మి.మీ.

ఒకప్పుడు పాడి పంటలతో కళకళ లాడిన అనంతపురం ఇప్పుడు నిత్యం కరువు కాటకాలతో సతమతమౌతోంది. జిల్లాలో అధిక విస్తీర్ణం సాగు వర్షాధారం. ఇక్కడ వేరుసెనగ సాగు చేస్తారు.ఏళ్ళు గడచినా ఇక్కడ ప్రజల జీవన విధానంలో పెద్దగా మార్పు లేదు. ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చేందుకు గ్రామీణ అభివృద్ధి సేవా సంస్థ చాలా ఏళ్ళుగా కృషి చేస్తోంది.




#Article 130: వైఎస్‌ఆర్ జిల్లా (848 words)


కడపజిల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతానికి చెందిన జిల్లా. సుప్రసిద్ధ వాగ్గేయకారుడు, సంకీర్తనాచార్యుడయిన అన్నమయ్య, ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన, తెలుగు జాతీయ కవి వేమన, తొలి తెలుగు కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క, మరో ప్రసిద్ధ కవయిత్రి మొల్ల, మహోన్నతమైన యోగి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, అయ్యలరాజు రామభద్రుడు ఈ జిల్లాకు చెందినవారే. ప్రపంచ ప్రఖ్యాత సురభి నాటక సమాజం ప్రస్థానం 1885లో కడప జిల్లా సురభి గ్రామంలో 'కీచక వధ' నాటక ప్రదర్శనతో మొదలయ్యింది. ఈ సమాజ వ్యవస్థాపకుడు వనారస గోవిందరావు. ఈ జిల్లా బెరైటీస్ (ముగ్గురాయి) గనులు, బండలకు ప్రసిద్ధి చెందింది.పూర్వం ఈ జిల్లాకు హిరణ్యదేశంని పేరు ఉంది. ఈ ప్రదేశం పల్లవులు, తెలుగు చోళులు, కాకతీయులు, విజయనగర రాజులు, గండికోట పెమ్మసాని నాయకులు, నిజాం నవాబులు, సిద్ధవటం నుంచి పరిపాలించిన మట్లి రాజులు, కడప నవాబులచే పరిపాలించ బడింది. 

కడప జిల్లాచరిత్ర చాలా ప్రాచీనమైంది. క్రీ.పూ. 274-236 ప్రాంతంలో అశోక చక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించాడు. ఆ తరువాత శాతవాహనులు పాలించారు. శాతవాహనుల నాణేలు పెద్దముడియం, దానవులపాడు గ్రామాల్లో దొరికాయి. క్రీ.శ. 250-450 ప్రాంతంలో పల్లవరాజులు పాలించారు. ఇంకా రాష్ట్రకూటులు, చోళులు, కళ్యాణి చాళుక్యులు, వైదుంబులు, కాకతీయులు మొదలైన రాజవంశాలు ఈ ప్రాంతాన్ని పాలించాయి. క్రీ.శ. 1336-1565 కాలంలో విలసిల్లిన విజయనగర సామ్రాజ్యంలో వైఎస్ఆర్ కడప జిల్లా ఒక భాగం. గండికోటను పాలించిన పెమ్మసాని నాయకులు విజయనగర రాజులకు సామంతులుగా విధేయులై పేరుప్రఖ్యాతులు పొందారు. నంద్యాల రాజులు, మట్లి రాజులు కూడా ఈ ప్రాంతం మీద పెత్తనం సాగించారు. విజయనగర పతనం తర్వాత గోల్కొండ నవాబులు, బీజాపూరు సుల్తానులు, ఔరంగజేబు మొదలైన మహమ్మదీయ రాజులు పాలించారు. క్రీ.శ. 1710 ప్రాంతంలో అబ్దుల్ నబీ ఖాన్ కడపలో కోటను నిర్మించాడు. నవాబుల తర్వాత పాళెగాళ్ళు విజృంభించారు.ఆ తరువాత ఈస్టిండియా కంపెనీ ఈ ప్రాంతం మీద ఆధిపత్యం వహించింది. సర్ థామస్ మన్రో వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టరుగా పనిచేశాడు. పాలెగాళ్ళను అణచాడు. రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు.ఈ ప్రాంతపు అభివృద్ధికి బ్రిటీసు ప్రభుత్వంలో కొంతవరకు అభివృద్ధికి కృషి జరిగినట్లు భావించవచ్చు.మన్రో ఈ ప్రాంతపు దేవాలయాల అభివృద్ధికి మడిమాన్యాలిచ్చాడు. సి.పి.బ్రౌన్ తెలుగు భాషను సముద్ధరించాడు. మనుచరిత్ర, వసుచరిత్ర వంటి తెలుగు కావ్యాలను ముద్రించాడు. మూడు వేలకు పైగా వేమన పద్యాలను సేకరించాడు. వాటిని ఇంగ్లీషులోకి అనువదించి అచ్చు వేయించాడు. ఇక కోలిన్ మెకంజీ గ్రామాల చరిత్రను సేకరించి కైఫీయతుల పేరుతో భద్రపరిచాడు.2010 జూలై 8 నుండి ఈ జిల్లా పేరును ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వై.ఎస్.ఆర్ కడప జిల్లాగా మార్చింది.రాయలసీమలోని నాలుగు జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నడిబొడ్డైన కడపలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అనేక ప్రాంతీయ, కేంద్ర కార్యాలయాలు ఉన్నాయి.

తూర్పున నెల్లూరు జిల్లా, పశ్చిమాన అనంతపురం జిల్లా, దక్షిణాన చిత్తూరు జిల్లా, ఉత్తరాన కర్నూలు జిల్లా,ప్రకాశం జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.కొండప్రాంతం, నైసర్గికంగా పీఠభూమి, నల్లనేల భాగాలుగా చెప్పుకోవచ్చు. శేషాచలం కొండలు ఈ జిల్లాలో విస్తారంగా వ్యాపించి ఉన్నాయి. వాటిని పాలకొండలని, నల్లమల కొండలని, వెలికొండలని, ఎర్రమల కొండలని పిలుస్తారు. జిల్లాలో నల్లరేగడి, ఎర్రరేగడి, ఇసకపొర నేలలు ఉన్నాయి.

ఉష్ణోగ్రతలు వేసవికాలంలో 30°సె. - 44°సె, చలికాలంలో 21°సె. - 30°సెగా వుంటాయి. సగటు వర్షపాతము: 695 మి.మీ

పెన్న, చిత్రావతి, కుందేరు, పాపాఘ్ని, సగిలేరు, చెయ్యేరు జిల్లాలో ప్రవహించే ప్రధాన నదులు.

అడవుల విస్తీర్ణం 4,96,672 హెక్టార్లు, జిల్లా విస్తీర్ణంలో 32.3 శాతం అన్నమాట.పులివెందుల మండలంలో తప్ప నల్లచేవ, ఎర్రచేవ,ఎపి మొదలైన కలప జాతులు, విదేశీమారకం తెచ్చిపెట్టే ఎర్రచందనము లభ్యమవుతుంది. ప్రపంచంలో మరెక్కడా కనిపించకుండా ఆంతరించి పోయిందనుకున్న కలివికోడి ఇక్కడి శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో కనిపించింది. సింహాలు, చిరుతపులులు, మెదలయిన వన్యప్రాణులు ఈ అడవులలో నివసిస్తున్నాయి.

తుంగభద్ర నది మీద సుంకేశుల ఆనకట్ట వద్ద మొదలై కర్నూలు కడప కాలువ కడప, కర్నూలు జిల్లాల ద్వారా ప్రవహిస్తూ నాలుగు వేల హెక్టార్ల సాగుభూమికి నీటిని సమకూరుస్తుంది. సాగునీటి పారుదల కొరకు హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు, పులివెందల కాలువ నిర్మాణంలో ఉన్నాయి. బుగ్గవంక నది మీద ఇప్పపెంట గ్రామం వద్ద పుల్లల మడుగు జలాశ్రయం నిర్మించబడింది. గాలేరు-నగరి సుజల స్రవంతి కాలువ, జిల్లాలో త్రాగునీటికి ముఖ్య ఆధారము. మాధవరం చేనేత పరిశ్రమ జిల్లాకు ఆదాయం తెచ్చిపెట్టే ఒక ముఖ్య ఆధారం.

వరి, సజ్జ, జొన్న, రాగి వంటి ఆహార ధాన్యాలు, మామిడి, చీనీ, బొప్పాయి వంటి పండ్ల తోటలు, చెఱకు, పసుపు వంటి వాణిజ్య పంటలు పండుతున్నాయి. చెన్నూరు తమలపాకులు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. మైదుకూరు ప్రాంతంలో పండే కె.పి.ఉల్లి విదేశాలకు ఎగుమతి అవుతుంది. కృష్ణాపురం గ్రామం పేరు మీదుగా ఆ వంగడానికి ఆ పేరు వచ్చింది.

జిల్లాలో పెన్నానది, కె.సి.కాలువ ప్రధానమైన నీటి వనరులు. జిల్లా మొత్తంలో కాలువల క్రింద 24 వేల హెక్టార్లు, చెరువుల క్రింద 22 వేల హెక్టార్లు, బావుల క్రింద 66 వేల హెక్టార్లు తక్కిన వనరుల క్రింద 11 వేల హెక్టార్లు సాగులో ఉన్నాయి.ఊటుకూరులో వ్యవసాయ పరిశోధనా కేంద్రము, కృషి విజ్ఞాన కేంద్రం, అనంత రాజపేటలో పండ్ల పరిశోధన కేంద్రం, మైదుకూరులో జాతీయ ఉద్యనవనాల పరిశోధనాభివృద్ధి సంస్థ ఉన్నాయి.

వైఎస్ఆర్ జిల్లాలో ప్రపంచంలో మరెక్కడా లభించనంత ముగ్గురాయి (బెరైటీస్) మంగంపేట గనుల్లో లభిస్తోంది.పులివెందుల ప్రాంతంలో రాతినార తీస్తున్నారు.నాప రాళ్ళకు కడప పెట్టింది పేరు. పులివెందుల నియోజకవర్గంలో యురేనియం నిక్షేపాలను కనుగొన్నారు. వేముల మండలంలోని తుమ్మలపల్లె గ్రామంలో యురేనియం శుద్ధి కర్మాగారం ఉంది. యర్రగుంట్ల ప్రాంతంలో సిమెంటు పరిశ్రమ, విస్తరిస్తోంది. జమ్మలమడుగులో ఉక్కు కర్మాగారం నిర్మాణంలో ఉంది. ముద్దనూరు దగ్గర ఏర్పాటైన ఆర్.టి.పి.పి. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు మెగాపవర్ ప్రాజెక్టు.కడప ప్రొద్దుటూరులో పారిశ్రామిక వాడలున్నాయి. రాయలసీమ అభివృద్ధి పథకం కింద కడపలో చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ నెలకొల్పడం జరిగింది.

మొత్తం 896 గ్రామాలు 644 గ్రామ పంచాయితీల, 51 మండలాల, మూడు రెవిన్యూ డివిజన్ల పరిధిలో ఉన్నాయి. జిల్లాలో కడప నగరపాలకసంస్థ, ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, రాజంపేట, రాయచోటి పురపాలక సంస్థలు.

బ్రిటిష్ కాలంలో ఏర్పాటైన కడప విమానాశ్రయం 1990 దశకంలో మూతపడింది. 2014 లో దీనిని ప్రారంభించారు. దేశంలోని అతి ప్రధానమైన రైలు మార్గాల్లో ఒకటిగా 1854-1866 మధ్య కాలంలో వేయబడిన ముంబై-చెన్నై రైలు మార్గం ఈ జిల్లాలో ఉన్న ఏకైక రైలు మార్గం. రైల్వే కొండాపురం, ముద్దనూరు, ఎర్రగుంట్ల, కమలాపురం, కడప, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, రైల్వే కోడూరు ఈ జిల్లాలో ఈ రైలు మార్గం కలిపే ముఖ్య పట్టణాలు. ముఖ్య వాణిజ్య పట్టణమైన ప్రొద్దుటూరు మీదుగా ఎర్రగుంట్ల-నంద్యాల రైలు మార్గం నిర్మాణ దశలో ఉంది. కడప-నెల్లూరు, కడప-బెంగుళూరు రైలు మార్గాలు వెయ్యాలనే ప్రతి పాదనలు ఉన్నాయి. కర్నూలు-కడప-చిత్తూరు పట్టణాలను కలిపే 18వ నంబరు జాతీయ రహదారి, కడప-చెన్నై, కడప-బెంగుళూరు రాష్ట్ర రహదారులు. నెల్లూరు-బళ్ళారిలను కలిపే మరో ముఖ్యమైన రహదారి మైదుకూరు మీదుగా వెళ్తుంది.

లంకమల్లేశ్వరములో శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణాలయం, రాజంపేటలో శ్రీ వేంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణాలయం ఉన్నాయి.

కడపలో యోగి వేమన విశ్వవిద్యాలయం, రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ, కడప  వైద్య కళాశాల ముఖ్యమైనవి. ఇవి కాక పులివెందులలో జె.ఎన్.టి.యు కడప. (జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం) ఇంజినీరింగ్ కళాశాల, కడపలో క్రీడా పాఠశాల, ప్రభుత్వ హోమియో కళాశాల ఉన్నాయి. ఇక కడపలో సి.పి.బ్రౌన్ నివసించిన బంగళాలో ఆయన పేరిట నెలకొల్పిన బ్రౌన్ గ్రంథాలయం ప్రస్తుతం యోగి వేమన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా భాషా సాహిత్య పరిశోధనా కేంద్రంగా పనిచేస్తోంది.

ధార్మిక వ్యవస్థకు పునాదులైన ఎన్నో దేవాలయాలు, క్షేత్రాలు, తీర్థాలు ఈ జిల్లాలో ఉన్నాయి. రాజులు, రాజ్యాలు అంతరించినా ఆనాటి చరిత్రకు గుర్తులుగా 
చాంద్ పీరా గుంబద్, గండికోట దుర్గం, గండికోట, సిద్ధవటం కోట, ఓంటిమిట్ట, తాళ్ళపాక ఉన్నాయి. భగవాన్ మహావీర్ ప్రభుత్వ సంగ్రహాలయం కడపలో ఉంది.

ఇవే కాక మస్జీద్-ఏ-ఆజమ్, కడప, అత్తిరాల, రాజంపేట, గండి ఆంజనేయస్వామి దేవాలయము, వేంపల్లె, నామాలగుండు, కనంపల్లె దేవరరాయి, సంబేపల్లి, వీరభద్ర స్వామి దేవాలయము, దేవళాలు (అల్లాడుపల్లె), చాపాడు మండలం, రాచవేటి వీరభద్ర స్వామి దేవాలయము, రాయచోటి, సంజీవరాయుడు దేవాలయము ప్రొద్దుటూరు మొదలగునవి ఉన్నాయి.

ప్రకృతి రమణీయాలైన కొండలు, కోనలు, చందన వృక్షాలు, వన్యమృగాలు ఈ జిల్లాలో ఉన్నాయి. 




#Article 131: మెదక్ జిల్లా (1072 words)


మెదక్ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.  మెదక్‌ పట్టణం హైదరాబాదుకు 100 కి మీ ల దూరంలో ఉంది. మెదక్ జిల్లాకు ఇది ముఖ్యపట్టణం. 

పూర్వం సిద్దాపూర్‌ అని పిలువబడే నేటి మెదక్, కాకతీయుల కాలంలో ఉచ్ఛస్థితిలో ఉండేది. ఆ కాలం నాటి దుర్గం మెదక్ లో ఉంది. మెతుకుసీమగా తరువాతి కాలంలో పిలువబడేది. 1830లో కాశీయాత్రలో భాగంగా జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాలలో మజిలీ చేస్తూ ప్రయాణించిన యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఆనాడు ఈ ప్రాంతపు స్థితిగతుల గురించి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ రాజ్యంలో, కృష్ణానది దాటినది మొదలుకొని హైదరాబాద్ నగరం వరకూ ఉన్న ప్రాంతాల్లో (నేటి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ నగర జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాల్లో) సంస్థానాధీశుల కలహాలు, దౌర్జన్యాలు, భయభ్రాంతులను చేసే స్థితిగతులు ఉన్నాయని, ఐతే హైదరాబాద్ నగరం దాటిన తరువాత నుంచి గోదావరి నది దాటేవరకూ (నేటి నిజామాబాద్, మెదక్ జిల్లాలు) గ్రామాలు చాలావరకూ అటువంటి దౌర్జన్యాలు లేకుండా ఉన్నాయని వ్రాశారు. కృష్ణానది నుంచి హైదరాబాద్ వరకూ ఉన్న ప్రాంతాల్లో గ్రామ గ్రామానికి కోటలు, సైన్యం విస్తారంగా ఉంటే, హైదరాబాద్ నుంచి గోదావరి నది వరకూ ఉన్న ప్రాంతంలో మాత్రం కోటలు లేవని, చెరువులు విస్తారంగా ఉండి మెట్టపంటలు ఉంటున్నాయని వ్రాశారు.

మెదక్ జిల్లాను భౌగోళికంగా నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణకు ముందు  46 రెవిన్యూ మండలాలుగా విభజించారు..

పూర్వపు 46 మండలాలతో ఉన్న మెదక్ జిల్లా రేఖా పటం (కుడివైపు)  ——→           ——→ 

పూర్వపు మెదక్ జిల్లాకు చెందిన 19 పాత మండలాలతో సంగారెడ్డి జిల్లా కొత్తగా ఏర్పడింది.కొత్తగా 7 మండలాలు ఏర్పడినవి.
      

 

పునర్య్వస్థీకరణ తరువాత పాత మండలాలు 15 కాగా,మెదక్ జిల్లాల గ్రామాల నుండి వ.సంఖ్య16 నుండి 20 వరకు గలవి 5 కొత్తగా ఏర్పడిన మండలాలు.
      

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (5)

మెదక్ జిల్లా గుండా 2 జాతీయ రహదారులు వెళ్ళుచున్నాయి. 7వ నెంబరు జాతీయ రహదారి ఉత్తర-దక్షిణముగా వెళ్ళుచుండగా, 9వ నెంబరు జాతీయ రహదారి తూర్పు-పడమరలుగా పోవుచున్నది. ఇవే కాకుండా సంగారెడ్డి-నాందేడ్ రహదారి, హైదరాబాదు-కరీంనగర్ రహదారి, మెదక్-నిజామాబాదు రహదారి, మెదక్ - సిద్ధిపేట్ రహదారి జిల్లా గుండా వెళ్ళు ప్రధాన రహదారులు.

జిల్లాలో మొట్టమొదటిసారిగా 1886లో రైలుమార్గము వేయబడింది. సికింద్రాబాదు నుండి వాడి వరకు వేయబడిన రైలుమార్గము జిల్లాలో దక్షిణ ఆగ్నేయములో కొంతదూరం జిల్లా నుండి పోవుచున్నది. ఇది కాకుండా వికారాబాదు-పర్లివైద్యనాథ్ మార్గం, కాచిగూడ-మన్మాడ్ మార్గం జిల్లా గుండా వెళ్ళుచున్నది.

మెదక్ జిల్లాలో చాలా రకాల మతాలవారు,కులాలవారు నివసిస్తున్నారు.

హైదరాబాదుకు 115 కిలోమీటర్ల దూరంలో అలాగే మెదక్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోచారం అటవీ ప్రాంతం. ఇది 20వ శతాబ్దం ఆరంభంలోనే అడవి జంతువుల శరణాలయంగా ప్రకటించబడింది. ఇది ఒకప్పుడు నిజాంకు ప్రియమైనా వేటప్రదేశం. పోచారం సరస్సు రూపుదిద్దుకున్న తరువాత దీనికి ఈ పేరు పెట్టబడింది. ఇది 9.12 కిలోమీటర్లదూరం విస్తరించబడి ఉంది. ఇది దట్టమైన వృక్షాలతో అలరారుతుంది. జంతు సంపద, వృక్షసంపదలతో అలరారుతున్న ఇది పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఇది బార్-హెడ్డెడ్ గూస్, బ్రహ్మిణీ బాతులు, ఓపెన్ బిల్డ్ స్ట్రోక్ వంటి విదేశీ పక్షులను ఆకర్షిస్తుంది. పరస్పరాధారిత పర్యావరణ వ్యవస్థకు పేరు పొందిన పర్యాటనకు ఇది ప్రసిద్ధి పొంది ఉంది. ఇక్కడ పర్యాటకులు జింకలు, దుప్పి జాతి మృగాలను సందర్శించ వచ్చు. వేసవి ఉష్ణోగ్రతలు 46°సెంటీగ్రేడ్, శీతాకాలం 6 ° సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. ఈ శరణాలయంలో చిరుత, అడవి పిల్లి, అడవి కుక్క, తోడేలు, గుంటనక్క, దక్షిణ ఎలుగుబంటు, కృష్ణజింక, నాలుగు కొమ్ముల దుప్పి వంటి జంతువులు ఉన్నాయి.

మెదక్ జిల్లాలో ప్రముఖ విద్యాలయాలలో కొన్ని: ఐఐటి, హైదరాబాద్, ఎమ్ ఎన్ ఆర్ మెడికల్ కాలేజ్, ఎమ్ ఎన్ ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, పఠాన్ చెరువులోని గీతం (జి ఐ టి ఎ ఎమ్) విశ్వవిద్యాలయం, సుల్తంపుర్ లో జె.ఎన్.టి.యూ.

కాకతీయ చక్రవర్తి, ప్రతాపరుద్రుని కాలంలో మెదక్ దుర్గం నిర్మించారు. వ్యూహాత్మకంగా ఒక గుట్టపైన నిర్మించిన ఈ దుర్గాన్ని మెతుకుదుర్గం అని ఈ ప్రాంతాన్ని మెతుకుసీమ అని అనేవారు. ముఖద్వారం వద్ద కాకతీయుల ముద్ర రెండు తలల గండభేరుండం  ఠీవిగా ఉంటుంది. కాకతీయుల నిర్మాణ ధురీణతకు ఈ కోట తార్కాణంగా నిలుస్తుంది. కోటలోని ఒక బావినుండి గొట్టాల ద్వారా కోటలోకి నీటి సరఫరా జరిగేది. కోటకు మూడు ద్వారాలున్నాయి: ప్రథమ ద్వారం, గర్జిస్తున్న రెండు సింహాల మూర్తులతో కూడిన సింహ ద్వారం, ఇరువైపులా రెండు ఏనుగుల ప్రతిమలు కలిగిన గజ ద్వారం. కోటలో 17 వ శతాబ్దంకు చెందిన 3.2 మీటర్ల పొడవైన శతఘ్నిని చూడవచ్చు. సహజ సిద్ధమైన భౌగోళిక రూపురేఖలను చక్కగా వినియోగించుకున్న ఈ కోటకు చుట్టు ఉన్న గండ శిలలు సహజ రక్షణగా నిలుస్తున్నాయి.

నిర్మాణ, శిల్పకళల చాతుర్యాన్ని ప్రదర్శించే దేవాలయాలెన్నో మెదక్ జిల్లాలో ఉన్నాయి. బొంతపల్లి లోని వీరభద్ర స్వామి దేవాలయం (హైదరాబాదు నుండి 25 కి మీ), జరసంగం, మంజీరా నది ఒడ్డున గల ఏడుపాయలు లోని కనకదుర్గ ఆలయం (మెదక్‌ నుండి 8 కి మీ), నాచగిరి లోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం (హైదరాబాదు నుండి 55 కి మీ), సిద్ధిపేట లోని కోటి లింగేశ్వర స్వామి ఆలయం వీటిలో కొన్ని. సాంప్రదాయిక తెలంగాణా సంస్కృతికి మెదక్ జిల్లా నెలవు. 

మెదక్‌ నుండి 60 కి మీ ల దూరంలో గల కొండాపూర్‌  వద్ద జరిపిన తవ్వకాల్లో శాతవాహనుల కాలం నాటి అవశేషాలు, బౌద్ధ నిర్మాణాలు బయట పడ్డాయి. పురావస్తు శాఖ వారు నిర్వహిస్తున్న సంగ్రహాలయం ఇక్కడ ఉంది. ఇక్కడ 8,100 పురాతన వస్తువులు ప్రదర్శన కోసం ఉంచారు. శాతవాహనుల నాణేలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ నాణేలను బట్టి కొండాపూర్‌ కూడా శాతవాహనులకు చెందిన 30 నగరాల్లో ఒకటిగా కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. బౌద్ధ స్థూపాలు, చైత్యాల అవశేషాలు కూడా కొండాపూర్‌లో లభించడంతో ఈ ప్రాంతం ఒకప్పుడు గొప్ప బౌద్ధమత కేంద్రంగా వెలిగిందని కూడా తెలుస్తోంది. రోమను చక్రవర్తి ఆగస్టస్‌కు చెందిన బంగారు నాణెం కూడా ఇక్కడ ప్రదర్శనలో ఉంది. ఇంకా వెండి నాణేలు, పూసలు, మట్టి గాజులు, దంతం, రాగి, గాజుతో చేసిన అందమైన వస్తువులు ఉన్నాయి.

మెదక్‌కు 15 కి మీ ల దూరంలో గల పోచారం అడవి నిజాము నవాబు వేటకు వెళ్ళే స్థలం.20 వ శతాబ్దపు తొలినాళ్ళలో దీనిని అభయారణ్యముగా ప్రకటించారు. పోచారం చెరువు పేరిట ఏర్పడిన ఈ అడవి 9.12 చ.కి.మీ ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఎన్నో రకాల వృక్ష, జంతు జాతులకు నెలవైన ఈ అడవికి ఏటా రకరకాలైన పక్షులు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఉన్న పర్యావరణ యాత్రా స్థలంలో ఐదు రకాల లేళ్ళను, దుప్పులను చూడవచ్చు. వేసవిలో 46 °C‌ దాటే ఉష్ణోగ్రత, శీతాకాలంలో 6 °C‌కు పడిపోతుంది. ఈ అభయారణ్యంలో చిరుతపులి, అడవి పిల్లి, అడవి కుక్క, తోడేలు, నక్క, ఎలుగుబంటి, సాంబార్‌ దుప్పి, నీల్గాయి, చింకారా, నాలుగు కొమ్ముల దుప్పి మొదలైన జంతువులు ఉన్నాయి.

ప్రకృతి ఆరాధకులకు మెదక్‌లో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. హైదరాబాదుకు 35 కి మీ ల దూరంలో గల నర్సాపూర్  అడవి, గుమ్మడిదల, నర్సాపూర్‌ ల మధ్య 30 చ.కి.మీ ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఎన్నో రకాల చెట్లు, జంతుజాలం, ఎన్నో చెరువులతో ఈ అడవి కళకళలాడుతూ ఉంటుంది. మెదక్‌కు 75 కి.మీ ల దూరంలో ఉన్న మంజీర అభయారణ్యం 20 చకి మీ ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఈ అడవి సగటు వెడల్పు 500 నుండి 800 మీటర్లు. మంజీర, సింగూరు ఆనకట్టల మధ్య విస్తరించి ఉన్న ఈ అడవి తొమ్మిది చిన్న చిన్న దీవుల సమాహరం. ఎన్నో రకాల వలస పక్షులు, బురద మొసళ్ళు మొదలైన వాటికి ఈ ప్రాంతం ఆలవాలం.

మెదక్ జిల్లా శిల్పకళా సౌందర్యం ప్రతిబింబిస్తున్న పలు ఆలయాలకు పుట్టిల్లు. గణేశ్‌గడ్డకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్దనూరు, ప్రతిసంవత్సరం వైభవోపేతంగా జాతర జరుపుకుంటున్న సంగారెడ్డి వద్ద ఉన్న ఇస్మాయిల్ఖాన్ పేటలో ఉన్న సౌధమ్మమాతా ఆలయం, హైదరాబాదు నుండి 35 కిలోమీటర్లదూరంలో ఉన్న సప్తప్రాకారయుత భవాని మాతా ఆలయం, హైదరాబాదుకు ఉత్తరంగా 25 కిలోమీటర్ల దూరంలో బొంతపల్లిలో ఉన్న వీరభద్రస్వామి ఆలయం, మెదక్‌కు 45 కిలోమీటర్లదూరంలో ఉన్న సంగమేశ్వరాలయం, మెదక్‌కు 15 కిలోమీటర్ల దూరంలో మంజీరా నదీ తీరంలో ఉన్న కనకదుర్గాలయం, నాచగిరి ఆలయాలు, హైదరాబాదుకు 55 కిలోమీటర్లదూరంలో ఉన్న లక్ష్మీనారాయణాలయం, సైదాపేటలో ఉన్న కోటిలింగేశ్వరాలయం, శ్రీసరస్వతిక్షేత్రం, సైదాపేటకు 22 కిలోమీటర్లదూరంలో కరీంనగర్ వెళ్ళే దారిలో ఉన్న అనంతసాగర్ ఆలయం, కర్ణంపల్లి వద్ద ఉన్న చేగుంట సాయిబాబా దేవస్థానం, కల్యాణవేంకటేశ్వరస్వామి దేవస్థానం, వాసవీ కన్యకాపరమేశ్వరీ అమ్మవారి దేవాలయం, స్వయంభూ మహాలక్ష్మీ దేవస్థానం, ఆంజనేయస్వామి ఆలయం ప్రముఖమైనవి. ఇంకా ఈ జిల్లాలో జోగిపేట పట్టణం ఆందోల్ మండలంలో చితుకుల పల్లెలో ఉన్న శ్రీ శ్రీ చాముండేశ్వరీ అమ్మవారి ఆలయం, మంజీరా నదీతీరంలో రామయ్య చేత నిర్మించబడిన ప్రబలమైన శక్తి ఆలయం, జోగిపేటలో ఉన్న జోగినాధాలయం, అందొల్ గ్రామంలో కల శ్రీ రంగనాథ స్వామి దేవాలయం,  హైదరాబాదుకు 60 కిలోమీటర్లదూరంలో కౌడిపల్లి మండలంలో ఉన్న తుణికిలో ఉన్న పోచమ్మ ఆలయం, పుల్కల్ మండలంలోని బొమ్మారెడ్డి గూడెంలో ఉన్న జగదాంబమాతా, కర్నల్పల్లి, చేగుంటమండలంలో సాయిబాబా ఆలయం, ప్రబల రేణుకా ఎల్లం దేవీ ఆలయం, కర్నల పాల్లి వాసుల చేత నిర్మింపబడిన ఆంజనేయ ఆలయం ఉన్నాయి.

సిద్ధిపేట సత్యనారాయణుని ఆలయం: సత్య దేవుని ఆలయం సిద్ధిపేటలో స్థానిక భక్తులు, దాతలు కలిసి విరాణాలు సేకరించి 2011 లో ఆలయ నిర్మాణ పనులు చేపట్టారు. గర్భగుడిచుట్టూ విష్ణుమూర్తి దశావతారల విగ్రహాలు చెక్కించారు. ఇందులోని అద్దాల మండపము ఈ ఆలయంలో చెప్పుకోదగ్గ విశేషం. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి రంగు రంగుల పాల రాతిని తెప్పించి అద్దాల మండపాన్ని నిర్మించారు.అదే విధంగా అనేక రంగుల అద్దాలను తెప్పించి అనేక డిజైన్ల ప్రకారం కోసి మండపానికి అతికించారు. మండపంలో పైభాగానికి అమర్చిన అష్టదళ పద్మం ఈ మండపానికే వన్నె తెచ్చింది. విద్యుత్తు దీపాల వెలుగులో ఈ అద్దాల మండపాన్ని చూడడం ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయంలో ఏటా ధనుర్మాసంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి వుత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. చివరిలో గోదా దేవి కళ్యాణం నిర్వహిస్తారు. నూతనంగా నిర్మించిన ఈ ఆలయం సిద్ధిపేటకు తలమానికంగా వెలుగొందుతున్నది.

బర్రెంకల జయదేవులు -




#Article 132: శ్రీకాకుళం జిల్లా (1229 words)


శ్రీకాకుళం జిల్లా భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈశాన్య సరిహద్దులో ఉంది. జిల్లా ముఖ్యపట్టణమైన శ్రీకాకుళం (అక్షా: 18' ఉ, రేఖా: 54' తూ) నాగావళి నది ఒడ్డున ఉంది. విశాఖపట్నం జిల్లా నుంచి 1950 ఆగష్టు 15 న శ్రీకాకుళం జిల్లా ఏర్పడింది. విశాఖపట్నం జిల్లా లోని కొంత భాగం, శ్రీకాకుళం జిల్లా నుంచి మరి కొంతభాగం కలిపి 1979 జూన్ 1 న విజయనగరం జిల్లా ఏర్పడింది. 

ఒకప్పుడు ఇది బౌద్ధమతానికి ముఖ్యస్థానంగా వర్ధిల్లింది. శాలిహుండం, దంతపురి, జగతిమెట్ వంటి బౌద్ధారామం|బౌద్ధారామాలు ఇక్కడ కనుగొనబడ్డాయి. తరువాత ఇది కళింగ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. గాంగేయులు ఈ ప్రాంతాన్ని 6 నుండి 14వ శతాబ్దం వరకు, 800 సంవత్సరాలు పాలించారు. వజ్రహస్తుడు|వజ్రహస్తుని కాలంలో ప్రసిద్ధి చెందిన శ్రీ ముఖలింగం ఆలయాన్ని నిర్మించారు. మహమ్మదీయుల పాలన కాలంలో షేర్ మహమ్మద్ ఖాన్ శ్రీకాకుళంలో జామియా మసీదు నిర్మించాడు.

విశాఖపట్నం జిల్లాలో భాగంగా ఉండే ఈ జిల్లా 1950 ఆగష్టు 15న ప్రత్యేక జిల్లాగా అవతరించింది. 1969లో ఈ జిల్లానుండి సాలూరు తాలూకాలోని 63 గ్రామాలు, బొబ్బిలి తాలూకాలోని 44 గ్రామాలను విశాఖపట్నం జిల్లాలో కొత్తగా ఏర్పరచిన గజపతి నగరం తాలూకాకు బదలాయించారు. మళ్ళీ మే 1979లో కొత్తగా విజయనగరం జిల్లాను ఏర్పరచినపుడు సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం, చీపురుపల్లి తాలూకాలను కొత్తజిల్లాలో విభాగాలుగా చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ లో నక్సలైటు (మావోయిస్టు పార్టీ) ఉద్యమం ప్రారంభమయింది శ్రీకాకుళం జిల్లాలోనే.

శ్రీకాకుళం జిల్లా
మొత్తం జిల్లా వైశాల్యం 5837 చ.కి.మీ. జిల్లాకు 193 కి.మీ. సముద్ర తీరం ఉంది. తూర్పు కనుమలు ఈశాన్యం నుండి కొంతభాగం విస్తరించి ఉన్నాయి.

నాగావళి, వంశధార, మహేంద్ర తనయ, చంపావతి, బహుదా, కుంభికోటగెడ్ ఇవి జిల్లాలలో ముఖ్యమైన నదులు. ఇవి తూర్పు కనుమలలో పుట్టి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి.

సంవత్సరంలో ఎక్కువకాలం వాతావరణం తేమగా ఉంటుంది. నైఋతి ఋతుపవనాలు జూన్ నుండి సెప్టెంబరు వరకు, ఈశాన్య ఋతుపవనాలు అక్టోబరు - నవంబరు మాసాలలోను వర్షాలు కురిపిస్తాయి. డిసెంబరు నుండి ఫిబ్రవరి వరకు పొడిగాను, చల్లగాను ఉంటుంది. సంవత్సరం సగటు వర్షపాతం 1162 మి.మీ. (2004-2005 సం.లో వర్షపాతం 937.6 మి.మీ.)

జిల్లాలోని అడవుల సాంద్రత, వృక్ష జాతులు ప్రాంతాన్ని బట్టి వైవిధ్యం కలిగి ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడి అడవులను రెండు రకాలుగా చెప్పవచ్చును.

శ్రీకాకుళం జిల్లాలో అటవీ మృగాలు అల్పంగా ఉన్నాయి. జనావాసాల విస్తరణ, అడవుల నాశనం ఇందుకు కారణాలు కావచ్చును. మాంసాహార మృగాలలో పులి దాదాపు అంతరించింది. చిరుత పులి, హైనా (దుమ్ములగొండి), తోడేలు వంటి జంతువులు అరుదుగా అడవుల్లో కనిపిస్తుంటాయి. గుంటనక్క, అడవిపిల్లులు, కుక్కలు జిల్లాలో కనిపించే ఇతర మాంసాహార జంతువులు. శాకాహార జంతువులలో ఎక్కువుగా  మచ్చల దుప్పి (చితాల్), అడవి గొర్రెలు, ఎలుగుబంట్లు సాధారణంగా కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో కృష్ణజింక, నీలగాయ్, బైసన్లు అసలు కనిపించకపోవడం గమనార్హం. పక్షి జాతులలో - నెమళ్ళు, కౌజులు, పావురాలు, చిలకలు, మైనా కౌజుపిట్టలు,బాతులు,పావురాలు వంటివి అధికంగా ఉన్నాయి..

ఉత్తరాన ఒడిషా రాష్ట్రం, దక్షిణ-పశ్చిమాల్లో విజయనగరం జిల్లా, ఒడిషా గజపతి జిల్లా, తూర్పున బంగాళాఖాతం ఉన్నాయి. జిల్లాకు కొంత భాగం హద్దులుగా కందివలస గెడ్, వంశధార, బహుదా నదులు ప్రవహిస్తున్నాయి.

మొత్తం జిల్లా వైశాల్యం 5837 చ.కి.మీ.

జిల్లాలో ముఖ్య పంటలు- వరి, రాగులు, పెసలు, మినుములు, ఉలవలు, చెరకు, జనుము, వేరుశనగ, నువ్వులు, మిరప, పసుపు, నీరుల్లి.

శ్రీకాకుళం జిల్లాలో బాహుద, ఉత్తర మహేంద్ర, తనయ, బెంజిగడ్డ, వరహాలు గడ్డ, వంశధార, నాగావళి, పెద్దగడ్డ, కందివలస అనే 9 నదులు ఉన్నాయి. వీటిలో నాగావళి, వంశధార, మహేంద్ర తనయ ముఖ్యమైన నదులు. జిల్లాలో ఈశాన్య ఋతుపవనాల ద్వారా 26.47%, నైఋతి ఋతుపవనాల ద్వారా 62.61% వర్షాలు లభిస్తాయి. మూడు ముఖ్య నదుల ద్వారా జరుగుతున్న నీటి వినియోగం: నాగావళి 371 మి.క్యూ.మీ. (మిలియన్ క్యూబిక్ మీటర్లు) (36%), వంశధార 121 మి.క్యూ.మీ. (12%), మహేంద్ర తనయ 81 మి.క్యూ.మీ. (8%), చిన్న చెరువులు 140 మి.క్యూ.మీ. (14%), భూగర్భ జలాలు 300 మి.క్యూ.మీ. (30%). మొత్తం 1,013 మి.క్యూ.మీ. రాష్ట్రంలో రెండు ప్రధాన జలాశయాలు సుమారు 140 మి.క్యూ.మీ. నీటిని వ్యవసాయ నిమిత్తం సమకూరుస్తున్నాయి. అవకాశం ఉన్న నీటిలో 91% (5,763 మి.క్యూ.మీ.) బంగాళాఖాతంలోకి వృధాగా పోతున్నదని అంచనా. 9% నీరు మాత్రమే భూగర్భంలోకి ఇంకుతున్నది.

జిల్లాలో 3.3 లక్షల (0.33 మిలియన్) హెక్టేరులు భూమి సాగులో ఉంది. అందులో 1.9 లక్షల హెక్టేరులకు సాగునీటి వసతి ఉంది. కాలువల ద్వారా 91,946 హెక్టేరులు, చెరువుల ద్వారా 80,123 హెక్టేరులు, బోరు బావుల ద్వారా 6,923 హెక్టేరులు, ఇతర బావుల ద్వారా 8,866 హెక్టేరులు, ఇతర వనరుల ద్వారా 5,316 హెక్టేరులు భూమికి సాగునీరు లభిస్తుంది.

అనిశ్చితమైన వర్షపాతం జిల్లాలో ప్రధాన సమస్య. చాలా సంవత్సరాలు అనావృష్టి సంవత్సరాలుగా పరిగణింపబడుతున్నాయి. అలాగే త్రాగు నీటి సమస్య కూడా తీవ్రంగానే ఉంది. ఫ్లోరోసిస్ సమస్య కూడా కొన్నిచోట్ల ఉంది. నీటి వనరులను పరిరక్షించే విధానాలు లేకపోవడం, ఏజెన్సీ ప్రాంతంలోని పోడు వ్యవసాయం ఇందుకు ముఖ్యమైన కారణాలు. జిల్లాలో ఎక్కువ భాగం నేల ఉపరితలం గట్టిగా ఉన్నందున నీరు ఇంకే అవకాశం తక్కువ. అందుకు తోడు అధిక భూభాగం వాలుగా ఉన్నది గనుక నీరు నిలవదు. వరి, చెరకు పంటలకు ఎక్కువ నీటిని వాడుతారు.

జిల్లాలో ముఖ్యమైన ప్రాజెక్టులు: నారాయణపురం డామ్ (మద్దివలస రిజర్వాయిర్, నాగావళి), గొట్టా బారేజి (వంశధార), కళింగాంధ్ర ప్రాజెక్టు (మహేంద్ర తనయ)

మచిలేశం, కళింగపట్నం, నువ్వలరేవు, భావనపాడు, బారువలు ముఖ్యమైన మత్స్య పరిశ్రమ కేంద్రాలు.

జిల్లాలో మాంగనీసు, గ్రాఫైటు, సున్నపు రాయి, మైకా, గ్రానైట్, జిల్లా తీరప్రాంతంలోని ఇసుకలో మోనజైట్, ఇతర ఖనిజాలు సమృద్ధిగా దొరుకుతాయి.

జిల్లాలో ముఖ్యపరిశ్రమలు: చక్కెర, నూనె, జీడిపప్పు, జనపనార, పేపర మిల్లు కర్మాగారములు కలవు

పైడిభీమవరం, రాజాం, మడపాం, ఆమదాలవలస, సంకిలి పట్టణాలలో పరిశ్రమలు విస్తరిస్తున్నాయి.

జిల్లా మూడు రెవిన్యూ డివిజన్లుగా విభజింపబడింది: శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ

జిల్లా మొత్తం 38 మండలాలుగా విభజింపబడింది . 

రోడ్డు మార్గాల ద్వారా వివిధ ప్రాంతాలకు చక్కగా కలపబడి ఉంది. విశాఖపట్నం, దగ్గరలోని విమానాశ్రయము.ఇది రెవెన్యూ డివిజన్ కేంద్రస్థానమైనా రైలుస్టేషను లేదు.10 కి.మీ.లోని శ్రీకాకుళం రోడ్ స్టేషనుకు వెళ్ళాలి.ఎ.పి.ఎస్.ఆర్.టి.సి ప్రభుత్వ సంస్ధ ద్వారా జిల్లా కేంద్రం నుండి ఇతర మండల.జిల్లా.రాష్ట్రాలకు వివిధ సర్వీస్ లు నడుస్తున్నాయి.

(2011 జనాభా లెక్కల సాయంతో)

ప్రధాన భాష తెలుగు. అయితే, ఒడిషా రాష్ట్రానికి సరిహద్దు కావడంచేత ఒరియా భాషను కొంతమంది అర్థం చేసుకోగలరు, మాట్లాడగలరు కూడా. శ్రీకాకుళం జిల్లా ప్రధానంగా వ్యవసాయాధారిత ప్రాంతం. ఇటీవలి కాలంలో జరుగుతున్న పారిశ్రామిక, విద్యా రంగాల్లో అభివృద్ధి కారణంగా శ్రీకాకుళం పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. కానీ మౌలిక సదుపాయాల విషయంలో ఆటంకాలను ఎదుర్కొంటోంది. ఈ ఊరిని పేదవాని స్వర్గం (poor man's paradise) అని చమత్కరిస్తారు (వేసవికాలంలో చల్లగాఉండే ప్రదేశం కావడం వలన).

శ్రీకాకుళం పట్నం, జిల్లాలోని పలు ప్రాంతాలు పచ్చికబయల్లు, అడవులు,సశ్యస్యామలమైన పంట పొలాలతో ఎప్పుడూ చల్లగా ఉంటుంది.వేసవి కాలములో ఊటీని పోలి ఉంటుంది. ఈ జిల్లాలో వర్షపాతము ఎక్కువగా ఉంటుంది. కాస్టాఫ్ లివింగ్ చాలా తక్కువ. అందుకే దీనిని పేదవాని స్వర్గమని పిలుస్తారు. జిల్లాలోని పర్యాటక ప్రదేశాలన్నీ కలిపి 2017లో రెండు కోట్లమంది పైచిలుకు, 2016లో కోటీ అరవైలక్షల పైచిలుకు పర్యాటకులు సందర్శించారని ప్రభుత్వ అంచనా. పర్యాటకుల సంఖ్య విషయంలో 2017లో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలో చిత్తూరు జిల్లా తర్వాత రెండవ స్థానం పొందింది.

సంవత్సరంలో ఎక్కువకాలం వాతావరణం తేమగా ఉంటుంది. నైఋతి ఋతుపవనాలు జూన్ నుండి సెప్టెంబరు వరకు, ఈశాన్య ఋతుపవనాలు అక్టోబరు - నవంబరు మాసాలలోను వర్షాలు కురిపిస్తాయి. డిసెంబరు నుండి ఫిబ్రవరి వరకు పొడిగాను, చల్లగాను ఉంటుంది. సంవత్సరం సగటు వర్షపాతం 1162 మి.మీ. (2004-2005 సంవత్సరంలో వర్షపాతం 937.6 మి.మీ.)
జిల్లాలోని అడవుల సాంద్రత, వృక్ష జాతులు ప్రాంతాన్ని బట్టి వైవిధ్యం కలిగి ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడి అడవులను రెండు రకాలుగా చెప్పవచ్చును.

దక్షిణ భారత Moist deciduous అడవులు - మిశ్రమ అడవులు, మద్ది అడవులు, పర్వత సవాన్నా భూములు. 
దక్షిణ భారత సతత హరిత అడవులు (dry ever-green miscellaneous forests) అందుకే దీనిని పేదవాని స్వర్గం అని పిలుస్తారు.

శ్రీకాకుళం పట్టణానికి చేరువలో అనేక ధార్మిక, విహార యాత్రా స్థలాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయు.

జిల్లా కేంద్రమైన ఈ పట్టణం నాగావళి నది ఒడ్డున ఉంది. 13 కిలోమీటర్ల దూరంలో ఆమదాలవలస రైల్వేస్టేషను ఉంది. కోటేశ్వరస్వామి ఆలయము (గుడివీధి), సంతోషిమాత ఆలయం (పాతశ్రీకాకుళం), వెంకటేశ్వరఆలయం (గుజరాతీపేట), కోదండ రామస్వామి ఆలయం, జమియా మసీదు ముఖ్యమైన ప్రార్థనా స్థలాలు.

సూర్య దేవాలయానికి ప్రసిద్ధి చెందిన అరసవిల్లి శ్రీకాకుళం పట్టణానికి 2 కి.మీ.లోనే ఉంది. దేశంలో ఉన్న కొద్ది సూర్య మందిరాలలో ఇది ఒకటి. ఇక్కడ ఆదిత్య, అంబిక, విష్ణు, గణేష, మహేశ్వర మూర్తులు ఉన్నాయి.

శ్రీకాకుళం పట్టణానికి 15 కి.మీ. దూరంలో ఉన్న శ్రీకూర్మం దేశంలో బహుశా ఒకే ఒక కూర్మావతార మందిరం. విశిష్టమైన శిల్పకళ కలిగిన ఈ మందిరంలో లభించిన శాసనాలు చారిత్రికంగా కూడా ఎంతో ముఖ్యమైనవి. ఇక్కడ డోలోత్సవం ప్రధాన ఉత్సవం.

ఇది శ్రీకాకుళం పట్టణానికి 18 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ పురావస్తుశాఖ త్రవ్వకాలలో పురాతన బౌద్ధారామాల శిథిలాలు బయటపడ్డాయి.

జిల్లా కేంద్రానికి 25 కి.మీ. దూరంలో ఉన్న ఓడరేవు. చారిత్రకంగా సముద్ర వాణిజ్య కేంద్రం. వంశధార నది ఇక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక్కడ దర్గా షరీఫ్, షేక్ మదీనా అక్విలిన్ ఉన్నాయి. 23 కిలోమీటర్లవరకు కనుపించే ఒక దీప స్తంభం ఉఉంది.

సోంపేట, ఇచ్ఛాపురాల మధ్య ఉన్న కవిటిని 'ఉద్దానం' (ఉద్యానవనం) అని కూడా అంటారు. కొబ్బరి, జీడిమామిడి, పనస వంటి తోటలతో ఇది రమణీయంగా ఉండే ప్రదేశం. శ్రీకాకుళానికి 130 కి.మీ. దూరం. ఇక్కడ చింతామణి అమ్మవారి, శ్రీ సీతారామ స్వామి ఆలయం ఉన్నాయి.

ఇది శ్రీకాకుళం పట్టణానికి 109 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ మహేంద్ర తనయ నది సముద్రంలో కలుస్తుంది, ఇక్కడ కోటిలింగేశ్వర స్వామి ఆలయం, జనార్దన స్వామి ఆలయం ఉన్నాయి. ఒకప్పుడు ఇది ముఖ్యమైన ఓడరేవు. ఇది కొబ్బరి తోటలకు, కొబ్బరి పీచు పరిశ్రమకు కేంద్రం.

ఇది శ్రీకాకుళం పట్టణానికి 60 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ ఒక సంరక్షిత పక్షి ఆవాస కేంద్రం. సైబీరియా నుండి శీతకాలంలో పెలికన్ పక్షులు ఇక్కడికి వలస వస్తాయి.

ఇది శ్రీకాకుళం పట్టణానికి 22 కి.మీ. దూరంలో ఉంది. దీనిని బౌద్ధ జ్ఞానదంతపురి అని కూడా అంటారు. క్రీ.పూ.261లో అశోకుని కళింగ యుద్ధం తరువాత ఇది కళింగరాజులకు ప్రాంతీయ రాజధానిగా ఉంది. ఇక్కడ పురావస్తు శాఖవారి త్రవ్వకాలలో అనేక పురాతన వస్తువులు లభించాయి.

శ్రీకాకుళానికి 56 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ నాగావళి, వంశధార, సువర్ణముఖి నదులు కలుస్తున్నాయి. ఇక్కడ సంగమేశ్వర మందిరం ఐదు లింగక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధం. మహాశివరాత్రికి ఇక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది.

ప్రఖ్యాతి గాంచిన పొందూరు ఖద్దరు తయారయ్యేది జిల్లాలోని పొందూరు లోనే. ఇది జిల్లా కేంద్రానికి 21 కి.మీ. దూరంలో ఉంది.

ప్రఖ్యాతి గాంచిన మంచు తాతాయ్య చెనెత వస్త్రములు తయారయ్యేది జిల్లాలోని కొరసవాడ లోనే. ఇది శ్రీకాకుళానికి 55 కి.మీ. దూరంలో ఉంది.

శ్రీకాకుళానికి 40 కి.మీ. దూరంలో ఉన్న రాజాం బొబ్బిలి సర్దార్ తాండ్ర పాపారాయుడు కథ ద్వారా చారిత్రికమైనది.

సోంపేటకు 26 కి.మీ. దూరంలో ఉంది. మహేంద్రగిరి కొండ దుగువున ఉన్న ఈ వూరిలో 700 సంవత్సరాల పురాతన వాసుదేవ ఆలయం ఉంది. ఇక్కడి కోట దక్షిణ భారతదేశంలోనే ఎత్తైనదిగా చెప్పబడుతున్నది.

ఈ జిల్లాకు చెందిన ఎందరో మహానుభావులు ఆంధ్ర దేశం, తెలుగు భాష వికాసానికి అసమానమైన సేవ చేశారు. జిల్లాకు చెందిన కొందరు ప్రముఖులు

జిల్లాలో ఆరు పట్టణ ప్రాంతాలు -నాలుగు మునిసిపాలిటీలు, రెండు నోటిఫైడ్ పంచాయితీ టౌనులు - ఉన్నాయి.

శ్రీకాకుళం జిల్లాపరిధిలో 3 లోక్‌సభ స్థానాలున్నవి.




#Article 133: విశాఖపట్నం (2200 words)


విశాఖపట్నం (విశాఖ , విశాఖపట్టణం, వైజాగ్‌, వాల్తేర్) భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్‌ లో పెద్ద నగరం.  బంగాళా ఖాతం ఒడ్డున గల ఈ నగరంలో భారత దేశపు నాలుగో పెద్ద ఓడరేవు, దేశంలోనే అతి పురాతన నౌకా నిర్మాణ కేంద్రం ఉన్నాయి. ఇది మెట్రోపాలిటన్ ప్రాంతం. స్వతంత్ర భారత దేశపు మొట్ట మొదటి ఓడ అయిన జల ఉష ఇక్కడే తయారయి, అప్పటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా జలప్రవేశం చేసింది. 

సుందరమైన సముద్ర తీరం, అహ్లాదకరమైన కొండలతో అలరారే విశాఖపట్నం నగరానికి చుట్టుపక్కల అద్భుతమైన అరకు లోయ సౌందర్యం, మన్యం అడవుల సౌందర్యం, లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన బొర్రా గుహలు, 11 వ శతాబ్ది నాటి దేవాలయం, ప్రాచీన బౌద్ధ స్థలాలు మొదలైన  ఎన్నో ప్రసిద్ధ యాత్రా స్థలాలు ఉన్నాయి.  విశాఖపట్నం రేవు సహజ సిద్ధమైన నౌకాశ్రయం. సముద్రం లోకి చొచ్చుకొని ఉన్న కొండ డాల్ఫిన్స్‌ నోస్‌  అలల తాకిడిని తగ్గించే పనిచేస్తుంది.

శివ పార్వతుల తనయుడు, శుక్ర గ్రహాధినేత, యుద్ధాల దేవుడు, ధైర్య సాహసాలకు మారు పేరూ అయిన, విశాఖ పేరిట నగరానికి ఈ పేరు వచ్చిందని ప్రతీతి. ప్రాచీన గ్రంథాలైన రామాయణ, మహాభారతాలలో ఈ ప్రాంత ప్రస్తావన ఉన్నట్లు కనిపించుచున్నది. రాముడు సీత కొరకు వెదకుచూ ఈ ప్రాంతం గుండానే వెళ్ళినట్లు, ఈ పరిసరాల్లోనే శబరిని కలవగా ఆమె హనుమంతుడు నివసించే కొండలకు దారి చూపినట్లుగా రామాయణం తెలియజేస్తున్నది. రాముడు జాంబవంతుని కలిసింది కూడా ఈ ప్రాంతంలోనే. ఈ ప్రాంతంలోనే భీముడు బకాసురుని వధించినాడని ప్రతీతి. నగరానికి 40 కిలోమీటర్ల దూరంలోని ఉప్పలం గ్రామంలో పాండవుల రాతి ఆయుధాలను చూడవచ్చు.

స్థానికంగా వినవచ్చే కథ ఒకటి ఇలా ఉంది.(9-11 శతాబ్దపు) ఒక ఆంధ్ర రాజు, కాశీకి వెళ్తూ ఇక్కడ విశ్రాంతి కొరకు ఆగాడు. ఆ ప్రదేశ సౌందర్యానికి ముగ్ధుడై, తన ఆరాధ్య దైవమైన విశాఖేశ్వరునికి ఇక్కడ ఒక గుడి నిర్మింపజేసాడు. కాని పురాతత్వ శాఖ ప్రకారం మాత్రం ఈ గుడి 11, 12 శతాబ్దాలలో కుళోత్తుంగ చోళునిచే నిర్మించబడినదని తెలుస్తోంది. శంకరయ్య చెట్టి అనే ఒక సముద్ర వ్యాపారి ఒక మండపాన్ని నిర్మించాడు. ప్రస్తుతం ఈ గుడి లేనప్పటికీ, - ఒక 100 ఏళ్ళ కిందట తుపానులో కొట్టుకు పోయి ఉండవచ్చు. ఈ ప్రాంతపు పెద్దవారు తమ తాతలతో ఈ గుడికి వెళ్ళినట్లుగా చెప్పే వృత్తాంతాలు ఉన్నాయి.

గోదావరి నది వరకు విస్తరించిన ప్రాచీన కళింగ సామ్రాజ్యంలో భాగమైన ఈ ప్రాంతపు ప్రస్తావన క్రీ. పూ. 5, 6 శతాబ్దాల నాటి హిందూ, బౌద్ధ గ్రంథాలలోను, క్రీ.పూ. 4 వ శతాబ్దికి చెందిన సంస్కృత వ్యాకరణ పండితులైన పాణిని, కాత్యాయనుని రచనలలోను ఉంది.

ఈ ప్రాంతాన్ని ఎన్నో ప్రముఖ వంశాల వారు పరిపాలించారు. వాటిలో కొన్ని: 7 వ శతాబ్దంలో కళింగులు, 8 వ శతాబ్దంలో చాళుక్యులు, తరువాతి కాలంలో రాజమండ్రి రెడ్డిరాజులు, చోళులు, గోల్కొండకు చెందిన కుతుబ్‌ షాహీలు, మొగలులు, హైదరాబాదు నవాబులు. 1700 సంవత్సరం నాటికి బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ దక్షిణ భారతదేశంలో నెలకొల్పిన అతికొద్ది వర్తకస్థానాల్లో విశాఖపట్టణం ఒకటిగా ఉండేది.

విశాఖపట్నం అన్న నామం విశాఖ అనే పూర్వపదం, పట్నం అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. విశాఖపట్నానికి ఈ పేరు రావడం వెనుక భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. 

విశాఖపట్నం జిల్లా గజిట్ (pp 2-3) ప్రకారం శివునికుమారుడు వైశాఖ (కార్తికేయుడు) పేరు పెట్టినందున విశాఖ అనే పూర్వపదం వచ్చినట్లు ఉన్నది. శివుడి కుమారుడు కుమార స్వామికి విశాఖ అనే పేరు కూడా ఉంది. అతని నక్షత్రం కూడా విశాఖే. అతని గుడి ఇక్కడ ఉండేదనీ, అతని పేరిటే ఈ నగరానికి ఆ పేరు వచ్చిందనే వాదన కూడా ఉంది.

వైశాఖేశ్వరుని ఆలయం చుట్టూ నగరం విస్తరించినందువల్లే విశాఖపట్నంగా పేరు వచ్చిందనేది ఒక కథనం.   ఈ నగరంలో విశాఖేశ్వరుని ఆలయం ఉన్నందున విశాఖేశ్వరపురం అనే పేరు ఉండేదని కాలక్రమంలో, పురానికి రూపాంతరం పట్నం కావున విశాఖపట్నం గా మారినట్లు  ఒక కథ ప్రచారంలో ఉంది.   ఉత్తర పదం పట్నం పట్టణానికి రూపాంతరం. దీనికి ఊర్ల పేర్ల నిఘంటువు  ప్రకారం  పట్టణమంటే వ్యాపారకేంద్రం, నగరం, సముద్రతీరం అనే అర్థాలున్నాయి. ఈ నగరం పూర్వం నుండి సముద్రతీర ప్రాంతం, ఓడరేవు ఉన్నందున ఉత్తర పదం పట్నం వచ్చినట్లు తెలియుచున్నది.

ద్రాక్షారామం భీమేశ్వరాలయంలో లభ్యమైన క్రీ.శ. 1068 నాటి శిలాశాసనంలోనే విశాఖపట్నం అనే పేరు ఉన్నట్లు తెలుస్తోంది. 

విశాఖపట్నం బంగాళా ఖాతం నానుకొని సముద్రపు ఒడ్డున ఉంది. విశాఖపట్నానికి ఎల్లలు; ఉత్తరాన ఒడిషా రాష్ట్రం, విజయనగరం జిల్లా, దక్షిణాన తూర్పుగోదావరి జిల్లా గలదు. తూర్పున బంగాళాఖాతం పశ్చిమాన తూర్పు కనుమలు ఉన్నాయి. ఈ నగరపు అక్షాంశ రేఖాంశాలు; 17.6883° ఉత్తర అక్షాంశం, 83.2186° తూర్పు రేఖాంశం. ఈ నగరం మైదాన ప్రాంతం, తీరప్రాంతాలతో ఉంది. దీని వైశాల్యం .

 

పరిపాలన మహావిశాఖపట్నం నగర పాలక సంస్థ ద్వారా జరుగుతుంది.

జాతీయ పట్టణ అభివృద్ధి పధకం ద్వారా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, విశాఖ పట్నం పురపాలక సంఘాన్ని, మహా విశాఖపట్నం పురపాలక సంఘంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, విశాఖపట్నం చుట్టుపక్కల వున్న 32 గ్రామాలను (గ్రామాల పేర్లు కింద చూడు), గాజువాక పురపాలక సంఘాన్ని, మహా విశాఖ పురపాలక సంఘంలోవిలీనం చేసారు. 9.82 లక్షల జనాభా వున్న విశాఖ, ఈ 32 గ్రామాలు, గాజువాక పురపాలక సంఘం కలిసి పోయిన తరువాత 14.25 లక్షల జనాభాకి పెరిగింది. ఈ విలీనం వల్ల 111 చదరపు కిలోమీటర్లు (చ.కీ.మీ.) పరిధిలో విస్తరించిన విశాఖ, 534 చ.కీ.మీ. విస్తీర్ణానికి పెరిగింది

(1) మధురవాడ, (2) పరదేశి పాలెం, (3) కొమ్మాది, (4) బక్కన్న పాలెం, (5) పోతిన మల్లయ్య (పి.ఎమ్) పాలెం, (6) యారాడ (యారాడ మలుపు రోడ్డు ప్రమాదాలకు పెట్టింది పేరు. ఇక్కడ ఎల్లప్పుడూ 108 అంబులెన్స్ వుంటుంది), (7) గుడ్లవాని పాలెం, (8) ఎల్లపువాని పాలెం, (9) వేపగుంట, (10) పురుషోత్తమపురం, (11) చిన్న (చిన) ముసిడివాడ, (12) పులగాలిపాలెం, (13) పెందుర్తి, (14) లక్ష్మీపురం, (15) పొర్లుపాలెం, (16) నరవ, (17) వెదుళ్ళ నరవ, (18) సతివానిపాలెం, (19) నంగినారపాడు, (20) గంగవరం (పోర్టు వుంది), (21) ఇ.మర్రిపాలెం, (22) లంకెల పాలెం, (23) దేశపాత్రునిపాలెం, (24) దువ్వాడ (రైల్వే స్టేషను వుంది), (25) అగనంపూడి (ఆల్ ఇండియా రేడియో స్టేషను వుంది), (26) కె.టి.నాయుడిపాలెం, (27) దేవాడ, (28) పాలవలస, (29) చిన్నిపాలెం, (30) అప్పికొండ (సోమేశ్వరాలయం ప్రసిద్ధి) (31) అడివివరం (32) మంత్రి పాలెం.

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థలో ఉన్న 72 వార్డులు వున్నాయి. సంస్థ పరిపాలన కొరకు 11 విభాగాలున్నాయి. రెవెన్యూ శాఖ, అక్కౌంట్సు (పద్దులు) శాఖ, సాధారణ పరిపాలన, బట్వాడా శాఖ (సంస్థలోని మిగతా శాఖలు రాసిన ఉత్తరాలు, నోటీసులు పంపించటం), ఇంజినీరింగ్ శాఖ, ప్రజారోగ్య శాఖ (ప్రజల ఆరోగ్యం, వీధులు, మురికి కాలువలు శుభ్రం చేయటం, ఆసుపత్రులు ), టౌన్ ప్లానింగ్ శాఖ, అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ (నగర్ అభివృద్ధి సంస్థ), విద్యా శాఖ, ఆడిట్ శాఖ (అక్కౌంట్సు శాఖ రాసిన జమా ఖర్చులు సరిగా ఉన్నాయా లెవ అని పరిశీలించి, తప్పులను, అనవరంగా చేసిన ఖర్చులను వెదికి అభ్యంతరాలను నమోదు చేస్తుంది), లీగల్ సెల్ (మహా విశాఖ నగరపాలక సంస్థ మీద ఎవరైనా దావాలు వేసిన వాటికి సమాధానలు ఇవ్వటం, కొన్ని న్యాయసంబంధమైన సలహాలు సంస్థకు ఇవ్వటం, వంటి పనులు చేస్తుంది). ఈ 11 శాఖలకు అధిపతులు ఉంటారు. ఈ 11మంది అధిపతులు, మహా విశాఖ నగర పాలక సంస్థ అధిపతి అయిన కమిషనరు (ఐ.ఏ.ఎస్ అధికారి) ఆధ్వర్యంలో పనిచేస్తారు.

విశాఖ పట్నం నగర అభివృద్ధి కొరకు విశాఖపట్నం మెట్రోపొలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుచేయబడింది.

 

భారతదేశ 2011 జనాభా లెక్కల ప్రకారం , విశాఖపట్నం జనాభా 1,728,128, వీరిలో పురుషులు 873,599, ఆడవారు 854,529, - లింగ నిష్పత్తి 1000 మగవారికి 978 మంది. జనాభా సాంద్రత 18,480 /చ. కిమీ  (47,900 / చదరపు మైళ్ళు). 0–6 సంవత్సరాల వయస్సులో 164,129 మంది పిల్లలు ఉన్నారు, 84,298 మంది బాలురు మరియు 79,831 మంది బాలికలు ఉన్నారు - లింగ నిష్పత్తి 1000 మంది అబ్బాయిలకు 947 మంది బాలికలు. మొత్తం 1,279,137 మంది అక్షరాస్యులతో సగటు అక్షరాస్యత రేటు 81.79% గా ఉంది, వారిలో 688,678 మంది పురుషులు మరియు 590,459 మంది స్త్రీలు ఉన్నారు.  ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో విశాఖపట్నం 122 వ స్థానంలో ఉంది.  మొత్తం మురికివాడ జనాభా  జనాభాలో 44.61%. అంటే 770,971 మంది మురికివాడల్లో నివసిస్తున్నారు. 

నగర పరిమితుల విస్తరణ తరువాత జనాభా రెండు మిలియన్ల మార్కును దాటి 2,035,922 వద్ద ఉంది. 

తెలుగు స్థానిక ప్రజలు  ఎక్కువగా మాట్లాడే భాష  మరియు అధికారిక భాష.     సాధారణ మాండలికం,ఉత్తరాంధ్రా (ఈశాన్య ఆంధ్ర) మాండలికం వాడుకలోవున్నాయి. ఉత్తరాంధ్ర మాండలికం ప్రధానంగా విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ప్రజలు మాట్లాడతారు.  విశాఖపట్నం యొక్క కాస్మోపాలిటన్ జనాభాలో తమిళులు,   మలయాళీలు,   సింధీలు,  కన్నడిగులు,   ఒడియాస్,  బెంగాలీలు, భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుండి వచ్చిన బిహారీ వలసదారులు ఉన్నారు.    నగరం మొదటి కాస్మోపాలిటన్లుగా పరిగణించబడే ఆంగ్లో-ఇండియన్ సముదాయం కూడా ఉంది. 

పౌరులలో హిందూ మతం ఎక్కువమంది ఆచరిస్తున్నారు, తరువాతి స్థానాలలో  ఇస్లాం మరియు క్రైస్తవ మతం ఉన్నాయి. ఈ ప్రాంతం పురాతన కాలంలో బౌద్ధమతం ప్రాబల్యంవుండేది అనేదానికి చిహ్నంగా  దగ్గర ప్రాంతాల్లోని అనేక బౌద్ధ సంఘరామాలున్నాయి. ఇటీవలి జనాభా లెక్కల ఆధారంగా మొత్తం నగరంలో బౌద్ధమతస్తుల జనాభా సుమారు 0.03% గా ఉంది. 

వైద్య రంగంలో విశాఖ పట్నం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోనే మెరుగైన సేవలు అందుబాటులో ఉన్నాయి. అనేక మల్టి సూపర్ స్పెషలిటీ హాస్పిటళ్లు ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నాయి. ప్రభుత్వ రంగం లోని కింగ్ జార్జ్ హాస్పిటల్, విక్టోరియా హాస్పిటల్, విశాఖ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ తో పాటు, టాటా కాన్సర్ ఇన్స్టిట్యూట్, ఇండస్ హాస్పిటల్స్, సెవెన్ హిల్స్ హాస్పిటల్స్, ప్రథమ హాస్పిటల్, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, పినాకిల్ హాస్పిటల్, మై క్యూర్, కేర్, అపోలో, ఓమ్ని వంటి హాస్పిటల్స్ ఇక్కడ నెలకొల్పబడ్డాయి.

ఆంధ్ర వైద్య కళాశాల, గీతం మెడికల్ కాలేజ్, గాయత్రీ విద్య పరిషద్ మెడికల్ కాలేజ్, ఎన్నారై మెడికల్ కాలేజ్ వంటి వైద్య సేవలతో పటు వైద్య విద్యను అందిస్తున్నాయి.

క్రీడా రంగ అభివృద్ధి కొరకు నగరం అనేక మైదానాలు ఏర్పాటు చేయబడ్డాయి. డా.వై.ఎస్.ఆర్.క్రికెట్ స్టేడియంలో అంతర్జాతీయ స్థాయి అన్ని ఫార్మాట్ల క్రికెట్ మ్యాచ్ లు జరుగుతాయి. ఇక్కడ డే అండ్ నైట్ మ్యాచ్ లకు సైతం ఆతిధ్యం ఇచ్చే సౌకర్యం ఉంది. ఇది కాక నగరంలో పోర్ట్ ఇండోర్ స్టేడియం, పోర్ట్ ట్రస్ట్ డైమండ్ జూబిలీ స్టేడియం, స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం, ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, ఉక్కు స్టేడియం వంటి క్రీడా ప్రాంగణాలు ఔత్సాహికులు అయిన క్రీడా కారులను తీర్చిదిద్దుతున్నాయి.

విశాఖ ప్రముఖ పారిశ్రామిక కేంద్రం. ఎన్నో భారీ పరిశ్రమలు ఇక్కడ నెలకొని ఉన్నాయి. వాటిలో కొన్ని:

ఉక్కునగరంలోని విశాఖ ఉక్కు కర్మాగారం 6.3 మిలియన్ టన్నుల సామర్ధ్యానికి విస్తరిస్తున్న తరుణంలో భవిష్యత్తులో ముడిసరుకు కొరత తలెత్తకుండాఅ ఉండేందుకు ఐరన్ ఓర్ (ఇనుప ఖనిజం) ఐరన్ ఓర్ యార్డు నిర్మాణాన్ని సంస్థ చేపడుతోంది సుమారు రూ.418 కోట్లతో నిర్మించనున్న ఐరన్ ఓర్ యార్డు నిర్మాణానికి 2010 జూలై 21 బుధవారం శంకుస్థాపన జరిగింది. ఐరన్ ఓర్ యార్డు నిర్మాణం పూర్తయితే సుమారు ఆరు లక్షల టన్నుల ముడి ఇనుప ఖనిజాన్ని నిల్వ చేయవచ్చు. యార్డు నిర్మాణంలో 65 వేల ఘనపు మీటర్ల కాంక్రీటు, 930 టన్నుల ఇనుము ఉపయోగించనున్నారు యార్డు నుంచి బ్లాస్ట్ ఫర్నేస్ విభాగానికి నేరుగా ఇనుప ఖనిజాన్ని చేరవేసేందుకు పది కి.మీ పొడవుగల కన్వేయరు బెల్టును నిర్మిస్తారు. ఐరన్ ఓర్ యార్డు నుంచి 3.4 కి.మీ పొడవుగల రైల్వే లైను ఏర్పాటు చేస్తున్నారు. అనుకోని పరిస్థితిలో (బందులు, లారీల సమ్మె, ఆందోళనలు, శాంతిభద్రతలకు భంగం జరిగిన సమయంలో, యుద్ధ వాతావరణంలో) రవాణా జాప్యమైతే కర్మాగారం ఇబ్బందుల్లో పడకుండా నిల్వ ఉంచిన ముడిసరుకును వినియోగించుకోవచ్చును. భవిష్యత్తులో గనుల నుంచి నేరుగా కర్మాగారానికి పైపుల ద్వారా ముడిసరుకు సరఫరా చేసేలా ఇప్పటికే ఒప్పందం చేసుకున్నారు.

టెక్ మహెంద్ర, హెచ్.ఎస్.బి.సి, సయ్ంట్, కాంసెట్రిక్, ఫ్లుఎంట్ గ్రిడ్, విప్రొ, సంక్య, సైనెక్టిక్ ఇన్ఫోటెక్ ప్రైవేటు లిమిటెడ్, నూనెట్ టెక్నాలజీస్ ఇక్కడ వున్న  ప్రముఖ ఐటి సంస్థలు. ఐ.బీ.ఎమ్ వారు విశాఖ నడి ఒడ్డున వున్న రాంనగర్ లో కార్యాలయం ఏర్పాటు చేసారు

వైజాగ్ సమీపంలోని పరవాడ,పైడి భీమవరంలో ఫార్మా కంపెనీలు అభివృద్ధి చెందాయి. మైలన్, ఫైజర్,ఆవ్ర వంటి కంపెనీలున్నాయి.

భారత నౌకా దళ తూర్పు కమాండుకు విశాఖపట్నం కేంద్ర స్థానం.(ప్రధాన స్థావరం).

జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి చెందింది, పలు పర్యాటక స్థలాలు, పుణ్యక్షేత్రాలు, కయాకింగ్, స్కూబా డైవింగ్, ట్రెక్కింగ్, జెట్ స్కీయింగ్, పారా గ్లైడింగ్, హెలి పర్యాటకం వంటి సాహస క్రీడా సదుపాయాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. జిల్లాలోని పర్యాటక ప్రదేశాలన్నీ కలిపి 2017లో కోటి 78 లక్షల మంది పైచిలుకు, 2016లో రెండుకోట్ల 6 లక్షల పైచిలుకు పర్యాటకులు సందర్శించారని ప్రభుత్వ అంచనా. 2016, 2017 సంవత్సరాల్లో అత్యధిక పర్యాటకులు సందర్శించిన ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో విశాఖపట్టణం జిల్లా మూడవ స్థానంలో కొనసాగుతోంది. విదేశీ పర్యాటకులు అత్యధికులు సందర్శించిన జిల్లాల్లో 2016, 2017ల్లో రెండో స్థానం నిలబెట్టుకుంది.

'ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్'(ఈపీడీసీఎల్)  సంస్థ పరిధిలో విశాఖపట్నం జిల్లాలోనే విద్యుత్ వాడకం ఎక్కువగా ఉంటుంది. భారీ పరిశ్రమలు, వాణిజ్య, గృహావసరాలకు అవసరమైన విద్యుత్ సరఫరాను ఈ సంస్థ సరఫరా చేయాలి. ప్రతి ఏడాది రోజువారీ పరిమితి (కోటా) 8 మిలియన్ యూనిట్ల నుంచి పది మిలియన్ యూనిట్ల వరకు ఉండేది. 2011కు ముందు  సగటున  రోజు వారి వినియోగం 8-10 మిలియన్ యూనిట్లు  వుండగా  2011కు 11 మిలియన్ యూనిట్లకు పెరిగింది.

చెన్నై-కోల్‌కతా లను కలుపు 16 వ నంబరు జాతీయ రహదారి, విశాఖపట్నం-రాయపూర్ లను కలుపు 26 వ నంబరు జాతీయ రహదారి విశాఖను దేశం లోని మిగిలిన ప్రాంతాలతో అనుసంధానిస్తున్నాయి.

విశాఖపట్నం లోని ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ చే నిర్వహించబడు ద్వారకా బస్సు స్టేషన్ కాంప్లెక్స్ నుండి ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, తమిళనాడు (చెన్నై), కర్ణాటక (బెంగళూరు) రాష్ట్రాలకు అంతరాష్ట్ర సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. దాదాపుగా రాష్ట్రం లోకి అన్ని ప్రాంతాలకు ఈ బస్సు స్టేషన్ నుండి బస్సు సౌకర్యాలు ఉన్నాయి. మద్దిలపాలెం,అనకాపల్లి బస్ స్టేషన్ ల నుండి కూడా సర్వీసులు నడుపబడతాయి.

విశాఖపట్నం నగరంలోని నగర బస్సులు ఎ.పి.ఎస్.ఆర్.టి.సి వారి అజమాయిషీలో నడుపుతున్నారు. నగరం లోని దాదాపు అన్ని ప్రాంతాలకు సిటీబస్ సౌకర్యం అందుబాటులో ఉన్నాయి.విశాఖ నగరంలో సింహాచలం,గాజువాక,ఉక్కునగరం,పాత పోస్టాఫీసు,మద్దిలపాలెం,మధురవాడ,వాల్తేరు, కుర్మన్నపాలెం,అనకాపల్లి వంటి ప్రాంతాలలో సిటీ బస్సు డిపోలు ఉన్నాయి తగరపువలసలో కూడా డిపో ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయి.ఈ డిపోల నుండి సిటీ ఆర్డినరీ,మెట్రో షట్టిల్స్,మెట్రో లగ్జరీ వంటి బస్ లు సేవలు అందిస్తున్నాయి. అంతే కాకుండా నగరం నుండి విజయనగరం,శ్రీకాకుళం డిపో లకు కూడా మెట్రో లగ్జరీ సిటీ బస్ లు సేవలు అందిస్తున్నాయి.అలాగే నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించడానికి శీఘ్రవంతమైన ప్రజా రవాణా కొరకు బి.అర్.టి.ఎస్ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది.అలాగే నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించడానికి గ్రేటర్ విశాఖ, రాష్ట్ర ప్రభుత్వం నగరంలో అత్యంత ముఖ్యమైన ఎన్.ఏ.డీ కూడలి వద్ద ప్లైఓవర్ బ్రిడ్జిను నిర్మిస్తున్నారు.అలాగే హనుమంతవాక కూడలి,గాజువాక కూడళ్ళ వద్ద కూడా ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఎ.పి.ఎస్.ఆర్.టి.సి సిటీ బస్సులు మాత్రమే కాక అగ్రిగేటర్స్ అయినా ఉబెర్, ఓలా సంస్థలు, ఇతర స్థానిక ప్రైవేటు ఆపరేటర్లు నిర్వహించే క్యాబ్ సేవలు, ఆటోలు స్థానిక రవాణా కొరకు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు మోటారు సైకిళ్ళు, కార్లు అద్దెకు ఇచ్చే సంస్థలు కూడా నగరంలో అందుబాటులో ఉన్నాయి.

నగరంలో మూడు రైలు మార్గాలలో మెట్రో రైలు వ్యవస్థ ప్రతిపాదించబడింది.

దేశంలో నాల్గవ అత్యధిక ఆదాయం కలిగిన వాల్తేరు డివిజన్ ప్రధాన కేంద్రం విశాఖ పట్నంలో ఏర్పాటు చేయబడింది.

హౌరా - చెన్నై రైలు మార్గంలో విశాఖపట్నం జంక్షన్ ఒక ప్రధాన రైల్వే స్టేషన్. దేశంలో దాదాపు అనేక ప్రాంతాలకు ఇక్కడి నుండి ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంది. ప్రధాన రైల్వే స్టేషన్ కాకుండా దువ్వాడ, అనకాపల్లి రైల్వే స్టేషన్ లలో కూడా అనేక ఎక్స్ ప్రెస్ రైళ్లు నిలుస్తాయి. సింహాచలం రైల్వే స్టేషన్ లో కూడా కొన్ని ఎక్ప్ ప్రెస్ రైళ్లు, పాసెంజర్ రైళ్లు నిలుస్తాయి. ఇవి కాకుండా మర్రిపాలెం, పెందుర్తి, తాడి వంటి చిన్న రైల్వే స్టేషన్లు నగరంలో ఉన్నాయి. ప్రధాన రైల్వే స్టేషన్ పై వత్తిడి తగ్గించుటకు కొన్ని రైళ్లు దువ్వాడ సింహాచలం మీదుగా మళ్లించటం జరుగుతోంది.

జోధ్ పూర్, విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీ, గుంటూరు, కొల్లం, షిర్డీ, ముంబయి, కోరాపుట్, తిరుపతి, భువనేశ్వర్, గాంధీ ధామ్, కోలకతా, దీఘా, టాటా నగర్, చెన్నై, నరసాపురం, మచిలీపట్టణం, కోర్బా, నాందేడ్, కిరండూల్, పారాదీప్ నగరాలకు ఎక్స్ ప్రెస్ రైళ్లు రాయపూర్, గుణుపూర్, కిరండూల్, కోరాపుట్, శ్రీకాకుళం రోడ్, అరకు, విజయవాడ, బరంపూర్, రాయగడ, కాకినాడ, విజయనగరం, రాజమహేంద్రవరం, పలాస, దుర్గ్ నగరాలకు పాసెంజర్ రైళ్లు విశాఖపట్నం స్టేషన్ నుండి ప్రారంభం అవుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా తూర్పు కోస్తా రైల్వే నుండి వాల్తేర్ డివిజన్ ని, దక్షిణ మధ్య రైల్వే లోని విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్ ల కలిపి దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వాల్తేరు డివిజన్ లోని ఒడిశా భాగాలూ నూతనంగా ఏర్పాటు చేయబడు రాయగడ డివిజన్ లో భాగం కానున్నాయి. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ లోని మిగిలిన భాగాలు విజయవాడ డివిజన్ లో విలీనం చేసేలా సూత్ర ప్రాయంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.

విశాఖపట్నంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇక్కడి నుంచి ఎయిర్ ఏషియా, ఎయిర్ ఇండియా, అలయన్స్ ఎయిర్, ఇండిగో, స్కూట్ స్పైస్ జెట్,సిల్క్ ఏర్వేస్, శ్రీలంక ఏర్ వేస్ వంటి విమానయాన సంస్థలు కౌలాలంపూర్ దుబాయ్, సింగపూర్,శ్రీలంక వంటి దేశాలకు అంతర్జాతీయ సర్వీస్ లు, దేశీయంగా బెంగళూరు, కోలకతా, ఢిల్లీ, హైదరాబాద్, ముంబాయి, పోర్ట్ బ్లెయిర్, విజయవాడ, చెన్నై, రాజమహేంద్రవరం, వారణాసి నగరాలకు విమాన సౌకర్యం కల్పిస్తున్నాయి. ఇక్కడనుండి కార్గో సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా ప్రస్తుతం ప్రయాణికుల సౌకర్యం కొరకు టెర్మినల్ భవనాన్ని విస్తరిస్తున్నారు

ఇది నౌకాదళం అధీనంలో నడిచే విమానాశ్రయం. ఇందులోనే ఐ.ఎన్.ఎస్. డేగ పేరుతో నౌకాదళానికి చెందిన విమానాలు, హెలికాప్టర్లు ప్రయాణిస్తుంటాయి. ఇది పౌరులకు నిషిద్ధ ప్రాంతం.

పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా భోగాపురంలో ఆధునిక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

రుషి కొండలో నగర విహంగ వీక్షణం కొరకు సెలవుదినాలలో, పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండే సమయాలలో హెలికాప్టర్ సౌకర్యం ఏర్పాటు చేయబడింది.

ఇక్కడ సంవత్సరంలో అన్ని రోజులు నౌకలు నిలుపుదల చేయగల సహజ సిద్ద నౌకాశ్రయం కేంద్ర ప్రభుత్వ అధీనంలో లోని విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. ఇది కాకుండా దేశం లోనే లోతైన పోర్ట్ అయిన గంగవరం పోర్ట్ ద్వారా కూడా ఎగుమతులు దిగుమతులు జరుగుతున్నాయి. స్థానిక జాలర్ల కొరకు రాష్ట్రం లోనే అతి పెద్ద ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయబడింది.

ఎగుమతులు,దిగుమతుల కోసం కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు ఏర్పాటు చేయబడింది.

విశాఖ పోర్ట్ నుండి పోర్ట్ బ్లెయిర్ కి క్రూయిజ్ సౌకర్యం ఉంది.

పర్యాటకుల విహారం కొరకు ఫిషింగ్ హార్బర్ నుండి, రుషికొండ బీచ్ నుండి సాగరంలో బోటింగ్ సౌకర్యాలు ఉన్నాయి.

సి ఎం ఆర్ సెంట్రల్ - ఐనాక్స్ మల్టీ ప్లెక్స్ (4 స్క్రీన్ లు)

ఐనాక్స్ - వరుణ్ బీచ్ (6 స్క్రీన్ లు)

చిత్రాలయ - ఐనాక్స్ (3 స్క్రీన్ లు)

విశాఖపట్నం సెంట్రల్ - ముక్తా ఎ2 సినిమాస్ (3 స్క్రీన్ లు)

విశాఖపట్నంలో లైన్స్ క్లబ్ (లయన్స్ క్లబ్), రోటరీ క్లబ్, ఇన్నర్ వీల్ క్లబ్. సావిత్రిబాయి ఫూలే ట్రస్టు, గోపాల పట్నం. ప్రతిజ్ఞ ఛారిటబుల్ ట్రస్టు, ఆర్.పి.పేట, మర్రిపాలెం, ప్రేమ సమాజం వంటి అనేక స్వచ్ఛంద సంస్థలున్నాయి

విశాఖపట్నంలో సాంస్కృతిక కార్యక్రమాలకు, సంప్రదాయ కళలకు కాణాచి అయిన కళాభారతి 1991 మార్చి 3 న స్థాపించారు. వ్యవస్థాపక దినోత్సవము ప్రతీ సంవత్సరము 3 మార్చి న జరుగుతుంది. సంగీత విద్వన్మణి సుసర్ల శంకర శాస్త్రి కలలకు ప్రతీకగా పుట్టిన ఈ ఆడిటోరియాన్ని 1991 మే 11 తేదీన పిఠాపురం కాలనీలో ప్రారంభించారు. ఇక్కడ నిత్యం, వివిధ సంగీత కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు (సంప్రదాయ, జానపద), నాటకాలు జరుగుతూ, ఆంధ్ర దేశపు ఔన్న్తత్యాన్ని తెలియ జేస్తుంటాయి. ఆగస్టు 2011 లో రజతోత్సవాలు జరుగుతాయి.

ఈ సంస్థ విశాఖపట్నంలోని సంగీత (కర్ణాటక, హిందుస్థానీ), నృత్య కార్యక్రమాలకు కేంద్ర స్థానంగా ఉంది. సంగీత, నృత్య ప్రదర్శనల కార్యక్రమాలను, త్యాగరాజు ఆరాధనోత్సవాలు, మొదలైన కార్యక్రమాలు జరిస్తుంది. విశాఖపట్నంలోని సంగీతం, నృత్యం అంటే అభిమానం ఉన్నవారికి, ఈ సంస్థ వారిని నిత్యం ఆనందింపచేస్తుంది.




#Article 134: తూర్పు గోదావరి జిల్లా (2164 words)


తూర్పు గోదావరి జిల్లా, భారత దేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఈశాన్యాన 16° 30', 18° 20' ఉత్తర అక్షాంశాల మధ్య, 81° 30', 82° 36' తూర్పు రేఖాంశాల మధ్య ఉంది.కాకినాడ, రాజమహేంద్రవరం దీని ముఖ్యపట్టణాలు. కాకినాడ, రాష్ట్ర రాజధాని అమరావతికు 246కి.మీల దూరంలో ఉంది.

చరిత్రలో పిష్టపురం (పిఠాపురం) ప్రస్తావన మొదటి సారిగా సముద్రగుప్తుని అలహాబాదు జయస్తంభంపై కనిపిస్తుంది. సముద్రగుప్తుడు 360 CE లో దక్షిణాదిగా రాజ్యవిస్తరణ జరిపినపుడు పిష్టపురంలోని మహేంద్రుడనే రాజును జయించాడని ఆ జయస్తంభ శాసనంలో చెప్పబడింది. అంటే అప్పటికే పిఠాపురం రాజధానిగా ఉండిన ఒక గొప్ప పట్టణంగా భావించాలి.
 

పై రెండు శాసనాల ద్వారా అటు శ్రీకాకుళం నుండి ఇటు పశ్చిమగోదావరి ఆచంటవరకూ ఉన్న ప్రాంతానికి పిఠాపురం రాజధానిగా ఉండేది అని అనుకోవచ్చు.

అనంతవర్మ తరువాత పిష్టపురంపై ఆధిపత్యంకోసం కళింగరాజులకు గుంటూరు ప్రాంతపాలకులైన శాలంకయనులకు పోరు నడిచి చివరకు ఏడవ శతాబ్దంలో ఇది బదామి చాళుక్యుల ఆధీనంలోకి వెళ్ళిపోయింది.

బదామి చాళుక్యుడైన రెండవ పులకేశి (610-642) తన రాజ్యాన్ని దక్షిణాది వరకూ విస్తరించాడు ఆ క్రమంలో వేంగిని జయించి ఈ ప్రాంతానికి పిఠాపురాన్ని రాజధానిగా చేసి తన తమ్ముడు కుబ్జ విష్ణువర్ధనుడిని ఇక్కడ నిలిపి తనకు సామంతుగా ఉంటూ పాలించుకొమ్మని అప్పగించాడు.

కుబ్జవిష్ణు వర్ధనుడు (624-641) పిఠాపురాన్ని రాజధానిగా చేసుకొని గోదావరి ప్రాంతాన్ని పాలించాడు.

ఇతని కుమారుడు జయసింహ I పరిపాలనా సౌలభ్యం కొరకు రాజధానిని పిఠాపురం నుంచి వేంగికి మార్చాడు. ఆ విధంగా పిఠాపురం వేంగి రాజ్యానికి రెండవ రాజధానిగా మారి తన ప్రాభవాన్ని కొంతమేరకు కోల్పోయింది.

ఏడవ శతాబ్దం వరకూ ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులు జైన మతాన్ని ప్రోత్సహించారు. పిఠాపురంలో నేటికి సన్యాసిరాళ్ళు/దేవుళ్ళు పేరుతో జైన విగ్రహాలు ఆరాధనలు అందుకొంటున్నాయి. తపస్సుచేసుకొంటున్న ముని ఆకారంలో ఉన్న రాతివిగ్రహాలన్నీ జైన లేదా బౌద్ధానికి చెందిన ప్రతిమలుగా గుర్తించవచ్చు. జెల్లూరులో లభించిన కొన్ని జైన విగ్రహాలకు స్థానికులు గుడి కట్టి దీపారాధనలు చేస్తున్నారు. ఆ తరువాత శైవం ప్రచారంలోకి రావటంతో చాలా జైన/బౌద్ధ ఆలయాలు, శివాలయాలుగా రూపాంతరం చెందాయి. నేటి పంచారామాలు ఒకనాటి బౌద్ధారామాలని అంటారు చరిత్రకారులు. వీటిలో నాలుగు ఆలయాలు గోదావరి జిల్లాలలో ఉండటానికి కారణం ఒకప్పుడు ఈ ప్రాంతంలో వెల్లివిరిసిన జైన బౌద్ధాలే కారణం. 

పిఠాపురం, కుంతీమాధవస్వామి ఆలయంలో ధ్వజస్తంభం పక్కనే ఉన్న ఒక శాసనం ఆంధ్ర ప్రాంత రాజుల వంశావళిని నిర్మించటానికి చరిత్రకారులకు ఎంతో సహాయపడింది. ఇది నలుపలకలుగా సుమారు పన్నెండు అడుగుల పెద్ద స్తంభంలా ఉండే శాసనం. దీనికి నాలుగువైపులా వ్రాసిన శాసనాలు ఉన్నాయి. లిపి తెలుగు. భాష సంస్కృత, తెలుగు మిశ్రమము.

ప్రస్తుతం మనం చూస్తున్న పిఠాపురం కుంతీమాధవస్వామి ఆలయం పదిహేడవ శతాబ్దంలో నిర్మించారు. నిజానికి ఈ ఆలయానికి కనీసం వెయ్యేళ్ల చరిత్ర ఉంది. పాత ఆలయ అవశేషాలు ఒక్కటీ కనిపించవు. అంతా రాతిసున్నం కట్టుబడి.

పైన చెప్పిన శాసనం మాత్రం పాతదిగా తెలుస్తున్నది. మెకంజి సామర్లకోట కైఫియత్తులో ఈ శాసనంలోని వివరాలు యధాతధంగా స్థానిక చరిత్రగా పొందుపరచబడ్డాయి.

E. Hultzsch అనే చరిత్రకారుడు ఈ శాసనాన్ని పరిష్కరించి వ్రాసిన ముప్పై పేజీల వ్యాసం Epigraphia Indica Vol IV లో ఉంది. 
.
శాసన విషయం

మూడవ గొంకరాజు భార్య, పృధ్వీశ్వర మహారాజు తల్లి అయిన జయాంబిక నవకండవాడ అనే గ్రామాన్ని నిత్యదీపారాధనకొరకు కుంతీమాధవ స్వామికి సమర్పించుకొన్న సందర్భంగా ఇది 1186 CE లో వ్రాయించిన శాసనము. 
ఈమె మాధవదేవరకు, శ్రీ లక్ష్మిదేవి అమ్మవారికి గోపురములు, ప్రాకారములు కట్టించెను.

నవకంఢవాడ నేటి కాండ్రకోటకావొచ్చు. ఈ గ్రామానికి సరిహద్దులుగా – తూర్పువైపున పెరవ, నైరుతి వైపున ఇదురవాము, దక్షిణము వైపున సూరెగుండ, పడమరవైపున కొమ్మినాయకుని చెరువు, ఉత్తరము వైపున పుట్టలత్రోవ ఉన్నవని స్పష్టంగా వివరాలు ఉన్నాయి. కానీ ఈ గ్రామనామాలు నేడు వాడుకలో లేవు. శాసనము దిగువన, చెక్కిన వ్యక్తి పేరు అయ్యపిల్లార్య, కంఠాచారి శ్రీపిఠాపురం అని ఉంది.

ఈ శాసనంలో సుమారు పాతికమంది రాజుల వంశ కాలక్రమణిక లిఖించబడింది. ఇతరప్రాంతాలలో లభించే శాసనాలు, తామ్రఫలకాలలోని వ్యక్తుల వంశావళిని ఈ కుంతీమాధవస్వామి ఆలయశాసనంతో పోల్చి సరిచూసుకొని వాటి కాలాన్ని చరిత్రకారులు నిర్ధారించటం చేస్తున్నారంటే ఈ శాసనం ఎంతవిలువైనదో అర్ధం చేసుకోవచ్చును.

సాధారణంగా దానశాసనాల చివరలో అతిక్రమణలకు పాల్పడినవారు, బ్రాహ్మణ హత్య, తల్లి హత్య చేస్తే వచ్చేలాంటి పాపంమూటకట్టుకొని నరకానికి పోతారంటూ వివిధ రకాల శాపాలు ఉంటాయి.

ఈ శాసనంలో “దానం శత్రువు చేసినదైనప్పటికీ అది  రక్షింపబడాలి.  ఎందుకంటే శత్రువు శత్రువే కావచ్చు, కానీ దానం శత్రువు కాదు” అనే గొప్ప వాక్యం ఆకర్షిస్తుంది.

బుచ్చి కుమారవెంట్రాయినిం గారు 1775 లో పిఠాపుర సంస్థానాధిపతి అయినపుడు, ఈ కుంతీమాధవస్వామి దేవాలయముకు ముఖమంటప ప్రాకారము కట్టించి, శ్రీస్వామికి ఆభరణములు చేయించి, నూతన చూడిగుదత్త అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసారు. (రి. మెకంజి కైఫియత్తు). బహుశా నేడు చూస్తున్న ఆలయాకారము వీరు నిర్మించినదే కావొచ్చు.

పిఠాపురానికి మూడవ శతాబ్దమునుంచి ఘనమైన చరిత్రకలదు కనుక నేటి కుంతీమాధవస్వామి ఆలయం ఆనాటినుంచి ఉన్నదే కావొచ్చు.

ఆరవ శతాబ్దం వరకూ ఆలయాల నిర్మాణంలో పైకప్పు కలపతో నిర్మించటం ఎక్కువగా జరిగేది కనుక ఆనాటి ఆలయం శిథిలమైపోయి ఉండవచ్చు.

ఇది ఒకప్పుడు జైన ఆలయం కావటానికి అవకాశాలు ఎక్కువ. కాలక్రమేణా హిందూ ధర్మం విస్తరించింది.
మెకంజి సేకరించిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బోయినపూడి కైఫియత్తులో ముక్కంటి అనేరాజు ఈ ప్రాంతంలో ఉన్న జైనులను గానుగతొక్కించి సామూహికంగా వధించాడని ఉంది.

తూర్పుగోదావరి జిల్లాను ప్రారంభ చరిత్రను అనుసరించి మిగిలిన దక్కన్ పీఠభూమిలాగా మౌర్యులు, నందుల చేత పాలించబడింది. మౌర్యసామ్రాజ్య పతనము తరువాత మూడవ శతాబ్దం ప్రముఖ కవి, రాజు అయిన హలచక్రవర్తి వరకు ఈ ప్రదేశం శాతవాహనుల చేత పాలించబడింది. త్రవ్వకాలలో లభించిన నాణ్యాలు ఆధారంగా గౌతమీపుత్ర శాతకర్ణి, వాసిష్టీ-పుత్ర పులుమాయి, యజ్ఞశ్రీ శాతకర్ణి పాలించినట్లు నిరూపితమైంది. 350 ఎ.డిలో పిష్టాపుర, అవాముఖ కాలంలో ఈ ప్రదేశం మీద సముద్రగుప్తుడు దండెత్తినట్లు ఆధారాలు ఉన్నాయి. సముద్రగుప్తుని దండయాత్ర తరువాత ఇక్కడ 375-500 వరకు మద్రసామ్రాజ్యం పాలనసాగింది. వీరిలో మొదటి పాలకుడు మహారాజా శక్తివర్మ.

ఈ జిల్లా తరువాత 5వ శతాబ్దంలో  విక్రమ వర్మ కాలంలో  విష్ణుకుండినుల హస్థగతం అయింది. విష్ణుకుండినుల సామ్రాజ్యం విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, తూర్పు గోదావరి జిల్లా వరకు విస్తరించింది. వశిష్ఠకుల పాలకులను ఇంద్రభట్టారకుడు ఓడించి విష్ణుకుండినుల సామ్రాజ్యం స్థాపించాడు. అయినా త్వరితంగా కళింగ సైన్యాల చేత ఓడింపబడ్డాడు. ఇంద్రభట్టారకుడు తరువాత మూడవ మాధవర్మ, మంచన్న భట్టారక పాలన కొనసాగింది. వీరు తమ సామ్రాజ్యాన్ని తిరిగి స్థాపించాలని ప్రయత్నించారు. ఈ వంశపు కడపటి చక్రవర్తి మూడవ మాధవర్మ.

తూర్పుగోదావరి జిల్లాలో అనేకమంది రాజవంశీయులు జమిందారులు ఉన్నారు. రాజపుత్రులు అయిన సూర్యవంశ రాజుల వారసులు ఈ జిల్లాలో 12వ శతాబ్దంలో ఇక్కడకు వలస వచ్చారు. ప్రముఖ జమిందారులు పెద్దాపురం, తుని, రామచంద్రపురం వాళ్ళు. ఇక్కడ జగపతులు అని బిరుద నామంతో పిలువబడుతున్న వత్సవై రాజులు కూడా ఉన్నారు.

బాదామి చాళుక్యులకు చెందిన రెండవ పులకేశి, అతను సోదరుడు విష్ణువర్ధనుడు పిష్టాపురాన్ని 7వ శతాబ్దంలో అధిపత్యం వహించాడు. కుబ్జ విష్ణు వర్ధనుడు స్థాపించిన తూర్పు చాళుక్య సామ్రాజ్యం మొదట పిష్టాపురాన్ని తరువాత వేంగి, రాజమండ్రి వరకు పాలించాడు. అనేక రాజులు పాలించిన కారణంగా వారి వంశస్థుల పాలనా చరిత్ర వివాదాస్పదమౌతుంది. మొదటి చాళుక్య చక్రవర్తి బీమా దాక్షారామంలో శివాలయం ఆలయనిర్మాణం చేసాడు. 1973లో ఈ సామ్రాజ్యపు చక్రవర్తి అయిన ధనార్వుని పెదకల్లు (కర్నూలు జిల్లా) జాతచోడ భీమ చంపి వేంగిని ఆక్రమించుకున్నాడు. ధనార్వుడి ఇద్దరు కుమారులైన మొదటి శక్తివర్మ, విమలవర్మ పారిపోయి మొదటి రాజరాజచోళుని సభలో ప్రవేశించి అతనును ఆశ్రయించాడు. రారాజ చోళుడు ధనార్వుని కుమారుల తరఫున వేంగి మీద దండెత్తి జాతచోడ భీమను చంపాడు. కల్యాణికి చెందిన పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన సత్యరాయునికి వేంగి ప్రాంతం మీద చాళుక్యుల ఆధిపత్యం నచ్చలేదు. ఆ కారణంగా కారణంగా చోళులు, చాళుక్యుల మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. 175 ఎ డిలో ఏడవ విజయాఅదిత్యుడి మరణం తరువాత తూర్పు చాళుక్యసామ్రాజ్యం ముగింపుకు వచ్చింది.

ఏడవ విజయాదిత్యుడి శత్రువైన మొదటి కులోత్తుంగచోళుడు (రాజేంద్రచాళుక్యుడు) చోళుల తరఫున యుద్ధంచేసి చాళుక్య చోళుల సామ్రాజ్య స్థాపన చేసాడు. వేంగి రాజ్యం వెంట ఈ జిల్లా వారి సామ్రాజ్యంలో ఒక భాగం అయింది. జిల్లాలో అధిక భాగం చోళుల సామంతరాజైన వెలనాటి చోడుల ఆధిక్యతకు వశమైంది. చోళసామ్రాజ్యపు ప్రముఖ పాలకులు మొదటి గోయంకా, మొదటి రాజేంద్రచోడా, రెండవ గోయంకా, రెండవ రాజేంద్రచోడ.

ఈ ప్రదేశాన్ని పడమటి చాళుక్యుడైన ఏడవ విక్రమచోడుడు ఆక్రమించుకుని కొంతకాలం ఆధిక్యత సాధించాడు. అయినా ఇది తిరిగి వెలనాటి చోడ, చాళుక్యుల వశమైంది. తరువాత వెలనాటి చోడులు తిరుగుబాటుదారులైన కోణాకు చెందిన హైహయులు, కాకతీయులకు చెందిన రెండవ గోయంకా, రుద్రాలచేత అణచబడి వశపరచుకున్నారు.

ఈ ప్రాంతంలో లభించిన శిలాశాసనాలు 13వ శతాబ్ధపు శిలాశాసనంతో కలిసి ఈ ప్ర్రాంత చరిత్రను వెలుగులోకి తెచ్చాయి. కాకతీయ చక్రవర్తి రెండవ ప్రోలా పశ్చిమ చాళుక్యుల నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు. అప్పటి నుండి చాళుక్యచోళులకు ప్రతిధ్వంది అయ్యాడు. అతను కుమారుడు రుద్రా రెండవ చాళుక్యచోళుని నుండి గోదావరి డేల్టాను బహుమతిగా పొందాడు. గోదావరి డెల్టా మీద రుద్రా ఆధిపత్యాన్ని వెలనాడు చోడాలు ఎదిరించారు. చాళుక్య చోళ వెలనాటి రాజైన రెండవ రాజేంద్ర చోడా అతను మంత్రి దేవన ప్రగ్గడ సైన్యాధ్యక్షతలో రుద్రా మీదకు దండయాత్రకు పంపించాడు. రుద్రా అతను కనిష్ఠ సోదరుడు మహాదేవా దేవగిరి యాదవులతో జరిగిన యుద్ధంలో మరణించిన తరువాత రాజ్యపాలన చేపట్టాడు. అతను కుమారుడు గణపతి కాకతీయ సింసానానికి తరువాత రాజయ్యాడు. గణపతి నెల్లూరు చోడుల సహాయంతో ఉత్తరంలోని కళింగ సైన్యాలను, మధురై పాండ్యులను, చోళులను ఓడించాడు. గణపతి కామము అతను కుమార్తె రుద్రమదేవి కాలం అంతా గోదావరి ప్రదేశమంతా కాకతీయుల ఆధిపత్యం కొనసాగింది. 1295లో ప్రతాప రుద్రుడు కాకతీయ సింహాసనం అధిష్ఠించినప్పటికీ ఢిల్లీ సుల్తానులతో అనేక పోరాటాలను ఎదుర్కొన్నాడు. 1323లో అతను ముహ్హమద్-బీన్-తుగ్లక్ చేతిలో ఓడిపోయిన తరువాత ఈ జిల్లా ఢిల్లీ సుల్తానుల ఆధిపత్యానికి చేరింది. ముహ్హమద్-బీన్-తుగ్లక్ దక్షిణభారతదేశాన్ని అయిదు సంస్థానాలుగా విభజించి వాటికి గవర్నర్లను నియమించింది.

ఢిల్లీ సుల్తానులు ప్రాంతీయ ప్రముఖులైన ప్రొలయా మున్సూరి నాయకుల తెగల నిరంతర తిరుగుబాటును ఎదుర్కొన్నారు. అద్దంకి రెడ్లు, పిఠాపురం కొప్పుల తెలగాలు, రాచకొండ రేచర్ల వెలములు అతనుకు సహకరించారు. వరంగల్లు స్వాతంత్ర్యం సాధించిన సందర్భంలో తెలుగు వారు 50 సంవత్సరాల అనంతరం తెలుగు భూమికి లభించిన స్వాతంత్ర్యానికి ఆనందించారు. మునుసూరి కపయ నాయకా తన బంధువులు అయిన అన్వొత నాయకా, ముమ్మడి నాయకా (కోరుకొండ)లను గోదావరీ ప్రదేశానికి గవర్నర్లుగా నియమించాడు. ముమ్మడి నాయకా కపయ నాయకా మేనకోడలిని వివాహం చేసుకున్నాడు. 1388 వరకు ముమ్మడి నాయకా జీవించాడు. అతనుకు ముగ్గురు కుమారులు తరువాత 40 సంవత్సరాలు ఈ ప్రాంతం మీద ఆధిపత్యం వహించి కొండవీటి రెడ్లచేత అణిచివేయబడ్డారు. తరువాత కళింగరాజైన ఐదవ నరసింహదేవ ఈ ప్రదేశాన్ని జయించి పాలించాడు అయినా రాజమడ్రికి చెందిన అనవొత రెడ్డిచేత అది తిరిగిస్వాధీనపచుకోబడింది. అతను తరువాత అదే సామ్రాజ్యానికి చెందిన అనవేమరెడ్డి, కుమరగిరి ఈ ప్రాంతాన్ని పాలించారు.

కుమరగిరి రాచకొండకు చెందిన రాచెర్లులు, కళింగ రాజులతో అనేక యుద్ధాలు చేసాడు. అతను తన కుమారుడైన అనవోత వెంట సైన్యాధ్యక్షుడు కాటయ వేముని తూర్పు ప్రాంతాలను జయించడానికి పంపాడు. ఫలితంగా ఉత్తరంగా పలు ప్రాంతాలు సింహాచలం వరకు సామ్రాజ్యంలో చేరాయి. కొత్తగా లభించిన ప్రాంతం రెడ్డిరాజుల రాజ్యంలో చేరింది. అలాగే ఈ విభాగం ప్రత్యేకంగా తూర్పురాజ్యంగా పిలువబడింది. రాజకుమారుడు అనవోత రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని ఈ ప్రాంతాన్ని పాలించాడు. అతను 1395 వరకు పాలించిన తరువాత చిన్న వయసులోనే మరణించాడు. తరువాత సైన్యాధ్యక్షుడు, బావమరిది అయిన కాటయ వేమునికి అతను చేసిన సేవలకు గుర్తింపుగా రాజమహేంద్రవరం లభించింది. కాటయ వేమను కొండవీటి సింహాసనం నుండి పెదకోమటి వేమ బలవంతంగా త్రోసి వేసిన తరువాత కాటయవేమ రాజమహేంద్రవరానికి వెళ్ళాడు. 
పెదకోమటి వేమ కాటయ వేమను ఓడించబడిన తరువాత కాటయవేమకు ఎరువా సైన్యాధ్యక్షుడు అన్నదేవ చోడునితో యుద్ధం ఏర్పడింది. అతను రాజమహేంద్రవరం లోని చాలాభాగం ఆక్రమించుకోబడింది. ఎలాగైతేనే అతడు కాటయవేమతో తరమబడ్డాడు. కాటయవేమ అన్నదేవచోడునితో చేసిన ఒక యుద్ధంలో మరణించాడు. అతను మరణించిన తరువాత అల్లాడరెడ్డి కాతయవేమ కుమారుడిని రాజమహేంద్రవరం పాలకుడిగా చేసి తాను రాజప్రతినిధిగా ఈ ప్రాంతాన్ని పాలించాడు. అల్లాడరెడ్డి 1423 లో తనకు మరణం సంభవించే వరకు ఈ ప్రాంతాన్ని పాలించాడు. 1443లో విజయనరం పాలకుడైన రెండవ దేవరాయ రాజు వీరభద్రుని ఓడించి ఈ రాజ్యాన్ని పాలించాడు.

కొండవీడులో పెదకోమటి వేమ తరువాత రాచవేమ సింహాసనాధిష్టుడయ్యాడు. అతను పాలన చాలా క్రూరంగా ఉండేది. ఒడిషా నుండి గజపతులు, విజయనగర రాయలు దండెత్తినప్పుడు అతనుకు ప్రజల నుండి కొంత సహాయం లభిస్తుండేది. కపిలేశ్వర గజపతి రెడ్డిరాజులను అణచివేసి రాజమహేంద్రవరాన్ని తన రాజ్యంలో కలుపుకున్నాడు.

గోల్కొండ పాలకుడు కుతుబ్ షాహి రాజ్యంలో ఏర్పడిన అననుకూల పరిస్థితులను తనకూలంగా మలచుకుని సుల్తాన్ కులీ కుతుబ్ షాహి కోస్తా ప్రాంతం మీద దండయాత్రచేసి రాజమండ్రి, దాని పరిసర రాజ్యాలను కైవశం చేసుకున్నాడు. సుల్తాన్ కులీ కుతుబ్ షాహి హత్యచేయడిన తరువాత అతడి కుమారుడైన జమ్షిద్ కుతుబ్ షాహ్ తరువాత అతను మనుమడు సుభాన్‌కుతుబ్‌షాహ్సింహాసనం అధిష్టించాడు. అతడి పాలనా కాలంలో ఇబ్రహీం షితాబ్‌ఖాన్, విద్యాధర్ల నుండి సవాళ్ళను ఎదుర్కొన్నాడు. అబ్దుల్ హాసన్ తానాషా ఈ ప్రదేశానికి చివరి పాలకుడు అయ్యాడు. అతను 1672-1687 మధ్య పాలన సాగించాడు. ఈ కాలంలోనే ముఘల్ చక్రవర్తి ఔరంగజేబు దక్షిణ భారతదేశం అతడి ఆధిపత్యంలోకి చేరింది. 1687 గోల్కొండ రాజ్యాన్ని ఔరంగజేబు జయించి స్వాధీనం చేసుకున్నాడు. అలాగే గోదావరి జిల్లా కూడా అతడి ఆధీనంలోకి వచ్చింది. అతడి సమ్రాజ్యంలోని 22 విభాగాలలో గోదావరి కూడా ఒకటి అయింది. ఔరంగజేబు ఈ సంస్థానాలను పాలించడానికి వైశ్రాయిని నియమించాడు. గోల్కొండ వైస్రాయ్ నిజామ్-ఉల్-ముల్క్ ఈ ప్రదేశాన్ని ఫౌజ్‌దార్లు అనబడే సైనికాధికారుల నిర్వహణలో పాలించాడు. ముఘల్ చక్రవర్తి ఫర్రుక్‌సియార్ దక్కన్ విభాగాన్ని పాలించడానికి నిజామ్- ఉల్ - ముల్క్ గా అసఫ్‌జాహ్‌ను నియమించాడు. ముహామ్మద్ షాహ్ సమయంలో అసఫ్‌షాహ్ స్థానంలో హుస్సేన్ అలి ఖాన్  ఖాన్ నియమించబడ్డాడు. 1724లో అసఫ్‌జాహ్ దక్కన్ మీద దాడి చేసి ముబరిజ్‌ఖాన్ను ఓడించి చంపి దక్కన్ ప్రాంతాన్ని హైదరాబాద్ నిజాముగా చేసి పాలించాడు. ఈ యుద్ధం షకర్‌ఖేరా అని పిలువబడింది.

సలాబాత్ జంగ్ అతడి సోదరుడైన నిజామ్ అలి ఖాన్ చేత తొలగించబడ్డాడు. తరువాత నిజామ్ అలి ఖాన్ రాజమండ్రి, చికాకోల్(ప్రస్తుతం శ్రీకాఆకుళం) లను హాసన్ అలి ఖాన్‌కు లిజ్‌కు ఇచ్చాడు. 1765 ఆగస్టులో ముఘల్ చక్రవర్తి షాహ్ అలామ్ తో చర్చలు జరిపి ఫలితంగా నార్తన్ సిర్కార్స్‌ మీద ఆధిపత్యాన్ని  బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ  కొరకు సాధించాడు. అయినా 1766 మార్చి వరకు ఇది రహస్యంగా ఉంచబడింది. కొండపల్లి కోటను ఆక్రమించిన బ్రిటిష్ ప్రభుత్వం అవసర సమయాలలో సైన్యాలను నడిపించడానికి జనరల్ సిల్లౌడ్ ను మచిలీపట్నానికి పంపింది. నిజామ్ కూడా చురుకుగా యుద్ధప్రయత్నాలను చేపట్టింది. కాని 1766 నవంబరు 12 న జరిగిన ఒప్పందం కారణంగా యుద్ధం ఆగిపోయింది. ఫలితంగా ఆక్రమిత నార్తెన్ సిర్కార్ తిరిగి నిజామ్ ఆధీనంలోకి వచ్చింది.

ఈ జిల్లా బ్రిటిష్ అధీనంలోకి వచ్చే ముందు జమిందారుల ప్రాముఖ్యత అధికంగా ఉండేది. జమీందారులైన రంప, తోటపల్లి, జమ్మిచావడి, జద్దంగి, పెద్దాపురం, పిఠాపురం, కోట, రామచంద్రపురం మొదలైనవిీ ప్రదేశంలో ప్రధానమైనవి.

తూర్పుగోదావరి జిల్లా వైశాల్యం 10,807 చదరపు కిలోమీటర్లు ఉంటుంది(4,173 మైళ్ళు). ఇది వైశాల్యంలో ఇండోనేషియా యొక్క ద్వీపంతో సమానం. ఈ జిల్లా పశ్చిమాన కొండాకోనలతో నిండి ఉటుంది. అలాగే తూర్పున మైదానాలతో నిండి ఉంటుంది. ఈ జిల్లాకు తూర్పున బంగాళాఖాతం ఉటుంది. ఈ జిల్లా కేంద్రమైన కాకినాడ సముద్రతీరాన ఉపస్థితమై ఉంది.

తూర్పు గోదావరి జిల్లాకు ఉత్తరాన విశాఖపట్నం జిల్లా, ఒడిషా రాష్ట్రము, తూర్పున, దక్షిణాన బంగాళా ఖాతము, పశ్చిమాన పశ్చిమ గోదావరి జిల్లా, వాయవ్యాన ఖమ్మం జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. భౌగోళికంగా జిల్లాను మూడు ప్రాంతాలుగా వర్గీకరించవచ్చు. అవి: డెల్టా, మెట్ట ప్రాంతం, కొండ ప్రాంతాలు. వివిధ ప్రాంతాల ఎత్తులు సముద్ర మట్టం నుండి 300 మీ.ల వరకు ఉన్నాయి.

డెల్టా ప్రాంతంలో కోనసీమ, కాకినాడలోని ప్రాంతాలు, పూర్వపు రామచంద్రపురం, రాజమహేంద్రవరం తాలూకాలు ఉన్నాయి. ఈ ప్రాంతం వరి పొలాలతో, అరటి, కొబ్బరి, తమలపాకు తోటలతో, లెక్కలేనన్ని తాడి చెట్లతో కళకళ లాడుతూ ఉంటుంది. సారవంతమైన ఒండ్రు నేలలు, ఇసుకతో కూడిన మట్టి నేలలు డెల్టా ప్రాంతంలో కనిపిస్తాయి.

మండపేట, తుని, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ, రామచంద్రాపురం, రాజమహేంద్రవరం లలో కొన్ని ప్రాంతాలను మెట్ట ప్రాంతాలుగా పిలుస్తారు. తూర్పు కనుమలు సముద్ర మట్టం నుండి అంచెలంచెలుగా లేస్తూ, పూర్వపు మన్యం తాలూకాలైన రంపచోడవరం, ఎల్లవరం అంతటా వ్యాపించాయి. గోదావరి, పంపా, తాండవ, ఏలేరులు జిల్లాలో ప్రవహిస్తున్న ప్రముఖ నదులు. పెద్దాపురం సంస్థానం ప్రసిద్ధికెక్కింది.

ఈ జిల్లాలో ఈశాన్య ఋతుపవనాలు, నైరుతీ ఋతుపవనాల కారణంగా జూన్ నుండి అక్టోబరు వరకు వర్షాలు కురుస్తుంటాయి. ఈ జిల్లా పశ్చిమ కొండ ప్రాంతాలలో సుమారు 140 సెంటిమీటర్లు, ఉత్తర కోస్తా ప్రాంతంలో సరాసరి వర్షపాతం 100 సెంటిమీటర్లు ఉంటుంది.
ఏడాది పొడుగునా వాతావరణం సాధారణంగా ఉంటుంది. ఏప్రిల్‌ నుండి జూన్‌ వరకు మాత్రం ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెంటీగ్రేడు వరకు పెరుగుతాయి. జిల్లా లోని సాధారణ వర్షపాతం - 1280.0 మి మీ. సగానికి పైగా వర్షపాతం నైరుతి ఋతుపవనాల వలన కలగగా మిగిలినది ఈశాన్య ఋతుపవనాల వలన కలుగుతుంది.

గోదావరి డెల్టాలో అధికభాగం ఈ జిల్లాలోనే ఉన్నందున వ్యవసాయం, నీటిసంబంధిత వృత్తులు (అక్వా కల్చర్) జిల్లా ప్రజలకు ప్రధాన వృత్తులుగా ఉన్నాయి. ఇటీవల జరిపిన పరిశోధనల మూలంగా సహజవాయువు నిలువలు బయటపడడం వలన ఈ ప్రదేశం పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతుంది. జిల్లాలో రెండు ఎరువుల కర్మాగారాలు, సహజ వాయువుతో తయారయ్యే విద్యుత్ వుత్పత్తి కేంద్రాలు, చమురు శుద్ధి కర్మాగారాలున్నాయి. ప్రస్తుతం ఇది దేశంలో అతి పెద్ద చమురు, సహజవాయు ఉత్పత్తి కేంద్రంగా ఉంది.

తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయం ప్రధానంగా వున్న జిల్లా. అలాగే తూర్పు గోదావరి సంపన్నభరితమైన జిల్లా కూడా. రాష్ట్రంలో సంపన్నతలో మొదటి స్థానంలోనూ దేశంలో రెండవ స్థానంలోనూ ఉంది. ఇది దేశంలో సమృద్ధిగా సహజ వాయువు, చమురు నిలువలు విస్తారంగా ఉన్న జిల్లాగా గుర్తింపు పొందింది. ఈ జిల్లాలో చమురు, సహజవాయువు నిల్వలు ఉన్న ప్రదేశాలు అనేకం ఉన్నట్లు భావించబడుతుంది.

క్షత్రియ, భట్టు రాజులు, అగ్ని కుల క్షత్రియ,శెట్టి బలిజ, యాదవ, కాపులు, రెడ్డి, కమ్మ, కొండా రెడ్డిలు అధికంగా ఉన్నఈ జిల్లాలో ఇంకా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంది. రాచపల్లి వంటి మెట్ట ప్రాంతాల్లో ఇంకా క్షత్రియ రాజుల జమీందారీ వ్యవస్థ కొనసాగుతున్నది. ఈ జిల్లా వాసులకు ఎక్కువగా పశ్చిమ గోదావరి జిల్లా వాసులతో వివాహ సంబంధాలుంటాయి. ఈ జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడ వంటి పట్టణాలలో కొద్దిగా ఆధునికత కనిపించినా మిగిలిన మండలాల్లో చాలావరకూ గ్రామీణ సంస్కృతి కనిపిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాతో పోలిస్తే ఈ జిల్లాలో ఉన్న మహిళల్లో అక్షరాస్యత తక్కువ, ఎక్కువశాతం ఆడపిల్లలకు 18 సంవత్సరాలు నిండగానే వివాహాలు జరుగుతాయి. బాల్య వివాహాలు కూడా ఎక్కువగా జరుగుతూవుంటాయి. యువతులు, స్త్రీలు ఒంటరిగా బయట తిరగడం అంతగా కనిపించరు. సంక్రాంతి, ఉగాది, వినాయక చవితి, క్రిస్టమస్ మరియూ గ్రామీణ పండుగలు వైభవంగా జరుపుకుంటారు గట్టిగా

తూర్పు గోదావరి జిల్లాలో 8 పురపాలక వ్యవస్థలు ఉన్నాయి. 

మండలాలు 64 (62 గ్రామీణ + 2 పట్టణ),() మండల ప్రజా పరిషత్తులు 57, పంచాయితీలు 1,012,మునిసిపాలిటీలు, కార్పొరేషనులు 9, పట్టణాలు 14, గ్రామాలు 1379.

తెలంగాణా రాష్ట్ర విభజన తర్వాత Andhra Pradesh Reorganisation (Amendment) Act, 2014 ప్రకారం తెలంగాణాలో ఖమ్మం జిల్లాకు చెందిన చింతూరు మండలం, వరరామచంద్రపురం మండలం, కూనవరం మండలం, భద్రాచలం మండలం లోని గ్రామాలు (భద్రాచలం పట్టణం తప్ప) - తూర్పుగోదావరి జిల్లాలో కలిశాయి 

తూర్పు గోదావరి జిల్లా దేశం నలుమూలలకు రహదారి, రైలు మార్గాలతో అనుసంధానించబడి ఉంది. చెన్నై, కోల్‌కతా లను కలిపే జాతీయ రహదారి, రైల్వే లైనులు జిల్లా గుండా పోతున్నాయి. రాజమండ్రి కొవ్వూరును అనుసంధానిస్తూ అతి పెద్ద రహదారి, రైలు వంతెన ఉన్నది . రాజమహేంద్రవరంకి 15 కి.మీ.ల దూరంలో ఉన్న మధురపూడి వద్ద ఒక విమానాశ్రయము ఉంటుంది. ఇది కాకినాడకు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజమండ్రి నుండి హైదరాబాదు, చెన్నై, విజయవాడ మొదలైన నగరాలకు వరకు ప్రతి రోజు రైలు సేవలు ఉన్నాయి. విశాఖపట్నం విమానౌకాశ్రయం తరువాత స్థానంలో ఉన్న నౌకాశ్రయం ఈ జిల్లా కేంద్రమైన కాకినాడలో ఉంది.

జిల్లాలోని పర్యాటక ప్రదేశాలన్నీ కలిపి 2017లో కోటి 34 లక్షల మంది పైచిలుకు, 2016లో కోటీ 28 లక్షల పైచిలుకు పర్యాటకులు సందర్శించారని ప్రభుత్వ అంచనా. జిల్లా 2016, 17 సంవత్సరాల్లో అత్యధికంగా పర్యాటకులను ఆకర్షించిన జిల్లాల్లో 5వ స్థానం పొందింది.

ఆంధ్ర ప్రదేశ్ లో చాలా వరకు ఆటలను మనం గమనించవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ యొక్క రాష్ట్ర క్రీడ కబడ్డీ. తూర్పుగొదావరి జిల్లా యొక్క క్రీడ కో-కో.




#Article 135: కమ్మమెట్టు (ఖమ్మం ఖిల్లా) (159 words)


ఖమ్మం ఖిల్లా ఖమ్మం నగరం మధ్యలో స్తంబాద్రి అనే కొండపై ఉంది.
కాకతీయుల పాలనకాలం క్రీ.శ. 950లో ఖమ్మంమెట్టు నిర్మాణానికి పునాదులు పడినాయి. సుమారు 400 ఏళ్లు ఈ కోట కాకతీయుల ఆదీనంలో ఉంది. ఆ తరువాత వచ్చిన ముసునూరి కమ్మరాజులు, కుతుబ్ షాహీ వంశస్తులు కూడా ఈ కోటను మెరుగుపరచడంలో ప్రశంసనీయమైన పాత్ర పోషించారు. మొదట దీని పేరు ఖమ్మంమెట్టు. కుతుబ్ షాహీ వంశస్తులు దీని పేరు ఖమ్మం ఖిల్లాగా వ్యవహరించడం మొదలు పెట్టారు.

సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ 1531లో అప్పటి ఖమ్మం పాలకుడైన సితాబ్ ఖాన్ (సీతాపతిరాజు) ను ఓడించి ఖమ్మం కోటను స్వాధీనం చేసుకొన్నాడు. అప్పటి నుండి ఈ దుర్గం కుతుబ్‌షాహీల పాలనలో ఉంది. 17వ శతాబ్దంలో తక్కిన తెలంగాణ లాగ అసఫ్‌జాహీల పాలనలోకి వచ్చింది.

గ్రానైటు రాళ్లతో నిర్మించిన ఈ పఠిష్టమైన కోట నాలుగు చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. కోటకు పది ద్వారాలున్నాయి. పశ్చిమం వైపున్న దిగువకోట ప్రధానద్వారం. తూర్పు వైపున్న ద్వారాన్ని రాతి దర్వాజా లేదా పాత దర్వాజా అంటారు. కోట చుట్టూ 60 ఫిరంగులు మొహరించే వీలుకలదు. కోటలోపల జాఫరుద్దౌలా కాలంలో నిర్మించిన ఒక పాత మసీదు, మహలు ఉన్నాయి. అరవై అడుగుల పొడవు, ఇరవై అడుగుల వెడల్పు ఉన్న జాఫర్ బౌలీ అనే బావి కూడా ఉంది. కోటపై ముట్టడి జరిగినప్పుడు తప్పించుకోవటానికి ఒక రహస్య సొరంగం కూడా ఉంది. వర్షపు నీటిని నిలువ చేసుకోవటానికి నీటి కాలువలు కూడా ఉన్నాయి.




#Article 136: పర్ణశాల (523 words)


పర్ణశాల, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దుమ్ముగూడెం మండలంలోని గ్రామం.. 

ఇది మండల కేంద్రమైన దుమ్ముగూడెం నుండి 36 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మణుగూరు నుండి 78 కి. మీ. దూరంలోనూ ఉంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి 32 కి మీ ల దూరంలో పర్ణశాల ఉంది. హిందువుల ఆధ్యాత్మిక గ్రంథం రామాయణంలో పర్ణశాల ప్రసక్తి ఉంది. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళినపుడు ఇక్కడ నివసించినట్లు ప్రతీతి. వాగు వద్ద సీత స్నానం చేసిన తరువాత ఇక్కడి రథంగుట్ట పై చీరలు ఆరవేయగా దానిపై ఆ చీరల ఆనవాళ్ళు ఏర్పడినవని ఒక కథనం. ఈ ఆనవాళ్ళు పర్ణశాలలో ఒక యాత్రా విశేషం.రాముడు బంగారు లేడి రూపంలో వచ్చిన మారీచుని ఇక్కడే చంపాడు. అప్పుడు రావణాసురుడు సీతను అపహరించగా నేలపై ఒక గుంట ఏర్పడింది. పర్ణశాలలో ఉన్న గుంట ఈ కారణంగా ఏర్పడినదే అని ప్రతీతి.

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప బాలబడి దుమ్ముగూడెంలో ఉంది.సమీప జూనియర్ కళాశాల దుమ్ముగూడెంలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల‌లు భద్రాచలంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల ఖమ్మంలోను, పాలీటెక్నిక్‌ ఎటపాకలోను, మేనేజిమెంటు కళాశాల పాల్వంచలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల దుమ్ముగూడెంలోను, అనియత విద్యా కేంద్రం పాల్వంచలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఖమ్మం లోనూ ఉన్నాయి.

పర్ణశాలలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ఒక మందుల దుకాణం ఉంది.

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

పర్ణశాలలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. మొబైల్ ఫోన్ ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.

గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్ ఉంది. అంగన్ వాడీ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం, జనన మరణాల నమోదు కార్యాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

పర్ణశాలలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

పర్ణశాలలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

పర్ణశాలలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

వరి, మిరప, ప్రత్తి, అపరాలు, కాయగూరలు

వ్యవసాయం, వ్యవసాయధారిత వృత్తులు 




#Article 137: పాపి కొండలు (715 words)


పాపికొండలు, తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వత శ్రేణి. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ ఉన్నాయి. (తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఖమ్మం జిల్లాల నడుమ ఉండేవి). ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం నగరానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలోను, తెలంగాణ లోని భద్రాచలం పట్టణం నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలోను, తెలంగాణ రాజధాని హైదరాబాదు నగరానికి సుమారు 410 కిలోమీటర్ల దూరంలోను ఉన్న పాపికొండల ప్రాంతం జాతీయ పార్కుగా గుర్తించబడింది.

పాపికొండల ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చవు. ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశము. ఇక్కడి కొండలూ, జలపాతాలు, గ్రామీణ వాతావరణము దీనిని ఆంధ్రా కాశ్మీరం అని పిలవకుండ ఉండనీయవు. ఎండాకాలంలో కూడా పాపికొండల ప్రాంతం చల్లగానే ఉంటుంది. భధ్రాచలం వద్ద మునివాటం అను ప్రదేశం దగ్గరలో జలపాతం ఉంది. ఇక్కడే ఒక శివలింగం సర్పం నీడలో అద్భుతంగా ఉంటుంది.

పాపికొండల అడవుల్లో పెద్ద పులులు, చిరుతపులులు, నల్లపులులు, అడవిదున్నలు (గొర్ర గేదెలు), జింకలు, దుప్పులు, నక్కలు, తోడేళ్ళు, కొండచిలువలు, వివిధ రకాల కోతులు, ఎలుగుబంట్లు, ముళ్ళ పందులు, అడవి పందులు, వివిధ రకాల పక్షులు, విష కీటకాలు ఉంటాయి. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు ఉంటాయి.

పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహిస్తూ, ఆ వాతావరణానికి మరింత రమణీయతను తెచ్చి పెడుతుంది.
రాజమహేంద్రవరం నుండి ఇక్కడికి చేసే లాంచీ ప్రయాణం పర్యటకులకు మరచిపోలేని అనుభవం. 
పాపికొండల వెనుక భాగానికి పశ్చిమ గోదావరి జిల్లాలో కొయ్యలగూడెం, కన్నాపురం, పోలవరం, శింగన్నపల్లి, వాడపల్లి, ఛీడూరు మీదుగా కొరుటూరుకు ఘాట్ రోడ్డు మార్గం కూడా ఉంది. 
పాపికొండల విహార యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసం ద్వీపం నుండి మొదవుతుంది. అక్కడినుండి పోలవరం, గొందూరు (పోచమ్మ గండి), సిరివాక, కొల్లూరు, పేరంటాలపల్లి మీదుగా సాగుతుంది.
 
ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం వద్ద కట్టబోతున్న ఇందిరా సాగర్ ప్రాజెక్టు వలన ఈ ఘాట్ రోడ్డు మార్గం కనుమరుగు అవబోతున్నది. 
సీతారామయ్యగారి మనవరాలు, అంజి, గోదావరి, గోపి గోపిక గోదావరి వంటి సినిమాలు పాపికొండల పరిసరాల్లోనే తీశారు.

చుట్టూ గోదారమ్మ పరవళ్లు... పచ్చని ప్రకృతి సోయగాలు... కనుచూపు మేర పచ్చటి పర్వత పంక్తులు... గిలిగింతలు పెట్టే చలిగాలులు... కొండల మధ్య మధ్య అందమైన సూర్యో దయం, అంతే అందమైన సూర్యాస్తమయం... రాత్రిళ్లు వెదురు గుడిసెల్లో బస... మధ్యలో క్యాంప్‌ఫైర్‌... గోదారమ్మ ఒడిలో స్నానం..! ఇవి చాలు పాపికొండల ప్రత్యేకతలు వివరించడానికి! యాంత్రిక జీవనానికి విసిగి వేసారిన జనాలకు చక్కటి ఆహ్లాదాన్ని పంచే పాపికొండల నడుమ పడవ ప్రయాణం అద్భుత జ్ఞాపకాలను మిగుల్చుతోంది. తూర్పుగోదావరి జిల్లా లోని (పూర్వం ఖమ్మం జిల్లాలోని) వి.ఆర్‌.పురం మండలం శ్రీరామగిరి గ్రామం నుంచి సుమారు మూడు గంటల పాటు గోదావరి నదిలో ప్రయాణం, చుట్టూ చూడచక్కని గిరిజన గ్రామాలు, అందమైన ప్రకృతి నడుమ ఉరుకులు, పరుగుల జీవితానికి ఒక్కపూట మన మనస్సుని పరవశింపజేస్తుందంటే ఆ ఆనందం మరువలేనిదని చెప్పడంలో అతిశయోక్తి కాదేమో. ఎక్కడో మహారాష్టల్రోని నాసిక్‌ వద్ద జన్మించి ఎన్నో ఉపనదులను తనలో కలుపుకుని కూనవరం వద్ద గోదావరి, శబరి నదులలో సంగమమై శ్రీరామగిరి గ్రామం నుంచి లాంచీలో ప్రయాణిస్తే పేరంటాలపల్లికి నుంచి పాపికొండలకు చేరుకోవచ్చు

ముందుగా భోగరాముడు కొలువై ఉన్న శ్రీరామగిరిని కలుపుకొని రహదారి మార్గంలేని ఎన్నో గిరిజన గ్రామాలను అభయారణ్యాలను కలుపుకొని రెండు జిల్లాల (పూర్వం  మూడు జిల్లాల) సంగమమైన పాపికొండలలతో మిళితమైన పేరంటాలపల్లి గ్రామంలో బాలానంద స్వామి కొలువుతీరిన శ్రీరామకృష్ణ మునివాటంలో శివుడిని దర్శించి పచ్చని ఎత్తయిన కొండలపై నుంచి జాలువారే జలపాతాలను, గుడివెనుక రాళ్నుంచి పారే నీటి పరవళ్లు, అక్కడి నుండి ఇసుక తిన్నెలను ప్రయాణికులకై భోజన వసతి. పేరంటాలపల్లి విహారయాత్ర, రాష్ట్రంలోని రెండవ భద్రాద్రిగా పేరుపొందిన శ్రీరామగిరి పుణ్యక్షేత్రం వద్ద యాత్రికులకు శ్రీసుందర సీతారాముల వారి దర్శనం కలుగుతుంది. ఎతైన కొండలు గుట్టల మధ్య సుమారు 170 మెట్లు ఎక్కిన తర్వాత కనులు పరవశింపజేసే సుమారు 500 సంవత్సరాల క్రితం మాతంగి మహర్షిచే ప్రతిష్ఠింపబడిన శ్రీ సీతారామలక్ష్మణ, ఆంజనేయ సుందర విగ్రహాలను భక్తులు దర్శిస్తారు. ఆ దేవతామూర్తులను చూడగానే నిజంగా సీతారామ లక్ష్మణ అంజనేయస్వాములను మనం చూస్తున్నట్లు అనుభూతి కలుగుతుంది. ఎత్తయిన కొండలు నుంచి వచ్చే పిల్లగాలులు, మనస్సును పరవశింపచేస్తాయి. పక్కనే ఎతె్తైన రెండు పర్వతాలు వాలి, సుగ్రీవుల గుట్టలు భక్తులకు కనువిందు చేస్తాయి.

చుట్టూ ఎత్తయిన కొండలు .. చిక్కని అడవులు... 
మధ్యలో గోదారమ్మ ఒడిలో మెలికలు తిరుగుతూ జల విహారం చేస్తే... 'చూసే కనులకు మనసుంటే ... ఎటు చూసిన అందమే... ' అన్న పాట గుర్తుకొస్తుంది.పాపి కొండల మధ్య నుంచి లాంచిల్లో ప్రయాణం ఓ అద్భుత అనుభూతి.
ఉదయం వెళ్తే సాయంత్రానికి రాజమహేంద్రవరం నగరానికి చేరుకోవచ్చు.

వాలి, సుగ్రీవుల కొండల నుండి మరో పర్లాంగు దూరంలో చొక్కనపల్లి గోదావరి రేవులో ఝటా యువు పక్షి పడిపోయిన గుర్తులు కనిపిస్తుంటాయి. అక్కడే శ్రీరాముడు ఝటాయువుకు పిండ ప్రదానం చేసాడని పురాణాలు వెల్లడిస్తున్నాయి. శ్రీరామగిరి నుంచి బయలుదేరిన లాంచీ రెండు గంటల పాటు గోదావరి తీరాన ఉన్న అమాయక గిరిజనులైన కొండరెడ్ల ప్రజలను పలకరిస్తుంది.

మూడు గంటల పాటు లాంచీ ప్రయాణం అనంతరం రాష్ట్రంలోనే ప్రసిద్ధి పొందిన పాపికొండల సోయగాలు కనపడగానే యాత్రికులు తమను తాము మార్చిపోయి మంత్రముగ్ధులవుతారు. పాపికొండల వద్ద గోదావరి ప్రవాహం చాల ఇరుకుగా ఎంతో లోతుగా ఉంటుంది. శివలింగం అలంకారం, ఆలయం చుట్టూ ఫలవృక్షాలు, పూలమొక్కలు, అమాయక కొండరెడ్ల గిరిజనుల అప్యాయత ఆదరణ నవనాగరిక సమాజానికే తలమానికం. ఇక్కడ శ్రీరాముని వాకిటం అనేక ఆశ్రమం ఉంది. ఇందులోనే శివాలయం కూడా ఉంది. 1800 శతాబ్దంలో రాజమహేంద్రవరం నుంచి ఒక మునీశ్వరుడు లాంచీపై బయలు దేరి భద్రాచలం వస్తూ పేరంటాలపల్లి వద్ద రాత్రి కావడంతో అక్కడ బస చేశారు. ఆయన కలలో భగవంతుడు కనిపించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించమని ఆదేశించడంతో అందుకు అనుగుణంగా ఆయన ఇక్కడే నివాసం ఉండి ఆ ఆలయాన్ని నిర్మించినట్లు ఈ ప్రాంతవాసులు చెబుతారు. ఈ ప్రాంత గిరిజనులకు విద్యా బుద్ధులు, వైద్య సౌకర్యం కల్పించిన మునిశ్వేరుడిని వారు ఆరాధ్యదైవంగా భావిస్తారు. ఈ శివాలయంలో కొండలపై నుంచి జలపాతం చుట్టూ పనస, పొక చెక్క వంటి అనేక మొక్కలతో ఆప్రాంతం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అక్కడి నుంచి లాం చీలపై మరొక 5 కిలోమీటర్ల దూరం లాంచీపై వెళ్తే పర్యా టకులను పరవశింపజేసే పాపి కొండలు దర్శనమిస్తాయి. భద్రా చలం వద్ద సుమారు రెండు కిలోమీటర్ల వెడల్పు ఉన్న గోదావరి పాపి కొండలు వంపు సొంపులతో చిన్న ఏరులా గోచరిస్తుంది. ఎత్తయిన కొండల మధ్య వంపులు తిరిగి ప్రవహించే గోదావరిని చూపి పర్యాటకులు పరవశించిపోతారు. పర్యాటక శాఖ ఈ పేరంటాలపల్లి, పాపికొండల యాత్రకు మరింత అభివృద్ధి చేసి పర్యాటకం ప్యాకేజీ ప్రకటిస్తే యాత్రికులు మరింతగా వచ్చే అవకాశం ఉంది.




#Article 138: త్యాగరాజు (897 words)


త్యాగరాజు (మే 4, 1767  - జనవరి 6, 1847) కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరు. త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరాముని పై అతనుకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై అతనుకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి. ఉపనయనం తరువాత తండ్రిగారి బోధలు, 18వ ఏట రామకృష్ణానంద పరబ్రహ్మం ఉపదేశం చేసిన రామ షడక్షరీ మంత్ర ప్రభావం, తల్లి అలవర్చిన భక్తి సంగీతాలు బాల్యంలోనే బీజాంకురాలై త్యాగ రాజస్వామి వారిలో మూర్తీభవించాయి.ఇతను కర్ణాటక సంగీత త్రయంలో మరో ఇద్దరైన శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులకు సమకాలికుడు కూడా. వీరు ముగ్గురూ తమిళనాడులోని, తంజావూరు జిల్లా, తిరువారూరుకు సంబంధించిన వారే. తమిళదేశంలో పుట్టి పెరిగినా వారి గానం ఎక్కువగా తెలుగు, సంస్కృతాల్లోనే సాగింది.

త్యాగరాజు జన్మస్థలం, పుట్టిన తేదిల గురించి ప్రామాణిక సమాచారం అందుబాటులో లేదు. అతని శిష్య పరంపరల ద్వారా కొన్ని వివరాలు తెలియగా, అతను రాసిన కీర్తనల నుంచి కూడా మరికొన్ని వివరాలు లభ్యమవుతున్నాయి. చాలామంది ఆమోదించిన అతని జీవిత చరిత్రకు ఆధారాలు రెండు. మొదటిది త్యాగరాజు ప్రత్యక్ష శిష్యుడైన వలజాపేట వెంకటరమణ భాగవతార్ దగ్గరున్న తాళపత్రాలు, ఇంకొకటి  వెంకటరమణ భాగవతార్ కొడుకు కృష్ణస్వామి భాగవతార్ దగ్గరున్న నోటు పుస్తకం. 

త్యాగరాజు 1767 మే 4 వ తేదీన ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తంజావూరు జిల్లాకు దగ్గరలో ఉన్న తిరువారూర్ అనే గ్రామంలో జన్మించాడు.అతను కాకర్ల రామబ్రహ్మం, కాకర్ల సీతమ్మ దంపతుల మూడవ సంతానం. ఇతని జన్మనామం కాకర్ల త్యాగబ్రహ్మం. వీరు ములకనాడు తెలుగు బ్రాహ్మణులు, భరద్వాజ గోత్రీకులు, త్రిలింగ వైదికులు, ఆపస్తంభ సూత్రులు. త్యాగరాజు పూర్వీకులు ప్రస్తుత ప్రకాశం జిల్లా, కంభం మండలంలో కాకర్ల అను గ్రామం నుండి తంజావూరు పరిసర ప్రాంతానికి (ప్రస్తుతం తమిళనాడులో భాగం) వలస వెళ్లారు. తండ్రి రామబ్రహ్మం తంజావూరు ప్రభువు శరభోజీ ఆధ్వర్యంలో ఉండేవాడు. త్యాగరాజు తాత గిరిరాజ కవి తెలుగు వాగ్గేయకారుడు.ఇతనిని గురించి త్యాగయ్య తన బంగాళరాగ కృతిలో గిరిరాజసుతా తనయ అని తన తాతగార్ని స్తుతించాడు. త్యాగయ్య విద్య కొరకు రామబ్రహ్మం తిరువారూర్ నుంచి తిరువయ్యూర్ కు వెళ్ళారు. త్యాగయ్య అక్కడ సంస్కృతాన్ని, వేదవేదాంగాలను అభ్యసించాడు. శొంఠి వేంకటరమణయ్య దగ్గర సంగీతం అభ్యసించాడు. వేంకటరమణయ్య త్యాగయ్య చాకచక్యంను, సంగీతంనందుగల ప్రావీణ్యతను గమనించి వారియందు అతి శ్రద్ధతో సంగీతోపదేశం చేసారు.

త్యాగయ్య తండ్రి పిన్న వయస్సులోనే గతించిరి. కనుక అన్నదమ్ముల మధ్య జగిగిన భాగపరిష్కారాలలో త్యాగయ్య  భాగంలో కులప్రతిమలైన శ్రీరామ లక్ష్మణులు విగ్రహాలు వచ్చాయి. ఆ ప్రతిమలను అతి భక్తితో పూజించేవాడు.త్యాగయ్య జీవితమంతయూ ఊంఛవృత్తిని అవలంబించి సామాన్యంగా సాగించేవాడు.తక్కిన సమయమంతయు తన యిష్టదైవమైన శ్రీరాములు పై కృతులు రచించుటలో నిమగ్నమైయ్యేవాడు. త్యాగయ్య 96 కోట్ల శ్రీరామ నామాలు జపించి వారి దర్శనం పొంది, వారి ఆశీర్వాద పొందినట్లు కథనాలు.త్యాగరాజువారు మంచి వైణికులు కూడా.

త్యాగరాజు తన సంగీత శిక్షణను శొంఠి వెంకటరమణయ్య దగ్గర, చాలా చిన్న వయసులోనే ప్రారంభించాడు. పదమూడేండ్ల చిరు ప్రాయంనాడే త్యాగరాజు నమో నమో రాఘవా అనే కీర్తనను దేశికతోడి రాగంలో స్వరపరచాడు. గురువు శొంఠి వేంకటరమణయ్య ఇంటిలో చేసిన కచేరీలో ఎందరో మహానుభావులు అనే కీర్తనను స్వరపరచి పాడాడు. ఇది పంచరత్న కృతులలో ఐదవది. ఈ పాటకు వెంకటరమణయ్య చాలా సంతోషించి, త్యాగరాజులోని బాలమేధావి గురించి, తంజావూరు రాజుకు చెప్పగా, రాజు సంతోషించి అనేక ధన కనక వస్తు వాహనాది రాజలాంఛనాలతో త్యాగరాజును సభకు ఆహ్వానించాడు. కానీ త్యాగరాజు తనకు నిధి కన్నా రామ సన్నిధి మాత్రమే సుఖమని ఆ కానుకలను నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. ఈ సందర్భంగా స్వరపరచి పాడినదే నిధి చాల సుఖమా అనే కీర్తన. సంగీతాన్ని భగవంతుని ప్రేమను పొందే మార్గంగా త్యాగరాజు భావించాడు. సంగీతంలోని రాగ, తాళాలను వాటిపై తన ప్రావీణ్యాన్ని చూపించుకోవడానికి కాక, భగవంతుని నామాలను చెప్పడానికి, భగవంతుని లీలలను పొగడటానికి ఓ సాధనంగా మాత్రమే చూసాడు.

తంజావూరు రాజు పంపిన కానుకలను తిరస్కరించినపుడు ఆగ్రహించిన అతని అన్నయ్య జపేశుడు, త్యాగరాజు నిత్యం పూజించుకునే శ్రీరామ పట్టాభిషేక విగ్రహాలను కావేరీ నదిలో విసిరివేసాడు. శ్రీరామ వియోగ బాధను తట్టుకోలేక, రాముడు లేని ఊరిలో ఉండలేక, దక్షిణ భారతదేశ యాత్రలకు వెళ్ళి అనేకానేక దేవాలయాలను, తీర్థాలను దర్శించి, ఎన్నో అద్భుత కీర్తనలను త్యాగయ్య రచించాడు. చివరగా శ్రీరాముని అనుగ్రహంతో విగ్రహాలను పొందాడు. వైకుంఠ ఏకాదశి నాడు త్యాగరాజు శ్రీరామ సన్నిధిని చేరుకున్నాడు.

త్యాగరాజు జీవితంలో జరిగినట్లుగా కొన్ని విశేషాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దేవముని అయిన నారదుడే స్వయంగా ఇతనికి సంగీతంలోని రహస్యాలను చెప్పి, స్వరార్ణవం ఇచ్చాడనీ, ఆ సందర్భంలో త్యాగరాజు చెప్పిన కృతిగా పంచరత్న కృతులలో మూడవదైన సాధించెనే అనీ చెపుతాడు. ఈ పుస్తకం వల్ల త్యాగయ్య సంగీతంలో అత్యుత్కృష్టమైన విషయాలను తెలిసికొనినట్లు తెలుస్తుంది. శంకరాభరణం లోని స్వరరాగ సుధారసం అను కృతిలో ఈ గ్రంథం గురించి త్యాగయ్య పేర్కొన్నాడు. త్యాగయ్యవారు 24000 రచనల వరకు రచించాడు. దివ్యనామ సంకీర్తనలు, ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు అను బృంద కీర్తనలు కూడా రచించాడు. ప్రహ్లాద భక్త విజయం, నౌకా చరిత్రం అను సంగీత నాటకాలు కూడా రచించాడు.

అసంఖ్యాకమైన కీర్తనలు రచించి, కర్ణాటక సంగీతంలోని అన్ని నియమాలను సోదాహరణంగా నిరూపించి శాశ్వతమైన కీర్తి సంపాదించిన త్యాగరాజును కర్ణాటసంగీతానికి మూలస్తంభంగా చెపుతారు.ఇతను జన్మదినం రోజుని భారతీయ సంగీత దినోత్సవంగా జరుపుతారు. ఈ సంగీత నిధికి నివాళిగా ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమి నాడు  (జనవరి, ఫిబ్రవరి నెలలలో) తిరువయ్యూరులో అతను సమాధి చెందిన త్యాగరాజ మహోత్సవ సభనందు త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు.

అతను భక్తులు, సంగీత కళాకారులు మొదట ఊంఛవృత్తి భజన, తరువాత అతను నివాస స్థలమైన తిరుమంజనవీధి నుంచి బయలుదేరి అతను సమాధి వరకూ కీర్తనలు గానం చేస్తూ ఊరేగింపుగా వస్తారు. వందలకొద్దీ కర్ణాటక సంగీత కళాకారులు అతను రచించిన పంచరత్న కృతులను కావేరీ నది ఒడ్డున గల అతను సమాధి వద్ద బృందగానం చేస్తారు. సంగీతాభిమానులకు ఈ గానం శ్రవణానందాన్ని కలిగించడమే కాకుండా భక్తిభావాన్ని కూడా రేకెత్తిస్తుంది. ఈ ఉత్సవాన్ని ప్రపంచంలో చాలాచోట్ల నిర్వహిస్తారు, కానీ తిరువయ్యూరులో నిర్వహించే ఆరాధన చాలా ప్రసిద్ధి గాంచింది. ప్రతీ సంవత్సరం పెరుగుతూ వస్తున్న కళాకారుల, సందర్శకుల కోసం ఇక్కడ ఒక పెద్ద భవనం కూడా నిర్మాణదశలో ఉంది.

త్యాగరాజ స్వామివారి మహాభక్తురాలు బెంగుళూరు నాగరత్నమ్మ కావేరీ నది ఒడ్డున శిథిలావస్థలోనున్న స్వామి వారి సమాధి చూసింది. ఆ స్థలాన్ని, దాని చుట్టు ఉన్న ప్రదేశాన్ని తంజావూరు రాజుల ద్వారా, రెవిన్యూ అధికారుల ద్వారా తన వశం చేసికొని పరిశుభ్రం చేయించి, గుడి, గోడలు కట్టించింది. మదరాసులోని తన ఇంటిని అమ్మి రాత్రనక పగలనక వ్యయప్రయాసల కోర్చి దేవాలయ నిర్మాణాన్ని ముగించింది. 1921 అక్టోబరు 27లో పునాదిరాయిని వేయగా, 1925 జనవరి 7న గుడి కుంభాభిషేకం జరిగింది. స్థలాభావం వలన ఇంకా నేల కొని ఒక మంటపం, పాకశాల 1938లో నిర్మించింది. ఈ నిర్మాణాలతో ఆమె సంపద, ఆభరణాలు హరించుకుపోయాయి. 1946లో త్యాగయ్య చిత్ర నిర్మాణసందర్భంలో చిత్తూరు నాగయ్య నాగరత్నమ్మను కలిశారు. ఆమె సలహాపై నాగయ్య త్యాగరాజ నిలయం అనే సత్రాన్ని కట్టించారు.

రామేతి మధురం వాచం' అన్నట్లు 96 కోట్ల సార్లు రామనామాన్ని జపించి, స్వీయానుభవ భావనలే కృతి రూపంలో మలచి గాంధర్వగాన మధురానుభూతిగా లోకానికి అందించారు. భూలోక నారదుడైన త్యాగరాజ స్వామి నారద మంత్రోపదేశం పొంది, అనుగ్రహం ప్రాభవంతో 'స్వరార్ణవం' 'నారదీయం' అనే రెండు సంగీత రహస్యార్థ శాస్త్ర గ్రంథాలు రచించారు. పంచరత్న కృతి సందేశం : శ్రీత్యాగరాజస్వామి రచించిన కృతులను ప్రాపంచికం, తాత్వికం, కీర్తనం, నిత్యానుష్ఠానాలని వర్గీకరించవచ్చు. త్యాగరాజస్వామి కీర్తనలలో ఘనరాగ పంచరత్న కీర్తనలు ముఖ్యమైనవి. శ్రీత్యాగరాజస్వామి. రామభక్తా మృతాన్ని సేవించి, కర్ణాటక సంగీత సంప్రదాయంలో అనేక కృతులను మధుర కీర్తనలుగా మలచి సంగీత, సాహిత్య రసజ్ఞుల హృదయాల్లో చిరంజీవిగా నిలిచారు. త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో విశేషంగా పంచరత్న కీర్తనలు ఆలపించడం సంప్రదాయం.

త్యాగయ్య దాదాపు 800 కీర్తనలను రచించాడు. వీటిలో చాలావరకు అతని మాతృభాష తెలుగులో రచించినవే. కొన్ని సంస్కృతంలో రచించబడినవి. కానీ ఈ కీర్తనలు మాత్రం ఆంధ్రదేశంలోకన్ననూ కర్ణాటక సంగీతంలో, తమిళనాట బాగా ప్రాచుర్యం పొందాయి. సంస్కృతంలో రచించబడిన జగదానందకారక అనే కీర్తన శ్రీరామునికున్న108 పేర్లను ప్రస్తావిస్తుంది. 'ప్రహ్లాద భక్తి విజయం', 'నౌకా చరితం' అనే నాట్యరూపకాలను కూడా రచించాడు. త్యాగరాజు కీర్తనల పూర్తి పట్టిక కోసం త్యాగరాజు కీర్తనలు అనే వ్యాసాన్ని చూడండి. త్యాగయ్య  క్షేత్రాలకు వెళ్ళినపుడు, ఆయా క్షేత్రం మీదను, క్షేత్రంలోని దేవుని మీదను కృతులు రచించాడు. అవి యేవనిన:

(కొవ్వూరు లోని శ్రీ సుందరేశ్వర స్వామిపై వ్రాసిన ఐదు కృతులు)

(తిరువత్తియూరులో వెలసిన శ్రీ త్రిపుర సుందరీ దేవిపై రచించిన కృతులు)




#Article 139: భారతీయ సంగీతము (837 words)


శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి: అన్నారు పెద్దలు. ఆది ప్రణవనాదమైన ఓంకారం నుండి ఉధ్బవించినదిగా చెప్పబడే సంగీతం గురించి చూద్దాం.

సంగీత నాట్యకళలు భారతజాతి అంత ప్రాచీనమైనది. భారతీయ సంగీతానికి మూలం వేదాలు - వేదాలలోని స్వరాలు. ఋగ్వేదం మంత్రాల గురించి వివరిస్తుంది. ఈ మంత్రాలకు మొన్ని లయాత్మక పదాలు చేర్చి పాడేవారు. వీటిని 'స్తోభాలు' అంటారు. రుగ్వేద కాలంలో ఉదాత్త, అనుదాత్త, స్వరిత అనే స్వరాలు ఉచ్ఛరించేవారు. కాలక్రమేణా వీటిని ఉచ్ఛ, వచ, స్వర, విశిష్టలతో సృష్టించారు. ఈ విధానం తరువాత ఏకస్వరమైన ఆర్చిక పఠనంగా మరింది. యజ్ఞయాగాలు జరిపే సమయంలో హాత, ఉద్గాత, సామిక అనే పేర్లతో స్వరాలను పాడేవారు. వేదకాలంలో ఏక (ఆర్చిక), ద్విశ్వరాలు (గాధిక్యం), దిస్వర (సామిక) పేర్లతో రూపొందింది. కాలక్రమేణా చతుస్వరి (నాలుగు), పంచస్వరి (ఐదు), షట్స్వరి (ఆరు), సప్తస్వరి (ఏడు) గా మారాయి. కాలక్రమంగా సప్తస్వర యుక్తమైన ఒక స్థాయిని మన పూర్వీకులు అందించారు.

సామవేదము భారతీయ సంగీతానికి మూలం. ఇందులో ఏడు నుండి పది స్వరాలు వాటి సంగతులున్నాయి. ఇవి వికార, విశ్లేష, వికర్షణ, అభ్యాస, విరామ, స్తోభాలు మొదలైనవి. అవి ఈనాటికీ సంగీతంలో గమకాలుగా ఉంటాయి. మరికొంత కాలానికి సంగీతంలో వాది-సంవాది, ఆరోహణ-అవరోహణ, మంద్ర-తారా స్థాయిలు మొదలైన ప్రక్రియలు వచ్చాయి.

భారతీయ సంగీతము అనేక సంప్రదాయ రీతులలో భాసిల్లుచున్నది. వాటిలో ముఖ్యమైనవిగా కర్ణాటక, హిందుస్థానీ సంగీత సంప్రదాయములు చెప్పబడుచున్ననూ, ప్రసిద్ధములైన యితర సంప్రదాయములూ ఉన్నాయి. వాటిని గురించి ఈ దిగువన ప్రస్తావించెదము.

చెవుల కింపైన దేదైనా కర్ణాటక సంగీతమే. కాని దక్షిణాదిలో ప్రాచుర్యం పొందిన సంగీత బాణీని కర్ణాటక సంగీతమనీ, దాక్షిణాత్య సంగీతమని అంటారు. ఇందులో శాస్త్రీయ సంగీతం పండితరంజకంగా ఉంటే, ఇతర రకారలైన సంగీత రూపాలు దెశకాలపరిస్థితుల కనుగుణంగా, పామర రంజకంగా అభివృద్ధి చెందాయి.

సామవేద జనితమైన సంగీతం ఉత్తరాదిన మొగలుల ప్రభావంతో మార్పులు చెంది నేడు ప్రచారంలో ఉన్న హిందూస్తానీ సంగీతంగా ప్రచారంలో ఉంది. ఇది ముఖ్యంగా రాజాస్థానాల్లో పాడబడేది. దీనిలో అనేక బాణీలు జనించాయి.

ఈ సంగీత సంప్రదాయము భక్తి రస ప్రధానము. ఈ సంప్రదాయము ఆయా వాగ్గేయకారుల పద్యములు, భజనలు, సంస్కృత శ్లోకములను కలిగి వుండును. సాధారణముగా శ్లోకముల వంటివాటికి తాళము చెప్పబడదు.

ఇది పురాణేతిహాసములలోని ప్రధాన ఇతివృత్తములను ఆధారముగా చేసికొని సాగే సంగీత కథనము. దక్షిణ భారతదేశమందు ప్రసిద్ధి చెందిన ఈ ప్రక్రియయందు ప్రధాన గాయకుడు కథాభాగమునకు శ్లోకములు, కీర్తనలు మేళవించి రసరమ్యముగా ఆలపించును.

దక్షిణ భారతదేశమందు ఖ్యాతినొందిన శాస్త్రీయ నృత్యములగు భరత నాట్యము, కూచిపూడి, మొదలగునవి కర్ణాటక సంగీతముపై మిక్కిలి ఆధారపడియున్నవి. తిల్లానా, పదము, జావళి, మొదలగునవి సంగీత కచేరీలయందును, నృత్య ప్రదర్శనలయందును ముఖ్య భాగములుగా పరిగణింపబడుచున్నవి. నృత్యమున ఉపయుక్తములగు కృతులు నృత్తమునకు, అభినయమునకు అనుగుణముగా మార్పు చేయబడును అనగా, కాల భేదము చూపబడును.

భారతదేశము జానపద సంగీతానికి పట్టుకొమ్మ. కొన్ని జానపద గేయాలు శతాబ్దాలనుండి తరువాతి తరముల వారికి అందింపబడుతున్నాయి. ఇక పోతే, చక్కటి గతులతో హృదయాన్ని హత్తుకునేలా ఉండటం దీని ప్రత్యేకత. ఇప్పటికీ పల్లెటూర్లలో జానపదాలు వినవస్తాయి. శాస్త్రీయ సంగీతం లోని ఆనంద భైరవి వంటి రాగాలు కొన్ని జానపద సంగీతం నుండి వచ్చినవే. చాలా మటుకు సినిమా సంగీతం కూడా జానపదాల మీద ఆధారపడి ఉంది.)

కర్ణాటక సంగీతములో చాలా రకాల రచనలు ఉన్నాయి. అవి 

వివిధ రాగ, తాళములకు కూర్చబడ్డ స్వరయుక్తమైన చిరు రచనలు గీతములు. తాళాధ్యయనము కొరకై నేర్వబడు అలంకారముల తరువాత గీతములు చెప్పబడును. విద్యార్థికి గీతముల ద్వారా రాగసంబంధమైన స్వరసంచారాదులు పరిచయం చేసెదరు.

గీతముల తర్వాత స్వర సాహిత్య యుక్తమైన స్వరజతులు నేర్పబడును. స్వరజతులయందు పల్లవి అనుపల్లవి చరణములను మూడు భాగములుండును. వీటిని నృత్యమునందు ఉపయోగించరు.

స్వరజతి వలె వుండే జతిస్వరంలో కేవలం జతులు స్వరములు మాత్రమే వుండును. ఇవి భరత నాట్యం లోని నృత్త వరుసలకు యుక్తములు. నృత్తమనగా కథనరహిత వరుసలు. స్వరము లేక పదముల బదులు వాడబడే ధీం, తాం, తోం, నం, ఝం, తకిట, తరికిట, మొదలైనవి జతులనబడును.

నాట్యంలో మాదిరిగానే సంగీతంలో కూడా వర్ణానికి చాలా ప్రాముఖ్యముంది. గీతములు స్వరజతుల మల్లే రాగస్వరూపాన్ని నేర్చుట కోసం వర్ణములు ఉపయుక్తములు. సంగీత కచేరీలలో ప్రారంభంలో వర్ణమును పాడుట కూడా సంప్రదాయమున ఉంది. వర్ణములు ముఖ్యముగా తాన వర్ణములు, పద వర్ణములు, దరు వర్ణములు అని మూడు రకాలు. తాన వర్ణములు చిఱు సాహిత్యముతో ప్రారంభమవుతాయి. పల్లవి అనుపల్లవి చరణములు మాత్రమే సాహిత్యమును కలిగి వుంటాయి. చిట్ట ముక్తాయి స్వరములు సాహిత్యరహితములు. అదే పద వర్ణమయితే చిట్ట ముక్తాయి స్వరములకు కూడా సాహిత్యముండును. పద వర్ణములు నాట్యంలో బాగా ప్రసిద్ధములు. దరు వర్ణములో స్వర సాహిత్యములే గాక జతులు కూడా వుంటాయి. వర్ణములు రచించిన వారిలో రామస్వామి దీక్షితులు, పల్లవి గోపాల అయ్యర్, తంజావూర్ చతుష్టయము (చిన్నయ్య, పొన్నయ్య, వడివేలు, శివానందం), పట్ణం సుబ్రహ్మణ్య అయ్యర్, రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, మొదలైన వారు ముఖ్యులు.

కీర్తనలలో సంగీతానికన్నా సాహిత్యానికి ప్రాముఖ్యత ఎక్కువ. అంటే రాగానికి కాక భావానికి ప్రాధాన్యత ఎక్కువన్నమాట. నవవిధ భక్తులలో ఒకటైన భగవంతుని కీర్తనకు అనువైనవి కీర్తనలు. ఇంకోలా చెప్పాలంటే కీర్తనలు భక్తిరస ప్రధానమైనవి. కీర్తనలనగానే మనకి గుర్తుకొచ్చేవి ఈనాడు అధిక ప్రాచుర్యంలో ఉన్న త్యాగరాజస్వామి వారి దివ్యనామ ఉత్సవ సాంప్రదాయ కీర్తనలూ అన్నమయ్య కీర్తనలూ రామదాస పురందరదాస కీర్తనలూను. తమిళ కవులు ముత్తు తాండవర్, అరుణాచల కవిరాయర్, గోపాలకృష్ణ భారతి మున్నగువారి రచనలు కూడా ఈ కోవకే వస్తాయి.

కృతులు కీర్తనలనుండే పుట్టాయని ఒక వాదం ఉంది. కృతులలో సంగీతం ప్రధానం. అయితే హిందుస్థానీ సంప్రదాయంలా కాక కర్ణాటక సంప్రదాయంలో సాహిత్యం తప్పనిసరి. రాగభావాన్ని వ్యక్తీకరించడం కృతుల ముఖ్య లక్షణం. కర్ణాటక సంగీతపు త్రిమూర్తులుగా పిలువబడే త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రుల రచనలు కృతుల ప్రపంచంలో అగ్రతాంబూలాన్ని అందుకుంటాయి. వీరు ముగ్గురే కాక మైసూరు వాసుదేవాచార్యులు, హరికేశనల్లూర్ ముత్తయ్య భాగవతార్, సుబ్బరాయ శాస్త్రి, మహారాజా స్వాతి తిరునాళ్, పట్ణం సుబ్రహ్మణ్య అయ్యర్, రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్, పాపనాశం శివన్, కోటీశ్వర అయ్యర్ వంటి వాగ్గేయకారులు కృతి సాంప్రదాయంలో దిగ్గజాలు.

రాగమాలిక అంటే రాగములతో కూర్చబడ్డ దండ. రాగమాలికలంటే ఒకే కృతిలోగానీ పదములలోగానీ వర్ణంలోగానీ వివిధ భాగాలు వివిధ రాగాలలో వుంటాయి. రాగమాలికలైన పల్లవులు, కల్పన స్వరములు కూడా మనోధర్మ సంగీతంలో ఉన్నాయి. ఒక రాగం నుండి మరొక రాగానికి మార్పిడి చాలా మృదువుగా వుంటుంది. ముత్తుస్వామి దీక్షితులు, మహారాజా స్వాతి తిరుణాళ్, సీతారామయ్య, రామస్వామి దీక్షితులు మున్నగువారలు రాగమాలికా రచనలలో ప్రసిద్ధులు. మహా వైద్యనాథ అయ్యర్ గారిచే రచింపబడిన ఒక 72 మేళకర్తరాగమాలిక కూడా ఉంది.

తాళమాలికలంటే వివిధ తాళములకు కూర్చబడిన రచనలు. ఒకే కృతిలోగానీ తిల్లానాలోగానీ వివిధ తాళగతులుంటాయి. తిరువొట్రియూర్ త్యాగయ్య తాళమాలికలు బాగా ఆదరణ పొందాయి. మంగళంపల్లి బాలమురళీకృష్ణ వ్రాసిన గతిభేదతిల్లానా కూడా జనాదరణ పొందింది.

ఈ సంగీత ప్రక్రియలో ప్రతిభాగానికీ రాగమూ తాళమూ రెండూ మార్పుచెందుతాయి. 108 వివిధ రాగతాళములతో రామస్వామి దీక్షితులు ఒక రాగతాళమాలికను చేసారు.

నృత్య సంగీతాలలో శృంగార, భక్తి రస ప్రధానమైన వీ పదములు. పదములు నాయికా నాయకుల మధ్య జరిగే ఆయా సంఘటనల గురించి చెప్పుచున్నట్లు కనపడినా, ప్రేమతో (శృంగారము) భక్తితో భగవంతునిలో ఏకమవ్వటం వీటి అసలు అంతరార్థం. సాధారణంగా పదములను మధ్యమకాలము లేదా అంతకన్నను నెమ్మదిగా పాడవలెను. పదరచనలో క్షేత్రజ్ఞులు (క్షేత్రయ్య), అన్నమాచార్యులు, పురందరదాసు, ఘనం సీనయ్య మొదలైనవారు ప్రసిద్ధులు.

శృంగారరసముతో ప్రేయసీ ప్రియుల లక్షణములను తెలిపే కృతులకు జావళీలని పేరు. వీటిలో పదములలో మాదిరిగా అంతర్లీనమైన భక్తి కనపడదు. జావళీలు గ్రామ్య భాషలో ఆది-రూపక-చాపు తాళములకు కూర్చబడి తేలికగా పాదుకొనేవిధంగా రచించబడతాయి. మహారాజా స్వాతి తిరుణాళ్, పట్ణం సుబ్రహ్మణ్య అయ్యరు, ధర్మపురి సుబ్బారావు, శివరామయ్య మున్నగువారు జావళీకర్తలు.

జతులు, స్వరసాహిత్యములతో మధ్యమగతిలో పాదుకొనుటకు అనుకూలంగా వివిధ రాగములలో వివిధ తాలములఓ చేయబడ్డ రచనలకు తిల్లానాలని పేరు. వీటి సంగీతము చాల సజీవముగానూ వేగంగానూ వుంటుంది. సాధారణంగా తిల్లానాలను కచేరీలలో చివరలో ప్రదర్శిస్తారు. మహారాజా స్వాతి తిరుణాళ్, పొన్నయ్య, పల్లవి శేషయ్య, మంగళంపల్లి బాల మురళీకృష్ణ, లాల్గుడి జయరామన్ తిల్లానా రచనలో ప్రముఖులు.




#Article 140: నల్గొండ జిల్లా (754 words)


నల్గొండ జిల్లా, తెలంగాణా రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి. , గాంధేయవాది రావి నారాయణరెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు పులిజాల రంగారావు, ఆర్యసమాజ ముఖ్యుడు నూతి విశ్వామిత్ర, కమ్యూనిస్టు యోధుడు బొమ్మగాని ధర్మభిక్షం, రజాకార్ల దురాగతాలను ఎదిరించిన మహిళ ఆరుట్ల కమలాదేవి,ఆరుట్ల రామచంద్రా రెడ్డి, బీమ్ రెడ్డి నారాయణరెడ్డి, మల్లు స్వరాజ్యం. నిజాం వ్యతిరేక పోరాట యోధుడు కాసాని నారాయణలు ఈ జిల్లాకు చెందినవారే. 1952 ఎన్నికల్లో 12 నియోజకవర్గ లలో 12 కమ్యూనిస్ట్ నాయకులే గెలిచారు. కవి, కమ్యూనిస్ట్ యోధుడు మగ్దుo మొహిణిద్దీన్ హుజుర్నగర్ మొదటి mla.అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో రావి నారాయణరెడ్డి గారు సీపీఐ నుండి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కంటే ఎక్కువ మెజారిటీ గెలిచాడు. నల్గొండ జిల్లాలో కమ్యూనిస్ట్ లు వేలాది ఎకరాల భూమిని ప్రజలకు పంచి సాయుధ పోరాట నికి ఊపిరి పోశారు. 

శాతవాహనుల కాలంలో నీలగిరిగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతమే కాలక్రమంలో నందికొండగా, నల్గొండగా మారింది. నల్గొండ జిల్లా పోరాటాలకు ప్రసిద్ధి, ఉద్యమాల ఖిల్లాగా ఈ జిల్లాకు పేరు. ప్రపంచ చరిత్రలో స్థానం సంపాదించిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి జిల్లా ఆయువుపట్టు.

నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణకు ముందు భౌగోళికంగా నల్లగొండ జిల్లా 59 రెవిన్యూ మండలాలతో కలిగి ఉంది.. 

పూర్వపు 59 మండలాలతో ఉన్న నల్గొండ జిల్లా రేఖా పటం (కుడివైపు)              ——→ ——→

అందులో భాగంగా నల్గొండ జిల్లా పరిధిలో పునర్య్వస్థీకరణ ముందు ఉన్న 59 పాత మండలాలు నుండి 14 మండలాలతో భువనగిరి పరిపాలనా కేంధ్రంగా యాదాద్రి జిల్లా,18 మండలాలతో సూర్యాపేట జిల్లా కొత్తగా ఏర్పడగా 26 పూర్వపు మండలాలతో నల్గొండ జిల్లా పునర్య్వస్థీకరించారు.అధికారికంగా కొత్త జిల్లాలు ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

పూర్వపు నల్గొండ జిల్లాకు చెందిన 18 పాత మండలాలతో సూర్యాపేట జిల్లా కొత్తగా ఏర్పడింది.కొత్తగా 5 మండలాలు ఏర్పడినవి.

 
        

పూర్వపు నల్గొండ జిల్లాకు చెందిన 14 పాత మండలాలతో యాదాద్రి భువనగిరి జిల్లా కొత్తగా ఏర్పడింది. కొత్తగా 2 మండలాలు ఏర్పడినవి.

         

పునర్య్వస్థీకరణలో 26 పాత మండలాల కాగా, కొత్తగా 5 మండలాలు కలిపి 31 మండలాలుతో జిల్లా ఏర్పడింది.   

         
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (5)

జిల్లాలో 6 శాసనసభ నియోజక వర్గాలు ఉన్నాయి. 

సున్నపురాయి నిల్వలు అత్యధికంగా ఉన్న జిల్లా కావడంతో సిమెంట్ ఉత్పాదనలో ఈ జిల్లా అసియాలోనే ప్రథమ స్థానంలో ఉంది.

జిల్లాలో 2007 లో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం స్థాపించబడింది.

బహుళార్థసాధక ప్రాజెక్టుకు సరైన నిర్వచనం చెప్పగల నాగార్జున సాగర్ ఈ జిల్లాకు ప్రధాన ఆకర్షణ. మానవ నిర్మిత ఆనకట్టలలో ఆసియాలోనే ఇది అతిపెద్దది. క్రీ.శ. 2వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో నివసించిన బౌద్ధమతాచార్యుడైన ఆచార్య నాగార్జునుని పేరుతో నిర్మించిన ఈ ప్రాజెక్టును 1955లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రారంభించాడు. జలాశయం మధ్యలోని నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకూ కృష్ణా నది పొడవునా 3568 చ.కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించిన రిజర్వు అడవి దేశంలో వన్యమృగ సంరక్షణ కేంద్రాలన్నింటికంటే పెద్దది.జిల్లాలోని యాదగిరి గుట్ట, తెలంగాణాలోని పర్వత ప్రాంత దేవాలయాల్లో ఎంతో పేరుపొందింది. ఇక్కడి లక్ష్మీనరసింహస్వామి గుడి అన్ని ప్రాంతాలవారికి దర్శనీయ పుణ్యక్షేత్రం. దేవాలయ నిర్మాణ రీతి ప్రాచీన ఆధునిక సంప్రదాయాల కలగలుపుగా ఉంటుంది. ఏటా రథోత్సవం జరుగుతుంది. ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవం, పెళ్ళిళ్ళు విరివిగా జరిగే ప్రదేశం. జిల్లాలోని ఆలేరుకు సుమారు ఆరుకిలోమీటర్ల దూరంలోని కొలనుపాక జైన మతానుయాయులకు ఒక పవిత్ర యాత్రాస్థలం. ప్రస్తుతం ఇక్కడ శ్వేతాంబర శాఖకు చెందిన ఒక జైన దేవాలయం నిత్య పూజారాధనతో విలసిల్లుతోంది. కాకతీయుల నాటి ప్రసిద్ధి చెందిన శివాలయాలు సూర్యాపీట మండలం లోని పిల్లలమర్రి గ్రామంలో ఉన్నాయి. వాడపల్లి తీర్థం ఈ జిల్లాలో అతి పెద్ద శైవ క్షేత్రము.శివరాత్రి నాడు పుణ్యస్నానాలు అచరించడానికి ప్రజలు అధిక సంఖ్యలో వస్తారు.ఇది కృష్ణా,మూసీ, అంతర్వేది సంగమం.

హైదరాబాదుకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగార్జునసాగర్ ప్రధాన పర్యాటకకేంద్రం. ఈ చారిత్రాత్మ ప్రదేశానికి ఈ పేరు బౌద్ధసన్యాసి నార్జునుడి కారణంగా వచ్చింది. ఈ ప్రదేశంలో పండితుడైన ఆచార్య నాగార్జునుడు విద్యాకేంద్రాన్ని స్థాపించాడు. ప్రస్తుతం ఇక్కడ నాగార్జునసాగర్ ఆనకట్ట నిర్మించబడి ఉంది. నాగార్జున సాగర్ ఆనకట్ట ప్రపంచంలో పొడవైన మానవ నిర్మిత ఆనకట్టగా ప్రసిద్ధిగాంచింది. నాగార్జునసాగర్ ఆనకట్ట కింద 10 లక్షల కంటే అధికమైన ఎకరాల సాగుబడి జరుగుతుంది.

ఈ ఆనకట్ట నిర్మించే సమయంలో త్రవ్వకాలలో బౌద్ధసంస్కృతికి చెందిన శిథిలాల పురాతన అవశేషాలు బయటపడ్డాయి. వెలికితీసిన పురాతన అవశేషాలను సుందరమైన నాగార్జునకొండ మీద బధ్రపరిచారు. ఈ కొండ మానవ నిర్మిత సరస్సుకు కేంద్రంలో ఉంది. పవిత్రమైన బౌద్ధస్థూప అవశేష మిగులు భాగాలను స్థూప, విహారాలు, ఒక విశ్వవిద్యాలయం, పవిత్రమైన బలిపీఠం జాగ్రత్తగా రిజర్వాయర్‌కు తూర్పు భాగంలో ఉన్నాయి.

మానవ నిర్మిత సరస్సు మధ్య మనోహరమైన ద్వీపం ఉంది. నాగార్జునకొండ త్రవ్వకాలలో 2వ 3వ శతాబ్ధానికి చెందిన బౌద్ధసంస్కృతిక స్థూపం బయటపడ్డాయి.ఈ కొండను చేరటానికి విజయపురి వద్ద ఉన్న జెట్టి అనేప్రదేశంలో బోటు సేవలు లభ్యం ఔతాయి.129 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాదు విమానాశ్రయం నుండి ఇక్కడకు వాయుమార్గంలో ప్రదేశానికి చేరవచ్చు. 

ఎత్తిపోతల జలపాతముకు దిగువగా 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుందరమైన కొండచరియలలో చంద్రవంక జలపాతము ఉంది. ఈ జలపాతము పచ్చని కొండల నుండి 21.3 మీటర్ల నుండి కింద ఒక మడుగులోకి పడుతూ ఉంటుంది. ఈ జలపాతాన్ని తరచూ పర్యాటకులు దర్శిస్తుంటారు.

ఈ సుందర జలపాతము 60 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న చంద్రవంక నది నుండి ప్రవహించే జలాల వలన ఏర్పడింది. ఈ జలపాతం నాగార్జునకొండకు 21 కిలోమీటర్ల దూరంలో తూర్పున ఉంది. అక్కడ ధ్యానంచేసిన ఒక యతీశ్వరుడి వలన ఈ జలపాతానికి ఈ పేరు వచ్చింది. ఈ ప్రాంతంలో కొన్ని కొండ గుహాలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతం వారు ఇక్కడి దైవాలను పూజిస్తూ ఉంటారు.
ఈ ప్రాంతం రహదారి మార్గంలో హైదరాబాదు నుండి 150 కిలో మీటర్ల దూరంలో ఉంది విజయపురి సమీపంలో ఉంది. 

నందికొండ అంటే కృష్ణా నదీ తీరంలో ఉన్న చిన్న పల్లెటూరు. ఇది మిరియాలగూడకు 64.37 కిలో మీటర్ల దూరంలో ఉంది. చాలా ప్రముఖమైన ఈ నిర్మాణం ఇక్ష్వాకు వంశానికి చెందిన వారి చేత నిర్మించబడిన కోట. దృఢమైన గోడలు, కందకము, ద్వారాలు, బురుజులు కలిగిన ఈ కోటలో ఒక దీర్ఘచతురస్రాకార రంగస్థలం (స్టేడియం)ఉంది.

ఇక్కడ అద్భుతమైన చిత్రాలు, సున్నితంగా చెక్కబడిన స్తంభాలు కలిగిన పురాతన కాకతీయ ఆలయాలు ఉన్నాయి. ఈ చారిత్రాత్మక ప్రదేశం ప్రసిద్ధ కవి అయిన పిల్లల మర్రి పిన వీరభద్రుని పుట్టిన ప్రదేశం. 

ఇది హైదరాబాదు నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది చాలా చారిత్రక ప్రసిద్ధమైనది. ఇది 93.24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఒకప్పుడు సమృద్ధి కలిగి ఉన్న ప్రదేశం. పాత కోట యొక్క శిథిలాలు ఇప్పటికీ మిగిలి ఉన్నాయి. ఒకప్పుడు ఎ.డి. 11వ శతాబ్దం ఇది కల్యాణి చాళుక్యులకు రెండవ కోటగా ఉన్నప్పుడు అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది.

శ్రీపార్వతి జడలరామలింగేశ్వర స్వామి గా ప్రసిద్ధి చెందిన చెర్వుగట్టు దేవస్థానం నల్లగొండ జిల్లా కేంద్రం నుండి 18 కి.మీ దూరంలో వెలిసింది.

రాచకొండ, గాజుల కొండ, ఏలేశ్వరం, ఫణిగిరి, భోంగిర్ ఫోర్ట్, మటంపల్లి, వడపల్లి, పంగల్, సుంకి




#Article 141: ఆదిలాబాద్ జిల్లా (733 words)


ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణా రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.

దీని ముఖ్యపట్టణం ఆదిలాబాద్..బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా పేరు మీద ఈ పట్టణానికి ఈపేరు స్థిరపడింది. అంతకు ముందు అదిలాబాదును ఎడ్లవాడ అని పిలిచే వారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోక ముందు, ఉమ్మడి రాష్ట్ర ఆదాయంలో 20% కలిగి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సంపన్న జిల్లాలలో ఇది ఒకటి. తెలంగాణ 10 జిల్లాలతో ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రంలో ఇది ఆదిలాబాద్ జిల్లాకు పరిపాలనా కేంద్రం.

ఆదిలాబాద్ జిల్లాకు ఈ పేరు ఎలా వచ్చిందన్న విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు పాలించిన బీజపూరు సుల్తాను అయిన మొహమ్మద్ అదిల్ షాహ్ పేరు మీద వచ్చింది. మొహమ్మద్ అదిల్ షాహ్ తన ఆర్థిక మంత్రి సేవలకు మెచ్చి ఆదిలాబాదు జిల్లా ప్రాంతాన్ని జాగీరుగా బహూకరించాడు. ఆర్థికమంత్రి మొహమ్మద్ అదిల్ షాహ్ మీద కృతజ్ఞత చూపిస్తూ ఇక్కడ ఒక గ్రామాన్ని నిర్మించి దానికి  ఆదిల్ షా బాద్ అని నామకరణం చేసాడు. క్రమంగా అది ఆదిలాబాదుగా అభివృద్ధి చెందింది. మరో కథనం ప్రకారం ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఎద్దుల సంత జరిగేదని ఆ కారణంగా ఇది ఎదులాపురం అని పిలువబడేదని ముగలాయ్ పాలనా కాలంలో అది ఆదిలాబాదుగా మారిందన్నది భావించబడుతున్నది. తొలి తెలుగు యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రలో భాగంగా ఈ ప్రాంతాన్ని సందర్శించిన వివరాలు వ్రాస్తూ ఈ నగరాన్ని ఎదులాబాదుగానే ప్రస్తావించారు. ఈ జిల్లా పెరు ఎదులపురంగా పిలుస్థారు

చారిత్రకంగా ఆదిలాబాద్ జిల్లా పలు సంస్కృతులకు పుట్టిల్లు. దక్షిణభారతదేశ సరిహద్దులలో ఉపస్థితమై ఉన్న కారణంగా ఇది ఉత్తరభారతదేశ సామ్రాజ్యాధినేతలైన ముగలాయిలు, మౌర్యులు, దక్షిణ భారతదేశ సామ్రాజ్యాధినేతలైన శాతవాహనులు, చాళుక్యులు పాలించారు. ప్రస్తుతం ఈ జిల్లా ప్రజలలో పొరుగున ఉన్న మరాఠీ సంప్రదాయం రాష్ట్ర తెలుగు సంప్రదాయంతో గుర్తించ తగినంతగా కలిసి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ, ఈ జిల్లాలో, పలు సంస్కృతులకి చెందిన వారైన బెంగాలి, మలయాళీ, గుజరాతీలు,పరస్పర సహకార జీవనం సాగిస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లాకు ఉత్తరంలో మహారాష్ట్రంలోని యవత్మాల్ జిల్లా, చంద్రాపూర్ జిల్లాలు ఉన్నాయి. తూర్పున చంద్రాపూర్ జిల్లా ఉంది, దక్షిణాన నిజామాబాద్ జిల్లా, పశ్చిమంలో నాందేడ్ జిల్లాలు ఉన్నాయి. నదులుపరంగా దక్షిణాన గోదావరి నది, తూర్పున ప్రాణహిత నది, ఉత్తరంలో వార్ధా నది, పెల్ గంగా ఉన్నాయి. జిల్లా వైశాల్యం 16203.8 చదరపు కిలోమీటర్లు. వైశాల్యం పరంగా రాష్ట్రంలో ఐదవ స్థానంలో ఉంది. జిల్లాలో 40 శాతం ఉండే అడవులు క్రమంగా క్షీణిస్తున్నాయి.జిల్లాలో 75% భూభాగం ఉష్ణమండల తేమతోకూడిన అడవులతో నిండి ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ లోని అటవీప్రాంతం కలిగిన జిల్లాలలో రెండవ స్థానంలో ఉంది. అదిలాబాదు జిల్లాలో కుంతల జలపాతాలు, సహ్యాద్రి కొండలు మరియూ సత్మాల కొండలు అనేక సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. 600 మిలియన్ టన్నుల మేలిరకం సున్నపురాయి నిల్వలు జిల్లాలో ఉన్నాయి. పింగాణి పాత్రలు, సానిటరీ పైపులు, ఇటుకలు, బెంగుళూరు పెంకుల తయారీకి పనికి వచ్చే బంకమన్ను విస్తారంగా లభిస్తుంది. ఈ జిల్లాలోని ప్రధాన నదులు ప్రాణహిత, పెన్‌గంగ, వార్థా.

ఆదిలాబాద్ జిల్లాలో అధికంగా సాగుచేయబడే ఆహారపు పంట జొన్నలు, వడ్లు, మొక్కజొన్నలు, కందులు, మినుములు, సోయాబీన్, ఇతర పప్పులు, మిరపకాయలు, గోధుమలు, చెరకు. వాణిజ్యపంటలు పత్తి, పసుపు. నిర్మల్, లక్షింపేట్, ఖానాపూర్ సమీప మండలాలలో నీటిపారుదల వసతులు లభ్యం ఔతున్న కారణంగా వ్యవసాయం ఎక్కువగా చేస్తున్నారు. 3.5% భూమిలో సాగుచేయబడే ఉద్యానవన సాగుబడి వలన విదేశీమారకం వంటి ఆదాయం, ఉపాధి లభిస్తుంది. సాధారణ వర్షపాత ప్రాంతం అలాగే నీటిపారుదల వసతులు స్వల్పంగా కలిగిన ఎగువ భూములలో ఉద్యానవన సాగుబడికి అనుకూలంగా ఉండి కూరగాయలు, పండ్లు, కూరగాయలు అలాగే సుగంద ద్రవ్యాలు, పూలు వంటి పంటలు కూడా పండుతున్నాయి.పట్టుపురుగుల పెంపకం కూడా జిల్లాకు కొంత ఆదాయం సమకూరుస్తుంది. పట్టుపురుగుల పెంపకం కొరకు 1000 ఎకరాలలో మలబరీ చెట్లు పెంచబడుతున్నాయి. జిల్లాలో పట్టుపురుగుల పెంపకం కొరకు అనుకూల వాతావరణం ఉంది కనుక పట్టుపురుగుల పెంపకం అభివృద్ధికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.ప్రభుత్వ ప్రణాళిక కారణంగా జిల్లాలో పెంపుడు జంతువుల పెంపకం వలన ఆదాయం, ఉపాధి లభిస్తుంది. జిల్లాలోఆవులు, బర్రెలు, గొర్రెలు, కోళ్ళు పెంచబడుతున్నాయి. జిల్లాలో భూపరిస్థితి పెంపుడు జంతువుల పెంపకానికి అనుకులంగా ఉంది. జిల్లాలో 87 పశువుల ఆసుపత్రులు ఉన్నాయి. ఆదిలాబాదు జిల్లాలో ఉన్న పచ్చిక నిండిన కొండ ప్రాంతాలు గొర్రెలు, మేకలు పెంచడానికి అనుకూలంగా ఉంది.

ఆదిలాబాదు జిల్లాలో బియ్యపు మిల్లులు, నూనె శుద్ధి కర్మాగారాలు, మొక్కజొన్న పిండి, శక్తినిచ్చే ఆహారపదార్థాలు, మినపప్పు మిల్లులు, సుగంధద్రవ్య పొడులు, బేకరీలు, ఐస్ క్రీం, అల్లం ముద్ద, సేమ్యా, మిరపకాయల కారం, నూడుళ్లు, బిస్కత్తులు, కాగితపు రుమాళ్ల తయారీ, ఊరగాయలు, అప్పడాలు, వేరుశనగ బర్ఫీ, పశుగ్రాసం, వ్యవసాయం, వ్యవసాయ సంబంధిత పరిశ్రమలు జిల్లాలో ఉపాధి కల్పిస్తున్నాయి. ముడి, నాణ్యత పెంచబడిన తోలు, తోలు సంచులు, తోలు చెప్పులు, తోలు వస్తువులు తయారీ ఉపాధిని కలిగిస్తున్నాయి. చేనేత వస్త్రాలు, అల్లికలు, పాఠశాల సమవస్త్రాలు, ఉపయోగానికి సిద్ధమైన దుస్తులు, స్క్రీన్ ప్రింటింగ్, వస్త్ర పరిశ్రమ సంబంధిత పరిశ్రమలున్నాయి. ప్లాస్టిక్ సంచులు, ఎలెక్ట్రానిక్ పరికరములు, గాజులు పూసలు, టైర్లు తయారీ పరిశ్రమలున్నాయి. సిమెంటి ఇటుకలు, మట్టి ఇటుకల తయారీ పరిశ్రమలు కూడావున్నాయి. బ్లాక్  వైట్ ఫెనిలిజ్, బట్టలుతుకు పొడి తయారీ చేస్తున్నారు. పుస్తకాలు, ఆభినందన పత్రికలు, వివాహ పత్రికలు తయారు చేస్తున్నారు. శుద్ధనీరు తయారీ, డేటా ప్రొసెసింగ్, అల్యూమినియం పాత్రలు, ఫర్నీచర్, సైబర్ కేప్స్, యంత్రాలు మరమ్మత్తు పనులు వంటివికూడా వున్నాయి

ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణకు ముందు భౌగోళికంగా అదిలాబాద్ జిల్లా పరిధిలో 52 మండలాలు ఉన్నాయి.పునర్య్వస్థీకరణ ముందు 52 మండలాలుతో కలిగియున్న జిల్లా రేఖా పటం ——————→

పునర్య్వస్థీకరణ తరువాత రెండు రెవెన్యూ డివిజన్లు (ఆదిలాబాద్, ఉట్నూరు), 18 రెవెన్యూ మండలాలు, 508 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 31 నిర్జన గ్రామాలు ఉన్నాయి.ఐదు కొత్త మండలాలు ఏర్పడ్డాయి.

జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలుతో కలుపుకొని 467 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.

పునర్య్వస్థీకరణకు ముందు జిల్లా పరిధిలో పట్టణ ప్రాంతాలు ఆదిలాబాదు, మంచిర్యాల్, బెల్లంపల్లి, మందమర్రి, నిర్మల్, భైంసా, కాగజ్‌నగర్ ఏడు పురపాలక సంఘాలున్నాయి.

 

ఆదిలాబాద్ జిల్లాలో పునర్య్వస్థీకరణ తరువాత 18 మండలాలు ఉన్నాయి.అందులో 13 పాత మండలాలుకాగా 5 కొత్తగా ఏర్పడిన మండలాలు.

	

దేశంలోనే అతి పొడవైన జాతీయ రహదారి 44 అదిలాబాదు జిల్లా వాసుల రహదారి ప్రయాణాలను సులభతరం చేస్తూ ఉంది. ఇది మిగిలిన మిగిలిన భారతదేశాన్ని అనేక రహదారి మార్గాలతో కలుపుతూ జిల్లావాసుల రహదారి ప్రయాణాలకు సహకరిస్తుంది. ఇక్కడ వాయుమార్గం 1948లో జరిగిన పోలీస్ ఏక్షన్  భారతీయ వాయు సేనలచేత నాశనం చేయబడింది. అతిసమీపంలో ఉన్న విమానశ్రయం నాగపూరులో ఉన్నా హైదరాబాదు విమానాశ్రయం మరింత ఉపయోగకరమైనది.

జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రం నిర్మల్ పట్టణానికి 70 కి.మీ దూరంలో ఉంది.తెలంగాణలో కల ఏకైక సరస్వతీ ఆలయం ఇక్కడే ఉంది. భారతదేశంలో గల రేండే రెండు సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరులో ఉండగా, రెండవది ఇదే. కుంటాల జలపాతం చాలా ఆకర్షణీయమైంది. పులి, మొసళ్ళు, దుప్పి వంటి అడవి జంతువుల సంరక్షణకోసం ప్రాణహిత సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది.




#Article 142: నిజామాబాదు జిల్లా (1293 words)


నిజామాబాద్ జిల్లా, తెలంగాణా రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.
 		
నిజామాబాద్ నగరం ఈ జిల్లా ముఖ్య పట్టణం. నిజామాబాద్ను పూర్వం ఇందూరు, ఇంద్రపురి అని పిలిచేవారు. బోధన్, ఆర్మూరు ఇతర ప్రధాన పట్టణాలు.నిజామాబాదు నగరం హైదరాబాదు, వరంగల్ తరువాత తెలంగాణాలో 3వ అతిపెద్ద నగరం.

నిజామాబాద్ ను 8వ శతాబ్దంలో రాష్ట్రకూట వంశానికి చెందిన ఇంద్రవల్లభ పాంత్యవర్ష ఇంద్ర సోముడనే రాజు పరిపాలించాడు. అతని పేరుపైననే ఈ ప్రాంతానికి ఇందూరు అని పేరు వచ్చింది. ఇందూరుకు పూర్వం పేరు ఇంద్రపురి. ఇంద్రపురి అని ఒక రాజు పేరు మీదుగా పేరు వచ్చిందని భావించబడుతున్నది. కానీ ఆ రాజు క్రీ.శ.388 ప్రాంతంలో నర్మదా, తపతిల దక్షిణ ప్రాంతాన్ని పాలించిన త్రికూటక వంశానికి చెందిన ఇంద్రదత్తుడా, విష్ణుకుండిన చక్రవర్తి మొదటి ఇంద్రవర్మనా ఇదమిద్ధంగా తెలియడం లేదు. 20వ శతాబ్దం తొలినాళ్ళ వరకు కూడా ఈ ఊరు, జిల్లా ఇందూరుగానే పిలవబడింది. 1901వ సంవత్సరములో ఈ ప్రాంతములో నుండి (సికింద్రాబాద్ నుండి మన్మాడ్ వరకు) రైలు మార్గము ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడి ప్రాంతానికి అప్పటి రాజు నిజాం-ఉల్-ముల్క్ పేరు పెట్టి, జిల్లా పేరును నిజామాబాద్ గా మార్చడం జరిగింది.

జిల్లాలో చారిత్రక శిల్పసంపదకు కొదవలేదు. రాజులు ఏలిన సంస్థానాలలో నేటికీ చారిత్రక కట్టడాల ఆనవాళ్ళు దర్శనమిస్తున్నాయి. క్రీ.పూ.3000 నాటికే జిల్లాలో మానవుల ఉనికి ఆధారాలున్నాయి. అందుకు చరిత్రకారులకు దొరికిన 'కైరన్' (చనిపోయిన వారిని వారికి ఇష్టమైన వస్తువులతో కలిపి పూడ్చిపెట్టి దాని చుట్టూ కొన్ని గుర్తులను అమర్చడం)లే నిదర్శనం. దీని ద్వారానే ప్రాచీన కట్టడాలైన రాష్ట్ర కూటులు, బోధన్ చాళుక్య, కల్యాణి చాళుక్యులు, కాకతీయుల ఆలయాలు, ముస్లిం నిర్మాణాలు తెలిశాయి.

రాజులకు సేవచేసిన కొందరికి అధిక మొత్తంలో భూమిని ధారాదత్తం చేసేవారు. అలా ఎక్కువ మొత్తంలో భూమి పొందిన వారినే సంస్థానాధీశులుగా పేరుపొందారు. సంస్థానాలు అంటే చాలామొత్తంలో ఎక్కువ గ్రామాలు అధికారి ఏలుబడి కింద ఉండడం. ముస్లిం రాజుల పరిపాలనలో అధికార భాషలుగా ఫారసీ, ఉర్దూ ఉండేవి. జిల్లాలో దోమకొండ, సిర్నాపల్లి, కౌలాస్ సంస్థానాల ఆనవాళ్ళు నేటికీ పదిలం.

కాకతీయ సామ్రాజ్యం అంతమైన తరువాత బహమనీ సుల్తానులు కౌలస్ దుర్గాన్ని వశపరచుకున్నారు. ఈ సంస్థానానికి ఔరంగజేబు ద్వారా రాజా పథంసింగ్ గౌర్ ను కౌలాస్ సంస్థానాధీశునిగా నియమితులయ్యారు. ఇతని వారసులు స్వాతంత్ర్యం వరకు అసఫ్ జాహి నైజాం రాజులకు సామంతులుగా వారి రాజ్య పరిరక్షణలో ముఖ్యపాత్ర పోషించారు. రాజా దీప్ సింగ్ 1857 తిరుగుబాటులో ముఖ్యపాత్ర పోషించి బ్రిటీషువారిచే శిక్షకు గురయ్యాడు. శత్రు దుర్భేద్యమైన అప్పటి కట్టడాలు ఇప్పటికీ వాటి నిర్మాణ చాతుర్యాన్ని చాటుతున్నాయి.

జిల్లాలో సిర్నాపల్లి సంస్థానానికి ప్రత్యేకత ఉంది. నిజాంనవాబు కాలంలో రాణి జానకీబాయి హయాంలో జరిగిన అభివృద్ధి పనులు ఇప్పటికీ అజరామరం. 1859 నుంచి 1920 వరకు సిర్నాపల్లి సంస్థానాన్ని ఆమె పాలించారు. చెరువులు, ఆనకట్టలు, కుంటలు, బావులు, కాలువలు కట్టించారు. ఆమె ఇందల్ వాయి, నిజామాబాద్ లోని సిర్నాపల్లి గడి, కోటగల్లిగడి, మహబూబ్ గంజ్ లోని క్లాక్ టవర్ కట్టడం తదితర నిర్మాణాలు, జానకంపేట, నవీపేట, రెంజల్ దాకా 100 గ్రామాల్లో పరిపాలన సాగించారు. సికింద్రాబాద్-నిజామాబాద్ రైల్వేలైనును నిజాం నవాబు ఉప్పల్‌వాయి, డిచ్ పల్లిల మీదుగా వేస్తే, ఈమె ఆ లైనును తన సిర్నాపల్లి మీదుగా వెళ్ళేలా వేయించుకున్నారు.

జిల్లాలో వెల్మల్ సంస్థానం పురాతనమైనది. దీని క్రింద వెల్మల్, కల్లెడి, గుత్ప తదితర గ్రామాలుండేవి.

ప్రాచీన సంస్థానాల్లో పేరెన్నికగన్నది దోమకొండ. పాకనాటి రెడ్డశాఖకు చెందిన కామినేని వంశస్థులు ఈ సంస్థానాధీశులు. 1636లో అబ్దుల్ హుస్సేన్ కుతుబ్ షా కామారెడ్డికి ఈ సంస్థానాన్ని ఇచ్చాడు. ఈ ప్రాంతంలోని అనేక గ్రామాలు వారి వంశీయుల పేర్లయిన కామారెడ్డి, సంగారెడ్డి, ఎల్లారెడ్డి, మాచారెడ్డి, సదాశివనగర్, పద్మాజివాడి, తుక్కోజివాడి, తిమ్మోజివాడిల మీదనే వెలిశాయి. సంస్థానంలోని కట్టడాలు శిల్పకళా సంపదను సాక్షాత్కరిస్తాయి. కోట, అద్దాల బంగళా, రాజుగారి భనాలు, అశ్వగజ శాలలు, కుడ్యాలు, బురుజులు, కందజం పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. ఈ అద్దాల మేడలోనే కామినేని వంశీయులు సాంస్కృతిక కార్యక్రమాలు జరిపించేవారు. పురావస్తుశాఖ ఆధ్వర్యంలో పునర్నిర్మాణ పనులు జరగడంతో చారిత్రక సంపదను కాపాడుకున్నట్లయింది.

హైదరాబాదు రాజ్యం యొక్క బీదరు సుబాలో, ఇందూరు జిల్లాగా ఉంది. 1905లో ఇందూరు తాలుకాలోని నిర్మల్, నర్సాపూర్ తాలూకాలను కొత్తగా ఏర్పడిన అదిలాబాదు జిల్లాలో చేర్చారు. మధోల్ తాలూకా, బాన్స్‌వాడలోని కొంతభాగం నాందేడ్ జిల్లాలో చేర్చారు. మిగిలిన బాన్స్‌వాడ తాలూకాను యెల్లారెడ్డి, బోధన్ తాలుకాలోకి చేర్చారు. భీంగల్‌ను ఆర్మూరు తాలూకాలో కలిపి, యెల్లారెడ్డిపేట, కామారెడ్డిపేట తాలూకాలో మరికొన్ని మార్పులు చేసి కొత్తగా ఏర్పడిన జిల్లాకు నిజామాబాదు జిల్లాగా నామకరణం చేశారు. జిల్లా ఏర్పడినప్పుడు ఐదు తాలూకాలుండేవి - ఇందూరు, ఆర్మూరు, కామారెడ్డి, యెల్లారెడ్డి, బోధన్. 1930వ దశకంలో యెల్లారెడ్డి, బోధన్ తాలూకాల నుండి బాన్స్‌వాడ తాలూకాను తిరిగి ఏర్పరచారు.

జిల్లాకు సరిహద్దులుగా, ఉత్తరాన అదిలాబాదు జిల్లా, తూర్పున కరీంనగర్, దక్షిణాన మెదక్ జిల్లాలు, పశ్చిమాన కర్ణాటక లోని బీదరు జిల్లా, మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లాలు ఉన్నాయి. 18-5', 19' ఉత్తర అక్షాంశాల మధ్య, 77-40', 78-37' తూర్పు రేఖాంశాల మధ్య జిల్లా విస్తరించి ఉంది. సముద్రతీరానికి సుదూరంగా ఉండటంచేత జిల్లా వాతావరణం భూమధ్యరేఖా వాతావరణం గాను, విపరీత ఉష్ణోగ్రతా వ్యత్యాసాలు ఉంటాయి. సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత 13.7 డిగ్రీల సెం, సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 39.9 డిగ్రీల సెం గాను ఉన్నాయి. శీతాకాలంలో ఉష్ణోగ్రత 5 డిగ్రీలు సెం వరకు పడిపోవడం, వేసవిలో 47'డిగ్రీలు సెం వరకు పెరగడం కూడా కద్దు. జిల్లా విస్తీర్ణం 7956 చ.కి.మీ, అనగా 19,80,586 ఎకరాలు. జిల్లాలోని 36 మండలాల్లో ఉన్న 923 గ్రామాల్లో 866 నివాసమున్నవి కాగా, 57 గ్రామాలు ఖాళీ చెయ్యబడినవి గానీ, లేక నీటిపారుదల ప్రాజెక్టులలో ముంపుకు గురయినవి గాని.

 

 

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (10)

జిల్లా గుండా సికింద్రాబాదు- మన్మాడ్ మార్గం వెళ్ళుచుండగా, జానకంపేట నుంచి బోధన్ వరకు మరో మార్గం ఉంది. జిల్లాలో మొత్తం కిమీ పొడవు కల మార్గంలో 15 రైల్వేస్టేషనులు ఉన్నాయి. కరీంనగర్ నుంచి నిజామాబాదుకు కొత్తగా నిర్మిస్తున్న రైలుమార్గం పురోభివృద్ధిలో ఉంది. జిల్లా గుండా ఉత్తర-దక్షిణంగా 44వ నెంబరు జాతీయ రహదారి, నిజామాబాదు - భూపాలపట్నం జాతీయ రహదారి వెళ్ళుచున్నాయి. కామారెడ్డి, డిచ్ పల్లి, నిజామాబాదు, ఆర్మూరు జాతీయరహదారి పై ఉన్న ప్రధాన పట్టణాలు.

నిజామాబాదు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లా తర్వాత రెండవ అత్యల్ప జనాభా గల జిల్లా. 2011 జనాభా లెక్కల ప్రకారం, ఈ జిల్లా జనాభా 25,52,073. స్త్రీ, పురుషుల నిష్పత్తి 1038:1000. భారతదేశ జనాభాతో పోల్చుకుంటే, జిల్లాలో పురుషుల సంఖ్య కంటే స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. మొత్తం అక్షరాస్యత 53.26 శాతం (2001 జనగణన). జిల్లాలో ఏడు పట్టణాలు, 923 గ్రామాలు ఉన్నాయి.

అలీసాగర్ నిజామాబాదు నుండి 10 కిలోమీటర్ల దూరములో నిజామాబాదు - బాసర రోడ్డుకి 2 కిలోమీటర్ల దూరములో ఉంది. ఈ మానవ నిర్మిత జలాశయము 1930లో కట్టబడింది. నగర జీవితము యొక్క హడావిడికి దూరముగా ఈ జలాశయము ప్రశాంత వాతావరణము కల్పిస్తుంది. వన్య ప్రాంతంతో పాటు కల వేసవి విడిది, చక్కగా తీర్చిదిద్దిన ఉద్యానవనాలు, ఒక దీవి, కొండపైనున్న అతిధిగృహము దీనిని పర్యాటకులకు ఒక ముఖ్య గమ్యస్థానంగా చేస్తున్నాయి. వీటితో పాటు జింకల పార్కు, ట్రెక్కింగ్, జలక్రీడలకు సదుపాయాలు ఉండటము అదనపు ఆకర్షణ.

మల్లారం అడవి, నిజామాబాదు నుండి 7 కిలోమీటర్ల దూరములో ఉంది. చుట్టూ వన్య ప్రదేశములో ఒదిగి ఉన్న మల్లారం ప్రకృతి పర్యటణకు సరైన స్థలము. అడవి మార్గములు, ఒక గోపురము, ఒక దృశ్యకేంద్రమున్న టవర్ ఇక్కడి ముఖ్య ఆకర్షణలు. 1.45 బిలియన్ సంవత్సరాల పురాతనమైన శిల ఇక్కడ మిమ్మల్ని ప్రకృతి ఒడిలోకి పిలుస్తుంది. సాహసిక పర్యటనలకు, ఉత్తేజితమైన పిక్నికులకు చాలా అనువైన ప్రదేశము.

నిజామాబాదు, అదిలాబాద్ జిల్లాల విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు పెంపొందించేందుకు 2006లో నిజామాబాదు జిల్లాలోని డిచ్‌పల్లి కేంద్రంగా తెలంగాణా విశ్వవిద్యాలయం ఏర్పడింది. ఇది వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉన్న బిక్నూరు పోస్టుగ్రాడ్యుయేట్ కేంద్రం 2011-12 విద్యాసంవత్సరం నుండి తెలంగాణా విశ్వవిద్యాలయం దక్షిణ క్యాంపసుగా మారింది.

నిజామాబాదు నగరంలో చూడడానికి చాల ఉన్నాయి. నీలకంఠేశ్వరాయలయం, సారంగపూర్ హనుమాన్ మందిరము, తిలక్ గార్డెను, ఖిల్లా, తెలంగాణ విశ్వవిద్యాలయము మొదలయినవి. నిజాంసాగర్‌ ప్రాజెక్ట్,, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్, పోచారం, ఆలీసాగర్, నిజామాబాదు కోట, డిచ్‌పల్లి రామాలయం, తిలక్ గార్డెన్ వద్ద ఉన్న మ్యూజియం, దోమకొండ కోట, ఖిల్లా రామాలయం,భిక్కనూరు శ్రీ సిద్దరామేశ్వర దేవాలయం, రామారెడ్డి శ్రీ కాలభైరవ స్వామి దేవాలయం,సంతాయిపేట్ శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం, మల్లారం అడవి, అశోక్ సాగర్, సారంగాపూర్, ఆర్మూరు రోడ్డు లోని శిలలు మొదలైనవి జిల్లాలోని కొన్ని పర్యాటక ఆకర్షణలు. నిజామాబాదు కోట, రఘునాథదాసు నిర్మించిన ఒకప్పటి రామాలయంపై నిర్మించారు. ఆయనే నిర్మించిన పెద్ద చెరువు నేటికీ నిజామాబాదు నగర మంచినీటి అవసరాలు తీరుస్తోంది. ఈ పర్యాటక ప్రదేశాలన్నీ అందమైన తోటలతో, అతిథిగృహాల వంటి సౌకర్యాలతో యాత్రికులకు సౌకర్యవంతంగా ఉన్నాయి.

నిజామాబాదులోని జిల్లా పురాతత్వ ప్రదర్శనశాలలో పాతరాతియుగం నుండి విజయనగర సామ్రాజ్య కాలం వరకు మానవ నాగరికత పురోగతిని తెలియజేసే పురాతన వస్తువులు ఉన్నాయి. 2001 అక్టోబరులో ప్రారంభమైన ఈ ప్రదర్శనశాలలో పురాతత్వ విభగం, శిల్పకళా విభాగం, కాంస్య, అలంకరణ విభాగం అనే మూడు విభాగాలు ఉన్నాయి. బిద్రీ వస్తువులు, అనేక రకములైన ఆయుధాలు కూడా ప్రదర్శనలో ఉన్నాయి.

అందమైన శిలలు, ఉద్యానవనాలతో దృశ్యసౌందర్యమైనది అశోక్ సాగర్ చెరువు. హైదరాబాదు - బాసర రోడ్డులో నిజామాబాదు నుండి 7 కిలోమీటర్ల దూరములో ఉంది. ఇక్కడ ఉద్యానవనము చక్కగా తీర్చిద్దిబడి వెలిగించబడిన శిలలతో ఉంది. ఈ సరస్సులో పడవ విహారము కూడా చేయవచ్చు.

జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో లింబాద్రి గుట్ట, బడా పహాడ్, బిచ్కుంద, సారంగాపూర్ మొదలైనవి ఉన్నాయి.

లింబాద్రి గుట్టపై ప్రశాంత వాతావరణములో శ్రీ నరసింహ స్వామి ఆలయము నెలకొన్నది. ఈ ప్రదేశం భీమగల్ నుండి 4 కిలోమీటర్ల దూరములో ఉంది. ప్రతి సంవత్సరము కార్తీక సుద్ధ తదియ నుండి త్రయోదశి వరకు ఇక్కడ ఉత్సవం జరుగుతుంది. దీనిని నింబాచలం అని కూడా పిలుస్తారు. పచ్చని కొండల మధ్య ఎంతో అహ్లాదంగా ఉంది

వర్ని, చండూరు మధ్య ఉన్న బడా పహాడ్ పైన సయ్యద్ సదుల్లా హుస్సేనీ దర్గాలో అనేక మంది ప్రజలు శ్రద్ధాంజలి ఘటించడానికి వస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరము జాతర కూడా జరుగును.

నిజామాబాదు నుండి 8 కి.మీ.ల దూరంలో ఉన్న సారంగాపూర్ వద్ద హనుమంతుని దేవాలయం ఉంది. ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాసు, దాదాపు 452 ఏళ్ళ కిందట ఈ ఆలయానికి శంకుస్థాపన చేసాడు. చక్కటి రవాణా సౌకర్యాలతో, భక్తులకు అవసరమైన వసతి వంటి అన్ని సౌకర్యాలు ఈ ప్రదేశం కలిగి ఉంది.

దక్షిణ కాశిగా పేరుగాంచిన, ప్రసిద్ధ శ్రీ భిక్కనూరు సిద్దరామేశ్వర స్వామి దేవాలయం, నిజామాబాదు నుండి 70 కిలోమీటర్ల దూరములో భిక్కనూరు మండల కేంద్రంలో ఉంది.

ఎంతో ప్రాచుర్యం కలిగిన శ్రీ కాల భైరవస్వామి దేవాలయం, సదాశివనగర్ మండలం, ఇస్సన్నపల్లి గ్రామంలో ఉంది.

ఈ కంఠేశ్వర్ వద్ద ఉన్న నీలకంఠేశ్వరుని రూపంలో ఉన్న శివుని దేవాలయం పురాతనమైనది. ఉత్తర భారత వాస్తు శైలిలో ఉండే ఈ ఆలయాన్ని శాతవాహన చక్రవర్తి యైన రెండవ శాతకర్ణి జైనుల కొరకు కట్టించాడు. రథసప్తమి పండుగను ప్రతి ఏటా పెద్దెత్తున జరుపుతారు.

క్రీ.శ. 1600 ప్రాంతంలో విజయనగర రాజులు డిచ్ పల్లి దేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. 76 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు. ద్వారాలపై నగిషీ, గోపురాలపై ద్రావిడుల ప్రభావం కన్పిస్తుంది. విజయనగర రాజుల శిల్ప రీతి కనిపించడంతో 16వ శతాబ్దం మధ్య కాలంలో రామరాయల హయాంలో నిర్మించి ఉండొచ్చని భావిస్తున్నారు. నిర్మాణం మొత్తం చాలావరకు నల్లరాయితో జరిగింది. ఈ దేవాలయానికి ఎదురుగా చెరువు మధ్యలో నిర్మించిన మండపం ప్రత్యేక ఆకర్షణ.

ఇందూరు, ఇంద్రపురి అనేపేర్లు కలిగిన నిజామాబాదు పట్టణాన్ని, ఇక్కడి కోటను రాష్ట్రకూటులు నిర్మించారు. వారి కాలంలోనే నిర్మించిన 40 అడుగుల ఎత్తున్న విజయస్థూపం కూడా ఇక్కడ ఉంది. క్రీ.శ. 1311లో ఈ కోటను అల్లావుద్దీన్ ఖిల్జీ ఆక్రమించాడు. తరువాత అది బహమనీ రాజుల చేతుల్లోకి, ఆపై కుతుబ్ షాహీ, ఆసఫ్ జాహీల చేతుల్లోకి వెళ్ళింది. విశాలమైన ఈ కోట రాతి గోడలతో, నాలుగు మూలల బురుజులతో ఉంది. క్రీ.శ.10 వ శతాబ్దపు ఈ రాష్ట్రకూటుల కోట ప్రస్తుతం ఆసఫ్ జాహీ ల శైలిలో విశాలమైన గదులతో ఉంది. కోటలో సమర్థ రామదాసు నిర్మించిన బడా రామాలయం మరో ఆకర్షణ.

కంజర్లో కూడా హనుమంతుని దేవాలయం ఉంది. ఈ గుడి 1843లో నిర్మించబడ్డది.




#Article 143: పశ్చిమ గోదావరి జిల్లా (1597 words)


 	 		
పశ్చిమ గోదావరి జిల్లా, భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని ఒక జిల్లా. ఈ జిల్లా రాజధాని ఏలూరు కృష్ణాజిల్లాలో ముఖ్య పట్టణమైన విజయవాడకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. జిల్లాకు తూర్పున గోదావరి నది ప్రవహిస్తూ తూర్పు గోదావరి జిల్లాను జిల్లా నుండి వేరు చేస్తున్నది. జిల్లాకు పశ్చిమాన కృష్ణా జిల్లా, దక్షిణాన కృష్ణా జిల్లా, బంగాళాఖాతం, ఉత్తరాన తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఖమ్మం జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. తాడేపల్లిగూడెం, జిల్లాలోని ఒక అభివృద్ధి చెందుతున్న పట్టణం. ఈ జిల్లాలో 52% అక్షరాస్యత ఉంది. తణుకు పారిశ్రామికంగా వృద్ధి పొందుతున్న గ్రామం. భీమవరం వ్యాపారాత్మకంగా వృద్ధిపొందుతున్న నగరం, పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు మరొక ముఖ్య నగరంగా వెలుగొందింది.

బౌద్ధుల కాలంనుండి ఇక్కడి చరిత్రకు స్పష్టమైన ఆధారాలున్నాయి. కామవరపుకోట మండలం జీలకర్రగూడెం, గుంటుపల్లిలలో ఉన్న బౌద్ధారామాలు సా.శ.పూ. 200 నుండి క్రీ.శ. 300 మధ్యకాలానికి సంబంధించినవి. బుద్ధుని ప్రతిమలేవీ లేకపోవడం వలన ఇవి ముఖ్యంగా 'హీనయానం' (బౌద్ధం ఆరంభ సమయం) కాలానికి చెందినవని అనిపిస్తున్నది. భీమవరం దగ్గర పెదఅమిరం గ్రామంలోను, పెనుమంచిలి, ఆచంట లలోనూ జైన తీర్ధంకరుల మందిరాలున్నాయి.

ప్రస్తుతం పశ్చిమ గోదావరిగా పిలువబడే ప్రాంతం చారిత్రికంగా నందుల సామ్రాజ్యంలోనూ, తరువాత అశోకుని సామ్రాజ్యంలోనూ భాగంగా ఉండేది. తరువాత మిగిలిన దక్షిణ దేశంలాగానే (క్రీ.శ. 1 నుండి 3వ శతాబ్దం వరకు) ఇది కూడా శాతవాహనుల యేలుబడిలోకి వచ్చింది. క్రీ.శ.350 ప్రాంతంలో సముద్రగుప్తుడు ఈ ప్రాంతంపై దండెత్తాడు. తరువాత మహారాజు శక్తి వర్మతో ఆరంభమైన మఠరకుల వంశం వారు క్రీ.శ. 375 నుండి 500 వరకు ఆంధ్ర తీర ప్రాంతాన్ని పరిపాలించారు. తరువాత రెండు శతాబ్దాలు పిఠాపురం (పిష్టపురం) కేంద్రంగా విష్ణు కుండినులు ఈ తీర ప్రాంతంలో రాజ్యపాలన చేశారు. వీరిలో విక్రమేంద్ర వర్మ ముఖ్యమైనవాడు. విక్రమేంద్ర వర్మ ప్రతినిధిగా రణ దుర్జయుడు పిఠాపురం నుండి పాలన చేశాడు. ఇంద్ర భట్టారకుడనే విష్ణు కుండిన రాజును జయించి, కళింగ గంగులు వారి రాజ్యంలో చాలా భాగాన్ని ఆక్రమించారు. 3వ మాధవ వర్మ విష్ణు కుండినులలో చివరి రాజు.

తరువాత బాదామి చాళుక్యులు|బాదామి చాళుక్యుల (పశ్చిమ చాళుక్యులు) వంశానికి చెందిన 2వ పులకేశి సోదరుడైన కుబ్జవిష్ణువు పిఠాపురాన్ని జయించి ఇక్కడ చాళుక్యుల పాలనకు నాంది పలికాడు. కుబ్జ విష్ణునితో తూర్పు చాళుక్య పాలన మొదలయ్యింది. వారి పాలనలో రాజధాని పిఠాపురం నుండి ఏలూరుకి, తరువాత రాజమండ్రికి మార్చబడింది. క్రీ.శ. 892-921 మధ్య రాజైన 1వ చాళుక్య భీముడు ద్రాక్షారామ శివాలయాన్ని నిర్మించాడు.కాకతీయ వంశ జ రాణి రుద్రమదేవి నిర్వర్జ్యపురము అనబడే ఈనాటి నిడదవోలును రాజధానిగా పాలించిన చాళిక్యుల ఇంటి కోడలు. తరువాత వివిధ రాజుల రాజ్యాలు సాగాయి.

బ్రిటిష్‌ వారి కాలంలో ఈ ప్రాంతం పాలన మచిలీపట్నం కేంద్రంగా సాగింది. 1794లో కాకినాడ, రాజమండ్రిల వద్ద వేరే కలక్టరులు నియమితులయ్యారు. 1859లో కృష్ణా, గోదావరి జిల్లాలను వేరు చేశారు. తరువాత చేపట్టిన పెద్ద నీటిపారుదల పథకాల కారణంగా జిల్లాలను పునర్విభజింపవలసి వచ్చింది. 1904లో యర్నగూడెం, ఏలూరు, తణుకు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం ప్రాంతాలను గోదావరి నుండి కృష్ణా జిల్లాకు మార్చారు. 1925 ఏప్రిల్ 15న కృష్ణా జిల్లాను విభజించి పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పరచారు. (గోదావరి జిల్లా పేరు తూర్పు గోదావరిగా మారింది). తరువాత 1942లో పోలవరం తాలూకాను తూర్పు గోదావరి నుండి పశ్చిమ గోదావరికి మార్చారు.

భౌగోళికంగా ఈ జిల్లా 16 - 15' నుండి 17-30' ఉత్తర అక్షాంశాల మధ్య, 80-55' తూర్పు రేఖాంశాల మధ్య ఉంది.
గోదావరి నది డెల్టాలో కొంత భాగం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. మొత్తం జిల్లా వైశాల్యం 7,780 చ.కి.మీ. (19,26,277 ఎకరాలు). జిల్లాలో సగటు వర్షపాతం 1076.20 మిల్లీమీటర్లు.
. నైసర్గికంగా జిల్లాను మూడు సహజ ప్రాంతాలుగా విభజించవచ్చును -

డెల్టా ప్రాంతంలో కృష్ణా, గోదావరి నదుల కాలవలు ప్రధానమైన నీటి వనరులు. పెద్ద మంచినీటి సరస్సు అయిన కొల్లేరు ఈ జిల్లాలోనే ఉంది. మెరక భూములలో ఇటీవల విస్తారంగా కరంటు బావుల ద్వారా వ్యవసాయం జరుగుతున్నది. ఏజన్సీ ప్రాంతంలోనూ, మెరక ప్రాంతంలోనూ చిన్న, పెద్ద సాగునీటి ప్రాజెక్టులు నీటిని అందిస్తున్నాయి.

జిల్లాలో అటవీ ప్రాంతం 81,200 హెక్టేరులు - మొత్తం వైశాల్యంలో సుమారు 10.5%. సాగు అవుతున్న భూమిలో అధిక భాగం వరి పంట (82.8%), తరువాత పుగాకు (4.9%), చెరకు (4.7%), మిర్చి (1.3%).

జిల్లా ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం పైనా, వ్యవసాయాధారిత సేవలు, పరిశ్రమలపైనా ఆధారపడి ఉంది. పనిచేసే వారిలో దాదాపు 78% జనాభా వ్యవసాయాధారితమైన వృత్తులే సాగిస్తున్నారు. వరి, చెరకు, పుగాకు, కొబ్బరి, మామిడి, మొక్కజొన్న, ఆయిల్ పామ్, వేరుశనగ, అపరాలు, ప్రొద్దు తిరుగుడు పూలు - ఇవి ఈ జిల్లాలో ప్రధానమైన పంటలు. జిల్లాలోని వివిధ పంటల విస్తీర్ణం క్రింద ఇవ్వబడింది.

ఈ పంటలలో వరి, చెరకు సాగు ప్రధానంగా డెల్టా ప్రాంతంలో సాగుతుంది. అపరాలు ఎక్కువగా డెల్టా ప్రాంతంలో అంతర పంటగా పండిస్తారు. మొక్కజొన్న, పుగాకు, కొబ్బరి వంటివి మెరక ప్రాంతంలోనూ, పల్లపు ప్రాంతంలోనూ కూడా పండుతాయి. జీడిమామిడి, మామిడి, నిమ్మ, ఆయిల్ పామ్ వంటి తోటల వ్యవసాయం అధికంగా మెరక ప్రాంతంలో జరుగుతుంది.

జిల్లాలోని డెల్టా ప్రాంతలో సారవంతమైన నల్లరేగడి నేల ఉంది. కొద్దిభాగం పాటి నేల. ఎక్కువ భాగం ఎర్ర చెక్కు నేల, ఇసుక నేల కలిసి ఉంది. మొత్తం జిల్లాలోని 7.7 లక్షల హెక్టేరుల వైశాల్యంలో సుమారు 5.5 లక్షల హెక్టేరులు వ్యవసాయానికి అనుకూలమైన భూమి. 0.8 లక్షల హెక్టేరులు అడవి ప్రాంతము. 0.45 లక్షల హెక్టేరులు బీడు భూములు. 0.94 హెక్టేరులు ఇతర ఉపయోగాలకు వాడుతున్నారు. 1996-97లో మొత్తం 6 లక్షల హెక్టేరులలో వ్యవసాయం జరిగింది.

వ్యవసాయానికి అనుబంధంగా సాగే పశుపాలన కూడా జిల్లా ఆర్థిక వ్యవస్థలో ముఖ్యభాగం వహిస్తున్నది. జిల్లాలో 2.5 లక్షల ఆవులు, 4.2 లక్షల గేదెలు, 75వేల గొర్రలు, లక్ష మేకలు, 30 వేల పందులు, 84 లక్షల కోళ్ళు పెంచబడుతున్నాయని అంచనా.

జిల్లాలో సరాసరి సంవత్సర వర్షపాతం 1076.2 మి.మీ. ఇందులో సుమారు 64% వర్షపాతం నైరుతి ఋతుపవనాల సమయంలో (జూన్ - సెప్టెంబరు కాలం) ఉంటుంది.

జిల్లాకు తూర్పు హద్దుగా ఉన్న గోదావరి నది విజ్జేశ్వరం వద్ద గౌతమి గోదావరి, వశిష్ట గోదావరి అనే రెండు పాయలుగా చీలుతుంది. అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తుంది. ఎర్రకాలువ, తమ్మిలేరు, బైనేరు, కొవ్వాడ కాలువ, జల్లేరు, గుండేరు ఇతర ప్రవాహ నీటి వనరులు. జిల్లాలో దాదాపు 20.2% నేల గోదావరి నది పరీవాహక ప్రాంతంలోనూ, 48.1 % యెర్రకాలువ పరీవాహక ప్రాంతంలోను, 26.8% తమ్మిలేరు ప్రాంతంలోను, 1.4% రామిలేరు ప్రాంతంలోను, 3.5% లోయేరు ప్రాంతంలోను ఉంది..

జిల్లాలో వ్యవసాయానికి నీరందించేవాటిలో మూడు వ్యవస్థలు ఉన్నవి:

ఇవి కాక తమ్మిలేరు రిజర్వాయరు ద్వారా 3,700 హెక్టేరులు, జల్లేరు రిజర్వాయరు ద్వారా 1,700 హేక్టేరులు సాగుకు అవకాశం ఉంది.

మెరక ప్రాంతంలో పెద్దయెత్తున గొట్టపు బావులద్వారా సాగునీరు వినియోగం జరుగుతున్నది.

పశ్చిమ గోదావరి జిల్లా పారిశ్రామికంగా పెద్దగా అభివృద్ధి చెందిందనడానికి ఆస్కారం లేదు. అందువలన ఉద్యోగావకాశాలు కూడా చాలా తక్కువని చెప్పవచ్చును. ప్రధానంగా వ్యవసాయాధారితమైన ఈ జిల్లాలో ఉన్న కొద్దిపాటి పరిశ్రమలు కూడా వ్యవసాయాధారితమైనవే.

జిల్లాలో ఏలూరు, భీమవరం, తణుకు, పాలకొల్లులలో పారిశ్రామిక కేంద్రాలున్నాయి. మొత్తం జిల్లాలో పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లు ఇలా ఉన్నాయి:

మొత్తం జిల్లాలో 52 పెద్ద, మధ్య తరగతి పరిశ్రమలున్నాయి. వీటిలో సుమారు 17వేల మందికి ఉపాధి లభిస్తున్నది. జిల్లాలోని ముఖ్య పరిశ్రమలు:

ఇవి కాక జిల్లాలో ఈ క్రింది కుటీర పరిశ్రమలు చిన్నపరిశ్రమలు కొన్ని పట్టణాలలో కేంద్రీకృతమై ఉన్నాయి.

ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భావం నాటికి పశ్చిమగోదావరి జిల్లాలో చేపల సాగుకు ప్రత్యేకమైన పద్ధతులంటూ ఏమీ లేవు. ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో విస్తరించిన గోదావరి, దక్షిణం వైపున 19.5 కిలోమీటర్ల మేర సముద్రం కొల్లేరు, ఉప్పుటేరు ప్రాంతాల్లో లభించే చేపలతోనే మత్స్యకారులు వ్యాపారం జరిపేవారు. చేపల అధికోత్పత్తి, వాణిజ్య రంగ విస్తరణకు ఎటువంటి పద్ధతులు అప్పట్లో లేవు. 1961 నాటికి జిల్లాలో తొమ్మిది మార్కెట్లే ఉండేవి. నాడు 460 టన్నుల చేపల విక్రయాలు జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 1969-70 మధ్య రూ. 10.25 లక్షల విలువైన 471 టన్నుల చేపలు, రూ. 1.61 లక్షల విలువ చేసే 73 టన్నుల రొయ్య అమ్మకాలు జరిగాయి. ఈ క్రమంలోనే మత్స్యపరిశ్రమపై ఆధారపడిన మత్స్యకారుల కోసం 42 ఫిషర్‌మేన్ కోఆపరేటివ్ సొసైటీలు 5805 మంది సభ్యులతో ఏర్పడ్డాయి. 1981 నాటికి ఆ సంఖ్య 61 సొసైటీలకు పెరిగింది. 1960లో బాదంపూడిలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించడంతో జిల్లాలో చేపల పెంపకం చెరువుల్లో మొదలైంది. ఇందుకోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో భీమవరం సమీపంలోని పెదఅమిరం, నరసాపురం, కొవ్వలి, తణుకు, ఏలూరు, కొవ్వూరు తదితర చోట్ల చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు వెలిశాయి.

శాస్త్రీయ పద్ధతుల్లో వాణిజ్య వ్యాపారంగా చేపల పెంపకం 1980 నుంచి ప్రారంభమైంది. తొలుత జిల్లాలో ఆకివీడు, కృష్ణా జిల్లా కైకలూరు పంట ప్రాంతాలుగా చేపల పెంపకం విస్తరించింది. ప్రారంభంలో 20 వేల ఎకరాల్లో మొదలైన ఈ సాగు 1985-86 ప్రాంతంలో వరి పంట నష్టాలకు గురవుతుండటంతో ఒకేసారి మరో 10 వేల ఎకరాలకు విస్తరించింది. భీమవరం, నిడమర్రు, గణపవరం, కాళ్ళ, ఉండి, వీరవాసరం, మొగల్తూరు, నరసాపురంలలో చేపల చెరువులు బాగా విస్తరించాయి. ప్రధానంగా భీమవరం ప్రాంతంలో చేపల పరిశ్రమ అభివృద్ధి కోసం ఆనంద గ్రూపు-అమాల్‌గమ్ ఫిషరీస్ సంయుక్తంగా 1988లో కొత్త పద్ధతులను, ఫిష్ ప్యాకింగ్ గ్రేడింగ్ విధానాలను ప్రారంభించాయి. అప్పటి వరకు ఒక మోస్తరుగా రైళ్ళ ద్వారా చేపల ఎగుమతులు జరిగేవి. తదుపరి ప్యాకింగ్‌తో ట్రేడింగ్ విధానం ప్రారంభం కావడంతో భీమవరం చేపల ఉత్పత్తుల పెంపకానికి ప్రధాన కేంద్రంగా మారింది. అస్సాం, ఢిల్లీ, కలకత్తా తదితర ప్రాంతాలకు చేపల ఎగుమతులు ప్రారంభమయ్యాయి. తొలి రోజుల్లో 500 టన్నుల ఉత్పత్తులు ఎగుమతి అయ్యేవి.

రెండున్నర దశాబ్దాలలో 20 వేల ఎకరాల నుంచి జిల్లాలో 1.50 లక్షల ఎకరాల విస్తీర్ణానికి పెరిగాయి. 1990 నాటికి ప్రభుత్వం ప్రైవేటు రంగాలలో 7054 చెరువులు ఉండగా 20 వేలకు పెరిగినట్లు అంచనా. ఒక్క గణపవరం, నిడమర్రు, ఆకివీడు మండలాలలో గతంలో 35 లారీల చేపలు కలకత్తా మార్కెట్‌కు రోజూ వెళ్ళేవి. ప్రస్తుతం రోజుకి 1250 లారీల్లో చేపలు ఎగుమతి అవుతున్నాయి.

జిల్లాలో 48 మండలాలున్నాయి. ()

తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం ఖమ్మం జిల్లాకు చెందిన బూర్గంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు ఈ జిల్లాలో కలిసినవి.

మద్రాసు-కొలకత్తా రైలు మార్గం ఈ జిల్లాగుండా వెళుతుంది. ట్రంకు రైలు మార్గం పొడవు 90 కి.మీ. బ్రాంచి లైను పొడవు 75 కి.మీ. (గుడివాడ-భీమవరం-నిడదవోలు/నరసాపురం)

జిల్లాలో ముఖ్యమైన రైల్వే స్టేషన్లు: ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు (జంక్షన్), భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, కొవ్వూరు, తణుకు, పాలకొల్లు, నరసాపురం, ఆకివీడు, భీమడోలు

జిల్లాలో కాలువల ద్వారా ప్రయాణం, సరకుల రవాణా పెద్దగా జరగడం లేదు. గోదావరి డెల్టాలో కొంత వినియోగం జరుగుతున్నది.

జిల్లాలో తాడేపల్లిగూడెంలో విమనాశ్రయం ఉన్నప్పటికీ ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. ఇటీవల కాలంలో ఈ విమానాశ్రయం వినియోగంలోకి తీసుకురావలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గన్నవరం (విజయవాడ), మధురపూడి (రాజమండ్రి) విమానాశ్రయాలు ప్రస్తుతం జిల్లావాసులకు అందుబాటులో ఉన్నాయి.

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలాగానే ప్రయాణికుల నిత్యావసరాలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ వారి బస్సు సర్వీసులే ప్రధాన ప్రయాణ సాధనాలు. కొంత వరకు హైదరాబాదు, విశాఖపట్నం నగరాలకు ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయి. పట్టణ పరిసర గ్రామాలలో ఆటోల వినియోగం ఇటీవల బాగా పెరిగింది.

పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం జనాభా 37.96 లక్షలు. ఇందులో 30.48 లక్షలు గ్రామీణ ప్రాంతాలలోను, 7.45 లక్షలు పట్టణ ప్రాంతాలలోను నివసిస్తున్నారు. జిల్లా వైశాల్యం 7742 చ.కి.మీ. కనుక జనసాంద్రత చ.కి.మీ.కు 490. జనాభాలో 70% పైగా జనులు వ్యవసాయ సంబంధితమైన ఉపాధిపై జీవిస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ శాతం గ్రామీణ సంస్కృతి ఉంది. కాపు, కమ్మ, రెడ్డి, బి.సి, యస్.టి సామాజిక వర్గాల జనాభా ఎక్కువ. ఆంధ్ర క్షత్రియులు (క్షత్రియ రాజులు), బ్రాహ్మణ కులాల జనాభా తక్కువగా ఉంది. భీమవరం, ఏలూరు, జంగారెడ్డిగూడెం, తణుకు వంటి పట్టణాల్లో పాశ్చాత్య నాగరికత కనిపిస్తుంది. మహిళా అక్షరాస్యత - సాధికారతలో కూడా ఈ జిల్లా ముందంజలో ఉంది. ఈ జిల్లా వాసులకు వివాహ సంబంధాలు ఎక్కువగా తూర్పు గోదావరి జిల్లా వాసులతో జరుగుతూవుంటాయి.

జిల్లాలోని అధిక ప్రాంతం సాంద్ర వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తూ, వ్యావసాయికంగా ఎంతో అభివృద్ధి సాధించి, ఆంధ్ర ప్రదేశ్ ధాన్యాగారంగా ప్రసిద్ధిచెందింది. జిల్లాలో మత్స్య పరిశ్రమ కూడా బాగా అభివృద్ధి చెందింది. భీమవరం నగరం రాష్ట్రంలోనే ప్రముఖ మత్స్య పరిశ్రమ వ్యాపారకేంద్రం. తణుకులో ఆంధ్రా సుగర్స్, అక్కమాంబ టెక్స్ టైల్స్, సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్స్ వంటి పరిశ్రమలు ఉన్నాయి.

ప్రధానంగా వ్యవసాయంపై ఆధార పడిన ప్రాంతము, అటవీ ప్రాంతము ఉన్న ఈ జిల్లా 73.95% (పురుషులు 78.43%, స్త్రీలు 69.45%) అక్షరాస్యతలో ఆంధ్ర ప్రదేశ్‌లో హైదరాబాదు తరువాత రెండవ స్థానంలో ఉంది. మొత్తం దేశంలో ఈ జిల్లా చదువుకొన్న వారి సంఖ్య ప్రకారం 31వ స్థానంలోను, అక్షరాస్యత శాతం ప్రకారం 149వ స్థానంలోను ఉంది. జిల్లాలో మహానగరాలు ఏవీ లేకపోవడం వలనా, విశ్వవిద్యాలయం లేకపోవడం వలనా ఉన్నత విద్యకు అవకాశాలు దాదాపు శూన్యం. పై చదువులకు విద్యార్థులు ఎక్కువగా ఇతర జిల్లాలకు, లేదా ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇటీవల ప్రైవేటు రంగంలో విద్యావకాశాలు పెరగడం వలన ఇంజినీరింగ్, మెడికల్ విద్యాలయాలు జిల్లాలో స్థాపించబడ్డాయి. జిల్లాలో విద్యాలయాల సంఖ్య ఇలా ఉంది.

ఆంధ్ర విశ్వ విద్యాలయం పి.జి కళాశాల, తాడేపల్లిగూడెం

జిల్లాలో ఎక్కువ కళాశాలలు ఆంధ్ర విశ్వ విద్యాలయా నికి అనుబంధంగా ఉన్నాయి అనేక విద్యాలయాలు నిర్వహించే సంస్థలలో ఏలూరుకు చెందిన సర్.సి.ఆర్.రెడ్డి విద్యా సంస్థల సముదాయము, సెయింట్ తెరిసా విద్యాలయాలు, భీమవరానికి చెందిన డి.ఎన్.ఆర్. విద్యా సంస్థల సముదాయము ముఖ్యమైనవి.

ఇటీవల కార్పొరేట్ విద్యారంగం పెరిగిన కారణంగా ప్రైవేటు రంగంలో అనేక విద్యా సంస్థలు స్థాపించబడినాయి.

భీమవరం వాసి అయిన వెంకటపతి రాజు ఇండియన్ నేషనల్ క్రికెట్ టీం తరపున 28 టెస్ట్ మ్యాచ్ లు, 53 వన్ డే మ్యాచ్ లు ఆడాడు. అతని పూర్తి పేరు సాగి లక్ష్మి వెంకటపతి రాజు.

పశ్చిమ గోదావరి జిల్లాలో 16 శాసనసభ నియోజక వర్గాలతో పాటూ రెండు లోక్ సభ (ఏలూరు, నర్సాపురం) నియోజకవర్గాలు ఉన్నాయి.

జిల్లాలో సంఖ్యాపరంగా కాపుల ప్రాబల్యము చాలా ఎక్కువగా ఉన్నాధి. ఇక్కడ సినిమారంగ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు రాజకీయాల్ని శాసిస్తున్నారు. ఆంధ్ర సుగర్స్ వ్యవస్థాపకుడైన ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ కు తణుకు, కొవ్వూరు, గోపాలపాలెం, పోలవరం నియోజకవర్గాల ఫలితాలను ప్రభావితం చేయగల పలుకుబడి ఉంది. సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగరాజు ముగ్గురు తెలుగుదేశం శాసనసభా సభ్యులకు మద్దతు ఇచ్చినట్టు నివేదికలు వెల్లడించాయి. భీమవరం నుండి పి.వి.నరసింహరాజు, ఉండి నుండి కలిదిండి రామచంద్రరాజు, అత్తిలి నుండి దండు శివరామరాజు.

సినీరంగ ప్రభావములో కేంద్రమంత్రి యు.వి.కృష్ణంరాజు నర్సాపురం లోక్‌సభ స్థానంలో గెలుపొందాడు. సినీ నిర్మాత అంబికాకృష్ణ ఏలూరు నుండి శాసనసభకు ఎన్నికైనాడు. పాలకొల్లు శాసనసభా సభ్యుడు అల్లు వెంకట సత్యనారాయణ సినిమా నటుడు చిరంజీవి అండదండలతో 1983 నుండి తెలుగుదేశం తరఫున పోటీచేసే అవకాశం పొందుతూనే ఉన్నాడు. 1983లో రాజకీయ జీవితము ప్రారంభించినప్పటినుండి ప్రతి ఎన్నికలలోనూ అజేయంగా నిలిచిన తెలుగుదేశం నాయకులు ముగ్గురు: చింతలపూడి నుండి కోటగిరి విద్యాధరరావు, నర్సాపురం నుండి కొత్తపల్లి సుబ్బారాయుడు, ఉండి నుండి కలిదిండి రామచంద్రరాజు.




#Article 144: మహబూబ్ నగర్ జిల్లా (2091 words)


మహబూబ్‌నగర్ జిల్లా, తెలంగాణా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఒకటి. ఇది జిల్లా ముఖ్యపట్టణం.

ఇది హైదరాబాదునుండి నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో ఉంది.మహబూబ్ నగర్ జిల్లాను పాలమూర్ అని కూడా పిలుస్తారు .

జిల్లాకు దక్షిణాన తుంగభద్ర నది, కర్నూలు జిల్లా, తూర్పున నల్గొండ జిల్లా, ఉత్తరమున రంగారెడ్డి జిల్లా, పశ్చిమమున కర్ణాటక లోని రాయచూరు, గుల్బర్గా జిల్లాలు ఉన్నాయి. ఈశాన్య దిశలో హైదరాబాదు జిల్లా ఉంది. హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికైక ఏకైక ముఖ్యమంత్రిని అందించిన జిల్లా ఇది. ఉత్తరప్రదేశ్ గవర్నరుగా పనిచేసిన బి.సత్యనారాయణ రెడ్డి ఈ జిల్లాలోనే జన్మించాడు. రాష్ట్రంలోనే తొలి, దేశంలో రెండవ పంచాయతి సమితి జిల్లాలోనే స్థాపితమైంది. విస్తీర్ణం దృష్ట్యా చూసిననూ, మండలాల సంఖ్యలోనూ ఈ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. కృష్ణా, తుంగభద్ర నదులు రాష్ట్రంలో ప్రవేశించేది కూడా ఈ జిల్లా నుంచే. దక్షిణ కాశీగా పేరుగాంచినఆలంపూర్, మన్యంకొండ, కురుమూర్తి,మల్దకల్ శ్రీస్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవస్థానం, ఊర్కొండపేట, శ్రీరంగాపూర్ లాంటి పుణ్యక్షేత్రాలు, పిల్లలమర్రి, బీచుపల్లి, వరహాబాదు లాంటి పర్యాటక ప్రదేశాలు, జూరాల, కోయిలకొండకోయిల్ సాగర్, ఆర్డీఎస్, సరళాసాగర్ (సైఫర్ సిస్టంతో కట్టబడిన ఆసియాలోనే తొలి ప్రాజెక్టు) లాంటి ప్రాజెక్టులు, చారిత్రకమైన గద్వాల కోట, కోయిలకొండ కోట, చంద్రగఢ్ కోట, పానగల్ కోట లాంటివి మహబూబ్‌నగర్ జిల్లా ప్రత్యేకతలు. సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, పల్లెర్ల హనుమంతరావు లాంటి స్వాతంత్ర్య సమరయోధులు, గడియారం రామకృష్ణ శర్మ లాంటి సాహితీవేత్తలు, సూదిని జైపాల్ రెడ్డి, సురవరం సుధాకరరెడ్డి లాంటి వర్తమాన రాజకీయవేత్తలకు ఈ జిల్లా పుట్టినిల్లు. ఎన్.టి.రామారావును సైతం ఓడించిన ఘనత ఈ జిల్లాకే దక్కుతుంది.కెసిర్ ఈ జిల్లా మంత్రిగా ఉన్నపుడే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. పట్టుచీరెలకు పేరొందిన చెందిన నారాయణపేట, చేనేత వస్త్రాలకు పేరుగాంచిన రాజోలి, కాకతీయుల సామంత రాజ్యానికి రాజధానిగా విలసిల్లిన వల్లూరు, రాష్ట్రకూటులకు రాజధానిగా ఉండిన కోడూరు, రసాయన పరిశ్రమలకు నిలయమైన కొత్తూరు, మామిడిపండ్లకు పేరుగాంచిన కొల్లాపూర్, రామాయణ కావ్యంలో పేర్కొనబడిన జఠాయువు పక్షి రావణాసురుడితో పోరాడి నేలకొరిగిన ప్రాంతం, దక్షిణభారతదేశ చరిత్రలో పేరొందిన రాక్షస తంగడి యుద్ధం జరిగిన తంగడి ప్రాంతం ఈ జిల్లాలోనివే. ఉత్తర, దక్షిణాలుగా ప్రధాన పట్టణాలను కలిపే 44వ నెంబరు జాతీయ రహదారి, సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం ఈ జిల్లానుంచే వెళ్ళుచున్నాయి. 2011, 2012లలో నూతనంగా ప్రకటించబడ్డ 7 పురపాలక/నగరపాలక సంఘాలతో కలిపి జిల్లాలో మొత్తం 11 పురపాలక/నగరపాలక సంఘాలు, 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోకసభ నియోజకవర్గాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 1553 రెవెన్యూ గ్రామాలు, 1348 గ్రామపంచాయతీలున్నాయి. ఈ జిల్లాలో ప్రధాన వ్యవసాయ పంట వరి.

భౌగోళికంగా ఈ జిల్లా తెలంగాణ ప్రాంతంలో దక్షిణాదిగా ఉంది. విస్తీర్ణం పరంగా తెలంగాణాలో ఇదే అతిపెద్దది. 16°-17° ఉత్తర అక్షాంశం, 77°-79° తూర్పు రేఖాంశంపై జిల్లా ఉపస్థితియై ఉంది.. జిల్లా వాయువ్యంలో వర్షపాతం తక్కువగా ఉండి తరుచుగా కరువుకు గురైతుండగా, ఆగ్నేయాన పూర్తిగా దట్టమైన అడవులతో నిండి ఉంది. అమ్రాబాదు, అచ్చంపేట, కొల్లాపూర్ మండలాలు నల్లమల అడవులలో భాగంగా ఉన్నాయి. నడిగడ్డగా పిల్వబడే కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ప్రాంతం కూడా నీటిపారుదల సమస్యతో ఉండగా, జూరాల, దిండి ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు సస్యశ్యామలంగా ఉన్నాయి.

మహబూబ్ నగర్ ప్రాంతాన్ని పూర్వం పాలమూరు అని రుక్మమ్మపేట అని పిలిచేవారు. ఆ తరువాత 1890 డిసెంబరు 4నందు అప్పటి హైదరాబాదు సంస్థాన పరిపాలకుడైన ఆరవ మహబూబ్ ఆలీ ఖాన్ అసఫ్ జా (1869 - 1911) పేరు మీదుగా మహబూబ్ నగర్ అని మార్చబడింది. క్రీ.శ. 1883నుండి జిల్లా కేంద్రానికి ఈ పట్టణము ప్రధానకేంద్రముగా ఉంది. ఒకప్పుడు ఈ మహబూబ్ నగర్ ప్రాంతాన్ని చోళవాడి (చోళుల భూమి) అని పిలిచేవారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన కోహినూర్ వజ్రం, గోల్కొండ వజ్రం మహబూబ్ నగర్ ప్రాంతంలో దొరికినట్లు చెబుతారు.

ఈ ప్రాంతాన్ని పాలించిన పాలకుల నిర్లక్ష్యం వల్ల మహబూబ్ నగర్ చరిత్రను తెల్సుకోవడానికి ఇబ్బందే. అంతేకాకుండా ఈ ప్రాంతం చాలా కాలం చిన్న చిన్న ప్రాంతాల పాలకుల చేతిలో ఉండిపోయింది. ఇక్కడ ఎక్కువగా సంస్థానాధీశులు, జమీందారులు, దొరలు, భూస్వాములు పాలించారు. జిల్లాలోని 
ముఖ్య సంస్థానాలలో గద్వాల, వనపర్తి, జటప్రోలు, అమరచింత, కొల్లాపూర్ సంస్థానాలు ప్రముఖ మైనవి. ఇక్కడి ప్రజలు పేదరికంతోను, బానిసత్వంలోను ఉన్నందున చరిత్రకారులు కూడా ఈ ప్రాంతంపై అధిక శ్రద్ధ చూపలేరు. ఇప్పటికినీ ఈ ప్రాంతముధిక ప్రజలు పేదరికంతో జీవన పోరాటం సాగిస్తున్నారు.

హైదరాబాదు నిజాం ఆరవ నవాబు మీర్ మహబూబ్ అలీ ఖాన్ పేరు మీదుగా ఈ జిల్లాకు మహబూబ్ నగర్ అనే పేరు వచ్చింది. జిల్లాలో పాలు, పెరుగు సమృద్ధిగా లభించడంతో పాలమూరు అనే పేరు కూడా ఉంది.

స్వాతంత్ర్యానికి పూర్వం 1930 దశాబ్దిలో జరిగిన ఆంధ్రమహాసభలలో ఈ జిల్లాకు చెందిన వ్యక్తులు అధ్యక్షత వహించారు. 1930లో మెదక్ జిల్లాలో జరిగిన తొలి ఆంధ్రమహాసభకు సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షత వహించగా, 1931లో నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన రెండో ఆంధ్రమహాసభకు బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షత వహించాడు. వీరిరువురూ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రముఖులే. 1936లో ఐదవ ఆంధ్రమహాసభ జిల్లాలోని షాద్‌నగర్ లోనే జరిగింది.

నిరంకుశ నిజాం పాలన వ్యతిరేక పోరాటంలో పాలమూరు జిల్లా కూడా ఎంముఖ్య స్థానం పొందింది. ఎందరో పోరాటయోధులు తమప్రాణాలను సైతం లెక్కచేయక పోరాడి నిజాం ముష్కరుల చేతితో అమరులైనారు. మరికొందరు జైలుపాలయ్యారు. వందేమాతరం రామచంద్రారావు, వందేమాతరం వీరభద్రారావు, కె.అచ్యుతరెడ్డి, పల్లెర్ల హనుమంతరావు, సురభి వెంకటేశ్ శర్మ, పాగపుల్లారెడ్డి, ఏగూరు చెన్నప్ప, ఆర్.నారాయణరెడ్డి, కొత్త జంబులురెడ్డి, శ్రీహరి, బి.సత్యనారాయణరెడ్డి లాంటి ముఖ్యులు నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. అప్పంపల్లి, షాద్‌నగర్, మహబూబ్‌నగర్ లలో పోరాటం ఉధృతం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో నిజాంపై తిరగబడిన ప్రధాన సంఘటన అప్పంపల్లి. మహబూబ్‌నగర్ పట్టణంలో తూర్పుకమాన్ ఉద్యమకారులకు వేదికగా నిలిచింది. నారాయణపేట ఆర్యసమాజ్ నాయకులు, సీతారామాంజనేయ గ్రంథాలయోద్యమ నాయకులు, జడ్చర్లలో ఖండేరావు, కోడంగల్‌లో గుండుమల్ గోపాలరావు. కల్వకుర్తిలో లింగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టణంలో పల్లర్ల హనుమంతరావు, అయిజలో దేశాయి నర్సింహారావు, గద్వాలలో పాగ పుల్లారెడ్డి, వనపర్తిలో శ్రీహరి తదితరులు నిజాం వ్యతిరేక ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. తుర్రేబాజ్ ఖాన్ ఇతను హైదరాబాద్ బ్రిటీషు రెసిడెన్సీ ( ప్రస్తుత కోఠీ ఉమెన్స్ కాలేజీ) పై దాడి చేసినందుకు మొగిలిగిద్ద గ్రామంలోని పోలీస్ స్టేషనులో సమారు 1940 ప్రాంతంలో బంధించారు. తరువాత ఇతనిని రెసిడెన్సీ గుమ్మానికి ఉరితీసారు.

తెలంగాణలో భౌగోళికంగా మహబూబ్ నగర్ జిల్లా అతి పెద్ద జిల్లా. పాలమూరు అని కూడా పిల్వబడే ఈ జిల్లాలో 1553 రెవెన్యూ గ్రామాలు, 1347 గ్రామ పంచాయతీలు, 64 మండలాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 10 పురపాలక సంఘాలు (నగర పంచాయతీలతో కలిపి), 2 లోక్‌సభ నియోజక స్థానాలు, 14 అసెంబ్లీ నియోజక వర్గ స్థానాలు ఉన్నాయి. కృష్ణా, తుంగభద్రలతొ పాటు దిండి, బీమా లాంటి చిన్న నదులు జిల్లాలో ప్రవహిస్తున్నాయి. 7వ నెంబరు జాతీయ రహదారి, సికింద్రాబాదు - ద్రోణాచలం రైల్వే మార్గం ప్రధాన రవాణా సౌకర్యాలు. పంచాయత్‌రాజ్ రహదారులలో మహబూబ్ నగర్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో ఉంది.

ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణకు ముందు భౌగోళికంగా మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో 64 రెవిన్యూ మండలాలుగా ఉన్నాయి..

  

పునర్య్వస్థీకరణలో భాగంగా మొదట ఈ జిల్లాలో 26 మండలాలు ఉన్నాయి.

ఆ తరువాత 2019 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం ఈ జిల్లా నుండి 11మండలాలను విడగొట్టి కొత్తగా నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేసింది.

గమనిక:2016 పునర్య్వస్థీకరణలో వ.నెం.2, 3, 8 మండలాలు కొత్తగా ఏర్పడినవి

 
గమనిక:2016 పునర్య్వస్థీకరణలో వ.నెం.4, 11రు మండలాలు కొత్తగా ఏర్పడినవి

మహబూబ్ నగర్ జిల్లాలో 11 మున్సీపాలిటీలతో పాటు (నగరపంచాయతీలతో కలిపి) అనేక పట్టణ ప్రాంతాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి : మహబూబ్ నగర్ (స్పెషల్ గ్రేడ్ మున్సీపాలిటీ), గద్వాల (థర్డ్ గ్రేడ్ మున్సీపాలిటీ), వనపర్తి (థర్డ్ గ్రేడ్ మున్సీపాలిటీ), నారాయణపేట (థర్డ్ గ్రేడ్ మున్సీపాలిటీ), షాద్‌నగర్ (థర్డ్ గ్రేడ్ మున్సీపాలటీ), కల్వకుర్తి (నగర పంచాయతి), కొల్లాపూర్ (నగర పంచాయతి), నాగర్ కర్నూల్ (నగర పంచాయతి), అయిజ (నగర పంచాయతి), జడ్చర్ల (నగరపంచాయతి), అచ్చంపేట్ (నగర పంచాయతి), ఆత్మకూర్ (మేజర్ గ్రామ పంచాయతి), 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో లక్ష జనాభా పైబడి ఉన్న ఏకైక పట్టణం మహబూబ్‌నగర్. జాతీయ రహదారిపై, రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉన్న ప్రాంతాల్లో పట్టణప్రాంత జనాభా అధికంగా ఉంది. రెవెన్యూ డివిజన్ల ప్రకారం చూస్తే పట్టణ జనాభా మహబూబ్‌నగర్ డివిజన్‌లో అత్యధికంగానూ, నారాయణపేట డివిజన్‌లో అత్యల్పంగానూ ఉంది.

రైలు సౌకర్యం : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వచ్చే మహబూబ్ నగర్ జిల్లాలో 195 కిలోమీటర్ల నిడివి కల ప్రధాన రైలు మార్గం ఉంది. ఈ రైలు మార్గం సికింద్రాబాదు నుంచి కర్నూలు గుండా తిరుపతి, బెంగుళూరు వెళ్ళు దారిలో ఉంది. ఉత్తరాన తిమ్మాపూర్ నుంచి దక్షిణ సరిహద్దున ఆలంపూర్ రైల్వేస్టేషను వరకు జిల్లాలో మొత్తం 30 రైల్వేస్టేషనులు ఉన్నాయి. అందులో మహబూబ్ నగర్, షాద్‌నగర్, గద్వాల, జడ్చర్ల ముఖ్యమైనవి. మహబూబ్ నగర్ పట్టణంలోనే 3 రైల్వేస్టేషనులు ఉన్నాయి. (మహబూబ్ నగర్ మెయిన్, మహబూబ్ నగర్ టౌన్, ఏనుగొండ). కర్ణాటకలోని వాడి, రాయచూరు మార్గం కూడా ఈ జిల్లాగుండా కొన్ని కిలోమీటర్లు వెళ్తుంది. మాగనూరు మండలంలోని కృష్ణా రైల్వేస్టేషను ఈ మార్గంలోనే ఉంది. గద్వాల నుంచి కర్ణాటక లోని రాయచూరుకు మరో రైలు మార్గపు పనులు చురుగ్గా సాగుతున్నాయి. మహబూబ్ నగర్ నుంచి మునీరాబాద్ రైల్వే లైన్ కూడా మంజురు అయిననూ పనులు ప్రారంభం కావల్సి ఉంది. జిల్లాలో రైల్వేలైన్ల సాంద్రత ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు 0.57గా ఉంది.

రోడ్డు సౌకర్యం : దేశంలోనే అతి పొడవైన జాతీయ రహదారి అయిన 44వ నెంబరు (పాత పేరు 7 వ నెంబరు) జాతీయ రహదారి మహబూబ్ నగర్ జిల్లా గుండా వెళ్తుంది. జిల్లాలో ఉన్న జాతీయ రహదారి కూడా ఇదొక్కటే. ఇది జిల్లాలో ఉత్తరం నుంచి దక్షిణం వరకు సుమారు 200 కిలోమీటర్ల పొడవు ఉంది. హైదరాబాదు నుంచి కర్నూలు గుండా బెంగుళూరు వెళ్ళు వాహనాలు జాతీయ రహదారిపై ఈ జిల్లా మొత్తం దాటాల్సిందే. జాతీయ రహదారిపై జిల్లాలోని ముఖ్య ప్రాంతాలు - షాద్‌నగర్, జడ్చర్ల, పెబ్బేర్, కొత్తకోట, ఎర్రవల్లి చౌరస్తా, ఆలంపూర్ చౌరస్తాలు. జిల్లా గుండా మూడు అంతర్రాష్ట్ర రహదారులు కూడా వెళుతున్నాయి. వాటిలో జడ్చర్ల-రాయిచూరు రహదారి ముఖ్యమైనది. ఈ రహదారి మహబూబ్ నగర్, మరికల్, మక్తల్, మాగనూరు గుండా రాయిచూర్ వెళ్తుంది. మరో అంతర్రాష్ట్ర రహదారి హైదరాబాదు-శ్రీశైలం రహదారి. దీనికి జాతీయ రహదారిగా చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఈ రహదారి కడ్తాల్, ఆమనగల్లు, కల్వకుర్తిల గుండా జిల్లానుంచి వెళుతుంది. హైదరాబాదు-బీజాపూర్ రహదారి కొడంగల్ గుండా వెళ్తుంది.

బస్ డిపోలు: మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన 8 బస్సు డిపోలు ఉన్నాయి - మహబూబ్ నగర్, గద్వాల,షాద్‌నగర్,వనపర్తి,అచ్చంపేట,కల్వకుర్తి, నారాయణపేట,నాగర్‌కర్నూల్.

నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు పూర్వం జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, ప్రస్తుతం 14 అసెంబ్లీ స్థానాలు, రెండు లోకసభ స్థానాలున్నాయి. బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి, పల్లెర్ల హనుమంతరావు, సూదిని జైపాల్ రెడ్డి, మల్లు రవి, పాగపుల్లారెడ్డి, డీకే అరుణ, జూపల్లి కృష్ణారావు, నాగం జనార్థన్ రెడ్డి, పి.శంకర్ రావు తదితరులు జిల్లా నుంచి ఎన్నికయ్యారు. వీరిలో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవి పొందగా, పలువులు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందారు. 1989లో అప్పటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్టీ రామారావు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీచేయగా కాంగ్రెస్ పార్టీకి చెందిన చిత్తరంజన్ దాస్ చేతిలో పరాజయం పొందినాడు.

పార్టీల బలాబలాలు చూస్తే 1983 వరకు కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఆధిపత్యం వహించింది. 1983లో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలు చెరో 6 స్థానాలలో విజయం సాధించాయి. 1985లో తెలుగుదేశం పార్టీ 9 స్థానాలు పొందగా 1989లో ఒక్కస్థానం కూడా దక్కలేదు. 1994లో తెలుగుదేశం 11 స్థానాలు సాధించి కాంగ్రెస్ పార్టీకి ఒక్కస్థానం కూడా ఇవ్వలేదు. 1999లో తెలుగుదేశం 8, కాంగ్రెస్ పార్టీ 4, భారతీయ జనతా పార్టీ ఒక స్థానంలో విజయం సాధించాయి. 2004లో కాంగ్రెస్ పార్టీ 7, తెలంగాణ రాష్ట్ర సమితి ఒకటి, ఇతరులు 4 స్థానాలు పొందగా తెలుగుదేశంకు ఒక్కస్థానమే లభించింది. 2009లో తెలుగుదేశం పార్టీ 9, కాంగ్రెస్ పార్టీ 4, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక స్థానంలో విజయం సాధించారు. మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా నాగర్‌కర్నూల్ నుంచి విజయం సాధించిన నాగం జనార్థన్ రెడ్డి, కొల్లాపూర్ నుంచి విజయం సాధించిన జూపల్లి కృష్ణారావులు రాజీనామా చేశారు. మహబూబ్‌నగర్ నుంచి గెలుపొందిన రాజేశ్వర్ రెడ్డి మరణించడంతో మొత్తం 3 స్థానాలకు 2012 మార్చిలో ఎన్నికలు జరుగగా మహబూబ్ నగర్ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యెన్నం శ్రీనివాసరెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసిన నాగం జనార్థన్ రెడ్డి, కొల్లాపూర్ నుంచి తెరాస అభ్యర్థిగా పోటీచేసిన జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు. 2014 మార్చిలో జరిగిన పురపాలక సంఘం ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 4, తెరాస 1, భారతీయ జనతా పార్టీ 1 పురపాలక సంఘాలలో మెజారిటీ సాధించాయి.

స్వాతంత్ర్యానికి పూర్వం మహబూబ్‌నగర్ జిల్లాలో 16 సంస్థానాలు ఉండేవి. అందులో ముఖ్యమైన సంస్థానాలు :

స్థానిక సంస్థల చరిత్రలో రాష్ట్రంలో జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సుల ప్రకారం మూడంచెల పంచాయతీ వ్యవస్థ అప్పటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్‌నగర్ లో ప్రారంభించారు. 1959, అక్టోబర్ 14న అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఇక్కడి సమితికి ప్రారంభోత్సవం చేసాడు. ఇది దేశంలోనే రెండవ పంచాయతీ సమితి. (మొదటి సమితిని రాజస్థాన్ రాష్ట్రంలో ప్రారంభించారు). నెహ్రూ ప్రారంభించిన పంచాయతీ సమితి భవనం నేడు మండల పరిషత్తు కార్యాలయంగా సేవలందిస్తోంది.

మహబూబ్ నగర్ జిల్లాలో 1875 లోనే మొగిలిగిద్ద గ్రామంలో ప్రభుత్వ పాఠశాల స్థాపించబడింది. జిల్లాలో 1955-56 నాటికి 1160 ప్రాథమిక పాఠశాలలు, 20 ప్రాథమికోన్నత పాఠశాలలు, 5 ఉన్నత పాఠశాలలు ఉండగా, 2006-07 నాటికి ఈ సంఖ్య పెరిగి 2860 ప్రాథమిక, 987 ప్రాథమికోన్నత, 729 ఉన్నత పాఠశాలలు, 82 జూనియర్ కళాశాలకు చేరింది. 2008-09 నాటికి ఈ సంఖ్య 3094 ప్రాథమిక, 890 ప్రాథమికోన్నత, 926 ఉన్నత పాఠశాలలు, 147 జూనియర్ కళాశాలకు చేరింది.
ఇవే కాకుండా 45 డీగ్రీ కళాశాలలు, 9 పీజీ కళాశాలలు, 39 బీఎడ్ కళాశాలలు, 7 డైట్ కళాశాలలు, 19 ఐటీఐలు, 3 పాలిటెక్నిక్ కళాశాలలు, 3 ఇంజనీరింగ్ కళాశాలలు, 6 ఫార్మసీ కళాశాలలు, 3 ఎంబీఏ కళాశాలలు, 3 ఎంసీఏ కళాశాలలు, ఒక మెడికల్ కళాశాల, ఒక వ్యవసాయ కళాశాల ఉన్నాయి. 2008 లో పాలమూరు విశ్వవిద్యాలయం స్థాపించబడింది.పాలమూరు విశ్వవిద్యాలయం దేశంలోనే 'లార్జెస్ట్ బేర్ ఫుట్ వాక్'అనే అంశంలో గిన్నిస్ రికార్డు సాధించిన తొలి విశ్వవిద్యాలయంగా వాసికెక్కింది. జాతీయసేవాపథకం విభాగంలో ఈ రికార్డు ఆంగ్ల భాషలో గిన్నిస్ రికార్డు గ్రహీత అయిన డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి ఆధ్వర్యంలో 2010 నవంబర్ 12 న 2,500 మంది పాల్గొని నిర్వహించారు.ఈ రికార్డు సాధించడం ద్వారా రాష్ట్రానికి చెందిన ప్రశంస బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు పాలమూరు విశ్వవిద్యాలయాన్ని 'మహా మహా'అనే బిరుదునిచ్చి గౌరవించారు.

సంస్థానాల కాలంలోనే పాలమూరు జిల్లా సాహిత్యంలో పేరొందింది. గద్వాల సంస్థానాధీశులు ఎందరో సాహితీవేత్తలను పోషించుకున్నారు. స్వయంగా గద్వాల పాలకులు సాహిత్యం కూడా రచించారు. సంస్థానాధీశుల కాలంలో విద్వత్ గద్వాలగా పేరుగాంచింది. స్వాతంత్ర్యోద్యమ కాలంలో సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ కవుల పేరుతో గ్రంథాన్ని వెలువరించాడు. ఆలంపూర్ ప్రాంతానికి చెందిన గడియారం రామకృష్ణశర్మ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినాడు. తెలుగులో తొలి రామాయణం రంగనాథ రామాయణం రచించినది జిల్లాకు చెందిన గోనబుద్ధారెడ్డి. హైదరాబాదు ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు కూడా అనేక కావ్యాలు, అనువాదాలు, కవితలు రచించారు. గడియారం రామకృష్ణ శర్మ, కపిలవాయి లింగమూర్తి లాంటి సాహితీమూర్తులు పాలమూరు జిల్లాకు చెందినవారు.16 అక్టోబర్ 2000 లో సీనియర్ జర్నలిస్ట్ కొటకొండ యెడ్ల విజయరాజు అధ్వర్యంలో నారాయణపేటలో వార్తాతరంగాలు తెలుగు పత్రిక ప్రారంబించడం జరిగింది.అప్పటి మంత్రి యెల్కొటి యల్లారెడ్ది, మాజీ యెమ్మెల్యే చిట్టం నర్సిరెడ్డి,కొడంగల్ యెమ్మెల్యే సుర్యనారాయణ,బిజెపి నాయకుడు నాగురవు నామజి,అప్పటి మునిసిపల్ చైర్మన్ గడ్డం సాయిబన్న తదితరులు పాల్గొన్నారు.2004 జనవరి 14 లో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంగా వార్తాతరంగాలు పత్రికను దిన పత్రికగా మార్చడం జరిగింది.ప్రస్తుతం రాష్ట్ర రాజధాని నుండి కూడా పత్రిక ప్రింట్ అవుతుంది.

మన కాలపు మహానీయుడూ ప్రజా కవి గోరేటి వేంకన్న పాలమూరు బిడ్డే ఆన్నసంగతి మరువొద్దు.

మహబూబ్ నగర్ జిల్లాలో వర్షపాతం తక్కువ. జిల్లా మొత్తంపై సగటు వార్షిక వర్షపాతం 60.44 సెంటీమీటర్లు. అందులో అధికభాగం నైరుతి రుతుపవనాల వల్ల జూన్, జూలై, ఆగస్టు నెలలలో కురుస్తుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినప్పుడు వాయుగుండం ప్రభావం వల్ల కొన్ని ప్రాంతాలలో భారీ వర్షపాతం నమోదౌతుంది. జిల్లాలో సగటు వర్షపాతంలో ప్రాంతాల మధ్య తేడాలున్నాయి. దక్షిణవైపున తుంగభద్ర, కృష్ణానది తీరగ్రామాలు భారీ వర్షాల సమయంలో నీటమునిగితే, జిల్లా వాయువ్య ప్రాంతమైన నారాయణ పేట డివిజన్‌లో కరువు తాండవిస్తుంది.

జిల్లాలో వాతావరణం సాధారణంగా పొడిగా ఉంటుంది. సముద్రతీరం చాలా దూరంలో ఉండుటవల్లనూ, సమీపంలో పెద్ద చెరువులు లేకపోవడం వల్లనూ, చుట్టూ కొండలు చుట్టబడి ఉండుటచే చల్లని గాలులకు అవకాశం తక్కువగా ఉంది. ఈ వాతావరణం ప్రత్తి వంటి పంటలకు చాలా అనువైనందున జిల్లాలో ప్రత్తి విస్తారంగా సాగుచేయబడుతున్నది. వేసవి కాలంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు చేరుకుంటుంది. శీతాకాలంలో నవంబర్, డిసెంబర్ మాసాలలో 15-18 డిగ్రీలకు చేరుకుంటుంది. మిగితా జిల్లాలతో పోలిస్తే శీతాకాలంలో చలి తక్కువగా ఉన్ననూ, వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి.

జిల్లా మొత్తం విస్తీర్ణంలో దాదాపు 10.5% అడవులు ఉన్నాయి. దట్టమైన అడవులు 329 చ.కి.మీ.లతో కలిపి మొత్తం 1944 చ.కిమీ.ల అడవులున్నాయి. ఈ అడవులలో అధిక భాగం జిల్లా ఆగ్నేయాన ఉన్న శ్రీశైలం అడవీప్రాంతంలో ఉంది. జిల్లాలో కల దట్టమైన అరణ్యం కూడా ఇదే ప్రాంతంలో ఉంది. శ్రీశైలం సమీపంలో కర్నూలు జిల్లా సరిహద్దులో ఉన్న అమ్రాబాదు మండలంలో అధికశాతం అడవులున్నాయి. ఈ ప్రాంతంలోని అడవులలో పులులు, ఇతర వన్యప్రాణి జంతువులు సంచరిస్తుంటాయి. ఇది 5 జిల్లాలలో విస్తరించియున్న రాష్ట్రంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో భాగము. జిల్లాలోని అడవులను రెండు డివిజన్ల క్రింద విభజించారు. అచ్చంపేట డివిజన్‌లో 209 హెక్టార్లు ఉండగా మహబూబ్‌నగర్ డివిజన్‌లో కొంత భాగం అడవులున్నాయి.

దేశంలోనే మూడవ పెద్దనది కృష్ణానది, దాని ప్రధాన ఉపనది తుంగభద్ర, చిన్న వాగులపై జిల్లాలో జూరాలా ప్రాజెక్టు, ఆర్డీఎస్, కోయిలకొండ ప్రాజెక్టు, సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించగా, సరళా సాగర్ ప్రాజెక్టు, కోయిల్ సాగర్ ప్రాజెక్టు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, బీమా లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ తదితర ప్రాజెక్టులు జలయజ్ఞంలో ప్రారంభించబడి పురోభివృద్ధిలో ఉన్నాయి. పెద్దతరహా, మధ్యతరహా ప్రాజెక్టులు కలిపి జిల్లాలో 215000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇవి కాకుండా కాలువలు, చెరువులు, బోరుబావులు, ఊటబావులు తదితరాల ద్వారా మరో 212000 ఎకరాల భూమి సాగవుతుంది. పంటల వారీగా చూస్తే అత్యధికంగా వరి 145000 ఎకరాలు, వేరుశనగ 71000 నీటిపారుదల సాగు క్రింద ఉంది.

పాలమూరు జిల్లాలో క్వార్ట్జ్, ఫెల్డ్‌స్పార్, గ్రానైట్ రాయి విరివిగా లభిస్తుంది. కోడంగల్ ప్రాంతంలో నాపరాయి, సున్నపురాయి లభ్యమౌతుంది. గట్టు ప్రాంతంలో బంగారం నిక్షేపాలున్నట్లు ప్రాథమిక పరిశోధనలో వెల్లడైంది. ఇక్కడ ఇంకనూ పరిశోధనలు జరుగుతున్నాయి.

రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉన్న కొత్తూరు మండలంలో జిల్లాలోనే అత్యధిక పరిశ్రమలు కేంద్రీకృతమై ఉన్నాయి. రసాయన, ఇంజనీరింగ్, ఫార్మా, డ్రగ్స్ తదితర 137 పరిశ్రమలతో కొత్తూరు మండలం ప్రథమస్థానంలో ఉంది. మహబూబ్‌నగర్ మండలంలో 92, షాద్‌నగర్ మండలంలో 69, జడ్చర్ల మండలంలో 67 పరిశ్రమలున్నాయి. రాష్ట్రంలోనే తొలి సెజ్ జడ్చర్ల సమీపంలోని పోలెపల్లిలో ప్రారంభమైంది. జాతీయ రహదారిపై ఉన్న కొత్తూరు, షాద్‌నగర్, బాలానగర్ మండలాలలో పరిశ్రమలు అధికంగా ఉండగా. నారాయణపేట డివినల్‌లో తక్కువగా ఉన్నాయి.

జిల్లాలో ప్రజాదరణ కలిగిన క్రీడ క్రికెట్. ఇది కాకుండా వాలీబాల్, బ్యాడ్మింటన్ ఎక్కువగా ఆడుతారు. హైదరాబాదు రంజీ జట్టులో జిల్లాకు చెందిన క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించారు. మహబూబ్ నగర్ పట్టణంలో క్రీడా స్టేడియం ఉంది. ఇక్కడ జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయికి చెందిన వివిధ పోటీలు జరుగుతాయి. మహబూబ్‌నగర్ పట్టణంలోని స్పోర్ట్స్ పాఠశాల నుంచి పలువులు విద్యార్థులు జాతీయస్థాయిలో పతకాలు సాధించారు.




#Article 145: విజయనగరం (481 words)


విజయనగరం పట్టణం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈశాన్యాన ఉంది.ఇది విజయనగరం జిల్లాకు ముఖ్యపట్టణం. రాష్ట్రం లోని జిల్లాలన్నిటికంటే, విజయనగరం జిల్లా అత్యంత కొత్తది. 1979 జూన్ 1 న ఈ జిల్లా ఏర్పడింది. దీనితో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 23 కు చేరింది. విజయనగరం బంగాళా ఖాతము నుండి 18 కి.మీ.ల దూరములో, విశాఖపట్నం నకు 40 కి.మీ.లు ఈశాన్యాన ఉంది.

విజయనగరం పట్టణం చారిత్రక ప్రశస్తి కలిగినది. ప్రపంచప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కం నాటకంలోని ప్రధాన వేదిక విజయనగరమే! పట్టణంలోని కొన్ని ప్రధాన ప్రాంతాలు - అయ్యకోనేరు, బొంకులదిబ్బ మొదలైన వాటి ప్రస్తావన ఈ నాటకంలో ఉంది. ఆ నాటక రచయిత గురజాడ అప్పారావు విజయనగరం రాజావారి ఆస్థానంలో ఉద్యోగస్తుడే.

ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాలు విజయనగరం పట్టణంలో 300 ఏళ్లుగా జరుగుతున్నాయి. బొబ్బిలియుద్ధం సమయంలో విజయనగర రాజుల ఆడపడుచైన పైడితల్లి ఆత్మాహుతికి పాల్పడి ఇలవేల్పుగా అవతరించినట్లు భావిస్తారు. అప్పటినుంచి ఆమెను భక్తితో పూజిస్తున్నారు. లక్షలాదిమంది భక్తులు దీనికి హాజరవుతారు.

విజయనగరం పట్టణం మధ్యలో 'పెద్ద చెరువు' చాలా విశాలమైనది. 18వ శతాబ్దంలో కోట నిర్మాణానికి కావల్సిన మట్టి కోసం దీన్ని తవ్వించారు. ఈ చెరువులోని నీటితో ఆయకట్టు రైతులు ఏటా మూడు పంటలు పండిస్తుంటారు. ఈ చెరువు పశ్చిమ భాగంలోనే పైడిమాంబ విగ్రహం సాక్షాత్కారమైనది. ఈ చెరువులోనే అమ్మవారి తెప్పోత్సవం నిర్వహిస్తారు.

విద్యుచ్చక్తి లేని రోజుల్లో నాటి పురపాలక సంఘం వారు మూడు లాంతర్లు కూడలిలో మూడు వైపులా మూడు హరికెన్ లాంతర్లు ఏర్పాటుచేశారు. రాత్రిపూట నెల్లిమర్ల, ధర్మపురి, గంటస్తంభం దారులలో ఎడ్లబళ్ళుతో వెళ్ళేవారికి, పాదచారుల సౌకర్యార్ధం నెలకొల్పారు. విజయనగర రాజులు అవృతఖానాను పెద్ద పూలకోటలో నిర్మించారు. ఖానా అంటే మదుము అని అవృత అనే ఆంగ్లపదంతో కలిసి రూపొందింది. నీరు బయటకు పోయే మదుము అని దీని అర్ధం. ఇది గంటస్తంభం నమూనాలో ఉంది. పైభాగంలో స్నానానికి అనువుగా పెద్ద తొట్టె ఉంది. క్రిందిభాగంలో నుయ్యి, దిగడానికి మెట్లు ఉన్నాయి. మహారాజులు ఇందులో స్నానాలు చేసేవారని పెద్దలు అంటారు.

కోట ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశాన్ని బొంకుల దిబ్బ అంటారు. నాడు ఈ ప్రదేశాన్ని మహారాజులు సైనిక విన్యాసాలకు కవాతులకు వినియోగించేవారు. బంకు అనేది మహారాష్ట్ర పదం దీనికి తలవాకిట పహరా అని అర్ధం. కాలక్రమేణా ఈ బంకులదిబ్బే బొంకులదిబ్బగా రూపాంతరం చెందింది. ఈ ప్రదేశానికి ఈ పేరు రావడానికి మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. ఒక ఫ్రెంచి ఇంజినీరు భూగర్భ జలాల్ని బయటకు తెప్పిస్తానని గొట్టాలను తెప్పించి వాటిని ఇక్కడే భూమిలోకి దించాడట. తన ప్రయత్నం విఫలం కావడంతో చెప్పాపెట్టకుండా రాత్రికి రాత్రే పారిపోయాడట. ఆ ఇంజినీరు పలికిన బొంకు లేదా అబద్ధం ఆ ప్రదేశానికి స్థిరపడిందంటారు. మహాకవి గురజాడ అప్పారావు తన కన్యాశుల్కం నాటకాన్ని బొంకుల దిబ్బ సీనుతోనే ఆరంభించారు. ప్రస్తుతం ఈ ప్రదేశం కూరగాయల మార్కెట్ గా ఉపయోగపడుతుంది.

విజయనగరం ఒక సంస్థానం. పూసపాటి వంశం వారు దీని పాలకులు. 1754 లో, విజయనగర పాలకుడైన పూసపాటి విజయరామ గజపతి రాజు, ఫ్రెంచి వారితో ఒప్పందం కుదుర్చుకొని, తన పాలన సాగించాడు. కానీ కొంత కాలానికే ఈ సంస్థానం బ్రిటిషు వారి ఏలుబడిలోకి వెళ్ళింది. స్వాతంత్ర్యం వచ్చేవరకు బ్రిటిషువారి ఏలుబడిలోనే ఉంది.

విజయనగర రాజులు మొదట్లో కుమిలి లోని మట్టి కోటలో నివసించేవారు. ఆనంద గజపతి రాజు విజయనగరం కోట నిర్మాణాన్ని క్రీ.శ. 1712-1714 ల మధ్య ప్రారంభించారు. అయిదు విజయాలకు చిహ్నంగా అనగా విజయ నామ సంవత్సరంలో, విజయదశమి, మంగళవారం నాడు (తెలుగులో జయవారం) ఈ కోట నిర్మాణం మొదలైంది. తన కుమారుడు విజయరామ రాజు పేరిట దీనికి 'విజయనగరం' అని పేరు వచ్చింది. అయితే 1717 సంవత్సరంలో ఆనందరాజు పరమపదించగఅ విజయరామరాజు కోట నిర్మాణాన్ని పూర్తిచేశారు.2012 నాటికి 300 సం.లు అయింది.

విజయనగరం కోటను కొండరాళ్లతో నిర్మించారు. ఇది 26 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు కోణాల్లో నలుగు పెద్ద బురుజులతో నిర్మితమైనది. కోట చుట్టూ 19,653 చదరపు అడుగుల కందకం తవ్వించారు. నాడు కందకం నిండా నీరు ఉండేది. ఇది సుమారు రెండు ఏనుగులు మునిగేటంత లోతు ఉంటుంది. గోడలు సుమారు 30 అడుగుల ఎత్తు కలిగివున్నాయి.

విజయనగరం భౌగోళికంగా 18 ° 07'N 83 ° 25'E / 18,12 ° N 83,42 ° E / 18,12 ప్రాంతంలో ఉంది. ఇది 74 మీటర్ల (242 అడుగులు) సగటు ఎత్తులో ఉంది.

విజయనగరం పురపాలక సంఘం 1888 లో స్థాపించారు.  2015 డిశెంబరు 9న నగరపాలక సంస్థగా అభివ్రుద్ది చేసాను. నగర అధికార పరిధి .




#Article 146: హైదరాబాదు (1535 words)


హైదరాబాదు, తెలంగాణ రాజధాని. హైదరాబాదు జిల్లా, రంగారెడ్డి జిల్లాల ముఖ్యపట్టణం. హైదరాబాద్ కి మరో పేరు భాగ్యనగరం. హస్తకళలకు, నాట్యానికి ప్రసిద్ధి. హైదరాబాదు భారతదేశంలో ఐదవ అతిపెద్ద మహానగరం. అంతేకాదు హైదరాబాదు చుట్టు పక్కల మున్సిపాలిటీలను కలుపుకుపోతే ప్రపంచంలోని మహానగరాలలో 41వ స్థానంలో ఉంది. ఇది మెట్రోపాలిటన్ ప్రాంతం.

హైదరాబాదు భారతదేశంలో బాగా అభివృద్ధి చెందిన నగరాలలో ఒకటి, అంతేకాదు సాఫ్టువేరు రంగంలో కూడా బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తోంది. హైదరాబాదు, సికింద్రాబాద్లు జంట నగరాలుగా ప్రసిద్ధి పొందాయి. హుస్సేన్‌ సాగర్‌ ఈ రెండు నగరాలను వేరు చేస్తుంది, ట్యాంకు బండ్ వీటిని కలుపుతుంది. హుస్సేన్‌ సాగర్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా వలీ 1562లో నిర్మించిన ఒక పెద్ద కృత్రిమ సరస్సు. హైదరాబాదుకు మధ్యలో చార్మినారును మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో అప్పటిదాకా విజృంభించిన ప్లేగు వ్యాధి నిర్మూలనకు చిహ్నంగా నిర్మించాడు. ఇటీవల కాశ్మీర్లో జరిగిన 370 అధికరణ సవరణ తర్వాత హైదరాబాద్ ను కూడా యూనియన్ టెరిటరీ చేయాలని కొంత మంది హైదరాబాద్ వాసులు కోరుతున్నారు .

హైదరాబాదును మూసీ నది ఒడ్డున క్రీ.శ.1590 దశకంలో, కుతుబ్ షాహీ వంశస్థుడయిన, మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించాడు. గోల్కొండలోని నీటి సమస్యకు సమాధానంగా పరిపాలనను ఇక్కడకు మార్చారని చరిత్రకారులు చెబుతారు. ఇక్కడి నుండే కుతుబ్ షాహీ వంశస్తులు ఇప్పటి తెలంగాణ ప్రాంతాన్ని , ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలలోని కొన్ని భాగాలను పాలించారు. 

మహమద్ కులీ కుతుబ్‌షా భాగమతి అనే బంజారా స్త్రీని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఆ తరువాత ఆవిడ పేరు మీదనే భాగ్యనగర్ అని పేరు పెడతాడు. పెళ్ళయిన తరువాత భాగమతి ఇస్లాం మతం స్వీకరించి, హైదర్ మహల్ అని పేరు మార్చుకుంటుంది. దానిని అనుసరించి నగరం పేరు కూడా హైదరాబాదుగా (అనగా హైదర్ యొక్కనగరం) రూపాంతరం చెందింది. ఉర్దూ భాషాయుక్తంగా చూస్తే హైదరాబాదు పేరు వెనక మరొక అర్థం ఉంది. హైదర్ (రాజు పేరు) ఎక్కడయితే ఆబాదు (ప్రఖ్యాతి) అయ్యాడో ఆ నగరమే హైదరాబాదు అని ప్రతీతి.

హైదరాబాదు దాదాపు తెలంగాణ రాష్ట్రము మధ్య ప్రాంతములో ఉంది. ఇది దక్కను పీఠభూమిపై సముద్రమట్టం నుండి 541 మీ. (1776 అడుగులు) ఎత్తులో ఉంది. సుమారుగా ఈ నగర వైశాల్యం 260 చ.కి.మీ. (100 చ.మైళ్ళు).

హిమాయత్ సాగర్, సింగూరు జలాశయం, కృష్ణా తాగునీటి మొదటి దశ ప్రస్తుతమున్న ప్రధాన నీటి వనరులు. కృష్ణా నది నుండి తాగునీటిని సరఫరా చేసే ప్రాజెక్టు రెండో దశ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.

నగర పరిపాలన హైదరాబాద్ మహానగర పాలక సంస్థ చే నిర్వహించబడుతుంది దీనికి అధిపతి మేయరు అయినప్పటికీ కార్యనిర్వాహక అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం నియమించే నగరపాలక కమిషనరు అనబడే ఒక ఐఏఎస్ అధికారి చేతిలో ఉంటాయి. నగర త్రాగునీటి సౌకర్యం, రోడ్లు, డ్రైనేజీ నిర్వహణ, చెత్త తొలిగించుట, వీధిదీపముల ఏర్పాటు, మౌలిక వసతులకు బాధ్యత ఈ సంస్థదే. నగరం 150 వార్డులుగా విభజింపబడి ఉంది. ఒక్కో వార్డుకు ఒక కార్పొరేటరు ఎన్నికై కార్పొరేషనులో తన వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తాడు. నగరప్రాంతం మొత్తం తెలంగాణ 31 జిల్లాల్లో ఒకటి - అదే హైదరాబాదు జిల్లా. ఆస్తుల దస్తావేజులు, రెవిన్యూ సమీకరణకు జిల్లా కలెక్టరు బాధ్యుడు. హైదరాబాదు జిల్లాలో ఎన్నికల నిర్వహణ బాధ్యత కూడా కలెక్టరుదే.

భారతదేశంలోని ఇతర మహానగరములలో వలెనే, హైదరాబాదు పోలీసుకు పోలీసు కమీషనరుగా ఒక ఐపీఎస్‌ అధికారి ఆధిపత్యము వహిస్తుంటాడు. హైదరాబాదు పోలీసు రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ నేతృత్వములో పని చేయుస్తుంది. హైదరాబాదును ఐదు పోలీసు జోన్లుగా విభజించారు. ఒక్కొక్క జోన్‌కు ఒక డిప్యూటీ కమీషనర్‌ ఆఫ్‌ పోలీసు అధిపతిగా ఉంటాడు. ట్రాఫిక్‌ పోలీసు విభాగము హైదరాబాదు పోలీసు శాఖలో పరిమిత స్వయంప్రతిపత్తి కలిగిన ఒక విభాగము. తెలంగాణ రాష్ట్రము మొత్తము తన న్యాయ పరిధిలో ఉండే తెలంగాణ ఉన్నత న్యాయస్థానము యొక్క పీఠము హైదరాబాదు నగరంలోనే ఉంది. హైదరాబాదులో రెండు దిగువ న్యాయస్థానములు, పౌరసంబంధ సమస్యలకై చిన్న సమస్యల (small causes) న్యాయస్థానము , నేర విచారణ కొరకు ఒక సెషన్స్ న్యాయస్థానం ఉన్నాయి. హైదరాబాదు నగరానికి లోక్‌సభలో రెండు సీట్లు , రాష్ట్ర శాసనసభలో పదమూడు సీట్లు ఉన్నాయి.

బృహత్తర ప్రణాళిక (మాస్టర్‌ ప్లాన్‌) ప్రకారం కోర్‌ ఏరియా 172 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. 2001లో నగర జనాభా 75.86 లక్షలు కాగా... 2031 నాటికి అది 1.84 కోట్లకు పెరుగుతుందనే అంచనాలతో కొత్త మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించారు. అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా 22 ప్రాంతాలకు మల్టిపుల్‌ జోన్లుగా గుర్తింపు. ఐదు ప్రాంతాల్లో అంతస్తుల (మల్టీ లెవెల్‌) పార్కింగ్‌ ఏర్పాటుచేస్తారు. 70 కమర్షియల్‌ రోడ్లను గుర్తించారు. 150 హెరిటేజ్‌ భవనాలను గుర్తించి వాటి పరిరక్షణకు ప్రణాళిక రూపకల్పనచేశారు. 29 కొత్త రోడ్లు వేస్తారు.అంతర్గత రోడ్లను 40 అడుగులకు పరిమితం చేస్తారు. కొత్తగా పది ఫ్త్లెఓవర్ల నిర్మిస్తారు . మూసీనది, హుస్సేన్‌సాగర్‌ నాలాలపై 13 వంతెనలకు ప్రతిపాదన చేశారు.హుస్సేన్‌సాగర్‌ సర్‌ప్లస్‌ నాలాలకు గ్రీన్‌ బెల్టుగా గుర్తించి, రెండు వైపులా తొమ్మిది మీటర్ల చొప్పున పచ్చదనం పెంపు చేస్తారు. ఆజామాబాద్‌, సనత్‌నగర్‌ వంటి పారిశ్రామిక ప్రాంతాలకు వర్క్‌ సెంటర్లుగా గుర్తించారు.జాతీయ రహదారులను 120-150 అడుగుల మేరకు విస్తరిస్తారు.ఏడు చోట్ల రైల్‌ అండర్‌ బ్రిడ్జిలు, కందికల్‌ గేట్‌ వద్ద ఆర్వోబీ, తాడ్‌బండ్‌ వద్ద ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మిస్తారు.
రోడ్ల విస్తరణలో స్థలాన్నిచ్చే వారికి చెల్లించే పరిహారం 100 శాతంగా ఉన్న ట్రాన్స్‌ఫరబుల్‌ డెవలప్‌మెంట్స్‌ రైట్స్‌ను 150 శాతానికి పెంచుతారు. ఎంజీబీఎస్‌ మినహా మిగిలిన ఆర్టీసీ బస్టాండ్లు, డిపోలను బహుళ అవసరాలకు వినియోగించుకుంటారు.
ఔటర్‌ రింగ్‌ రోడ్డు, హైటెక్‌ సిటీ ఫ్త్లెఓవర్‌ నిర్మాణం పూర్తిచేస్తారు. హుస్సేన్‌సాగర్‌లోకి రసాయనాలు మోసుకొచ్చే పికెట్‌, కూకట్‌పల్లి నాలాలపై మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి, వాటర్‌ రీసైక్లింగ్‌ ద్వారా ఆ నీటిని ఇతర అవసరాలకు వినియోగిస్తారు. బాటసింగారం వద్ద 40 ఎకరాల్లో ట్రక్స్‌ పార్కు ఏర్పాటు చేస్తారు. సాగర్‌ హైవేపై మంగల్‌పల్లి వద్ద 20 ఎకరాల్లో మరో ట్రక్‌ పార్కు ఏర్పాటు చేస్తారు.

హైదరాబాదు దేశంలోని చాలా నగరాలతో రోడ్డుద్వారా అనుసంధానమై ఉంది. వాటిలో బెంగళూరు, ముంబాయి, పూణె, నాగ్‌పూర్, విజయవాడ, వరంగల్, గుంటూరు , కర్నూలు చెపుకోతగ్గవి. ముఖ్యంగా తెలంగాణాలోని అన్ని పట్టణాలకు ఇక్కడి నుండి రోడ్లు ఉన్నాయి. జాతీయ రోడ్లయిన జాతీయ రహదారి 44, జాతీయ రహదారి 163 , జాతీయ రహదారి 65 నగరంలో నుంచే వెళ్తుంటాయి.

హైదరాబాదు నగరం లోపలకూడా మంచి రోడ్లు ఉన్నాయి. ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకై ఎన్నో ఫ్లైఓవర్లు నిర్మించటం జరిగింది. ముఖ్యమయినా రోడ్లు చాలావరకు 3-లేన్ సౌకర్యము ఉంది. అయినా కూడా ట్రాఫిక్ సమస్య పెరిగి పోతుండటంతో జాతీయ రహదారుల వెంట వెళ్ళే పెద్ద వాహనాలను నగరం వెలుపల నుండే పంపుటకుగాను ఔటర్ రింగు రోడ్డు నిర్మాణము జరిగింది..

హైదరాబాదు నగరంలో ప్రయాణ అవసరాలకు తెలంగాణా రోడ్డు రవాణా సంస్థ , లెక్కకు మిక్కిలి సిటీ బస్సులను నడుపుతుంది. ఇక్కడ ఉన్న మహత్మా గాంధీ బస్ స్టేషను 72 ప్లాట్ఫారాలతో ఆసియాలోకెల్లా అతిపెద్ద బస్‌స్టేషనుగా పేరు సంపాదించింది. బస్సులేకాక నగరం నలుమూలలకు తీసుకు వెళ్ళే ఆటోలు ఇక్కడ ఇంకో ప్రధాన రవాణా సాధనం.

హైదరాబాదుకు జంటనగరమైన సికింద్రాబాదులో దక్షిణమధ్య రైల్వే ముఖ్యకార్యాలయం ఉంది. ఇక్కడి నుండి దేశంలోని అన్ని ప్రాంతాలకు రైలు సౌకర్యం ఉంటుంది.

హైదరాబాదు నగరంలో 2003లో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (Multi-Modal Transport System (MMTS)) ప్రవేశ పెట్టారు. సికింద్రాబాదు - లింగంపల్లి, హైదరాబాదు (నాంపల్లి) - లింగంపల్లి, సికింద్రాబాదు - ఫలక్‌నుమా, లింగంపల్లి - ఫలక్‌నుమా, హైదరాబాదు (నాంపల్లి) - ఫలక్‌నుమా దారులలో రైలు బండ్లు తిరుగుతున్నాయి. 121 ట్రిప్పులతో రోజుకు 180,000 ప్రయాణీకులకు సేవలందిస్తోంది. దీనిక జతగా సెట్విన్ చిన్నబస్సు సేవలు నడుపుతుంది. 

మెట్రోరైల్ మొదటి దశ నవంబర్ 2017 లో నాగోల్ - అమీర్పేట్- మియాపూర్ మార్గంతో ప్రారంభించబడింది. తరువాత ఎల్ బి నగర్ -అమీర్ పేట మార్గం అక్టోబరు 2018 లో ప్రారంభించబడింది. అమీర్ పేట -హైటెక్ సిటీ మార్గం మార్చి 2019 న ప్రారంభించారు.
హైదరాబాద్ మెట్రో దేశంలో రెండవ పెద్ద మెట్రోగా గుర్తింపుపొందింది.

హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్లో కొత్తగా నిర్మించిన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం  2008 మార్చి 15 తేదీన ప్రారంభించబడింది. ఇది ప్రపంచం లోని 5 ప్రముఖ విమానాశ్రయాలలో స్థానం సంపాదించింది. 4కిమీపైగా ఉన్న రన్‌వే సౌకర్యంతో, ప్రపంచంలోనే అతిపెద్దదయిన ఎయిర్‌బస్ A380 విమానము కూడా ఇక్కడి నుండి రాకపోకలు సాగించగలదు. ఈ విమానాశ్రయం నుండి భారతదేశంలోని అన్ని ముఖ్య పట్టణాలకు, మధ్య ప్రాచ్య ప్రాంతం నైరుతి ఆసియా, దుబాయి, సింగపూరు, మలేషియా , చికాగో, ఫ్రాంక్‌ఫర్ట్ మొదలైనటువంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమాన ప్రయాణ సౌకర్యము ఉంది.

హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయము ప్రత్యేక విమానాల (రక్షణ , ఇతరాలు) కొరకు మాత్రమే పనిచేస్తుంది.

విద్య పరంగా హైదరాబాదు దక్షిణ భారతంలో ప్రముఖ కేంద్రం. 

ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలు చాలావరకు సిబిఎస్ఇ విద్యాపద్ధతి పాటిస్తాయి. మూడింట రెండు వంతులు విద్యార్థులు ప్రైవేట్ సంస్థలలో ఉన్నారు. బోధనా మాధ్యమాలు ఇంగ్లిషు, హిందీ, తెలుగు, ఉర్దూ. సంస్థని బట్టి, విద్యార్థులు సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ పరీక్ష రాస్తారు. లేక ఐసిఎస్ఇ (ICSE) రాస్తారు. సెకండరీ మాధ్యమిక విద్య పూర్తయిన తర్వాత, జూనియర్ కళాశాలలో ఉన్నత మాధ్యమిక విద్యకొరకు చేరుతారు. ఇంజనీరింగ్ వృత్తి విద్య కొరకు ప్రవేశ పరీక్ష (ఎమ్సెట్) (EAMCET) రాసి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ విశ్వవిద్యాలయం,  (JNTUH) లేక ఉస్మానియా విశ్వవిద్యాలయం (OU) అనుబంధం గల కళాశాలలలో చేరతారు.

హైదరాబాదులో చాలా జీవసాంకేతికం, జీవమెడికల్ శాస్త్రం, ఔషధాల కేంద్రాలున్నాయి. నేషనల్ ఇన్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసుటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (NIPER) హైదరాబాదులో ఐదు వైద్యకళాశాలలున్నాయి. అవి ఉస్మానియా వైద్య కళాశాల, గాంధీ వైద్య కళాశాల, నిజాం వైద్య శాస్త్రాల సంస్థ, దక్కన్ వైద్య శాస్త్రాల సంస్థ] , షాదాన్ వైద్య శాస్త్రాల సంస్థ] ఎఐఐఎమ్ఎస్ (AIIMS) హైదరాబాద్ పొలిమేరలలో ప్రతిపాదించబడింది. యునాని వైద్యంలో ప్రభుత్వ నిజామియా టిబ్బి కళాశాల ఉంది.

ఇంకా ప్రముఖ కళాశాలలు లేక సంస్థలు సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (NIRD), నల్సార్ శాసనవిషయాల సంస్థ (నల్సార్), ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (NGRI), ప్రభుత్వరంగ సంస్థల సంస్థ (IPE), the భారతీయ పరిపాలన ఉద్యోగుల సంస్థ (ASCI), ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా (ESCI),సర్దార్ వల్లభభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ. సాంకేతిక కళాశాలలు ఐఐఐటి (IIITH), బిట్స్ (BITS Hyderabad), గాంధీ సాంకేతిక నిర్వహణ సంస్థ (GITAM హైదరాబాదు) , ఐఐటి,హైదరాబాదు (IIT-H), వ్యవసాయ శాస్త్ర సంస్థలు ఇక్రిశాట్ (ICRISAT), ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం.

ఫ్యాషన్ కళకు సంబంధించిన రాఫిల్స్ మిల్లెనియమ్ ఇంటర్నేషనల్, నిఫ్ట్, హైదరాబాదు (NIFT-H), విగాన్ మరియ లీ కళాశాల కూడా ఉన్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ 2015 లో పని ప్రారంభించిది. దక్షిణ భారతంలోనే అతిపెద్ద ఇస్లామిక్ విశ్వవిద్యాలయం అయిన జామియా నిజామియా కూడా ఇక్కడే ఉంది.

హైదరాబాదు నగరం ముత్యాలకు, చెరువులకు పేరు సంపాదించినది, ఈ మధ్యన ఐటి రంగం వలన కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తోంది. చార్మినారుకు దగ్గరలోనే ముత్యాల మార్కెట్టు ఉంది. వెండి గిన్నెలు, చీరలు, నిర్మల్ , కలంకారి బొమ్మలు, గాజులు, పట్టు, చేనేత, నూలు వస్త్రాలు, లాంటి మరెన్నో వస్తువులతో ఇక్కడ శతాబ్దాల తరబడి వర్తకం నిర్వహిస్తున్నారు.

ప్రపంచంలోనే అతిపెద్దదైన చలన చిత్ర నిర్మాణ కేంద్రమైన రామోజీ ఫిలిం సిటీ ఇక్కడే ఉంది. రెండు వేల ఎకరాల సువిశాల ప్రదేశంలో ఈ కేంద్రాన్ని 1996లో నిర్మించారు. అంతే కాదు ఆరు వందల లొకేషన్లను కల్పించే ఈ చలన చిత్ర నిర్మాణ కేంద్రం అతిపెద్ద చలన చిత్ర నిర్మాణ కేంద్రంగా గిన్నీసు బుక్కులో స్థానం కూడా సంపాదించింది.

హైదరాబాదులో పేరెన్నికగన్న పరిశోధనాలయాలు , విద్యాలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రభుత్వ రంగంలో ఉంటే మరికొన్ని ప్రైవేటు రంగంలో ఉన్నాయి. అంతేకాదు ఈ పరిశోధనాలయాలు వివిధ రంగాలకు విస్తరించాయి కూడా. వాటిలో కొన్ని:

హైదరాబాదులోనే స్థాపించబోయే మరికొన్ని ముఖ్యమయిన ప్రాజెక్టుల వివరాలు

భారత దేశంలోని మరెన్నో ఇతర నగరాల వలే హైదరాబాదులో కూడా రియల్ ఎస్టేటు రంగము మంచి అభివృద్ధి సాధిస్తోంది. అందుకు ముఖ్య కారణంగా ఇటీవల కాలంలో తామర తంపరగా వస్తున్న ఐటి సంస్థలనే చెప్పుకోవచ్చు. ప్రభుత్వం హైటెక్ సిటీని నిర్మించిన తరువాత ఎంతోమంది ప్రైవేటు భాగస్వాములు కూడా ఐటి పరిశ్రమలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. అంతేకాదు సింగపూరులో కార్యకలాపాలు సాగించే ఎసెండాస్ 2002లో హైదరాబాదులోని హైటెక్ సిటీ దగ్గర ఐటీ పార్కుని నిర్మించటానికి ఎల్టితో , తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు . అంతే కాదు ఆంధ్ర ప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ కూడా, సెస్మా ఇంటర్నెషనల్ (CESMA International) అనే సింగపూరుకు చెందిన సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఐటి ఉద్యోగులకు ఉపయుక్తంగా పోచారం దగ్గర 16000 గృహాల సముదాయాన్ని నిర్మించ తలపెట్టింది .

హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు వంటి వివిధ మతాల ప్రజలు హైదరాబాదులో పెద్దసంఖ్యలో ఉన్నారు. సిక్కులు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. హైదరాబాదీయులు తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషలు మాట్లాడుతారు. హిందువులు, క్రైస్తవులు తెలుగు, ముస్లిములు ఉర్దూ మాట్లాడినప్పటికీ అధికశాతం ప్రజలు రెండు భాషలూ మాట్లాడగలిగి ఉంటారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలు హైదరాబాదులో స్థిరపడటంతో అన్ని రకాల యాసల తెలుగూ ఇక్కడ వినిపిస్తుంది. అయితే ప్రధానంగా తెలంగాణా యాస ఎక్కువగా వినిపిస్తుంది. ఇక్కడి హిందీ, ఉర్దూ కూడా దేశంలోని ఇతర ప్రాంతాల వాటికంటే భిన్నమైన యాస కలిగి ఉంటాయి. హిందువులు, ముస్లిములు అన్నదమ్ముల కలిసి మెలిసి ఉంతరు

ఇక్కడి ముస్లిములు సాంప్రదాయికంగా ఉంటారు. స్త్రీలు బురఖా ధరించడం, మతపరమైన ఆచారాలను కచ్చితంగా పాటించడం వంటివి ఇక్కడ బాగా కనిపిస్తాయి. ఉత్తర భారతీయులకంటే తాము కాస్త కులాసా జీవితం గడుపుతామని మిగతా దక్షిణాది వారి వలెనే హైదరాబాదీయులు కూడా అనుకుంటారు.

హైదరాబాదు రుచులు మిగతా భారతదేశపు రుచుల కంటే భిన్నంగా ఉంటాయి. మొఘలుల రుచులతో కలిసిన తెలంగాణా వంటకాలు ఇక్కడి ప్రత్యేకత. బిరియానీ, బగారాబైంగన్ (గుత్తి వంకాయ), ఖుబానీ కా మీఠా, డబల్ కా మీఠా, హలీమ్, ఇరానీ చాయ్ మొదలైనవి ఇక్కడి ప్రముఖ వంటకాల్లో కొన్ని. చాలామంది హైదరాబాదీ ముస్లింలు పని చేయడానికి మధ్య ప్రాచ్యము అందులో ప్రత్యేకముగా దుబాయి వెళ్ళడము వలన, ఇప్పుడు హలీం ఆ ప్రాంతాలలో కూడా ప్రసిద్ధి చెందినది.హైదరాబాద్‌ హలీం భౌగోళిక చిహ్నం (జియోగ్రాఫికల్‌ ఇండికేటర్‌)ని సొంతం చేసుకొంది.

హైదరాబాదు చారిత్రక, రాజధానిగా ఉండుట వలన ఇక్కడ ప్రచురణ , ఎలక్ట్రానిక్ మీడియా బాగా అభివృద్ధి చెందింది. దాదాపు అన్ని తెలుగు వినోద, వార్తా ఛానళ్ళు  హైదరాబాదు కేంద్రముగా పని చేయుచున్నవి.




#Article 147: మోక్షగుండం విశ్వేశ్వరయ్య (431 words)


మోక్షగుండం విశ్వేశ్వరయ్య - MV - (సెప్టెంబర్ 15, 1861 — ఏప్రిల్ 12, 1962), భారతదేశపు ఇంజనీరు, పండితుడు, రాజనీతిజ్ఞుడు. మైసూరు సంస్థానానికి 1912 నుండి 1918 దివానుగా పనిచేశాడు. 1955లో అతనుకు భారతదేశపు అత్యున్నత పురస్కారమైన భారతరత్న లభించింది. అతను ప్రజలకు చేసిన సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం తరపున ఐదవ కింగ్ జార్జి నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ బిరుదునిచ్చి సత్కరించాడు. భారతదేశంలో అతను జన్మదినమైన సెప్టెంబరు 15ను ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారు. మైసూరులో గల ఆనకట్ట కృష్ణరాజ సాగర్కు అతను ఛీఫ్ ఇంజనీరుగా పనిచేశాడు. హైదరాబాదును మూసీ నది వరదల నుంచి రక్షించడానికి పథకాలను రూపొందించాడు.

విశ్వేశ్వరయ్య 1861, సెప్టెంబరు 15న బెంగుళూరు నగరానికి 60 మైళ్ళ దూరంలోగల చిక్కబళ్ళాపూర్ తాలూకా, ముద్దెనహళ్ళి అనే గ్రామంలో మోక్షగుండం శ్రీనివాస శాస్త్రి, వెంకటలక్ష్మమ్మ అనే బ్రాహ్మణ దంపతులకి    జన్మించారు.వీరి పూర్వీకులు ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని మోక్షగుండం గ్రామానికి చెందిన వారు. మూడు శతాబ్దాల కిందట వారు మైసూరు రాష్ట్రానికి వలస వెళ్ళారు. కాబట్టి వీరు తెలుగు మాట్లాడగలిగే వారు.. అతని తండ్రి సంస్కృత పండితుడు, హిందూ ధర్మశాస్త్ర పారంగతుడే కాక ఆయుర్వేద వైద్యుడు కూడా. విశ్వేశ్వరయ్యకు 12 సంవత్సరాల వయసులో తండ్రి మరణించాడు. చిక్కబళ్ళాపూరు లో ప్రాథమిక విద్య, బెంగుళూరులో ఉన్నతవిద్య పూర్తి చేసాడు. 1881లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి.ఏ., తరువాత పుణె సైన్సు కాలేజి నుండి సివిలు ఇంజనీరింగు ఉత్తీర్ణుడయ్యాడు.

పుణెలో ఇంజనీరింగు పూర్తయిన తరువాత తన 23వ యేట బొంబాయి ప్రజా పనుల శాఖలో అసిస్టెంట్ ఇంజనీరుగా చేరిన తరువాత, భారత నీటిపారుదల కమిషను చేరవలసినదిగా ఆహ్వానం వచ్చింది. అతను దక్కను ప్రాంతంలో చక్కని నీటిపారుదల వ్యవస్థను రూపొందించాడు. నీటి ప్రవాహానికి తగినట్లుగా ఆనకట్టకు ఎటువంటి ప్రమాదం కలగకుండా నీటిని నిల్వచేయగలిగిన ఆటోమాటిక్ వరద గేట్ల వ్యవస్థను అతను రూపొందించాడు. 1903లో మొదటిసారిగా దీనిని పుణె దగ్గరి ఖడక్‌వాస్లా వద్ద నెలకొల్పారు. వరద సమయంలో ఆనకట్ట భద్రతను దృష్టిలో ఉంచుకుంటూనే అత్యధిక నీటి నిల్వ చేసే విధానం ఇది. దీని తరువాత గ్వాలియర్ వద్ద అల తిగ్రా వద్ద, మైసూరు వద్ద గల కృష్ణరాజ సాగర్ ఆనకట్టలలోను దీనిని వాడారు.

హైదరాబాదు నగరాన్ని వరదల నుండి రక్షించడానికి ఒక వ్యవస్థను రూపొందించినపుడు, అతనుకు గొప్ప పేరు వచ్చింది. విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలో కూడా అతను పాత్ర ఉంది.. కావేరీ నది పై నిర్మించిన కృష్ణరాజసాగర్ ఆనకట్ట ఆది నుంచి అంతం వరకు అతను పర్యవేక్షణలోనే జరిగింది. అప్పట్లో కృష్ణరాజ సాగర్ ఆనకట్ట ఆసియా ఖండంలోనే అతిపెద్దది..

లండన్ లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్  యాభై సంవత్సరాల పాటు, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అతనుకు గౌరవ సభ్యత్వాన్నిచ్చాయి. భారతదేశంలోని ఎనిమిది విశ్వవిద్యాలయాలు అతనుకు గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. 1923లో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కు అతను అధ్యక్షుడిగా వ్యవహరించాడు.

విశ్వేశ్వరయ్యకు అనేక రంగాలలో విశేషమైన గుర్తింపు లభించింది. అందులో ప్రధానమైనవి విద్యారంగం, ఇంజనీరింగ్. కర్ణాటకలోని అత్యధిక ఇంజనీరింగు కళాశాలలు అనుబంధమై ఉన్న బెల్గాంలోని విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్శిటీ అతను పేరు మీద నెలకొల్పబడింది. ఇంకా బెంగుళూరులోని యూనివర్శిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సర్ ఎమ్. విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస పుణెలోని నాగపూర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అతను పేరు మీదుగా పిలవబడుతున్నాయి. పుణెలో అతను నిలువెత్తు విగ్రహాన్ని చూడవచ్చు. అతను జన్మశతి సంవత్సరంలో బెంగుళూరులో విశ్వేశ్వరయ్య పారిశ్రామిక, సాంకేతిక ప్రదర్శనశాల నెలకొల్పబడింది.

అతను స్వస్థలమైన విశ్వేశ్వరయ్య మెమోరియల్ ట్రస్టు వారు ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఇది అతను నివసించిన ఇంటి పక్కనే నెలకొల్పబడింది. ఇందులో అతను సాధించిన పతకాలు, బిరుదులు, అతను వాడిన కళ్ళద్దాలు, కప్పులు, వెబ్ స్టర్ డిక్షనరీ, అతను విజిటింగు కార్డును ముద్రించే పరికరం లాంటి వస్తువులు ప్రదర్శనకు ఉంచారు. అంతే కాకుండా అతను రూపకల్పన చేసిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అయిన కృష్ణరాజ సాగర్ ఆనకట్ట నమూనాను కూడా సందర్శించవచ్చు. అక్కడి ప్రజలు దాన్ని ఓ దేవాలయంగా భావిస్తుంటారు.




#Article 148: భారతరత్న (1096 words)


భారతరత్న పురస్కారం భారతదేశంలో పౌరులకు అందే అత్యుత్తమ పురస్కారం. ఇది జనవరి 2, 1954లో భారతదేశ మొదటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ చేత స్థాపించబడింది. ఈ పౌర పురస్కారం కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషికి ప్రదానం చేస్తారు. ఇప్పటివరకు నలభై మందికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. వారిలో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. ఈ పురస్కారం 1977 జూలై 13 నుండి 1980 జనవరి 26 వరకు జనతా పార్టీ పాలనలో కొద్దికాలం పాటు నిలిపివేయబడింది. ఒకే ఒక్కసారి 1992లో సుభాష్ చంద్రబోస్కు ఇవ్వబడిన పురస్కారం చట్టబద్ధ సాంకేతిక కారణాల వల్ల వెనుకకు తీసుకొనబడింది.

ఎలాంటి జాతి, ఉద్యోగం,స్థాయి లేదా స్త్రీ పురుష వ్యత్యాసం లేకుండా ఈ పురస్కారం ఇవ్వబడుతుంది. ఈ పురస్కారగ్రహీతల జాబితాను ప్రధానమంత్రి రాష్ట్రపతికి సిఫారసు చేయవలసి ఉంటుంది.

భారతరత్న పొందిన పౌరులకు 7వ స్థాయి గౌరవం లభిస్తుంది (మొదటిది ఆరూ- రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్ర గవర్నర్లు, మాజీ రాష్ట్రపతులు, ఉపప్రధాన మంత్రి, ముఖ్య న్యాయాధీశులు). కానీ ఈ గౌరవం వలన ఎలాంటీ అధికారాలు లేదా పేరు ముందు ప్రత్యేక బిరుదులూ రావు.

ఈ పురస్కారం పొందిన విదేశీయుల జాబితాలో సరిహద్దు గాంధిగా పేరుపొందిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (1987), నెల్సన్ మండేలా (1990) ఉన్నారు.

భారతరత్న పురస్కారం కేవలం భారతీయులకే ప్రదానం చేయాలన్న నిబంధన ఏమీ లేదు. ఈ పురస్కారాన్ని భారత పౌరసత్వం స్వీకరించిన మదర్ థెరీసాకు 1980లో, మరో ఇద్దరు విదేశీయులు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్‌కు 1987లో, నెల్సన్ మండేలాకు 1990లో ప్రదానం చేశారు. ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్‌కు తన 40వ యేట ఈ పురస్కారం లభించింది. ఈ పురస్కారం లభించినవారిలో ఇతనే అతి పిన్నవయస్కుడు, మొట్టమొదటి క్రీడాకారుడు. సాధారణంగా భారతరత్న పురస్కార ప్రదాన సభ రాష్ట్రపతి భవన్, ఢిల్లీలో జరుగుతుంది. కానీ 1958, ఏప్రిల్ 18వ తేదీన బొంబాయిలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ధొండొ కేశవ కర్వేకు అతని 100వ జన్మదినం సందర్భంగా ఈ పురస్కారాన్ని అందజేశారు. ఇతడు జీవించి ఉండగా ఈ పురస్కారం అందుకున్నవారిలో అతి పెద్ద వయస్కుడు. 2015 నాటికి ఈ పురస్కారాన్ని మొత్తం 45 మందికి అందజేయగా వారిలో 12 మందికి మరణానంతరం లభించింది.

చరిత్రలో ఈ పురస్కారం రెండుసార్లు రద్దు చేయబడింది. మొదటి సారి మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా గద్దెనెక్కిన తర్వాత 1977, జూలై 13వ తేదీన అన్ని పౌరపురస్కారాలను రద్దుచేశారు. తరువాత ఈ పురస్కారాలు 1980, జనవరి 25న ఇందిరాగాంధీ ప్రధాన మంత్రి అయిన తర్వాత పునురుద్ధరించబడ్డాయి. 1992లో ఈ పురస్కారాల రాజ్యాంగ సాధికారతను సవాలు చేస్తూ కేరళ, మధ్యప్రదేశ్ హైకోర్టులలో రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు కావడంతో ఈ పురస్కారాలను రెండవసారి రద్దు చేశారు. ఈ వ్యాజ్యాలకు ముగింపు పలుకుతూ 1995 డిసెంబరులో సుప్రీం కోర్టు ఈ పురస్కారాలను మళ్ళీ పునరుద్ధరించింది.

భారతరత్న పురస్కారం అత్యున్నత స్థాయిలో ప్రదర్శించిన కృషికి/చేసిన సేవకు గుర్తింపుగా ఎటువంటి జాతి, వృత్తి, స్థాయి, లింగ బేధాలను పాటించకుండా ప్రదానం చేయబడుతుంది. 1954 నాటి నిబంధనల ప్రకారం ఈ పురస్కారం కళలు, సాహిత్యం, విజ్ఞానం, ప్రజాసేవ రంగాలలో కృషి చేసినవారికి ఇచ్చేవారు. 2011, డిసెంబరులో ఈ నిబంధనలను మార్చి మానవజాతి పాటుపడే ఈ రంగానికైనా అనే పదాన్ని చేర్చారు. 1954 నాటి నిబంధనలు మరణానంతరం ఈ పురస్కారం ప్రకటించడాన్ని అనుమతించేవి కావు. కానీ 1955 జనవరిలో ఈ నిబంధనను సడలించారు. 1966లో లాల్ బహదూర్ శాస్త్రి మొట్టమొదటి సారి మరణానంతరం ఈ పురస్కారాన్ని పొందాడు. ఈ పురస్కారానికి ప్రతిపాదనలు చేసే పద్ధతి లేనప్పట్టికీ, ప్రధానమంత్రి మాత్రమే రాష్ట్రపతికి ఏడాదికి గరిష్ఠంగా ముగ్గురిని మాత్రం సిఫారసు చేయవచ్చు. కానీ 1999లో ఈ పురస్కారాన్ని నలుగురు వ్యక్తులకు ప్రదానం చేశారు. ఈ పురస్కార గ్రహీతలకు రాష్ట్రపతి తన సంతకంతో కూడిన ఒక సనదు(పట్టా), ఒక పతకం ప్రదానం చేస్తాడు. ఈ పురస్కారం క్రింద ఎలాంటి నగదు మంజూరు చేయరు. భారత రాజ్యాంగం యొక్క ఆర్టికల్ 18 (1) ప్రకారం ఈ పురస్కార గ్రహీతలెవ్వరూ తమ పేరు ముందు, వెనుక భారతరత్న అని పేర్కొనరాదు., భారతరత్న పొందిన పౌరులకు 7వ స్థాయి గౌరవం లభిస్తుంది.

భారతరత్న పురస్కారం ప్రకటించినట్లు ఎన్ని ప్రకటనలు వెలువడినా, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారు ప్రచురించే గెజిట్‌లో అధికారికంగా ప్రకటించిన తర్వాతనే ఈ పురస్కారం అధికారికంగా లభించినట్లు భావిస్తారు.

ఒక ఏడాది తరువాత దీని రూపాన్ని మార్చారు. అప్పుడు మార్చిన దానినే ఇప్పటికీ వాడుతున్నారు. ఇప్పటి మోడల్ ప్రకారం రావి ఆకు ఆకారంలో ఉండి 2 5⁄16 ఇంచులు (59 మి.మీ.) పొడవు, 1 7⁄8 ఇంచుల (48 మి.మీ.) వెడల్పు and 1⁄8 ఇంచుల (మి.మీ.) మందం కలిగి ఉండి ప్లాటినం చట్రం కలిగి ఉంటుంది. పతకం ముందుభాగంలో మధ్యలో సూర్యుని బొమ్మ చిత్రీకరించబడి ఉంటుంది. ప్లాటినం లోహంతో తయారు చేసిన ఈ బొమ్మ 5⁄8 ఇంచుల (16 మి.మీ.) వ్యాసార్ధం కలిగి ఉండి, సూర్యుని కేంద్ర బిందువు నుంచి 5⁄6 ఇంచులు (21 మి.మీ.) నుంచి 1⁄2 దాకా (13 మి.మీ.) కిరణాలు విస్తరించి ఉంటాయి. ముందుభాగంలో భారతరత్న అన్న పదాలు, వెనుక వైపు భారత జాతీయ చిహ్నం, నినాదం సత్యమేవ జయతే 1954 డిజైన్ లోనే ఉంచేశారు. మెడలో వేయడానికి వీలుగా 2 ఇంచ్ వెడల్పు, 51 ఎం.ఎం. గల తెలుపు రిబ్బన్ ను పతకానికి కడతారు. 1957లో, వెండి పూత మార్చి ఎండిన కాంస్యం వాడటం ప్రారంభించారు. భారత రత్న పతకాలను కలకత్తాలోని అలిపోర్ ప్రభుత్వ ముద్రణశాలలో ముద్రిస్తారు. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ, పరమ వీర చక్ర, వంటి పౌర, సైనిక పురస్కారలకు ఇచ్చే పతకాలు కూడా ఇక్కడే ముద్రిస్తుంటారు.

భారతరత్న పురస్కార ప్రదానంపై అనేక వివాదాలు ముసురుకున్నాయి. అనేక ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు నమోదు కాబడ్డాయి.

సుజాత వి.మనోహర్, జి.బి.పట్నాయక్‌లతో కూడిన సుప్రీం కోర్టు ప్రత్యేక డివిజన్ బెంచి ఈ కేసును పరిశీలిస్తూ భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ వంటి పురస్కారాల ప్రదానంలో కొన్ని నిబంధనలను పాటించడం లేదని గుర్తించింది. పురస్కార గ్రహీతల పేర్లు గెజిట్ ఆఫ్ ఇండియాలో తప్పక ప్రచురించాలని, రాష్ట్రపతి అజమాయిషీలో ఒక రిజిస్టర్ నిర్వహించాలనీ, దానిలో ఈ అవార్డు గ్రహీతల పేర్లు నమోదు చేయాలని స్పష్టం చేసింది. అంతే కాక అప్పటి రాష్ట్రపతులు ఆర్.వెంకట్రామన్ (1987-92), శంకర్ దయాళ్ శర్మ (1992-97)లు వారి సంతకం, సీలుతో కూడిన సనదు (పట్టా)ను ప్రదానం చేయలేదని గుర్తించింది.

సి.ఎన్.ఆర్.రావు, సచిన్ టెండూల్కర్‌లకు భారతరత్న పురస్కారం ఇస్తున్నట్లు 2013, నవంబరులో ప్రకటన వెలువడగానే అనేక ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేయబడ్డాయి. సి.ఎన్.ఆర్. రావుకు వ్యతిరేకంగా వేయబడిన పిల్‌లో హోమీ భాభా, విక్రం సారాభాయ్ వంటి అనేక శాస్త్రజ్ఞులు రావు కంటే ఎక్కువ సేవలను అందించారని, 1400 పరిశోధనా పత్రాలను ప్రచురించినట్లు రావు చేస్తున్న దావా భౌతికంగా అసాధ్యం అని వాదించారు. రావు భావ చౌర్యానికి పాల్పడినట్లు నిరూపితమైనదని, అతనికి భారతరత్న పురస్కారం ప్రదానం చేయరాదని, ఈ ప్రతిపాదనను కొట్టివేయాలని కోరారు. టెండూల్కర్‌కు వ్యతిరేకంగా వేయబడిన పిల్‌లో అతడు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు నామినేట్ చేయబడిన సభ్యుడని, అతనికి భారతరత్న పురస్కార నిర్ణయం ఆ సమయంలో ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, మిజోరాంలలో జరుగుతున్న ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.టెండూల్కర్‌కు వ్యతిరేకంగా వేసిన మరొక పిల్‌లో భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్‌ను ఉద్దేశపూర్వకంగా విస్మరించారని ఆరోపించారు.

భారత స్వాతంత్ర్య సంగ్రామానికంటే అంటే 1947 కంటే ముందు, లేదా ఈ పురస్కారం ప్రారంభించిన ఏడాది 1954 కంటే ముందు మరణించిన వారికి ఈ పురస్కారాన్ని ప్రకటించడాన్ని పలువురు చరిత్రకారులు తప్పుబట్టారు. ఇటువంటి ప్రదానాలు మౌర్య చక్రవర్తి అశోకుడు, మొఘల్ చక్రవర్తి అక్బర్, మరాఠా వీరుడు శివాజీ, నోబుల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్, హిందూ ఆధ్యాత్మికవాది స్వామి వివేకానంద,, స్వాతంత్ర్య యోధుడు బాలగంగాధర తిలక్ వంటి అనేకులకు భారతరత్న పురస్కారం ఇవ్వాలనే డిమాండ్లకు వీలు కల్పించాయి. అప్పటి ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు 1991లో వల్లభభాయి పటేల్‌కు అతడు మరణించిన 41 సంవత్సరాల తర్వాత ఈ పురస్కారం ప్రకటించడాన్ని, 1945 నుండి ఆచూకీ లేని సుభాష్ చంద్రబోస్‌కు 1992లో ప్రకటించడాన్ని విమర్శించారు. అలాగే 2015లో నరేంద్ర మోడీ 1946లో మరణించిన మదన్ మోహన్ మాలవ్యాకు ఇవ్వాలని నిర్ణయించడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు జనార్దన్ ద్వివేది తప్పుపట్టాడు. మాలవ్యా వారణాశిలో ఎక్కువగా పనిచేశాడని, మోడీ వారణాశి నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడు కావాలని ఉద్దేశ పూర్వకంగా మాలవ్యాను ఈ పురస్కారానికి ఎంపిక చేశాడని ఆరోపించాడు.

కొందరిని ప్రపంచం గుర్తించిన తర్వాత కాని ఈ పురస్కారానికి ఎంపిక చేయలేదనే విమర్శలు వెలువడ్డాయి. మదర్ థెరెసాకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చిన తరువాతి సంవత్సరం భారతరత్న ప్రకటించారు. సత్యజిత్ రేకు ఆస్కార్ అవార్డు అందిన తర్వాతనే భారతరత్న ప్రకటించారు.అలాగే అమర్త్య సేన్‌కు నోబెల్ బహుమతి వచ్చిన తర్వాతనే భారతరత్న ఇవ్వబడింది.

నిబంధనల ప్రకారం భారతరత్న పురస్కారానికి రాష్ట్రపతికి, ప్రధానమంత్రి మాత్రమే సిఫార్సులు చేసే హక్కు ఉంది. వివిధ రాజకీయ పార్టీలు తమ ప్రముఖ నాయకుల పేర్లను ఎన్నోసార్లు సిఫార్సుకు డిమాండ్లు చేస్తూనే ఉన్నాయి. జనవరి 2008లో, భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎల్.కె.అద్వానీ, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయికు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు లేఖ రాశారు.  ఇది జరిగిన వెంటనే కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) తమ నాయకుడు, బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బసుకు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. బసు భారతదేశంలోనే అత్యంత ఎక్కువసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకునిగా రికార్డు సృష్టించిన వ్యక్తి. అయితే తనకు భారత రత్న వద్దనీ, అందుకు తాను అర్హుణ్ణి కాదనీ, దాని వల్ల ఆ పురస్కారానికి గౌరవం తగ్గుతుంది అని వ్యాఖ్యానించారు.  తెలుగు దేశం పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, శిరోమణి అకాలీ దళ్ వంటి ప్రాంతీయ రాజకీయ పార్టీలు కూడా తమ తమ నాయకులైన ఎన్.టి.రామారావు, కాన్షీరామ్, ప్రకాష్ సింగ్ బాదల్ లకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. సెప్టెంబరు 2015లో, ప్రాంతీయ రాజకీయ పార్టీ అయిన శివసేన, ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్కు పురస్కారం ఇవ్వాలని డిమాండు చేసింది. ఆయనను మునుపటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని పేర్కొంది. అయితే వినాయక్ కుటుంబసభ్యులు ఈ అభ్యర్ధనను తాము సమర్ధించబోమనీ, వినాయక్ కు అవార్డు రావాలని తాము డిమాండు చేయట్లేదనీ, స్వాతంత్ర్యం కోసం దేశానికి ఆయన చేసిన సేవలను భారతరత్న ఇవ్వకపోతే జాతి మరచిపోదని స్పష్టం చేయడం విశేషం.




#Article 149: సంస్కృతము (2647 words)


సంస్కృతము (దేవనాగరి: संस्कृतम्) భారతదేశానికి చెందిన ప్రాచీన భాష, భారతదేశ 23 ఆధికారిక భాషల లో ఒకటి. పరమేశ్వరుని ఢమరుక నాదము నుండి వెలువడిన శబ్ద బ్రహ్మమే సంస్కృత భాష అని విజ్ఞులందురు. అట్లు వెలువడిన పదునాలుగు రకములైన సూత్రములను మాహేశ్వర సూత్రములందురు. సంస్కృతం హిందూ, బౌద్ధ, జైన మతాలకు ప్రధాన భాష. నేపాలు లో కూడా సంస్కృతానికి భారతదేశములో ఉన్నటువంటి స్థాయియే ఉంది. జనాభాలెక్కల ప్రకారం సంస్కృతం మాట్లాడేవారి జనాభా: * 1971--2212 * 1981--6106 * 1991--10000 * 2001--14135.
 అని ఉన్నా కనీసం పది లక్షల కంటే ఎక్కువ మందే సంస్కృతాన్ని అనర్గళంగా మాట్లాడగలరు. కర్ణాటకలోని  అనే గ్రామములో పూర్తిగా సంస్కృతమే వ్యవహారభాష.
సంస్కృతం అంటే 'సంస్కరించబడిన', 'ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పడిన' అని అర్థం .ప్రపంచంలోని 876 భాషలకు సంస్కృతం ఉపజీవ్యం. సంస్కృతమునకు అమరవాణి, దేవభాష, సురభాష, గీర్వాణి మొదలగు పేర్లు ఉన్నాయి. శౌరసేని, పైశాచి, మాగధి మొదలగు ప్రాకృత భాషలు కూడా సంస్కృతము నుండియే పుట్టినవి. సంస్కృతమునందు ఏకవచనము, ద్వివచనము, బహువచనము అను మూడు వచనములు ఉన్నాయి. సంస్కృతమునందు నామవాచకములను విశేష్యములనియు, శబ్దములనియును, క్రియాపదముల యొక్క మూలరూపములను ధాతువులనియును వ్యవహరింతురు. సంస్కృతాన్ని మొదట సరస్వతీ లిపిలో వ్రాసేవారు. కాలక్రమేణ ఇది బ్రాహ్మీ లిపిగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత దేవనాగరి లిపిగా పరివర్తనం చెందింది. ఇదే విధంగా తెలుగు లిపి, తమిళ లిపి, బెంగాలీ లిపి, గుజరాతీ లిపి, శారదా లిపి, అనేక ఇతర లిపులు ఉద్భవించాయి. క్రియా పదముల యొక్క లింగ, వచన, విభక్తులు నామవాచకమును అనుసరించి ఉండును. 

జటావల్లభుల పురుషోత్తము ఎం. ఏ. (Lecturer in Sanskrit, S.R.R.  C.V.R College, Vijayawada) చే రచించబడి, 1957 లో ముద్రింపబడిన భారతీయవైభవము అను పుస్తకము నుండి తీయబడింది.

ఏదృష్టితో చూచినను సంస్కృతభాష ప్రపంచ భాషలలో విశిష్టస్ధానము నలంకరించుచున్నది. అయ్యది సకల భాషలలోను ప్రాచీనతమమై, సర్వలోక సమ్మానితమై, వివిధ భాషామాతయైయలరారు చున్నది; భారత జాతీయతకు జీవగఱ్ఱయై, భారతీయభాషలకు ఉచ్ఛ్వాసప్రాయమై, సరససాహిత్యజ్ఞానవిజ్ఞానరత్నమంజూషయై యొప్పారుచున్నది. పురాతనమైన యీభాష అధునాతన నాగరికతలో కూడా ప్రధానభూమికను నిర్వహింపగల్గియుండుట పరమ విశేషము.

సుమారు 150 సంవత్సరములక్రిందట భాషాసాదృశ్య శాస్తము (Comparitive Philology) విజ్ఞాన ప్రపంచములో నుద్భవించెను. గ్రీకు, లాటిను, ఇంగ్లీషు, జర్మను, ఫ్రెంచి మున్నగు యూరోపియన్ భాషలనడుమ, అత్యంత సన్నిహితసంబంధము కలదనియు, ఈభాషలన్నియు ఆదిలో నేకమాతృసంజనితలనియు నపుడు పాశ్చాత్య పండితులు గ్రహించిరి. కొన్నిశతాబ్దములనుండి, ఐరోపాఖండములో వివిధయూరోపియన్ భాషలను నేర్చినవారెందరో యుండినను, వారి కంతకాలమును గోచరింపని యీ పరస్పర సంబంధము సంస్కృత భాషను నేర్చుకొన్నతర్వాతనే గోచరించుట విశేషము. ఇది గోచరించుటతోబాటు, వారికి సంస్కృతము ఆయన్నిభాషలకును తల్లియను విషయముకూడ స్పష్టమాయెను. వివిధ యూరపీయ భాషలు నిలిచియున్న విజ్ఞానరంగములోనికి, సర్వాంగసుందరియైన సంస్కృతభాష ప్రనేశించినప్పుడు, విమర్శకులీమె తల్లియనియు, మిగిలినభాష లక్కచెల్లెండ్రనియు గ్రహించిరి.

ఆదిలో ఇండో యూరోపియన్ భాషా సాదృశ్యశాస్తములో కృషిచేసిన వారిమతమున, సంస్కృతము నిస్సంశయముగ మాతృభాషగనే యుండెను. పిమ్మట నేకారణముచేతనోకాని పాశ్చాత్యపండితులు సంస్కృతమునకు మాతృస్ధానమును తొలగించి, అది యూరోపియన్ భాషలతో పోదరీ సంబంధమునే కలిగియున్నదను సిద్ధాంతమును లేవదీసిరి. ఇట్లు చెప్పిన పాశ్చాత్యపండితులుగూడ నొక్కయంశమునంగీకరింపక తప్పినదికాదు. ఈయక్కచెల్లెండ్రకు తల్లియైన భాషను మిక్కిలి హెచ్చుగ బోలియున్నది సంస్కృతమే కాని మరొకటికాదని వారనుచున్నారు. నిజమైనతల్లి యిపుడు మృగ్యమనియు, చాల విషయములలో నది సంస్కృతమును పోలియుండునని మనమూహించుకొనవచ్చుననియు, విమర్శకులు నుడువుటచే వివిధ యూరపీయభాషలకు సంస్కృతము కీలకమను అంశము వ్యక్తమగుచున్నది.

రాజకీయముగా భారతదేశము పాశ్చాత్యుల అధీనమయిన కాలములో, పాశ్చాత్యులు భారతీయభాషయే తమ భాషకు తల్లియని అంగీకరించుచో, అది విపరీతముగ నుండెడి మాట వాస్తవమే. అట్లొప్పుకొనుట పాలకజాతివారి గర్వమునకు భంగకరమును, పాలితజాతివారి ఆత్మగౌరవమునకు ఉద్దీపకమును అగును. అయినను ఉదారులగు పాశ్చ్యాత్యులు కొందరు సత్యమును బాహాటముగా చాటిరి. విమర్శకులలో ఉన్నతశ్రేణికి చెందిన కర్జన్ పండితుడు వ్రాసిన మాటల నిట ఉల్లేఖించుచున్నాను.

నిష్పక్షపాతబుద్ధితో ఈరీతిగా సంస్కృతభాషకు యూరపీయభాషామాతృత్వము నంగీకరించినవారు కొందరు కలరు. 1834 వ సంవత్సరములో R.A.S. పత్రికలోనే ద్వితీయసంపుటములో Sanskrit Literature అను శీర్షిక క్రింద W.C. టెయిలర్ వ్రాసిన యీక్రిందిమాటలుకూడ గమనింపదగియున్నవి. “ప్రాచీనయూరోపీయభాషల కన్నింటికిని తల్లి హిందూదేశపుభాషయే. దేశములో ఎన్నిమార్పులు వచ్చినను ఆ భాషను హిందూదేశము నిలబెట్టుకొనగల్గినదని మనము ఆశ్చర్యముతో కనుగొంటిమి.”

సంస్కృతమునకు ఇండోజర్మానిక్ భాషలలో జ్యేష్ఠ భగినీత్వము నారోపించుట యిటీవలనే కొందరు పాశ్చాత్యులు చేసినపనియనియు, మాతృత్వమే మొదట అంగీకరింపబడినదనియు నిరూపించుట కీవచనముల నుదాహరించియున్నాను. జ్యేష్ఠభగినీవాదియైన మాక్సుముల్లరుకూడ సంస్కృతమంత ప్రాచీనభాష మరియొకటి లేదనియు, ఇకమీదటకూడ అట్టిది కన్పట్టుట కవకాశము గోచరింపదనియు చెప్పియున్నాడు.

ఇండోయూరపీయ కుటుంబమునకు చెందిన యేభాషలోనైనను కూలంకషమైన పాండిత్యము గల్గుటకు సంస్కృతభాషాజ్ఞానము అత్యంతావశ్యకము. ఇం.యూ. కుటుంబమునకు చెందక, ప్రత్యేకము ద్రావిడభాషా కుటుంబమునకు చెందినవని కొందరిచే భావింపబడుచున్న ఆంధ్రము, కర్ణాటకము మున్నగు భాషలను నేర్చుకొనుటకుకూడ సంస్కృత జ్ఞాన మవసరమే. ఈనడుమ గొందరు పండితులు ఆంధ్రము, సంస్కృత ప్రాకృతజన్యమని రుజువుచేసియుండుటచే, సంస్కృతభాషాప్రాముఖ్యత మరింత హెచ్చింది. ప్రపంచములోని ఏభాషనునేర్చుకొనుటకైనను సంస్కృతము కీలకమని మాక్సుముల్లరు అభిప్రాయపడినాడు. ఆధునికశాస్త్రముల కన్నింటికిని గణితశాస్త్ర మెట్టిదో, ప్రపంచభాషలకన్నింటికిని సంస్కృతమట్టిదని యాయన నుడివినాడు. “What Mathematics is to the Sciences, the same is Sanskrit to the languages of the world”.

సంస్కృతమునేర్చిన పాశ్చాత్య పండితులేకాక, ఇతర పాశ్చాత్య విద్వాంసులుకూడ నీ యభిప్రాయమునంగీకరించారు. జాన్ రస్కిన్ కూడా ఇంగ్లీషుభాషలో పాండిత్యము గలుగవలెనన్నచో మాక్సుముల్లరు రచించిన Biography of words అను గ్రంథమును చదువవలెనని చెప్పినాడు. ఆ గ్రంథములో ప్రధానముగా యూరపీయ భాషాపదముల సంస్కృతభాషా వ్యుత్పత్తి ప్రదర్శింపబడింది. దానిని చదువుటవలన ఇంగ్లీషుపదముల శక్తి, వినియోగ విధానము బాగుగా బోధపడునని రస్కిన్ అభీప్రాయము. (చూ: Sesame and Lilies.)

సంస్కతభాష సమస్త భాషలకు మాతయైనట్లే, సంస్కృతభాషాఘటితమైన విజ్ఞానముకూడ సమస్తదేశ ప్రాచీన విజ్ఞానమునకు మూలమైయున్నది. విజ్ఞాన ప్రవాహము భారతదేశమునుండి బయలుదేరి యేరీతిగా పర్షియా, అరేబియా, గ్రీసు మున్నగు దేశములకు వ్యాపించినదో విపులముగా వివరించుచు పోకాక్ అను ఆంగ్లేయుడు India in Greece అను గ్రంథములో నిరూపణచేసియున్నాడు. బాబిలోనియా, ఈజిప్టు మున్నగు దేశములలో అతిప్రాచీననాగరికత యని భావింపబడుచున్నది భారతదేశసంస్కృతియొక్క విస్తారమే యని ఆ గ్రంథములో వివరముగా తెలుపబడింది. ఈ గ్రంథము రచింపబడి నూరు సంవత్సరములగుచున్నది. ఇంత సహేతుకముగా సప్రమాణముగా ప్రపంచనాగరికత భారతీయనాగరికతా విస్తారమేయని నిరూపించిన గ్రంథమునకు దేశములో వ్యాప్తిలేకుండుట ఆశ్చర్యముగానున్నది. ఆ గ్రంథము వ్యాప్తిలోనికి వచ్చుచో భారతీయవిజ్ఞానముపట్ల భారతీయులయొక్కయు, ప్రపంచవాసులయొక్కయు దృక్పథములో మూలమట్టమైన మార్పువచ్చును.

ప్రపంచములోని యేభాషలోను వాజ్ఞయము పుట్టక పూర్వమే, సంస్కృతములో వాజ్ఞయము బయలుదేరినదని ఎల్లరు నంగీకరించుచున్నారు. మానవ పుస్తకభాండాగారములో ఋగ్వేదమే మొదటిగ్రంథమని మాక్సుముల్లరు నుడివియున్నాడు.

ప్రపంచములో మొదటికావ్యమగు రామాయణము సంస్కృతభాషలో నుద్భవించినది, ప్రపంచములోని మొదటి జ్యౌతిషగ్రంథము, మొదటి నాట్యశాస్త్ర గ్రంథము, మొదటి వ్యాకరణ గ్రంథము సంస్కృతభాషలోనే యుద్భవించినవి. కావున ప్రపంచవిజ్ఞానచరిత్రలో సంస్కృతభాషకు విశిష్టమైనస్థానము ఉంది.

సంస్కృతభాషలోని వాఙ్మయముతో పరిచయమును పొందిన పాశ్చాత్యపండితులెల్లరు, దాని మహత్త్వమును వేనోళ్ల కొనియాడిరి. మహామేధావి, విమర్శకశిరోమణియైన గెటీయను జర్మనుపండితుడు శాకుంతలనాటకమును జర్మనుభాషలో చదివి ముగ్ధుడైనాడు. స్వర్గమర్త్యలోకముల సారసర్వస్వమే శకుంతలయని యాతడు వర్ణించాడు. మానవ హృదయమునకు ఉపనిషత్తు లీయగల శాంతిని మరియేవాఙ్మయము కూర్పజాలదని యెల్లరు నంగీకరించిరి.
విశ్వవిఖ్యాతిగల షోపెన్ హోవర్ అను జర్మనువిద్వాంసుడు ఉపనిషత్పఠన మంత లాభదాయకమైనది, ఔన్నత్యాపాదకమైనది మరొకటిలేదు. అది జీవితకాలమంతయు నాకు ఆశ్వాసజనకముగా నున్నది. మరణ సమయమునకూడ అదియే నాకు ఆశ్వాసహేతువు కాగలదు” అని నుడివినాడు.

ఫ్రెడెరిక్ ష్లెగెల్ భారతీయుల భాష, విజ్ఞానము” అను గ్రంథములో నిట్లు వ్రాసెను. “ప్రాగ్దేశస్థుల ఆదర్శ ప్రాయమైన విజ్ఞానజ్యోతి ముందర గ్రీకువేదాంతుల తత్వశాస్త్రము అప్రతిబద్ధమై మినుకుమినుకుమను నిప్పునెరసువలె నుండును”.

సంస్కృతభాషయొక్క కట్టుబాటును గురించి మోనియర్ విలియమ్స్ యిట్లు పల్కినాడు. “ఇంతవరకు ప్రపంచములో బయలుదేరిన అద్భుతగ్రంథములలో పాణినివ్యాకరణమొకటి. స్వతంత్ర ప్రతిభ లోను, సూక్ష్మ పరిశీలనలోను పాణినీయ వ్యాకరణముతో పోల్చదగిన గ్రంథమును మరియే దేశమును సృజించుకొనలేదు”.

భాషను నిబంధించు వ్యాకరణశాస్త్రము ఒక శాస్త్రముగా పరిగణింపబడు ఉన్నతస్ధితికి వచ్చుట భారతదేశములో మాత్రమే జరిగింది. సంస్కృతవ్యాకరణమునుగూర్చి యీరీతి వర్ణనను Most Scientific Grammar” అని అనేక పాశ్చాత్యపండితులు గావించియున్నారు. బుద్ధికి శిక్షణము నొసగు విషయములలో గణితశాస్త్రమొకటి. గణితశాస్త్రమునుగాని, సంస్కృతవ్యాకరణమునుగాని చదువుచో మానవబుద్ధి సరియైన మార్గములో ఆలోచించుటయను అలవాటులో పడునని నిష్పక్షపాతబుద్ధి గల పాశ్చాత్యులే నుడివియున్నారు.

బహుభాషానిబద్ధ సాహిత్యకృషి చేసినవారు ప్రపంచసాహిత్యములో వాల్మీకి రామాయణముతో సమానమైన గ్రంథము లేదనిరి. ఆంగ్లములో గ్రంథకర్తగా ప్రసిద్ధిచెందిన భూతపూర్వ బీహార్ రాజ్యపాల శ్రీ ఆర్. ఆర్. దివాకర్ ఇట్లు వాక్రుచ్చారు. “కొందరు నాతో ఏకీభవించినను, ఏకీభవింపకపోయినను నామట్టునకు నాకు ప్రపంచసాహిత్యములో వాల్మీకి రామాయణము ఉత్తమోత్తమ గ్రంథమనిపించుచున్నది.” (ఆంధ్రపత్రిక 21-7-57 ) . ఇట్టి బహువిషయములలో అగ్రస్థానము మరి యేభాషకును లభించుట లేదు.

ప్రపంచములో ఏభాషయు సాధింపజాలని యొక విశేషమును సంస్కృతము సాధించినదని శ్రీ వివేకానంద స్వామి నుడివియున్నారు. ఏభాషలోనైనను కావ్యము రసవంతమై రమ్యముగానున్నచో అందు ధర్మబోధ తక్కువగా నుండును. ధర్మబోధ యెక్కువగానున్నచో రమ్యత తక్కువగానుండును. రమ్యతయు, ధర్మ్యతయు కలియుట మేలనియు, కాని అట్టి కలయిక కన్పట్టుటలేదనియు అరిస్టాటిల్ మున్నగు ప్రాచీనవిమర్శకులు పరితపించారు. పాశ్చాత్య నాటకకర్తలలో మేటియైన షేక్స్పియరులోకూడ ధర్మబోధ ప్రయత్నము తక్కువయనియు, షేక్స్పియరు లోకమునకు సందేశమునిచ్చు దృష్టితో నాటకములను వ్రాయనేలేదనియు విమర్శకులు చెప్పుచున్నారు. రమ్యతను, ధర్మ్యతను అత్యున్నత పథములో సమముగా సాధించిన గ్రంథము వాల్మీకి రామాయణము మాత్రమే. ఈ యంశమును స్వామి వివేకానందుడు అమెరికనులకు తెలుపుచు ఇట్లు పలికెను.

ఈ విషయములో రామాయణమునే వరవడిగా నుంచుకొని సంస్కృతకావ్య నాటకాదులు బయలుదేరినవనుట స్పష్టము. ఆలంకారికులుకూడ ఈలక్ష్యమునే ఆదేశించారు. ప్రతాపరుద్ర యశోభూషణములో విద్యానాథడు రచించిన యద్వేదాత్ప్రభుసమ్మితాదధిగతం” ఇత్యాది శ్లోకసందర్భమును పరికింపదగును.

పాఠకుని హృదయము ఆనందసముద్రములో ఓలలాడుటతో బాటు, ధర్మసౌధశిఖరమును సోపానక్రమముచే అధిరోహించుట రామాయణ పఠనసమయములోనేకాక కాళిదాసాది ఇతర సంస్కృతకవుల గ్రంథములను పఠించు సమయములో కూడా అనుభవగోచరము.

అట్టి గ్రంథములే యింతకాలము భారతీయులను సత్వగుణ ప్రధానులనుగ చేసి, వారికి ప్రపంచములో నొక విశిష్టతను చేకూర్చినవి. ఆధునిక కాలములో (సైన్సు) విజ్ఞానము పర్వతరాశివలె పెరిగిపోయింది. దానిప్రక్కను భారతీయ సంస్కృతియను మరొకపర్వతమున్నది. ఈ సంస్కృతిచే పరిమళింప చేయబడని ఆధునికవిజ్ఞానమును మనముపయోగించుకొందుమేని అది యిప్పటిరీతిగానే ప్రపంచమునకు శాంతి ప్రదానశక్తిలేక, కల్లోలస్ధితికే కారణమగుచుండును. ఈరెండు పర్వతములను కలుపగల వంతెనయే సంస్కృతభాష. భారతరామాయణగాధలు, బోధలును, కాళిదాసాదికవుల గ్రంథములలోని మధురసందేశమును, భర్తృహరి సుభాషితాది హృదయంగమోపదేశములును నేటి విజ్ఞానపర్వతమునకును, భారతీయజీవిత పథమను సంస్కృతికిని సేతుబంధముగా పనిచేయగల్గి ఆధునికనాగరికతలో నూతనయుగము నావిర్భవింపచేయ గలవు. ఇట్టి సేతువును నిర్మింపవలసిన యావశ్యకతను రాష్ట్రపతి శ్రీ రాజేంద్రప్రసాదుగారు 1952 వ సంవత్సరములో కాశీలోజరిగిల\న సంస్కృత విశ్వపరిషదధివేశమునకు అధ్యక్షతను వహించుచు, స్పష్టపరిచి యున్నారు.

నైతికముగాను, ధార్మికముగాను సంస్కృతము మానవులకు గల్గింపగల యభ్యున్నతి నిరుపమానమైనది. ప్రపంచములో నెక్కడెక్కడ సంస్కృతము ప్రాకినదో, అక్కడక్కడ మానవహృదయమునకు మృదుత్వమేర్పడినదని రవీంద్రనాధటాగోరువంటి విశ్వమానవ సమదృష్టిగల విశ్వకవికూడ నుడివియుండుట గమనింపదగిన విషయము. భారతదేశములో ఫిన్లెండు రాజదూతగానుండిన హ్యూగోవల్వనే చెప్పిన యీ క్రిందిమాటలు సంస్కృతముయొక్క యీప్రభావమును ఘంటాపథముగ చాటుచున్నవి. “సంస్కృతభాషా నిబద్ధములైన భారతీయభావములు యూరపు హృదయమునకు మృదుత్వము నొసగినవి. అచట నాగరికతను నెలకొల్పినవి. ప్రత్యక్షముగా సంస్కృతభాషాద్వారముననే కాక భాషాంతరీకరణముల ద్వారమునకూడ నీపనిజరిగినది. తరువాత కొన్ని శతాబ్దములపాటు సంస్కృతము యూరపియనులకు అందలేదు.” (11-2-53 తేదీని కాశీలో ప్రభుత్వ సంస్కృత కళాశాలా స్నాతక సభోపన్యాసము).

ఇటీవల యూరపియనులు వాణిజ్యాదులకొరకు భారతదేశానికి వచ్చుటయు, సంస్కృతమును నేర్చుకొనుటయు, సంస్కృతసాహిత్యగ్రంథములనేకాక శాస్త్రములనుకూడ తమతమ భాషలలోనికి పరివర్తింపచేసికొనుటయు సంభవించెను. 18 వ శతాబ్దిలో ప్రారంభమైన యీ సంస్కృత సంస్కృతి ప్రసారము పాశ్చాత్యభాషలపైననూ, విజ్ఞానముపైనను అపారప్రభావమును చూపెను. సంస్కృతభాషను నేర్వనివారిపైకూడ ఈ ప్రభావము పడెను. కాంట్, స్పైనోజా మున్నగు దేవాంతులపైనను, ఎమర్ సన్, ఎడ్విన్ ఆర్నాల్డ్, సోమర్ సటే మాగమ్ మొదలైన రచయితలపైనను ఈ ప్రభావము ప్రస్ఫుటముగా గోచరించును. ఐరోపాలో 15 వ శతాబ్దిలో జరిగిన రినైజాన్స్ అని చెప్పబడు విజ్ఞానపునర్విజృంభణమునకు తరువాత జరిగిన వైజ్ఞానిక సంచలనములన్నిటిలోను గొప్పది సంస్కృత సంపర్కమువలన జరిగిన వైజ్ఞానికసంచలనమే యని ఎ. ఎ. మాక్డోనెల్ తన Sanskrit Literature అను గ్రంథములో వ్రాసియున్నాడు. (1 వ పుట)

సంస్కృతభాషను నేర్చి, భారతీయుల జీవితపద్ధతులను చూచిన పాశ్చాత్యపండితు లెల్లరు సంస్కృత భాషానిబద్ధసంస్కృతికిని, భారతీయుల జీవితమునకును గల సన్నిహిత సంబంధమును, సమన్వయమును చూచి యాశ్చర్యపడిరి. భారతీయజీవితము నర్ధముచేసికొనుటకు సంస్కృతభాషా వాఙ్మయపరిచయము అవసరమని గుర్తించిరి. కావుననే బ్రిటిష్ ప్రభుత్వకాలములో ఈ దేశానికి పరిపాలకులుగా రాదలచిన ఐ. సి. యస్. పరీక్షాభ్యర్ధులకు మాక్సుముల్లరు రచించిన India; What can it teach us? అను గ్రంథము పఠనీయముగానుండెను.

పైన పేర్కొనబడిన ఫిన్లెండ్ రాయబారి తన ప్రభుత్వము తన్ను భారతదేశానికి రాజదూతగా పంపిన కారణమును కాశీ విశ్వసంస్కృత పరిషదధివేశములో నిట్లు వివరించెను. 'మా దేశపు ప్రభుత్వము సంస్కృతభాషను నేర్చినవాని నెవనినయినను భారతదేశానికి దూతగా పంపిన బాగుండునని తలంచుచుండెను. నేను 35 సంవత్సరముల క్రిందట, మా దేశములో విశ్వవిద్యాలయములో సంస్కృతము నభ్యసించితిని. కావున ఈ ఉద్యోగమునకు నేను ఎంచుకొనబడుట సంభవించెను'. భారతదేశముతో సంబంధము పెట్టుకొనదలచిన పాశ్చాత్యులకే సంస్కృతభాషాజ్ఞానమంత ముఖ్యముగా భావింపబడుచుండగా, స్వయముగా భారతీయులకా భాష యెంతముఖ్యమో, అది యెంతగా ప్రాణసమానమైనదో వేరుగ చెప్పనక్కరలేదు.

ఆసేతు హిమాచలము గల ప్రజలు ఏకజాతిగ నిబద్ధమగుటలో విశేషముగ తోడ్పడినది సంస్కృతభాష. రాజకీయ శాస్త్రములో జాతీయతకు (Nationhood) కావలసినవిగ చెప్పబడిన యంశములలో భాషైక్యమొకటి. ప్రాచీనభరతఖండములో ప్రాంతీయభాషలుండినను వివిధప్రాంతముల నడుమ సామాన్యభాషగా నుండినది సంస్కృతమే. పండితులలో సంస్కృతము సామాన్య భాషగా వాడబడుట నేటికిని గలదు. స్వచ్ఛ సంస్కృతము రాని భిన్నప్రాంతముల వారు సమావేశమైనప్పుడుకూడ వారు పరస్పరము అవగాహనము చేసికొనవలయునన్నచో వారివారి భాషలలో సామాన్యముగనుండు సంస్కృత పదజాలమే సహాయము చేయును. ఒక యాంధ్రుడును బీహారు ప్రాంతవాసియు నొకచోట కలిసినప్పుడు ఆంధ్రుడు బీహారీని మీ నివాస మెక్కడ?” అని తెలుగులో అడిగినను అతని కర్థమగును. నివాస శబ్దము రెండు భాషలలోను సమానమే. 'భోజనము', 'శ్రమ', 'దానము' మున్నగు సామాన్యముగా వాడబడు పదములు రెండు భాషలలోను ఉండును. కావున భాషా భేదమున్నను, భారతీయు లెల్లరు సంస్కృతపద సూత్రబద్ధులై భాషైక్యముగూడ పొందియున్నారు.

సంస్కృతభాషవలెనే తద్భాషా నిబద్ధమైయున్న విజ్ఞానముకూడ భారతదేశమున కైక్యమును సాధించింది. రామాయణము, మహాభారతము, భర్తృహరి సుభాషితములు మున్నగునవి భారతదేశములోని ఏప్రాంతమువారికైను సమాన పరిచితములే; వానినిచూచి యుప్పొంగని భారతీయుడు లేడు. సంస్కృతభాషను కాళిదాసాదివిరచితశ్లోకములద్వారమున నేర్పు సంప్రదాయమొకటి మన దేశములో నున్నది. దీనివలన సంస్కృతము, సంస్కృతి కూడా ఒకేసారి బాలబాలికల హృదయములో ప్రవేశించు సదవకాశము కల్గును. జీవితకాలమంతయు జ్ఞప్తియందుంచుకొనవలసిన రసవంతములైన శ్లోకములద్వారా భాష నేర్చుకొనుటవలన యువకులు వానిని కంఠస్థముచేయుటయు, జీర్ణించుకొనుటయు సంభవించును. నేటి పాఠ్యపుస్తకములద్వారా సంస్కృతము నేర్చుకొనుచో నీ ప్రయోజనము బోవును. మహాకవుల గ్రంథములు బాలురకు బోధపడునాయనుశంకకు అవకాశము లేదు. ప్రపంచములో ఏభాషకును లేని విశేషమొకటి సంస్కృతభాషకు ఉంది. ఈభాషలో మహోన్నతకవులే మహాసులభకవులు. వాల్మీకి, కాళిదాసు లెంతగొప్పవారో అంత సులభులు. కావున ఈ విషయమున సంస్కృతభాష మరొక భాషతో పోల్చదగినదికాదు.

ఇది భారతప్రధాని నెహ్రూ, సంస్కృతభాషావాఙ్మయములనుగురించి వెలుబుచ్చిన అమూల్యాభిప్రాయము.

సంస్కృతము ఏప్రాంతములోను నిత్యవ్యవహారభాష కానంత మాత్రముచేత కొందరు దీనిని మృతభాషయనుట అసమంజసము. భారతదేశములో సంస్కృతము జీవద్భాషయే యనునది స్పష్టమైన సత్యము. మృతభాషలైన గ్రీకు, లాటినులను సంస్కృతముతో పోల్చి చూతుమేని మృతభాషావాదము నిస్సారమని తెలియగలదు. నేడు ఒక సంస్కృతగ్రంథము ముద్రింపబడుచో సంవత్సరమునకు కొన్ని వేల ప్రతులు విక్రయింపబడుటను చూచుచున్నాము. అట్టి గ్రంథములు వందలకొలది ముద్రితము లగుచున్నవి; చెల్లుబడి యగుచున్నవి. గ్రీకు, లాటిన్ గ్రంథముల కింత ఆదరము లేదు సరికదా యిందులో శతాంశమైనను లేదు. నేడు వేలకొలది ప్రజలుగల సభలలో సంస్కృతమున ఉపన్యాసములు జరుగుటయు, ప్రజలు వాని నర్థముచేసికొనుటయు చూచుచున్నాము. మద్రాసువంటి ఆధునికపట్టణములో వేలకొలది మంది అర్థము చేసికొను భాషను మృతభాషయనుటకంటె అసత్యము మరొకటి యుండదు. గ్రీకు భాషలో ఉపన్యాసము జరుగుచో ఇంగ్లండులోనేకాదు గ్రీసు దేశములోకూడ ఏపట్టణములోను నూరుమందికూడ అర్థము చేసికొనజాలరు. ఇట్టి యనేక కారణములవలన సంస్కృతము నేటికికూడ జీవద్భాషయే యని స్పష్టమగుచున్నది. సంస్కృతము నేర్వనివారికి కూడా లోకోక్తి రూపముగాను, సుభాషితరూపముగాను పదులకొలదిగనైనను సంస్కృతశ్లోకములు వచ్చియుండును. పైని చెప్పిన లక్షణములలో ఏదియు మృతభాష కుండదు.

సంస్కృతము మృతభాష కాకుండుటయేకాక మాధుర్యభరితమై యున్నందున అమృతభాషయని చెప్పదగియున్నది.

హిందూమతముతో బాటు సంస్కృతమును జీవింపక తప్పదు. సంస్కృతవిరహితమైన హిందూమతము ఊహకుకూడ అందనిది. హిందువుల మతగ్రంథములన్నియు - వేదములు, పురాణేతిహాసములు, భాష్యములు మున్నగునవన్నియు - సంస్కృతములోనే యుండుటచేతను, నిత్యకర్మలును. నిషేకాదిశ్మశానాంతకర్మలును, శ్రేతపౌరాణిక యజ్ఞములును, పారాయణగ్రంథములును, అన్నియు సంస్కృతములోనే యున్నందున హిందువులకిది శాశ్వతముగ సమాశ్రయణీయము. మహాత్మా గాంధి యిప్పట్ల నుడివిన యీ మాటలు గమనింపదగినవి.

ఒకప్పడు క్రైస్తవమతమునకు పవిత్రభాషగా నుండి క్రైస్తవమతముతోబాటు శాశ్వతముగా జీవించీతీరునను అభిప్రాయమును గల్గించుచుండిన లాటిను భాష ఈనాడు క్రైస్తవమతమును వీడినట్లే సంస్కృతముకూడ హిందూమతమును వీడదాయను సందేహమెవరికైనను కలుగవచ్చును. ఆ సాదృశ్యము సరియైనదికాదు; (1) ఆదిలో లాటిను ద్వారా క్రైస్తవమతము ఐరోపాలో వ్యాపించినను, తన్మత మూలగ్రంథము లాటిను పుట్టియుండలేదు. కావున లాటిను కును క్రైస్తవమునకును సంబంధము మూలమట్టమైనదికాదు. (2) హిందూమత మూలగ్రంథములలో అర్ధశక్తియేగాక అక్షరశక్తికూడ కలదు ఆ అక్షరములు అదేరీతిగా, అదేస్వరముతో ఉచ్చరింపబడుచో అపూర్వము పుట్టునని యీ మతములోని సిధ్ధాంతము. కావున మూల గ్రంథమునకు ప్రముఖస్ధానము ఎప్పుడును పోదు. (3) ఈ మతమునకు చెందిన ఉద్గ్రంథములలో - ముఖ్యముగ త్రిమతస్ధుల ప్రస్థానత్రయ భాష్యములలో శబ్దవిచారమే ముఖ్యముగా చేయబడింది. “ఇచ్చట ఏవకారమునకు ప్రయోజన మేమి?”, ”అక్కడ ఆధాతువునకు ఆప్రత్యయము వచ్చినందున ఆయర్ధము తెలుపబడుచున్నది”—ఇత్యాది ధోరణిలో భాషమీదనే విశేషముగ విచారణ జరిగియున్నందున, ఈ మతముతో సంస్కృత భాషకుగల సంబంధ మెన్నటికిని పోదు. (4) ఇంతవరకు భారతీయ భాషలలో రామాయణ భారత భాగవతములకు అసంఖ్యాక పరివర్తన గ్రంథములు బయలుదేరినను ఏ యొక ధార్మికవిషయమునగాని భక్తివిషయమునకాని తత్వవిషయమున కాని సందేహము వచ్చినను మూల సంస్కృతగ్రంథమును చూచియే సందేహమును తీర్చుకొనుచున్నారుకాని యీ ప్రాంతీయభాషాగ్రంథములను చూచి సందేహమునెవ్వరును తీర్చుకొనుటలేదు. కావున ప్రామాణికత మూలసంస్కృత గ్రంథములకు పోయే అవకాశము లేదు. (5) సంస్కృతమువంటి అమూల్యరత్న నిధానమును హిందువులు విడిచిపెట్టుకొందురనుటకంటె వీరికిచేయబడు అన్యాయము వేరొండు లేదు.

ఆధునిక యుగమున భారతదేశములో ఫ్రాంతీయ భాషలకు సంస్కృతమువలన కలుగు పరిపుష్టి వర్ణనాతీతము. ఏభావమునైనను, భావచ్చాయనైనను తెలుపగల పదములు సంస్కృతములో సిద్ధములై యుండుటయేకాక అవసరమైనకొలదియు నూతన పదములను సృజించుకొను అవకాశము ఇందున్నంత పుష్కలముగా మరి యేభాషలోను లేదు. ఆయా ధాతువులకు చేర్చబడు ఉపపర్గల వలనను తిఙకృత్ప్రత్యయముల వలనను అనంతపదజాలము కల్పింపబడుట కవకాశమున్నది. అట్లే సుబంత తద్ధిత రూపములును కొల్లలుగా సంపాదింపబడును. ఒక్కథాతువునుండి సుమారు 150 పదములను సృజించు అవకాశము సంస్కృతములో ఉంది. ఇట్టి యవకాశము మరి యే భాషలోను లేదు. ఇంత భాగ్యవంతమును, సమృద్ధి మంతమును అయిన భాష ఆధునికయుగములో నిర్వహింపవలసిన కార్య మెంతయో ఉంది.

బహువిధోద్యమములతోను, వైజ్ఞానిక సంచలనములతోను చైతన్యవంతమైన ఆధునిక కాలములో సంస్కృతము చేయుచున్నట్టియు, చేయగల్గినట్టియు సహాయ మింతింతయని చెప్పజాలము. సంస్కృత సహాయము లేనిచో సుమారు అర్థశతాబ్దినుండి ఆంధ్రదేశములో ( అట్లే యితర భాషాప్రాంతములలో ) విజృంభించుచున్న అనేకోద్యమము లింతగా ప్రజల హృదయములను తాకెడివికాదు. గ్రంథాలయోద్యమము, వయోజన విద్యాప్రచారము, సహాయ నిరాకరణోద్యమము, గ్రామ్య, గ్రాంధికభాషా వివాదము, భావకవిత్వ ప్రస్ధానము, సారస్వత విమర్శనము, చారిత్రక పరిశోధనము - అది యిది యననేల – ఆధునిక జీవిత విజృంభణ మంతయు సంస్కృత భాషావలంబనము చేతనే జరిగింది. సంస్కృతమునకా పటుత్వమున్నది. ఏయుద్యమము బయలుదేరినను అది ప్రజల హృదయములలో నాటుకొనిపోవులనట్లు చేయగల అమోఘమైన శక్తి సంస్కృతభాష కుండుటచేత సంస్కృతముద్వారా ఉద్యమములు వ్యాపించుటయే కాక ఉద్యమములద్వారా సంస్కృతభాష కూడా అపారముగా వ్యాపించిపోయింది. ఏమాత్రము విద్యాగంధము లేనివారికికూడ ఆయాయుద్యమ భావములతోఁబాటు సంస్కృతభాషా పదములుకూడ అందఁజేయఁబడినవి. తత్ఫలితముగా నేడు సంస్కృత పదములు వెనుకకంటె హెచ్చు వ్యాప్తిలోనికి వచ్చినవి. మునుపు సంస్కృత పండితులకు మాత్రమే యర్థమగుచుండిన కొన్ని సంస్కృతపదములు నేడు సామాన్యజనుల కర్ధమగుచున్నవి.

ఆధునిక నాగరికతకును సంస్కృతభాషకును ఇట్టి సంబంధము ఉంది. ఇది భారతదేశములోని అన్ని ప్రాంతీయ భాషలకును వర్తించును. కావుననే భారత కేంద్రప్రభుత్వమునకు అధికారభాష కావలసిన హిందీ పదములను స్వీకరింపవలసినపుడు ముఖ్యముగా సంస్కృతము నుండియు, తరువాత ఇతర భారతీయభాషల నుండియు (...by drawing, whereever necessary or desirable, for the vocabulary, primarily on Sanskrit and secondarily on other languages) స్వీకరింపవలయుననని భారత రాజ్యాంగ ప్రణాళికలో ఉపనిబద్ధమైయున్నది. (Part XVII, Chapter IV, 351)

భారతదేశములోనేకాదు, ఇతరదేశములలో కూడా ఆధునిక వ్యవహారములకు సంస్కృత సహాయము పొందబడుచున్నది. సయాం, జావా మున్నగు దేశములలో దేశీయ భాషలు ఆధునిక వ్యవహారములకు ఉపయోగవడుటకై పరిపుష్టిని సంస్కృతభాషనుండి పొందుచున్నవి. సింహళ విశ్వవిద్యాలయాచార్యులైన వి. జి. సేకరే స్వీయ దేశ భాషాభివృద్ధి మార్గమును నిర్దేశించుచు నుడివిన యీమాటలు గుర్తింపదగినవి. “ఇంత కాలముపేక్షింపబడిన దేశీయభాష త్వరలోనే గురుతర బాధ్యతలను వహింపవలసివచ్చును. ఈ దేశీయభాషాభీవృద్ధిసందర్భమున మనకు ప్రధానమైన స్ఫూ ర్తి సంస్కృతభాషనుండి రావలసియున్నది. దీనినెల్లరు నంగీకరింతురు. విపులమైన శబ్దజాలము, శాస్త్రీయపారిభాషిక పదసమూహము సంస్కృతమున కాస్థానమును గల్గించుచున్నవి. సంస్కృత ధాతువుల నాధారముగా చేసికొనియే మనము నూతనపదములను నిర్మించుకొనవలసి యున్నది.” (22-6-54 తేదీని జాఫ్నాలో జరిగిన సంస్కృత మహాసభలోని ఉపన్యాసము.)

భారతదేశములోని యే ప్రాంతీయ భాషాసాహిత్యములోనైనను ప్రవేశించుటకు గాని గ్రంథరచనగావించుటకుగాని సంస్కృతభాషాజ్ఞానము తప్పనిసరిగా నుండదగినది. ఈ సంస్కృతప్రభావము ప్రాచీనరచనలలోను, అర్వాచీనరచనలలోను సమానముగానే యున్నది. ప్రాంతీయభాషాప్రత్యయములను తొలగించి సంస్కృత ప్రత్యయములను చేర్చుచో సంస్కృతభాషగానే మారిపోవు రచనలు నాడును నేడును గూడ సర్వ ప్రాంతీయభాషలలోను ఉన్నాయి. సంస్కృతపద భూయిష్టములైన రచనలే అన్ని ప్రాంతీయ భాషలలోను జనసామాన్యముచే ఆదరింప బడుచున్నవి. ఏగ్రంథములు సంస్కృత పదములను వాడరాదను అభిప్రాయముతో కవులచే రచింపబడినవో ఆ గ్రంథములే కృతిమములు గాను, కఠినములు గాను గన్పట్టుచున్నవి. ధారాళముగా సంస్కృత పదములు ప్రయోగింపబడిన గ్రంథములు జనసామాన్యమున కర్థమగుచున్నవి. కొన్నిపట్ల సంస్కృతపదభూయిష్ఠ రచనయు కఠినముగా నుండవచ్చును. కాని యా కాఠిన్యతనకు కారణము ఆపదములు సంస్కృత పదములై యుండుటకాదు. అట్టిపదములు సంస్తృతగ్రంథములలో నున్నను ఆ గ్రంథములు సంస్కృత పండితులకు కఠినముగానే యుండును. వానికి బదులుగా తేలికయైన సంస్కృతపదములు వాడబడుచో ఆ రచన తెలుగు గ్రంథములోనున్నను తేలికగనే యుండును. సంస్కృతగ్రంథములలోనున్నను తేలికగానే యుండును. కావున కాఠిన్య, సౌలభ్యములు ఆ ప్రయుక్తపదములకు సంబంధించినవే కాని భాషకు సంబంధించినవి కావు.

నేటి భారతీయ భాషాసాహిత్యములతో సంస్కృతమునకు గల గాఢసంబంధము గట్టిగా మనస్సునకు తట్టవలయునన్నచో అప్పుడప్పుడు జరుగుచుండు సర్వప్రాంతీయ కవిసమ్మేళనమములలో పద్యములను మనము వినవచ్చును. ఇంచుమించు అన్ని ప్రాంతీయభాషలలోను అవే సంస్కృత పదములు విననగును; భిన్నభారతీయ భాషలనడుమ ఎంత ఐక్యతకలదో స్పష్టముగ గోచరించును.

నేటి మన వ్యవహారరంగములోను, సాహిత్యరంగములోను సంస్కృతమెంత సన్నిహిత సంబంధమును గల్గియున్నదో, సంస్కృతాభ్యాసము పెరుగుచో ఈ ఉభయరంగములలోను మన భాషాపాటవ మెంతగా పెరుగునో, జాతీయజీవన మెంత సౌభాగ్య వంతముగానుండునో పై విచారణమువలన తెలియగలదు. నవయుగములో సంస్కృత పునరుజ్జీవము ప్రాంతీయభాషా పునరుజ్జీవములో నొక ముఖ్యభాగముగా భావింపవలయుననియు, సర్వప్రాంతీయ భాషలలోను సంస్కృతపదజాలము పెరుగుచున్న కొలదియు భిన్నభిన్న ప్రాంతములవారు పరస్పరము దగ్గరకు చేరుకొనుటకును, భారతీయులలో ఏకజాతీయభావము ఇతోధికముగా సునిరూఢమగుటకును దోహదమేర్పడుననియుకూడ దీనివలన స్పష్టమగుచున్నది.

సంస్కృతమునకు ప్రాంతీయభాషలతోగల సంబంధమును గురించిన విచారణము ఇంతటితో నాపి సంస్కృత పదముల సహజశక్తిని గురించి యొకింత చెప్పవలసియున్నది.
ఇతర భాషలలో అనేక పదములచే చెప్పవలసిన భావమును సంస్కృతములోని ఒక్క వదము చెప్పగలదు. నాలుగు ఉదాహరణములను మాత్ర మీక్రింద నిచ్చుచున్నాను. 
యాయజూకః = తఱచుగా యజ్ఞములు చేయువాడు.
జిగమిషా = పోవలయునను కోరిక.
రామతే = రామునివలె ఆచరించుచున్నాడు.
కేశాకేశి = జుట్టుజుట్టు పట్టుకొని యుద్ధముచేయునట్లు.
ఇట్టి శబ్దపటుత్వము నేటి ప్రపంచభాషలలో దేనికిని లేదు.

ఇంతియేకాక, రెండు, మూడు అక్షరములు గల చిన్న పదములు గొప్ప భావమును స్ఫురింపజేయుట సంస్కృతములోనే కాంచనగును. ధర్మ శబ్దమువలన దాని నాచరించువాడు మంచిస్ధితిలో ధరింపబడునని బోధింప బడుచున్నది. రథ్యా శబ్దమువలన పూర్వము వీధులు రథము నడుచుటకు తగినంత వెడల్పుగా నుండెనని తెలుపబడును. శరీర శబ్దమువలన నిది శిథిలమైపోవునను (శీర్యతే) తత్వబోధ చేయబడుచున్నది. స్మృతి శబ్దమువలన మనుస్మృత్యాది గ్రంథములు, వేదములను స్మరించుచు వ్రాయబడినవే కాని తత్కర్తల స్వకపోలకల్పితములు కావని తెలియుచున్నది. ఈరీతిగా సంస్కృత శబ్దములకు లోకోత్తరశక్తి కన్పట్టుచున్నది. ఇతర భాషలలో నిది మిక్కిలి తక్కువ. మూలధాతువునకు కాని, మూల పదమునకు కాని దూరము కాకుండ, ప్రత్యభీజ్ఞానావకాశము గల్గునంత దగ్గరలో సంస్కృత పదములు నిలిచి యుండుట యీ పరిస్ధితికి గల కారణములలో నొకటి. ఇతర భాషలలో పదములకు సరియైన వ్యుత్పత్తులు లభించుటే కష్టము; లభించినను అవి భాషా ప్రాజ్ఞులకో, విశేష పరిశోధన గావించిన వారికో మాత్రమే లభించును. అజ్ఞాత వ్యుత్పత్తికములు సంస్కృతములో ఉన్నంత తక్కువగా మరి యెందును లేవు.

ప్రపంచములో ఏ భాషలోని పదములకైనను వ్యుత్పత్తికావలసినచో సాధారణముగా ఇతర భాషలలోనికి పోయి వెదుకవలసి యుండును. ఒక ఇంగ్లీషు పదమునకు వ్యుత్పత్తి కావలసినచో కెల్టిక్, ట్యుటానిక్, హైజర్మన్, లోజర్మన్, లాటిన్, గ్రీక్ మున్నగువానిలో అది లభించును; అట్లే యితర భాషాపదములకును, ఈ మూలభాష లనుకొనబడుచున్నవాని పదములకు వ్యుత్పత్తి కావలసినచోకూడ మరొక భాషలో నన్వేషణము చేయవలసియుండును. గ్రీకులోని పదములకు కూడా అనేకములకు సంస్కృతములో వ్యుత్పత్తి లభించును. ఒక్క సంస్కృతములోని పదములకు మాత్రము వ్యుత్పత్తి అన్య భాషల కేగనక్కరలేకుండ ఆభాషలోనే లభించును. సంస్కృతముయొక్క సర్వ ప్రాచీనతకును స్వతంత్రతకును ఇది ప్రబల నిదర్శనము.

అర్ధముకానివారికి కూడా శ్రవణ సుఖమును గల్గించు భాష సంస్కృతము. సంస్కృత శ్లోకములను విని యానందింపని వాడుండడు. నేటి భాషలలో కాని, గ్రీకు, లాటినులలోగాని సంస్కృత వృత్తములంత మధురములైన వృత్తములు లేవు. Most musical metres – మధురతమ వృత్తములు - ఆని ఎ. ఎ. మాక్డొనెల్ సంస్కృత వృత్తములను వర్ణించి యున్నాడు. భగవద్గీతాది గ్రంథములలోని అనుష్టుప్ శ్లోకములు, మందాక్రాంత, వియోగిని, ద్రుతవిలంబితము, మాలిని మున్నగు వృత్తములు మధురాతి మధురములై సర్వ మనోరంజక శక్తిగలవై యొప్పుచున్నవి.

సంస్కృత పండితులు సరస సాహిత్య సల్లాపములను గావింపునపుడు కాని, వేదాంతగోష్ఠిని నెరపునపుడు కాని, పురాణ ప్రవచనము సలుపునపుడు కాని వినునట్టి నవీన విద్యానాగరికతా సంపన్ను లెల్లరును తద్భాషా సౌందర్యము నకును, విషయ మహత్త్వ మాధుర్యములకును ముగ్ధులగుటను గాంచుచున్నాము. ఆధునిక సభ్యతలో నెంత ఉన్నతస్థతిలో నున్న వారును ఈ భాషాను వాఙ్మయమును నేర్చియుండినచో తమ జన్మ ధన్యమయ్యెడిదని భావించుట సర్వత్ర కాంచనగును. సంస్కృతమునకు గల అద్వితీయ మాధుర్య మహత్త్వముల కిది ప్రబల నిదర్శనము.

ఇట్టి సర్వతోముఖ సౌరభ సౌభాగ్యములు గల్గిన సంస్కృతభాష భారత భాగ్యరాశిలో అమూల్యరత్న మగుటయేకాక భారతీయులకు భారతీయతను నిలబెట్టగల్గిన సర్వప్రముఖ సాధనమై యలరారుచున్నది.

సంస్కృతము ఆర్యుల అధికారిక భాష. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల్లో మెపోపటేమియా, పర్షియా దేశాలనుండి వచ్చిన ఆర్యులు ఉత్తర భారతదేశంలో స్థిరపడిన తర్వాత చతుర్వేదాలు వ్రాసుకొన్నారని చరిత్రకారుల భావన.

ప్రాచీన జ్ఞాన సంపదయైన వేదాలు, ఇతిహాసాలైన రామాయణం, మహాభారతం, ఉపనిషత్తులు, మను స్మృతి, వాస్తు శాస్త్రం, అర్థ శాస్త్రం మొదలైనవన్నీ సంస్కృతంలో వ్రాయబడినవే. మధ్య యుగాల్లో తెలుగు కవులు సంస్కృత సాహిత్య పుస్తకాలను తెలుగు భాషలోకి అనువదించినప్పుడు ఎన్నో సంస్కత పదాలు తెలుగు భాషలో చేరాయి. అలాగే ఇతర ద్రావిడ భాషలపై సంస్కృత భాష ప్రభావము ఎంతైనా ఉంది. తెలుగు భాషలో కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం, మేఘదూతం, శూద్రకుడు రచించిన మృచ్చకటికము, భాసుడు రచించిన స్వప్న వాసవదత్తము, శ్రీహర్షుడు వ్రాసిన రత్నావళి, వాత్సాయనుడు వ్రాసిన కామసూత్రములు మొదలైనవి ప్రసిద్ధి చెందిన అనువాద గ్రంథాలు.




#Article 150: కుతుబ్ షాహీ వంశము (219 words)


కుతుబ్ షాహీ వంశము (ఈ వంశస్థులను కుతుబ్ షాహీలు అంటారు) దక్షిణ భారతదేశము లోని గోల్కొండ రాజ్యము యొక్క పాలక వంశము. ఈ వంశస్థులు తుర్కమేనిస్తాన్-ఆర్మేనియా ప్రాంతములోని తుర్కమేన్ తెగకు చెందిన షియా ముస్లింలు.

కుతుబ్ షాహీ వంశ స్థాపకుడు సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్,  16వ శతాబ్దము ప్రారంభములో కొందరు బంధువులు, స్నేహితులతో కలసి ఢిల్లీకి వలస వచ్చాడు. తరువాత దక్షిణాన దక్కన్ పీఠభూమికి వచ్చి బహుమనీ సుల్తాన్ మహమ్మద్ షా కొలువులో పనిచేసాడు. అతడు గోల్కొండను జయించి హైదరాబాద్ రాజ్యానికి అధిపతి అయ్యెను. 1518లో బహుమనీ సామ్రాజ్యము పతనమై ఐదు దక్కన్ సల్తనత్ ఆవిర్భవించుచున్న సమయములో బహుమనీ సుల్తానుల నుండి స్వతంత్రము ప్రకటించుకొని, కుతుబ్ షా అనే పట్టము స్వీకరించి గోల్కొండ కుతుబ్ షాహీ వంశమును స్థాపించాడు.

ఈ వంశము తెలుగు వారిని పరిపాలించిన తొలి ముస్లిం వంశము. ఇది అంధ్ర దేశమును ముస్లింలు పరిపాలి‌చిన (తెలంగాణ ప్రాంతము), హిందూ పరిపాలనలో ఉన్న ఇతర ప్రాంతములుగా విభజించింది. ఈ వంశము 1687లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు యొక్క సైన్యాలు దక్కన్ని జయించేవరకు, 171 సంవత్సరాలు గోల్కొండను పరిపాలించింది. ఆ తరువాత 1948లో హైదరాబాదు రాజ్యము, న్యూఢిల్లీ యొక్క సైనిక జోక్యం (పోలీసు చర్య) తో భారత దేశములో విలీనము అయ్యేవరకు ముస్లింల పరిపాలనలోనే ఉంది.

కుతుబ్ షాహీ పాలకులు గొప్ప కళా, శాస్త్ర పోషకులు. వీరు పర్షియన్ సంస్కృతిని పోషించడమే కాకుండా, ప్రాంతీయ దక్కన్ సంస్కృతికి చిహ్నమైన తెలుగు భాష, కొత్తగా అభివృద్ధి చెందిన ఉర్దూ (దక్కనీ) ను కూడా పోషించారు. తెలుగు ప్రాంతమైన తెలంగాణ గోల్కొండ రాజ్యములో ఒక ప్రముఖ భాగమైనందున, వాళ్ల మాతృ భాష కాకపోయినా, గోల్కొండ పాలకులు తెలుగు భాష అభ్యసించారు. గోల్కొండ, ఆ తరువాత హైదరాబాదు రాజ్యమునకు రాజధానులుగా ఉండేవి, ఉభయ నగరములును కుతుబ్ షాహీ సుల్తానులే అభివృద్ధి చేశారు.

ఈ వంశము యొక్క ఎనిమిది రాజులు క్రమముగా:

ఇతాని రాజ్య విస్తరణకు కారకులయిన సేనాధిపతులు 1. హై ధర్ ఉల్ముల్క్ 2. మురారీరావ్ .మురారి రావ్ అహోభిలమ్ దేవాలయం పై దండెత్తాడు




#Article 151: మూసీ నది (282 words)


మూసీ నది కృష్ణా నది యొక్క ఉపనది. తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాదు నగరం మధ్యనుండి ప్రవహిస్తూ చారిత్రక పాత నగరాన్ని, కొత్త ప్రాంతం నుండి వేరుచేస్తూ ఉంటుంది. పూర్వము ఈ నదిని ముచుకుందా నది అని పిలిచేవారు. హైదరాబాదు యొక్క త్రాగునీటి అవసరాలను తీర్చటానికి మూసీ యొక్క ఉపనదిపై హుస్సేన్ సాగర్ సరస్సు నిర్మించబడింది.

మూసీనది హైదరాబాదు నగరానికి 90 కిలోమీటర్లు పశ్చిమాన రంగారెడ్డి జిల్లా, వికారాబాదు వద్ద అనంతగిరి కొండల్లో పుట్టి నల్గొండ జిల్లా, వాడపల్లి (వజీరాబాద్) వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. 2,168 అడుగుల ఎత్తులో పుట్టి తూర్పు దిశగా ప్రవహించి హైదరాబాదు గుండా ప్రవహిస్తుంది. నగరాన్ని దాటిన తర్వాత మూసీలో చిన్నమూసీ నది, అలేరు నదులు కలుపుకొని దక్షిణపు దిశగా మలుపు తిరుగుతుంది. మూసీలో ఆలేరు కలిసేచోట సూర్యాపేట వద్ద 1963లో పెద్ద జలాశయాన్ని నిర్మించారు. ఆ తరువాత పాలేరు నదిని కలుపుకొని వజీరాబాదు వద్ద కృష్ణానదిలో కలిసేటప్పటికి 200 అడుగుల ఎత్తుకు దిగుతుంది. మూసీ నది యొక్క బేసిన్ వైశాల్యము 4,329 చదరపు మైళ్ళు. ఇది మొత్తం కృష్ణానది యొక్క బేసిన్ వైశాల్యములో 4.35% సాధారణంగా చిన్న వాగులాగా ప్రవహించే ఈ నది వరదలు వచ్చినప్పుడు బీభత్సము, అత్యంత జననష్టము కలిగించిన చరిత్ర ఉంది.

మూసీ నదిపై హైదరాబాదు నగరంలో దాదాపు ఏడు వంతెనలు ఉన్నాయి. వీటిలో పురానా పుల్ (పాత వంతెన) అత్యంత పురాతనమైనది. గోల్కొండను పాలించిన కుతుబ్ షాహీ వంశస్తుడైన ఇబ్రహీం కుతుబ్ షా 1578 లో నిర్మించాడు. ఈ వంతెన ఇప్పటికీ వాడుకలో ఉంది. నయా పుల్ (కొత్త వంతెన) వంతెన హైకోర్టు సమీపములో అఫ్జల్ గంజ్ వద్ద ఉంది. ఇవికాక ఇతర వంతెనలు డబీర్‌పూరా, చాదర్‌ఘాట్, అంబర్‌పేట, నాగోల్, ఉప్పల్ కలాన్ వద్ద ఉన్నాయి. విజయవాడ వెళ్ళే జాతీయ రహదారి 7, వరంగల్ వెళ్ళే జాతీయ రహదారి 202 ఈ నది యొక్క ఉత్తర, దక్షిణపు ఒడ్డుల వెంట సాగుతాయి.

నగారాభివృద్ధికి ప్రణాళికను తయారుచెయ్యటానికి నియమించబడిన సాంకేతిక నిపుణుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, వరదల పునరుక్తిని నివారించడానికి, నగరంలో మౌలిక పౌర సౌకర్యాలను మెరుగుపరడానికి కొన్ని సూచనలు చేస్తూ 1909, అక్టోబరు 1న తన నివేదిక సమర్పించాడు. ఏడవ నిజాం 1912లో ఒక నగరాభివృద్ధి ట్రస్టును ప్రారంభించాడు. వరదలను నివారించేందుకు ఒక వరద నివారణ వ్యవస్థను కట్టించాడు. 1920లో మూసీ నదిపై ఒక నగరానికి పది మైళ్ళ ఎగువన ఉస్మాన్ సాగర్ ఆనకట్టను కట్టించారు. 1927లో మూసీ ఉపనదైన ఈసీ నదిపై హిమాయత్ సాగర్ అనే మరో జలాశయము నిర్మించారు. ఈ రెండు జలాశయాలు మూసీ నదికి వరదలు రాకుండా నివారించడముతో పాటు హైదరాబాదు నగరానికి ప్రధాన మంచినీటి వనరులుగా ఉపయోగపడుతున్నాయి.




#Article 152: గోల్కొండ (1481 words)


గోల్కొండ కోట, నగరం. తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాదు నగరంనకు 11 కి.మీ. దూరములో ఉంది. గోల్కొండ నగరం, కోట మొత్తం ఒక 120 మీ. ఎత్తయిన నల్లరాతి కొండమీద కట్టారు. కోట రక్షణార్ధం దాని చుట్టూ పెద్ద బురుజు కూడా నిర్మించారు. 1083 A. D. నుండి 1323 A. D. వరకు కాకతీయులు గోల్కొండను పాలిస్తూ ఉండేవారు.g 1336 A. D.లో ముసునూరి కమ్మ నాయకులు మహమ్మద్ బీన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను తిరిగి సాధించారు. 1364 A. D.లో కమ్మ మహారాజు ముసునూరి కాపయ నాయకుడు గోల్కొండను సంధిలో భాగముగా బహమనీ సుల్తాను మహమ్మదు షా వశము చేశాడు. ఇది బహుమనీ సామ్రాజ్యములో రాజధానిగా (1365-1512) ఉన్నది, కానీ 1512 A. D. తరువాత ముస్లిము సుల్తానుల రాజ్యములో రాజధానిగా చేయబడింది.

గోల్కొండ నాలుగు వేర్వేరు కోటల సముదాయం, ఒకదానిని చుట్టి మరొకటి నిర్మించబడ్డాయి. కోటను పెంచుటలో, పటిష్ఠపరుచటలో కుతుబ్‌షాహిలదే ప్రధాన పాత్ర. మొదటి నిజాం వశమైన కాలంలో కోట వెలుపలి భాగాన తూర్పు దిక్కున ఒక గుట్ట ఉండేది. దానిని శత్రువు ఆక్రమిస్తే తరలించుట కష్టమని భావించిన నిజాం గుట్టను కోటలోపలికి కలుపుతూ చుట్టూ గోడను నిర్మించాడు. దుర్గం చుట్టూ గుట్టలు పెట్టని కోటలవలె ఉన్నాయి. ఈ కోట 87 అర్ధ చంద్రాకారపు బురుజులతోకూడిన 10 కి.మీ. పొడవు గోడను కలిగి ఉంది; కొన్ని బురుజులలో ఇంకా ఫిరంగులను నిలిపిఉంచారు. ఇంకా 8 సింహద్వారములు, 4 ఎత్తగలిగే వంతెనలు (draw bridge), బోలెడన్ని రాచమందిరాలు, మసీదులు, గుళ్ళు, అశ్వశాలలు మొదలగునవి చాలా ఉండేవి. సింహద్వారములలో అన్నిటికంటే కిందది, అన్నిటికంటే బయట ఉండే ఫతే దర్వాజా (విజయ ద్వారము) నుండే మనము గోల్కొండ కోటను చూడటానికి వెళ్తాము. ఔరంగజేబు విజయము తరువాత ఈ ద్వారము గుండానే తన సైన్యమును నడిపించాడు. ఏనుగుల రాకను ఆడ్డుకోవటానికి ఆగ్నేయము వైపున పెద్ద పెద్ద ఇనుప సువ్వలు ఏర్పాటు చేసారు. ఫతే దర్వాజా నిర్మించటానికి ధ్వనిశాస్త్రమును ఔపోసన పట్టినట్లున్నారు. గుమ్మటం కింద ఒక నిర్ణీత ప్రదేశమునందు చప్పట్లు కొడితే కిలోమీటరు ఆవల గోల్కొండలో అతి ఎత్తయిన ప్రదేశములో ఉన్న బాలా హిస్సారు వద్ద చాలా స్పస్టముగా వినిపిస్తుంది. ఈ విశేషమును ఒకప్పుడు ఇక్కడి నిర్వాసితులు ప్రమాదసంకేతములు తెలుపుటకు ఉపయోగించేవారు. ఇప్పుడు మాత్రం సందర్శకులకు వినోదం పంచేదిగా మిగిలిపోయింది.

ఇది మూడు అంతస్తులలో నిర్మించబడిన రాజుగారి సభా మండపము. దీని నుండి గోషామహల్‌ బారాదరి హైదరాబాదు భూమార్గము కూడా ఉంది. దీని పై అంతస్తులో రాజ సింహాసనము ఉంది. దీని నుండి 30 మైళ్ళ విస్తీర్ణములో అతి సుందరము, శోభాయమానముగా కన్పిస్తుంది. ఇది సముద్ర మట్టమునకు 400 అడుగుల నుండి 2000 అడుగులుంటుంది. దీని నుండి తూర్పుగా కుతుబ్‌షా వంశపు శిథిలమైన భవనములు, లంగర్‌హౌజ్‌ చెరువు, హైదరాబాద్‌ నగరంన ముఖ్య కట్టడమైన చార్‌మినార్‌, మక్కా మసీదు, ఉస్మానియా వైద్యశాల చూడొచ్చు. తూర్పు-దక్షిణ మూలగా మీర్‌ ఆలమ్‌ చెరువు, ఫలక్‌నుమా భవనము, దక్షిణముగా మకై దర్వాజా, హిమయత్‌నగర్‌, దీనికి దక్షిణమున పడమర మూలగా తారామతి, ప్రేమామతి భవనములు, ఉస్మాన్‌ సాగర్‌ చెరువు (గండిపేట) పడమరగా ఉన్నాయి. తూర్పు - ఉత్తర మూలగా హుసేన్‌ సాగర్‌ చెరువు, సికింద్రాబాదు నగరం, ఉస్మానియా యూనివర్సిటీని చూడవచ్చు. ఉత్తర-పడమర మూలగా కుతుబ్‌షా రాజుల గోపురములు పెట్లాబురుజు చూడొచ్చు. ఉత్తరముగా గోల్కొండ కోట పట్టణం, హకీం పేట, బేగంపేట విమానాశ్రయాన్ని చూడొచ్చు.

కోటకు మొత్తం తొమ్మిది (తలుపులు) ద్వారాలున్నాయి. ఫతే దర్వాజ, మోతి దర్వాజ, కొత్తకోట దర్వాజ, జమాలి దర్వాజ, బంజారి దర్వాజ, పటాంచెరు దర్వాజ, మక్కా దర్వాజ డబుల్‌, బొదిలి దర్వాజ, బహిమని దర్వాజా. వీటిలో 1,2,3,4,5,7 ప్రయాణీకుల సౌకర్యార్థము తెరచి వుంటాయి. మిగిలిన వాటిని మూసివేశారు.
సమయములలో శత్రువుల పోకడలను గమనించుటకు వీలుగా బాలాహిసార్‌ ద్వారముల కెదురుగా నిర్మింపబడిన తెరవంటి గోడ. బాలాహిసార్‌ గేటుకు వెలుపలి భాగములో ఒక రంధ్రము ఉంటుంది. యుద్ధ సమయములో శత్రువు గేటు ద్వారా ఏనుగులతో తోయించే సమయంలో దీని నుండి కాగుతున్న నూనెను కాని, కరిగిన లోహమునుకాని పోసేవారు.వైబ్రేషన్‌: బాలాహిసార్‌ గేటు మధ్యభాగంలో మెట్లకు ఎదురుగా నిల్చొని చప్పట్లు కొడితే... తిరిగి బాలాహిసార్‌ ఎత్తయిన భాగము నుండి మారుమోగుతుంది.

ఇది నూనె దాచి ఉంచే కట్టడం. ఇది 30 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు, 10 అడుగుల లోతున ఒకే రాతితో మలచబడింది. దీనిలో 12,000 గ్యాలన్ల నూనె నిల్వచేసి, సప్లయి చేసేవారు

ఇది 15 మైళ్ళ విస్తీర్ణముతో కొండల మీద నిర్మించపబడింది. ఇక్కడ చాలా కట్టడములున్నాయి. వాటిలో కుతుబ్‌షా భవనములు, దర్బార్‌ ఎ-ఆల్‌ అనే జనరల్‌ శాసనసభ హాల్‌ (విధాన సభ), దర్బార్‌ -ఎ-ఖాన్‌ అనే ముఖ్యమైన విధాన మండపములున్నాయి. ఇంకా నూతులు, మందుగుండు సామాను దాచి ఉంచు గది, ఆయుధ కర్మాగారం, మసీదులు, దేవాలయాలు, భక్త రామదాసును బంధించిన జైలు, నీటి రిజర్వాయరు, పెద్ద తోట, స్నాన గదులు, తుపాకులు, మందు గుండు సామాను దాచి ఉంచు గది, కుడివైపు దర్బార్‌-ఎ-ఆమ్‌ అనే శాసనసభ హాలుకు పోవుటకు మార్గము... ఎడమవైపు రాజభవనము నిర్మింపబడింది.

ఈ కోటకు మొత్తం 87 బురుజులున్నాయి. వీటిలో పెట్లా బురుజు, మూసా బురుజు,మజ్ను బురుజు ప్రసిద్ధి గాంచినవి. పెట్లా బురుజు కోటకు ఉత్తర పడమర మూలగా వుంటుంది. దీని మీద అలంగిరీ జయమునుకు గుర్తుగా ఫిరంగి అమర్చబడి ఉంది. ఇది 16 అడుగులు పొడవు ఉంటుంది. ఒక మణుగు (165 పౌండ్ల బరువు గల) ఫిరంగి గుళ్ళు ఉంచే వీలుంది. ఇది చూడ్డానికి చాలా అందంగా వుంటుంది. కోటకు దక్షిణముగా మూసా బురుజు ఉంది. 1666 సంవత్సరములో (1977 హిజ్రి) కమాండర్‌ మూసా ఖాన్‌ ఆధిపత్యములో ధర్మాచారి అనే మేస్త్రీ దీన్ని నిర్మించాడు. దీని మీదుగా మీరాన్‌ అను ప్రసిద్ధిగాంచిన సైన్యాధిపతి హతుడౌతాడు. అతని స్థానంలోమూసా ఖాన్‌ నియమితుడవుతాడు. బురుజు మీద ఫిరంగి అమర్చి వుంటుంది. ఇది కూడా పెట్లా బురుజు ఫిరంగి మాదిరిగా దాడిచేయడానికి వీలుగా ఉంటుంది.

బాలాహిసార్‌ గేటు నుండి లోనికి ప్రవేశించేటపుడు కుడి చేతి వైపు ఈ స్నానముల గది ఉంది. కొంచెము నగీనా తోటకు కుడి చేతి వైపు పక్కన వేడి నీళ్ళు... చన్నీళ్ళు వచ్చేలా నేల మార్గమున గొట్టములను అమర్చి కట్టినది. ఈ కుళాయిలను చెరువు నుండి నింపేవారు. ఈ నీటిని అతి ముఖ్యమైన సందర్భములలో ఉపయోగించేవారు. ఎవరయినా రాజ వంశస్తులు దివంగతులైనపుడు ఇక్కడ వేడి నీటితో స్నానము చేయించి శవపేటికను ఉత్తరపు ద్వారము నుండి బయటకు తీసుకెళ్లేవారు.

కుతుబ్‌షాహీలు స్నానం చేసేందుకు ప్రత్యేక ఏర్పాటు ఇది కోటలోని 'బాలాహిసార్‌' కు ఉత్తర దిశగా నిర్మితమై ఉంది. ఇది 200 గజముల పొడవు, అదే వెడల్పులో, 5 గజముల లోతుగా నిర్మించిన నీటిని నిలువచేసే స్థలం. దీనిని ఒక చెరువు నుండి వచ్చే నీటితో నింపేవారు. దీనికి పడమర దిశలో ఉన్న గేటు దగ్గర శబ్దం చేస్తే అది అన్ని వైపులకు ప్రతిధ్వనిస్తుంది. ఈ నీటి హౌస్‌ను రాజులు, మరి కొందరు ప్రముఖులు వినోద స్థలముగా ఉపయోగించేవారు.

తోటకు దక్షిణముగా ఆర్కులలో రాజకుమారులు, రాజకుమార్తెలు ఊగేందుకు ఊయలలు అమర్చబడి ఉన్నాయి. ఇప్పటికీ వాటి గుర్తుగా ఆర్కులోని రాళ్ళలో రంధ్రములు కన్పిస్తాయి. నగీనా గార్డెన్‌ నుండి వెళ్ళే సన్నని మార్గంలో ఎడమ చేతివైపు ఒక కట్టడము ఉంది. ఇది రక్షకభటుల కోసం నిర్మించిన భవనము. కుతుబ్‌షా వంశపు రాజులలో ఏడవవాడు, ఆఖరివాడు అయిన అబ్దుల్‌ హసన్‌ తానీషా పరిపాలనలో, రక్షక భటులకోసం కట్టబడిన భవన మార్గములోనే ఆయన మంత్రివర్యులైన అక్కన్న మాదన్నల కోసం నిర్మించిన కార్యాలయ భవనం ఉంది.

బాలాహిసార్‌ మెట్లకు కుడిపక్కగా ఒక పెద్ద బావి ఉంది. దీనిని బడీ బౌలి అని పిలిచేవారు. ఈ బావిలో ఒక మూల రాయి ఉంది. అది వేసవి కాలములో నీరు కిందపడడానికి ఉపయోగపడేది. ఈ బావికి దగ్గరలో రెండు వరండాలున్న ఒక భవనముంది. దీనిలో రాజులు కూర్చొని ప్రకృతి సౌందర్యమును తిలకించేవారు.

బడి బౌలికి కొద్ది దూరంలో మెట్లకిందుగా పారే ఒక కాలువ వుండేది. ఇది డ్రగ్‌ చెరువు కోటకు 5 మైళ్ళ దూరంలో ఉంది. కోటలో ఉన్న తోటలకు, చేలకు ఈ కాలువ ద్వారానే నీరును మళ్ళించేవారు, పంటలు పండించేవారు.

అక్కన్న మాదన్న, అబ్దుల్‌ హసన్‌ తానీషా కాలములో కట్టినదీ దుర్గాదేవి లేక మహాకాళి అమ్మవారి మందిరం. ఇక్కడ ప్రతి ఆషాఢ మాసములో బోనాల జాతరలు జరుగుతాయి. జంట నగరాల నుండి అనేక మంది సందర్శకులు వస్తుంటారు.

రోడ్డుకు తూర్పు దిశగా దీని బాల్కనీ ఉంది.. బాల్కనీ ముందు పెద్ద ఖాళీ స్థలము వుంటుంది. ఇక్కడికి ప్రజలు వచ్చి తమ కష్టసుఖాలు చెప్పుకొనేవారు. రాజు ఈ బాల్కానీలోంచి వినేవారు.

అన్ని ముఖద్వారములలోకి బాలా హిస్సారు దర్వాజా చాలా మనోహరమయినది. ఆర్చీల మూల ఖాళీలలో ఉన్న సన్నటి రాతి పలకల మీద కాల్పనిక మృగాలు, సింహపు బొమ్మలు ఈ రక్షణ ద్వారమునకు ప్రత్యేక అలంకారాలు. బాలా హిస్సారు దర్వాజా నుండి కొండపైకి వెళ్ళటానికి 380 ఎగుడు దిగుడు రాతిమెట్లు ఉంటాయి. ఆ మెట్లు అన్నీ ఎక్కిన తరువాత మనకు బాలా హిస్సారు బారాదరీ అని పిలవబడే ఒక మంటపము కనిపించును. దర్బారు హాలుగా ఉపయోగించే ఈ కట్టడములో 12 ఆర్చీలు, 3 అంతస్తులు ఉన్నాయి. దానిని వంపు తిరిగిన గదులుగా దృఢమయిన స్థంబాలతో విభజించారు. ఎత్తులో ఉన్న ఒక గదికి ఆనుకొని ఉన్న మూడు ఆర్చీలద్వారా వెనుక ద్వారము తెరుచుకొనును. ఒక ఎత్తయిన మిద్దెపైన మనకు రాతి సింహాసనము కనిపించును. కొండలలో విసిరేసినట్లున్న ఈ మంటపములో అబుల్ హసన్ లు తమ ఉంపుడుగత్తెలను ఉంచేవారని చాలామంది నమ్మకము. బారాదరీలో మనకు మరో విశిష్టత కనిపిస్తుంది - జంట గోడల మధ్య ఉన్న ఖాళీలు గాలిని పీల్చి, పీడనం పెరిగేటట్లుగా గదిలోనికి వదులుతూ, సహజసిద్ధమయిన కూలరు వలె ఉంటుంది.

హిందూ ఉద్యోగులలో ముఖ్యులయిన అక్కన్న మాదన్నల కార్యాలయములు పైన ఉన్న కుతుబ్ షాహీ దర్బారులో ఉంటాయి. అక్కడ మనము గండశిల నుండి నిర్మించిన కాకతీయుల కాలమునాటి హిందూ దేవాలయమును కూడా చూడవచ్చు. దీనిని మాదన్న దేవాలయముగా సంబోదిస్తారు. అందులో రంగులలో చిత్రించిన కాళీదేవి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ఇంకో ముఖ్య కట్టడము తారామతి నిర్మించిన మసీదు. ఆక్కడి గండశిలల గుండా నడుస్తున్నప్పుడు మనకు బంకమట్టితో తయారుచేసిన గొట్టాలు కనిపిస్తాయి. కొండపైకి నీటి సరఫరా కోసం అప్పటి సమర్ధవంతమయిన ఏర్పాట్లకు ఇవి సాక్ష్యాలు.

ఏటవాలుగా, ఇరుకుగా ఉన్న మెట్లు కింద ఉన్న జనానాకు, రాణీగారి మహలుకు దారితీయును. అక్కడి రాచమందిరాలు, పెద్ద పెద్ద మిట్టలమీద కట్టారు, వాటికి ఎత్తయిన పైకప్పులు ఉన్నాయి, గోడలన్నీ అలంకార వస్తువులతో నింపి పొదరిల్లులు, చూరులు పర్శియను తరహా రూపకల్పనతో ఎంతో అందముగా తీర్చిదిద్దారు. ఆర్చీల మూలలలో సన్నటి పలకలపై నాజూకు ఆకృతులు మరింత శోభను తెచ్చిపెడుతుంది. రాణీ మహలులో ఉండే ఈ విశేష భోహములను చూసి నాటి మొగలులే అసూయచెందేవారు.

దర్బారు హాల నుండి కొండపాదమున ఉండే ఒక రాచమందిరమునకు దారి చూపే రహస్య సొరంగ మార్గము ఉండేదని ఒక అభిప్రాయము. ఇస్లాముమత వాస్తుశాస్త్రము ఆధారముగా నిర్మించిన కుతుబ్ షాహీ నవాబుల సమాధులు గోల్కొండకు ఉత్తర దిక్కులో బయట గోడకు 1 కి.మీ. దూరమున నిర్మించారు. ఈ సమాధుల చుట్టూ వనములు, వాటి మధ్య అందమయిన రాతి శిల్పాలు ఉన్నాయి.

కోట బయట రెండు వెర్వేరు మండపాలను బండరాళ్ళతో నిర్మించారు. వాటిని తారామతి మందిరము, ప్రేమతి మందిరము అని పెలిచేవారు. వీటిలో అక్కాచెళ్ళెలయిన తారామతి, ప్రేమతి నివసించేవారు. వారు రెండంతస్తుల పైన ఒక వృత్తాకారపు వేధికపై తమ ప్రధర్శనలు ఇచ్చేవారు. దానిని కళామందిరమని పిలిచేవారు. దానిని గోల్కొండ కోట పైన ఉన్న రాజుగారి దర్బారునుండి తిలకించవచ్చును.

కోట ప్రవేశద్వారం వద్ద చప్పట్లు కొడితే కోట పైభాగానికి వినిపిస్తుంది. కోటలోకి ప్రవేశించే ప్రతి సందర్శకుడు ఇలా ఒకసారి చప్పట్లు కొట్టి ఆ అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. ఆ అనుభూతిని పదిలంగా గుండెల్లో దాచుకొని వెళతారు. ఈ ఇంద్రజాలం ఇవాళ ఒక సరదా. ఆనాడు శత్రువు రాక గురించి హెచ్చరించే వ్యూహం.ఇంకా అనేకానేక భద్రతా చర్యల్లో భాగం. కోటలోని ప్రతి మలుపు, ప్రతి ప్రాకారం విస్మయం గొలిపే దృశ్యం.నాటి రాజుల ఆయుధాగారాలు, ధాన్యశాలలు, స్నాన శాలలు, వంటశాలలు మొదలుకొని ఆశ్వశాలలు, నూనె నిల్వ చేసే గది ఉన్నాయి. ఆరోజుల్లోనే (క్రీశ1518) వేడినీటి శాలలు, చప్పట్లు కొడితే అల్లంత దూరాన వినిపించే సౌకర్యం వంటివి ఆశ్చర్యచకితులను చేస్తాయి.

కోటలోని రాజభవనాలు, శయన మందిరాలు, స్నానవాటికలు, రాజ ప్రముఖుల భౌతికకాయాలకు చివరిస్నానం చేయించే స్నాన మందిరాలు, తోటలలకు, ఫౌంటెన్లకు రాళ్ళతో నిర్మించిన ఆక్వడెట్లు, రామదాసు బందీఖానా, మసీదులు, మందుగుండును నిల్వచేసే స్టోర్‌ రూములు, సైనికుల నివాసాలు, మంత్రుల కార్యాలయాలు, ఉద్యానవనాలు, హబ్సికమాన్లు, రాజు ఏకాంత మందిరం, తారామతి మసీదు, బారదారి (దర్బారు హాలు) ఇబ్రహీం మసీదు, నయాఖిల్లా వంటివి ఇప్పటికీ సందర్శకుల్ని మరపురాని అనుభూతులకు లోను చేస్తున్నాయి.

దాదాపు ఏడు కిలోమీటర్ల పొడవు కలిగిన అగడ్తలు, మూడు ప్రాకారాలు, మొత్తం ఎనిమిది మహాద్వారాలు, కోట గోడలపై 15 నుంచి 18 మీటర్ల ఎత్తున వున్న దాదాపు 87 బురుజులతో కూడిన గోల్కొండ కోటలో, కోట సమీపంలో వున్న చాలా ప్రాంతాలు అన్యాక్రాంతమై ఉన్నాయి.

గోల్కొండ కోట దక్కన్‌లోనే అతి పెద్ద దుర్గం. ఇంతటి విస్తీర్ణం, వైవిధ్యం, వాస్తు వైభవం వున్న మరో కోట దక్షిణ భారతదేశంలో లేదు. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో నిర్మించిన మహాదుర్గం గోల్కొండ. ఇలాంటి కట్టడాన్ని పున:నిర్మించడం, పున:సృజించడం దుర్లభం.

గొర్రెల కాపరుల గొర్రెలు మేపుకునే ప్రాంతంలో వున్న కొండ కాబట్టి దీనిని మొదట్లో గొల్లకొండ అన్నారన్నది ఒక కథనం. ఇదే కాలక్రమాన గోల్కొండగా ప్రసిద్ధి చెందింది. కాకతీయలు కాలంలో నిర్మించగా 1363 సంవత్సరంలో బహుమనీ సుల్తానుల అధీనంలోకి వచ్చింది. వారి పతనం తర్వాత 1518లో కుతుబ్‌షాల పరమైంది ఈ ప్రాంతం. కుతుబ్‌షాల రాజధానిగా మారిన తర్వాత గోల్కొండ కోటను ఇంకా బాగా పటిష్ఠపరిచారు.

వజ్రాల గనిగా పేరొందిన కోట గోల్కొండ. కుతుబ్‌షాల పాలనలో వుండగా ఔరంగజేబు కోట మీద భీకరమైన దాడి చేశాడు. శత్రు దుర్భేద్యమైన గోల్కొండ కోట దాదాపు ఎనిమిది నెలల యుద్ధం తర్వాత మొగలాయిల అధీనంలోకి వచ్చింది. ఔరంగజేబు యుద్ధానంతరం తిరిగి వెళుతూ మొగలుల దక్కన్‌ ప్రతినిధిగా ఆసఫ్‌జాను నియమించాడు. ఆయన నిజాం ఉల్‌ ముల్క్‌ అనే బిరుదును ధరించి స్వాతంత్య్రం ప్రకటించుకోవడంతో గోల్కొండ కోట నిజాం పాలకుల పరమైంది.




#Article 153: అంతర్జాలము (1858 words)


అంతర్జాలాన్ని ఆంగ్లంలో ఇంటర్నెట్ (Internet) అని అంటారు. అంతర్జాలము అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లను కలిపే ఒక వ్యవస్థ. మరింత వివరంగా చెప్పాలంటే ఇంటర్నెట్ నెట్‌వర్క్ లను కలిపే నెట్‌వర్క్. ఈ వ్యవస్థలో ఉన్న కంప్యూటర్లు ఒకదానితో ఒకటి సంభాషించుకొనేటందుకు ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనే నియమావళిని ఉపయోగిస్తారు.

ఇంటర్నెట్ అంటే ఏమిటో అర్ధం అవటానికి ఒక చిన్న ఉపమానం చెప్పుకోవచ్చు. ఒక పేటలో ఉన్న ఇళ్ళని కలుపుతూ ఒక వీధి ఉంటుంది. ఒక ఇంటి నుండి మరొక ఇంటికి వెళ్ళటానికి ఈ వీధి అవసరం. ఊళ్ళో ఉన్న పేటలన్నిటిని కలుపటానికి అల్లిబిల్లిగా అల్లుకుని ఊరు నిండా పెద్ద రహదారులు (రోడ్లు) ఉంటాయి. ఒక ఊరు నుండి మరొక ఊరికి వెళ్ళటానికి ప్రాంతీయ రహదారులు ఉంటాయి. ఒక దేశం నుండి మరొక దేశం వెళ్ళటానికి సముద్రంలోనూ, ఆకాశంలోనూ 'అంతర్జాతీయ రహదారులు' ఉంటాయి. ఒక మేపులో చూస్తే ఈ చిన్నవీధులు, రహదారులూ అన్ని ఒక జాలరివాడి వలలా కనిపిస్తాయి. ఇదే విధంగా ప్రపంచంలో ఉన్న కంప్యూటర్లు అన్నీ కూడా చిన్న చిన్న ప్రాంతీయ వలల లాగా, పెద్ద పెద్ద అంతర్జాతీయంగా అల్లుకుపోయిన వలల లాగా కనిపిస్తాయి కనుక వీటిని అంతర్జాలం అంటారు.

ఇంటర్నెట్ ద్వారా ఎటువంటి సమాచారాన్ని అయినా క్షణాల్లో సేకరించుకోవచ్చు. ఇంటర్నెట్ కంప్యూటర్లకు సమాచారం చేరవేసే అద్భుతమైన సాధనం. అన్ని కంప్యూటర్లకు అందుబాటులో ఉండే కమ్యూనికేషన్ టెక్నాలజీ
సాధనమే ఇంటర్నెట్. ప్రపంచంలోని అన్నిరకాల నెట్ వర్కులన్నింటి వల్ల కమ్యూనికేషన్ ప్రక్రియలో కోట్లాది మంది వ్యక్తులు అనుసంధానంలో ఉంటారు. 

మెషిన్లు శాటిలైట్లు, సర్వర్లు, కంప్యూటర్లు ఒకదానితో మరొక్కటి అనుసంధానించిన అసంఖ్యాకమైన స్టాప్‌వేర్ ప్రొగ్రాంలు ప్రపంచ వ్యాప్తంగా ఆయా కంప్యూటర్లలో నిక్షిప్తమై ఉన్న బహ్మండమైన నెట్‌వర్క్.. ఇవన్నీ ఇంటర్నెట్‌లో భాగాలే. ప్రతిరోజూ కోట్లాది మంది సమాచారాన్ని తీసుకునే ఆధునాతనమైన కమ్యూనికేషన్ మీడియా ఇంటర్నెట్. వ్యక్తులు, సంస్థలు ప్రభుత్వ పరిపాలనా దాకా ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలో మన దశ, దిశ గురించి తెలుసుకోవచ్చు. 

ఇంటర్నెట్ మాతృకను అమెరికాకు చెందిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్ నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. 1973లో ఇంగ్లాండు-నార్వే మధ్య ప్రపంచ మొట్టమొదటి కమర్షియల్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ప్రారంభమైంది. 1982లో ఇంటర్నెట్ ప్రోటోకాల్ అన్నమాట వాడ కం ప్రారంభమైంది. ప్రతి నిమిషం ఇంటర్నెట్ ద్వారా వేలకోట్ల రూపాయల వ్యాపా ర లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రపంచంలో ఏ రంగానికైనా కావలసిన సమాచారం ఇంటర్నెట్‌లో అవలీలగా లభ్యమవుతుంది. 

ప్రపంచ వ్యాప్తంగా వేలాది టీవీ చానళ్లు, వార్తాపత్రికలు అలాగే విద్యార్థుల చదువులు, ఫలితాలు, కౌన్సిలింగ్, రైతులు, మీ సేవా వంటి సేవలు ఇట్లా ఏ రంగాన్ని నెట్‌తో సంబంధం లేకుండా ఊహించుకోలేము.

ఇంటర్నెట్ చరిత్ర చాల పెద్దది. అమెరికా భద్రతా విభాగమయిన ఎడ్వాన్సెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ ఆర్పా(ARPA) వారి నిధులతో సృష్టించబడింది.

చాలా మందికి ఇంటర్నెట్ కి వరల్డ్ వైడ్ వెబ్ కి మధ్య ఉన్న తేడా తెలియదు. ఈ రెండింటిని ప్రత్యామ్నాయ పదబంధాలుగా వాడెస్తూ ఉంటారు. అలా చెయ్యడం వల్ల కొంప ములిగిపోయే నష్టం ఏమీ లేదు కాని ఈ రెండింటికి మధ్య తేడా ఉండడం ఉంది.

పీ.సీ లకు మొబైల్ ఫోన్ లకు ఇంటర్నెట్ వేగం రకరకలా విధాలుగా 100 యంబీపీయస్ నుండి శక్తివంతమైన 4జీ (జెనరేషన్),
కొన్ని ఏరియాల్లో 5జీ (జెనరేషన్) ఇప్పటి వరకు అందుబాటులో ఉన్నది.

మే 2019 లో ఆస్ట్రేలియా 'అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ వేగాన్ని నమోదు చేసింది' సెకనుకు 44.2 టెరాబిట్లు (టిబిపిఎస్).

ఇంటర్నెట్ కనెక్టివిటీతో మొట్టమొదటి ఫోన్ నోకియా 9000 కమ్యూనికేటర్ 1996లో ఫిన్లాండ్‌లో విడుదలైంది. ఇంటర్నెట్ ఆధారిత మొబైల్ ఫోన్ ఆలోచన ఈ నమూనా నుండి ధరలు పడిపోయే వరకు జనాదరణ పొందలేదు, ఫోన్‌లలో ఇంటర్నెట్‌ను అనుమతించడానికి నెట్‌వర్క్ ప్రొవైడర్‌లు సిస్టమ్‌లు, సేవల అభివృద్ధిని ప్రారంభించారు.

అంతర్జాలం అంటే ఏమిటో చిన్న ఉదాహరణతో చెప్పడం తేలిక. మన దేశంలో దేశవ్యాప్తంగా ఉన్న ఊళ్లని ఎన్నింటినో కలుపుతూ రైలు మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలన్నీ గుర్తించిన దేశపటాన్ని చూస్తే అంతా గజిబిజిగా అల్లిక అల్లిన గుడ్డలా గీతలు కనిపిస్తాయి. దీనిని మనం ఇంగ్లీషులో అయితే “రైల్వే నెట్‌వర్క్” (railway network) అంటాం. తెలుగులో కావలిస్తే “వలలా అల్లుకుపోయిన రైలు మార్గాలు” అని అనవచ్చు, లేదా టూకీగా “రైలు మార్గాల వలయం” అనో మరీ టూకిగా “రైలు వలయం” అనో అనొచ్చు.

ఇప్పుడు ఒక్క సారి చరిత్రలో వెనక్కి వెళదాం. మనకి స్వతంత్రం రాక పూర్వం దేశంలో ఉన్న రైలు మార్గాలని బ్రిటిష్ ప్రభుత్వం నడిపేది కాదు; ప్రెవేటు రంగంలో కంపెనీలు నడిపేవి. మద్రాస్ సదరన్ మరాటా రైల్వే వారి మార్గం ఒకటి మద్రాసు నుండి వాల్తేరు వరకు వెళ్లేది. ఇలాంటి మార్గాలు ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నిటిని కలిపి ఎం. ఎస్ .ఎం. రైలు వలయం (MSM rail network) అనేవారు. బెంగాల్ నాగపూర్ రైల్వే వారి మార్గం ఒకటి వాల్తేరు నుండి హౌరా వరకు వెళ్లేది. ఇలాంటి మార్గాలు వారికీ చాలా ఉండేవి. వీటన్నిటిని కలిపి బి. ఎన్. ఆర్. రైలు వలయం (BNR rail network) అనేవారు. ఇలాగే “నైజాం రైలు వలయం,” “మైసూర్ రైలు వలయం” వగైరాలు ఉండేవి. ఇవన్నీ వేర్వేరు రైలు వలయాలు. అయినప్పటికీ ఒకరి రైలు బళ్లు మరొకరి పట్టాల మీద ఇబ్బంది లేకుండా నడిచేవి. ఈ రకం ఏర్పాటుని “అంతర్‌వలయం” అనొచ్చు (అంతర్‌జాతీయం లా). అనేక దేశాల ఉమ్మడి సంస్థలకి పేర్లు పెట్టవలసి వచ్చినప్పుడు ఇంగ్లీషులో “ఇంటర్” (inter) అనే విశేషణం వాడతాం. అదే విధంగా అనేక వలయాలని ఉమ్మడిగా ఉపయోగించినప్పుడు ఆ ఉమ్మడి వలయాన్ని “ఇంటర్‌నెట్” అనొచ్చు; లేదా తెలుగులో “అంతర్‌వలయం” అనో “ఉమ్మడి వలయం” అనో పిలవచ్చు. చేపలని పట్టే వలని జాలం అనిన్నీ, పట్టేవాడిని జాలరి అనీ అన్నట్లే, పైన చెప్పిన రైలు మార్గాల అమరికని అంతర్జాలం అనిన్నీ ఈ అంతర్‌జాలాన్ని వాడే వారిని అంతర్‌జాలరులు అనిన్నీ కూడా అనొచ్చు.

మా ఊరు రైలు స్టేషన్ లో “సామానులని నిల్వ చేసే గిడ్డంగి” (గొడౌను) ఉంది. దీనినే గోదాం అని కాని, మండీ అని కాని అంటారు. మా ఉరుపాటి ఊళ్లన్నిటిలోను ఇలాటి గిడ్డంగులు ఉంటాయి. మా ఊరు నుండి ఎగుమతి చేసే ఖద్దరు బట్టలు, బెల్లం, చింతపండు, అడ్డాకులు, తమలపాకులు, మామిడి పళ్లు, వగైరాలు ఈ గిడ్డంగిలో ఉన్న గదులలో పేర్చేవారు - బండి వచ్చి బరువులు ఎక్కించుకుని మోసుకుపోయేవరకు. ఇలా ప్రతి ఊళ్లోను ఎగుమతులు, దిగుమతులు చెయ్యవలసిన సరకులని దాచడానికి గిడ్డంగి గదులు ఉంటాయి కదా. ఇలా ప్రపంచ వ్యాప్తంగా అల్లుకుపోయిన గిడ్డంగులని “విశ్వ వ్యాప్త గిడ్డంగుల అల్లిక” అందాం. దీనినే ఇంగ్లీషులో అంటే “వరల్డ్ వైడ్ వెబ్” (World Wide Web) అవుతుంది. ఇక్కడ “వెబ్” అన్న పదం “స్పైడర్ వెబ్” (spider web) లాంటి ప్రయోగం కనుకనున్నూ, “స్పైడర్ వెబ్”ని  తెలుగులో “సాలె గూడు” అని కాని, “సాలె పట్టు” అని కాని అంటాము కనుకనున్నూ, “వరల్డ్ వైడ్ వెబ్” (world wide web లేదా WWW) ని “ప్రపంచ పరివ్యాప్తమైన పట్టు” లేదా “పపప” అనొచ్చు.

రైలు పట్టాలు లేకుండా కేవలం గిడ్డంగులు, ఆ గిడ్డంగులలో సామానులు ఉండి మాత్రం ఏమి లాభం? అలాగే రైలు మార్గాలు ఉండి, వాటి మీద రవాణా చెయ్యడానికి సరుకులు లేకపోతే ఏమి ప్రయోజనం? కనుక రైలు మార్గం లాంటి ఇంటర్‌నెట్టూ, అల్లుకుపోయిన గిడ్డంగులు లాంటి వర్లడ్ వైడ్ వెబ్బూ, రెండూ ఉంటేనే ప్రయోజనం. ఇంటర్‌నెట్ రవాణాకి కావాలి. వెబ్ సరుకులు దాచుకునేందుకు కావాలి. ఈ ఉపమానం ఇంతటితో సమాప్తం.

ఇప్పుడు రైలు మార్గాలకి బదులు సమాచార ప్రసార మార్గాలు – అంటే టెలిఫోను సౌకర్యాలలాంటివి – చూద్దాం. రైలు మార్గాలలాగే ఈ సమాచార ప్రసార మార్గాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ సమాచార వలయానికి (అంతర్జాలానికి, ఇంటర్‌నెట్‌కి) మన కంప్యూటరుని (మన గిడ్డంగిని లేదా మన వెబ్ పేజిని) తగిలించేమనుకొండి. మనం ఇతరులతో పంచుకోవాలనుకున్న వ్యాసాలు, కథలు, ఛాయాచిత్రాలు, పాటలు, వగైరాలని మన కంప్యూటర్‌లో ఉన్న మన “గిడ్డంగి”లో పెడితే అప్పుడు అవన్నీ ఆ సమాచార వలయంతో లంకించుకున్న వారందరి అందుబాటులోకి వస్తాయి. టూకీగా ఇదీ కథ.

మనం ఇతరులతో పంచుకోదలచిన సమాచారాన్ని కంప్యూటర్‌లో ఎక్కడ దాచుకుంటామో ఆ స్థలం “మన వెబ్‌సైట్” లేదా తెలుగులో “మన గిడ్డంగి” అనో “మన ఆటపట్టు” అనో అందాం. ఈ ఆటపట్టులో ఉండేవి చింతపండు, బెల్లం కాదు - సమాచారం. కనుక ఈ “వెబ్ సైట్” (ఆటపట్టు) ని పుస్తకంలో పేజీలలా అమర్చుకుంటే చదివేవారికి సదుపాయంగా ఉంటుంది. అప్పుడు ప్రతి పేజీని “వెబ్ పేజ్” (web page) లేదా “పట్టు పుట” అని కాని “పట్టు పత్రం” అని కాని అనొచ్చు. పుస్తకానికి ముఖపత్రం ఎలాంటిదో అలాగే ఆటపట్టు (“వెబ్ సైట్”) కి ముఖపత్రం (“హోం పేజి”) అలాంటిది. పుస్తకం కొనేవాడు అట్ట మీద బొమ్మ చూసి కొంటాడు. ఇంట్లోకి వచ్చేవాడు వీధి వాకిలి ఎలా ఉందో చూస్తాడు. కనుక ప్రతి వెబ్ సైట్ కి అందంగా ఉన్న ముఖపత్రం ఒక ముఖ్యమైన అంగం.

ఇళ్లకి చిరునామాలు లేదా విలాసాలు ఉన్నట్లే ఈ వెబ్ సైట్లకి (ఆటపట్లకి) కూడా చిరునామాలు ఉంటాయి. చిరునామాలో వ్యక్తి పేరో, సంస్థ పేరో ఉండడమే కాకుండా, ఊరు పేరు దేశం పేరు ఉంటాయి అన్న విషయం మరచిపోకండి. వెబ్ సైట్ల చిరునామాని ఇంగ్లీషులో URL (Universal Resource Locator) అంటారు. ఉదాహరణకి అనే చిరునామానే తీసుకుందాం. ఇందులో http అనేది ఇది ఏ రకం వెబ్ సైటో చెబుతుంది. అంటే వెబ్ సైట్లలో రకాలు ఉంటాయన్నమాట. తరువాత ://ని చూడగానే కంప్యూటర్ (బ్రౌజర్) రాబోయేది ఒకానొక రకం వెబ్ సైటు విలాసం అని తెలుసుకుంటుంది. ఈ విలాసంలో “మాటకీ మాటకీ మధ్య” చుక్కలు మాత్రమే ఉండొచ్చు (కామాలు, కోలన్లు, వగైరా విరామ చిహ్నాలు నిషిద్ధం). తరువాత Friendsoftelugu అనేది వెబ్ సైటు పేరు. తరువాత చుక్క, ఆ చుక్క తరువాత “ఆర్గ్” (org) - అంటే ఇది ఏ రకం సంస్థో చెబుతోందన్న మాట. దీనిని ఇంగ్లీషులో “డొమైన్ నేం” (domain name) అంటారు; తెలుగులో “ఇలాకా పేరు” అందాం. ఇలాకా అంటే అధికార పరిధి అని అర్థం.

ఎక్కువ తరచుగా తారసపడే ఇలాకా పేరు (domain name) “డాట్ కాం” (.com) ; దీనిని వ్యాపార సంస్థలకి కేటాయించేరు. విద్యాసంస్థలు వాడే ఇలాకాని “డాట్ ఇడియు” (.edu) అంటారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలకి బయట ఇలాకా పేరు తరువాత ఆయా దేశాల పేర్లు, రెండక్షరాల సంక్షిప్తం రూపంలో, వాడతారు. ఇండియాలో ఉన్న సంస్థల పేర్ల చివర “డాట్ ఇన్” (.in) అని ఉండడం గమనించే ఉంటారు. సాధారణంగా పైన ఉదహరించిన URL చివర /index.html అని మరొక అంశం ఉండొచ్చు. ఒక వెబ్ సైట్ లో ఎన్నో పుటలు పుస్తకరూపంలో అమర్చి ఉన్నాయని అనుకుందాం. అపుడు అనే విలాసం మాత్రమే వాడితే ఆ పుస్తకంలో ఏ పేజీకి వెళ్లాలి? మనం ఏ పేజీకి వెళ్లాలో నిర్ద్వందంగా చెప్పలేదు కనుక కంప్యూటరు మనని “విషయసూచిక” ఉన్న పేజీకి తీసుకెళుతుంది. ఈ విషయసూచిక ఉన్న పేజీ పేరే index.html.

మన ఇంటికి వచ్చేవారంతా వీధి గుమ్మంలోకి వచ్చి తలుపు తడితే బాగుంటుంది కాని పాలవాడు పెరటి గుమ్మంలోకి వచ్చి పెళ్లాంతో సరసాలాడతానంటే ఏమి బాగుంటుంది? అందుకని పట్టు పుటని index.html పేజిగా నిర్మిస్తే మన వెబ్ సైట్‌కి వచ్చేవారందరికీ ముందుగా ముఖపత్రం కనిపిస్తుంది.

ప్రపంచంలోని ముఖ్యమైన డొమైన్ల జాబితాని ఇక్కడ చూడవచ్చు.

ఇక నుంచి తెలుగులోనూ వెబ్‌సైట్‌ డొమైన్‌ పేరు రాసుకోవచ్చు. విదేశీ డొమైన్లపై లాభాపేక్షలేని సంస్థ 'ద ఇంటర్నెట్‌ కార్పొరేషన్‌ ఫర్‌ ఆసియాన్డ్‌ నేమ్స్‌ అండ్‌ నంబర్స్‌' (ఐసీఏఎన్‌ఎన్‌) భారత్‌కు చెందిన ఏడు భాషలకు ఆమోదం తెలిపింది. ఆంగ్లేతర భాషల్లోనూ డొమైన్ల పేర్లకు ఆహ్వానం పలికిన ఆ సంస్థ తెలుగు, హిందీ, తమిళం, బెంగాలీ, ఉర్దూ, గుజరాతీ, పంజాబీ భాషలనూ అనుమతించింది. (ఈనాడు3.11.2009)

డొమెయిన్ నేమ్‌ (ఇలాకా పేరు) కీ ఇంటర్నెట్ ప్రోటోకోల్ (IP) అడ్రస్ (అంతర్జాల విలాసం) కీ మధ్య తేడా ఉంది. టూకీగా చెప్పాలంటే ఇలాకా పేరు మనుష్యులకి అర్థం అయే రీతిలో ఉండాలనే ఉద్దేశంతో సృష్టించింది. IP అడ్రస్ యంత్రాలకి అర్థం అయే రీతిలో సృష్టించింది. ఐపి అడ్రసుకు ఉదాహరణలు:

ఈ సంఖ్యలు మానవులకి అర్థం అవాలని సృష్టించినవి కావు. కాని ప్రతి కంప్యూటరుకి ఈ రకం సంఖ్యలు కేటాయించబడి ఉంటాయి. ఉదాహరణకి మాత్రమే - పైన్ ఇచ్చిన మొదటి ఐపి అడ్రసుకి ఈ దిగువ ఊహించిన విధంగా అర్థం చెప్పుకోవచ్చు: 192 అనేది ఇండియాకి సంకేతం అనుకుందాం. 168 ఉభయ గోదావరి జిల్లాలకి సంకేతం అనుకుందాం. తరువాత వచ్చే 0 మొగల్తుర్రు ఊరికి సంకేతం అనుకుందాం. చివరన ఉన్న 167 వేమూరి పార్వతీశం గారి ఇంటికి సంకేతం అనుకుందాం. అప్పుడు 192.168.0.167 అనేది బారిష్టరు పార్వతీశం గారి ఇంట్లో కంప్యూటరు అని తెలుస్తుంది. కాని ఈ సంఖ్యలని ఎవరు గుర్తు పెట్టుకోగలరు. అందుకని బారిష్టరు పార్వతీశం తన స్నేహితులకి అనే చిరునామాని ఇస్తారు. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవలసినది Friendsoftelugu.org అన్న భాగం. ఇది URLకి IP అడ్రెస్ కి ఉన్న అవినాభావ సంబంధం.

ముందు బ్రౌజర్ అంటే ఏమిటో తెలుసుకుందాం. కంప్యూటర్ యుగానికి ముందే ఈ మాట ఇంగ్లీషు భాషలో వాడుకలో ఉంది. గ్రంథాలయానికి వెళ్లినప్పుడు కాని, పుస్తకాల దుకాణానికి వెళ్లినప్పుడు కాని మనం సాధారణంగా అట్ట మీద బొమ్మ చూసో, పేరు చూసో ఒక పుస్తకాన్ని ఎన్నుకుని విప్పి చూస్తాం. ఒక నిమిషం పోయిన తరువాత ఆ పుస్తకాన్ని తిరిగి బీరువాలో పెట్టెస్తాం. మరొక పుస్తకం తీస్తాం, చూస్తాం, పెట్టెస్తాం. ఈ రకం పనిని “బ్రౌజింగ్” అంటారు. ఈ పని చేసే వ్యక్తిని బ్రౌజర్ అంటారు. అంటే తెలుగులో “చూడ్డం, పరిశీలించడం, వీక్షించడం,” వగైరా పనులని వీక్షించడం అనిన్నీ, ఆ పని చేసే వ్యక్తిని వీక్షకి అనిన్నీ అందాం. చీరల కొట్లోకి వెళ్లి మన ఆడవాళ్లు చేసే పనిని కూడా “బ్రౌజింగ్” అనొచ్చు. అంతర్జాలంలో విహరించడానికి ఉపయోగపడే సాధనం కనుక దీనిని తెలుగులో విహరిణి అంటున్నారు.

మనకి బజారులో రకరకాలైన పట్టు దర్శనులు దొరుకుతున్నాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ వారు ఎక్స్‌ప్లోరర్ (Explorer) కి మద్దత్తు ఇస్తే, ఏపిల్ కంపెనీ వారు సఫారీ (Safari) కి మద్దత్తు ఇస్తున్నారు. గూగుల్ కంపెనీ వారు క్రోం (Chrome) ని వెనకేసుకొస్తున్నారు. ఏ కంపెనీకి చెందని జనతా దర్శని పేరు ఫైర్‌ఫాక్స్ (Firefox). ఒకరి గణాంకాల ప్రకారం వీటన్నిటిలోను ఎక్కువ జనాదరణ పొందినవి, ఆ క్రమంలో, క్రోం, ఫైర్‌ఫాక్స్, ఎక్స్‌ప్లోరర్, సఫారీ. తమాషా ఏమిటంటే అన్ని దేశాలలోనూ ఈ జనాదరణ ఒకేలా లేదు. ఇక్కడ చెప్పిన గణాంకాలు బల్ల మీద పెట్టుకుని వాడుకునే కంప్యూటర్ల విషయంలోనే. అరచేతిలో ఇమిడే కంప్యూటర్ల విషయానికి వస్తే సఫారీ ఎక్కువ ఆదరణలో ఉన్నట్లు కనిపిస్తోంది. కనుక గణాంకాలని గభీమని గుడ్డిగా నమ్మడానికి వీలు లేదు.

రహదారులు ఉండబట్టి మనకి రవాణా సౌకర్యాలు లభించినట్లే, ఇంటర్నెటు ఉండటం వల్ల మనకి అనేకమైన సౌకర్యాలు, సేవలు (services) లభిస్తున్నాయి. రహదారురహదారులు వెంబడి టపాలు బట్వాడా చేసినట్లే అంతర్జాలం మీద బట్వాడా అయే టపాలని ఈ-టపా లేక ఈ-మెయిలు అంటారు. ఇక్కడ ఈ అనే అక్షరం ఇంగ్లీషులో Electronic అనే మాటకి సంక్షిప్తం. కావలిస్తే దీనిని తెలుగులో విద్యుత్-టపా లేదా వి-టపా అనొచ్చు.

internet is on smart phone in india from year 2008 so the net usage increses
inindia india is one of the hiegest net userfs in the world net is usefull for education
and online servies and communicaiton 
రహదారులు ఉండబట్టే మనం ఇరుగు పొరుగులకి వెళ్ళి బాతాఖానీ కొట్టి రాటానికి వీలయింది. అలాగే ఈ విద్యుత్‌ రహదారిని ఉపయోగించి, ఇల్లు వదలి బయటకి వెళ్ళకుండా బాతాఖానీ కొట్టొచ్చు. ఈ బాతాఖానీనే ఇంగ్లీషులో చాటింగ్ (Chatting) అంటారు.

రహదారులు ఉండబట్టే ఆ రహదారురహదారులు వెంబడి గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు, పత్రికలు చదవటానికి సానుకూలం అయింది. అదే విధంగా ఈ అంతర్జాలపు రహదారి వెంబడి మనం ప్రపంచం అంతా తిరిగి బహిరంగంగా ఉన్న గ్రంథాలయాలే కాకుండా ఇంటింటా ఉన్న సొంత గ్రంథాలయాలని కూడా దర్శించి విషయ సేకరణ చెయ్యవచ్చు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జ్ఞాన సంపదనే 'వరల్డ్ వైడ్ వెబ్' అంటారు.

వరల్డ్ వైడ్ వెబ్ ఇంటర్నెటులో అత్యధికంగా లభించే సేవ. ఇందులో వెబ్ సైట్సు, బ్లాగులు, మొదలయిన ఎన్నో పేజీలు మనకు అందుబాటులో ఉంటాయి. ఈ సమాచారాన్ని మనం వాడుకనేందుకు వాడే సాఫ్టువేర్ అనువర్తనాన్ని బ్రౌజర్ లేదా విహరిణి అంటారు. అంతెందుకు మీరు ఇప్పుడు చదువుతున్న వికీపిడియా కూడా వరల్డ్ వైడ్ వెబ్ లో బాగమే. వరల్డ్ వైడ్ వెబ్ ను పలకటానికి సులువుగా ఉంటుందని వెబ్ అని పిలుస్తుంటారు.

వెబ్ తరువాత ఇంటర్నెటులో ఈ-మెయిల్ అత్యధికంగా ఉపయోగించబడే సేవ. మన పోస్టలు సేవకు మల్లేనే ఇందులో మనము ఉత్తరాలు వాటికి ప్రత్యుత్తరాలు పంపించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకు కాగితం అవసరంలేదు. కేవలం సమాచారం ఉంటే చాలు. చాటింగ్ లేదా ఇన్స్టెంట్ మెసేజింగ్ కూడా ఈ-మెయిల్ వంటిదే, కానీ సమాచారమును మరింత తొందరగా చేరవేస్తుంది, కాకపోతే కొద్ది సమాచారమును మాత్రమే పంపించగలము.

సినిమాలంటే ఇష్టం ఉన్న వారు మూవీ డేటాబేస్ (IMDB) కి వెళ్లి కావలసిన సమాచారం తెలుసుకోవచ్చు. 

రకరకాలసేవలను అందించే ప్రత్యేక వెబ్సైటులను వెబ్ పోర్టల్ అంటారు. పోర్టల్ ని తెలుగులో గవాక్షం అంటున్నారు. ఇవి తెలుగు భాషలో లభ్యమవుతున్నాయి

అయితే కొన్ని దేశాలలో ప్రభుత్వాలు ఇంటర్నెటు ఒక్క చెడ్డ వ్యవస్థ అనే అభిప్రాయం కలిగి ఉన్నాయి. అవి ఇంటర్నెటులోని కొన్ని భాగాలను తమ దేశాలలో ప్రజలు వాడుకోకుండా అడ్డుకుంటున్నాయి. ఉదాహరణకు, చైనాలో ప్రజలు ఎవరు కూడా మీరు చదువుతున్న ఈ వికీపిడియాను చదవలేరు, మార్పులు కూడా చేయలేరు. అంతేకాదు కొంతమంది తల్లితండ్రులు తమ పిల్లలకు ఇంటర్నెటు చాలా కీడు చేస్తుందని భావిస్తుంటారు.




#Article 154: బ్లాగు (1780 words)


బ్లాగు (blog) అనే పదం వెబ్‌లాగ్ (weblog) అనే పదాన్ని సంక్షిప్తంగా చేయడంతో వచ్చింది. బ్లాగు అంటే మామూలు వెబ్‌పేజీయే, కాకపోతే ఇందులో రాసిన జాబులు తేదీల వారీగా. చివరగా రాసిన జాబులు ముందు చూపిస్తూ అమర్చి ఉంటాయి. వ్యక్తిగత డైరీల నుండి రాజకీయ ప్రచారాల దాకా, వివిధ మాధ్యమాల కార్యక్రమాల నుండి పెద్ద కంపెనీల వరకు, అప్పుడప్పుడు కలం విదిల్చే రచయితల నుండి అనేక మంది చెయ్యితిరిగిన రచయితల సామూహిక రచనల దాకా బ్లాగులు విస్తరించాయి. చాలా బ్లాగుల్లో చదువరులకు వ్యాఖ్యలు రాసే వీలు కలగజేస్తారు. అలా వ్యాఖ్యలు రాసేవారితో ఆ బ్లాగు కేంద్రంగా ఒక చదువరుల సమూహం ఏర్పడుతుంది; మిగతా వాళ్ళు కేవలం చదివి 'పారేసే' వాళ్ళన్నమాట. ఈ బ్లాగులూ, వాటికి సంబంధించిన వెబ్‌సైట్లూ అన్నిటినీ కలిపి బ్లాగోస్ఫియరుఅని దాన్ని తెలుగులో బ్లాగావరణం అని అంటారు. ఏదైనా ఒక విషయం గురించి, లేక వివాదం గురించి బ్లాగుల్లో వాద ప్రతివాదాలు చెలరేగితే వాటిని బ్లాగ్యుద్ధాలు, బ్లాగు తుఫానులు అంటారు.

బ్లాగులు రకరకాల ఆకృతుల్లో ఉంటాయి. మామూలు బులెట్‌జాబితా లాగా పేర్చిన హైపరులింకుల (hyper links) వంటి వాటి నుండి, పాఠకుల వ్యాఖ్యలు, రేటింగులతో కూడిన సంక్షిప్త వ్యాసాల దాకా ఉంటాయి. వ్యక్తిగత బ్లాగు జాబులన్నీ కూడా తేదీ, సమయం ప్రకారం అన్నిటి కంటే కొత్తవి అన్నిటి కంటే పైన కనపడేలా అమర్చబడి ఉంటాయి. పాఠకుల వ్యాఖ్యలు జాబుకు అడుగున ఉంటాయి. బ్లాగులకు లింకులు చాలా ముఖ్యం కనుక పాత జాబులను ఓ క్రమపద్ధతిలో అమర్చి ప్రతీ జాబుకూ ఓ స్థిర లింకును కేటాయించే ఏర్పాటు ఉంటుంది. ఈ స్థిర లింకునే పెర్మాలింకు అంటారు. కొత్త వ్యాసాలు, వాటి లింకులు అర్ ఎస్ ఎస్ (RSS) లేదా ఆటమ్ (Atom లేదా ఎక్స్ఎమ్ఎల్ (XML ) పద్ధతుల్లో అందిస్తున్నారు. వీటిని ఏ ఫీడురీడరు ద్వారానైనా చదువుకోవచ్చు.

బ్లాగుల రచన, కూర్పు, ప్రచురణ ఎక్కువగా కంటెంటు మేనేజిమెంటు సిస్టము లేదా CMS ద్వారా చేస్తారు.

వ్యక్తిగత పేజీలతోపాటు బ్లాగ్‌రోల్సూ, ట్రాక్‌బాక్ వంటి లింకులు, వ్యాఖ్యల వంటి లింకులను తేలిగ్గా అమర్చుకునే వీలును బ్లాగు కలిగించింది. కొంత మంది నియంత్రణలో ఉండే ఫోరములు, ఎవరైనా చర్చ మొదలుపెట్టగలిగే మెయిలు జాబితాలకు భిన్నంగా సొంతదారు నియంత్రణలో ఉంటూ వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా బ్లాగు ఉంటుంది. 1994 లో స్వార్త్‌మోర్ కాలేజీలో చదివేటపుడు బ్లాగటం మొదలుపెట్టిన జస్టిన్ హాల్‌ను తొలి బ్లాగరులలో ఒకడిగా భావిస్తారు.

బ్లాగులంటే కేవలం మామూలు వెబ్‌సైట్ల లాగా కాక, వాటికి కొత్త హంగులు చేర్చి శోభ తెచ్చిన వ్యక్తి డేవ్ వైనర్. ఆయన ఓ సర్వరును సృష్టించాడు.. బ్లాగులో ఏదైనా మార్పు చేర్పులు జరగ్గానే సదరు బ్లాగు ఈ సర్వరును తట్టి, తనకు మార్పులు జరిగిన విషయం తెలియజేస్తుంది. బ్లాగ్‌రోలింగు  వంటి పరికరాలను వాడి తమకిష్టమైన బ్లాగుల్లో ఎప్పుడు మార్పులు చేర్పులు జరుగాయో వినియోగదారులు తెలుసుకోగలిగారు.

సెప్టెంబర్ 11 దాడుల తరువాత అమెరికాను సమర్ధించే బ్లాగులు ఎన్నో వచ్చాయి. ఆ సంఘటననకు సంబంధించిన సమాచారం మరింత తెలుసుకునేందుకు, దాన్ని అర్థం చేసుకునేందుకు పాఠకులు ఈ బ్లాగులను ఆదరించారు. 2002 నాటికి వీటిలో చాలా బ్లాగులు అమెరికా ఇరాక్ ఆక్రమణను, సామూహిక మారణాయుధాల నిల్వల ఏరివేతనూ సమర్ధించాయి. ఈ యుద్ధ బ్లాగరులు ఎక్కువగా యుద్ధ సమర్ధకులైన మిత వాదులే అయినప్పటికీ, తరువాతి కాలంలో ఇరాక్ యుద్ధం గురించి రాసేవారంతా - వారి దృక్కోణం ఎలా ఉన్నప్పటికీ - యుద్ధ బ్లాగరుల కోవలోకి వచ్చేలా ఈ పదం కొత్త అర్థం సంతరించుకుంది. 2003లో ఫోర్బెస్ పత్రిక ఉత్తమ యుద్ధబ్లాగులను సంకలనం చేసినపుడు యుద్ధ బ్లాగరులను ఈ కొత్త అర్థంలోనే వాడింది.

మొదటి బ్లాగు వివాదం బహుశా ట్రెంట్ లాట్ పతనం అయి ఉండవచ్చు. స్ట్రోం థర్మండ్ గౌరవార్థం ఇచ్చిన ఓ విందులో థర్మండ్ నాయకత్వ లక్షణాల కారణంగా అయ్యన ఒక ఉత్తమ అధ్యక్షుడు కాగలడని లాట్ వ్యాఖ్యానించాడు. థర్మండ్ తన రాజకీయ జీవితపు తొలిన్నాళ్ళలో తెల్ల జాత్యహంకారుల సానుభూతిపరుడుగా ఉండేవాడు. దీంతో అతన్ని పొగడిన లాట్‌ను ప్రజలు జాతి దురహంకారిగా భావించారు. తరువాతి కాలంలో జరిగిన పరిణామాల్లో జోష్ మార్షల్ వంటి బ్లాగర్లు ఈ విషయంపై దాడిని కొనసాగించారు. ఆయన వ్యాఖ్యలు ఏదో పొరపాటున నోరుజారి చేసినవి కావనీ, లాట్ స్వతహాగానే జాతి దురహంకారి అనీ వాదిస్తూ ఆయన చేసిన మరి కొన్ని ప్రసంగాలను ఉదహరిస్తూ తమ బ్లాగుల్లో రాసారు. ఈ ప్రయత్నాల మూలంగా వత్తిడి పెరిగి చివరికి సెనేట్ మెజారిటీ నాయకుడిగా లాట్ రాజీనామా చెయ్యవలసి వచ్చింది.

ఆ సరికి బ్లాగు ఒక గొప్ప ఆవిష్కరణగా మారింది. బ్లాగు ఎలా సృష్టించాలి, జాబులు ఎలా రాయాలి మొదలైన అంశాలను నేర్పిస్తూ వ్యాసాలు రాసాగాయి. ఇతర ప్రాజెక్స్టులకు వ్యాప్తి కలిగించడంతో పాటు, ఎలెక్ట్రానిక్ సమాజాలను నిర్మించడంలో బ్లాగుల ప్రాముఖ్యత గురించి కూడా వ్యాసాలు వచ్చాయి. జర్నలిజం కళాశాలలు బ్లాగులను పరిశీలిస్తూ, వాటికి, ప్రస్తుత జర్నలిజం పద్ధతులకు మధ్య తేడాలను గుర్తించే పని మొదలుపెట్టాయి.

వార్తలను, విశేషాలను వెల్లడి చెయ్యడం, వార్తా వ్యాసాలు రాయడం, వ్యాపింపజెయ్యడం మొదలైన అంశాల్లో వాటి పాత్ర కారణంగా బ్లాగుల ప్రాచుర్యం 2003 నుండి దినదినాభివృద్ధి చెందింది. 2003 ఇరాక్ యుద్ధం బ్లాగు ప్రస్థానంలో ఒక ప్రముఖ సంఘటన. మితవాదులూ, వామపక్షవాదులూ ఈ విషయంపై పరిణతితో కూడిన అభిప్రాయాలను వెల్లడించారు. ఇరాక్ యుద్ధ వార్తలతో కూడిన బ్లాగులు ఒక విస్ఫోటనం లాగా అకస్మాత్ ప్రజాదరణ పొందాయి. ఫోర్బెస్ పత్రిక  ఈ వ్యవహారాన్ని అక్షరబద్ధం చేసింది. హొవార్డ్ డీన్, వెస్లీ క్లార్క్ లాంటి రాజకీయవేత్తల బ్లాగులు తమ అభిప్రాయాలను ప్రకటించేందుకు బ్లాగులను వాడుకోవడంతో వార్తా కేంద్రాలుగ వారి ప్రాశస్త్యం మరింత బలపడింది. డేనియల్ డ్రెజ్ఞర్, జె.బ్రాడ్‌ఫోర్డ్ డిలాంగ్ వంటి విషయ నిపుణులు బ్లాగులు రాయడం కారణంగా లోతైన విశ్లేషణా కేంద్రాలుగా బ్లాగులు పేరుపొందాయి.

రాదర్‌గేట్ కుంభకోణం గురించి ఇక్కడ చెప్పుకోవాలి. సీబీఎస్ వార్తా సంస్థకు చెందిన డాన్ రాదర్ 60 మినిట్స్ 2 అనే టీవీ కార్యక్రమంలో చూపించిన కొన్ని పత్రాలు ఫోర్జరీవి అని వాదిస్తూ కొందరు బ్లాగరులు సమీకృతంగా జాబులు రాసారు. మూడురోజుల్లోనే సీబీఎస్ తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పక తప్పలేదు. ఈ సంఘటనతో బ్లాగు కూడా ఒక వార్తా మాధ్యమంగా ఇతర మాధ్యమాలు అంగీకరించినట్లుగా బ్లాగరులు భావించారు. పాతుకుపోయిన వార్తా సంస్థలపై కూడా వత్తిడి తీసుకువచ్చి వారి వార్తా కథనాలను వెనక్కు తీసుకునేలా చెయ్యడంలో బ్లాగుల ప్రభావం తెలియవచ్చింది.

వినియోగదారుల ఫిర్యాదులను వెలుగులోకి తీసుకువచ్చే పని కూడా ప్రస్తుతం బ్లాగుల ద్వారా - ఒకప్పుడు యుస్‌నెట్ ద్వారా చేసినట్లు - చేస్తున్నారు.

బ్లాగరులు మాధ్యమాల వైపుకు కూడా మళ్ళారు. , ,  రేడియోలో పాల్గొంటారు.  () టీవీలో వస్తూ ఉంటారు. ఇక  వంటి వారు మాధ్యమాల నుండి ఇటువైపు వచ్చి తమ పాత పరపతిని బ్లాగుల ద్వారా మరింత విస్తరించుకున్నారు.

జనవరి 2005లో , ,   , , , ,  అనే ఎనిమిది మంది బ్లాగరులను వ్యాపార వర్గాలు విస్మరించజాలని వారుగా ఫార్చూన్ పత్రిక  రాసింది.

బ్లాగడమంటే రాజకీయాలెంతో సాంకేతికాలూ అంతే. బ్లాగులను నడిపించే ఉపకరణాలూ, బ్లాగుల చుట్టూ అల్లుకున్న సమాజాలూ బ్లాగులను  ముడిపెట్టాయి. లారీ లెస్సిగ్, డేవిడ్ వీన్‌బెగర్ వంటి రచయితలు తమ బ్లాగుల ద్వారా బ్లాగులకు ప్రాచుర్యం కల్పించడమే కాక, రకరకాల సామాజిక దృష్టికోణాలను పాదుకొల్పారు. వార్తా సేకరణలో బ్లాగు పాత్ర గురించిన చర్చ ప్రస్తుతం జోరుగా జరుగుతున్న జర్నలిజం చర్చల్లో ఒకటి. ఇది సమాజంలో మాధ్యమాల పత్రగురించీ, మేథో సంపత్తి గురించీ పలు ప్రశ్నలకు దారి తీస్తుంది. చాలా మంది బ్లాగరులు ప్రధాన స్రవంతి మాధ్యమాల నుండి తమను తాము భిన్నంగా చూస్తారు. కొందరు మాత్రం మరో మాధ్యమం ద్వారా పనిచేస్తున్న ఆ మాధ్యమాల సభ్యులే.

చాలామంది బ్లాగరులకు పెద్ద పెద్ద ఎజెండాలే ఉన్నాయి. బ్లాగులను ఓపెన్‌సోర్సు రాజకీయాల్లో ఒక భాగంగానూ, రాజకీయాల్లో మరింత ప్రత్యక్షంగా పాల్గొన వీలు కలిగించే మార్గం గాను భావించారు. సంస్థలు మాత్రం అడ్డుగోడలేమీ లేకుండా ప్రజలకు నేరుగా తమ సందేశాలను చేర్చగలిగే సాధనంగా భావించాయి.

బ్లాగులు మొదలైనప్పటి నుండి బ్లాగులను సృష్టించుకునేందుకు వీలు కలిగిస్తూ అనేక సాఫ్టువేరు పాకేజీలు వచ్చాయి. వెబ్‌లో బ్లాగులను రచించేందుకు, వాటిని ఆవిష్కరించేందుకు అనేక సంస్థలు తామరతంపరగా వచ్చాయి. గ్రేటెస్ట్ జర్నల్, పిటాస్, బ్లాగర్, లైవ్‌జర్నల్, క్సాంగా వీటిలో కొన్ని.

చాలా మంది బ్లాగరులు సర్వరు సాఫ్టువేరు ఉపకరణాలను వాడి బ్లాగులను సృష్టించేందుకు మొగ్గు చూపుతారు. న్యూక్లియస్ CMS, మూవబుల్‌టైప్, బిబ్లాగ్, వర్డ్‌ప్రెస్, బి2ఇవల్యూషన్, బోస్ట్‌మెషిన్, సెరెండిపిటీ ఇలాంటి ఉపకరణాల్లో కొన్ని. వీటి ద్వారా సృష్టించిన బ్లాగులను తమ తమ వెబ్‌సైట్లలో, లేదా తమకనువైన మరోచోట ప్రచురించుకోవచ్చు. ఈ ప్రోగ్రాములు మరిన్ని సౌలభ్యాలతో, మరింత శక్తివంతంగా ఉంటాయి కానీ, వాటిని వాడేందుకు మరింత పరిజ్ఞానం కావాలి. 
వెబ్‌లో రచనలు చేసేందుకు ఏర్పాటు చేస్తే ఎక్కడనుండైనా బ్లాగులు రాసే వీలు కలుగుతుంది.

ఇవేకాక, కొంతమంది తమ బ్లాగు సాఫ్టువేరును తామే ఓనమాల దగ్గరి నుండి రాసుకుంటారు. PHP, CGI వంటి భాషలు వాడి రాసే ఈ ప్రోగ్రాములకు చాలా సమయం పడుతుంది కానీ, చక్కగా తమకు అనువైన విధంగా బ్లాగులను తీర్చిదిద్దుకోవచ్చు.

బ్లాగులకు సామాన్యంగా ఉండే రెండు అంశాలు బ్లాగ్చక్రాలు (blogrolls), వ్యాఖ్యలు (commenting).

బ్లాగ్చక్రాలు అంటే ఓ బ్లాగు నుండి లింకులు ఇచ్చిన బ్లాగుల జాబితా. తన బ్లాగు దగ్గర సంబంధం కలిగి ఉన్న బ్లాగులకు లింకులు ఇవ్వడం ద్వారా బ్లాగరి తన బ్లాగుకు ఒక సందర్భాన్ని సృష్టిస్తారు. ఈ లింకుల ద్వారా ఒక బ్లాగు ఎన్నిసార్లు ఉదహరించబడిందో లెక్క వేస్తారు. బ్లాగ్చక్రపు మరో ప్రయోజనం ఏమిటంటే.. పరస్పర లింకులు ఇచ్చుకోవడం. లేదా తన బ్లాగుకు లింకు ఇస్తారనే ఆశతో తన బ్లాగునుండి మరో బ్లాగుకు లింకు ఇవ్వడం

మరో ముఖ్యమైన, వివాదాస్పదమైన అంశం.. వ్యాఖ్యానాల పద్ధతి. ఈ పద్ధతిలో పాఠకులు బ్లాగు జాబులపై తమ వ్యాఖ్యలను రాయవచ్చు. కొన్ని బ్లాగులకు ఈ వ్యాఖ్యల పద్ధతి ఉండదు. మరి కొన్నిటిలో వ్యాఖ్యలకు బ్లాగరి అనుమతి తప్పనిసరి చేసి ఉంటుంది. కొందరు బ్లాగరులు వ్యాఖ్యలను చాలా కీలకమైనవిగా భావిస్తారు. అసలైన బ్లాగులకు మామూలు రకం బ్లాగులకు తేడా ఈ వ్యాఖ్యల ద్వారా తెలుస్తుందని వీరు భావిస్తారు. వ్యాఖ్యాన అంశాన్ని బ్లాగు సాఫ్టువేరులో అంతర్భాగంగా రూపొందించవచ్చు. లేదా హేలోస్కాన్ వంటి సేవను అనుబంధంగా చేర్చడం ద్వారా నెలకొల్పవచ్చు. ఏదైనా బ్లాగుకు క్రమం తప్పకుండా రాసే వ్యాఖ్యాతలుంటే వారందరినీ ఆ బ్లాగు యొక్క సంఘంగా అనుకోవచ్చు.

ఎక్టో, w.బ్లాగర్ వంటి ఉపకరణాలను వాడి బ్లాగరులు వెబ్‌కు వెళ్ళకుండానే తమ బ్లాగుల్లో జాబులు రాయవచ్చు. బ్లాగు సాంకేతికాంశాలు ఇంకా మెరుగుపడుతూనే ఉన్నాయి. ఉదాహరణకు మూవబుల్‌టైప్ వారు 2002 లో ప్రవేశపెట్టిన ట్రాక్‌బాక్ ద్వారా బ్లాగుల్లో మార్పులు చేర్పులు జరిగినపుడు విషయ సంబంధం ఉన్న బ్లాగులకు ఈ విషయం తెలియజేస్తుందిందష్;ఫలానా విషయంపై జాబు లేదా వేరే బ్లాగులోని ఫలానా జాబుపై స్పందన.. ఇలాగ.

ఈ ట్రాక్‌బాకుల్లాంటి విశేషాలు కలిగిన బ్లాగులు సెర్చి ఇంజన్లు వాడే పేజీ రాంకు పద్ధతిని జటిలం చేసాయి. వీటిని సెర్చి ఇంజన్ల పరిధి లోకి తీసుకురావడం ఒక సవాలుగా మారింది. కావాలని సెర్చి రాంకును ముందుకు నెట్టేందుకు కొందరు దీన్ని వాడుతున్నారు. అయితే, పేజిరాంకును నిర్ణయించే పని సెర్చి ఇంజన్లది.. అది ఎలా చెయ్యాలి అనేది అవే చూసుకోవాలి.

వెబ్‌హోస్టింగు కంపెనీలు, ఆన్‌లైను ప్రచురణా సంస్థలు కూడా బ్లాగు తయారీ ఉపకరణాలను అందిస్తున్నాయి. సేలన్, ట్రైపాడ్, బ్రేవ్‌నెట్, అమెరికా ఆన్‌లైన్ మొదలైనవి కొన్ని ఉదాహరణలు. తాము ప్రచురించే బ్లాగులను వీరు జర్నల్స్ అంటారు.

బ్లాగు అంటే ఆన్‌లైను డైరీ లేదా జర్నలుగా చెప్పడం తరచూ జరుగుతూ ఉంటుంది. సరళమైన బ్లాగు ఆకృతి కారణంగా పెద్ద అనుభవం లేనివారు కూడా జాబులను సులభంగా రాసి, ప్రచురించగలుగుతున్నారు. ప్రజలు తమ రోజువారీ అనుభవాలను, ఫిర్యాదులను, కవిత్వాన్ని, గద్యాన్ని, దొంగచాటు, చాటుమాటు ఆలోచనలను రాసుకుంటారు. కొన్నిసార్లు ఇతరులను కూడా రాయనిస్తారు. ఇంటర్నెట్టు పితామహుడైన టిం బెర్నర్స్ లీ చెప్పినట్లు పరస్పరం కలిసి పనిచేయడమన్నమాట. 2001లో ఈ ఆన్‌లైను డైరీల గురించిన పరిజ్ఞానం నాటకీయంగా పెరిగిపోయింది.

కౌమారదశలో ఉన్నవారు, కాలేజీ కుర్రాళ్ళు, మొదలైనవారి దైనందిన జీవితంలో ఆన్‌లైను డైరీ ఓ భాగమైపోయింది. ఒకరినొకరు తిట్టుకోడానికీ, పైగా స్నేహితులు, శత్రువులు, అపరిచితులు - అందరూ చక్కగా వాటిని చదువుకోడానికి ఈ డైరీలు అనువుగా ఉన్నాయి.

వ్యక్తిగత బ్లాగు దైనందిన జీవితంలోని విషయాలకు, సంఘటనలకు సంబంధించింది కాగా, ఈ ఆలోచనాత్మక బ్లాగులు ఒక విశేష విషయంపై బ్లాగరు ఆలోచనలను ప్రతిబింబిస్తాయి. విషయాలేమైనా కావచ్చు.. ప్రస్తుతం వార్తల్లో ఉన్న విషయాలే కానక్కర్లేదు, వేదాంత విషయాల దగ్గర్నుండి ఏవైనా కావచ్చు. ఒకవైపు వ్యక్తిగత బ్లాగులతోటీ, మరోవైపు విషయాత్మక బ్లాగులతోటి కలుస్తున్నప్పటికీ ఈ ఆలోచనాత్మక బ్లాగులను ఓ ప్రత్యేక వర్గంగా భావించవచ్చు.

ఒకే అభిరుచులు కలిగిన వారు కలగలసి రాసే జర్నలే మిత్రబ్లాగు. ఇవి చిన్న చిన్న జాబులతో కూడి ఉంటాయి. జాబులు తరచుగా రాస్తూ ఉంటారు. రచయిత తన మిత్రబ్లాగును తన స్నేహితుల మిత్రబ్లాగులతో కనెక్టయ్యే వీలు కల్పిస్తారు. దీంతో బ్లాగుల గొలుసుకట్టు ఏర్పడితుంది.

ఓ ప్రత్యేక విషయంపై - సాధారణంగా సాంకేతిక విషయం - రాసే బ్లాగులే విషయాత్మక బ్లాగులు.  దీనికో ఉదాహరణ. గూగుల్‌కు సంబంధించిన వార్తలు మాత్రమే ఇందులో ఉంటాయి. చాలా బ్లాగుల్లో పోస్టులను వర్గీకరించుకునే ఏర్పాటు ఉంది. దీంతో మామూలు బ్లాగును కూడా విషయాత్మక బ్లాగుకా మార్చుకోగలిగే వీలు ఏర్పడింది.

కొన్ని బ్లాగులు వార్తలను సంక్షిప్తంగా సమర్పిస్తూ ఉంటాయి. ఉదాహరణకు , , , , 

ఒక విషయం గురించి ఒకే బ్లాగులో ఒకరికంటే ఎక్కువ మంది రాసే బ్లాగులు ఇవి. ఇలాంటి బ్లాగులు ఎవరైనా రాసే విధంగానైనా, లేదా కొంతమందికే పరిమితమైగానీ ఉండవచ్చు. మెటాఫిల్టరు దీనికో ఉదాహరణ.

స్లాష్‌డాట్ లో కొంతమంది ఎడిటర్లు సాంకేతికాంశాలకు చెందిన వార్తలపై రోజంతా తమకు వచ్చే లింకులను పరిశీలించి సరైనవాటిని ఎంచి ప్రచురిస్తూ ఉంటారు. వాళ్ళు స్లాష్‌డాట్ ను బ్లాగు అని పిలవనప్పటికీ బ్లాగు లక్షణాలు దానికి కొన్ని ఉన్నాయి.

మరో కొత్త రకం బ్లాగు వచ్చింది.. బ్లాగరులూ, సాంప్రదాయిక మాధ్యమాలు పరస్పర సహకారంతో నిర్వహించే బ్లాగులివి. ఈ మాధ్యమాల్లో వచ్చే వార్తలను బ్లాగుల్లోనూ, బ్లాగు వార్తలను మాధ్యమాల్లోను చర్చించే కార్యక్రమమిది. , హూస్టన్ టాక్ రేడియో స్టేషనుల మధ్య గల సహకారం ఇలాంటిదే!

బ్లాగుల్లో ఎక్కువగా కనపడే రకాలలో రాజకీయ బ్లాగులు ఒకటి. వార్తల వెబ్‌సైట్లలోని వార్తలకు లింకులు ఇస్తూ వాటి గురించి తమ అభిప్రాయాలు రాస్తూ ఉంటారు. రచయితకు ఆసక్తి ఉన్న ఏ అంశంపైనైనా జాబులు రాయవచ్చు. వీటిలో కొన్ని ప్రత్యేకమినవి.. వార్తల వెబ్‌సైటులో గానీ, ఇతర బ్లాగుల్లో గానీ దొర్లిన తప్పులు, పక్షపాత ధోరణి గురించి రాస్తూ ఉంటారు ఈ బ్లాగుల్లో.

న్యాయ, చట్టపరమైన విషయాలను చర్చించే బ్లాగులు ఇవి. ఇంగ్లీషులో వీటిని blawgs అనడం కద్దు.

అనేకానేక వెబ్‌సైట్ల వివరాలను ఒక పద్ధతిలో, విషయానుసారంగా అమర్చి పెట్టిన బ్లాగులివి. వార్తలకు సంబంధించిన బ్లాగులు ఈ కోవలోకి వస్తాయి.

కొన్ని బ్లాగులు ప్రసార మాధ్యమాల తప్పులని, వక్రీకరించబడిన యదార్థాలని వేలెత్తిచూపిస్తూ, ప్రసార మాధ్యమాలకు కాపలాదార్లుగా ఉంటాయి. చాలా మాధ్యమ-ప్రధానమైన బ్లాగులు ఏదో ఒక్క వార్తాపత్రికనో, టెలివిజన్ నెట్‌వర్క్‌పైనో దృష్టి కేంద్రీకరిస్తాయి.

పెద్ద పెద్ద వ్యాపార సంస్థల ఉద్యోగులు అధికారిక, లేదా ఉప అధికారిక బ్లాగులు ప్రచురించడము బాగా ఎక్కువ అవుతున్నది. కానీ సంస్థలు మాత్రం అన్ని వేళలా ఈ బ్లాగులును, బ్లాగర్లను మెచ్చుకోలేదు. జనవరి 2005లో జాయ్ గోర్డన్, స్కాట్లాండు లోని ఎడింబర్గ్ లోని వెస్ట్స్టోన్ పుస్తకాల షాపు నుండి ఉద్యోములో నుండి తొలగించబడినాడు, ఎందుకంటే ఇతను తన బ్లాగులో పై అధికారిని  asshole in sandals అని తిట్టినాదు. అలాగే 2004 సంవత్సరములో ఎల్లెన్ సిమోనెట్టి డెల్టా ఎయిర్ లైన్స్ విమాన సేవకుడు కూడా తన బ్లాగులో ఉద్యోగ డ్రస్సులో ఫోటో పెట్టినందుకు తొలగించబడింది. బహుశా అన్నిటికన్నా ప్రముఖమైన సంఘటన ఓ వెబ్సైటు జేటూఈఈ నుండి పీహెచ్‌పీకి మారడంలోని ఔచిత్యం గురించి వ్రాసినందుకు  ఫ్రెడ్‌స్టెర్ నుండి ఉద్యోగము నుండి తొలగించుట.

దీనికి వ్యతిరేకముగా ప్రవర్తించిన సంస్థలు కూడా ఉన్నాయి.

చాలా బ్లాగులు సలాహాలు అందిస్తుంటాయి, ఉదాహరణకు మైక్రోసాఫ్ట్ సాంకేతిక విజ్ఞానము ()లేదా కాల్పనిక మహిళా రచనలు ().

కొన్ని బ్లాగులు మతపరమైన విషయాలు చర్చిస్తూ ఉంటాయి. వీటిలో మత పరమైన సలహాలు, సూచనలు, శ్లోకాలు, మంత్రాలు, మత గ్రంథాల వివరాలు, విశ్లేషణలు, ఇంకా మత పరమైన ఆరోపణలు, కేకల్ మొదలగున్నవి ఉంటాయి

కొన్ని బ్లాగులు ఫార్మేటులో ప్రత్యేకతను కలిగి ఉంటాయి, ఉదాహరణకు బొమ్మల బ్లాగు, వీడియో బ్లాగు మరి కొన్ని ప్రత్యేకమైన విషయముపై ఉంటాయి, ఉదాహరణకు మొబైలు బ్లాగు.

బహుళ ప్రాచుర్యము పొందిన డిజిటల్ కెమెరాలు, బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ల వల్ల ఇంటర్నెట్ (అంతర్జాలము) పై ఫోటోలు పంచుకోవడము చాలా తేలిక మరియూ ప్రాచుర్యము వహించింది. ఈ కోవలోని చెందినదే ఫోటో బ్లాగు, ఈ బ్లాగులో ఫోటోలు చాలా చక్కగా అలంకరించి ఉంటాయి.

జనవరి 2005 న మొదటి  ఏర్పాటు చేయబడింది. దీనితో ఓ క్రొత్త బ్లాగర్ల ఫార్మేటు ప్రారంభమైంది, అదే వీడియో బ్లాగింగు.

అన్ని హాబీల్లాగే బ్లాగింగు కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన పదజాలాన్ని సృష్టించుకున్నది. వాటిలో ఎక్కువ తరచుగా వాడే పదాలు, పదబంధాలు కొన్నిటిని వివరించడానికి చేసిన చిన్న ప్రయత్నం ఇది (పదం యొక్క అర్థం స్పష్టంగా లేనిచోట ఆ పదం ఎలా ఏర్పడిందో కూడా పేర్కొనడం జరిగింది):
 

 




#Article 155: చీరాల (694 words)


చీరాల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చీరాల మండలంకు చెందిన పట్టణం. వస్త్ర ఉత్పత్తి, వ్యాపారంలో సాధించిన ప్రగతి కారణంగా చీరాల చిన్న బొంబాయిగా పేరుగాంచింది. భారతీయ వాయుసేనకు చెందిన స్థావరం, సూర్యలంకకు దగ్గరగా వున్నది .

నేటి చీరాల పట్టణానికి శంకుస్థాపన 1604లో ఇద్దరు యాదవ ప్రభువులు - మించాల పాపయ్య, మించాల పేరయ్యలు చేసారు. ఈ పట్టణం పాత చీరాలకు అసలు పేరైన శుద్ధనగరం నుండి ఏర్పడింది. మద్రాసు ప్రాచ్య లిఖిత భాండాగారం లోని రికార్డుల ప్రకారం, శుద్ధనగరాన్ని కాకతి గణపతిదేవ చక్రవర్తి వద్ద మంత్రిగా ఉన్న గోపరాజు రామన్న, చీరాల అనంతరాజుకు క్రీ.శ.1145 లో దానమిచ్చాడు. అతని వారసుడు చీరాల వెంకటకృష్ణుడు ప్రస్తుత చీరాలను కొత్త పట్టణాన్ని నిర్మించేందుకు గాను యాదవులకు కౌలుకిచ్చాడు. ఈ ప్రకారం, విశ్వావసు సంవత్సర వైశాఖ శుద్ధ సప్తమి నాడు - క్రీ.శ.1604లో - నేటి చీరాల పట్టణం ఆవిర్భవించింది.

కొత్త పట్టణంలో 1619 లో వేణుగోపాలస్వామి గుడి, 1620 లో మల్లేశ్వరస్వామి గుడి కట్టించారు. మరి కొద్దికాలం తరువాత గంగమ్మ గుడి కట్టించారు. 19వ శతాబ్దపు మధ్య కాలంలో చీరాల రామన్న పంతులు ఈ గుడులకు రథాలు తయారుచేయించాడు.

చెన్నై-కోల్‌కతా-ఢిల్లీ ప్రధాన రైలుమార్గంలో ఉన్న చీరాలలో రైల్వే స్టేషను ఏర్పాటయ్యాక, వ్యాపారపరంగా చీరాల అభివృద్ధి చెందింది. ఒకప్పుడు మోటుపల్లి రేవు ద్వారా సముద్ర వ్యాపారం చేసిన పాత చీరాల క్రమేణా ప్రాముఖ్యతను కోల్పోయి, ఓ చిన్న గ్రామంగా మిగిలిపోయింది.

బ్రిటిషువారు చీరాలను ఆరోగ్య విడిదిగా భావించేవారు. 1906 లో మొదటగా ఎడ్వర్డు VII పట్టాబిషేక స్మారక ఆసుపత్రి ప్రారంబమైంది. 1912లో డా.బాయరు బాయరు మిషనరీ ఆసుపత్రి ప్రారంభించాడు.

చీరాలకి ఈ పేరు దాని పాత పేరు క్షీరపురి నుండి వచ్చింది. ఇక్కడ సముద్రము తెల్లగా కనపడుతుంది. అంచేత ఈ వూరికి ఆ పేరు వచ్చింది.

స్వాతంత్ర్యోద్యమ కాలంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాకుండా భారతదేశ చరిత్రలోనే ప్రముఖంగా పేర్కొనే బ్రిటీష్ వ్యతిరేక ఉద్యమంగా పేరుపడిన చీరాల పేరాల ఉద్యమం ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న చీరాలలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆధ్వర్యంలో జరిగింది. బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ఇంకా స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొన్న జనాబ్ గౌస్ బేగ్ సాహెబ్, ద్రాక్షారం యల్లంశెట్టి, ఈ ఊరివారే.

ప్రకాశం జిల్లాలో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. గోపాలకృష్ణయ్య వేయిమంది సభ్యులతో రామదండు అనే వాలంటీర్ సంస్థను ఏర్పాటు చేశారు. విజయవాడ కాంగ్రెస్ సమావేశాల సందర్భంగా గాంధీ వచ్చినపుడు గోపాలకృష్ణయ్య ఆయనకు సమస్య వివరించాడు. గాంధీ చీరాలను సందర్శించి ఊరు ఖాళీ చేసిపోతే మున్సిపాలిటీ దానంతట అదే రద్దవుతుందని ఆలోచన చెప్పాడు. గోపాలకృష్ణయ్య చీరాల, పేరాల ప్రజలను ఊరు ఖాళీచేయించి దాని పొలిమేర అవతల రామ్‌నగర్ పేరుతో కొత్త నివాసాలు ఏర్పర్చాడు. అక్కడ 11 నెలలపాటు కష్ట నష్టాలని అనుభవించారు. ఉద్యమానికి కావలసిన విరాళాలను సేకరించడానికి గోపాలకృష్ణయ్య బరంపురం వెళితే ప్రభుత్వం ఆయన్ను నిర్భందించి ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష విధించింది. దీంతో చేసేదేమీ లేక ప్రజలు తమ నివాసాలకు తిరిగి వెళ్ళాల్సి వచ్చింది.
స్వాతంత్ర్య సమరంలో ప్రత్యేక భూమిక పోషించిన చీరాల 2004, ఏప్రిల్ 27 న (వైశాఖ శుద్ధ సప్తమి) 400 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

ప్రస్తుత ఎన్.ఆర్ అండ్ పీ.మున్సిపల్ ఉన్నత పాఠశాల 1912లో ప్రథమాంగ్ల పాథశాలగా స్థాపించబడింది. చారిత్రాత్మక చీరాల-పేరాల స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ మహాత్ముని సూచనమేరకు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో 18 వేల ప్రజానీకమంతా పట్టణాన్ని వదలి వెళ్ళిపోవడం వలన-పాఠశాల 1921లోమూతపడి మరల 1924లో మునిసిపల్ మిడిల్ స్కూల్గా పున:ప్రారంభమైంది. 1928లో మొట్టముదటి యస్.యస్.యల్.సి బ్యాచ్ విద్యార్థులు ఈ స్కూల్ నుండి పబ్లిక్ పరీక్షకు హాజరైనారు. 2004లో ఈ స్కూల్ అశీతి (80) వసంతోత్సవాలను ప్రధానోపాధ్యాయులు చంగవల్లి సత్యనారాయణ శర్మగారి సారథ్యంలో ఘనంగా జరుపుకున్నది. వివిధ రంగాలలో లబ్ధప్రతిష్ఠులైన ఎన్.ఆర్.అండ్.పి.మున్సిపల్ ఉన్నత పాఠశాల పూర్వవిద్యార్థులు:- భారత మాజీ చీఫ్ ఎన్నికలు కమీషనర్ డా.జి.వి.జి.కృష్ణమూర్తి; మాజీమంత్రులు-రొండా నారపరెడ్డి, వడ్డే నాగేశ్వరరావు: మాజీ శాసనసభ్యులు ప్రగడ కోటయ్య, అక్కల కోటయ్య, ముప్పలనేని శేషగిరిరావు, ముట్టె వెంకటేశ్వర్లు: పార్లమెంటు సభ్యులు:సలగల బెంజిమన్: భారత రాయబారి పేర్లి దానమ్; ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు; వై.పి.యస్.రావ్, వైద్యుడు; వెంకట్ చంగవల్లి (సిఈఓ,108 అంబులెన్స్) : డా.సి.యస్.ఆర్.మూర్తి, విశ్వవిద్యాలయ ప్రొఫెసరు ఈస్కూల్లో చదివినవారే! 1946లో కస్తూరిబా గాంధీ మునిసిపల్ గరల్స్ ఉన్నత పాఠశాల స్థాపించబడింది.దీన్ని ప్రారంభించడానికి టంగుటూరి ప్రకాశం పంతులు విచ్చేశారు. 1948లోఎన్.ఆర్.ప్.యమ్ ఉన్నత పాఠశాలలో గాంధీ విగ్రహాన్నిప్రతిష్ఠించారు. 1951లో పేరాలలో ఆంధ్రరత్న మున్సిపల్ ఉన్నత పాఠశాల స్థాపించబడింది. ప్రస్తుత వి.ఆర్.ఎస్ అండ్ యై.ఆర్.ఎన్.కాలేజి 1951లో స్థాపించబడింది.

పురపాలక ప్రాథమిక పాఠశాలలతో పాటు ఎయిడెడ్ పాఠశాలలు ఎక్కువగా ఉన్నాయి

చీరాల ప్రముఖ రవాణా కూడలి. రాష్ట్ర ప్రధాన రహదారి SH 45, పిడుగురాళ్ల దగ్గర SH 2 కూడలి నుండి ప్రారంభమై నరసరావుపేట, చిలకలూరిపేట మీదుగా చీరాలను తలుపుతుంది.

చెన్నయ్ హౌరా రైలు మార్గములో ఈ పట్టణం ఉంది. రైల్వే స్టేషన్, బస్సు స్టేషన్ పక్క పక్కనే వుండడంతో ప్రయాణీకులకు సౌకర్యంగా వుంటుంది. ఇక్కడి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారములు చేరటానికి లిఫ్టు సదుపాయం కూడావుంది.

చీరాల పట్టణంలోని బోస్‌నగర్‌లో వేంచేసియున్న ఈ ఆలయానికి శత సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి 26 సంవత్స రాలు అయినది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో బహుళ పాడ్యమి నుండి బహుళ పంచమి వరకు, ఐదు రోజులపాటు, ఈ ఆలయంలోని అమ్మవారి తిరునాళ్ళు వైభవంగా నిర్వహించుచున్నారు. మొదటి రోజున 108 కలశాలతో అమ్మవారికి అభిషేకాలు నిర్వహించెదరు. రెండవ రోజు సాయంత్రం సామూహిక కుంకుమార్చనలు మూడవరోజు సాయంత్రం అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవం, నాల్గవ రోజున అమ్మవారికి 108 రకల ప్రసాదాల నైవేద్యం, ఐదవ రోజున అన్నసంతర్పణ, హారతుల సమర్పణతో సేవలతో ఉత్సవాలు ముగింపుకు చేరుకుంటవి. ఈ వేడుకలకు గుంటూరు, ప్రకాశం జిల్లాల నుండి భక్తులు అధికసంఖ్యలో విచ్చేయుదురు. ముఖ్యముగా ఒంగోలు, పరుచూరు, బాపట్ల, అ చుట్టు ప్రక్కల గ్రామాలనుండి వేలాదిగా తరలి వచ్చెదరు.




#Article 156: బనగానపల్లె (269 words)


బనగానపల్లె ఆంధ్ర ప్రదేశ్, కర్నూలు జిల్లా లోని జనగణన పట్టణం. పిన్ కోడ్: 518 124. కర్నూలు జిల్లాలో నున్న బనగానపల్లె 1790 నుండి 1948 వరకు అదే పేరు కలిగిన సంస్థానంగా ఉండేది. 

అప్పటినుండి బనగానపల్లెను మొగలు చక్రవర్తుల సామంతులుగా కొన్నాళ్ళు, ఆ తరువాత 1724లో మొగలుల నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకొన్న హైదరాబాదు నిజాము సామంతులుగా కొన్నాళ్ళు ఫైజ్‌ వారసులే పాలించారు. అతడు కూడా మగ వారసులు లేకుండా మరణించడంతో, అతని మనుమడు హుసేన్‌ ఆలీ ఖాన్‌ బనగానపల్లెకు ప్రభువయ్యాడు. అతని పాలన చివరి రోజుల్లో మైసూరు రాజు హైదరాలీ సామ్రాజ్య‌ విస్తరణ చేయడాన్ని గమనించి అతనికి సామంతుడిగా మారిపోయాడు. 1783లో హుసేను మరణించాక, అతని కుమారుడు, చిన్నవాడైన గులాం మొహమ్మదాలి -మామ రాజ ప్రతినిధిగా- రాజయ్యాడు. ఒక ఏడాది లోనే హైదరాలి వారసుడైన టిప్పు సుల్తాను వాళ్ళను బనగానపల్లె నుండి తరిమివేయగా, వాళ్ళు హైదరాబాదులో తలదాచుకున్నారు. మళ్ళీ 1789లో బనగానపల్లెకు తిరిగి వచ్చారు. తరువాత కొన్నాళ్ళకు, దగ్గరలోని చెంచెలిమల జాగీరును వియ్యం ద్వారా కలుపుకున్నారు.

బనగానపల్లె పట్టణంలో, ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, ఉన్నాయి. బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రైవేటు విద్య సంస్థలు కూడా ఉన్నాయి. బనగానపల్లెలో ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల ఉంది. ఒక సార్వజనిక వైద్యశాల, ప్రభుత్వ పశు వైద్యశాల ఉన్నాయి. ఆర్.టి.సి. డిపో ఉంది. బనగానపల్లె నుండి రాయలసీమ లోని అన్ని ముఖ్య పట్టణాలకు రవాణ సౌకర్యం ఉంది. హైదరాబాదుకి ప్రతి రోజు రాత్రి బస్సులు ఉన్నాయి. రైల్వే స్టేషను ఉంది.

మండలం లో దద్దనాల చెరువు ముఖ్యమైన నీటి వనరు,ఈ చెరువు ఏ కాక మండలం లో వ్యవసాయం అంతా SRBC కలువ పై ఆధారపడి వుంది.మండలం లో GNSS కలువ కూడా ప్రవహిస్తుంది

బనగానెపల్లె ప్రాంతంలో పెరిగే ఒక రకం మామిడికి బంగినపల్లి మామిడి అని వాడుకలో పేరు. చాలా ప్రసిద్ధమైన మామిడి రకం ఇది. దీన్ని బేనిషా అని కూడా అంటారు. మామిడి పళ్ళు రాష్ట్రం మొత్తం పేరొందింది. మామిడి పళ్ళను ఇష్టపడే నవాబు, ఒక్కొక్క రకం మామిడి చెట్టుకి ఒక్కొక్క రకం గుర్తు (నిషాన్) చెక్కించేవాడు. అయితే ఒక రకం మామిడి పండు ఎంతో తీయగా, మిగతా అన్ని రకాల కంటే రుచిగా ఉండటంతో, ఆ చెట్టుకి ఏ గుర్తు చెక్కించక, దానికి 'గుర్తు లేనిది' (బే నిషాన్) అని నామకరణం చేయించాడు. అదే వాడుకలో బేనిషా అయ్యింది. ఒక NTR చిత్రంలో బంగినపల్లి మామిడి పండు రంగుకొచ్చింది అనే పాట కూడా ఉంది.




#Article 157: కనిగిరి (437 words)


కనిగిరి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన పట్టణం. కనిగిరిని మనుమసిద్ధిపై యుద్ధము చేసిన కాటమరాజు పరిపాలించాడని ప్రతీతి. కనిగిరి కొండపై కనిగిరి కోట, బావులు, దుర్గము ముఖ్యమైనవి.

కనిగిరిని పూర్వము కనకగిరి (బంగారుకొండ) అని పిలిచేవారు. దీని పూర్తిపేరు కనకగిరి విజయ మార్తాండ దుర్గము. కవి, రాజు నన్నెచోడుడు ఉదయగిరిని పరిపాలించిన కాలంలో కనిగిరి సామంత రాజ్యంగా ఉండేది. కనిగిరిని మనుమసిద్ధిపై యుద్ధము చేసిన కాటమరాజు పరిపాలించాడని ప్రతీతి. కనిగిరి కొండపై కొన్ని చారిత్రక కట్టడములు ఉన్నాయి. వాటిలో కనిగిరి కోట, బావులు, దుర్గము ముఖ్యమైనవి. కనిగిరి కొండపై రెండు జీర్ణావస్థలో ఉన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. కొండపై ఒక చదరపు మైలు వైశాల్యము కలిగిన చదును నేల ఉంది. పూర్వము కొండపై ఒక పట్టణం ఉండేదని స్థానికుల కథనం

మనుచరిత్రలో వర్ణించిన కనకగిరి ఇదియే అని పలువురి అభిప్రాయము.కనిగిరిసీమకు సంబంధించిన శాసనాలని పరిశీలించినచో కటకపురాధీశ్వరుండగు రుద్రుడీ సీమను పాలించినట్లు-అతడే-ఇక్కడ ఉన్న దుర్గములను నిర్మించి తన విజయసూచకముగా ఇక్కడ విజయమార్తాండదుర్గ అని పేరిడినట్లు చరిత్రపుటలలో కనబడుతున్నది. అతనిపిదప ఆతని వంశస్థులీ పరిసరములను కొంతకాలము పాలించిరి. అటుపై కొంతకాలము తరువాత 17వ శతాబ్దములో మైసూరు నవాబగు హైదరాలి ఈ కనిగిరిసీమను జయించి-పట్టణంను-కోటను కుంగుటేళ్ళతో కూడా నేలమట్టము గావించెను.ఈతను తరువాత ఇది నిజాము వశము కాబడింది.అటుపై ఆంగ్లేయుల దత్తము కాబడింది.ఆశ్వేతముఖుల పాలనలో ఈ తాలూక కొన్ని దినములు కర్నూలు కడప జిల్లాలలో చేర్చబడి-మరికొంతకాలమునకు నెల్లూరు జిల్లాలో ఉండెను. 1970 నుండి ప్రకాశము జిల్లాలో నున్నది.కనకగిరికి సంబంధించిన శాసనములు నెల్లూరు జిల్లా శాసన సంపుటములో 40 వరకు ఉన్నాయి.

బొగ్గు గొందిలోనికి పోగా వచ్చునది చెన్నమ్మక్క బావి. దీనిని శ్రీ కృష్ణదేవరాయలు పట్టమహిషియైన చిన్నాదేవి సర్వ జనోపయోగార్దముగ నిర్మింపజేసినదియు-క్రమముగా మారుచు నేటికీ పేరు నిలిచినదని పలువురి అభిప్రాయము.ఇందలి నీరు లోదుర్గమున యాతాయాతవంబులకుపయోగిపడుచున్నది.దీని పరిసరములలో కొన్ని భిన్నములైన విగ్రహములున్నవి.పోయినవిపోగా ఉన్నవాటిలో చతుర్భుజుడైన శ్రీమహావిష్ణుమూర్తి.ఆనాటి కోటలోనుండు దేవాలయములోని విగ్రహమేమో?
ఇక్కడనుండి కొంచెము ముందుకు సాగినచో భీముని పాదమట-అడుగు ఆకారము కల ఒక గుంటకలదు.

ఈ సిద్ధపురుషుడెవ్వరో తెలియదు.ఈ ఆలయనిర్మాణమునకుపయోగించిన బండలు 3 అడుగుల మందముకలిగి అంతేలావు కలిగి ఉన్నాయి.ఈ దేవా;అయమునకు ప్రక్కనే కాశీ ద్వారమున్నది.ఈ పర్వతమంతయు పెద్ద శివలింగాకారముగా ఉంది.ఇందొక గుహలో దక్షిణాభిముఖుడగు మార్తాండేశ్వరుడున్నాడు.దక్షిణాభిముఖుడగు ఈశ్వరదేవాలయముంట అరుదుకదా! ఈ పరమేశ్వరునిని-మార్కాండేయ మహర్షి ప్రతిష్ఠించినని చెప్పుచున్నారు.

పామూరు 37 కి.మీ, చంద్రశేఖరపురం 38 కి.మీ, పెదచెర్లోపల్లి 29 కి.మీ, వెలిగండ్లల 22 కి.మీ, కందుకూరు 49 కి.మీ, ఒంగోలు 80 కి.మీ, కంభం 60 కి.మీ, దొనకొండ 52 కి.మీ.

ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ మోడల్ స్కూల్ తో పాటు చాలా ప్రైవేటు పాఠశాలలున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు పలు ప్రైవేట్ జూనియర్ కళాశాలలున్నాయి. అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు పలు ప్రైవేట్ డిగ్రీ కళాశాలున్నాయి.

ప్రభుత్వ ఆస్పత్రితో పాటు పలు ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయి

పలు ప్రభుత్వరంగం, ప్రైవేట్ రంగ బ్యాంకులు పనిచేస్తున్నాయి.

కనిగిరి గ్రామ దేవత అంకలమ్మ, హిందువులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ, ముస్లింలు, క్రైస్తవులు పట్టణం అంతటా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రానికి కందుకూరు మంచి ఉదాహరణ. ప్రజలు తిరునాళ్ళు, పీర్ల పండుగ,, నూతన సంవత్సరం పండుగ, ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్), సంక్రాంతి (సంక్రాంతి), వైకుంఠ ఏకాదశి, ఉగాది (ఉగాది), గణేష్ చతుర్థి (వినాయక చవితి), దసరా (దసరా), దీపావళి (దీపావళి), క్రిస్మస్ (క్రిస్మస్) పండుగలు ఆచరిస్తారు.

ఇది శతాబ్దాల చరిత్ర ఉన్న ఆలయం. ఈ ఆలయంలో ఒకప్పుడు రాజులు పూజలు చేసేవారు. 100 ఎకరాలకు పైగా మాన్యం భూములు, కోట్ల రూపాయల ఆస్తులున్నా సాధారణ కైంకర్యాలు గూడా చేసే అవకాశం లేదు. తక్షణం మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఉంది. [1] 

కనిగిరి నకిరేకల్-మాచెర్ల-తిరుపతి జాతీయ రహదారి (NH-565) మీద ఉంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) తో పాటు రెండు ప్రైవేటు బస్సు ఆపరేటర్లు రవాణా రంగంలో సేవలందిస్తున్నాయి. సమీప రైల్వే స్టేషనులు సింగరాయకొండ, దొనకొండ. సమీప విమానాశ్రయం విజయవాడ విమానాశ్రయం. 

కనిగిరి పట్టణం నుండి భారతదేశము, భారతదేశం లోని కొన్ని ప్రధాన ప్రాంతాల మధ్యన దూరం

కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గం




#Article 158: గిద్దలూరు (ప్రకాశం జిల్లా) (441 words)


గిద్దలూరు ప్రకాశం జిల్లాలోని ఒక ముఖ్య పట్టణం. పిన్ కోడ్: 523 357., ఎస్.టి.డి.కోడ్ = 08405.

గిద్దలూరు యొక్క పూర్వ నామము సిద్ధలూరు. సిద్ధలూరు సమీపములోని నాగేశ్వరాలయము దగ్గర ఒక స్థలమును నందన చక్రవర్తి శ్రీవత్స గోత్రజుడు, నందనవారిక వంశానికి చెందిన కుంచాల శివప్పకు అగ్రహారముగా ఇచ్చాడు. కానీ తరువాత ఈ గ్రామం. పాడుబడటము వలన, శివప్ప వంశీయుడైన రామచంద్ర నందవరము నకు తరలివెళ్లి, అక్కడి నుండే సిద్ధలూరి యొక్క వ్రిత్తిని అనుభవించాడు.

శక యుగములో తొండమారయగుళ్ల స్థాపన జరిగిన తరువాత, కుంచెల రామచంద్ర తొండమారయగుళ్ల నాయకుని నుండి కొత్తగా స్థాపించిన సిద్ధలూరిని అగ్రహారముగా పొంది నందవరము నుండి ఇరవై - ముప్పై బ్రాహ్మణ కుటుంబములు, బారబలావతులతో (12 మంది గ్రామ సేవకులు) సహా సిద్ధలూరికి తిరిగి వచ్చాడు. అయితే, తొండమారయగుళ్ల నాయకుని మరణానంతరము ఆ ప్రదేశము నిర్జనమైంది. ఆ కాలములో సిద్ధలూరి ప్రాభవము పెరిగి గ్రిద్ధలూరని కొత్త పేరు సంతరించుకొన్నది. కొంత కాలము తర్వాత గ్రిద్దలూరు అగ్రహారీకుడూ, కుంచాల రామచంద్రుని వంశజుడూ అయిన కుంచెల వెంకటాద్రయ్య గ్రామం చుట్టూ అనేక కుగ్రామంలు స్థాపన చేయించి గిద్దలూరిని మెరుగు పరచెను. అనతి కాలములోనే ఆ కుగ్రామంలు కంచిపల్లె, చట్టిరెడ్డిపల్లె, అక్కలరెడ్డిపల్లె మౌజే లుగా (స్వంతంత్ర గ్రామంలు లేదా ఒక మాదిరి పట్టణములు) ఎదిగినవి. దీనితో గిద్దలూరు కస్బా (ప్రధాన కేంద్రము) అయినది.

హరిహర దేవరాయల కాలములో రామచంద్రరాజు ఈ ప్రాంతములను జాగీర్దారుగా పరిపాలించుటకు వచ్చి ఈ గ్రామంలను వెంకటాద్రి నుండి వశము చేసుకొన్నాడు. కానీ ఆ తర్వాత కాలములో వెంకటాద్రి నుండి ఆ వంశములో మూడవ తరానికి చెందిన రామచంద్ర, హరిహర రాయలచే పునస్థాపించబడి తన గ్రామాలను తిరిగి పొందెను. ఆయన కరణముగా కూడా నియమించబడెను. ఈ విధముగా ముస్లింలు రాక వరకు రామచంద్రరాజు వంశజులు గిద్దలూరు కస్బాను, దాని గ్రామాలను పరిపాలించారు. రాయల పాలన ముగింపుతో గిద్దలూరు ముస్లింల ఆక్రమణకు గురై, ఆ తరువాత కాలములో దత్తమండలాలను నిజాము బ్రిటీషువారికి దత్తము చేసినప్పుడు కడప జిల్లాలో భాగముగా ఉన్న గిద్దలూరు బ్రిటిషు పాలనలోకి వచ్చింది. కర్నూలు జిల్లా యేర్పడిన తర్వాత కర్నూలు జిల్లాలోను భాగమై, 1971లో ఒంగోలు జిల్లా ఏర్పాటు చేసినప్పుడు కొత్తగా ఏర్పడిన జిల్లాలో కలపబడింది.

సగిలేరు నది (స్వర్ణబాహు నది) గిద్దలూరికి దక్షిణాన ప్రవహిస్తున్నది.

నరవ 1.9 కి.మీ, కొంగలవీడు 2.2 కి.మీ, తిమ్మాపురం 5.6 కి.మీ, అంబవరం 5.7 కి.మీ, ముండ్లపాడు 6.1 కి.మీ.

రాచెర్ల 11.7 కి.మీ,కొమరోలు 13.2 కి.మీ,బెస్తవారిపేట 28.2 కి.మీ.

గిద్దలూరు గుంటూరు - ద్రోణాచలము రైల్వే లైనుపై ఒక ప్రముఖ రైల్వేస్టేషను. 
ఈ రైల్వే స్టేషన్ నుండి * బెంగళూరు, విజయవాడ, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలకు చేరుకోవచ్చు.

గిద్దలూర్‌లో బస్ డిపో ఉంది. ఇక్కడి నుండి సమీప గ్రామాలకు చేరుకోవడానికి మాకు చాలా బస్సులు ఉన్నాయి. 

గిద్దలూర్ మేజర్ పట్టణంలో నాలుగు థియేటర్లు ఉన్నాయి

ఈ ఆశ్రమం, గిద్దలూరు నగర పంచాయతీ, కొంగళవీడు రహదారిపై ఉన్న్నది.

వరి, అపరాలు, కాయగూరలు

వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత వృత్తులు. 

గిద్దలూరు నగర పంచాయతీ రేడియో బావి సమీపంలోని శ్రీ అభయాంజనేయస్వామి, శ్రీ ఉమామహేశ్వరస్వామి దేవస్థానం, నవగ్రహ దేవతల ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించారు. 

గిద్దలూరు నగర పంచాయతీ రేడియోబావి కూడలిలోని ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించెదరు. 

ఈ ఆలయం గిద్దలూరు నగర పంచాయతీలోని పాత బద్వేలు రహదారిపై ఉంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి, తొమ్మిది రోజులపాటు ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు.

గిద్దలూరు నగర పంచాయతీ లోని ఆంకాళమ్మ వీధిలో 2015,ఫిబ్రవరి-21వ తేదీ, శనివారం ఉదయం, శ్రీ రమా సత్యనారాయణస్వామివారి విగ్ర ప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.

గిద్దలూరు నగర పంచాయతీలోని కొంగళవీడు రహదారిలో నెలకొనిఉన్నది.

ఈ ఆలయం గిద్దలూరు నగర పంచాయతీలోని రాచర్ల గేటు కూడలిలో ఉంది.

ఈ ఆలయం గిద్దలూరు నగర పంచాయతీలోని కాశిరెడ్డినగరులో ఉంది.

శ్రీ కాశి నాయన దేవస్థానం ఆవరణలో, గాయత్రీ మాత దేవస్థానం నిర్మాణానికి, గాయత్రీ పరివారం  భూమిపూజ నిర్వహించారు. 

ఈ ఆలయం గిద్దలూరు మండలం వీరన్న బావి కూడలి వద్ద ఉంది. 

ఈ ఆలయం స్థానిక కొంగళవీడు రహదారిలో ఉంది.

నరవ రహదారిలో కొత్తగా నిర్మించనున్న ఈ ఆలయ నిర్మాణానికి, శంకుస్థాపన నిర్వహించారు. 

  




#Article 159: తెలంగాణ (4069 words)


శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం ఈ మూడు దేవాలయాల మద్య భూబాగాన్ని కాకతీయులు పాలీంచిన ఏరియా త్రిలింగ దేశం ,  తెలుగు మాట్లాడే కాకతీయుల రాజ్యం, తెలుగు దేశం + ఆణెం అంటే దేశం, కాలగమనంలో తెలంగాణ అనే పదంగా మారింది. భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి తెలంగాణ. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన వాటిలో హైదరాబాద్ ఒకటి. నిజాం పాలన నుంచి 1948 సెప్టెంబరు 17న విముక్తి చెంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడి, 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా రాయచూర్, గుల్బర్గా, బీదర్ కర్ణాటక ప్రాంతం కన్నడ మాట్లాడే ప్రాంతాలు, మరాఠి మాట్లాడే ప్రాంతాలు కర్ణాటక లకు వెళ్ళిపోగా.  ఔరంగాబాద్, బీడ్, పర్భణీ, నాందేడ్, హుస్నాబాద్ మహారాష్ట్ర లకు వెళ్ళిపోగా, తెలుగు భాష మాట్లాడే జిల్లాలు అప్పటి ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. 2014 జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. 

దశాబ్దాలుగా సాగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో ఉధృతరూపం దాల్చగా, 2009, 2011లో మరో సారి తీవ్రరూపం దాల్చింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా వందలాది మంది ఆత్మహత్యలు చేసుకొన్నారు. 2010లో తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీని నియమించగా ఆ కమిటీ ఆరు ప్రతిపాదనలు చేసింది. 2013, జూలై 30న ప్రత్యేక తెలంగాణకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేయగా, 2013 అక్టోబరు 3న కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. 2014, ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోకసభ ఆమోదం లభించింది. ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందింది. 2014 మార్చి 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించింది. 2014 జూన్ 2 నాడు తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది.

దేశంలోనే పొడవైన 44వ నెంబరు (శ్రీనగర్-కన్యాకుమారి) జాతీయ రహదారి (జాతీయ రహదారి 7 కన్యాకుమారి-వారణాసి, జాతీయ రహదారి 44 కలిసి ఉంటాయి), 65వ నెంబరు (పూణె-విజయవాడ) జాతీయ రహదారి, జాతీయ రహదారి 63 నిజామాబాదు-జగదల్‌పూర్, హైదరాబాదు-భూపాలపట్నం జాతీయ రహదారి 202, వంటి జాతీయ రహదారులు ఈ రాష్ట్రం గుండా వెళ్ళుచున్నవి. హైదరాబాదు-వాడి, సికింద్రాబాదు-కాజీపేట, సికింద్రాబాదు-విజయవాడ, కాచిగూడ-సికింద్రాబాద్-నిజామాబాదు-నాందేడ్-మన్ మాడ్, సికింద్రాబాదు-డోన్, వికారాబాదు-పర్బని, కాజీపేట-బల్హర్షా, గద్వాల-రాయచూరు రైలుమార్గాలు తెలంగాణలో విస్తరించియున్నాయి. సికింద్రాబాదు, కాజీపేట రైల్వే జంక్షన్లు దక్షిణ మధ్య రైల్వేలో ముఖ్య కూడళ్ళుగా పేరెన్నికగన్నవి. తెలంగాణ రాష్ట్రం ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దు నుంచి దక్షిణాన ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం వరకు, పశ్చిమాన కర్ణాటక సరిహద్దు నుంచి తూర్పున ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర ప్రాంతం వరకు విస్తరించియుంది. 

తెలుగులో తొలి రామాయణ కర్త గోన బుద్ధారెడ్డి, సహజకవి బమ్మెర పోతన, దక్షిణ భారతదేశంలో తొలిమహిళా పాలకురాలు రుద్రమదేవి, ప్రధానమంత్రిగా పనిచేసిన పి.వి.నరసింహారావు తెలంగాణకు చెందిన ప్రముఖులు. చరిత్రలో షోడశ మహాజనపదాలలో ఒకటైన అశ్మక జనపదం విలసిల్లిన ప్రాంతమిది. కాకతీయుల కాలంలో వైభవంగా వెలుగొందిన భూభాగమిది. రామాయణ-మహాభారత కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్ళున్న ప్రదేశమిది. తెలంగాణ రాష్ట్రపు మొత్తం వైశాల్యం 1,14,840 చ.కి.మీ, కాగా 2011 లెక్కలప్రకారం జనాభా 35,286,757గా ఉంది. రాష్ట్రంలో 17లోకసభ స్థానాలు, 119 శాసనసభ స్థానాలు ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్లో 5వ శక్తిపీఠం, మల్దకల్‌లో శ్రీ స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవస్థానం, భద్రాచలంలో శ్రీ సీతారామాలయం, బాసరలో జ్ఞానసరస్వతీ దేవాలయం, యాదగిరి గుట్టలో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, వేములవాడలో శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం, మెదక్‌లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చి, ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రం దక్కను పీఠభూమిలో భాగంగా, తూర్పు కనుమలకు పశ్చిమంగా ఉంది. ఈ ప్రాంతము సముద్రమట్టం నుంచి సరాసరిన 1500 అడుగుల ఎత్తున ఉండి ఆగ్నేయానికి వాలి ఉంది. ఈ రాష్ట్రపు దక్షిణ భాగంలో ప్రధానముగా కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తుండగా, ఉత్తర భాగంలో గోదావరి నది ప్రవహిస్తున్నది. కృష్ణా, తుంగభద్ర నదులు దక్షిణమున ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ నుంచి వేరుచేస్తున్నవి. ఈ రాష్ట్ర విస్తీర్ణం 1,14,840 చదరపు కిలోమీటర్లు. తెలంగాణలో భౌగోళికంగా మహబూబ్ నగర్ జిల్లా పెద్దది కాగా, హైదరాబాదు చిన్నది. తెలంగాణకు సముద్రతీరం లేదు. ఈ రాష్ట్రం కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రాంతంలోకి వస్తుంది.

నదులు: గోదావరి, కృష్ణా నదులతో సహా పలు నదులు తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తున్నాయి. గోదావరి నది ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దుల గుండా ప్రవహిస్తుంది. కృష్ణా నది మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల దక్షిణ భాగం నుంచి ప్రవహిస్తుంది. తుంగభద్రనది మహబూబ్‌నగర్ జిల్లా దక్షిణ సరిహద్దు గుండా ప్రవహిస్తూ కృష్ణానదిలో సంగమిస్తుంది. భీమానది మహబూబ్‌నగర్ జిల్లాలో కొంత దూరం ప్రవహించి కృష్ణాలో సంగమిస్తుంది. దుందుభి నది మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలలో ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. ప్రాణహిత నది ఆదిలాబాదు జిల్లా సరిహద్దు గుండా ప్రవహించి గోదావరిలో సంగమిస్తుంది. మూసీనది రంగారెడ్డి, హైదరాబాదు, నల్గొండ జిల్లాలలో ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. పాలేరు నది నల్గొండ, ఖమ్మం జిల్లాల సరిహద్దు గుండా ప్రవహించి కృష్ణాలో విలీనమౌతుంది. కాగ్నా నది రంగారెడ్డి జిల్లాలో పశ్చిమ దిశగా ప్రవహించి కర్ణాటకలో కృష్ణాలో సంగమిస్తుంది. మంజీరా నది మెదక్, నిజామాబాదు జిల్లాలలో ప్రవహించి గోదావరిలో కలుస్తుంది.

అడవులు: ఆదిలాబాదు, ఖమ్మం, వరంగల్ జిల్లాలలోఅడవులు అధికంగా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా అగ్నేయప్రాంతం, నల్గొండ జిల్లా నైరుతి ప్రాంతంలో విస్తరించియున్న అమ్రాబాదు పులుల అభయారణ్యం దేశంలోనే పెద్దది. మెదక్, నిజామాబాదు జిల్లాలలో, నల్గొండ ఆగ్నేయ భాగంలోని దేవరకొండ డివిజన్‌లో కూడా అడవులు ఉన్నాయి. నల్లమల అటవీ రక్షిత ప్రాంతం, మంజీరా అభయారణ్యం, కిన్నెరసాని అభయారణ్యం, కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యం ఈ ప్రాంతంలోని రక్షిత అరణ్యాలు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలు ఉన్నాయి. 1948లో హైదరాబాదు రాష్ట్రం ఏర్పడే నాటికి 8 జిల్లాలు ఉండగా, 1956లో ఖమ్మం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉన్నప్పుడు 1978లో రంగారెడ్డి జిల్లా నూతనంగా ఏర్పాటు చేశారు.

ఈ రాష్ట్రంలో ఆదిలాబాదు జిల్లా ఉత్తరాన ఉండగా పశ్చిమ సరిహద్దులో ఆదిలాబాదుతో పాటు నిజామాబాదు, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలు ఉన్నాయి. ఈశాన్య సరిహద్దులో కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. దక్షిణమున మహబూబ్ నగర్ జిల్లా, ఆగ్నేయమున నల్గొండ జిల్లా సరిహద్దుగా ఉంది. ఖమ్మం జిల్లా తెలంగాణకు అతి తూర్పున ఉన్న జిల్లాగా పేరుగాంచింది. తెలంగాణ రాష్ట్రపు భౌగోళిక సరిహద్దు లేని ఏకైక జిల్లా హైదరాబాదు.

కర్ణాటక సరిహద్దుగా 3 జిల్లాలు, మహారాష్ట్ర సరిహద్దుగా 3 జిల్లాలు, ఛత్తీస్‌ఘఢ్ సరిహద్దుగా 2 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుగా 3 జిల్లాలు ఉన్నాయి.

పురాతన రాతియుగం నుంచే తెలంగాణ ప్రాంతం ఉనికిని కలిగియుంది. పూర్వ రాతియుగం కాలం నాటి ఆవాసస్థలాలు వేములపల్లి, ఏటూరునాగారం, బాసర, బోథ్, హాలియా, క్యాతూర్ తదితర ప్రాంతాలలో బయటపడ్డాయి. వాడపల్లి, వెల్టూరు, పోచంపాడు, ఎల్లారెడ్డిపేట తదితర ప్రాంతాలలో బృహశ్శిలాయుగం నాటి ఆనవాళ్ళను పురావస్తు శాస్త్రవేత్తలు సేకరించారు. షోడశ మహాజనపదాల కాలంలో దక్షిణాదిలోని ఏకైక జనపదం అశ్మక జనపదం ఈ ప్రాంతంలోనిదే. పోదన్ (నేటి బోధన్) దీని రాజధానిగా ఉండింది. బౌద్ధ గ్రంథాలలో కూడా ఈ సమాచారం నిక్షిప్తమైయుంది. బుద్ధుడి కాలంలో సుజాతుడు బోధన్ పాలకుడిగా ఉన్నట్లు బౌద్ధ వాజ్ఞయం తెలియజేస్తుంది. బుద్ధి సమకాలికుడు బావరి స్థిరపడ్డ ప్రాంతం నేడు బావనకుర్తి (ఆదిలాబాదు జిల్లాలో నదీద్వీపం) గా పిలుబడుతున్నది. మత్స్యపురాణంలో మంజీరక దేశం (నేటి మంజీరా నది పరీవాహప్రాంతం) ప్రస్తావన కూడా ఉంది. ప్రతిష్ఠానపురం (పైఠాన్) రాజధానిగా పాలించిన ములక రాజ్యం గోదావరి నది సరిహద్దు వరకు ఉండగా అందులో నేటి ఆదిలాబాదు జిల్లా ప్రాంతం భాగంగా ఉండింది. అప్పుడు ఉత్తర-దక్షిణ ప్రధానమార్గం ఈ రాజ్యం గుండా ఉండేది. విదేశాలలో ఉండే బౌద్ధులు దీనిని మంజీరకమని పిలిచారు (నేటి మంజీరా నది పరీవాహక ప్రాంతం). షోడశ మహాజనపదాలలో మగధ రాజ్యం బలపడి చాలా రాజ్యాల్ని ఆక్రమించగా అప్పుడు అశ్మక రాజ్యం కూడా మగధలో విలీనమైంది. ఆ తర్వాత నందరాజులు, ఆ పిదప మౌర్యులు ఈ ప్రాంతాన్ని పాలించారు.

మౌర్యుల కాలం:మౌర్యుల కాలంలో ఈ ప్రాంతం భాగంగా ఉండేదనడానికి అశోకుని 13వ శిలాశాసనం ఆధారంగా చరిత్రకారులు నిర్ణయించారు. మౌర్యుల కాలంలో పర్యటించిన విదేశీ యాత్రికుడు మెగస్తనీసు ఆంధ్రులకు 30 దుర్గాలున్నాయని పేర్కొనగా అందులో కదంబపూర్ (కరీంనగర్), పౌదన్యపురం (బోధన్), పిధుండ, ముషిక, ధూళికట్ట, పెద్దబొంకూర్, ఫణిగిరి, కొండాపురం, కోటిలింగాల, గాజులబండ ముఖ్యమైనది. ఇవన్నీ నేటి తెలంగాణ రాష్ట్రంలోనివే. ఇంకనూ బయటపడాల్సిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. మెగస్తనీసు ఎంతో బలవంతమైనదిగా వర్ణించిన ఆంధ్రరాజ్యం బహుశా ములక అస్సక లేదా ప్రతిష్ఠాన రాజ్యమే అయి ఉంటుందని చరిత్రకారుడు బి.ఎస్.ఎల్.హనుమంతరావు పేర్కొన్నారు.

శాతవాహనుల కాలం:శాతవాహనుల కాలంలో కోటిలింగాల ఒక వెలుగు వెలిగిన ప్రాంతం. శాతవాహనుల తొలి రాజధాని కూడా ఇదే. అయితే కొన్ని దశాబ్దాల వరకు కూడా ప్రతిష్ఠానపురం, ధరణికోటనే తొలి రాజధానిగా పరిగణించారు. శాతవాహనులకు సంబంధించిన పలు నాణేలు కోటిలింగాల, దాని పరిసరాలలో లభ్యమయ్యాయి. కాబట్టి శాతవాహనుల తొలి కేంద్రస్థానం గోదావరి తీరంలోని తెలంగాణ ప్రాంతమేనని పరిశోధకులు నిర్ణయించారు. శాతవాహనుల అనంతరం తెలంగాణ ప్రాంతం మొత్తం కలిపి పాలించిన రాజ్యాలులేవు. విజయపురి కేంద్రంగా పాలించిన ఇక్ష్వాకుల రాజ్యంలో తెలంగాణ తూర్పు ప్రాంతాలు భాగంగా ఉండేవి. ఇదే కాలంలో ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని వాకాటకులు పాలించారు. వాకాటక రాజు ప్రవరసేనుడి కాలంలో మొత్తం తెలంగాణ ప్రాంతం వాకాటక రాజ్యంలో కలిసిపోయింది. ఇక్ష్వాకులకు సామంతులుగా ఉన్న విష్ణుకుండినులు కూడా ఇక్ష్వాకుల తర్వాత స్వతంత్రంగా ఏర్పడి రాజ్యపాలన చేశారు. ఈ విష్ణుకుండినుల జన్మభూమి తెలంగాణయేనని ప్రసిద్ధ చరిత్రకారుడు బి.ఎన్.శాస్త్రి పరిశోధనల ద్వారా నిరూపించాడు. ఇంద్రపాలనగరంలోని అమరేశ్వర, రామేశ్వర, మల్లికార్జున ఆలయాలు, కీసరలోని రామలింగేశ్వర, షాద్‌నగర్ సమీపంలోని రామలింగేశ్వర ఆలయాలు విష్ణుకుండినుల కాలం నాటివి.

బాదామి చాళుక్య కాలం: బాదామి చాళుక్యుల కాలంలో తెలంగాణ మొత్తం వీరి పాలనలోఉండేది.ఆంధ్రదేశ చరిత్ర-సంస్కృతి-మొదటి భాగం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన ఆలంపూర్ ఆలయాలు ఈ కాలంలోనే నిర్మించబడ్డాయి. ఆలంపూర్‌లో పలు సంఖ్యలో వీరి రాతిశాసనాలు ఉన్నాయి.తెలంగాణ శాసనాలు, మొదటి భాగంహశ్శిలాయుగం నాటి ఆనవాళ్ళను పురావస్తు శాస్త్రవేత్తలు సేకరించారు.షోడశ మహాజనపదాల కాలంలో దక్షిణాదిలోని ఏకైక జనపదం అశ్మక జనపదం ఈ ప్రాంతంలోనిదే. పోదన్ (నేటి బోధన్) దీని రాజధానిగా ఉండింది. బౌద్ధ గ్రంథాలలో కూడా ఈ సమాచారం నిక్షిప్తమైయుంది. బుద్ధుడి కాలంలో సుజాతుడు బోధన్ పాలకుడిగా ఉన్నట్లు బౌద్ధ వాజ్ఞయం తెలియజేస్తుంది. బుద్ధి సమకాలికుడు బావరి స్థిరపడ్డ ప్రాంతం నేడు బావనకుర్తి (ఆదిలాబాదు జిల్లాలో నదీద్వీపం) గా పిలుబడుతున్నది. మత్స్యపురాణంలో మంజీరక దేశం (నేటి మంజీరా నది పరీవాహప్రాంతం) ప్రస్తావన కూడా ఉంది. ప్రతిష్ఠానపురం (పైఠాన్) రాజధానిగా పాలించిన ములక రాజ్యం గోదావరి నది సరిహద్దు వరకు ఉండగా అందులో నేటి ఆదిలాబాదు జిల్లా ప్రాంతం భాగంగా ఉండింది. అప్పుడు ఉత్తర-దక్షిణ ప్రధానమార్గం ఈ రాజ్యం గుండా ఉండేది. విదేశాలలో ఉండే బౌద్ధులు దీనిని మంజీరకమని పిలిచారు (నేటి మంజీరా నది పరీవాహక ప్రాంతం). షోడశ మహాజనపదాలలో మగధ రాజ్యం బలపడి చాలా రాజ్యాల్ని ఆక్రమించగా అప్పుడు అశ్మక రాజ్యం కూడా మగధలో విలీనమైంది. ఆ తర్వాత నందరాజులు, ఆ పిదప మౌర్యులు ఈ ప్రాంతాన్ని పాలించారు.

మౌర్యుల కాలం:మౌర్యుల కాలంలో ఈ ప్రాంతం భాగంగా ఉండేదనడానికి అశోకుని 13వ శిలాశాసనం ఆధారంగా చరిత్రకారులు నిర్ణయించారు. మౌర్యుల కాలంలో పర్యటించిన విదేశీ యాత్రికుడు మెగస్తనీసు ఆంధ్రులకు 30 దుర్గాలున్నాయని పేర్కొనగా అందులో కదంబపూర్ (కరీంనగర్), పౌదన్యపురం (బోధన్), పిధుండ, ముషిక, ధూళికట్ట, పెద్దబొంకూర్, ఫణిగిరి, కొండాపురం, కోటిలింగాల, గాజులబండ ముఖ్యమైనది. ఇవన్నీ నేటి తెలంగాణ రాష్ట్రంలోనివే. ఇంకనూ బయటపడాల్సిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. మెగస్తనీసు ఎంతో బలవంతమైనదిగా వర్ణించిన ఆంధ్రరాజ్యం బహుశా ములక అస్సక లేదా ప్రతిష్ఠాన రాజ్యమే అయి ఉంటుందని చరిత్రకారుడు బి.ఎస్.ఎల్.హనుమంతరావు పేర్కొన్నారు.

శాతవాహనుల కాలం:బొద్దు పాఠ్యం శాతవాహనుల కాలంలో కోటిలింగాల ఒక వెలుగు వెలిగిన ప్రాంతం. శాతవాహనుల తొలి రాజధాని కూడా ఇదే. అయితే కొన్ని దశాబ్దాల వరకు కూడా ప్రతిష్ఠానపురం, ధరణికోటనే తొలి రాజధానిగా పరిగణించారు. శాతవాహనులకు సంబంధించిన పలు నాణేలు కోటిలింగాల, దాని పరిసరాలలో లభ్యమయ్యాయి. కాబట్టి శాతవాహనుల తొలి కేంద్రస్థానం గోదావరి తీరంలోని తెలంగాణ ప్రాంతమేనని పరిశోధకులు నిర్ణయించారు. శాతవాహనుల అనంతరం తెలంగాణ ప్రాంతం మొత్తం కలిపి పాలించిన రాజ్యాలులేవు. విజయపురి కేంద్రంగా పాలించిన ఇక్ష్వాకుల రాజ్యంలో తెలంగాణ తూర్పు ప్రాంతాలు భాగంగా ఉండేవి. ఇదే కాలంలో ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని వాకాటకులు పాలించారు. వాకాటక రాజు ప్రవరసేనుడి కాలంలో మొత్తం తెలంగాణ ప్రాంతం వాకాటక రాజ్యంలో కలిసిపోయింది. ఇక్ష్వాకులకు సామంతులుగా ఉన్న విష్ణుకుండినులు కూడా ఇక్ష్వాకుల తర్వాత స్వతంత్రంగా ఏర్పడి రాజ్యపాలన చేశారు. ఈ విష్ణుకుండినుల జన్మభూమి తెలంగాణయేనని ప్రసిద్ధ చరిత్రకారుడు బి.ఎన్.శాస్త్రి పరిశోధనల ద్వారా నిరూపించాడు. ఇంద్రపాలనగరంలోని అమరేశ్వర, రామేశ్వర, మల్లికార్జున ఆలయాలు, కీసరలోని రామలింగేశ్వర, షాద్‌నగర్ సమీపంలోని రామలింగేశ్వర ఆలయాలు విష్ణుకుండినుల కాలం నాటివి.

బాదామి చాళుక్య కాలం: బాదామి చాళుక్యుల కాలంలో తెలంగాణ మొత్తం వీరి పాలనలోఉండేది. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన ఆలంపూర్ ఆలయాలు ఈ కాలంలోనే నిర్మించబడ్డాయి. ఆలంపూర్‌లో పలు సంఖ్యలో వీరి రాతిశాసనాలు ఉన్నాయి. మొదటి పులకేశి యొక్క శాసనం నల్గొండ జిల్లా ఏలేశ్వరంలో లభ్యమైంది. భవభూతి ఈ కాలం నాటి
తెలంగాణ కవి.

రాష్ట్రకూటుల కాలం: రెండో కీర్తివర్మతో చాళుక్యవంశం అంతంకాగా మాన్యఖేతం రాజధానిగా రాష్ట్రకూటులు పాలన సాగించారు. దంతిదుర్గుని కాలంలో తెలంగాణ మొత్తం రాష్ట్రకూటుల పాలనలో ఉండేది. తెలంగాణలో తొలి గద్యశాసనం కొరివి శాసనం ఈ కాలం నాటిదే. రాష్ట్రకూటుల సామంతులుగా ఉన్న వేములవాడ చాళుక్యులు బోధన్, వేములవాడలలో స్వతంత్ర పాలన చేశారు.

కళ్యాణి చాళుక్యకాలం: రాష్ట్రకూట రాజు రెండోకర్కరాజును ఓడించి రెండో తైలపుడు కళ్యాణి చాళుక్యరాజ్యం స్థాపించాడు. కవి రన్నడు ఇతని ఆస్థాన కవి. మహబూబ్‌నగర్ జిల్లా గంగాపురంలోని చెన్నకేశ్వస్వామి ఆలయాన్ని ఈ కాలంలోనే నిర్మించబడింది. ఈ ప్రాంతంలోవీరి పలు శాసనాలున్నాయి. ఇదే కాలంలో ఖమ్మం ప్రాంతంలో ముదిగొండ చాళుక్యులు పాలించారు. పాలమూరు జిల్లా మద్యభాగంలో కందూరి చోడుల పాలన కిందకు ఉండేది.

కందూరి చోడులు: క్రమక్రమంగా కందూరు చోళరాజ్యం విస్తరించింది. తొలి కాకతీయుల కాలం నాటికి ఇది కాకతీయ రాజ్యం కంటే పెద్ద రాజ్యంగా విలసిల్లింది. కందూరు, మగతల (నేటి మక్తల్), వర్థమానపురం (నేటి నంది వడ్డెమాన్), గంగాపురం, అమరాబాద్, భువనగిరి, వాడపల్లి, కొలనుపాక ఈ కాలంలో పెద్ద పట్టణాలుగా విలసిల్లాయి. విక్రమాదియుని కుమారుడు తైలపుని కాలంలో రాజ్యాన్ని రెండుగా చేసి ఇద్దరు కుమారులను రాజులుగా చేశాడు. దానితో ఇప్పటి నల్గొండ, పాలమూరు జిల్లా ప్రాంతాలలోవేర్వేరు పాలన సాగింది. గోకర్ణుడు తన రాజధానిని పానగల్లు నుంచి వర్థమాన పురానికి తరలించాడు. కందూరు చోడుల శాసనం ఒకటి మామిళ్ళపల్లిలో కూడా లభ్యమైంది. ఇదే కాలంలో వరంగల్ ప్రాంతంలో పొలవాస పాలకులు రాజ్యం చేశారు. అనుమకొండ (నేటి హన్మకొండ ప్రాంతం) మాత్రం కొలనుపాక రాజధానిగా కళ్యాణి చాళుక్యులే పాలించారు.

కాకతీయ కాలం: తొలి కాకతీయుల కాలంలో కాకతీయ సామ్రాజ్యం ఉత్తర తెలంగాణకే పరిమితమై ఉండగా రుద్రదేవుని కందూరు చోడరాజ్యంపై దండెత్తి వర్థమానపురాన్ని నాశనం చేసి తన సామంతులను పీఠం అధిష్టింపచేశాడు. తెలుగులో తొలి రామాయణం రంగనాథ రామాయణం రచించిన గోన బుద్ధారెడ్డి ఈ కాలం వాడే. ఈయన సోదరి కుప్పాంబిక తొలి తెలుగు కవియిత్రిగా ఖ్యాతిచెందింది. క్రీ.శ.1323లో ఢిల్లీ సుల్తానుల దాడితో కాకతీయ సామ్రాజ్యం అంతంకాగా తెలంగాణ ప్రాంతం సుల్తానుల వశమైంది. అయితే కొంతకాలానికే ప్రతాపరుద్రుని సేనానిగా పనిచేసిన రేచర్ల సింగమ నాయకుడు స్వతంత్రించి పద్మనాయక రాజ్యాన్ని స్థాపించాడు. ఇది దక్షిణ తెలంగాణ ప్రాంతంలో పాలన సాగించగా, ముసునూరి పాలకులు ఈశాన్య తెలంగాణలో కొంతవరకు పాలించారు. ఆ తర్వాత కృష్ణానదికి దక్షిణభాగం ఉన్న తెలంగాణ ప్రాంతం విజయనగర సామ్రాజ్యంలో భాగమైంది. ఉత్తర భాగం మాత్రం గోల్కొండ సుల్తానుల అధీనంలో ఉండేది.

కుతుబ్‌షాహీల కాలం: క్రీ.శ.1565లో విజయనగర సామ్రాజ్యం అంతం కాగా, దక్షిణ తెలంగాణ ప్రాంతం కుతుబ్‌షాహీల పాలనలోకి వచ్చింది. ఉత్తర ప్రాంతంలో అంతకు క్రితమే బహమనీలు పాలించారు. బహమనీ సామ్రాజ్యం ఐదు ముక్కలు అయిన పిదప గోల్కొండ ప్రాంతాన్ని కుతుబ్‌షాహీలు రాజ్యమేలారు. కుతుబ్‌షాహీల ఉచ్ఛదశలో కూడా కృష్ణానదికి దక్షిణాన ఉన్న తెలంగాణ ప్రాంతం (రాయచూర్ డోబ్‌లోని నడిగడ్డ ప్రాంతం) ఆదిల్‌షాహీల పాలన కిందకు ఉండేది. అయితే ఇది తరచుగా చేతులు మారింది. 1687లో ఈ ప్రాంతం మొఘలుల వశమైంది.

ఆసఫ్‌జాహీల కాలం: క్రీ.శ.1724 నుంచి తెలంగాణ ప్రాంతాన్ని ఆసఫ్‌జాహీలు పాలించారు. రాజభాషగా పర్షియన్ స్థానంలో ఉర్దూ ప్రవేశపెట్టారు. స్థానిక ప్రజలను అణకద్రొక్కి ఢిల్లీనుంచి ఉద్యోగస్తులను రప్పించడంతో ముల్కీ ఉద్యమం తలెత్తింది. క్రమక్రమంగా ప్రజలలో తలెత్తిన స్వేచ్ఛా భావనలతో 20వ శతాబ్ది ప్రారంభం నుంచి పలు రచయితల మూలంగా ప్రజలలో చైతన్యం వచ్చింది. సురవరం ప్రతాపరెడ్డి 1925లో గోల్కొండ పత్రికను స్థాపించడం, 1930 నుంచి నిజాం రాష్ట్ర ఆంధ్రమహాసభలు జరగడంతో ప్రజలలో చైతన్యం అధికమైంది. సురవరంతో పాటు బూర్గుల రామకృష్ణారావు, పులిజాల వెంకటరావు, కొండా వెంకట రంగారెడ్డి, మాడపాటి హన్మంతరావు, మందుముల నరసింగరావు, రావి నారాయణరెడ్డి, జమలాపురం కేశవరావు తదితరులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు.

హైదరాబాద్ సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు. దీన్నే తెలంగాణ విమోచనోద్యమంగా పిలుస్తారు. రెండు వందల సంవత్సరాల దోపిడి, అణిచివేతకు నలభై ఏడు సంవత్సరాల తిరుగుబాటు, సాయుధపోరాటం ఒక దశ మాత్రమే. వివిధ సంఘాల, పార్టీల, ప్రజాస్వామికవాదుల, రచయితల, ప్రజల సంఘటిత క్రమ-పరిణామపోరాటమది. హైదరాబాద్ సంస్థానంలో ప్రస్తుత తెలంగాణాతో పాటు మరాఠ్వాడ (మహారాష్ట్ర), బీదర్ (కర్ణాటక) ప్రాంతాలు ఉండేవి. 3 భాషా ప్రాంతాలకు చెందిన మొత్తం 16 జిల్లాలకు గాను 8 జిల్లాలు తెలంగాణా ప్రాంతానికి చెందినవి కాగా, మరాఠా, కన్నడ ప్రాంతాలకు చెందినవి 8 జిల్లాలుండేవి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిననూ నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వాతంత్ర్యం లేకపోవడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దేశమంతటా స్వాతంత్ర్యోత్సవాలతో ప్రజలు ఆనందంతో గడుపుచుండగా నిజాం సంస్థాన ప్రజలు మాత్రం నిరంకుశ బానిసత్వంలో కూరుకుపోయారు. హైదరాబాదు రాజ్యాన్ని పాలిస్తున్న ఏడవ నిజామ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ రజాకార్లను ఉసిగొల్పాడు. నిజాంకు అండగా ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు గ్రామాలపైబడి దోపిడిచేయడం, ఇండ్లు తగలబెట్టడం నానా అరాచకాలు సృష్టించారు. అతని మతోన్మాద చర్యలు కోరలాల్చి వెయ్యి నాల్కలతో విషంకక్కాయి. హీనమైన బతుకులు వెళ్ళదీస్తున్న జనం గురించి అస్సలు పట్టించుకోకుండా ప్రజల నుండి బలవంతంగా వసూలుచేసుకున్న సొమ్ముతో విలాసాలు, జల్సాలు, భోగభాగ్యాలు చేసుకొనేవారు. దీనితో రామానందతీర్థ నేతృత్వంలో ఆర్యసమాజ్ ఉద్యమాలు, కమ్యూనిష్టుల ఆధ్వర్యంలో సాయుధపోరాటాలు ఉధృతమయ్యాయి. మొదట నల్గొండ జిల్లాలో ప్రారంభమైన ఉద్యమం శరవేగంగా నైజాం సంస్థానం అంతటా విస్తరించింది. రావి నారాయణరెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం, మాడపాటి హనుమంతరావు, దాశరథి రంగాచార్య, కాళోజి నారాయణరావు, షోయబుల్లాఖాన్, సురవరం ప్రతాపరెడ్డి తదితర తెలంగాణ సాయుధ పోరాటయోధులు వారికి స్ఫూర్తినిచ్చే కవులు, రచయితలు మూలంగా 1948లో ఉధృతరూపం దాల్చి చివరికి భారత ప్రభుత్వం సైనిక చర్యతో నైజాం సంస్థానాన్ని 1948 సెప్టెంబరు 18న భారత్ యూనియన్‌లో విలీనం చేసుకుంది.

తెలంగాణ విమోచనోద్యమం: 1947, ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినను తెలంగాణ ప్రాంతం నిజాం పరిపాలనలోని హైదరాబాదు సంస్థానంలో భాగంగా ఉండేది. తరువాత పోలీసు చర్య ద్వారా 1948, సెప్టెంబరు 17ఇది భారతదేశంలో కలపబడింది. ఈ పోరాటంలో (తెలంగాణ విమోచనోద్యమం, తెలంగాణా సాయుధ పోరాటం) నాటి రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ముఖ్య భూమిక పోషించింది. 1948 నుంచి హైదరాబాదు రాష్ట్రంగా కొనసాగింది. వెల్లోడి, బూర్గుల రామకృష్ణారావు ఈ కాలంలో ముఖ్యమంత్రులుగావ్యవహరించారు.

తెలంగాణ రాష్ట్రంలో చారిత్రక, అధ్యాత్మిక, సాంస్కృతిక తదితర పర్యాటక ప్రాంతాలకు కొదువలేదు. ఆలంపూర్‌లో అష్టాదశ శక్తిపీఠం, బాసరలో జ్ఞానసరస్వతి దేవాలయం, భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం, యాదగిరి గుట్టలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, వేములవాడలో శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం, నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం, నిజామాబాద్ సారంగపూర్ హనుమాన్ మందిరం (ఇది చత్రపతి శివాజి గురువైన సమర్థ రామదాసు నిర్మించినది), ఆర్మూర్ సిద్దులగుట్ట, నిజామాబాద్ ఖిల్లారఘునాధ ఆలయం (ఇది చత్రపతి శివాజి గురువైన సమర్థ రామదాసు నిర్మించినది), డిచ్ పల్లి ఖిల్లా రామాలయం, ( కేస్లాపూర్‌లో నాగోబా దేవాలయం, సిరిచెల్మలో సోమేశ్వరాలయం, జైనాథ్‌లో పల్లవుల కాలం నాటి ఆలయం, గంగాపూర్‌లో కళ్యాణి చాళుక్యుల కాలం నాటి చెన్నకేశ్వస్వామి ఆలయం, కదిలిలో పాపహరేశ్వరాలయం, ధర్మపురిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కొండగట్టులో ఆంజనేయస్వామి ఆలయం, కాళేశ్వరంలో కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం, అచ్చంపేట సమీపంలో ఉమామహేశ్వర ఆలయం, నారాయణపేట సమీపంలో ఔదుంబరేశ్వరాలయం, సిర్సనగండ్లలో సీతారామాలయం, మన్యంకొండలో శ్రీవెంకటేశ్వరాలయం, మామిళ్ళపల్లిలో నృసింహక్షేత్రం, బీచుపల్లిలో పురాతనమైన ఆంజనేయస్వామి ఆలయం, మెదక్‌లో పెద్ద చర్చి, ఏడుపాయలలో భావాని మందిరం, కొత్లాపూర్‌లో ఎల్లమ్మ ఆలయం, ఝురాసంగంలో కేతకీ ఆలయం, కొల్చారంలో జైనమందిరం, నాచగిరిలోనృసింహాలయం, బొంతపల్లిలో వీరభద్ర ఆలయం, వరంగల్‌లో వేయిస్తంభాల ఆలయం, భద్రకాళి ఆలయం, నిజామాబాద్ జిల్ల లింబాద్రిగుట్టపై లక్ష్మీనృసింహస్వామి ఆలయం, బోధన్ ఏకచక్రేశ్వర ఆలయం, తాండూరులో భద్రేశ్వరస్వామి ఆలయం, అనంతగిరిలో పద్మనాభస్వామి ఆలయం, కీసరలో రామలింగేశ్వరస్వామి ఆలయం, చేవెళ్ళలో వెంకటేశ్వరస్వామి ఆలయం, చిలుకూరులో బాలాజీ ఆలయం, పాంబండలో రామాయణం కాలం నాటి శివాలయం, దామగుండంలో రామలింగేశ్వరాలయం, పాలంపేటలో రామప్పదేవాలయం, కొమురవెల్లిలో మల్లికార్జునస్వామి ఆలయం, మేడారంలో సమ్మక్క-సారక్క గద్దె ఉన్నాయి.వరంగల్ జిల్లా మేడారానికి 20 కిలోమీటర్ దూరంలో బ్రిటిష్ కాలానికి చెందిన అద్భుతమైన మరో ప్రకృతి వనం అందులోనూ కొలకత్తా హౌరా బ్రిడ్జి నమూనా రెండు వేరు వేరు దీవులను ఏకం చేస్తూ కట్టిన మరో అద్భుతం లక్నవరపు సరస్సు.

ఆదిలాబాదు జిల్లాలో ఎత్తయిన కుంటాల జలపాతం, పొచ్చెర జలపాతం, కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యం, బత్తీస్‌ఘఢ్ కోట, హైదరాబాదులో బిర్లామందిరం, బిర్లా ప్లానెటోరియం, చార్మినార్, గోల్కొండ కోట, నెహ్రూ జూపార్క్, రామోజీ ఫిలిం సిటి, సాలార్జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్, లుంబినీ పార్క్, ఎన్టీయార్ గార్డెన్, సంఘీనగర్ వెంకటేశ్వరాలయం, సర్దార్ మహల్, కరీంనగర్ జిల్లాలో జగిత్యాల ఖిల్లా, ఎలగందల్, రామగిరిఖిల్లా, ఖమ్మం జిల్లాలో రామాయణం కాలం నాటి పర్ణశాల, పాపికొండలు, కిన్నెరసాని అభయారణ్యం, నేలకొండపల్లి బౌద్ధస్తూపం, ఖమ్మం ఖిల్లా, పాలమూరు జిల్లాలో పిల్లలమర్రి వృక్షం, గద్వాల కోట, ఖిల్లాఘనపురం కోట, అంకాళమ్మ కోట, కోయిలకొండ కోట, పానగల్ కోట, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, వరహాబాదు వ్యూపాయింట్, మల్లెలతీర్థం, నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు, భువనగిరి కోట, దేవరకొండ దుర్గం, నిజామాబాదు జిల్లాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, అలీసాగర్ ప్రాజెక్టు, దోమకొండ కోట,నిజాంసాగర్ ప్రాజెక్టు, నిజామాబాద్ కందకుర్తి త్రివేణి సంగమం (గోదావరి, మంజీరా, హరిద్రా నదులు కలిసే స్థలం), రాస్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థాపకుడు కేశవరావ్ హెగ్డేవార్ జన్మస్థలం, రంగారెడ్డి జిల్లాలో అనంతగిరి కొండలు, కోట్‌పల్లి ప్రాజెక్టు, గండిపేట, శామీర్‌పేట చెరువు, వరంగల్ జిల్లాలో ఓరుగల్లు కోట, రామప్ప, వెయ్యి స్తంభాల గుడి,  పాకాల చెరువు, లక్నవరం, భోగత జలపాతం,  మెదక్ జిల్లాలో మెదక్ ఖిల్లా, పోచారం అభయారణ్యం, మంజీరా అభయారణ్యం, కొండాపూర్ మ్యూజియం, వనపర్తి జిల్లాలో వనపర్తి సంస్థానం, తిరుమలయ్య గుట్ట దేవాలయం, శ్రీరంగాపూర్ రంగనాయకస్వామి ఆలయం, తదితర పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.

తెలంగాణలో హైదరాబాదు జిల్లా ఆర్థికంగా ముందంజలో ఉండగా ఆదిలాబాదు జిల్లా వెనుకబడి ఉంది. రాష్ట్రంలోని మొత్తం జీడిపిలో సేవారంగం వాటా 59.01% ఉంది. వ్యవసాయరంగంలో 55.7% మంది పనిచేస్తుండగా, సేవారంగంలో 32.6%, పారిశ్రామిక రంగంలో 11% పనిచేస్తున్నారు. హైదరాబాదు జిల్లా నుంచి సేవారంగంలో సింహభాగం వాటా లభిస్తుండగా, పారిశ్రామిక రంగం నుంచి హైదరాబాదు పరిసరాలలోని రంగారెడ్డి జిల్లా ప్రాంతం నుంచి, మెదక్ జిల్లా పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతం నుంచి, మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు ప్రాంతం నుంచి లభిస్తుంది.

తలసరి ఆదాయం:తెలంగాణ ప్రాంతపు ప్రజల తలసరి ఆదాయం రూ.36082గా ఉంది. జిల్లాల వారీగా చూస్తే, హైదరాబాదులో అత్యధికంగా ఉండగా ఆదిలాబాదు, మహబూబ్ నగర్ జిల్లాల తలసరి ఆదాయం అత్యల్పంగా ఉంది.

ఖనిజాలు: తెలంగాణలో అనేక ఖనిజ నిక్షిప్తమై ఉన్నాయి. కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాదు జిల్లాలలో బొగ్గు గనులు, ఆదిలాబాదు, నిజామాబాద్, వరంగల్ ప్రాంతాలలో ముడి ఇనుము, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలలో ముగ్గు రాయి, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలలో సున్నపురాయి నిక్షేపాలు విస్తృతంగా వ్యాపించి ఉన్నాయి.

పరిశ్రమలు: హైదరాబాదు, పరిసరాలలో అన్ని రకాల పరిశ్రమలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా తాండూరు లో, నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతంలో సిమెంటు పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో పారిశ్రామికవాడ ఉంది. మెదక్ జిల్లా పటాన్‌చెరు ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. బోధన్ లో చక్కెర కర్మాగారం, సిర్పూర్‌లో కాగితం పరిశ్రమ, కొత్తగూడెంలో ఎరువుల పరిశ్రమ ఉంది.

విద్యుత్ కేంద్రాలు:

వ్యవసాయం: ప్రాచీన కాలంలో ముఖ్యంగా కాకతీయుల కాలంలో తెలంగాణ ప్రాంతం వ్యవసాయికంగా బాగా అభివృద్ధి చెందింది. వ్యవసాయాభివృద్ధి కోసం కాకతీయులు నిర్మించిన పలుచెరువులు నేటికీ కనిపిస్తున్నాయి. రెండొబేతరాజు కేసరి సముద్రం నిర్మించగా, గణపతిదేవుడు దేశం (తెలంగాణ) నలుమూలలా పలు భారీ చెరువులను నిర్మించాడు. గణపతిదేవుడి సేనాని రేచర్ల రుద్రుడు ప్రఖ్యాతిగాంచిన రామప్ప చెరువును త్రవ్వించాడు. తెలంగాణ ప్రాంతంలో సువాసనలువెదజల్లే బియ్యం పండుతున్నట్లు అప్పట్లోనే సాహితీవేత్తలు పేర్కొన్నారు. కుతుబ్‌షాహీ, ఆసఫ్‌జాహీల కాలంలో కూడా ఈ ప్రాంతం వ్యవసాయంలో పేరుగాంచింది. 1914లో వ్యవసాయాభివృద్ధి కోసం సహకార వ్యవస్థను ఏర్పాటుచేశారు. నిజాంసాగర్ (1935)జలాశయం, అలీసాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, గండిపేట చెరువుల నిర్మాణం జరిగింది. నిజామాబాద్ జిల్లా రుద్రూర్లో ప్రాంతీయ చెరుకు, వరి పరిశోధనా స్థానము (1935) ఏర్పాటు చేశారు. 
ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లాలో వరి, జొన్నలు, కందులు, ఆదిలాబాదు జిల్లాలో ప్రత్తి, నిజామాబాదు జిల్లాలో వరి, చెరుకు, మొక్కజొన్న, కరీంనగర్ జిల్లాలో వరి, ప్రత్తి, మెదక్ జిల్లాలో వరి, మొక్కజొన్న, వరంగల్ జిల్లాలో ప్రత్తి, వరి, నల్గొండ జిల్లాలో వరి, ప్రత్తి, రంగారెడ్డి జిల్లాలో వరి, కందులు అధికంగా పండుతాయి.తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల ద్వారా 70 లక్షల ఆయకట్టుకు పుష్కలమైన సాగునీరు అందుతున్నది. మరో 15.71 లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. 

తెలంగాణ రాష్ట్ర రహదారుల జాబితా చూడండి
వాయు రవాణా: రంగారెడ్డి జిల్లాలోని శంషాబాదులో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇక్కడి నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు, విదేశాలకు వెళ్ళడానికి సదుపాయం ఉంది. ఈ విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ విమానాశ్రయంగా పలుసార్లు అవార్డులు పొందినది. విమానాశ్రయ ఏర్పాటుకు ముందు బేగంపేటలో డొమెస్టిక్ విమానాశ్రయం ఉండేది. వరంగల్, నిజామాబాదు, రామగుండంలలో కూడా విమానాశ్రయాలు ఏర్పాటుచేయాలనే ప్రతిపాదన ఉంది.

రైలు రవాణా: సికింద్రాబాదు, కాజీపేటలు తెలంగాణలోని రైల్వేజంక్షన్లు. సికింద్రాబాదు దక్షిణ మధ్య రైల్వే యొక్క ప్రధాన కేంద్రము, డివిజన్ కేంద్రము . హైదరాబాదు/సికింద్రాబాదు నుంచి దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు రైళ్ళు ఉన్నాయి. నిజాంల కాలంలో 1874లో వాడి నుండి హైదరాబాదుకు రైలుమార్గం వేయబడింది. సికింద్రాబాదు-విజయవాడ మార్గం 1886లో పూర్తయింది. కాచిగూడ నుండి కామారెడ్డి, నిజామాబాద్, బాసర, నాందేడ్, ఔరంగబాద్ ల మీదుగా మన్మాడ్ వరకు గోదావరి వ్యాలీ రైలు మార్గం 1899లో మొదలు పెట్టి 1901లో ప్రారంభమైంది. సికింద్రాబాదు నుంచి మహబూబ్‌నగర్, కర్నూలు మీదుగా బెంగుళూరుకు, స్వాతంత్ర్యానంతరం బీబీనగర్ నుంచి నడికుడికి మార్గాలు వేశారు. నూతనంగా గద్వాల నుంచి రాయచూర్ మార్గం 2013, అక్టోబరు 12 న ప్రారంభమైంది. దేవరకద్ర నుంచి రాయచూరు, నిజామాబాద్ నుంచి పెద్దపల్లితో సహా పలు మార్గాలు నిర్మాణంలో ఉన్నాయి.

రోడ్డు రవాణా: దేశంలోనే పొడవైన 7వ (కొత్త పేరు 44వ) నెంబరు జాతీయ రహదారి ఆదిలాబాదు, నిజామాబాదు, మెదక్, రంగారెడ్డి, హైదరాబాదు, మహబూబ్‌నగర్ జిల్లాల మీదుగా ఉత్తర-దక్షిణంగా వెళ్ళుచున్నది. పూనా-విజయవాడలను కలిపే 9వ నెంబరు జాతీయ రహదారి తూర్పు-పడమరలుగా మెదక్, రంగారెడ్డి, హైదరాబాదు, నల్గొండ జిల్లాల మీదుగా పోతుంది. నిజామాబాదు నుంచి జగదల్‌పూర్ వెళ్ళే జాతీయ రహదారి 16వ (కొత్త నంబరు 63) నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాదు జిల్లాల మీదుగా వెళ్ళుచున్నది. హైదరాబాదు నుంచి భూపాలపట్నం వెళ్ళు జాతీయ రహదారి హైదరాబాదు, రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి వెళ్తుంది.

తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014) చూడండి

హైదరాబాదు సంఘసంస్కర్తగా పేరుపొందిన భాగ్యరెడ్డివర్మ, తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం రచించిన గోన బుద్దారెడ్డి, సహజకవి బమ్మెరపోతన, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జైరాజ్, కవి, విమోచనోద్యమకారుడు దాశరథి రంగాచార్యులు, కవయిత్రి సరోజినీ నాయుడు, కవి పండితుడు వానమామలై వరదాచార్యులు, ఒగ్గు కథకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన మిద్దె రాములు, విమోచనోద్యమకారుడు, నిజాంపైబాంబులు విసిరిన నారాయణరావు పవార్, చిత్రకళాకారుడు కొండపల్లి శేషగిరి రావు, తెలంగాణవాది, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ, సాహితీవేత్త జువ్వాడి గౌతంరావు, సుమతీ శతక కర్త బద్దెన, తొలి తెలుగు పురాణ అనువాదకుడు, మార్కండేయ పురాణం రచించిన మారన, భూమి కోసం, భుక్తి కోసం సాయుధపోరాటం చేసిన దొడ్డి కొమరయ్య, సాహితీవేత్త దేవులపల్లి రామానుజరావు, తెలంగాణ కాటన్‌గా ప్రసిద్ధి చెందిన నవాబ్ అలీ నవాబ్‌జంగ్ బహదూర్, ప్రధానమంత్రిగా పనిచేసిన పి.వి.నరసింహరావు, సంకీర్తనాచార్యుడు ముష్టిపల్లి వేంకటభూపాలుడు, విద్యావేత్త చుక్కా రామయ్య, ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి సుబ్బారావు, నిజాం కాలంలో కొత్వాల్‌గా పనిచేసిన రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి, సాయుధపోరాట యోధుడు ఆరుట్ల రామచంద్రారెడ్డి, కవి వేములవాడ భీమకవి, సమరయోధుడు రాధాకిషన్ మోదాని, జానపద సాహిత్య సృష్టికర్త బిరుదురాజు రామరాజు, తెలంగాణ సాహితీమూర్తి లక్ష్మీ నరసింహశర్మ, ప్రముఖ సమరయోధుడు పులిజాల వెంకటరంగారావు, 13వ శతాబ్దికి చెందిన శివకవి పాల్కురికి సోమనాథుడు, కమ్యూనిస్ట్ నాయకుడు బొమ్మగాని ధర్మభిక్షం, తెలంగాణ సాయుధ పోరాట సేనాని రాజ్ బహదూర్ గౌర్, నిజాంపై తిరగబడిన షోబుల్లాఖాన్, గద్వాల కోటను నిర్మించిన పెద సోమభూపాలుడు, సమరయోధుడు జమలాపురం కేశవరావు, చిత్రకారుడు పాకాల తిరుమల రెడ్డి, కవి సామల సదాశివ, సాహితీ వేత్త కూరెళ్ల విఠలాచార్య, సమరయోధుడు, సంఘసంస్కర్త పల్లెర్ల హనుమంతరావు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఒక రూపు తీసుకువచ్చిన కొత్తపల్లి జయశంకర్, అడవి బిడ్డలకు అండగానిలిచిన రాంజీ గోండు, కుతుబ్‌షాహీల నాటి కవి మరింగంటి సింగనాచార్యులు, తెలంగాణ ఉద్యమకారిణి టి.ఎస్.సదాలక్ష్మి, తొలితరం తెలుగు కవి కొరవి గోపరాజు, నటుడు కత్తి కాంతారావు, విమోచనోద్యమకారుడు విశ్వనాథ్ సూరి, దక్షిణ భారతదేశంలోనే తొలి మహిళాపాలకురాలు రుద్రమదేవి, ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి అంజయ్య, సాహితీవేత్త కృష్ణస్వామి ముదియార్, తెలంగాణభాషలో కవితలద్దిన కాళోజీ నారాయణరావు, కవి మల్లినాథ సూరి, ప్రముఖ చిత్రకారుడు కాపు రాజయ్య, కవి, కళాకారుడు సుద్దాల హనుమంతు, బహుముఖ ప్రజ్ఞాశాలి వట్టికోట ఆళ్వారుస్వామి, తెలంగాణ రైతాంగపోరాటయోధుడు బందగి, కమ్యూనిస్ట్ నాయకుడు రావి నారాయణరెడ్డి, ముఖ్యమంత్రిగా, గవర్నరుగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు, సమరయోధుడు మందుముల నరసింగరావు, కళాకారుడు, కవి పల్లెర్ల రామ్మోహనరావు, గవర్నరుగా పనిచేసిన బి.సత్యనారాయణ రెడ్డి, తెలంగాణలో కవులే లేరని హేళన చేయగా గోల్కొండకవుల చరిత్రతో నోరుమూయించిన సురవరం ప్రతాపరెడ్డి, కవి, చరిత్ర పరిశోధకుడు కపిలవాయి లింగమూర్తి, తొలితెలుగు కవయిత్రి కుప్పాంబిక, చరిత్ర పరిశోధకుడు, సాహితీవేత్త గడియారం రామకృష్ణ శర్మ, తెలంగాణ ఉద్యమనేత బొజ్జం నరసింహులు, నిజాం పాలనను ఎదిరించి ప్రజలలో చైతన్యం తెచ్చిన అనభేరి ప్రభాకరరావు, 15వ శతాబ్దికి చెందిన ప్రముఖ కవి చరిగొండ ధర్మన్న, మొఘల్ పాలనను అడ్డుకున్న సర్వాయి పాపన్న, కూచిపూడి నృత్యంలో అంతర్జాతీయ ఖ్యాతిచెందిన రాజారాధారెడ్డి దంపతులు, ఆర్యసమాజ్ పండిత్ నరేంద్రజీ, విమోచనోద్యమకారుడు పాగ పుల్లారెడ్డి, నిజాంపై తిరగబడిన ఆదివాసి కొమురం భీమ్, ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు, తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపకుడు కె.చంద్రశేఖర రావు, ముఖ్యమంత్రిగా, గవర్నరుగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి, కథా రచయిత అల్లం రాజయ్య, ప్రముఖ వాగ్గేయకారుడు రాకమచర్ల వేంకటదాసు, తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్న కోదండరాం, విమోచనొద్యమకారుడు వెల్దుర్తి మాణిక్యరావు, ప్రముఖ విద్యావేత్త జి.రాంరెడ్డి, చిత్రకారుడు తోట వైకుంఠం, శాసనసభ స్పీకరుగా పనిచేసిన దుద్దిల్ల శ్రీపాద రావు, చేనేత వస్త్ర పరిశోధకుడు నల్ల పరంధాములు, ప్రముఖ సాహితీవేత్త, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణ రెడ్డి, కేంద్రమంత్రిగా పనిచేసి, ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నరుగా ఉన్న సి.హెచ్.విద్యాసాగర్ రావు, చరిత్ర పరిశోధకుడు ఆదిరాజు వీరభద్రరావు, విమోచనోద్యమకారిణి ఆరుట్ల కమలాదేవి, విప్లవకవి గద్దర్, రచయిత జ్వాలాముఖి, విమోచనొద్యమకారుడు మగ్దూం మొహియుద్దీన్, ప్రస్తుత కేంద్రమంత్రి సూదిని జైపాల్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ పితామహుడిగా పేరుపొందిన కొండా వెంకట రంగారెడ్డి,తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారి నిరాహారదీక్ష కీలక ఘట్టం అయితే.....స్వరాస్ట్రం కోసం అసువులు బాసిన తొలి అమరుడు శ్రీకాంతాచారి.కణకణలాడే నిప్పును ముద్దాడి తన శ్వాస ఆశ ఆశయం తెలంగాణ రాష్ట్రం అంటూ ఉద్యమ సాక్షిగా మంటల్లో మాడి మసి అయిన విద్యార్థి శ్రీకాంతాచారి, 2009 డిసెంబరు 3వ తేదీన ప్రాణత్యాగం చేసిన తొలి అమరుడు 13వ శతాబ్దిలో గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం ద్విపద ఛందస్సులో రచించాడు. ఇది తొలి తెలుగు రామాయణంగా ప్రసిద్ధి చెందినది. గోన బుద్ధారెడ్డి సోదరి కుప్పాంబిక తొలి తెలుగు కవయిత్రిగా ఖ్యాతి పొందింది. ఈమె వేయించిన బూదపురం శాసనం నేటి భూత్పూర్‌లోని దేవాలయంలో ఉంది. తెలంగాణ సాహిత్యంలో కాకతీయ యుగం స్వర్ణయుగంగా భావించబడుతుంది. గణపతిదేవుని బావమరిది జాయపసేనాని నృత్యరత్నావళిని రచించాడు. తొలిసారిగా స్వతంత్ర రచన చేసిన పాల్కుర్కి సోమనాథుడు తెలుగు సాహిత్యంలోనే ఆదికవిగా నిలిచాడు. వేములవాడ భీమకవి ఈ కాలం నాటివాడే. 13వ శతాబ్దికే చెందిన బద్దెన కాకతీయుల కాలంలో సుమతీ శతకము రచించాడు. తొలి పురాణ అనువాద మహాకవి మారన ఇదే కాలానికి చెందినవాడు. ప్రతాపరుద్రుని ఆస్థానకవి విద్యానాథుడు రచించిన పలు గ్రంథాలలో ప్రతాపరుద్ర యశోభూషణం ప్రఖ్యాతిచెందింది. మూడు తరాల కాకతీయ చక్రవర్తుల వద్ద మంత్రిగా పనిచేసిన శివదేవయ్య కూడా మహాకవి. 14వ శతాబ్దికి చెందిన కాచ-విఠలులు తొలి తెలుగు జంటకవులుగా ప్రసిద్ధి చెందారు. చమత్కార చంద్రిక రచించిన విశ్వేశ్వరుడు కూడా 14వ శతాబ్దికి చెందిన కవి. తెలుగులో తొలి యక్షగాన రచయిత సర్వజ్ఞ సింగభూపాలుడు కూడా ఇదే కాలానికి చెందినవాడు. అనపోత నాయకుని కుమారుడు రెండో సింగభూపాలుడు స్వయంగా కవి, బహుముఖ ప్రజ్ఞాశాలి. విజయనగర రాజు బుక్కరాయల కోడలైన గంగాదేవి కాకతీయుల ఆడబిడ్డ, ఈమె కవయిత్రిగా పేరుపొందింది. తొలి తెలుగు వచనకర్త కృష్ణమాచార్యులు కూడా 14వ శతాబ్దికి చెందినవాడు. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు స్వయంగా కవి అయి శివయోగసారం లాంటి పలు రచనలు చేశాడు. సింహాసన ద్వాత్రింశిక రచించిన కొరవి గోపరాజు కూడా ఇదే కాలానికి చెందినవారు. సిగ్మండ్ ప్రాయిడ్ కంటే ముందే మానసిక సమస్యలు విశ్లేషించిన వాడిగా గోపరాజు ప్రఖ్యాతిచెందారు. చిత్రవిచిత్రాలతో కూడిన చిత్రభారతం రచయిత చరిగొండ ధర్మన్న 15-16వ శతాబ్దికి చెందిన కవి. 

కాకతీయ సామ్రాజ్య పతనానంతరం తెలంగాణలో తెలుగు సాహిత్య ప్రభ తగ్గిననూ మరింగంటి సింగరాచార్యులు తన కవిత్వంతో ఇబ్రహీం కుతుబ్‌షానే మెప్పించి అగ్రహారాన్ని పొందాడు. అప్పటి కవులు ఇతనిని మల్కిభరాముడని అభివర్ణించారు. ఇబ్రహీం కుతుబ్‌షా ఆస్థానకవి అద్దంకి గంగాధరుడు ప్రతిభావంతుడైన కవి. ఇతను రచించిన తపతి సంవర్ణోపాఖ్యానం ప్రఖ్యాతిచెందింది. పొన్నెగంటి తెలగనాచార్యుడు 16వ శతాబ్దికి చెందినకవి. కులీకుతుబ్‌షా ఫారసీ కవులను ఆదరించాడు. ఇతని కాలంలో ఫారసీ, ఉర్దూలలో పలు రచనలువెలువడ్డాయి. కులీకుతుబ్‌షా సంస్కృత శుకసప్తతిని యాతినామా పేరుతో ఫారసీలోకి అనువాదం చేయించాడు. ఈ కాలంలోనే దోమకొండ సంస్థానం సాహిత్యానికి పేరుగాంచింది. 1600 ప్రాంతానికి చెందిన కాసే సర్వప్ప సిద్దేశ్వర చరిత్ర రచించాడు. సురభి మాధవరాయల ఆస్థానకవి ఎలకూచి బాలసరస్వతి తెలుగులోనే మొట్టమొదటి మహామహోపాధ్యాయ కవిగా గణతికెక్కాడు. కొందరు గుంటూరు జిల్లా కవిగా భావించే కాకునూరి అప్పకవి తెలంగాణ వాడేనని బూర్గుల నిరూపించాడు. తానీషా వద్ద పనిచేసే అక్కన్న-మాదన్నల మేనల్లుడు కంచెర్ల గోపన్న (భక్తరామదాసు) కీర్తనలు తెలుగువారికి శతాబ్దాల నుంచి సుపరిచితమే. 

ఆసఫ్‌జాహీల కాలంలో (1724-1948) తెలంగాణ సాహిత్యం కుంటుపడింది. తెలుగుభాషను అణగద్రొక్కి బలవంతంగా ప్రజలపై ఉర్దూభాష రుద్దడం, తెలుగు కవులకు ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడంతో కాకతీయుల కాలంలో వెలుగులు విరజిమ్మిన తెలంగాణ సాహిత్యం ఆసఫ్‌జాహీలకాలంలో దారుణంగా దెబ్బతిన్నది. అక్కడక్కడా తెలుగులో రచించిన గ్రంథాలు కూడా వెలుగులోకి రాకుండా చేశారు. ఈ కాలంలో స్థానిక స్థల మహాత్మ్యాలు, దేవాలయ చరిత్రల విశేషాలు రచించినవి తర్వాతి కాలంలో బయటపడ్డాయి. భజనకీర్తనలు కూడా ఈ కాలంలో వ్రాయబడ్డాయి. మన్నెంకొండ హనుమద్దాసు, రాకమచర్ల వేంకటదాసు, వేపూరు హనుమద్దాసు ఈ కాలంలోని సంకీర్తన త్రిమూర్తులుగా పరిగణించబడతారు. రాజవోలు ప్రభువు ముష్టిపల్లి వేంకటభూపాలుడు వేలాది సంకీర్తనలు రచించాడు. ఆసఫ్‌జాహీలు స్వయంగా కవిపండితులకు ఆదరణ ఇవ్వకున్ననూ స్వతంత్రంగా పాలన కొనసాగించిన సంస్థానాలలో మాత్రం సాహిత్యం బాగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ఆధునిక కాలంలో కవిపండితులకు నిలయమైన గద్వాల సంస్థానం ప్రత్యేకతను కలిగియుంది. సాహితీవేత్తలు ఈ సంస్థానాన్ని విద్వత్గద్వాలగా అభివర్ణించేవారు. గద్వాల సంస్థానాధీశూలు కూడా స్వయంగా కవులుగా ఉండి పలు రచనలు చేశారు. తరుచుగా కవితాగోష్టులు నిర్వహించేవారు. గద్వాల సంస్థానాధీశులు కవులను ఎంతగా అభిమానించేవారంటే, వారి కోసం ఒక ప్రత్యేక ద్వారాన్నే ఏర్పాటు చేసి, వారు నడిచే మార్గంలో తెల్లటి వస్త్రాన్ని పరిచి, కవిపండితుల పాదధూళిని భరిణెలో భద్రపర్చి వాటిని తిలకంగా నుదుటికి పెట్టుకొనేవారు. గద్వాల సంస్థానంతో పాటు పరిసర సంస్థానాలైన వనపర్తి సంస్థానం, జటప్రోలు సంస్థానాధీశూలు కూడా గద్వాల సంస్థానంతో పోటీపడ్డారు. వీరి మధ్య తరుచుగా కవితా గోష్టులు జరిగేవి. తిరుపతి వేంకటకవులను కూడా ఓడించిన ఘనత వనపర్తి సంస్థాన కవులకు దక్కింది.

పండుగలు: బోనాల ఉత్సవాలు, బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ యొక్క ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. ఇవి కాకుండా మిగితా తెలుగు ప్రజలు జరుపుకొనే సంక్రాంతి, ఉగాది, దసరా, వినాయక చవితి, రంజాన్ తదితర ముఖ్య పండుగులను ఇక్కడి ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. 2014 జూన్ 26న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోనాలును రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ఉత్తర్వు జారీచేసింది.

భాష: తెలంగాణ రాష్ట్రంలో అధిక సంఖ్యాకుల భాష తెలుగు. సంపూర్ణ తెలంగాణావారు మాట్లాడే తెలుగు భాషలో ఉర్దూ పదాలు ఎక్కువగా కలుస్తాయి. ఆదిలాబాదు జిల్లాకు మూడు వైపులా మహారాష్ట్ర సరిహద్దు ఉండటంతో ఆ జిల్లాలో మరాఠి భాష ప్రభావం కొంత ఉంది. మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాదు జిల్లాల కర్ణాటక సరిహద్దు గ్రామాలలో కన్నడ భాష ప్రభావం కొంతవరకు కనిపిస్తుంది. తెలంగాణ ప్రాంతపు గ్రామీణ తెలుగు భాష యాసలో మిగితా ప్రాంతపు తెలుగు భాషకు కొద్దిగా వైరుధ్యం కనిపిస్తుంది. తెలంగాణాలోని ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుల్లో కొద్దిగా స్వచ్ఛమైన తెలుగు వినిపిస్తుంది.

వస్త్రధారణ: తెలంగాణ ప్రాంతము ఉత్తర-దక్షిణ భారతదేశానికి వారధిగా ఉండటం,కొన్ని శతాబ్దాల నుంచి ఈ ప్రాంతంపై దండయాత్రలుచేసి పాలించడం, ఇతర ప్రాంతాల వారు వచ్చి నివాసం ఏర్పర్చుకోవడంతో ఇక్కడ మిశ్రమ వస్త్రధారణ ఉంది. అలాగే మారుతున్న ధోరణులు, సినిమా-అంతర్జాలం-అంతర్జాతీయీకరణ తదితరాల వల్ల కూడా ఇక్కడి వస్త్రధారణ పట్టణ ప్రాంతాలలో చాలా మార్పుచెందింది. అయిననూ తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో పురుషులు మోకాళ్లపైకి ఉండే ధోవతి, మహిళలు చీరలు ధరించడం సాధారణంగా కనిపిస్తుంది. గిరిజన ప్రాంతాల మహిళలు మాత్రం వారి సంప్రదాయక దుస్తులు ధరిస్తారు.

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన పంట వరి. రెండో ప్రధాన పంట జొన్నలు. ప్రాజెక్టులు, నదులు, కాలువలు ఉన్న ప్రాంతాలలో వరి అధికంగా పండుతుంది. జొన్నల ఉత్పత్తిలో మహబూబ్‌నగర్, మెదక్, ఆదిలాబాదు జిల్లాలు తొలి మూడు స్థానాలలో ఉన్నాయి. కందుల ఉత్పత్తికి మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్ నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లా తాండూరు నియోజకవర్గం పేరుగాంచాయి. మొక్కజొన్న ప్రధానంగా మహబూబ్‌నగర్, మెదక్, కరీంనగర్, నిజామాబాదు, వరంగల్ జిల్లాలో పండుతుంది. పెసర్ల పంటలో మెదక్ జిల్లా అగ్రస్థానంలో ఉంది. నూనెగింజల ఉత్పత్తిలో మహబూబ్‌నగర్ జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా నిజామాబాదు జిల్లా తర్వాతి స్థానంలో ఉంది. చెరుకు ఉత్పత్తిలో మెదక్ జిల్లా తెలంగాణలో తొలి స్థానంలో ఉంది. మిరపపంటలో ఖమ్మం జిల్లా అగ్రస్థానం పొందగా, పత్తి ఉత్పత్తిలో ఆదిలాబాదు జిల్లా ముందంజలో ఉంది. పొగాకు, ఉల్లి సాగులో మహబూబ్ నగర్ జిల్లా ప్రథమస్థానంలో ఉంది. మొత్తం సాగుభూమి విస్తీర్ణంలో భౌగోళికంగా పెద్ద జిల్లా అయిన మహబూబ్‌నగర్ అగ్రస్థానంలో ఉండగా పూర్తిగా నగర ప్రాంతమైన హైదరాబాదు జిల్లాలో ఎలాంటి సాగుభూమి లేదు. తెలంగాణలోని వ్యవసాయాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ పర్యవేక్షిస్తుంది.

తెలంగాణలోని పలు ప్రాంతాలు కళలకు ప్రసిద్ధి చెందినవి. ఆదిలాబాదు జిల్లా నిర్మల్ కొయ్యబొమ్మలకు పేరుగాంచగా, వరంగల్ జిల్లా పెంభర్తి ఇత్తడి సామానుల తయారికి ప్రసిద్ధి చెందింది. ఆదిలాబాదు జిల్లా కేంద్రం రంజన్ల తయారీకి ప్రసిద్ధి చెందింది. నారాయణపేట జరీచీరల తయారీకి పేరుపొందింది.

సమరయోధుడు, రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి మరణించాడు.

 




#Article 160: మచిలీపట్నం (628 words)


మచిలీపట్నం (Machilipatnam) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన ముఖ్య తీర నగరం. పిన్ కోడ్: 521001. దీనిని బందరు లేదా మసూలిపటం లేదా మసూల అని కూడా పిలుస్తారు. ఈ పట్టణానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రత్యేక పురపాలక సంఘ స్థాయి కల్పించబడింది. ఈ పట్టణం చరిత్ర 3 వ శతాబ్దం శాతవాహనుల కాలములో నుండి ఉన్నదని దానిని మైసలోస్ (టోలిమి) మసిలా (పెరిప్లస్) అని పిలిచేవారని తెలుస్తున్నది.తీరపట్టణం అవడం చేత 17 వ శతాబ్దములో బ్రిటీష్ వారు, ఫ్రెంచ్ వారు డచ్|డచ్ వారు ఇక్కడ నుండి వర్తకం జరిపేవారు. 350 పడవలు పట్టే సన్నకారు చేపల రేవు ఉంది. ఈ పట్టణం కలంకారీ అద్దకం పనికి (కూరగాయల నుండి తీసిన రంగుల), తివాచీలకు, బందరు లడ్డు లకి ప్రసిద్ధి. ఒంగోలు, మచిలీపట్నం మధ్య నున్న తీర ప్రాంతం తరచు తుఫాను, వరదల బారిన పడుతుంటుంది. బియ్యము, నూనె గింజలు, బంగారపు పూత నగలు, వైజ్ఞానిక పరికరాలు ఇక్కడి ఇతర ఉత్పత్తులు. మచిలీపట్టణం నుంచి విశాఖపట్టణం, బీదరు, ధర్మవరం,విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు ప్రతి రోజూ రైళ్ళు, బస్సులు ఉన్నాయి. వర్షాకాలంలో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు.

బందరుకి మచిలీపట్నం అన్న పేరు రావటానికి వెనుక కథ ఒకటి ఉంది. సముద్రపుటొడ్డున ఉన్న కోట ద్వారం దగ్గర ఒక చేప విగ్రహం ఉండేది. అందుకని ఈ ఊరికి మచిలీపట్నం అన్న పేరొచ్చిందంటారు. 'మచిలీ' అంటే హిందీ భాషలో చేప, పట్నం అంటే పెద్ద ఊరు. తెలుగు దేశంలో పట్టణం అనేది సర్వసాధారణంగా సముద్రపు ఒడ్డున ఉన్న రేవులకే వాడతారు. ఉదాహరణకు చెన్నపట్నం, విశాఖపట్టణం, భీమునిపట్నం, కళింగపట్నం, నిజాంపట్నం మొదలైనవి. పట్నంతో ముగిసే పేర్లు కల ఊళ్ళు అన్ని తూర్పుకోస్తాలో ఉన్నాయి. నర్సీపట్నం మినహాయించి..

సముద్రమట్టానికి 7 మీ.ఎత్తులో ఇంది. సమయ మండలం :భారత ప్రామాణిక కాలమానం (యుటిసి+5:30) 

పెడన, గుడివాడ, రేపల్లె.

పెడన, గూడూరు, ఘంటసాల, గుడ్లవల్లేరు

మచిలీపట్నం, పెడన నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ ప్రదాన రైల్వేస్టేషన్ 73 కి.మీ

మచిలీపట్నాన్ని మసుల అనీ మససోలియ అని గ్రీకు రచయితలు రాసారు. థీని అసలు పేరు మహాసాలిపట్నమ్. అథే మహాసలిపట్నమ్,మసిలిపట్నమ్ , మచిలిపట్నమ్ గాను కాలక్రమంలో మార్పు చెందింది. ఇక్కడినుండి రోము నగరానికి సన్ననేత వస్త్రాలు ఎగుమతి అయ్యేవి. ఇది సాలీలు నివాసం. ఆదే దాని అసలుపేరు.

మచిలీపట్నపు కలంకారీ వస్తువులు ప్రసిద్ధి చెందినవి. దుస్తులు, తివాచీలు, గోడకు వేలాడతీసే వస్తువులు (వాల్ హేంగింగ్స్) మొదలైనవి కలంకారీ చేసే వస్తువులలో ముఖ్యమైనవి. కలంకారీ అనేది ఒక విధమైన అద్దకము పని. కలంకారీ అనే పేరు కలం అనే పర్షియన్ పదం నుండి వచ్చింది. కలం అంటే ఒక రకమైన పెన్ను. వెదురు బొంగుకి చివర ఖద్దరు గుడ్డ చుట్టి దానితో దుస్తుల మీద కాని తివాచీల మీద కాని రంగులు పులుముతారు. ఈ రంగులు నూనెగింజల నుండి లేదా కూరగాయల నుండి తయారు చేస్తారు. ఈ కలంకారీ పనిలో ఉతకడం, పిండడం, నానబెట్టడం, చలువ చేయడం (బ్లీచింగ్), కొన్ని మోడరెంట్లు, రంగులు కలపడం చేస్తారు.

నీలం రంగుకు నీలిమందు, ఎరుపు కొరకు మంజిష్ఠ, పసుపుపచ్చ కోసం మామిడి చెక్క, ఎండు కరక్కాయ, నలుపురంగు కోసం తాటిబెల్లం, తుప్పుపట్టిన ఇనుములను ఉపయోగిస్తారు. ఈ అద్దకము అనేక రోజులపాటు సాగే పెద్ద ప్రక్రియ. కొన్ని చిన్న భాగాలు చేత్తో గీసినా, విస్తారమైన పెద్ద వస్తువులను అచ్చుతో అద్దుతారు. పౌరాణిక కథలు, పాత్రలు చిత్రించబడి గోడకు వేళ్ళాడదీసుకొనే వస్తువుల తయారీకి కాళహస్తి పేరుపొందినది. అదే విధంగా మచిలీపట్నం, చీరలలో ఉపయోగించే అచ్చుతో అద్దిన పెద్ద వస్తువులకు పెట్టింది పేరు. మచిలీపట్నంలో అచ్చులతోనూ, చేతితోనూ వేసే అద్దకం పనిలో పూలూ, మొక్కల డిజైన్లతో ఎంతో అందంగా ఉంటాయి. ఈ అద్దకం పనులు స్థానిక పాలకుల ఆదరం పొందడమే కాక, బాగా ఎగుమతి కూడా అయ్యేవి. ఈ ఎగుమతులు మచిలీపట్నంపై ఐరోపా వర్తకులకు మోజు కలిగించాయి.

బందరులో 150 సంవత్సరాల క్రితం స్ధిరపడిన సింగుల కుటుంబాలు బందరు లడ్డుల సష్టికర్తలుగా చెపుతారు. బొందిలీలు అని కూడా పిలచే సింగుల కుటుం బాలు బందరులో ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయి. వీరిలో ఎవరు ఇప్పుడు ఈ లడ్డుల తయారీలో కానీ, ఈ వ్యాపారంలో కానీ లేరు. ఆ కుటుం బాల వద్ద పనిచేసి లడ్డు తయారీ నేర్చు కున్న ఒకటి రెండు కుటుంబాలలో ఒక కుటుంబం ఇప్పటికీ ఆ వ్యాపారాన్ని విడచిపెట్టలేదు. అందుకే బందరు లడ్డు అనగానే బందరులో ఠక్కున శిర్విశెట్టి సత్యనారాయణ కేరాఫ్‌ తాతారావు పేరు చెపుతారు. తాతారావును ఇప్పటికీ మిఠాయి కొట్టు తాతారావుగా పిలుస్తుంటారు. గత 50 ఏళ్లుగా ఆయన ఈ వ్యాపారంలో ఉన్నారు.బందరు లడ్డును తొక్కుడు లడ్డూ అని కూడా అంటారు. స్వచ్ఛమైన శనగపిండి నుండి ముందు పూస తీస్తారు. దాని నాణ్యతలో ఎక్కడా రాజీలేకుండా ఘుమఘు మలాడే అతి స్వచ్ఛమైన నేతితో వేయించి ఆ తరువాత దంచుతారు. దాన్నలా ఉంచి సరైనపాళ్లలో బెల్లం పాకం తయారు చేస్తారు. ఆ పాకాన్ని దంచుతున్న పొడిలో పోస్తూ తొక్కుతారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి సుమారు 9 గంటలు పడుతుంది. సరైన పక్వానికి వచ్చిన దశలో యాల కులు, పటికబెల్లం చిన్నచిన్న ముక్కలుగా చేసి కలిపి ఆ తరువాత లడ్డూలుగా చుడతారు. ఆ విధంగా తయారైన లడ్డూ 20 రోజులపాటు నిల్వ ఉంటుం ది. ఈ లడ్డులో ఎటువంటి రంగు, రసాయనాలు కలుపరు.

      

ఇక్కడ ఆంధ్రా బ్యాంకు, వైశ్యాబ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, బ్యాంకులు ఉన్నాయి.

ఇక్కడి హిందూ కళాశాల , ఎందరో ప్రముఖులకు విద్యాదానం చేసింది.

బందరులో ఉన్న మరొక కళాశాల పేరు ఆంధ్ర జాతీయ కళాశాల. కోపల్లె హనుమంతరావు ఈ కళాశాల 1910 లో స్థాపించారు. ఈ కళాశాల ప్రాంగణంలో మహాత్మా గాంధీ రెండు సార్లు విడిది చేశారు. దీనిని నేషనల్ కాలేజి అని కూడా అంటారు. ఈ కాలేజికి అడవి బాపిరాజు మొదలైన మహానుభావు లెందరో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేశారు.




#Article 161: అర్ధవీడు (218 words)


అర్ధవీడు ప్రకాశం జిల్లా,  గ్రామం, అర్థవీడు మండలం కేంద్రం.

ఇది సమీప పట్టణమైన మార్కాపురం నుండి 56 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1568 ఇళ్లతో, 6572 జనాభాతో 2360 హెక్టార్లలో విస్తరించి ఉంది.   2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6602,  గ్రామంలో నివాస గృహాలు 1390 ఉన్నాయి.

దొనకొండ 4 కి.మీ,యాచవరం 9 కి.మీ,గన్నేపల్లి 10 కి.మీ,పెద్దకందుకూరు 12 కి.మీ,మగుటూరు 14 కి.మీ.

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 8, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి , ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. 2 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఒక ప్రభుత్వ అనియత విద్యా కేంద్రం ఉంది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల కంభంలోను, ఇంజనీరింగ్ కళాశాల మార్కాపురంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల నంద్యాలలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు కందులాపురంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల కందులాపురంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఒంగోలు లోనూ ఉన్నాయి.

ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పలు ప్రైవేటు వైద్య కేంద్రాలున్నాయి.

చెన్నారాయుడు చెరువు 334 సర్వే నంబరులో, 104 ఎకరాల 38 సెంట్ల విస్తీర్ణంలో ఉంది. గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. 

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. 

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. 

గ్రామంలో ఆటల మైదానం, గ్రంథాలయం ఉన్నాయి. 

అర్ధవీడులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

అర్ధవీడులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

ప్రత్తి, ఆముదం, వరి, అపరాలు, కాయగూరలు




#Article 162: మోక్షగుండం (292 words)


మోక్షగుండం ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలంలోని ఒక చిన్న శ్రోత్రీయ గ్రామం. పిన్ కోడ్: 523334., ఎస్.టి.డి.కోడ్ = 08406.

గ్రామానికి రెండు కిలోమీటర్లు తూర్పున ఒక చిన్న కొండపై ముక్తేశ్వరము అను శివాలయము ఉంది. ప్రతి యేటా మాఘ మాసములో (ఫిబ్రవరి) జరిగే ముక్తేశ్వర స్వామి జాతరకు అనేక మంది భక్తులు చుట్టుపక్కల ప్రదేశముల నుండి విచ్చేస్తారు. ఈ గుడి దగ్గర ఉన్న పవిత్ర గుండములో స్నానము చేసిన వారికి మోక్షము కలుగునని స్థానికులు భావిస్తారు. అందుకే ఈ ఊరికి మోక్షగుండo అని పేరు వచ్చింది.

సోమిదేవిపల్లి 4 కి.మీ, పందిల్లపల్లి 4 కి.మీ, గుడిమెట్ట 7 కి.మీ, బసినెపల్లి 8 కి.మీ, పిట్టికాయగుళ్ల 8 కి.మీ.

ఉత్తరాన బెస్తవారిపేట మండలం, ఉత్తరాన కంభం మండలం, పడమరన గిద్దలూరు మండలం, దక్షణాన కొమరోలు మండలం.

ఈ పాఠశాల అభివృద్ధికై, సెయింట్ సంస్థ (CYIENT) వారు 2016, మే-19న ఆరు లక్షల రూపాయలను అందజేసినారు. [9]

ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం.

పరశురాముడు తన తండ్రి జమదగ్ని ఆజ్ఞతో తల్లి రేణుకాదేవిని హతమార్చి పాపపరిహారానికై ఇక్కడి గుడిలో ఉన్న లింగాన్ని పూజించి ముక్తి పొందుటచే దీనికి ముక్తేశ్వర క్షేత్రంగా పేరు వచ్చినట్టు స్థలపురాణంలో చెప్పబడింది. గర్భగుడిలోని లింగాన్ని వశిష్ఠుడు ప్రతిష్ఠ చేశాడని ఆ పురాణం ద్వారా తెలుస్తుంది. శ్రీరాముడు సతీసమేతంగా అరణ్యవాసం చేయు సమయాన తండ్రి దశరథుని సంవత్సరీకం వచ్చింది. ఆ సందర్భంలో నీరు లభించని కారణంగా బాణం వేసి పాతాళగంగ ను పైకి తెచ్చినట్టు పురాణంలో పేర్కొనబడింది. ఈ స్థలంలో నిర్మించిన కోనేరు, శ్రీరాముని కోనేరు గా నేటికీ పిలవబడుచున్నది. ఇచ్చటగల అమ్మవారిని భ్రమరాంబగా కొలుస్తారు.

ఈ ఆలయంలో 2014, జూన్-18, బుధవారం ఉదయం 11 గంటలకు, ఆదిత్యాది నవగ్రహ మృత్యుంజయ యంత్ర బింబ ప్రతిష్ఠ నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. [4]

గ్రామంలోని యోగి వేమన విగ్రహం వద్ద, వేమన జయంతి సందర్భంగా, 2015, మార్చి-25వ తేదీనాడు, పూజా కార్యక్రమం నిర్వహించెదరు. అనంతరం పద్యగానం కార్యక్రమం ఏర్పాటుచేసెదరు. [7]

భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య యొక్క పూర్వీకులు ఈ గ్రామం నుండే కన్నడ దేశానికి వలస వెళ్లారు.
ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ CYIENT (సెయింట్) అధినేత శ్రీ బి.వి.మోహనరెడ్డి (బోధనపు వెంకట రామమోహన రెడ్డి) :- వీరు 2017, జనవరి-26న భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైనారు. [9]

[3] ఈనాడు ప్రకాశం; 2014, జనవరి-17; 6వపేజీ. 
[4] ఈనాడు ప్రకాశం; 2014, జూన్-18; 4వపేజీ.
[5] ఈనాడు ప్రకాశం; 2014, అక్టోబరు-3; 14వపేజీ. 
[7] ఈనాడు ప్రకాశం; 2015, మార్చి-25; 4వపేజీ.
[8] ఈనాడు ప్రకాశం; 2016, మే-14; 5వపేజీ. 
[9] ఈనాడు ప్రకాశం; 2017, జనవరి-26; 1వపేజీ. 
[10] ఈనాడు ప్రకాశం; 2017, జూన్-28; 4వపేజీ.




#Article 163: ఏలూరు (1109 words)


ఏలూరు (Eluru, Ellore), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య పట్టణం. ఏలూరు (ఒకప్పుడు హేలాపురిగా వ్యవహరించబడేది, అంగ్లేయుల కాలంలో ఎల్లొర్ అనికూడా పిలిచేవారు) 1866 లో మునిసిపాలిటిగా ఏర్పడింది. (దేశంలో రెండవ మోడల్ మునిసిపాలిటి) 2005 లో మునిసిపల్ కార్పొరేషన్ గా గుర్తించబడింది.ఏలూరు ప్రస్తుతం ఒక స్పెషల్ గ్రేడ్ మునిసిపల్ కార్పొరేషన్, మండల కేంద్రం, జిల్లా కేంద్రం, శాసనసభ నియోజక వర్గం, పార్లమెంట్ నియోజక వర్గం కూడాను.

మద్రాసు - కలకత్తా జాతీయ రహదారి (ఎన్ఎచ్ 5) పై ఏలూరు నగరం విజయవాడ నుండి 63 కి.మీ. రాజమండ్రి నుండి 98 కి.మీ. దూరంలో ఈ రెండు నగరాల మధ్య ఉంది. జిల్లా కేంద్రమైనందున ప్రభుత్వ కార్యాలయాల కేంద్రంగాను, చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజల వ్యాపార, వైద్య, విద్య, రవాణా అవసరాల కేంద్రంగా ఉంటున్నది.వరి, కూరగాయలు, పొగాకు వర్తకం, చేపల ఎగుమతి, రాపెద్ద నిమ్మకాయల సి.ఆర్.రెడ్డి కాలేజి, అంబికా దర్బార్ బత్తి, జూట్ మిల్లు, తమ్మిలేరు, కృష్ణ కాలువ, సమీపంలో కొల్లేరు సరస్సు - ఇవి ఏలూరు గురించి చెప్పేటప్పుడు ప్రధానంగా ప్రస్తావించ దగిన అంశాలు. 

 
ఏలూరు నగరానికి ఒక ప్రక్క పల్లపు ప్రాంతాలు (కొల్లేరు, కైకలూరు), మరొక ప్రక్క మెరక ప్రాంతాలు (చింతలపూడి, జంగారెడ్డిగూడెం) ఉన్నందున ఇక్కడి నిత్య జీవనంలో రెండు ప్రాంతాల ప్రభావం కనిపిస్తుంది. మెరక ప్రాంతమైన చింతలపూడి వైపు నుండి వచ్చే తమ్మిలేరు వాగు ఏలూరి చివర రెండుగా చీలుతుంది (అశోక్ నగర్ వద్ద) . ఎడమవైపు చీలిన వాగు తంగెళ్లమూడి మీదుగా ప్రవహిస్తూ నగరానికి ఒక వైపు సరిహద్దుగా ఉంటుంది. రెండవ చీలిక ఆశోక్ నగర్, అమీనా పేట మీదుగా ప్రవహిస్తూ బస్‌స్టాండు, సి.ఆర్.రెడ్డి కాలేజీ పక్కగా ప్రవహిస్తూ, నగరానికి వేరే సరిహద్దుగా కనిపిస్తుంది. ఈ రెండు చీలికలమధ్య డెల్టాలా ఏలూరు ప్రధాన పట్టణం వుంటుంది. ఈ కారణం వల్లే నాగిరెడ్డి గూడెం ప్రాజెక్ట్ కట్టక మునుపు ఏలూరు ముంపుకు గురి అయ్యేది.

కృష్ణానది నుండి వచ్చే ఏలూరు కాలువ పట్టణం మధ్యలో నైఋతి నుండి ఈశాన్యం దిశగా ప్రవహిస్తుంది.కలిసి కొల్ గోదావరి నుండి వచ్చే ఏలూరు కాలువ, కృష్ణ కాలువ, తమ్మిలేరు - ఇవి మూడూ పాలగూడెం (మల్కాపురం) వద్ద కోలేరులో కలవడానికి సాగుతాయి. ఈ కాలువల సంగమం గురించి వేమూరి వెంకటేశ్వరరావు ఈమాట అంతర్జాల పత్రికలో మరపురాని స్మృతులు అనే వ్యాసంలో ఇలా వ్రాశాడు  

ఊరికి చుట్టూ మూడు పెద్ద ఏరులున్నాయి. అందుకనే మా ఊరిని ఏలూరు అని అంటారు. ... తరువాత పండితులెవరో హేలాపురి అని సంస్కృతీకరించారు కూడాను. కృష్ణ, గోదావరీ నదుల సంగమం మా ఊరి కాలవ. తూర్పు లాకుల దాకా గోదావరి నీళ్ళు, పడమటి లాకుల దాకా కృష్ణ నీళ్ళూ. కృష్ణ ఎత్తు, గోదావరి పల్లం. ఆ రెండునదులూ కాలవలో సమతలంగా కలపడానికి తూర్పు లాకులు, పడమటి లాకులు ఉండేవి. ఆ లాకులు ముయ్యడం, తియ్యడం, పడవలని జాగ్రత్తగా కాలవలోకి పంపించడం చూడటానికి ఎంతో ముచ్చటగా ఉండేది. చైత్ర వైశాఖ మాసాల్లో లాకులు కట్టేసి కాలవ మూసేసే వాళ్ళు. అప్పుడు కాలవ ఎండి పోయేది. మళ్ళీ మృగశిర కార్తె రాంగానే, కాలవ వదిలే వాళ్ళు. మళ్ళీ ఇంచక్కా కొబ్బరికాయలు, అరిటిపళ్ళ పడవలూ తూర్పునించి పడమరకీ, పడమటినుంచి తూర్పు వేపుకీ వెళ్ళేవి. ఆ కాలవ నీళ్ళే పంపుల చెరువుల్లోకి పట్టి ఉంచేవాళ్ళు, ఎండా కాలంలో మంచినీటి కరువు రాకండా! ఇప్పుడు ఆ గొడవే లేదు. కాలవలో సమృద్ధిగా నీళ్ళు ఎప్పుడూ ఉండవు. కాలవలో పడవలు లేవు. పంపుల చెరువులు పూడి పోతున్నాయి. 

తమ్మిలేరు అనే యేరు ఖమ్మం జిల్లా పాల్వంచలో మొదలవుతుంది. ఖమ్మం, కృష్ణా, పశ్చిమ గోదావరి జల్లాలలో సుమారు 120 మైళ్ళు ప్రయాణించి కొల్లేరులో కలుస్తుంది. ఏలూరులో ఎఫ్.సి.ఐ. గోడౌనుల దగ్గర రెండుగా చీలుతుంది. ఆ చీలికలు మొండికోడు, పెదయడ్లగాడి అనే రెండు స్థలాల వద్ద కొల్లేరులో కలుస్తాయి.

భౌగోళికంగా ఏలూరు అక్షాంశ రేఖాంశాలు . సముద్ర తలం నుండి ఎత్తు 22 మీటర్లు. (72 అడుగులు) . బంగాళాఖాతం తీరం నుండి ఏలూరు 40 మైళ్ళ దూరంలో ఉంది. ఇది ప్రధానంగా ఉష్ణమండల వాతావరణం కలిగిన ప్రాంతం. ఏప్రిల్, మే, జూన్ నెలలు బాగా వేడిగా ఉంటాయి. ఏలూరులో రికార్డయిన అత్యధిక ఉష్ణోగ్రత 51.7 డిగ్రీలు సెంటీగ్రేడ్, అత్యల్ప ఉష్ణోగ్రత 12.9 0 డిగ్రీలు సెంటీగ్రేడ్.

హేలాపురి (ఏలూరు) పాత కాలంనుండి వేంగి అను రాజ్యములో భాగముగా ఉంది. తూర్పు చాళుక్యులు, వేంగి రాజధానిగా 700 నుండి 1200 వరకు తీరాంధ్ర ప్రాంతాన్ని పరిపాలించారు. ఏలూరు (హేలపురి) అప్పటి చాళుక్య సామ్రాజ్యములో ఒక ప్రాంతముగా ఉండేది. 1471లో ముస్లింల దండయాత్ర జరిగే వరకు ఏలూరు కళింగ రాజ్యములో భాగముగా ఉంది. ఆ తరువాత గజపతుల చేతుల్లోకి వచ్చి వారి పరిపాలనలో ఉంది. 1515లో శ్రీ కృష్ణదేవరాయలు గజపతుల నుండి దీనిని చేజిక్కించుకొన్నాడు. ఆ తరువాత గోల్కొండ నవాబు మహమ్మద్ కులీ కుతుబ్ షా వశమైంది. ఏలూరుకు సమీపములో ఉన్న పెదవేగి, గుంటుపల్లె (జీలకర్ర గూడెం) గ్రామాలలో ఇందుకు సంబంధించిన అనేక చారిత్రక ఆధారాలు ఉన్నాయి.

బ్రిటిష్ వారి కాలంలో ఉత్తర సర్కారు ప్రాంతాలను జిల్లాలుగా విభజించినప్పుడు ఏలూరును మచిలీపట్నం జిల్లాలో చేర్చారు. తరువాత 1859లో గోదావరి జిల్లాలో భాగమైంది. తరువాత కృష్ణా జిల్లాకు కేంద్రంగా ఉంది. 1925లో పశ్చిమ గోదావరి జిల్లాలను ఏర్పరచినపుడు ఆ జిల్లాకు కేంద్రంగా ఏలూరు అయ్యింది. పట్టణం ఎదుగుదల ఫలితంగా 2005 ఏప్రిల్‌లో ఏలూరు మునిసిపాలిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మునిసిపల్ కార్పొరేషన్‌గా మార్చింది. ఆ సమయంలో చుట్టుప్రక్కల కొన్ని గ్రామాలు ఏలూరు నగరంలో కలుపబడ్డాయి. ఆ విధంగా నగర జనాభా 3, 50, 000కు చేరుకొంది.

ఏల అన్న చిన్న ఏరు ఈ పట్టణ పరిసరాల్లో ప్రవహించడంతో ఏలూరు అన్న పేరు ఏర్పడివుంటుందని బూదరాజు రాధాకృష్ణ వంటి పరిశోధకులు భావిస్తున్నారు.

ఏలూరు నగరం ప్రధానంగా జాతీయ రహదారి వెంట విస్తరించి ఉంది. పట్టణం మధ్యగా తమ్మిలేరు కాలువ ప్రవహిస్తుంది. స్థూలంగా పట్టణాన్ని I టౌన్ (తమిళేరు కాలువకి ఆవల వున్న ప్రాంతం), II టౌన్ (తమిళేరు కాలువకి ఇవతల వున్న ప్రాంతం) గా విభజించవచ్చు. అయితే పోస్టల్ వారి ప్రకారం ఏలూరు-1 (తమిళేరు కాలువ నుండి తూర్పు వైపు వున్న ప్రాంతం), ఏలూరు-2 ( పవర్ పేట, ఆర్ ఆర్ పేట తదితర ప్రాంతాలు), ఏలూరు-3 (శనివారపు పేట), ఏలూరు-3 (చాటపర్రు ప్రాంతం), ఏలూరు-5 (రైల్వే స్టేషన్, ఆదివారపు పేట ప్రాంతాలు, తంగెళ్ళమూడి, ఏలూరు-6 (నరసింహారావు పేట, అమీనా పేట, అశోక్ నగర్ ప్రాంతాలు), ఏలూరు-7 (వట్లూరు, విద్యా నగర్, శాంతినగర్, సత్రంపాడు ప్రాంతాలు) లుగా విభజించబడింది. 
ప్రధాన విభాగాలు

ఏలూరు నగరం, రోడ్డు, రైలు, జలమార్గాల ద్వారా ఆంధ్ర ప్రదేశ్ నగరాలు, పట్టణాలు చాలా బాగా అనుసంధానించబడి ఉంది.

జాతీయ రహదారి 16, జాతీయ రహదారి 43, జాతీయ రహదారి 44 లతో ఈ నగరం అనుసంధానమై ఉంది. జిల్లా కేంద్రంగా కూడా ఏలూరునుండి జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాలకు రోడ్డు ప్రయాణ సదుపాయం ఉంది. బస్సు, ఆటో, రైల్వే రవాణా సేవలు ప్రధానమైనవి. ఏలూరు పాత బస్సు స్టేషన్, ఏలూరు కొత్త బస్సు స్టేషన్ల ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ బస్సు నడుపుతోంది.

ఏలూరు రైల్వే స్టేషను విజయవాడ రైల్వే డివిజన్లొని దక్షిణ మధ్య రైల్వే జోన్కు చెందిన ఒక రైల్వే స్టేషను. పవర్‌పేట రైల్వే స్టేషను, వట్లూరు రైల్వే స్టేషను నగరానికి చెందిన శాటిలైట్ స్టేషన్లు. ఈ స్టేషన్లు హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము పై ఉన్నాయి.

గన్నవరం (విజయవాడ) ఏలూరుకు సమీపంలో ఉన్న విమానాశ్రయం (35 కి.మీ) . ఇక్కడి (విజయవాడ) నుండి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, అహ్మదబాద్, పూనే, జైపూర్, రాజమండ్రి, విశాఖపట్నం, కోల్ కత్తా, ఢిల్లీలకు ప్రతిరోజూ విమానాలు ఉన్నాయి (ఎయిర్ కోస్త, ఎయిర్ డెక్కన్, కింగ్‌ఫిషర్, ఏయిరిండియా సంస్థల ద్వారా) . ఇప్పుడు రాత్రి వేళల్లో కూడా విమానయానం అందుబాటులో ఉంది.

జాతీయ జలమార్గం 4 గా ప్రకటించబడిన జలమార్గం తీర ప్రాంతం వెంబడి కాకినాడ, ఏలూరు, కొమ్మమూరు, బకింగ్‌హాం కాలువ ద్వారా వెళ్తుంది.

చాలా కాలంనుండి టెలిఫోన్, టేలి ఫ్యాక్స్ లు అందుబాటులోఉన్నాయి. ఇంటర్నెట్ వంటి సదుపాయాలు, కేబుల్ టెలివిజన్లు అందరికీ అందుబాటులో ఉన్నాయి.

ఏలూరు పురపాలక సంఘాన్ని 1866 లో స్థాపించారు. నగర అధికార పరిధి తో 50 వార్డులు కలిగి ఉంది. వై.సాయి శ్రీకాంత్ ప్రస్తుత మున్సిపల్ కమిషనర్, షేక్ నూర్ జహాన్ నగర మేయర్గా ఉన్నారు. 9 April 2005 న నగరపాలక నంస్థగా అభివృద్ధి చెందింది.

ఏలూరులో శాంతిభద్రతల కొరకు ఎనిమిది పోలీసు స్టేషన్లు నిర్వహించబడుతున్నవి. వీటిలో, ఒక మహిళా పోలీసు స్టేషను, ఒక ట్రాఫిక్ పోలీసు స్టేషనూ ఉన్నాయి. ఇవి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ పరిధిలోకే ఉన్నాయి.

ఏలూరులోని విద్యా సంస్థలు ఏలూరు పట్టణం, పరిసర ప్రాంతాల యొక్క విద్యావసరాలకు ప్రధాన వనరులు. వాటిలో కొన్ని:

ఇది నగరంలో వైద్యానికి ఒక కేంద్ర బిందువు, ఇక్కడ అన్ని రకాల ఆసుపత్రులు ఉన్నాయి.

పారిశ్రామికంగా ఏలూరు చెప్పుకోదగినంత అభివృద్ధి సాధించలేదనే అనవచ్చును. ఎంతో కాలంగా నడుస్తున్న జూట్ మిల్లు తప్పించి ఇక్కడ ఎక్కువ మందికి ఉపాధి కలిగించే పెద్ద పరిశ్రమలు లేవు. అంబికా దర్బార్ బత్తి మాత్రమే ఏలూరు నుండి ప్రసిద్ధమైన బ్రాండ్ ఉత్పత్తి. పారిశ్రామిక వాడలో ఉన్న కొద్దిపాటి పరిశ్రమలు ఇంకా కుటీర, చిన్నతరహా పరిశ్రమల స్థాయిలోనే ఉన్నాయి. కనుక ఏలూరులో వ్యాపారం అధికంగా రెండు రంగాలలో కేంద్రీకృతమయ్యింది - (1) చుట్టుప్రక్కల లభించే వ్యవసాయ, అనుబంధ ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారం - ధాన్యం, కూరగాయలు, పుగాకు, చేపలు, వంట నూనెలు వంటివి (2) పట్టణంలోను, చుట్టుప్రక్కల గ్రామాలలోను ఉన్న ప్రజల వినియోగవసరాలు తీర్చే వ్యాపారాలు - పచారి సరుకులు, బట్టలు, నిత్యావసర వస్తువులు, గృహోపకరణాలు, గృహనిర్మాణావసరాలు, ఆభరణాలు, ఆర్థిక సేవలు (బ్యాంకులు, తాకట్టు వ్యాపారం, ఫైనాన్సింగ్) వంటివి. ఇటీవల విద్య, వైద్య సదుపాయాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వాహనాలు, పెట్రోలు వంటివి కూడా ఈ వ్యాపారాలలో చేరాయని చెప్పవచ్చును.

ఏలూరుకి ఆటో నగర్ నిర్మించాలని ఎప్పటి నుంచొ ప్రతిపాదన ఉన్నాయి. ఈ మద్య కాలంలోనే అది రూపుదిద్దుకుంది, ప్రస్తుతానికి కొన్ని చిన్న చిన్న వర్క్ షాప్ లు ఉన్నాయి. ఇది ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది. ఆటో నగర్, ఆశ్రం ఆసుపత్రికి వెళ్లేదారిలో పెద్ద రైల్వే స్టేషనుకి చేరువలో ఉంది.

ఏలూరు పట్టణానికి వేయి సంవ్సరాలకు పైబడి చరిత్రవుంది. అలానే ఇక్కడి ఆలయాల్లో కొన్నిటికి సహస్రాబ్దికి పైబడిన వయస్సువుంది. వెయ్యి సంవత్సరాలకు పైబడి చరిత్రవున్న ఆలయాల్లో రామలింగేశ్వరస్వామి ఆలయం, జ్వాలాపహరేశ్వరస్వామి ఆలయం, కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం, జనార్దన కన్యకాపరమేశ్వరీదేవి గుడి, మార్కండేయాలయం, ఓంకారేశ్వరస్వామి ఆలయం ఉన్నాయి.




#Article 164: సారస్వత నికేతనం (155 words)


సారస్వత నికేతనం ప్రకాశం జిల్లా వేటపాలెం లోని తెలుగు గ్రంథాలయం.  ఈ గ్రంథాలయము  1918 అక్టోబరు 15 నాడు ఊటుకూరి వెంకట శ్రేష్టి స్థాపించాడు. వెంకట శ్రేష్ఠి తరువాత ఈ గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసినవారు అడుసుమిల్లి శ్రీనివాసరావు పంతులు. స్వాతంత్ర్యము రాక ముందు స్థాపించబడిన ఈ గ్రంథాలయము మొదటి నుండి ప్రైవేటు కుటుంబము నిర్వహించే గ్రంథాలయముగానే ఉంది. ఆంధ్ర ప్రదేశ్లో కెల్లా ఇటువంటి అరుదైన ఏకైక గ్రంథాలయము  ఇదే.  మహాదాత, గాంధేయుడు గోరంట్ల వెంకన్న గ్రంథాలయమునకు మొదటి దశలో భూరి విరాళము ఇచ్చాడు.  గ్రంథాలయము ఆంధ్ర ప్రదేశ్లో పరిశోధన అవసరాలు తీర్చే  గ్రంథాలయాలలో ప్రముఖమైనది. దీనిని 1929 లో మహాత్మా గాంధీ శంకుస్థాపన చేశాడు. 1935 లో బాబూ రాజేంద్ర ప్రసాద్ దీన్ని సందర్శించారు. దీని భవనాలను సేఠ్ జమ్నాలాల్ బజాజ్, టంగుటూరి ప్రకాశం పంతులు ప్రారంభించారు. 

ఈ గ్రంథాలయములో పాత పుస్తకాలు, వార్తా పత్రికలు, మేగజిన్లు, పత్రికల విస్తారమైన సేకరణ ఉంది. కొన్ని వార్తాపత్రికలు 1909 వ సంవత్సరమునుండి ఉన్నాయి. 70,000కు పైగా సేకరణలు ఉన్న ఈ గ్రంథాలయములో చాలా మటుకు సేకరణలు అరుదైనవి. దేశము నలుమూలల నుండి, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా మొదలైన విదేశాలనుండి పలువురు పరిశోధకులు తమ పరిశోధనా ప్రాజెక్టుల కొరకు ఇక్కడ బసచేసి గ్రంథాలయ వనరులను ఉపయోగించుకొన్నారు.

సారస్వత నికేతనంలో ఎన్నో అపురూపమైన, అత్యంత అరుదైన పుస్తకాలు ఉన్నాయి. అలాగే తెలుగు సాహిత్య చరిత్రలో, చరిత్రరచనలో ఎన్నోవిధాలుగా ఉపకరించింది. ఇందుకు అసంఖ్యాకమైన ఉదాహరణలు ఉన్నాయి.




#Article 165: వేటపాలెం (350 words)


 

వేటపాలెం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన గ్రామం, వేటపాలెం మండల కేంద్రము. ఈ గ్రామం జీడిపప్పు ఉత్పత్తికి, వ్యాపారానికి పేరు పొందింది.  ఆంధ్రలో పురాతనమైన,  1918 లో స్థాపించిన సారస్వత నికేతనం అనబడే గ్రంథాలయం కూడా ఇక్కడే వున్నది.

రంగస్థల నటుడు రావిపాటి శ్రీరామచంద్రమూర్తి  ఈ ఊరివారే.

ఈ గ్రామం సముద్ర తీరం నుండి 4.5 కి.మీ. దూరంలో ఉంది. వేటపాలెం గ్రామం ఒంగోలు  - విజయవాడ రైల్వే లైనులో ఉంది.  వేటపాలెం గ్రామం చీరాల పట్టణానికి 9 కి.మీ దూరంలో ఉంది. వేటపాలెం కి సమీపంలోనే ఒకనాడు ఆంధ్రదేశానికే మకుటాయమానంగా నిలిచి, దేశ విదేశాలతో కోట్ల రూపాయల వ్యాపారాన్ని జరిపి, నౌకా కేంద్రాల్లో కెల్లా మహానౌకా కేంద్రంగా వెలుగొందిన మోటుపల్లి ఉన్నది. ప్రస్తుతం మోటుపల్లి ఒక సామాన్య కుగ్రామంగా మిగిలిపోయింది.

వేటపాలెం గ్రామ పంచాయతీ 1886, ఏప్రిల్-9న ఆవిర్భవించింది. ఆ రోజులలో గ్రామ విస్తీర్ణం 3,178 ఎకరాలు. అప్పట్లోనే మేజర్ పంచాయతీగా, కుటీరపరిశ్రమల కేంద్రంగా విరాజిల్లినది. 17 వార్డులలో, 16,000 జనాభా ఉండేవారు. తరువాత 1987,డిసెంబరు-19న, పురపాలకసంఘంగా గూడా ఎదిగినది. 1988లో ఎన్నికలు నిర్వహించారు. అప్పటివరకూ రు. 3 లక్షలు ఉన్న పన్నులు, రు. 10 లక్షలు అయినవి. దీనితో పౌరసమితిని ఏర్పాటుచేసి, ప్రజలు మునిసిపాలిటీని రద్దు చేయాలని ఉద్యమాలు చేశారు. ఈ నేపథ్యంలో 1992లో చీరాల శాసనసభ్యులుగా పోటీచేసిన  కొణిజేటి రోశయ్య మునిసిపాలిటీని రద్దు చేసి, పంచాయతీగా మారుస్తానని ఎన్నికలలో వాగ్దానం చేశారు. ఆ రకంగా, ఇది వేటపాలెం, రామన్నపేట, దేశాయిపేట గ్రామాలతో. కలిసి, మరలా పంచాయతీగా మారిపోయినది,. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే ఉత్తర ప్రత్యుత్తరాలు, వేటపాలెం మునిసిపాలిటీ పేరిటే జరుగుచున్నవి.

 

ఈ గ్రంథాలయములో పాత పుస్తకాలు, వార్తా పత్రికలు, మేగజిన్లు, పత్రికల విస్తారమైన సేకరణ ఉంది. కొన్ని వార్తాపత్రికలు 1909వ సంవత్సరమునుండి ఉన్నాయి. 70,000కు పైగా సేకరణలు ఉన్న ఈ గ్రంథాలయములో చాలా మటుకు సేకరణలు అరుదైనవి. దేశము నలుమూలల నుండి, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా మొదలైన విదేశాలనుండి పలువురు పరిశోధకులు తమ పరిశోధనా ప్రాజెక్టుల కొరకు ఇక్కడ బస చేసి గ్రంథాలయ వనరులను ఉపయోగించుకొన్నారు. తెలుగులో తొలి యాత్రాచరిత్రగా పేరొందిన ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రచరిత్ర గ్రంథాన్ని 1950 ప్రాంతాల్లో పునర్ముద్రించేందుకు ప్రముఖ చరిత్ర పరిశోధకుడు, పుస్తకప్రియుడు దిగవల్లి వేంకటశివరావు ప్రయత్నించగా వేటపాలెం గ్రంథాలయంలోనే మంచి ప్రతి దొరికి పునర్ముద్రణ సాధ్యమైంది.

బండ్ల బాపయ్య హిందు ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల  వుంది.
మండలం లోని కొత్తపేట గ్రామం లో జిల్లాపరిషత్ హైస్కూల్ అధునాతన సౌకర్యాలతో నిర్మాణం పూర్తి కావడంతో 1000 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు.2018 లో ప్రారంభించిన ఈ పాఠశాల లో విశాల మైన డైనింగ్ హాలు,30 కంప్యూటర్లు గల డిజిటల్ క్లాస్ రూమ్, ఆరు స్క్రీన్లు ఉన్నాయి. క్రీడల్లో కూడా విశేష ప్రాచుర్యం పొందింది.

రెండు పెద్ద మార్కెట్లు ప్రక్క ప్రక్కనే ఉన్నాయి. చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు ఈ మార్కెట్లకి కొనుగోలుకి వస్తూంటారు.

నిత్యావతార దత్తక్షేత్రమ్.

జయలక్ష్మి థియేటర్, రామకృష్ణ థియేటర్, విజయభాస్కర(సరస్వతి) థియేటర్ .

వ్యవసాయం ప్రధానంగా  జీడి తోటలు, మామిడి తోటలపై కేంద్రీకృతమైంది.  సముద్రతీరం వుండడంతో
రొయ్యల పెంపకం, చేపల పెంపకం కూడా ప్రధాన వ్యవసాయ అనుబంధ వృత్తిగావున్నది.

చేనేత పరిశ్రమలు, జీడి పప్పు పరిశ్రమలు, అగరబత్తి పరిశ్రమలు, తాటి కల్లు పరిశ్రమలు, బీడి పరిశ్రమలు వేటపాలెంలో ముఖ్యమైనని.




#Article 166: నేలకొండపల్లి (ఖమ్మం జిల్లా) (1094 words)


నేలకొండపల్లి, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలానికి చెందిన గ్రామం. 

ఇది సమీప పట్టణమైన ఖమ్మం నుండి 23 కి. మీ. దూరంలో ఉంది. 

నేలకొండపల్లి గ్రామం గొప్ప చారిత్రక స్థలం. మహాభారతంతో ముడిపడ్డ కథలొకవైపు, బౌద్ధ అవశేషాల తాలూకు చారిత్రక వాస్తవాలు మరొక వైపు ఈ ప్రాంతానికి ప్రాముఖ్యత నిస్తున్నాయి. నేలకొండపల్లికి ఒక మైలు దూరంలో విరాటరాజు దిబ్బ, కీచక గుండం అనే స్థలాలు మహాభారత కథతో సంబంధం కలిగి ఉన్నాయి.

మనం చూస్తున్న ఈ ప్రాంతాన్ని కీచకగుండం అని పిలుస్తారు. ఇది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో ఉంది.దీనికి కీచకగుండం అని పేరు రావడానికి కారణం, భీముడు కీచకుడిని చంపింది ఇక్కడే అని జనం చెబుతుంటారు. అంతేకాదు కీచకుడిని చంపిన తర్వాత పాతిపెట్టిన ప్రాంతం కూడా ఇదే కావడంతో, దీనికి కీచకగుండం అని పేరుపెట్టారు.

నేలకొండపల్లి అనగానే టక్కున గుర్తొచ్చే పేరు భక్తరామదాసు. భద్రాచలంలో శ్రీరామచంద్రుడికి గుడి కట్టించిన పరమభక్తుడు రామదాసు. ఆ భక్తరామదాసు నడయాడిన ఈ ప్రాంతం ఎన్నో వింతలు విశేషాలకు పెట్టింది పేరు. రామదాసు క్రీ.శ.1664లో ఈ గుడి కట్టించాడు. అంతకంటే కొన్ని శతాబ్దాల ముందు, అంటే క్రీ.శ.2వ శతాబ్దంలోనే మనం చూస్తున్న బౌద్ధస్థూప నిర్మాణం జరిగింది. ఆ రోజుల్లో దక్షిణ భారతదేశానికి ఇక్కడ నుంచే బౌద్ధ విగ్రహాల పంపిణీ జరిగేది. విగ్రహాల తయారీ కేంద్రం ఇక్కడే ఉండేది. నేలకొండపల్లి అంటే నెలసెండా అనే పట్టణం అని, 2వ శతాబ్దంలోనే టోలమీ రాసిన ఇండికా గ్రంథంలో నేలకొండపల్లి ప్రస్తావన ఉంది. ఇట్లా నేలకొండపల్లి చరిత్ర 2వేల సంవత్సరాలదని అర్థమవుతోంది. కీచకవధ గురించి తెలుసుకోవాలంటే మనం పాండవుల వనవాసచరిత్రను గుర్తుచేసుకోవాలి. పాండవులు 12ఏండ్ల వనవాసం తర్వాత అజ్ఞాతవాసం కోసం ఉత్తరభారతం నుంచి దక్షిణభారత ప్రాంతానికి వచ్చారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వద్ద, విరాటరాజు రాజ్యం ఉంది. ఆ రాజు వద్ధ పాండవులు మారువేషంలో పనికి చేరుతారు. భీముడు ఆడవేషంలో వచ్చి కీచకుడిని వధిస్తాడు. కీచకుడు భీముడి యుద్ధం అతి భీకరంగా సాగుతుంది. మనం చూస్తున్న ఈ బైరాగుల గుట్ట రాళ్ల కిందనే కీచకుడిని సమాధి చేశారని చరిత్ర చెబుతోంది.

కురుక్షేత్ర సంగ్రామానికి నాంది పల్కింది నేలకొండపల్లే! కీచకవధ అంటే ద్వాపరయుగం నాటి కౌరవ పాండవ యుద్ధ కాలంలోకి పోవాలీ! మహాభారతంలో యుద్ద సన్నివేశాల వేదికగా నిలిచిన ప్రాంతాలు కాలక్రమేణా కనుమరుగయ్యాయి! కానీ, వాక్కు రూపంలో మాత్రం ఈ ప్రాంత చరిత్ర సజీవంగా నిలిచింది! ద్వాపర యుగం నుంచి, బౌద్ధుల వరకు, ఆ తరువాత కాకతీయులు, నిజాం కాలంలో భక్తరామదాసు వరకు ఎంతో చరిత్ర ఈ ఊరి సొంతం! భక్తరామదాసు చరిత్ర అంటే, 400 ఏండ్ల క్రితం సంగతి! కాని, గత 40 ఏండ్ల క్రితం వరకు కూడా, ఇక్కడ మనం చూస్తున్న బౌద్ధస్థూపం కనిపించేది కాదు! ఇక్కడ ఇపుడు మనం చూస్తున్న ఆ బౌద్ధస్థూప నిర్మాణం ఇటీవలే తవ్వకాల్లో బయటపడింది! ముజ్జుగూడెం గ్రామానికి చెందిన కొందరు పండుగల సమయంలో పుట్టమన్ను కోసం తవ్వకాలు జరిపారు! బౌద్ధస్తూపం బయటపడింది! క్రీ.శ.2వ శతాబ్దం నుంచి దాదాపు 1800 ఏండ్లు అలా మట్టిపొరల్లో దాగున్న తథాగతుని చరిత్ర చీకట్లోనే ఉండిపోయింది!

బౌద్ధస్తూపం ఎలా మట్టిపొరల్లో వందల ఏళ్లు మరుగునపడ్డదో, సరిగ్గా అలాగే ఇదిగో ఈ ద్వాపరయుగ చరిత్ర సైతం వెలుగుచూడలేదు! కీచకవధ జరిగిన యుద్ధప్రాంతాలు అలానే మరుగునపడ్డాయి! కాని, వాక్కు మాత్రం చరిత్రను బతికిస్తున్నది! కౌరవ పాండవ వనవాస కాలంలో పాండవులు తమ బాణాలను జమ్మిచెట్టుపై దాచరని మనకందరికీ తెలుసు! ఆ జమ్మిచెట్టు బాణాపురంలోనే ఉందని మాత్రం ఎవరికీ తెలియదు! బాణాపురం ముదిగొండ మండలంలో ఉంది! ఈ ఊరిలోనే పాండవులు బాణాలు దాచారట! అందుకే ఈ ఊరికి బాణాపురం అనే పేరు వచ్చింది! మనం చూస్తున్న గోకినేపల్లికి ఆ పేరు రావడానికి కారణం పాండవులు వనవాస కాలంలో గోవులు ఇక్కడే కాశారట! అందుకే ఈ గ్రామానికి గోకినేపల్లి అని పేరు వచ్చిందని ఇక్కడి జనం తరతరాలుగా చెబుతున్నారు!

ఊరొక్కటే! కాని, ఒక్కో యుగంలో ఒక్కో చరిత్రకు దోసిలిపట్టింది నేలకొండపల్లి! తరతరాలుగా జనవాక్కుగా పిలవబడుతూ, కీచకగుండం కొలువైంది ఇక్కడే! ఈ చరిత్ర ఏ చరిత్రపుటల్లోకి ఎక్కలేదు! పాండవుల వనవాసం తర్వాత అజ్ఞాతవాసం కోసం విరాటరాజ్యంలో మారువేషంలో ఉంది! కురుక్షేత్ర సంగ్రామానికి నాంది పల్కిన నేలకొండపల్లి చరిత్రను ముందు తరాలకు తీసుకెళ్లడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి! కీచకవధ జరిగిన ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతున్నా, ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ నిమ్మకు నీరెత్తినట్లు ఉంది! దీన్ని స్థానిక ప్రజలు ఖండిస్తున్నారు!నేలకొండపల్లి నాటి ద్వాపరయుగం నుంచి నేటి భక్తరామదాసు వరకు ఎన్నో విశేషాలకు వేదికైంది! కాలరగ్బంలో ఇంకా వెలుగులోకి రాని చరిత్ర అవశేషాలతో నెలువైంది! కాలగర్భంలో కలసిన ఈ కౌరవ పాండవ యుద్ధ విశేషాలతో పాటు, మట్టిపొరల్లో మరుగునపడ్డ తథాగతుని చరిత్రను వెలుగులోకి రావాల్సి ఉంది! నాటి ద్వాపరయుగం నుంచి నేటి భక్తరామదాసు వరకు, విశేషాలను వెలుగులోకి తెస్తూ కేసీఆర్ సర్కార్‌ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నేలకొండపల్లివాసులు కోరుతున్నారు!

ఇప్పటికైనా కీచకవధ జరిగిన నేలకొండపల్లిని టూరిస్టు స్పాట్‌గా ప్రకటించాలి! ద్వాపరయుగం నాటి చారిత్రక స్థలాలపై పరిశోధనలు చేసి, మరింత సమాచారాన్ని వెలుగులోకి తెచ్చి, పరిరక్షించాల్సిన బాధ్యత తెలంగాణ సర్కార్‌ పై ఉందంటున్నారు జిల్లావాసులు!

ఇటీవలి చరిత్రకు వస్తే.., నేలకొండపల్లి భక్త రామదాసుగా ప్రసిద్ధి గాంచిన కంచర్ల గోపన్న ఇక్కడే జన్మించాడు. ఆయన పుట్టిన ఇంటిని భక్త రామదాసు ధ్యాన మందిరంగా పిలుస్తున్నారు. గ్రామంలో పురాతన దేవాలయాలు కూడా ఉన్నాయి.

గ్రామంలో 9ప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు 9, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు 8, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు ఏడు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలఒక ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.సమీప ఇంజనీరింగ్ కళాశాల ఖమ్మంలో ఉంది. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ ఖమ్మంలో ఉన్నాయి.సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఖమ్మం లో ఉన్నాయి.

నేలకొండపల్లిలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , ఏడుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

గ్రామంలో 2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్.బి.బి.యస్. కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఇద్దరు.నాటు వైద్యులు ఇద్దరు ఉన్నారు. ఐదు మందుల దుకాణాలు ఉన్నాయి.

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ ఉంది. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

నేలకొండపల్లిలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. పబ్లిక్ ఫోన్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

నేలకొండపల్లి ఖమ్మం నుండి కోదాడ (నల్లగొండ జిల్లా)రహదారిపై ఉంది. ఖమ్మం నుండి కోదాడ, నల్లగొండ, మిర్యాలగూడ, తిరుపతి, గుంటూరు వంటి ప్రదేశాలకు వెళ్ళే బస్సులు ఇక్కడ ఆగుతాయి. హైదరాబాదు వెళ్ళాలంటే ఖమ్మం లేదా కోదాడ నుండి ఎక్స్ ప్రెస్స్ బస్సులు దొరకుతాయి. ఖమ్మం నుండి దేశం లోని అన్ని ముఖ్య ప్రదేశాలకు రైలు సౌకర్యం ఉంది. అతి దగ్గర విమానాశ్రయం హైదరాబాదు విజయవాడలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

నేలకొండపల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

నేలకొండపల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

నేలకొండపల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

వరి, మిరప, పొగాకు

పాహి రామప్రభో . . పాహి భద్రాద్రి వైదేహి . . . రామప్రభో అంటూ రాముడిని పరిపరివిధాలా ఆర్తిగా కీర్తించిన భక్తకవి రామదాసు (కంచర్ల గోపన్న) స్వస్థలం నేలకొండపల్లి. రామదాసు నేలకొండపల్లిలోని రాజగోపాలస్వామి అనుగ్రహంతోనే జన్మించాడని ప్రతీతి. రామదాసు తల్లిదండ్రులు, రామదాసు ఇలవేల్పుగా ఇష్టదైవంగా ఆరాధించుకున్న దైవం శ్రీ రాజగోపాలస్వామి.




#Article 167: కొత్తగూడెం (భద్రాద్రి జిల్లా) (257 words)


కొత్తగూడెం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,కొత్తగూడెం మండలానికి చెందిన పట్టణం.భద్రాద్రి జిల్లా పరిపాలన కేంద్రం.కొత్తగూడెం మండలం పేరుతోనున్న మండలానికి ప్రధాన కేంధ్రం.

లోగడ కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో రెవిన్యూ డివిజనుగా ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కొత్తగా భద్రాద్రి పేరుతో నూతన జిల్లాను, కొత్తగూడెం జిల్లా పరిపాలన కేంద్రంగా ఉండేలాగున, అలాగే మండల కేంద్రంగా రామవరం గ్రామంతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది..

 పౌర పరిపాలన 

కొత్తగూడెం పురపాలక సంఘము 1971 లో స్థాపించిబడింది. ఇది 33 వార్డులు కలిగి ఉన్న ఒక మొదటి గ్రేడ్ పురపాలక సంఘము. ఈ పట్టణ అధికార పరిధి .

కొత్తగూడెం రైల్వేస్టేషన్ ను భద్రాచలం రోడ్డు  అనే పేరుతో పిలుస్తారు. భద్రాచలం చేరుకోవడానికి ఇక్కడనుండే వెళ్ళవలెను. భద్రాచలం ఇక్కడి నుండి గంట ప్రయాణము. పాల్వంచ పట్టణం మీదుగా వెళ్ళవలసి వుంటుంది. కొత్తగూడెంకు హైదరాబాదు నుండి బస్సు ద్వారాగానీ, రైలు ద్వారాగానీ వెళ్ళవచ్చు. దీనిని చేరుకోవడానికి హైదరాబాదు నుండి అయితే ఐదు గంటలు, బెజవాడ నుండి అయితే నాలుగు గంటలూ పడుతుంది. కొత్తగూడెం నాలుగు దిక్కులా పచ్చని అడవులను చూడవచ్చు. పట్టణంలో చెప్పోకోదగ్గ ముఖ్య అంశము సింగరేణి సంస్థ గురించి, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ సంస్థ ఉండటం వలన కొత్తగూడెంకి బ్లాక్ గోల్డ్ నగరం అని పేరు. కొత్తగూడెం ధర్మల్ విద్యుత్ కేంద్రం రాష్ట్రానికి అధికశాతం విద్యుత్ ని అందిస్తుంది. ఇది పాల్వంచ పట్టణంలో ఉంది. అక్కడే నవ భారత్ ఇనుము సంస్థ కూడా ఉంది.

కొత్తగూడెం మండలం హేమచంద్రాపురంగ్రామంలోని కారుకొండగుట్ట లకు ఘనమైన చరిత్ర ఉంది. రాతితో బుద్ధుడు పద్మాసనంలో కూర్చొని ఉండటం.. ఇక్కడి ప్రత్యేకత. వీటితో పాటు ఈ గుట్టపై అతి పెద్ద సొరంగం కూడా ఉందని పురావస్తు శాఖ గుర్తించింది. ఈ కొండకు ఆగ్నేయంగా రెండు బుద్ధుని విగ్రహాలు ఉన్నాయి. ఒకే రాయిపై 4 వైపులా బుద్ధుని ప్రతిమలు చెక్కి ఉన్నాయి. ఇక్కడ చరిత్ర నిక్షిప్తమై ఉన్నట్లు ప్రభుత్వం 1989లోనే గుర్తించి నిర్ధారించింది.

ఇక్కడ సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రధాన కార్యాలయము ఉండుటవల్ల దీనిని దక్షిణ భారతదేశపు బొగ్గు పట్టణంగా పిలుస్తారు. కొత్తగూడెం, పాల్వంచలు జంట పట్టణాలు. కొత్తగూడెం చుట్టుపక్కల అడవులు, పరిశ్రమలు, సుందరమైన ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి.




#Article 168: జగిత్యాల (927 words)


జగిత్యాల, భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, జగిత్యాల మండలానికి చెందిన పట్టణం.. 
ఈ పట్టణం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణకు జరగకముందు కరీంనగర్ జిల్లాలో ఉంది.ఇది రెవెన్యూ డివిజను ప్రధాన కేంద్రము.హైదరాబాదుకు 210 కి.మీ. దూరంలో ఉంది.

చుట్టుపక్కల 50 చ.కి.మీ. లోని 30 గ్రామాల ప్రజలకు జగిత్యాల వ్యాపార కేంద్రం. ఈ ప్రాంతపు ప్రజలకు ఇది విద్యాకేంద్రం కూడా. పట్టణానికి ఉత్తరాన జాఫరుద్దౌలా 1747లో కట్టించిన పాత కోట ఉంది. సమీప, దూర ప్రాంతాల పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలతో జగిత్యాలకు చక్కని రవాణా సౌకర్యాలు ఉన్నాయి. పట్టణానికి రైలు మార్గం ఈ మధ్యనే నిర్మించారు.జగిత్యాల ఒక శాసనసభ నియోజకవర్గ కేంద్రము.

నిజాము పరిపాలన గుర్తుగా జగిత్యాలలో అప్పటి నిర్మాణాలు కొన్ని ఉన్నాయి. అయితే ఇవి ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. జగిత్యాల చుట్టుపక్కల ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వేములవాడ (42 కి.మీ), ధర్మపురి (30 కి.మీ), కొండగట్టు (15 కి.మీ)ప్రముఖమైనవి. ప్రముఖ చారిత్రక ప్రదేశమైన పొలాస (7కి.మీ ) (కాకతీయుల నాటి పౌలస్త్యేశ్వరపురం) జగిత్యాలకు చేరువలోనే ఉంది. అలాగే వీటితో పాటు చూడదగ్గ ప్రదేశం పెంబట్ల దుబ్బ రాజన్న స్వామి ఆలయం ఇది 11 కి.మీ దూరంలో ఉంటుంది

జగిత్యాల సమీపంలో కొండగట్టు వద్ద జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ఉంది.పొలాస గ్రామములో ఆచార్య ఎన్. జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ( బి. యస్సీ అగ్రికల్చర్ ) ఉంది.డాక్టరు వి.ఆర్.కె. ఇంజనీరింగ్ కళాశాల ఉంది.పలు జూనియర్ కళాశాలలు ఉన్నాయి.గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 9, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు 8 , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి.సమీప బాలబడి జగిత్యాలలో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల జగిత్యాలలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల కరీంనగర్లోను, పాలీటెక్నిక్ పొలసలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం జగిత్యాలలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కరీంనగర్ లోనూ ఉన్నాయి.

జగిత్యాలకు ఈ పేరు రావడానికి పలు రకాల కథనాలు వ్యాప్తిలో ఉన్నాయి. క్రీ.శ. 1110 నుండి 1116 వరకు పొలాస రాజధానిగా పరిపాలించిన జగ్గదేవుడు, తన పరిపాలనా కాలంలో 21 యుద్ధాలు చేసి పరిసర ప్రాంతాల్లో పలు నూతన గ్రామాల్ని స్థాపించాడు. పొలాసకు దక్షిణాన 6 కి.మీ. దూరంలో జగ్గదేవుడు అతని పేరిట జగ్గదేవాలయం నిర్మించి ఉంటాడని, అదే జగిత్యాలగా స్థిరపడిందని చరిత్రకారులు కథనం. మరో కథనం ప్రకారం...ఎల్గందుల కోటకు అధిపతిగా ఉండిన మబారిజుల్ ముల్క్ జఫరుద్ధౌల మీర్జా ఇబ్రహీం ఖాన్ ధంసా క్రీ.శ.1747లో జగిత్యాలలో నక్షత్రాకారంలో ఒక సువిశాలమైన, పటిష్ఠమైన కోటను ఫ్రెంచ్ ఇంజనీర్లయి జాక్ సాంకేతిక సహకారంతో నిర్మించాడు. ఆ ఇద్దరి ఇంజనీర్ల పేరు మీదే ‘జాక్ పిలవబడి క్రమంగా జగ్త్యాల్, జగిత్యాలగా మారిందనీ చెబుతారు.

జగిత్యాల కోట రాయి, సున్నంతో నక్షత్రాకారంలో నిర్మితమైంది. ఈ కోట చుట్టూ లోతైన కందకం ఉంది. ఇది ఇప్పటికీ నీటితో నిండి ఉంది. కోట నిర్మాణం కండ్లపల్లి చెరువు పక్కన జరిగింది, కనుక కందకంలో నీరు ఎప్పుడూ ఎండిపోదు. ఇది నిర్మించి దాదాపు 250 సంవత్సరాలు కావొస్తుంది. కోట బురుజులలో దాదాపు రెండు మీటర్ల పొడవైన తోపులు అనేకం ఇంకా మిగిలే ఉన్నాయి. ఈ ఫిరంగులపై మహ్మద్ ఖాసిం పేరు ఉర్దూలో రాసి ఉంది. కోటలోపల, మందు గుండు సామాగ్రి కోసం నిర్మించిన గదులు అనేకం ఉన్నాయి. 1930 వరకు జగిత్యాల రెవెన్యూ కార్యాలయాలు ఈ కోటలోనే ఉండేవి. ఇక్కడ ఒక ఖిలేదార్, 200 మంది సిపాయిలు ఉండేవారు. ఆ కాలంలో అంటే క్రీ.శ. 1880లో జగిత్యాలలో 516 ఇళ్లు మాత్రమే ఉండేవంటారు. ఆనాటి జనాభా 2,812 అని తెలుస్తోంది.

చెక్కు చెదరని గడీ జగిత్యాల పట్టణంలో జువ్వాడి ధర్మజలపతి రావు అనే దొర ఒక గడీని నిర్మించాడు. ఈ గడీ చల్‌గల్ గడీకి దగ్గర పోలికల్తో ఉంటుంది. ఇరుపక్కల విశాలమైన బురుజులతో, లావైన స్తంభాలతో జగిత్యాల గడీ ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. ఈ గడీలో పై అంతస్థు పైన ఉండడానికి బయట నుండే రెండు వైపుల మెట్లను నిర్మించారు.ఆ కాలంలోని ‘దువ్వం తాలూకాదార్లు’ (డిప్యూటి కలెక్టర్‌లు) ఈ గడీలోనే ఉండేవారనీ చెబుతారు.

ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1937లో తన పరిపాలనా రజతోత్సవాలను రాజ్యమంతటా జరిపించాడు. ఆ సందర్భంగా ధర్మజలపతి రావు జగిత్యాల నడిబొడ్డున ఎత్తయిన క్లాక్ టవర్‌ను నిర్మించాడు. అది చూసి మెచ్చుకొని, నిజాం రాజు ఆ క్లాక్ టవర్ వెండి నమూనాను చేయించి జ్ఞాపికగా ధర్మజలపతి రావుకు బహుకరించాడు. ఈ గడీని అమ్మివేయడంతో అది ప్రస్తుతం ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉంది.

జగిత్యాలకి ఇంతటి పేరు రావడానికి కారణం 1978 సెప్టెంబరు 9. ఆ రోజు విప్లవోద్యమానికి సంబంధించి చారిత్రాత్మకమైన ప్రస్తావనకు జగిత్యాల నాంది పలికింది. నలభై వేల మంది ప్రజలు భూస్వామ్య వ్యవస్థ మీద విరుచుకుపడ్డారు. అనాటి ‘జైత్రయాత్ర’లో ప్రముఖ మావోయిస్టు నాయకుడు ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి, శీలం నరేష్, లలిత, మల్లోజుల కోటేశ్వర్‌రావు అలియాస్ కిషన్‌జీ, మల్లా రాజిడ్డి, సాహు, నల్లా ఆదిరెడ్డి, కైరి గంగారాం, గజ్జెల గంగారాం, పోశాలు, అంగ ఓదెలు, నారదాసు లక్ష్మణ్‌రావు, గద్దర్, అల్లం నారాయణలతో పాటు పలువురు పాల్గొని తమ ప్రసంగాలతో ప్రజల్ని ఉత్తేజ పరిచారు. ఈ జైత్రయాత్ర రష్యా గోడలపైన కూడా నినాదమై చోటు సంపాదించుకుంది.

ఒకప్పుడు చిన్న పట్టణంగా ఉండే జగిత్యాల నేడు చుట్టుపక్కల ఉన్న ఊర్లను ఎన్నింటినో తనలో కలుపుకొని ఒక ‘పెద్ద పట్టణం’గా రూపాంతరం చెందింది. జగిత్యాలలో ప్రస్తుతం సుమారు లక్షా యాబై వేల జనాభా ఉంది. తెలుగు, హిందీ, ఉర్దూ భాషలు సమాన స్థాయిలో పలుకుబడిలో ఉన్నాయి. ఇంగ్లీష్ కూడా క్రమంగా పరివ్యాప్తం చెందుతోంది. రాష్ట్రంలోని పెద్ద పట్టణాలలో ఇది ఒకటి. రాష్ర్ట ప్రభుత్వం ద్వారా ‘అతి పరిశుభ్రమైన నగరం’గా గుర్తింపు పొందింది.జగిత్యాలకు నాలుగు వైపుల నాలుగు చెరువులు ఉన్నాయి. కండ్లపల్లి, ముప్పారపు, మోతె చెరువుల నీళ్లని వ్యవసాయానికి, ధర్మసముద్రం నీటిని తాగేందుకు వినియోగిస్తున్నారు. మున్సిపాలిటీ ఆధీనంలో ఉన్న జగిత్యాల జనాభాలో 51 శాతం పురుషుల, 49 శాతం మహిళలు ఉన్నారు. అక్షరాస్యత 63 శాతంగా నమోదైంది. ఇది జాతీయ రేటు (59.5 శాతం) కంటే ఎక్కువ.

ఉత్తర తెలంగాణ వాతావరణ మండలంలోని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల రైతులకు ఇది సేవలందిస్తోంది.రైతుల దేవాలయం...పొలాస వ్యవసాయ పరిశోధనాకార్యాలయం, ఆచార్య జయశంకర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 1980 డిసెంబర్ 2న జగిత్యాల మండలం పొలాస వద్ద పరిశోధనా క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో క్షేత్రం ఏర్పాటు కాగా, 1983 నుంచి పూర్తిస్థాయి కార్యక్రమాలు ఆరంభమయ్యాయి.

పై మూడు జిల్లాల్లో ఏరువాక కేంద్రాలు, కృషీ విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు సేవలందిస్తున్నారు.

చరిత్ర పరిశోధకుడు జైశెట్టి రమణయ్య జగిత్యాల చారిత్రాత్మక సంపదపై లోతైన పరిశోధనలు చేసిన చరిత్రకారుడు జైశెట్టి రమణయ్య జగిత్యాల వాస్తవ్యులే. ఈయన రాసిన ‘టెంపుల్స్ ఆఫ్ సౌతిండియా’, ‘ది చాళుక్యాస్ అండ్ కాకతీయ టెంపుల్స్ ఎ స్టడీ’ అనే రెండు పుస్తకాలు జాతీయ స్థాయిలో పేరు సంపాదించి పెట్టాయి. యాబై చారిత్రాత్మక వ్యాసాలు ప్రముఖ జర్నల్స్‌లో ప్రచురితమై పాఠకుల మన్ననలు అందుకున్నాయి.

జగిత్యాలపై ఇప్పటి వరకు మూడు పుస్తకాలు వెలువడ్డాయి. అవి 1. జగిత్యాల జంగల్ మహల్ 2. జగిత్యాల పల్లె 3. నేను రుద్రవీణని... జగిత్యాలని. జగిత్యాల జైత్రయాత్ర జరిగిన తీరు, అంతకు ముందు దొరల వెట్టిచాకిరి, ఈ ప్రాంతం వెనుకబాటుతనం లాంటి విషయాల్ని విశ్లేషిస్తూ ‘జగిత్యాల జైత్రయాత్ర’ జరగడానికి కారణాలేమిటో చెబుతూ జగిత్యాల ‘జంగల్ మహల్’ పుస్తకం వెలువడింది. క్రాంతి ప్రచురణల పేరుతో విప్లవ రచయితల సంఘం 1981 జనవరిలో ఆరువేల కాపీలతో ఈ పుస్తకాన్ని ముద్రించారు.జగిత్యాల జైత్రయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొన్న ప్రముఖ పాత్రికేయులు, నమస్తే తెలంగాణ సంపాదకులు అల్లం నారాయణ ‘జగిత్యాల పల్లె’ పేరుతో ముప్పయి కవితల సంకలనాల్ని వెలువరించారు. అల్లం నారాయణ రాసిన కవితలే కాకుండా పాటలు కూడా ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా *‘జగిత్యాల కదిలింది జంబాయిరే... ఊరూరు మండింది జంబాయిరే...’ అనే పాట ఇప్పటికీ పల్లె ప్రజల నాల్కలపై విన్పిస్తుంది.ఇక ‘నేను రుద్రవీణని...జగిత్యాలని’ శీర్షికన వచ్చిన పుస్తకం కె.వి.నరేందర్, సంగవేని రవీంద్ర రచించిన దీర్ఘ కవిత. జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యం, ఈ ప్రాంతంలో ప్రపంచీకరణ ప్రభావం వల్ల అస్తవ్యస్తమైన జీవన విధానాన్ని, ఫొటోలతో ప్రతిబింభిస్తూ ‘పవర్ పాయింట్ ప్రజెంటేషన్' పేరుతో ఒక విశిష్ట రూపంతో అల్లం నారాయణ కలం నుంచి వెలువడిన కవిత ఇది.

జగిత్యాల పల్లె పందిళ్లు విరుగుతయ్ బీరపాదులతో సహా సన్నీలు శరీరాల మీద దిగుతయ్ బట్టలు ఇగ్గేసీ బజారు పాలు చేస్తారు.ఎవడో ఒక అభాగ్యుడు పండ్లు గిలకరించి మూలుగుతడు.తెల్లవారుతుంది,అజ్ఞాత సూరీడు,విరిగిన, పగిలిన,చిరిగిన, చిట్లిన గుడిసె కప్పుల మీదుగా కిరణాలు ఝళిపిస్తూ తూర్పున రగుల్కొంటాడు...ఇదే జిల్లాకు చెందిన ప్రముఖ కవి , రచయిత వాసాల లక్ష్మినారాయణ జీవన గమనం , అక్షర సైన్యం ,అక్షర సమ్మేళనం   అనే పుస్తకాలను వెలువరించాడు .




#Article 169: లేపాక్షి (1585 words)


లేపాక్షి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన హిందూపురం నుండి 14 కి. మీ. దూరంలో ఉంది. బెంగుళూరు నుండి 120 కి.మీ. దూరంలో ఉంటుంది. హైదరాబాదు, బెంగుళూరు రోడ్డుకు ఎడమ వైపు నుండి 11 కి.మీ. దూరంలో ఉంటుంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2133 ఇళ్లతో, 10042 జనాభాతో 1891 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5373, ఆడవారి సంఖ్య 4669. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1120 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 134. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 595570.పిన్ కోడ్: 515 331.

రావణాసురుడు మహాసాధ్వియగు సీతను అపహరించుకోని యా ప్రంతములో వేళ్ళుతూ వుంటే ఈ కూర్మ పర్వతము పైన జటాయువు అడ్డగిస్తుంది. రావణుడు ఆ పక్షి యొక్క రెక్కలు నరికివేయగ ఈ స్థలములో ఆ పక్షి పడిపోయింది. ఆ పిమ్మట సీతాన్వేషణలో ఈ స్థలమునకు వచ్చిన శ్రీరాముడు జటాయువును తిలకించి జరిగిన విషయమును పక్షి నుండి తెలుసుకోని తర్వాత ఆ జటాయువు పక్షికి మోక్షమిచ్చి ’లే-పక్షి’ అని ఉచ్చరిస్తాడు. లే-పక్షి అను కుదమే క్రమ క్రమముగా లేపాక్షి అయనట్లు ఇక్కడి ప్రజలు అంటున్నారు.

మరో కథ ప్రకారం చూస్తే... అచ్యుతరాయలు కోశాధికారి విరూపణ్ణ రాజు అనుమతి లేకుండా ప్రభుత్వ ధనంతో ఆలయ నిర్మాణం చేపట్టాడు. నిర్మాణం చాలా వరకూ పూర్తయి, కళ్యాణ మంటపం నిర్మాణం జరుగుతున్న సమయంలో రాజుగారికి ఈ విషయాన్ని విరూపణ్ణ వ్యతిరేకులు చేరవేసారు.
దీంతో విరూపణ్ణ ముందుగానే రాజు విధించబోయే శిక్షను తనకు తానుగా విధించుకుని రెండు కళ్లనూ తీసివేసి కళ్యాణ మంటపం దక్షిణవైపున ఉండే గోడకు విసిరి కొట్టాడట. అలా కళ్లు విసిరికొట్టిన ఆనవాళ్ళుగా అక్కడి గోడపైనుండే ఎర్రటి గుర్తులను స్థానికులు చూపుతుంటారు కూడా. అలా లోప- అక్షి (కళ్లు లేని) అనే పదాల ద్వారా ఏర్పడిందే లేపాక్షి అని చెబుతారు.

ఈ ఊరు శ్రీకృష్ణ దేవరాయల కాలమున మిక్కిలి ప్రశస్తి గన్నది. విరుపణ్ణ నాయక, వీరణ్ణ నాయకులను ఇరువరు గొప్ప వ్యక్తులు ఆ రాయల ప్రతినిధులుగ ఈ ఊరిలో ఉండి ఈ వైపు ప్రాంతమును ఏలినారు. ఈ ఊరి పక్కన ఒక గుట్ట ఉంది. దాని పేరు కూర్మశైలము. ఇక్కడ పాపనాశేశ్వరుడను శివుడు ప్రతిష్ఠితుడైయున్నాడు. అగస్త్యుడు ఇతనిని ప్రతిష్ఠించెను. మొదట ఇది గర్భగుడి మాత్రము ఉండెడిది. మన ఋషులు అరణ్యములలో తపమునకై వచ్చి ఇట్టి పట్టుల ప్రశాంతముగ డేవుని కొలిచెడివారు. దండకారణ్యమును తాపసోత్తమ శరణ్యమని కృష్ణ దేవరాయల కాలమునకు ముందు వాడగు పోతనామాత్యుడు వర్ణించి యున్నాడు. ఈ లేపాక్షి దండకారణ్యము లోనిది. ఇచ్చట జటాయువు పడియుండెననీ, శ్రీరాముడు ఆతనిని లే పక్షీ అని సంబోధించిరని, అందుచేతనే దీనికి లేపాక్షి అని పేరు కలిగినని కొందరు అంటారు. ఇది నమ్మదగినది కాదు. శ్రీరాముడు కిష్కింధకు రాకముందు జటాయువు సంస్కారము జరిగింది. శ్రీరాముడు ఉత్తరమునుండి దక్షిణమునకు వచ్చాడు.
పట్టణ ప్రవేశంలో ఉన్న ఒక తోటలో ఉన్న అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఠీవిగా కూర్చున్న భంగిమలో ఉంటుంది. ఇక్కడికి 200 మీ. దూరంలో మధ్యయుగం నాటి నిర్మాణ కళతో కూడిన ఒక పురాతన శివాలయం ఉంది. ఇక్కడకూడా దాదాపు ముప్పై అడుగుల ఎత్తున, పాము చుట్టుకొని ఉన్నట్లున్న శివలింగం ఆరుబయట ఉంటుంది. చక్కటి శిల్పచాతుర్యంతో కూడిన స్తంభాలు, మండపాలు, అనేక శివలింగాలతో కూడిన ఈ గుడిలో ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి. ఈ దేవాలయము పెద్ద ఆవరణ కలిగి మధ్యస్థంగా గుడితో సుందరముగా ఉంటుంది. 
ఇచ్చటి వీరభద్రుని ఆలయాన్ని క్రీ. శ 15, 16 వ శతాబ్ది మధ్యకాలములో విజయనగర ప్రభువు అచ్యుతరాయల కాలములో పెనుకొండ సంస్థానంలో కోశాధికారిగా వున్న విరూపణ్ణ కట్టించాడని ప్రతీతి. ఇతడు రాజధనము వెచ్చించి రామదాసుకు చాలాముందే ఈవీరభద్రాలయము కట్టించాడు. అచ్యుతరాయలు విజయనగరానికి రమ్మని తాకీదు పంపగా,రాజు విధించే శిక్ష తానే చేసుకోవాలనీ కళ్ళు తీయించుకున్నాడట.ఆలయ నిర్మాణము మూడింట ఒక వంతు ఆగిపోవడము ఇందువల్లనే అంటారు.ఈ ఆలయ నిర్మాణం జరుగత ముందు ఈ స్థలం కూర్మ శైలము అనే పెరుగల ఒక కోండగా ఉండేది. ఈ కొండపైన విరూపణ్ణ పెనుకొండ ప్రభువుల ధనముతో ఏడు ప్రాకారములగల ఆలయము కట్టించగా ఇప్పుడు మిగిలియున్న మూడు ప్రాకారములు మాత్రమే మనము చూడగలము. మిగిలిన నాలుగు ప్రాకారములు కాలగర్భమున కలసిపోయనవని అంటారు. ప్రాకారం గోడులు ఎత్తేనవిగా ఉన్నాయ. గోడలపైనా, బండలపైనా కన్నడ భాషలో శాసనములు మలచారు. ఈ శాసనముల ద్వారా ఈ దేవాలయ పోషణకు ఆనాడు భూదానము చేసిన దాతల గురిచిన వివరాలు తెలుస్తాయ్.
ఇక్కడి గుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడి మూలవిరాట్టు వీరభధ్ర స్వామి. గుడి లోపల ఒక స్తంభానికి దుర్గా దేవి విగ్రహము ఉంది. మాములుగా దేవుడు మనకు గుడి బయటినుండే కనపడుతారు . వీరభధ్ర స్వామి ఉగ్రుడు కాబట్టి, అతని ఛూపులు నేరుగా ఊరి మీద పదకూడదు అని గుడి ద్వారం కొంచం ప్రక్కకు వుంటుంది. గుడి లోని పైకప్పు మీద కలంకారి చిత్రాలు అద్భుతంగా వేయబడ్డాయి. ఈ గుడికి ముఖ్య ఆకర్షణ వేలాడే స్తంభం. ఈ స్తంభం కింద నుంచి మనము ఒక తువ్వాలుని అతి సులువుగా తీయవచ్చును. ఇది అప్పటి విశ్వబ్రాహ్మణ శిల్పుల యొక్క కళాచాతుర్యానికి ఒక మచ్చుతునక.లేపాక్షి ఒక మంచి దర్షనీయ ప్రదేశం. అక్కడ కొలువైఉన్న వీరబద్రస్వామి చాలా మహిమ కలవాడు.

లేపాక్షి దేవాలయమున చక్కని ఎరుపు, నీలిమ, పసుపుపచ్చ, ఆకుపచ్చ, నలుపు, తెలుపు లను ఉపయోగించి అబ్ధుతమగు చిత్రములు గీయించిరి. కృష్ణదేవరాయల కాలపు చిత్రలేఖనము యొక్క గొప్పదనము- అంటే లేపాక్షి చిత్రలేఖనపు గొప్పదనమును కూడా చూడవచ్చును. సమకాలికుడగు పింగళి సూరన్న ప్రభావతీ ప్రద్యుమ్నమున కొంత సూచించాడు. అందు ప్రభావతీ వర్ణన  కన్నుల గట్టినట్లు తెలికన్నుల నిక్కను జూచినట్ల, తోబలుక కడంగినట్ల, భావ గంభీరత లుట్టి పడన్ శివ వ్రాసినట్టి ఈ చిత్తరవు అని శుచిముఖిచేత వర్ణించాడు.శివ, వీరభద్ర, వైష్ణవాలాయములకు సమానమైన ముఖమండపము పైకప్పు లోభాగమున మహాభారత, రామాయణ పౌరాణిక గాథల పెక్కుగా వ్రాసినను, వీరభద్ర దేవాలయపు గోడలమీదను, శివాలయపు అర్ధపంటపమున శివకథలు అచ్చెరెవు గొల్పునట్లు అలంకరించారు. పార్వతీ పరిణయము, పార్వతీ పరమేశ్వరుల పరస్పరానురాగ క్రీడలు, త్రిపుర సంహారము, శివ తాండవము లోనిఆఖ్యాయికలు గాథా విషయములుగ చేర్చబడినవి. గౌరీ ప్రసాద శివుడను చిత్తరువున పద్మములు మీసములతో జటాజూటము నుండి ప్రవహించు గంగను మరుగుపరుపజూచుచు శివుడు పార్వతి చిబుకములపై చేయుడి బుజ్జగించుట, పార్వతి ప్రణయ కోపము, పరిణయమునకు ముందు పార్వతీ అలంకారము, పార్వతీ పరమేశ్వరులు చదరంగమాడుట, శివుడు అంధకాసుర సంహారమొనర్చుట ముఖమున శాంతి, కరమున శూలము పెట్టి రుద్రుడు మొఖము, శివుని భిక్షాటనము, నటేశుని ఆనందతాండవము, దక్షిణామూర్తి మొదలగు చిత్రములు చూచువారిని ముగ్ధులు గావించెను. విష్ణువాలయమున మధ్య విష్ణువును, చుట్టు దశావతారములను చిత్రించిరి. లేపాక్షి శిల్పములు అనల్పములు. 60 కాళ్ళ ముఖ మంటపములోని స్తంభముల మీద పూర్ణకృతులగు సంగీతకారులయ, నటులయ మూర్తులను విజయనగర కీర్తిని తీర్చారు. బ్రహ్మ మద్దెలను, తుంబురుడు వీణెను, నందికేశ్వరుడు హుడుక్కను మరియొక నాట్యచార్యుడు తాళమును వాయింప రంభ నాట్య మాడుట ఒకచోట చిత్రించెను.

ఇచ్చట గుట్టవంటి రాతి నిచ్చట బసవేశ్వరుడుగా తీర్చిదిద్దినారు. ఇంత పెద్ద బసవడు మనికెన్ని చోట్లలనో దొరకడు.ఈగుడిని ఉద్ధేసించి లేపాక్షి రామాయణము అను హరికథ కూడాకలదు.దేవాలయాలకు కల్యాణమండపాలుండడము మన మెరుగుదుము. ఈ ఆలయములో కల్యాణమండపము ఉన్నది (అసంపూర్ణము) ఉన్నదీ,లతా మండపమున్నది.పాతికకు మించిన శిలా స్తంభాలు, నాలుగు వైపులా లతలను చెక్కిపెట్టినవి, చేరి లతా మండప మేర్పరచినవి.ఇలాంటి మండపము ఇతరచోట్ల సామాన్యముగా కానరాదు. నాలుగు కాళ్ళ మండపము విజయనగరపు ఆలయాలలో దేవాలయానికి బయట కనిపిస్తుంది. కాని ఈ ఆలయంలో ప్రాకరములో వైపున పశ్చిమ భాగంలో ఉంది.
శిల్పాలంకారములు-ముఖ్యముగా చెట్లను పెకలించబోయే ఏనుగులను-పరిశీలిస్తే శ్రీశైలం దేవాలయ ప్రాకరశిల్పాల పోలిక చాలా కనబడుతుంది. పంచముఖ బ్రహ్మ ఇక్కడి ప్రత్యేకత.శిల్పరూపాలు- స్తంభాలకు చేరా చెక్కినవి, ఇంచుమించు నాలుగైదు అడుగులవి ఇక్కడ కనబడుతాయి.రెడ్డిరాజులు కోరుకొండ, దక్షరామము, పలివెల దేవాలయములలోని స్తంభాలతో తమ శిల్పాకృతులను చెక్కించారు. తాడిపత్రి రామలింగేశ్వరాలయపు గోపురముమీద శిల్పి విగ్రహమూ, తిమ్మరసు విగ్రహమూఉన్నాయి.అయితే, మందవ స్తంభాలకు చేరా చెక్కించిన విగ్రహాలు ఇంత పెద్దవి ఇతరచోట్ల కానరావు.ఈ ఉదాహరణమును చూచి అహోబిల దేవాలయ మండపములో తిరుమల దేవరాయలూ, సోమపాలెము చావడిలో పెద్ది నాయకుడూ పెద్ద విగ్రహాలూ చెక్కించారు, మధుర మీనాక్షి దేవళములో తిరుమల నాయకుడు ఈ అలవాటును బ్రహ్మాండంగా పెంచాడు. లేపాక్షి ఆలయములోని నాగలింగమంతటిదీ, లేపాక్షి నంది అంతటిదీ భారతదేశములో మరిలేవు.
అజంతా తరువాత లేపాక్షి మండపాలలో కప్పులమీద చిత్రించిన రూపాలంతటి బృహద్రూపాలు మరిలేవు. లేపాక్షి అర్ధ మండపములో కప్పుమీది వీరభద్రుదంతటి పెద్ద వర్ణ చిత్రము భారతదేశములో మరిలేదు. కళాకారులు జైనులే అయినా, శిల్పమూ చిత్రకళా బృహద్రూపాలలో కోడము విజయనగర కళా ప్రభావమే.కళాకారులు జైనులనుటకు పలు నిదరసనములు కనబడుతున్నవి. లేపాక్షి వర్ణ చిత్రకారులు వర్ణలేపనములో, విన్యాసాలలో, దీర్ఘచిత్రాలలో, వస్త్రాలంకార సామాగ్రులలో జైన చిత్ర కళాసంప్రదాయాల్నే పాటించారు.శిల్పులు దేవతల వాహనాల్ని జైన తీర్ధంకురుల చిహ్నాల సైజులో చెక్కారు. స్త్రీల నగ్నత్వము చాలా అరుదు లేపాక్షిలో. పెనుకొండ పెద్ద జైన విద్యాస్థానము.ఈనాటికీ రెండు జైన ఆలయములు పూజలందుకుంటున్నవి.విరుపణ్ణ పెనుగొండ నాయంకరము పొందినవాడు.కళాకారులు అక్కడివారే కావడము వింతకాదు.లేపాక్షిలో శిల్పమూ చిత్రకళా సమ సంప్రదాయాలతోనే నడచినవి.మూడుకాళ్ళ భృంగీ, ఆరుచేతుల స్నానశివుడూ అవుననే తార్కాణ.

లేపాక్షి వర్ణచిత్రాలలో ఆనాటి ఆచారాలు ప్రతిబింబిస్తాయి.అవి కేవలము సంప్రదాయక చిత్రాలేకావు.సమకాలిక చిత్రాలని అనవచ్చును.స్త్రీల పాపిటసరములూ, శిరోజములలో విడిపోవులూ, రెండు పొరల పైటలూ, కైవార హస్తములూ, ఉద్యోగుల, నాయకులూ-,శిల్పాలూ-, చిత్రకారులూ-,ఉష్ణీషాలూ, దుస్తులూ ఆనాటివే.

వరుపణ్ణి తండ్రిపేరు నంది లక్కిసెట్టి.లేపాక్షిలో ఒక రాతిగుట్టను 30 అడుగుల పొడవూ, 18 అడుగుల ఎత్తూ గల నందిని చెక్కించాడు.విరుపణ్ణ ఆతని సోదరుడు వీరణ్ణ గొరవనహళ్ళిలో లక్ష్మీ ఆలయము కట్టించాడు.విరుపణ్ణ వీరభద్రాలయము అర్ధ మండపము ఈశాన్యమూల తమ కులమునకు మూల పురుషుడైన కుబేరుని కొడుకు కోడలుని- రంభా నలకుబేరులను చెక్కించాడు.రంభ నట్టువరాలు దుస్తులతో ఉంది.నలకుబేరుడు విష్ణు ధ్రమోత్తరములో చెప్పినట్లు కోరలతో ఉన్నాడు. ఇటువంటి శిల్పాలు అరుదు.

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 12, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. 
ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల హిందూపురంలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల అనంతపురంలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు హిందూపురంలోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల సేవామందిర్ లో ఉన్నాయి. 

ప్రతిభ ఉన్నా చదువుకోలేని గ్రామీణ విద్యార్థుల్లో వెలుగులు నింపుతోంది జవహర్ నవోదయ విద్యాలయం. ఉన్నత ప్రమాణాలతో కూడిన అధునాతన విద్య ఉచితంగా అందించడంతో పాటు నైతిక విలువలు పెంపొందించడం ఈ పాఠశాల ప్రత్యేకత. అంతేగాక విశాలమైన క్రీడామైదానం, గ్రంథాలయంతో పాటు ఉపాధ్యాయులు అందుబాటులో లేని సమయం లోను విద్యార్థులకు పాఠాలు బోధించేలా పనిచేసే ఇంటరాక్టివ్ బోర్డు, ప్రతి విద్యార్థికి కంప్యూటర్ శిక్షణ వంటి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. సంగీతం, చిత్రలేఖనం లోనూ తర్ఫీదు ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకత. జిల్లాలో లేపాక్షిలో ఈ విద్యాలయాన్ని 1987లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు స్థాపించాడు. పాఠశాలలో ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు నేషనల్ కౌన్సిల్ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సిలబస్‌లో బోధన సాగుతోంది. 10, 12 తరగతుల విద్యార్థులు సెంటర్‌బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహించే పరీక్షలకు హాజరవుతారు. అందుకే ఈ పాఠశాలలో ప్రవేశం పొందేందుకు విద్యార్థులు ఎంతో ఆసక్తి చూపుతారు.

లేపాక్షిలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

గ్రామంలో 2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

గ్రామంలో కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. 
బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

లేపాక్షిలో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. 
లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగు తున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. 

లేపాక్షిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

లేపాక్షిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

లేపాక్షిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

వేరుశనగ, మొక్కజొన్న, వరి




#Article 170: రామడుగు (కరీంనగర్) (529 words)


రామడుగు, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, రామడుగు మండలానికి చెందిన గ్రామం..పిన్ కోడ్: 505531.

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల గుండిలోను, ఇంజనీరింగ్ కళాశాల కరీంనగర్లోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ కరీంనగర్లో ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కరీంనగర్లో ఉన్నాయి.

రామడుగులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.  ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

గ్రామంలో5 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ఇద్దరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీ చదివిన డాక్టరు ఒకరు, డిగ్రీ లేని డాక్టర్లు ఆరుగురు, ముగ్గురు నాటు వైద్యులు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

రామడుగులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఇక్కడకు చేరుకోవడానికి కరీంనగరు, జగిత్యాల, గంగాధర, చొప్పదండి లనుండి చాలా బస్సులు ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

రామడుగులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

రామడుగులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

రామడుగులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

వరి, ప్రత్తి, మొక్కజొన్న

బీడీలు

చేతితో చేసే రాతి పని ముట్లు

ఇక్కడ ప్రాచీన కాలంనాటి కోట ఒకటి ఉన్నది. దీని గోడలు ముప్పై మీటర్లు ఎత్తులో ఉంటాయి. ఇది రాతి శిల్పాలకు బహు ప్రసిద్ధి. ఇక్కడ ఉన్నటువంటి రాతి శిల్పాలను చూడటానికి భారతదేశం నలుమూలలనుండి జనాలు వస్తారు. 




#Article 171: మంథని (577 words)


మంథని, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా, మంథని మండలానికి చెందిన పట్టణం.

ఈ పట్టణం రెవెన్యూ డివిజన్ కేంద్రం.ఇది సమీప పట్టణమైన రామగుండం నుండి 40 కి. మీ. దూరంలోనూ, కరీంనగర్ నుండి 60 కి.మీ.ల దూరములోనూ, రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 225 కి.మీ.ల దూరములో ఉంది. భౌగోళికంగా మంథని 18-30', 19' ఉత్తర అక్షాంశాల మధ్యా, 78-30', 80-30' తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి సముద్ర మట్టమునకు 421 అడుగులు (128 మీటర్లు) ఎత్తులో ఉంది.

ఈ చిన్న గ్రామం వేద బ్రాహ్మణులతో, దేవాలయాలతో నిండి ఉంది.మంథనికి ఉత్తరాన గోదావరి నది, దక్షిణాన బొక్కలవాగు అనే చిన్న యేరు, తూర్పున సురక్షిత అడవి, పశ్చిమాన రావులచెరువు హద్దులుగా ఉన్నాయి. దక్షిణాన, పశ్చిమాన గ్రామ వ్యవసాయ భూములు ఈ పొలిమేరలకు ఆవల ఉన్నా ప్రధాన నివాస స్థలము ఈ హద్దులలోనే ఉంది. గ్రామ విస్తీర్ణము 6 చదరపు కి.మీ.

గ్రామంలో 8 ప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 21, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు 8, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు 11 , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు మూడు ఉన్నాయి. 2 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 2 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఒక ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల  ఉన్నాయి.సమీప ఇంజనీరింగ్ కళాశాల రామగుండంలో ఉంది. సమీప వైద్య కళాశాల కరీంనగర్లోను, పాలీటెక్నిక్‌ కాటారంలోను, మేనేజిమెంటు కళాశాల రామగుండంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల రామగుండంలో ఉన్నాయి.

మంథనిలో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఐదుగురు డాక్టర్లు , 12 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. మూడు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

గ్రామంలో5 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీ చదివిన డాక్టరు ఒకరు, డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు.

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

మంథనిలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

మంథనిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

మంథనిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

మంథనిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

వరి, ప్రత్తి, మిరప

    
 
కొత్త వాడలు

  
 

  
 

                         

సూచన: కింది వంశాల పేర్లకు సంబంధించి గోత్రాలు తెలియకున్నవి. నమోదు చేయగలరని మనవి.

                             

గమనిక:పై అలయాల్లో తరచూ పూజలు జరుగుతుంటాయి.ఇవి కాక గ్రామానికి నాలుగు సరిహద్దుల్లో నాలుగు బోయి లింగాలు ఉన్నాయి. ఇంకా పూజింప బడని విగ్రహాలు ఎన్నో ఉన్నాయి.




#Article 172: అబ్దుల్లా కుతుబ్ షా (911 words)


అబ్దుల్లా కుతుబ్ షా దక్షిణ భారతదేశములోని గోల్కొండ రాజ్యమును పరిపాలించిన కుతుబ్ షాహీ వంశములో ఏడవ రాజు. అతడు 1626 నుండి 1672 వరకు పరిపాలించాడు.

సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా కుమారుడైన అబ్దుల్లా, బహుభాషా కోవిదుడు, సంగీత నాట్య ప్రియుడు. అతడు ప్రసిద్ధి చెందిన పదకర్త క్షేత్రయ్యను తన సభకు ఆహ్వానించి సత్కరించాడు. క్షేత్రయ్య మధుర భక్తి సంప్రదాయములో సుప్రసిద్ధుడు. ఈయన పేమమతి తారామతి అనే ఇద్దరు హిందూ యువతులను వివాహం చేసుకున్నాడు. అబ్దుల్లా తరువాత అతని అల్లుడు, అబుల్ హసన్ కుతుబ్ షా, గోల్కొండ రాజు అయినాడు.

మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఆదేశంతో 1930 డిసెంబరు 3న గోల్కొండ రాజ్యపు ఈశాన్య సరిహద్దుల్లో గోల్కొండకు చెందిన మన్సుర్ ఘర్ అన్న కోటపై మొఘల్ పరిపాలిత ఒరిస్సాకు గవర్నర్‌గా వ్యవహరిస్తున్న బకర్ ఖాన్ సైన్యసహితంగా దండయాత్ర చేశాడు. తమకే అన్ని విధాలా అనుకూల్యత ఉన్నా గోల్కొండ సైన్యం మొఘల్ సైన్యం చేసిన తొలి దాడికే లొంగిపోయింది. ఆ ఓటమితో మన్సూర్ ఘర్, ఖిరాపరా ప్రాంతాలను గోల్కొండ రాజ్యం మొఘల్ సామ్రాజ్యానికి కోల్పోయింది. తర్వాతి సంవత్సరంలో షాజహాన్ మరొక మొఘల్ సేన్యాధ్యక్షుడైన నసిరిఖాన్‌ను గోల్కొండ రాజ్యపు వాయవ్య సరిహద్దుల నుంచి దాడిచేయమని ఆదేశించాడు. మొఘల్ సైన్యాలు కాందహార్ కోటను (మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఉంది) హస్తగతం చేసుకున్నాయి. తద్వారా గోల్కొండ రాష్ట్రంలోని తెలంగాణ ప్రావిన్సులో మూడవ వంతు మొఘల్ సామ్రాజ్యం అధీనంలోకి వెళ్ళిపోయింది.

తద్వారా గోల్కొండ రాజ్యపు స్వాతంత్ర్యం ముగిసిపోయింది. అబ్దుల్లా అప్పటి నుంచీ మొఘల్ సామంతుని స్థాయికి దిగిపోయాడు. తన పేరిట కాకుండా మొఘల్ చక్రవర్తి పంపిన నమూనాలో నాణాలను ముద్రించడం ప్రారంభించాడు. మొఘల్ ప్రతినిధి అబ్దుల్లా కొలువులో ఉండేవాడు. సామంతునిగా మారడం వల్ల అబ్దుల్లా చేయబోయే ప్రతీ ముఖ్యమైన రాజకీయ నిర్ణయానికి అప్రకటితమైనది కానీ, గర్భితంమైనది కానీ అసలంటూ మొఘల్ చక్రవర్తి ప్రతినిధి ఆమోదం అవసరం.

తళ్ళికోట యుద్ధం తర్వాత బలహీనమై, రకరకాల రాజధానులు మారుస్తూ పోయిన విజయనగర సామ్రాజ్యంపై 1642 ఏప్రిల్‌లో దండయాత్ర ప్రారంభించడానికి అబ్దుల్లా నిర్ణయించాడు. అందుకు తగ్గట్టుగా మొఘల్ చక్రవర్తి షాజహాన్ కూడా కర్ణాటక ప్రాంతంపై తనకు అధికారం ఉందనీ, కాబట్టి గోల్కొండ, బీజాపూర్ (అప్పటికి మొఘల్ సామంత రాజ్యం అయింది) రాజ్యాలు కర్ణాటకపై దండయాత్ర చేసి గెలిచి తమ రాజ్యాల మధ్య దాన్ని పంచుకొమ్మని ఫర్మానా వెలువరించాడు. అన్నివైపులా దుర్భేద్యమైన రక్షణ కలిగి ఉన్న ఉదయగిరి కోటపై గోల్కొండ రాజ్యం ముట్టడి చేసింది. సాధారణంగా దాన్ని గెలవడం సాధ్యమయ్యేదో కాదో కానీ అబ్దుల్లా అదృష్టం కొద్దీ కొత్తగా రాజ్యానికి వచ్చిన రెండవ శ్రీరంగ రాయల మీద వ్యతిరేకతతో ఉన్న కోట సేనాని మల్లయ్యను గోల్కొండ సైన్యం లొంగదీసుకోగలిగింది. రహస్య మార్గం గుండా కోటలోకి ప్రవేశించి విజయం సాధించింది. బీజాపూర్ సుల్తాన్ ద్వారా సహాయం పొందిన రెండవ శ్రీరంగ రాయలు మళ్ళీ ఉదయగిరి కోటను స్వాధీనం చేసుకోగా, గోల్కొండ సైన్యాధ్యక్షుడు రెండవ మీర్ జుమ్లా తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. ఈసారి కడప ప్రాంతాన్ని రెండవ మీర్ జుమ్లా తన కిందే ఉంచుకున్నాడు. ఆపైన శాన్ తోమ్, చెంగల్పట్టు ప్రాంతాన్నీ జయించాడు. 1946 నాటికల్లా విజయనగర ఆఖరి పాలకుడైన రెండవ శ్రీరంగ రాయల పరిపాలనలో ఉన్న మొత్తం ప్రాంతం గోల్కొండ పాలైంది.

విజయనగర సామ్రాజ్యాన్ని అంతం చేయడంలో కీలకమైన పాత్ర పోషించిన అబ్దుల్లా వజీర్ రెండవ మీర్ జుమ్లా పోను పోను తన సుల్తాన్‌కి సమస్యాత్మకంగా తయారయ్యాడు. మీర్ జుమ్లా దక్కన్‌లో మొఘల్ గవర్నర్‌గా ఉన్న ఔరంగజేబుతో రహస్యంగా మంతనాలు సాగిస్తూ, అతన్ని గోల్కొండపై దండయాత్రకు రమ్మని ఆహ్వానించిన విషయం అబ్దుల్లాకు తెలిసింది. మీర్ జుమ్లాను తన కొలువులో హాజరు కావాలని పంపిన ఆదేశానికి సమాధానం లేకపోవడంతో అబ్దుల్లా అతని కుమారుడిని, భార్యని ఖైదుచేసి, యావదాస్తిని జప్తుచేశాడు. అవతల మీర్ జుమ్లా మొఘల్ కొలువును అంగీకరించాడు, ఔరంగజేబు సహకారంతో షాజహాన్ నుంచి 5 వేలమంది సైన్యానికి మన్సబుదారుగా తనకూ, 2 వేలమంది సైన్యానికి మన్సబుదారుగా తన కుమారుడికీ హోదా పొందాడు. మీర్ జుమ్లా కుటుంబాన్ని విడిపించం అసలు కారణం కాగా మొఘల్ సామ్రాజ్యానికి రావాల్సిన పేష్కష్ బాకీ కోసం అన్న వంకతో ఔరంగజేబు గోల్కొండపైకి సైన్యాన్ని నడిపిస్తున్నట్టు ప్రకటించాడు. ఇందుకు తన కుమారుడిని సైన్య సహితంగా వెళ్ళమని ఆదేశించాడు. ఈ పరిణామంతో భయపడిపోయిన అబ్దుల్లా హైదరాబాద్‌ను విడిచిపెట్టి గోల్కొండ కోటలో దాక్కున్నాడు. దానితో పాటు మీర్ జుమ్లా కుమారుడిని, భార్యను విడిచిపెట్టాడు. ఐనా, ఔరంగజేబు కుమారుడు మహమ్మద్ మాత్రం వెనుదిరగలేదు. గోల్కొండ కోటను ముట్టడించి కూర్చున్నాడు. ధైర్యం సన్నగిల్లిన అబ్దుల్లా ఓటమిని అంగీకరించి శాంతిని కోరాడు. సంధి షరతుల్లో భాగంగా కోటి రూపాయలు చెల్లించాడు. పాద్షా బీబీ సాహెబా అన్న పేరుతో పేరొందిన తన కుమార్తెను ఔరంగజేబు పెద్ద కొడుకు మహమ్మద్ సుల్తాన్ మీర్జాకు ఇచ్చి పెళ్ళిచేశాడు. ఈ పరిణామాలు 1656లో జరిగాయి.

ఔరంగజేబు మొఘల్ చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైన తర్వాత ఒకసారి అబ్దుల్లా కుతుబ్ షాని ఎప్పటిలానే మొఘల్ రాజ ప్రతినిధిని తన కొలువులో ఉంచమని ఆదేశించగా, ఆ ఆదేశాన్ని అబ్దుల్లా తిరస్కరించాడు. ఖైదులో జీవిస్తున్నా షాజహాన్ జీవించే ఉండడంతో ఔరంగజేబు ధర్మబద్ధంగా చక్రవర్తి కాబోడనీ, ఇప్పటికీ షాజహానే చక్రవర్తి అనీ, కాబట్టి ఔరంగజేబు ఆదేశాలు తాను స్వీకరించనక్కరలేదనీ ఒక వాదన కూడా చెప్పాడు. మొఘల్ రాజప్రతినిధిని తన కొలువులో అవమానించాడు. దీనితో మొఘల్ సైన్యం మీదికి దండయాత్ర చేసి, అబ్దుల్లాను ఓడించింది. అలా కుదుర్చుకున్న సంధిలో కారణంగా అబ్దుల్లా మొఘల్ సామ్రాజ్యానికి లోబడి సామంతునిగా ఉండేట్టు అంగీకరించి గోల్కొండ రాజ్యానికి తిరిగి పాలకుడయ్యాడు.

అబ్దుల్లా కుతుబ్ షా పరిపాలన చాలా ఇబ్బందుల్లో సాగింది. సైనికంగా చాలా బలహీనమైన పాలకుడిగా కనిపిస్తాడు. అయితే, సుల్తాన్ గా అతని బాధ్యతల్లో ఒకటైన న్యాయ నిర్ణయం విషయంలో అబ్దుల్లాకు చాలా మంచి పేరు ఉంది. న్యాయబుద్ధికి, న్యాయాన్యాయ విచక్షణకీ అతను పేరుపొందాడు. ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నవారైనా అన్యాయంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవడానికి వెనుకాడేవాడు కాదు.

తెలుగు భాష పోషణ విషయంలో కుతుబ్ షాహీలు పేరు పొందినా సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా కాలంలో దీనికి ఎదురుదెబ్బ తగిలింది. అయితే, అబ్దుల్లా తెలుగు భాషా సాహిత్యాల పోషణను పునరుద్ధరించాడు. మత సామరస్యాన్ని కూడా పాటించాడు, హిందూ ముస్లింలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి తన చర్యలతో దోహదం చేశాడు. అబ్దుల్లా కాలంలో గోల్కొండ రాజ్యంలో ద్విభాషా ఫర్మానాలు వెలువడ్డాయి, వీటిలో పర్షియన్ భాషలో సారాంశం, తెలుగులో పూర్తి పాఠం ఉండేవి. అబ్దుల్లా కుతుబ్ షా పరిపాలనలో గోల్కొండ రాజ్యంలో మల్లారెడ్డి దేశాయ్, కేశన-మల్లన వంటి తెలుగు కవులు కావ్యాలు రాశారు. అబ్దుల్లా కాలంలోనూ గోల్కొండ రాజ్యంలో పర్షియన్ సాహిత్య పోషణ ఎంతగానో జరిగింది. అతని పాలనలో ఇక్కడ అనేకానేక పర్షియన్ రచనలు వచ్చాయి. 1651లో అబ్దుల్లా పాలనలో మహమ్మద్ హుసేన్ బుర్హాన్ రూపొందించిన బుర్హాన్-ఇ-ఖాతీ అన్న పర్షియన్ నిఘంటువు ఈనాటికీ పర్షియన్ భాషలో ప్రామాణికమైన నిఘంటువుగా పేరొందింది. మరెన్నో పర్షియన్ రచనలు, చెప్పుకోదగ్గ ఉర్దూ సాహిత్యం అబ్దుల్లా పోషణలో వెలువడింది.

రెండవ మీర్ జుమ్లా చేతిలో మోసపోయి అనేక సమస్యల పాలైన కారణంగా చివరి దశలో తనకు నమ్మకస్తులైన వారిని పరిపాలనలో నియమించుకోవాలని అబ్దుల్లా నిర్ణయించుకున్నాడు. దాని ప్రకారమే ప్రతిభావంతుడైన తెలుగు బ్రాహ్మణ ఉద్యోగి మాదన్నను ప్రోత్సహించాడు. రాజ్యంలోని అన్ని కీలకమైన ఉద్యోగాల్లోనూ మాదన్నకు నమ్మకస్తులైన వ్యక్తులను నియమించమని అతనికి అవకాశం కల్పించాడు. క్రమేపీ అతన్ని బలపరుస్తూ వచ్చి, తుదకు సయ్యద్ ముజఫర్‌ను తొలగించి, మీర్ జుమ్లా (ఆర్థిక మంత్రి) పదవిలో మాదన్నను నియమించాడు. మాదన్న సైన్యంలోనూ, పరిపాలనలోనూ వివిధ ఉన్నత పదవుల్లో తనకు నమ్మకస్తులైన దగ్గరి బంధువులను, కుటుంబ సభ్యులను నియమించాడు.

మహమ్మద్ కుతుబ్ షా సమయంలోనే గోల్కొండ రాజ్యంలో వజ్రాల గనులు ఉన్న విషయం బయటపడినా, గనులను వెలికితీసి దాన్ని పూర్తిస్థాయి పరిశ్రమగా తీర్చిదిద్దింది అబ్దుల్లా పరిపాలన వ్యవస్థే. అబ్దుల్లా వజ్రాల గనుల నిర్వహణ, వెలికితీత ప్రక్రియ, అమ్మకం వగైరా మొత్తం వజ్రాల పరిశ్రమ ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువచ్చాడు. వజ్రాల వెలికితీత ఎంత ముమ్మరంగా ఉండేదంటే వాటిని లెక్కించేప్పుడు ఒక్కో వజ్రాన్నీ కాక వజ్రాల మూటలుగా లెక్క పెట్టేవారు. అబ్దుల్లా కిరీటంలో ప్రపంచంలోనే అత్యుత్తం అనదగ్గ వెలకట్టలేని వజ్రాలు ఉండేవి.అబ్దుల్లా పరిపాలనలో కుతుబ్ షాహీ నిర్మాణ కౌశలం అత్యుత్తమ దశకు చేరుకుంది. తన జీవితకాలంలో అబ్దుల్లా అనేక మసీదులను కళాత్మకంగా నిర్మింపజేశాడు. హయత్‌నగర్ మసీదు, హతీ బౌలీ, ఖాస్ బాఘ్, ఇబ్న్-ఖాటూన్ సమాధి మందిరం, టోలీ మసీదు, ఘోషా మహల్, కుతుబ్-ఎ-ఆలమ్ మసీదు, మూసా బురుజు, గోల్కొండ టూంబ్స్‌కు సంబంధించిన గొప్ప మసీదు, హయత్ బక్ష్ బేగం సమాధి మందిరం, హీరా మసీదు, అబ్దుల్లా కుతుబ్ షా సమాధి మందిరం అన్నవి అబ్దుల్లా పాలనాకాలంలో నిర్మించిన గొప్ప నిర్మాణాలు.

అబ్దుల్లా కుతుబ్ షాకి ముగ్గురు కుమార్తెలు:

అబ్దుల్లా చివరకు 1672లో మరణించాడు. అతనికి వారసునిగా గోల్కొండ సామ్రాజ్యాన్ని అతని మూడవ అల్లుడు అబుల్ హసన్ పట్టాభిషిక్తుడయ్యాడు.




#Article 173: క్షేత్రయ్య (757 words)


కర్ణాటక సంగీతంలో పేరెన్నికగన్న వాగ్గేయకారులలో క్షేత్రయ్య (1595-1660) ఒకడు. ఈయన అసలు పేరు మొవ్వా వరదయ్య గా భావిస్తున్నారు. అనేక పుణ్యక్షేత్రాలు, దేవాలయాలను సందర్శిస్తూ వాటి గురించిన వివరాలు తెలుసుకుంటూ ఉండటం చేత ఈయనకు క్షేత్రజ్ఞుడనే పేరు వచ్చింది. క్రమేణా అది క్షేత్రయ్యగా మారింది.

క్షేత్రయ్య జీవితకాలం 1595 - 1660 మధ్యకాలం కావచ్చును. ఇతని అసలుపేరు వరదయ్య. ఇంటిపేరు మొవ్వ. క్షేత్రయ్య పదాలలోని వరద అనే ముద్ర స్వనామ ముద్రగా భావించి అతని అసలుపేరు 'వరదయ్య'గా నిర్ణయించారు. ఇతని జన్మ స్థలం ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్‌లోని, కృష్ణా జిల్లాలో మొవ్వ గ్రామం. ఆ వూరిలో వెలసిన వేణుగోపాల స్వామి అతని ఇష్టదైవం.

జనబాహుళ్యంలో ఉన్న కథ ప్రకారం చిన్నతనంనుండి వరదయ్యకు గాన అభినయాలంటే మక్కువ. కూచిపూడిలో ఒక ఆచార్యుని వద్ద నాట్యం నేర్చుకొన్నాడు. సహపాఠి అయిన మోహనాంగి అనే దేవదాసితో సన్నిహితుడైనాడు. తరువాత మేనమామ కూతురు రుక్మిణిని పెండ్లాడాడు. కాని మోహనాంగి పట్ల అతని మక్కువ తగ్గలేదు. దేవదాసి అయిన మోహనాంగి చాలా వివేకం కలిగిన పండితురాలు. తమ ఆరాధ్య దైవమైన మువ్వగోపాలునిపై నాలుగు పదాలు పాడి తనను మెప్పించగలిగితే తాను వరదయ్య ప్రేమను అంగీకరిస్తానని మోహనాంగి షరతు విధించిందట.

మోహనాంగి పెట్టిన షరతు కోసం వరదయ్య నిరంతరం సాధన చేయసాగాడట. ఆ సాధన కారణంగా ప్రపంచములోని జీవాత్మలన్నీ స్త్రీలని, పరమాత్ముడయిన మువ్వగోపాలుడొక్కడే పురుషుడనే తత్వం వరదయ్యను అలుముకొన్నదట. క్రమంగా ఆ మధురభక్తితో అనేక పాటలు పాడాడు. వాటికి మోహనాంగి నాట్యం చేసిందట.

మరొక కథ: బాల్యంలో విద్యాగంధం లేని వరదయ్య పశువుల కాపరిగా ఉండేవాడు. ఒక యోగి ఇతనికి 'గోపాల మంత్రం' ఉపదేశించాడు. ఆనాటి నుండి అతనికి గొప్ప కవితా శక్తి అలవడింది.

ఆంధ్ర దేశంలోని తిరుపతి, కడప, శ్రీశైలం మున్నగు క్షేత్రాలలో నెలకొన్న దేవతలపైనే కాక, కంచి, శ్రీరంగం, మధుర, తిరువళ్ళూరులలో వెలసిన స్వామి వార్లపై కూడా క్షేత్రయ్య పదాలు రచించారు. కాని, అన్నిటిని మువ్వ గోపాలునికి అంకితం గావించి ఆ స్వామితో ఆయా దేవతలకు అభేదం కల్పించారు. ఈ దేశాటనం కారణంగానే అతనికి క్షేత్రయ్య అనే నామం స్థిరమైనదనిపిస్తున్నది.

ముందుగా గుంటూరు జిల్లా బెల్లంకొండలో చలువు చక్కరపురీశుని దర్శించాడు (చలువ చక్కెరపురి నిలయుడని మదిలో వలవేసి నిను వలపించలేద?) . అనంతరం భద్రాచలం లోని సీతారామచంద్రస్వామిని, పిదప శ్రీశైలం మల్లికార్జునుని, ఆపై హంపి హేమాద్రి నిలయుని దర్శించాడు. క్షేత్రయ్య దర్శించిన ఇతర క్షేత్రాలు - పాలగిరి చెన్నకేశవుడు, ఇనగలూరు ఇనపురి స్వామి, (దేవుని) కడప వెంకటేశ్వర స్వామిని దర్శించాడు. తిరుపతి చేరి వెంకటేశ్వర స్వామి, ఇతర దేవతామూర్తులపై అనేక పదాలు రచించాడు.

పిదప దక్షిణాభిముఖంగా సాగి (దక్షిణ ఆర్కాటు జిల్లా) కోవిల్లూరు మువ్వగోపాల స్వామిని దర్శించాడు. తిరువళ్ళూరు వీర రాఘవస్వామి, వేద నారాయణపురం వేదపురీశుడు, సత్యవేడు సత్యపురవాసుదేవుడు, కరిగిరి స్వామి దేవుళ్ళ దర్శనం చేసుకొన్నాడు. మార్గంలో పండితుల, పాలకుల సత్కారాలందుకొన్నాడు. క్షేత్రయ్యను ఎందరో ప్రభువులు సన్మానించారు. వారిలో మధురనేలిన తిరుమల నాయకుడు, గోల్కొండ నవాబు, తంజావూరు రఘునాధ నాయకుడు, చెంజి కృష్ణప్ప నాయుడు (తుపాకుల రాయుడు) ప్రముఖులు. రఘునాధ నాయకునిపై క్షేత్రయ్య వేయి పదాలు చెప్పాడు.

చిదంబంరం గోవిందస్వామిని తిల్ల గోవిందస్వామి అని క్షేత్రయ్య ప్రస్తుతించాడు. చిదంబరం పాలకుడైన కృష్ణప్పనాయకుని సన్మానం అనంతరం క్షేత్రయ్య తంజావూరు వెళ్ళి రఘునాధనాయకుని ఆస్థానంలో కొంతకాలం ఉన్నాడు. అక్కడినుండే శ్రీరంగం, కంచి, రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించాడు. క్షేత్రయ్య దర్శించిన క్షేత్రాలలోని దైవం గురించి కొన్ని క్షేత్రయ్య పదాలు మనకు లభిస్తున్నాయి.

తిరుగుప్రయాణంలో భద్రాచలం క్రొత్త తాసిల్దార్ కంచెర్ల గోపన్న క్షేత్రయ్యను ఆదరించాడు. అనంతరం క్షేత్రయ్య తన స్వగ్రామం మొవ్వకు తిరిగివచ్చాడు. తాను వివిధ పాలకులవద్ద కూర్చిన పదాలగురించ ఈ క్షేత్రయ్య పదం ద్వారా మనకు తెలుస్తుంది.

పల్లవి:
వేడుకతో నడచుకొన్న - విటరాయడే
అనుపల్లవి:
ఏడుమూడు తరములుగా - ఇందు నెలకొన్న కాణాచట!
కూడుకొని మువ్వ గోపాలుడే నా విభుడు   ||వేడుక||
చరణాలు:
మధుర తిరుమలేంద్రుడు - మంచి బహుమానమొసగి
యెదుట కూర్చుండమని - ఎన్నికలిమ్మనెనే
యిదిగో రెండువేల పదములు - ఇపుడెంచుకొమ్మనగా?
చదురు మీదనే యున్న సామికి - సంతోషమింతింత గాదె?  ||వేడుక||

అలుకమీరి తంజావూరి అచ్యుత విజయరాఘవుడు
వెలయ మనుజుల వెంబడి - వేగమె పొడగాంచి
చలువ చప్పరమున నుండగ - చక్కగ వేయి పదముల
పలుకరించుకోగానే బహుమానమిచ్చేనావేళ         ||వేడుక||

బలవంతుడయిన గోలకొండ - పాదుషా బహుమానమిచ్చి
తులసిమూర్తితో వాదు తలచే నావేళ
వెలయు మువ్వ గోపాలుడు - వెయ్యిన్నూరు పదములు
నలువది దినములలో - నన్ను గలసి వినిపించెనే       ||వేడుక||

మాట, పాటలను స్వతంత్రంగా రచించగలిగినవారినే వాగ్గేయకారులు లేదా బయకారులు అన్నారు.

భక్తుడు తనను నాయికగా భావించి భగవంతుని పొందుకోసం చెందే ఆరాటమే మధుర భక్తి. ఇలాంటి మధుర భక్తి ప్రబలంగా ఉన్న 17 వ శతాబ్దంలో క్షేత్రయ్య జీవించాడు. పదకవితలకు ఆద్యుడిగా క్షేత్రయ్యను భావిస్తున్నారు. ఆయన పదకవితలు నేటికీ సాంప్రదాయ నృత్యరీతులకు వెన్నెముకగా నిలిచి ఉన్నాయి. ఆయన 4, 500 కు పైగా పదాలు రచించాడు అని వేడుకతో నడుచుకొన్న విటరాయుడే అనే పదం వలన తెలుస్తున్నది. వాటిలో 1, 500 పదాల వరకు గోల్కొండ నవాబు అబ్దుల్లా కుతుబ్ షాకు అంకితమిచ్చాడు. ఈనాడు మనకు 330 పదాలు మాత్రమే లభిస్తున్నాయి.-

క్షేత్రయ్య పదాలలో లలితమైన తెలుగుతనంతో పాటు చక్కని అలంకారాలు, జాతీయాలు ఎక్కువగా కనిపిస్తాయి. సంగీతానికి, సాహిత్యానికి సరైన ప్రాధాన్యము యిచ్చిన పదకర్తగా ఆధునికులు క్షేత్రయ్యను మిక్కిలి ప్రశంసించారు.

డాక్టర్ మంగళగిరి ప్రమీలాదేవి తన రచనలో క్షేత్రయ్య పదాలకు ఈ విశిష్టతలు ఉన్నాయని వివరించింది 

 

క్షేత్రయ్య పదాల లక్షణాల గురించి డా. దివాకర్ల వేంకటావధాని ఇలా వ్రాశాడు

ఆనంద భైరవి రాగం - ఆదితాళం

పల్లవి: 
శ్రీపతి సుతు బారికి నే-నోపలేక నిను వేడితే
కోపాలా? మువ్వ గోపాలా?

అనుపల్లవి:
ఏ ప్రొద్దు దానింటిలోనే-కాపైయుండి నీ సరస స
ల్లాపాలా? మువ్వ గోపాలా?

చరణాలు:
పైపూత మాటలు నేర్ప-జూపుదాని రతిపై నింత
తీపేలా? మువ్వ గోపాలా?

చూపుల నన్యుల దేరి-చూడని నాతో క
లాపాలా? మువ్వ గోపాలా?

నా పొందెల్ల దానికబ్బి-యే పొందును లేక యుసురనుటే
నా పాలా? మువ్వ గోపాలా?

ఇంతసేపు మోహమేమిరా ? ఇందరికంటే - నింతి చక్కనిదేమిరా ?
సుంతసేపు దాని - జూడకుండలేవు
అంతరంగము దెలుప - వదియేల మువ్వగోపాలా !   ||ఇంత||

నీకెదురుగ వచ్చునా ? నెనరూరగా - నిండు కౌగిట జేర్చునా ?
ఆకుమడుపు లిచ్చునా ? తన చెలిమి
కైన వాడని మెచ్చునా ? తమి హెచ్చునా ?

ఏకచిత్తమున మీరిద్దరు - నింపు సొంపుగ నున్న ముచ్చట
నాకు వినవిన వేడుకయ్యిరా ! యిపుడానతీరా !     ||ఇంత||

మోవి పానకమిచ్చునా ? కొసరి కొసరి - ముద్దులాడనిచ్చునా ?
తావి పువ్వుల దెచ్చునా ? తన సొగసుకు
తగినవాడని మెచ్చునా ? మనసిచ్చునా ?
దేవరే మొగడు గావలెనని - భావజుని పూజ లొనరించిన
యా వనిత పేరేమి సెలవీరా ? సిగ్గేలరా ?       ||ఇంత||

సంతోషముగ నాడునా ? తంబుర మీట - సంచు పాట పాడునా ?
వింత రతుల గూడునా ? ఆ సమయమున
విడవకుమని వేడునా ? కొనియాడునా ?
సంతతము న న్నేలుకొని యా - కాంతపై వలచినపుడె యిక
కొంత యున్నదో మువ్వగోపాల ? గోరడ మేలా ?      ||ఇంత||




#Article 174: గండికోట (703 words)


గండికోట వైఎస్‌ఆర్ జిల్లా, జమ్మలమడుగు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన జమ్మలమడుగు నుండి పడమర దిశగా 14 కి. మీ. దూరంలో ఎర్రమల పర్వత శ్రేణిపై ఉంది.పెన్నా నదీ ప్రవాహం ఇక్కడి కొండల మధ్య లోతైన గండిని ఏర్పరచడం వల్ల ఈ కోటకు గండికోట అని పేరు వచ్చింది. రెండు మూడు వందల అడుగుల ఎత్తున నిటారుగా ఉండే ఇసుకరాతి కొండల గుండా పెన్నా నదీ ప్రవాహం సాగే నాలుగు మైళ్ళ పొడవునా ఈ గండి ఏర్పడి ఉంది. నదికి దక్షిణతీరాన ఉవ్వెత్తున ఎగసిన కొండల మీద బ్రహ్మాండమైన రక్షణ గోడలున్నాయి. ఈ గ్రామంలో గల చారిత్రక కోట గండికోట ప్రముఖ పర్యాటక కేంద్రం.

 
గండికోట ఒక ప్రముఖమైన గిరిదుర్గము, దీని చరిత్ర 13వ శతాబ్దము యొక్క రెండవ అర్థభాగములో మొదలవుతుంది. గండికోట కైఫియత్ లో పశ్చిమ కళ్యాణీ చాళుక్య రాజైన ఆహవమల్ల సోమేశ్వరచే మలికినాడు సీమకు సంరక్షకునిగా నియమించబడిన కాకరాజు శా.1044 శుభకృతు నామ సంవత్సర మాఘ శుద్ధ దశమి (క్రీ.శ. 1123 జనవరి 9) నాడు చిన్న మట్టికోటను కట్టించెను అని పేర్కొనబడింది. ఐతే ఇది నిజమని నిర్ధారించడానికి మరే ఇతర చారిత్రక ఆధారాలూ లేవు. త్రిపురాంతకము వద్ద గల శా.1212 (క్రీ.శ. 1290) నాటి ఒక శాసనం ప్రకారం, అంబదేవ అనే ఒక కాయస్త నాయకుడు, తన రాజధానిని వల్లూరు నుంచి గండికోటకు మార్చాడని భావిస్తున్నారు. ఉప్పరపల్లె దగ్గర గల శా.1236కు (క్రీ.శ. 1314) చెందిన ఒక శాసనం ప్రకారం ప్రతాపరుద్రుని సామంతుడు ఒకరు ఈ కోటను జయించాడని, ప్రతాపరుద్రుడు జుట్టయలెంక గొంక రెడ్డిని గండికోటని పాలించడానికి నియమించాడని తెలుస్తోంది. గండికోట విజయనగర సామ్రాజ్య కాలములో ఉదయగిరి మండలం (ప్రాంతము) లోని ఒక సీమకు రాజధానిగా ఉండేది. 16వ శతాబ్దపు రెండవ అర్ధభాగములో గండికోటను పెమ్మసాని కమ్మ నాయకులు తిమ్మానాయుడు, రామలింగనాయుడు పాలించారు. విజయనగర సామ్రాజ్యము విచ్ఛిన్నమైనపుడు, పదిహేడవ శతాబ్దం మధ్య ప్రాంతంలో అబ్దుల్లా కుతుబ్ షా సేనాని మీర్ జుమ్లా పెమ్మసాని కుమార తిమ్మానాయునికి మంత్రి పొదిలి లింగన్న ద్వారా విష ప్రయోగము చేయించి ఈ కోటను స్వాధీన పరచుకొన్నాడు. కమ్మ నాయకులు గండికోటను మూడు వందలయేళ్ళకు పైగా పరిపాలించారు.

వీరి పాలనలో గ్రామాలని మూడు విధాలుగా విభజించారు. బండారువాడ, అమర, మాన్య విభాగాలుగా విభజించారు. ఇందులో బండారువాడ గ్రామాలు చక్రవర్తుల ఆధీనంలో ఉండేవి. మాన్య గ్రామాలు దేవాలయాల, బ్రాహ్మణుల ఆధీనంలో ఉండేవి. అమర గ్రామాలు అమరులైన కోట అధ్యక్షుల ఆధీనంలో ఉండేవి. అందమైన లోయలు, ఎటు చూసినా అబ్బురపరిచే కమనీయ దృశ్యాలే ఇక్కడ కన్పిస్తాయి. ఎంతో ఘన చరిత్ర ఈ కోట సొంతం. ఎందరో రాజులు, రాజవంశాల పరాక్రమానికి, నాటి రాజకీయ, సామాజిక పరిస్థితులకు ఇది నిలువుటద్దం. ఈ కోటను సందర్శిస్తే ఆనాటి రాజుల పౌరుషాలు, యుద్ధాలు, నాటి రాజుల పరిపాలన గుర్తుకు వస్తుంది. దీని పరిసర ప్రాంతాల్లో 21 దేవాలయాలున్నాయి. పడమర, ఉత్తర దిక్కుల్లో పెన్నానది ప్రవహిస్తోంది. కోట నుంచి చూస్తే దాదాపు 300 అడుగుల లోతులో 250 అడుగుల వెడల్పుతో పెన్నానది కన్పిస్తుండడం విశేషం. ఇక్కడున్న జుమ్మామసీదు ఎంతో ప్రాచుర్యం పొందింది. మసీదు ప్రాకారం చుట్టూ లోపల 64 గదులు, బయట 32 గదులుండి ఎంతో ఆకర్షిస్తాయి.

ఎలాంటి నేరాలకైనా కృరమైన శిక్షలు ఉండేవి. చిన్న దొంగతనానికి కాలు, చేయి తొలగించేవారు. రాజద్రోహానికి పాల్పడితే కళ్ళు పీకేసి సూదులు చెక్కిన కర్రతో చంపేసేవారు. పెద్ద దొంగతనాలకు గడ్డం కింద కొక్కెం గుచ్చి వేలాడదీసి చంపేసేవారు.

తాళ్ళపాక అన్నమయ్య ఆహోబిల మఠ సంస్థాపనాచార్యులైన శఠగోప యతీంద్రుల దగ్గర సకల వైష్ణవాగమాలను అభ్యసించిన పిదప దారి వెంబడి పలు ఆలయాలను దర్శిస్తూ తిరుమల చేరాడు. అ యాత్రలో అప్పుడు వున్న గండికోట చెన్నకేశవాలయం దర్శించి చెన్నకేశుడిని చీరలియ్యగదవోయి చెన్నకేశవా! చూడు చేరడేసి కన్నుల వో చెన్నకేశవా అని స్తుతించాడు.

వృత్తాకారంలో ఉండే కోట చుట్టుకొలత దాదాపు ఐదు మైళ్ళుంటుంది. కోట ముఖద్వారానికి ఎత్తైన కొయ్య తలుపులు ఇనుప రేకుతో తాపడం చేయబడి ఉన్నాయి. తలుపులపై ఇనుప సూది మేకులున్నాయి. కోట ప్రాకారం ఎర్రటి నున్నని శాణపు రాళ్ళతో నిర్మించారు. కొండ రాతి పై పునాదులు లేకుండా గోడలు నిర్మించారు. ఈ గోడలు 10 నుండి 13 మీటర్ల ఎత్తున్నాయి. చతురస్రాకారంలోను, దీర్ఘ చతురస్రాకారంలోను 40 బురుజులున్నాయి. గోడపై భాగాన సైనికుల సంచారం కోసం 5 మీటర్ల వెడల్పుతో బాట ఉంది.కోట అంతర్భాగంలో మాధవరాయ, రంగనాథ ఆలయాలున్నాయి. ముస్లిం నవాబుల కాలంలో ఈ ఆలయాలను ధ్వంసం చేశారు. అప్పటి శిథిల శిల్పాలు ఇప్పటికీ దర్శనమిస్తాయి. మీర్ జుమ్లా జామా మసీదును సుందరంగా నిర్మించాడు. కోటలో పెద్ద ధాన్యాగారము, మందుగుండు సామగ్రి గిడ్డంగి, పావురాల గోపురం, మీనార్లు ముఖ్యమైన కట్టడాలు. ఇంతే గాక జైలు, రంగ్ మహల్ ఉన్నాయి. నీటి వసతి కోసం రాజుల చెరువు, కత్తుల కోనేరు, ఇంకా చాలా చెరువులు, బావులున్నాయి.

గతంలో ఈ కోటలో సుందరమైన, ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు, తోటలు ఉండేవి. పెమ్మసాని నాయకులు గండికోటను జనరంజకంగా పాలించినట్లు ప్రతీతి. ఇప్పుడు గండికోటలోని శిథిలాలు, మిగిలి ఉన్న కట్టడాలు ఈ కోట గత వైభవానికి ప్రతీకలుగా నిలిచి ఉన్నాయి.

రంగనాథాలయం: ఈ ఆలయం గురించిన మొట్టమొదటి ప్రస్తావన శా.1479 (క్రీ.శ.1557) నాటి ఒక శాసనంలో కనిపిస్తుంది. ఆ శాసనం గండికోట లోని రంగనాయకుని గుడికి భూమిని మాన్యంగా ఇచ్చినట్లు తెలుపుతుంది. ఈ ఆలయనిర్మాణశైలిని బట్టి చూస్తే రంగనాథాలయం నూటికి నూరు పాళ్ళూ విజయనగర రాజుల నిర్మాణం అని స్పష్టమౌతుంది. ఈ ఆధారాలను బట్టి ఈ ఆలయాన్ని క్రీ.శ.పదహైదవ శతాబ్దంలో నిర్మించినట్లు చెప్పవచ్చు.

మాధవరాయ ఆలయం: ఈ ఆలయం గురించిన మొట్టమొదటి ప్రస్తావన క్రీ.శ.పదహారవ శతాబ్దానికి చెందిన శాసనాలలో కనిపిస్తుంది. ఆలయంలో మనకు కనిపించే శిల్ప కళా లక్షణాలు, ఆలయనిర్మాణశైలిని బట్టి చూసినా ఆలయ నిర్మాణం అదే కాలంలో జరిగినట్లు తోస్తుంది. ఆలయనిర్మాణాన్నీ, అందలి శిల్పకళారీతుల్నీ, వాటి లక్షణాలనూ విశదంగా అధ్యయనం చేసిన మీదట ఈ ఆలయాన్ని క్రీ.శ.పదహారవ శతాబ్దం తొలినాళ్ళలో (దాదాపుగా 1501-1525 మధ్యకాలంలో) నిర్మించినట్లు చెప్పవచ్చు.

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. బాలబడి, ప్రాథమికోన్నత పాఠశాల, మాధ్యమిక పాఠశాలలు గూడెంచెరువులో ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, పాలీటెక్నిక్‌, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం జమ్మలమడుగు లోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, సమీప వైద్య కళాశాల, కడప లోనూ ఉన్నాయి. మేనేజిమెంటు కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల ప్రొద్దుటూరు లోనూ ఉన్నాయి.

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది.

 జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది.

గండికోటలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

గండికోటలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

కంది, సీతాఫలం, పసుపు, ((నిమ్మ తోటలు))




#Article 175: రాయలసీమ (737 words)


రాయలసీమ అనునది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ముఖ్యప్రాంతాల్లో ఒకటి . ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ భాగంలో ఉండే నాలుగు జిల్లాలు ( కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు) రాయలసీమ ప్రాంతంలోకి వస్తాయి.

రాయలసీమ విజయనగర సామ్రాజ్యంలో భాగాంగా శ్రీ కృష్ణదేవ రాయలచే పరిపాలించబడింది. అదేవిదంగా కాకతీయ, ముసునూరి వారసులైన పెమ్మసాని, రావెళ్ళ, మిక్కిలినేని, సాయపనేని కమ్మనాయక రాజులు రాయలసీమ ప్రాంతని పరిపాలించారు. అది వరకూ తూర్పు చాళుక్యుల పరిపాలనా కేంద్రంగా హిరణ్యక రాష్ట్రంగా ఈ ప్రాంతం విలసిల్లినది. తర్వాత రాయలసీమ పై చోళుల ప్రభావం పెరిగింది. బ్రిటీషు వారి సహకారాన్ని పలు యుద్ధాలలో పొందిన హైదరాబాదుకి చెందిన నిజాం సుల్తానులు 1802 లో ఈ ప్రాంతాన్ని వారికి ధారాదత్తం చేయటంతో దీనికి దత్త మండలం అని పేరు వచ్చింది. 1808 లో దత్త మండలం ను విభజించి బళ్ళారి, కడప జిల్లాలని ఏర్పరచారు. 1882 లో అనంతపురంను బళ్ళారి నుండి వేరు చేశారు. ఈ ప్రాంతానికి 1928లో చిలుకూరి నారాయణరావు రాయలసీమ అని పేరుపెట్టాడు. అప్పటినుండి ఆ పేరే స్థిరపడినది.
వేమన తిరుగాడిన నేల కావున రాయలసీమ అనడం కన్నా వేమనసీమ అని పిలువడం సబబుగా ఉంటుంది.

ప్రాథమికంగా తెలుగు మాట్లాడే ఈ జిల్లాలు 1953 వరకూ మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నాయి. బళ్ళారి కూడా రాయలసీమలో ప్రాంతంగానే ఉండేది. కోస్తా, రాయలసీమ నాయకులు జరిపిన అనేక సంవత్సరాల ఉద్యమం ఫలితంగా 1953లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అప్పుడు ఈ నాలుగు జిల్లాలను ఆంధ్ర రాష్ట్రం లో, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు దృష్ట్యా బళ్ళారిని కర్ణాటకలో కలిపి వేశారు. కన్నడ, తెలుగు మాట్లాడేవారు సమానంగా ఉన్న బళ్ళారి నగరాన్ని పలు చర్చలు, వివాదాల తర్వాత మైసూరులో చేర్చారు. 1956 లో ఆంధ్రరాష్ట్రంలో తెలంగాణలో కలపటంతో అప్పటి నుండి ఇవి ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఉంటున్నవి.

తెలుగు మాట్లాడు ఇతర ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమ వైశాల్యంలో చిన్నదైననూ తెలుగు,తమిళం, కన్నడ, ఉర్దూ కళల్లో, సంస్కృతుల్లో, సాహిత్యంలో ఈ ప్రాంతం యొక్క ప్రభావం బహు అధికం.

కోస్తా ప్రాంతంతో పోలిస్తే రాయలసీమ అభివృద్ధి పరంగా వెనుకబడి ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినపుడు రాయలసీమ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలోని కర్నూలును కొత్త రాష్ట్ర రాజధానిగా నిర్ణయించారు. అయితే మరో మూడేళ్ళలోనే విశాల ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడడంతో రాజధాని హైదరాబాదుకు మారింది.

పలు యుద్ధాలలో బ్రిటీషు వారు నిజాం పాలకులకి సహకరించినందుకు కృతజ్ఞతగా ఈ ప్రాంతాన్ని వారికి ధారాదత్తం చేయటంతో దత్త మండలాలు లేదా దత్త సీమ పదాలు వ్యావహారికంలోకి వచ్చాయి. 20వ శతాబ్దపు ప్రారంభం నాటికి ఇక్కడి మేధావులు ఈ పేర్లు అవమాన కారకాలుగా అనుభూతి చెందారు. 1928 నవంబరు 17-18 తారీఖులలో నంద్యాల పట్టణంలో జరిగిన ఆంధ్ర మహాసభలో పాల్గొన్న నాయకుల మధ్య జరిగిన తీవ్రమైన చర్చలలో చిలుకూరి నారాయణ రావు విజయనగర సామ్రాజ్యమునకు చెందిన రాయల వంశము ఈ ప్రాంతాన్ని పరిపాలించారు కావున, వారి సుపరిపాలనలోనే ఇక్కడి సంస్కృతి, వారసత్వ సంపదలు ఒక వెలుగు వెలిగాయి కావున, దీనికి రాయలసీమ అని పేరు పెట్టాలని ప్రతిపాదించారు. (ఇది వరకు ఈ పేరు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు ప్రతిపాదించారు అనే ఆలోచన వ్యాప్తిలో ఉండేది. కానీ పరిశోధనల్లో ఈ ఘనత చిలుకూరి వారిదే అని తేలినది.) రాయలసీమ అన్న పేరు అన్ని వర్గాల మేధావులని/సామాన్య ప్రజానీకాన్ని ఆకర్షించటంతో ఆ పేరే ఈ ప్రాంతానికి స్థిరపడిపోయింది. కోస్తా ఆంధ్ర నాయకులు మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని వేర్పరచాలని ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం జరుపుతున్న సమయంలో ఈ ప్రాంతం నాయకులు ఆంధ్ర ప్రాంతంతో కలిస్తే రాయలసీమ అభివృద్ధి చెందదేమో అని సంశయించి, మొదట వారికి సహకరించలేదు. రాయలసీమ ప్రజల అనుమానాలు తీర్చటానికే 1937 నవంబరు 16 లో శ్రీబాగ్ ఒడంబడిక రూపొందించబడింది.

తత్వము సంస్కృతిలో ఒక భాగం. రాయలసీమలో ఎందరో తత్వవేత్తలు జన్మించారు. 

విజయనగర సామ్రాజ్యపు చక్రవర్తి అయిన శ్రీ కృష్ణదేవ రాయలు హయాంలో ఈ ప్రాంతపు సంస్కృతి చాలా ఉన్నతి చెందినది. అష్టదిగ్గజాలలో ఐదు మంది (అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, కందుకూరి రుద్రకవి (మాదయ్యగారి మల్లన), అయ్యలరాజు రామభధ్రుడు) ఈ ప్రాంతం వారే.

కడప జిల్లాకి చెందిన యోగి వేమన, బ్రహ్మం గారు తమ రచనల ద్వారా సామాన్య ప్రజానీకాన్ని విద్యావంతులని చేయటానికి ఎంతో కృషి చేశారు. శ్రీమద్భాగవతముని రచించిన పోతనామాత్యుడు కూడా ఒంటిమిట్ట లోనే జన్మించాడన్న అభిప్రాయం ఉంది.

బళ్ళారి రాఘవ, ధర్మవరం రామకృష్ణమాచార్యులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి రంగస్థల ప్రముఖులను అందించిన బళ్ళారి ప్రదేశానికి గొప్ప చరిత్ర గలదు. బళ్ళారి లోని రాఘవ కళా మందిర్ బళ్ళారి రాఘవ పేరు పై స్థాపించినదే.

తత్త్వవేత్త, ఆధ్యాత్మిక గురువు అయిన జిడ్డు కృష్ణమూర్తి, కట్టమంచి రామలింగారెడ్డి చిత్తూరుకి చెందినవారు.

చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన పలు ఉర్దూ రచయితలు ఉర్దూ సాహ్యిత్యానికి సేవ చేశారు.

రాయలసీమలో శుద్ధమైన తెలుగు భాష మాట్లాడే సంస్క్రతి ఉంది. రాజభాష తెలుగైనా రెండవ అధికార భాషగా ఉర్దూ భాష ఉంది. చిత్తూరు జిల్లాలోని పడమట, దక్షిణ ప్రాంతాలలో తమిళ భాష మాట్లాడేవారు ఎక్కువ. తిరుపతి, చిత్తూరు, పుత్తూరు ప్రాంతాలలో తమిళ ప్రభావం ఎక్కువ. కుప్పంలో ద్రావిడ విశ్వవిద్యాలయం ఉంది. మూడు రాష్ట్రాలు, ఆంధ్ర, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు కలిసే చోట ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడింది.

బ్రాహ్మణ కులంలో కేవలం రాయలసీమ ప్రాంతానికి మాత్రం పరిమితమైన ఉపకులం ములకనాడు బ్రాహ్మణం. ఈ కులానికి చెందిన త్యాగరాజు కాకర్ల (అర్ధవీడు)కి చెందినవాడు. ప్రస్తుతం ఇది ప్రకాశం జిల్లా ఉన్ననూ ఒకానొక గానంలో ఈయన పూర్వీకులు రాయలసీమకి చెందినవారని తానే స్వయంగా చెప్పుకొన్నారు.

వాగ్గేయకారుడైన అన్నమయ్య కడప జిల్లాకి చెందిన తాళ్ళపాకకి చెందినవాడు.

తరిగొండ నరసింహ స్వామి పై, వెంకటేశ్వర స్వామి పై అనేక గీతాలని రచించిన వెంగమాంబ తిరుపతి వద్దనున్న తరిగొండకి చెందినది.

సంగీతకారుడు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ అనంతపురానికి చెందినవాడు.

సంగీతకారుడు (, వైద్యుడు) అయిన శ్రీపాద పినాకపాణి జన్మత: శ్రీకాకుళం జిల్లాకి చెందినవారైననూ, కర్నూలులో స్థిర పడ్డారు.

తక్కిన రాష్ట్రం వలెనే రాయలసీమ కూడా వ్యవసాయాధారితమైనది. రాయలసీమలో వర్షపాతం రాష్ట్ర సగటు వర్షపాతం కంటే తక్కువ. అనంతపురం జిల్లా దేశం మొత్తం మీద అతి తక్కువ వర్షపాతం గల జిల్లాల్లో రాజస్థాను లోని జైసల్మీరు తరువాత రెండో స్థానంలో ఉంది. వ్యవసాయాధార ఆర్థికపరిస్థితి గల ఈ ప్రాంత అభివృద్ధిలో ఇది అతిపెద్ద అవరోధం. రాయలసీమకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వాలు ఎన్నో పథకాలు రచించాయి. బ్రిటిషు వారు నిర్మించిన కర్నూలు కడప కాలువ తోపాటు, శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ, తెలుగుగంగ, హంద్రీ-నీవా సుజల స్రవంతి, గాలేరు-నగరి మొదలైన ప్రాజెక్టులు వీటిలో కొన్ని. అయితే పథకాలు ఎన్నున్నా వాటి అమలు విషయంలో జరుగుతున్న జాప్యం, వర్షాభావ పరిస్థితుల కారణంగా పథకాల అంచనాల మేరకు సాగునీరందని పరిస్థితి నెలకొంది.

స్వతంత్రానంతరం గుంటూరు జిల్లానుండి కొంత భాగాన్ని, కర్నూలు జిల్లా నుండి కొంత భాగాన్ని వేరు చేసి ప్రకాశం జిల్లాను ఏర్పరచారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా మొత్తం కోస్తా ప్రాంతంలోనే చూపించబడుతున్నది.

ఎన్నో అరుదైన వృక్షాలు, పక్షులు, ఔషదులు, జంతువులు ఇక్కడి అడవుల్లో ఉన్నాయి.




#Article 176: కర్ణాటక (554 words)


కర్ణాటక ( కన్నడలో ) భారతదేశములోని ఐదు దక్షిణాది రాష్ట్రాలలో ఒకటి. 1950 లో పూర్వపు మైసూరు రాజ్యము నుండి యేర్పడటము వలన 1973 వరకు ఈ రాష్ట్రము మైసూరు రాష్ట్రముగా వ్యవహరించబడింది. 1956 లో చుట్టుపక్క రాష్ట్రాలలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలు కలుపుకొని విస్తరించబడింది. కర్ణాటక రాజధాని బెంగళూరు రాష్ట్రములో 10 లక్షలకు పైగా జనాభా ఉన్న ఏకైక నగరము. మైసూరు, మంగుళూరు, హుబ్లి-ధార్వాడ్, బళ్ళారి , బెళగావి రాష్ట్రములోని ఇతర ముఖ్య నగరాలు. కన్నడ, కర్ణాటక రాష్ట్ర అధికార భాష. 2001 జనాభా లెక్కల ప్రకారము దేశములో 5 కోట్లకు మించి జనాభా ఉన్న పది రాష్ట్రాలలో ఇది ఒకటి.

కర్ణాటకకు పశ్చిమాన అరేబియా సముద్రము, వాయువ్యమున గోవా రాష్ట్రము, ఉత్తరాన మహారాష్ట్ర, తూర్పున తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్, తూర్పున , ఆగ్నేయమున తమిళనాడు , నైౠతిన కేరళ రాష్ట్రములు సరిహద్దులుగా ఉన్నాయి.

భౌగోళికముగా రాష్ట్రము మూడు ప్రధాన ప్రాంతాలుగా విభజించబడింది. 

కర్ణాటక యొక్క పేరు ఎలా వచ్చినది అనేదానికి చాలా వాదనలున్నాయి. అయితే అన్నిటికంటే తర్కబద్ధమైన వాదన ఏమిటంటే కర్ణాటక పేరు కరు+నాడు = ఎత్తైన భూమి నుండి వచ్చినదని. గమనించవలసిన విషయమేమంటే కర్ణాటక రాష్ట్ర సగటు ఎత్తు 1500 అడుగులు మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే ఎక్కువే.

రాష్ట్రములో అత్యధిక ఉష్ణోగ్రత 45.6 సెంటీగ్రేడు రాయచూరు వద్ద 1928 మే 23న నమోదైనది. అత్యల్ప ఉష్ణోగ్రత 2.8 డిగ్రీల సెంటీగ్రేడు బీదర్లో 1918 డిసెంబరు 16 న నమోదైనది. 

కర్ణాటక, భాష ఆధారితముగా యేర్పడిన రాష్ట్రము. అందుకే రాష్ట్రము యొక్క ఉనికిలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. రాష్ట్రములో అత్యధిక సంఖ్యాకులు అధికార భాష అయిన కన్నడను మాట్లాడతారు. తెలుగు, తమిళము, కొడవ, తులు , ఇతర భాషలు.

కర్ణాటక భారతదేశములోని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో ఒకటి. దీని రాజధాని బెంగళూరు దేశములో సమాచార సాంకేతిక సేవలకు ప్రధాన కేంద్రము. భారతదేశములోని 90% బంగారము ఉత్పాదన కర్ణాటకలోనే జరుగుతుంది. ఇటీవల మాంగనీసు ముడిఖనిజము యొక్క వెలికితీత పనులు బళ్ళారి , హోస్పేట జిల్లాలలో ముమ్మరముగా సాగుతున్నాయి.

కర్ణాటక చరిత్ర పురాణ కాలమునాటిది. రామాయణములో వాలి, సుగ్రీవుడు , 'వానర సేన యొక్క రాజధాని ప్రస్తుత బళ్లారి జిల్లాలోని హంపి అని భావిస్తారు. మహాభారతములో పాండవులు తమ తల్లి కుంతితో వనవాసము చేయుచున్న కాలములో భీమునిచే చంపబడిన కౄర రాక్షసుడు అయిన హిడింబాసురుడు ప్రస్తుత చిత్రదుర్గ జిల్లా ప్రాంతములో నివసించుచుండేవాడు. అశోకుని కాలమునాటి శిలాశాసనములు ఇక్కడ లభించిన పురాతన పురావస్తు ఆధారాలు.

క్రీ.పూ. 4వ శతాబ్దములో శాతవాహనులు ఈ ప్రాంతమున అధికారమునకు వచ్చి దాదాపు 300 సంవత్సరాలు పరిపాలించారు. ఈ వంశము క్షీణించడముతో ఉత్తరమున కాదంబులు, దక్షిణమున గాంగులు అధికారమునకు వచ్చారు. అత్యంత ఎత్తైన గోమటేశ్వరుని ఏకశిలా విగ్రహము గాంగుల కాలమునాటి కట్టడమే. బాదామి చాళుక్యులు (500 - 735) వరకు నర్మదా నదీ తీరమునుండి కావేరీ నది వరకు గల విస్తృత ప్రాంతాన్ని రెండవ పులకేశి కాలము (609 - 642) నుండి పరిపాలించారు. రెండవ పులకేశి కనౌజ్ కు చెందిన హర్షవర్ధనున్ని కూడా ఓడించాడు. బాధామీ చాళుక్యులు బాదామి, ఐహోల్ , పట్టడకళ్లో అద్భుతమైన రాతి కట్టడాలను కట్టించారు. ఐహోల్ ను దేశములో ఆలయ శిల్పకళకు మాతృభూములలో ఒకటిగా భావిస్తారు. వీరి తరువాత 753 నుండి 973 వరకు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన మల్ఖేడ్ కు చెందిన రాష్ట్రకూటులు కనౌజ్ పాలకులపై కప్పము విధించారు. ఈ కాలములో కన్నడ సాహిత్యము ఎంతగానో అభివృద్ధి చెందినది. జైన పండితులు ఎందరో వీరి ఆస్థానములో ఉండేవారు. 973 నుండి 1183 వరకు పరిపాలించిన కళ్యాణీ చాళుక్యులు , వీరి సామంతులైన హళేబీడు హొయసలులు అనేక అద్భుతమైన దేవాలయాలను కట్టించి సాహిత్యము మొదలైన కళలను ప్రోత్సహించారు. మితాక్షర గ్రంథమును రచించిన న్యాయవేత్త విజ్ఞేశ్వర కళ్యాణీలోనే నివసించాడు. వీరశైవ మతగురువైన బసవేశ్వర కళ్యాణీలోనే మంత్రిగా ఉండేవాడు. విజయనగర సామ్రాజ్యము దేశీయ సంప్రదాయాలకు పెద్దపీట వేసి కళలను, మతమును, సంస్కృత, కన్నడ, తెలుగు , తమిళ భాషలలో సాహిత్యమును ప్రోత్సహించారు. ఇతర దేశాలతో వాణిజ్యము అభివృద్ధి చెందినది. గుల్బర్గా బహుమనీ సుల్తానులు , బీజాపూరు ఆదిల్‌షాహీ సుల్తానులు ఇండో-సార్సెనిక్ శైలిలో అనేక కట్టడములు కట్టించారు , ఉర్దూ, పర్షియన్ సాహిత్యాలను ప్రోత్సహించారు. మరాఠాపీష్వా , టిప్పూ సుల్తాన్ల పతనముతో మైసూరు రాజ్యము (కర్ణాటక) బ్రిటీషు పాలనలోకి వచ్చింది. 

భారత స్వాతంత్ర్యానంతరము, మైసూరు ఒడియార్ మహారాజు తన రాజ్యాన్ని భారతదేశములో విలీనము చేశాడు. 1950 లో, మైసూరు రాష్ట్రముగా అవతరించడముతో, పూర్వపు మహారాజు కొత్తగా యేర్పడ్డ రాష్ట్రానికి రాజప్రముఖ్ లేదా గవర్నరుగా నియమితుడయ్యాడు. విలీనము తర్వాత ఒడియార్ కుటుంబానికి ప్రభుత్వము 1975 వరకు భత్యము ఇచ్చింది. ఈ కుటుంబ సభ్యులు ఇప్పటికీ మైసూరులోని తమ వంశపారంపర్యమైన ప్యలెస్ లోనే నివసిస్తున్నారు.

రాజ్యోత్సవ దినము (నవంబర్ 1, 1956) న కూర్గ్ రాజ్యాన్ని, చుట్టుపక్కల ఉన్న మద్రాసు, హైదరాబాదు , బొంబాయి లలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలను కలుపుకొని మైసూరు రాష్ట్రము విస్తరించి ప్రస్తుత రూపు సంతరించుకొన్నది. 1973 నవంబర్ 1 న రాష్ట్రము పేరు కర్ణాటక అని మార్చబడింది.

కర్ణాటక అనేక జాతీయ వనాలకు ఆలవాలము. అందులో ముఖ్యమైనవి 

ఇవే కాక అనేక వన్యప్రాణి సంరక్షణాలయాలు అభయారణ్యాలు ఉన్నాయి. 

కర్ణాటక జిల్లాలు చూడండి

బెంగళూరు, మంగుళూరు, మైసూరు, బెల్గాం, హుబ్బళ్లి




#Article 177: కంభం (522 words)


కంభం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలం కేంద్రము, చారిత్రక పట్టణం.

గుండికా వీరాంజనేయస్వామివారి ఆలయం గుండ్లకమ్మనది ఒడ్డున నాగంపల్లి పాత గ్రామం ఉంది. మొఘల్ సామ్రాజ్యం పరిపాలనా కాలములో నాయక్ వీదీ, పార్క్ వీదీ, కోనేటి వీదీ, మెయిన్ బజార్ కలుపుకొని గుల్షానాబాద్ పాత గ్రామం ఉంది. ప్రస్తుతం న్యూ ఢిల్లీ రికార్డ్స్ లో కూడా గుల్షానాబాద్ అని ఉంది. గుల్షానాబాద్(కంభం) 17 వ శతాబ్దంలో 6000 జనాభా ఉంది.అప్పట్లో గుల్షానాబాద్(కంభం) నగర పాలక సమస్త(మునిస్పాలిటి) ఉంది. శ్రీ కృష్ణదేవరాయల విజయనగర రాజవంశం రాణి వరదరాజమ్మ(జగన్మోహిని రాణి) పరిపాలనా కాలములో పెద్ద కంభం, చిన్నకంభం, పేరు గల వారిని చెరువు ఆనకట్టకు (తూములు) కట్టబడే గోడకు వారిని బలి దానం చేశారు. వారి చిహ్నముగా కంభం ప్రస్తుతం అని పిలువ బడుతుంది .

కంభంలో రెండు శాసనాలు లభ్యమైనవి. మొదటిది 1706లో ఔరంగజేబ్‌ పరిపాలనా కాలములో కంభం కోట ఖిలాదార్‌ అయిన ఖాజా మొహమ్మద్‌ షరీఫ్‌ యొక్క మరణము గురించి ప్రస్తావిస్తుంది. రెండవది 1729లో మొఘల్‌ చక్రవర్తి మొహమ్మద్‌ షా పరిపాలనా కాలములో కంభం గవర్నర్ అయిన మొహమ్మద్‌ ఖయ్యూం యొక్క కుమారుడు మొహమ్మద్‌ సాహీన్‌ గురించి ప్రస్తావిస్తుంది.

దక్షణాన బెస్తవారిపేట మండలం,తూర్పున తర్లుపాడు మండలం,పడమరన అర్ధవీడు మండలం,దక్షణాన రాచర్ల మండలం.

రాష్ట్రం రహదారి వినుకొండ-నంద్యాల-కడప విజయవాడ-గుంతకల్ పట్టణం మీదుగా ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజన్ గుంటూరు-గుంతకల్ రైల్వే లైను మార్గంలో ఉంది.

ప్రభుత్వం డిగ్రీ కళాశాలతో పాటు, పలు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు, డిఇడి కళాశాలలు, బీఇడి కళాశాలలు, పారామెడికల్ కళాశాలలున్నాయి.

స్థానిక వైద్యవిధాన పరిషత్తు వైద్యశాలతో పాటు పలు ప్రైవేట్ వైద్యశాలలున్నాయి.

ది కంభం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ తో పాటు పలు ప్రభుత్వరంగ బ్యాంకులు సేవలందిస్తున్నాయి.

చారిత్రక కంభం చెరువు 15 వ శతాబ్దంలో ఒరిస్సా గజపతి రాజులు నిర్మించారు, తరువాత విస్తృతంగా విజయనగర రాజవంశం 16వ శతాబ్దము తొలి రోజులలో విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయల విజయనగర రాజవంశం యొక్క రాణి వరదరాజ(జగన్మోహిని రాణి) పరిపాలనా కాలములో కట్టించినారని భావిస్తారు. గుండ్లకమ్మ, జంపాలేరు నుండి పారే ఒక యేరు ఈ చెరువుకు నీటిని సమృద్ధిగా తెచ్చి రైతులు వరి, పసుపు, చెరుకు, అరటికాయలు మొదలైన వాణిజ్య పంటలు పండించుటకు వీలు కల్పిస్తున్నది. వర్షపు నీరే ఈ చెరువు యొక్క ఏకైక ఆధారము.20 వ శతాబ్దం మొదట్లో ఆనకట్ట ఎత్తు 57 అడుగుల (17 మీటర్లు), డ్రైనేజీ ప్రాంతం 430 చదరపు మైళ్ల (1,100 కిమీ 2) ఉండేది. ప్రత్యక్ష నీటి పారుదల భూమి 10,300 ఎకరాలు (42 km 2) ఉండేది. ఈ చెరువు యొక్క ఆయకట్టు కంభం, బెస్తవారిపేట మండలములలో విస్తరించి ఉంది. ఈ చెరువు 23.95 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి, 3 TMC ల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. చెరువులో ఏడు కొండలున్నాయి. ఈ చెరువు పరిసరాల్లోని వంద గ్రామాల రైతులకు నీరందిస్తుంది. పరీవాహక ప్రాంతము యొక్క విస్తీర్ణము 6,944 హెక్టారులు. ఈ చెరువు 1917, 1949, 1950, 1953, 1956, 1966, 1975, 1983, 1996, 2005 సంవత్సరాలలో పూర్తిగా నిండినట్లు చెబుతారు.

చెరువు 1,113 కిలోమీటర్ల పరీవాహక ప్రాంతాన్ని,23.95 చదరపు కిలోమీటర్ల నీటి నిల్వ ప్రాంతాన్ని కలిగి ఉంది. జలాశయ పూర్తి నీటి మట్టం 203.20 మీటర్లు కాగా, గరిష్ఠ నీటి మట్టం 204.10 మీటర్లు. చెరువు ఆనకట్ట పొడవు 295.65 మీటర్లు కాగా, ఎత్తు 18.29 మీటర్లు, అలుగు పొడుగు 89.40 మీటర్లు. చెరువు నీరు పెద్ద కంభం కాలువ, చిన్న కంభం కాలువ, చితిరలకట్ట, నక్కల గండి కాలువ, పాపాయిపల్లి కాలువ ద్వారా దాదాపు 25 గ్రామాలకు చెందిన పొలాలకు చేరుతుంది. పెద్ద కంభం కాలువ 32 తుములతో 7.2 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది. దీని కింద మూడు వేల ఎకరాల ఆయకట్టు ఉంది.

రాయల కాలం నాడు నిర్మించిన ఈ పురాతన చెరువుకు, ప్రపంచ చారిత్రిక నీటిపారుదల కట్టడాల (వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్) గుర్తింపు లభించింది. 2020వ సంవత్సరానికి గాను, ప్రపంచంలోని 14 సాగునీటి ప్రాజెక్టులకు స్థానం లభించగా, అందులో మన దేశంలోని నాల్గింటికి ఈ గుర్తింపు వచ్చింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ చెందినవి మూడు ఉండగా, అందులో కంభం చెరువు ఒకటి. ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ అను సంస్థకు చెందిన న్యాయనిర్ణేతల బృందం, అంతర్జాతీయంగా వచ్చిన ఎంట్రీలను పరిశీలించి, ఈ ఎంపిక చేసింది. గుండ్లకమ్మ నదిపై నిర్మించిన ఈ చెరువు, ఆసియా ఖండంలోనే రెండవ అతి పెద్ద సాగునీటి చెరువు. 500 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ చెరువు క్రింద 10,300 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువు 7 కి.మీ. పొడవు, 3.5 కి.మీ. వెడల్పు ఉంది.

పట్టణం ఆంధ్ర ప్రదేశ్. 2009 వరకు ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉంది . కంబం నియోజకవర్గం పునర్వ్యవస్థీకరించారు, గిద్దలూరు నియోజకవర్గంలో విలీనం చేశారు.

చెరకు, వరి,టమోటా, అరటి,పసుపు

వ్యవసాయం




#Article 178: ప్రొద్దుటూరు (1031 words)


ప్రొద్దుటూరు  పట్టణం, భారత దేశం లోని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో, వైఎస్ఆర్ జిల్లాలో కడప పట్టణానికి 55 కి మీ ల దూరంలో ఉన్న ముఖ్య వ్యాపార కేంద్రం. ప్రొద్దుటూరు యాత్రాస్థలం కూడా. పిన్ కోడ్ నం. 516 360., యస్.టీ.డీ.కోడ్= 08564.

ఇక్కడి రామేశ్వరాలయములో శ్రీరాముడు, అగస్తీశ్వరాలయములో అగస్త్య మహర్షి సంప్రోక్షణ జరిపారని ఒక కథనం.  

పెన్నా నది ఒడ్డున శ్రీ కృష్ణదేవ రాయలు నిర్మించిన ముక్తి రామలింగేశ్వర స్వామి ఉంది. 

అద్భుత కళారీతులతో పేరొందిన కన్యకా పరమేశ్వరి దేవాలయం . ప్రొద్దుటూరులో దసరా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. అందుకే ప్రొద్దుటూరును రెండవ మైసూరు అంటారు.

ప్రొద్దుటూరు లోని మరొక విశిష్టత ఇక్కడ భారీ ఎత్తున సాగే బంగారు, వెండి నగల వ్యాపారం. ఈ నగల వ్యాపారంలో ప్రొద్దుటూరు బాగా ప్రసిద్ధి చెందింది. అందుకే ప్రొద్దుటూరును రెండవ బొంబాయి అంటారు.

ముక్తి రామేశ్వరం వైఎస్ఆర్ జిల్లా లోని ప్రొద్దుటూరు పట్టణంలో ఉంది. ముక్తి రామేశ్వరాలయం పెన్నా నదిగా పిలువబడే పినాకినీ నది ఒడ్డున ఉంది. ఇక్కడికి సమీపంలో, ఆలయం నుంచి 14 కి.మీ. దూరంలో గల ఎర్రగుంట్లలో రైల్వే స్టేషను ఉంది. ప్రొద్దుటూరు నుంచి, ఎర్రగుంట్ల నుంచి యాత్రీకులను ఆలయం దగ్గరకు తీసుకు వెళ్ళడానికి చాలా బస్సులు తిరుగుతున్నాయి.

పురాణ కథల ప్రకారం లంకాధిపతియైన రావణుడు సాక్షాత్తూ బ్రహ్మ మనుమడు. అందు చేత బ్రాహ్మణుడు. శ్రీరాముడు రావణుడిని సంహరించిన తర్వాత ఒక బ్రాహ్మణుడిని చంపినందుకు బ్రహ్మ హత్యా పాతకం రాముడిని ఒక పిల్లి రూపంలో వెంటబడింది. దానినుంచి విముక్తుడు కావడానికి శ్రీ రాముడు దండకారణ్యంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాలనుకొన్నాడు. పినాకినీ నదీ తీరాన గల ఈ ప్రాంతాన్ని పవిత్రమైనదిగా భావించి ఇక్కడే శివలింగ ప్రతిష్ఠ చేయడానికి నిశ్చయించుకొన్నాడు. ముహూర్తం నిర్ణయించి, కాశీ నుంచి శివలింగాన్ని తెమ్మని హనుమంతుడిని పంపగా, హనుమంతుడు సకాలంలో తిరిగి రాలేక పోయాడు. దాంతో రాముడే పెన్నా నది లోని ఇసుకతో ఒక లింగాన్ని తయరు చేసి ప్రతిష్ఠించాడు. అది సైకత లింగం (ఇసుక లింగం)గా పేరుగాంచింది.
కాశీ నుంచి ఆలస్యంగా తిరిగి వచ్చిన హనుమంతుడు అది చూసి నొచ్చుకున్నాడు. దాంతో శ్రీ రాముడు అతడికి సంతోషం కలిగేటట్లు సైకత లింగానికి ఎదురుగా కొంత దూరంలో హనుమంతుడు కాశీ నుంచి తెచ్చిన లింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు. అందుకే ఆక్షేత్రాల్ని రామలింగేశ్వర క్షేత్రమ్, హనుమ క్షేత్రం అని పిలుస్తారు. రాముడు మొదటి పూజ కాశీ లింగానికీ, తరువాతి పూజ సైకత లింగానికీ జరిగేటట్లు అనుగ్రహించాడు. ఈ ప్రతిష్ఠలు అయిన తర్వాత పిల్లి పెన్నా నది ఒడ్డు దాకా నడచి అదృశ్యమైందట. పిల్లి పాదాల గుర్తులు అక్కడ ఉన్నాయంటారు. పిల్లి నదిలో దిగిన చోటును పిల్లి గుండం అంటారు. రామలింగేశ్వర స్వామికి ప్రక్కన రాజరాజేశ్వరి, శ్రీ చక్రం ప్రతిష్ఠించారు. ఆలయ ప్రాంగణంలో విఘ్నేశ్వరుడు, వీరభద్రుడు, సుబ్రహ్మణ్యస్వామి ఉన్నారు.
చైత్ర మాసంలో పౌర్ణమి నుండి పది రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కార్తీక సోమవారాల్లో భక్తులు విశేషంగా వస్తారు. ఈ ఆలయానికి, ప్రక్కన, వెనుక ఇద్దరు మునుల ఆలయాలున్నాయి.
స్థలపురాణం ప్రకారం శ్రీ రాముడు శివ లింగాన్ని ప్రొద్దు పొడవక ముందే తయారు చేసి ప్రతిష్ఠించాడు. అందుకే ఈ ఊరిని ప్రొద్దుటూరు అంటారు. 

ఈ క్షేత్ర ప్రతిష్ఠతో రాముడు బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తిని పొందాడు. అందుకే ఈ క్షేత్రాన్ని ముక్తి రామేశ్వరం అంటారు.

శాసనాల ప్రకారం శ్రీ కృష్ణదేవరాయలు ఈ దేవాలయం మీద ఐదు అంతస్తుల గోపురం నిర్మించాడు. గోపురం చుట్టూరా చెక్కిన అనేక మంది దేవతల అందమైన విగ్రహాలు ఆ నాటి శిల్పుల పనితనాన్నీ, సామర్థ్యాన్నీ చెప్పకనే చెబుతాయి. స్థలపురాణం ప్రకారం శ్రీ రాముడు శివ లింగాన్ని ప్రొద్దు పొడవక ముందే తయారు చేసి ప్రతిష్ఠించాడు. అందుకే ఈ ఊరిని ప్రొద్దుటూరు అంటారు.

ఈ క్షేత్ర దైవం లింగరూపంలో ఉండే శ్రీ రామలింగేశ్వరుడు. ఈ శివ లింగాన్ని ప్రతిష్ఠించింది శ్రీ రాముడు. అందుకే దీనికి రామేశ్వరమని పేరు. 56 అంగుళాల ఎత్తుండే ఈ లింగం మీద శ్రీ రాముడి వేలి ముద్రలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడికి కొన్ని అడుగుల దూరంలోనే శ్రీ హనుమత్ లింగేశ్వర క్షేత్రముంది. హన్మంతుడు కాశీ నుంచి తీసుకు వచ్చిన శివ లింగాన్ని శ్రీ రాముడు ప్రతిష్ఠించింది ఇక్కడే. శ్రీ రామలింగేశ్వర ఆలయం ప్రక్కనే శ్రీ రాజరాజేశ్వరీ ఆలయం కూడా ఉంది. ఇక్కడ శ్రీ ఆది శంకరాచార్యులు పూజించిన శ్రీ చక్ర యంత్రం ఉంది. ఈ చక్ర ప్రభావం వల్లే ఈ పట్టణం బాగా అభివృద్ధి చెందిందని ప్రొద్దుటూరు వాసులు బలంగా విశ్వసిస్తారు. ఈ శ్రీ చక్ర యంత్రాన్ని పూజించిన వారికి కోరికలన్నీ తీరి జీవితంలో సుఖశాంతులు కలుగుతాయని ఒక నమ్మకముంది.

ముక్తి రామలింగేశ్వరాలయం సువిశాలమైన స్థలంలో నిర్మించిన పెద్ద ఆలయం. అందమైన శిల్పాలతో అలరారే ఐదంతస్థుల రాజగోపురం చూపరులకు కనువిందు చేస్తుంది. ఈ ఆలయం చుట్టూ రక్షణ కోసం నిర్మించిన తలుపులతో బలమైన గోడలున్నాయి. ఈ ఆలయ గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించాడని ప్రతీతి. కుమారస్వామి, దుర్గా దేవి, నాట్య గణపతి, శివపార్వతులు, గరుడ వాహనం మీదుండే విష్ణువు, కాళీయ మర్ధనం చేసే కృష్ణుడు మొదలైన విగ్రహాలు పూర్వ కాలపు శిల్పుల కళా నైపుణ్యానికి నిదర్శనాలుగా ఉన్నాయి.

ఈ ఆలయాన్ని నందిచోళుడు నిర్మించాడు. సాళువ నరస నాయకుడు అభివృద్ధి చేశాడు. ఈ ఆలయం సాహిత్య సాంస్కృతిక కార్యక్రమ్మలకు కాణాచిగా ఉండేది. మహా కవి పుట్టపర్తి నారాయణాచార్యులు ఈ ఆలయంలోనే 'శివతాండవం' కావ్యాన్ని వ్రాశాడు.
ఈ ఆలయానికి ఎత్తైన ప్రాకారాలున్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో అగస్త్యేశ్వరుడు, రాజరాజేశ్వరి, భీమలింగేశ్వరుడు, సుందరేశ్వరుడు, కోదండరామస్వామి ఆలయాలున్నాయి. అగస్త్యేశ్వరుడు మూడడుగుల లింగాకారంలో ఉన్నాడు. అంతరాలయంలో వీరభద్రుడు, కార్తికేయుడు, గణపతి ఉన్నారు. అలయానికి ముందు పుష్కరిణి ఉండేది. దానిని పూడ్చి మార్కెట్ కాంప్లెక్సు నిర్మించారు. ప్రతి సంవత్సరం అగస్త్యేశ్వర స్వామికి వైశాఖ శుద్ధ సప్తమి నుంచి పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. రాజరాజేశ్వరీ దేవికి ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకూ దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

]
ప్రొద్దుటూరు నగర కీర్తికి తలమానికం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం. వాసవి వైశ్య కుల దేవత అయినా అందరూ ఈమెను దర్శిస్తూ ఉంటారు. క్రీ.శ. 1890 లో ఈ దేవాలయాన్ని స్థాపించారు.కామిశెట్టి కొండయ్య అనే వైశ్యునికి వాసవి కలలో కనిపించి తన కోసం దేవాలయం నిర్మించవలసిందిగా ఆదేశించింది. ఆయన, మరికొందరు వైశ్య ప్రముఖులు కలిసి ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. చివరి రోజు అమ్మ వారి ఊరేగింపుకు సుమారుగా 2 లక్షల జనము వస్తారు. దసరా ఉత్సవాలలో మైసూరు తర్వాత ప్రొద్దుటూరునే చెప్పుకోవాలి. ఆలయానికి ఎత్తైన గాలిగోపురం ఉంది. ముఖ ద్వారాలు శిల్పకళతో విరాజిల్లుతున్నాయి. పురాణగాథలు తెలిపే శిల్పాలు మనోహరంగా ఉన్నాయి. వాసవి జన్మ వృత్తాంతం తెలిపే ఛాయాచిత్రాలున్నాయి. మహాత్మా గాంధీ (1929 లో), శృంగేరీ పీఠాధిపతులు, కంచి కామకోటి పీఠాధిపతులు మొదలగు ప్రముఖులు ఈ ఆలయాన్ని దర్శించారు.

ప్రొద్డుటూరుకు కొత్త శోభ పెన్నా నదీ తీరంలో నిర్మించబడిన అయ్యప్ప స్వామి దేవాలయం. ఇక్కడి ప్రకృతి అందాలు ఒళ్ళు పులకరింప జేస్తాయి. 1991 లో విగ్రహాన్ని పంచలోహాలతో నిర్మించారు. ఈ విగ్రహం 21 అంగుళాల ఎత్తు, 110 కిలోగ్రాముల బరువు ఉంది.తిరుపతి సమీపంలోని తిరుచానూరు వాస్తవ్యులైన తిరుమలాచార్యులనే శిల్పి ఈ విగ్రహన్ని తయారు చేశాడు.
శిల్ప కళా నైపుణ్యంతోనూ, గాలిగోపురాలతోనూ దేవాలయాన్ని చూడముచ్చటగా నిర్మించారు.మన రాష్ట్రంలో భారీ వ్యయంతో నిర్మించిన అయ్యప్ప దేవాలయాల్లో ఇదొకటి. (నిర్మాణ వ్యయం 60 లక్షలు.) ఆలయ ప్రాంగణంలో 22 అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పుతో శివుని శిరస్సు నిర్మించారు.రాష్ట్రంలోని యాత్రికులు ఈ అయ్యప్ప స్వామిని దర్శించుకుని శబరిమల యాత్ర చేస్తారు.

ఈ అలయం ప్రొద్దుటూరు పట్టణంలోని వై.ఎం.ఆర్. కాలనీలో ఉన్నది.

ప్రొద్దుటూరు శివాలయం కూడలిలోని ఈ ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ నామా ఎరుకలయ్య. 2020,నవంబరు-15న, ఈ ఆశ్రమంలో, శ్రీ నామా ఎరుకలయ్య మరియు శ్రీమతి కమలాక్షమ్మల ఆరాధనోత్సవాలు ప్రారంభమైనవి. ఈ సందర్భంగా, గ్రామస్థులు, భక్తులు, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు. ఈ ఉత్సవాలు 23-11-2020 వరకు నిర్వహించెదరు. [1]

ప్రొద్దుటూరు నుంచి జమ్మలమడుగు వెళ్ళే దారిలో ప్రొద్దుటూరు నానుకుని ఉన్న బొల్లవరం గ్రామంలో విజయనగర రాజులు నిర్మించిన వెంకటేశ్వర, చెన్న కేశవ, వేణుగోపాల, ఆంజనేయ స్వామి ఆలయములు, రామాలయము ఉన్నాయి. ఇటివలె ఈ ఆలయలను పునరుద్దరించారు. అదే విధముగా

ప్రొద్దుటూరులో చాలా వరకు శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవాలయాలు ఊన్నాయి.

ప్రొద్దుటూరు (రామేశ్వరం) - ఆర్.టి.పి.పి. రహదారిలోని అష్టభుజి శ్రీ చౌడేశ్వరి ఆలయంలో, శ్రీ చౌడేశ్వరి విగ్రహ మూర్తి 50 అడుగుల ఎత్తయినది.

నరసింహాపురం గ్రామం ప్రొద్దుటూరు పట్టణానికి పడమర దిశలో, ప్రొద్దుటూరు - జమ్మలమడుగు రహదారి లో, ప్రొద్దుటూరు నుండి 6 కిమీ ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో పురాతన లక్ష్మీ నరసింహస్వామి ఆలయము ఒకటి ఉంది. గుడియందలి శిల్ప కళని గమనించినట్లయితే విజయనగర రాజుల చివరి కాలంలో అనగా 17వ శతాబ్దం చివరలో నిర్మించినట్లుగా అనుకోవచ్చు. నరసింహాపురంకి పడమటి దిశలో పొలాలలో ఒక పురాతన శివాలయము ఉంది. ఇందులోని శివలింగము ని ఆంజనేయుడు ప్రతిష్ఠించాడు అని చెప్పుకుంటారు

ప్రొద్దుటూరులో జరిగే దసరా ఉత్సవాలు ప్రసిద్ధి గాంచాయి. మైసూరు తరువాత ఆ స్థాయిలో దసరా ఉత్సవాలు జరుగుతాయి. 

ఈ పట్టణము, చుట్టుపక్కల పల్లెలందు వరి, జొన్న, ప్రత్తి, ప్రొద్దు తిరుగుడు, శనగ, కుసుమ, పసుపు, వేరు శనక్కాయలు, కంది, అలసంద ఎక్కువగా పండిస్తారు. ఎండా కాలములో కర్బూజ, కలింగర, దోసకాయలు పండిస్తారు. పాల కోసము బర్రెలు ఎక్కువగా పెంచుతారు.

వేరు శనక్కాయల నుంచి నూనె తీయు గానుగలు చాలా ఉన్నాయి. 

ప్రొద్దుటూరు పట్టణము ముఖ్యముగా బంగారు, వెండి నగలు, బట్టల వ్యాపారములకు ప్రసిద్ధి. చాలా రాతి గనులు కూడా ఉన్నాయి. ఇక్కడి నుంచి సానబెట్టిన నల్ల రాయి ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంది. 

వై. ఎస్. ఆర్. ఇంజనీరింగ్ కళాశాల.

[1] ఈనాడు కడప జిల్లా;2020,నవంబరు-16,4వపేజీ .   

అయోమయ నివృత్తి కొరకు చూడండి ప్రొద్దుటూరు (అయోమయ నివృత్తి)




#Article 179: పెన్నా నది (170 words)


పెన్నానది లేదా పెన్నార్ అనేది దక్షిణ భారతదేశపు ఒక నది. పెన్నా నది  (ఉత్తర పినాకిని)  కర్ణాటక రాష్ట్రంలో కోలారు సమీపానగల నందిదుర్గ కొండలలోని చెన్నకేశవ కొండల్లో పుట్టి నంది పర్వత శ్రేణుల గుండా 40 కి.మీ. ప్రవహించి అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి 597 కి.మీ. (మొత్తం పొడవు 560 కి.మీ. లేదా 350 మైళ్ళు) ప్రవహిచి నెల్లూరుకు ఈశాన్యంగా 20 కి.మీ. దూరంలో ఊటుకూరు దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది.

పెన్నా నదికి గల ముఖ్యమైన ఉపనదులు: కుముదావతి, జయమంగళ, చిత్రావతి, కుందేరు, పాపాఘ్ని, సగిలేరు, చెయ్యేరు, బొగ్గేరు, బిరపేరు. పెన్నా నది పరీవాహక ప్రాంతం 55,213 చ.కి.మీ. వ్యాపించి ఉంది. ఇది భారత దేశపు మొత్తం విస్తీర్ణంలో 1.7%. ఇది ఆంధ్ర ప్రదేశ్ (48,276 చ.కి.మీ.),, కర్ణాటక (6,937 చ.కి.మీ.) రాష్ట్రాలలో విస్తరించి ఉంది.

పెన్నానది పాలకొండల వద్ద ప్రవాహం సన్నగా ఉంటుంది. తదుపరి కుందేరు, చెయ్యేరు వంటి చిన్న్ అప్రవాహాల ద్వారా తిరిగి జమ్మలమడుగు వద్ద నుండి పెద్ద నదిగా మారుతున్నది.

గండికోట ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నా నది ఒడ్డున గల ఒక దుర్గం. ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నదికి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చింది. ఈ ఇరుకు లోయల్లో నది వెడల్పు 300 అడుగులకు మించదు. 300 అడుగుల దిగువన పడమటి, ఉత్తర దిశలలో ప్రవహించే పెన్నా నదితో, కోట లోపలి వారికి బలమైన, సహజసిద్ధమైన రక్షణ కవచములాంటిది.

సోమశిల ప్రాజెక్టు




#Article 180: నేపాల్ (3780 words)


హిమాలయాలలో ఉన్న నేపాలు రాజ్యము, 2006 నేపాలు ప్రజస్వామ్య ఉద్యమము|2006 నేపాలు ప్రజాస్వామ్య ఉద్యమానికి పూర్వం ప్రపంచంలోని ఏకైక హిందూ రాజ్యము. ఇది దక్షిణ ఆసియాలో చైనా, టిబెట్, భారతదేశాల సరిహద్దులతో ఉంది. ఇది ఒక భూపరివేష్టిత దేశం (లాండ్‌లాక్)

నేపాల్ కు వెయ్యి సంవత్సరాల పెద్ద చరిత్ర ఉంది. కిరాంత్ లేదా కిరాతి అనేది 7వ లేక 8వ శతాబ్దములలో తూర్పు నుండి వలస వచ్చిన, చరిత్రకారులకు తెలిసిన మొదటి తెగ. గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వము 563లో నేపాల్‌లోనే జన్మించాడు. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో అశోకుడు కూడా ఉత్తర భారతదేశంతో బాటు ఇప్పటి నేపాల్ లోని దక్షిణ ప్రాంతాలను (హిమాలయ పర్వత ప్రాంతాలు అశోకుని సామ్రాజ్యంలో లేవు) పరిపాలించాడు. అశోకుడు రుమ్మినిదేవి అను ప్రాంతమున ఒక స్తంభమును నెలకొల్పినాడు, స్యయంభూనాధ్ అనుచోట కొండకు పడమటి భాగమున కొన్ని బౌద్ధ కట్టడములను కట్టించినట్లు చెప్పబడుచుండెను. అంతేకాక అశోకుడు తన కుమార్తె అయిన చారుమతిని దేవపటాణ్ అను ప్రాంతమున నివసించు సుక్ష్యత్రియుడు అగు ఒక బౌద్ధ ధర్మదీక్షాపరాయణుడికిచ్చి వివాహము చేసినట్లు కొందరు చరిత్రకారులు చెప్పుచున్నారు. అశోకుని అనంతరము మగధ సామ్రాజ్యము విచ్ఛిన్నమయిపోయింది. ఇతర దేశములతోపాటు నెపాళదేశము కూడా సామ్రాజ్యంతర్భాగమున నుండుటను విరమించుకొనెను. ఈ విశేషము జరిగిన పిమ్మట చాలాకాలము వరకు అంతగ నేపాళ దేశపు చరిత్ర ఎవ్వరికి తెలియకుండెడిది. కాని క్ర్రీస్తు వెనుక 340 సంవత్సర ప్రాంతమందు గుప్తవంశీయుడు, భారతసామ్రాజ్యాధిపతి అగు సముద్రగుప్తుడు నేపాళ దేశమును తాను జయించిన దేశముల పట్టీలో పేర్కొనెను. ఇదియే అలహాబద్ స్తంభ శాసనమందీ పట్టీకలదు. క్రీస్తు శకం 200 నాటికి బౌద్ధ సామ్రాజ్యాన్ని హిందువులు అంతమొందించి, లిచ్ఛవి వంశ పరిపాలనను ప్రారంభించారు.

నేపాళ దేశమున నాగవాసము (Now Called Lake Table Land) అనుపేరుగల గొప్ప సరోవరము నుండెనట, ఇది మిక్కిలి లోతుకలదై అసంఖ్యాకముగ నీటి పక్షులతో మనోహరముగ ఆవృతమై యొప్పుచుండెను. ఈ సరోవరమున కర్కోటకుడగు 'నాగరాజూ పరిపాలించుచుండెను. ఆ కాలములో నాగసరోవరములో ఒక్క తామరమొక్క అయినా మొలవకుండెడిదట. ఇట్లుండగా అంతకు చాలాకాలము క్రిందట విందుమతీ నగరమునుండి విపస్య బుద్ధుడు ఈ సరోవరమునకు వచ్చినప్పుడు అతడొక తామర మొక్క మంత్రించి ఈ సరోవరమున పారవైచి ఈ తామర పుష్పించిననాడు స్వయంభువుడగు బుద్దభగవానుడు జ్యోతివలె భక్తులకు కనపడునని చెప్పి వెడిలిపోయినాడట. ఈ కారణముచేతనే స్యయంభూనాధ్, బోద్ద్ నాధ్ దేవాలయములందు జ్యోతి ఎల్లప్పుడు వెలుగుచూనే ఉండును. అటుపిమ్మట శిఖిబుద్ధుడు నాగవాసమందు నిర్వాణము పొందెను. ఆ తరువాత విశ్వభూబుద్ధుడు, బోధిసత్వుడు నాగవాసములో తప్పస్సు నొనర్చారు. ఈ బోధిసత్వుడినే కొందరు మంజుశ్రీ అని పిలిచెదరు. ఈ మంజుశ్రీ అను నాతడు కొందరు చైనా దేశము వాడని, మరికొందరు ఆంధ్రుడని మరికొందరు చెప్పుచున్నారు.

షా వంశాన్ని 1846లో జంగ్ బహద్దూర్ రాణా అంతమొందించి దేశ పరిపాలనను తన చేతిలోకి తీసుకున్నాడు. దీనికోసం అతడు దాదాపు కొన్ని వందల మంది రాకుమారులను, తెగల నాయకులను అంతమొందించాడు (దాన్నే కోట్ ఊచకోత అంటారు). 1948వ సంవత్సరము వరకూ రాణాలు వారసత్వ ప్రధాన మంత్రులుగా నేపాలను పరిపాలించారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే త్రిభువన్ అనే క్రొత్త రాజు నేపాలు పాలనకు రావడానికి భారతదేశం సహాయపడింది. నేపాలీ కాంగ్రెసు పార్టీ ఏర్పడడానికి కూడా సహాయపడింది. రాజు త్రిభువన్ కుమారుడైన రాజు మహేంద్ర ప్రజాస్వామ్య ప్రయోగాన్ని, పార్లమెంటును రద్దు చేసి, పార్టీలు లేని పంచాయితీ పద్ధతి ద్వారా నేపాలును పరిపాలించాడు. అతని కుమారుడు బీరేంద్ర సింహాసనాన్ని అధిరోహించాడు. అతను కూడా 1989 వరకూ పంచాయితీ పద్ధతినే అనుసరించాడు. కాని ప్రజల ఆందోళన తర్వాత బలవంతంగా రాజ్యాంగ మార్పులను ఆమోదించాడు. 1991 మే నెలలో దాదాపు యాభై సంవత్సరాల తరువాత నేపాలలో ఎన్నికలు జరిగాయి. నేపాలీ కాంగ్రెస్ పార్టీ, కమ్మూనిస్టు పార్టీలకు ఎక్కువ ఓట్లు దక్కాయి. ఏ పార్టీ కూడా రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం పరిపాలించలేక పోయింది. అందుకు కారణంగా ప్రజోపయోగ కార్యక్రమాలలో మార్పు లేకపోవటం, అవినీతి రోగం లాగా మారటాన్ని చూపిస్తారు.
 
ఫిబ్రవరి 1996 లో మావోయిస్టు పార్టీ ప్రజాస్వామ్యాన్ని మార్చి, సామ్యవాదాన్ని స్థాపించడం కోసం విప్లవాత్మక ధోరణిని ఎంచుకొని ప్రజా యుద్ధాన్ని ప్రారంభించింది. అదే ఆ తర్వాత అంతర్యుద్ధంగా మారి 10 వేల మంది మరణానికి దారితీసింది.

నేపాలు ప్రభుత్వ రికార్డుల ప్రకారం 2001, జూన్ 1 నాడు సింహాసన వారసుడు దీపేంద్ర తన ప్రేమను ఒప్పుకోలేదని రాజభవనంలో రాజు బీరేంద్రను, రాణి ఐశ్వర్యను, తమ్ముడిని, చెల్లెల్ని, ఇద్దరు బాబాయిలను, ముగ్గురు పినతల్లులనూ కాల్చి చంపేశాడు. తర్వాత తనూ కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు కోమాలో ఉన్నా, సాంప్రదాయం ప్రకారం అతడిని వైద్యశాల పడక పైనే రాజుగా ప్రకటించారు. అతడు మూడు రోజుల తరువాత మరణించాడు.

అతని మరణం తరువాత బీరేంద్ర తమ్ముడు అయిన జ్ఞానేంద్రను జూన్ 4న రాజుగా ప్రకటించారు. వెంటనే అతను రాజ్యంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించి ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. మావోయిస్టులతో యుద్ధానికి నేపాలు సైన్యాన్ని రంగంలోకి దించాడు.

నేపాలును మొత్తం 14 ప్రాంతీయ విభాగాలుగా విభజించారు. భాగమతి, భేరి, ధావలగిరి, గండకి, జానక్ పూర్, కర్నలి, కోషి, లుంబిని, మహాకాళి, మేచి, నారాయణి, రప్తి, సగర్మత, సేతి

భారత్, చైనా మధ్యలో భౌగోళికముగా నేపాల్ బంధింపబడి ఉంది. మొత్తం 1,47,181 చ.కి.మీ. వైశాల్యములో విస్తరించి ఉంది. అందులో 56,827 చ.మై. భౌగోళిక వైవిధ్యమున్నప్పటికీ, పర్వతాలతో నిండి ఉంది. అడ్డంగా మూడు వైవిధ్య భౌగోళిక స్వరూపాలు ఈ దేశంలో ఉన్నాయి. దక్షిణాన లోతట్టు ప్రాంతము, మధ్యన చిన్న పర్వతాలతో ఉన్న ప్రాంతము, ఉత్తరాన హిమాలయాలతో (ఎవరెస్టు, ఇతర ఎత్తైన శిఖరాలతో) కూడిన అతి ఎత్తైన ప్రాంతము (8,850 మీ లేదా 29,035 అడుగులు). మొత్తము నేపాలలో 20% భూమి మాత్రమే వ్యవసాయ యోగ్యమైనది. అడవుల కొట్టివేత కూడా ఒక ముఖ్య సమస్య.

ఈ శిఖరము ప్రపంచములోనే ఎత్తైనది. దీనిని నేపాలీలో సాగరమాత అనీ, టిబెట్ భాషలో ఖోమోలోంగ్మ అనీ పిలుస్తారు. ఇది నేపాల్-ఛైనా సరిహద్దులో ఉంది. సమున్నతమైన ఎవరెస్టు శిఖరము, హిమాలయ పర్వత సానువులతో బాటు, ప్రపంచములో 8000 మీ. దాటిన పది ఎత్తైన శిఖరాలలో ఎనిమిది నేపాలు లోనే ఉన్నాయి. ఇవి పర్యటకులకు ముఖ్య ఆకర్షణ. వీటిని ప్రకృతి వింతలుగా చెప్తారు.
నేపాలలో ఐదు వాతావరణ ప్రాంతాలు ఎత్తుల వారీగా ఉన్నాయి. దక్షిణాన సమశీతోష్ణ మండలం మొదలుకొని చల్లని వాతావరణము, ఉత్తరాన అతిశీతల ప్రదేశాల వరకూ ఉన్నాయి. వర్షపాతం వివిధ ఋతువులలో ఋతుపవనాల పై ఆధారపడి వివిధ రకాలుగా ఉంటుంది. ఆ వర్షపాతమే మొత్తము సంవత్సర వర్షపాతములో 60-80% మేర ఇస్తుంది. సంవత్సరానికి తూర్పున 2500 మి.మీ., పశ్చిమాన 1000 మి.మీ., 1420 మి.మీ. ఖాట్మండు చుట్టుప్రక్కలా ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో ఇది 4000 మి.మీ. దాకా, కొన్ని సార్లు 6000 మి.మీ. దాకా కూడా ఉండవచ్చు.
ఋతుపవనాలు మంచి ఊపు మీద ఉన్నప్పుడు వర్షపాత వివరాలు. (జులై-ఆగస్టు).

ప్రభుత్వము, మావోయిస్టుల మధ్య నిరంతరము జరిగే గొడవలు, తగవులు, చిన్న అంతర్యుద్ధముల వల్ల నేపాలు ఆర్థికముగా పతనము చెందినది. ప్రపంచములోని అత్యంత పేద దేశాలలో నేపాలు ఒకటి, కానీ ఆర్థికంగా ఓ ప్రబల శక్తిగా మారుటకు కావలసిన అన్ని అర్హతలు ఉన్న దేశము, కానీ సరైన నాయకత్వం లోపం చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది. సేవలు, వ్యవసాయం దీని ఆర్థిక వ్యవస్థలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. సుమారుగా 80% జనాభా, 41% స్థూల జాతియాదాయం ఈ రెండు రంగాల నుండే వస్తుంది. పారిశ్రామికీకరణ కేవలం వ్యవసాయాధార పరిశ్రమలయిన నార (jute), చక్కెర, పొగాకు, ఆహార పంటలకు మాత్రమే పరిమితం అయినది. వస్త్ర ఉత్పత్తి, తివాచీల తయారీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నది, గత మూడు సంవత్సరాలలో ఇవి రెండూ దేశ విదేశీ మారక ద్రవ్య సంపాదనలో 80% ఆక్రమించినాయి. పారిశ్రామికాభివృద్ది చాలా వరకూ ఖాట్మండు లోయ చుట్టుప్రక్కల, మరియూ భిరత్ నగర్, బిర్గంజ్ వంటి నగరాలలోనే జరిగింది. వ్యవసాయాభివృద్ది 5%, వార్షిక జనాభావృద్ది 2.3%గా ఉంది.

నేపాలు బహు భాషా, బహు మత, బహు జాతులు గల సమాజం. ఈ క్రింద ఇవ్వబడిన లెక్కలు 2002 నేపాలు జన గణన నుండి ఇవ్వబడింది. 
 

నేపాల్‌కి వైవిధ్య భరితమైన భాషా సంస్కృతి ఉంది. అది మూడు భాషా సముదాయాల నుండి ఏర్పడింది. 1.ఇండో-ఆర్యన్, 2.టిబెటో-బర్మన్, 3.దేశీయమైన. 2001 జాతీయ లెక్కల ప్రకారం నేపాలులో మొత్తం 92 వివిధ భాషలు మాట్లాడతారు (93వ దాన్ని ఉన్నాగుర్తించలేకపోయారు). మాతృభాషగా నేపాలీలు మాట్లాడేది జనాభా శాతం ప్రకారం నేపాలి (49%), మైథిలి (12%), భోజ్ పురి (8%), థారు (6%), తమంగ్ (5%), నేవారి లేదా నేపాల్ భాష (4%), మగర్ (3%), అవధి (2%), బంటవ (2%), లింబు (1%), బజ్జిక (1%). మిగతా 81 భాషలు మాతృభాషగా 1% కన్నా తక్కువ మంది మాట్లాడతారు.

అధికార భాష దేవనాగరి లిపిలో వ్రాయబడే నేపాలీ భాష. వివిధ భాషలు మాట్లాడే నేపాలీలందరికీ, ఈ భాష భాషా మాధ్యమంగా ఉపయోగపడుతున్నది. దక్షిణ తెరాయ్ లేదా 5-10 మైళ్ళ వెడల్పు ఉన్న నేపాలు భారత సరిహద్దు ప్రాంతంలో హిందీ కూడా మాట్లాడతారు.

ఆధికారికంగా నేపాలు ప్రపంచంలో ఏకైక హిందూ దేశము. కానీ దీర్ఘ కాలంగా అక్కడి చట్టాలు బలవంతపు మత మార్పిడులను, అన్య మత విద్వేషాన్ని అడ్డుకుంటున్నాయి. 2001 లెక్కల ప్రకారం 80.6% మంది హిందువులు, 11% మంది బౌద్ధులు. కాని ఇరు మతాల వాళ్ళూ ఇరు మతాల సంప్రదాయాలనూ, ఆచారాలనూ, సమానంగా ఆచరిస్తారు. ఇంకా 4.2% మంది ముస్లింలు, 3.6% మంది కిరాంతులనబడే వాళ్ళూ, 0.5% మంది క్రైస్తవులూ ఉన్నారు. వీరి సంఖ్య 2005 కు 6 లక్షలకు పెరిగింది.

నేపాలీలకు కార్తీక మాసం కృష్ణ పక్షం రోజులు చాల పవిత్రమైనవి. ఈ సందర్భంగా తీహార్ పండుగలను జరుపుకుంటారు. ఇవి ఐదు రోజులు పాటు జరుపు కుంటారు. యమలోకాధి పతి ఐన యమధర్మ రాజును పూజించడంతో ఈ పండగలు ప్రారంభ మౌతాయి. ఈ పండగల కొక ఇతిహాసము ఉంది. దాని ప్రకారం:

పండగ దినాల్లో కూడా భూలోకంలో మానవులు మరణిస్తున్నారనీ, వారి ఆత్మలను తీసుకు రావడానికి తమకు బాదగా వున్నదనీ, దీనికి నివారణోపాయాన్ని చెప్పమని యమధూతలు.... యమ ధర్మ రాజుకు మొర పెట్టుకోగా. యమ ధర్మరాజు ఒక తరుణోపాయం ఆలోచించి వారికి చెప్తాడు. దాని ప్రకారం. ఎవరైతే కార్తీక కృష్ణ పక్షం త్రయోదశి, చతుర్థశి ఆ తర్వాతి రోజు తమ తమ ఇళ్ళను దీపాలతో అలంకరిస్తారో వారికి అకాల మరణ భయం, నరకలోక ప్రాప్తి వుండదనీ శలవిస్తాడు. ఆ విధంగా ఆ అయిదు రోజులు యమ పంచకం పండుగలుగా జరుపుకుంటారు.

యమ పంచకంలో మొదటి రోజైన ఈ రోజున కాగ్ తీహార్ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున అపశకునపు పక్షి అయిన కాకిని పూజిస్తారు. మానవుల మరణానికి కాకులు దూతలు బావించి ఈ రోజున ఇంట్లోని వారందరూ భోజనం చేయకుండా వుపవాసముండి, ఇంటిని దీపాలతో అలంకరించి పూజానంతరం కాకులకు అన్నం పెడతారు.

రెండో రోజున కుకుర్ తీహార్ అనగా కుక్కల పండుగ . ముఖ్యంగా మరణానికి పుత్రులుగా నల్లని కుక్కలను chestnut రంగు కుక్కలను భావించి వాటిని పూజిస్తారు. వాటి ముఖానికి బొట్టు పెట్టి, మెడలో పూల దండలు వేసి, వాటికి మంచి ఆహారం పెట్టి పూజిస్తారు. అన్ని జంతువుల కన్న కుక్క మానవునికి అత్యంత విశ్వాస పాత్రమై నందున, మానవునికి తోడుగా వుండి, అతనికి ఇంటిని కాపలా కాస్తున్నందున ఈ విధంగా వాటికి రుణం తీర్చుకోవడంగా కూడా నేపాలీ ప్రజలు భావిస్తారు. ( సాధారణంగా భారతదేశంలో ఆలయాల లోనికి కుక్కలు ప్రవేశిస్తే అపవిత్రంగా భావిస్తారు. ఆ అపవిత్రతను తొలిగించ డానికి కొన్ని శుద్ధి కార్యక్రమాలు కూడా చేస్తారు. కానీ నేపాల్ దేశంలో ఖాట్మండులోని పరమ పవిత్ర పశుపతి నాద్ దేవాలయంలో కొందరు పూజారులు కొన్ని కుక్కలకు నొసటన పసుపు పూసి కుంకుం బొట్లు పెట్టి వాటి మెడలో పూల మాల వేసి ఒక స్తంభానికి కట్టి ఆ ప్రక్కనే ఒక పూజారి కూర్చొని వుండగా నేను గమనించాను. కుక్కలు ఆలయంలో ఈ విధంగా వుండడము చూచి ఇదేదో పవిత్రమైన కార్యమై వుంటుందని భావించి కొంత లోతుగా పరిశీలించగా..... ఆలయానికొచ్చిన భక్తులు కుక్క వద్ద వున్న పూజారికి కుక్కలకు పూజా కార్యక్రమం చేయించి వారినుండి కొంత సంభావన స్వీకరించారు. ఇది నేను స్వయంగా చూసిన విషయం. బహుశా పూజించ డానికి కుక్కలు దొరక నందున ఆలయంలో ఈవిదంగా కుక్కలను పూజించే అవకాశం కల్పించబడినదని భావించ వచ్చు. )

మూడోరోజున పశువుల పండగ జరుపు కుంటారు. (ఆంధ్ర ప్రదేశ్ లో పశువుల పండుగ లాంటిది కాదు) గోవును లక్ష్మీ ప్రతిరూపంగా భావించి పూజించడము హిందువులకు ప్రపంచ వ్వాప్తంగా వున్న ఆచారమే. హిందువు లందరూ గోమాత అవయవాలల్లో అన్ని రకాల దేవతలు కొలువై వున్నారని నమ్ముతారు. గోమాత పూజను నేపాలీలు కార్తీక పౌర్ణమి నాడు చేస్తారు. చీకటిని ప్రాలద్రోలి లక్ష్మీ దేవికి స్వాగతం పలకడానికి ప్రజలందరూ తమ ఇండ్లను దీపాలతో అలంకరిస్తారు. క్షీర సాగర మదనంలో లక్ష్మీ దేవి ఈరోజునే పుట్టిందని వీరి నమ్మిక. స్త్రీలందరినీ లక్ష్మీ దేవి అవతారులుగా ఈ రోజున భావిస్తారు. స్త్రీలు ఈ రోజున స్నానానంతరం కొత్త బట్టలు ధరించి లక్ష్మీ పూజలు చేసి bhailo పాటలు పాడుతూ ఇంటింటికి వెళతారు. ఆ ఇంటి ఇల్లాలు ...... పాటలు పాడుతూ తమ ఇంటి ముంగిటకు వచ్చిన స్త్రీలను లక్ష్మీ అవతారంగా భావించి వారిని దీపాలతో ఆహ్వానిస్తారు. ఇంట్లో కూర్చో బెట్టి ఒక పళ్ళెంలో వివిధ రకాల రొట్టెలు, పలు రకాల పండ్లు అలంకరించి అందులో కొంత డబ్బులు పెట్టి వారికి సమర్పిస్తారు. ప్రతిగా....., ఆ వచ్చిన స్త్రీలు ఆ యింటి వారిని లక్ష్మీ కటాక్షం కలిగి ధన ధాన్యాలతో తులతూగాలని దీవిస్తారు. ఈ పండుగ నేపాల్ దేశంలో ప్రతి పల్లెలోను ఇప్పటికీ జరుగు తున్నది. పట్టణాలలో అంతగా లేదు.

నేపాల్ లోని పశ్చిమ ప్రాంతాలైన దోటి, హుమ్లా ప్రాంతాల్లో భైలే పాటలు ఐదు రోజులు పాటు పాడుతారు. అంతే గాక పుష్య మాసంలో (జనవరి-పిబ్రవరి) 20 రోజులు జరుపుతారు. దీనిని మఖ్య భైలే అని అంటారు.

నాల్గవ రోజున కూడా ప్రజలు తమ ఇండ్లను దీపాలతో అలంక రిస్తారు. కాని పూజా విధానంలో ప్రజలు వారి వారి సంస్కృతిని బట్టి కొన్ని మార్పులతో జరుపు కుంటారు. సాధారణంగా ఈ రోజు అందరూ తలంటుకుని స్నానంచేసి ఎద్దులకు కూడా స్నానంచేయించి, అలంకరించి పూజిస్తారు. ఆవులను పాలు పితకరు, ఎద్దులను పనిలో పెట్టరు. శ్రీ కృష్ణున్ని పూజించేవారు ఈ రోజు గోవర్థన పూజ చేస్తారు. శ్రీ కృష్ణుడు గోవర్థన పర్వతాన్ని ఎత్తి అనేక పశువులను, ప్రజలను రక్షించినది ఈ రోజు ఇదేనని పూజ చేస్తారు. కొందరు కొత్త తరం వారు ప్రతి మానవుని లోను దేవుడున్నాడని నమ్మి ఆత్మ పూజ చేస్తారు.

గోవర్థన పూజ జరిగిన రాత్రి పురుషులు భైలిలో స్త్రీలు పాటలు పాడినట్లు పాటలు పాడుతారు. (men play their carol called devsi) దీన్ని దెవ్సీ అంటారు. ఇందులో స్త్రీలకు ప్రవేశం లేదు. పట్టణ ప్రాంతాల్లో పురుషులు ఈ మార్గాన్ని ధన సంపాదనకు మార్గంగా ఎంచు కుంటున్నారు. కొన్ని సందర్భాలలో ఈ బృందం తాము అడిగినంత విరాళం ఇవ్వనందుకు ఇంటి వారితో వాగ్వివాదానికి దిగి అసభ్యంగా ప్రవర్తించడం కూడా జరుగు చున్నది. హోటళ్ళు వంటి కొన్ని వ్వాపార సంస్థలు ఈ దెవ్సీ బృందానికి తాము ఇంతే మొత్తమిస్తామని బయట బోర్డులు కూడా పెడ్తారు. పరదేశీ విహార యాత్రా వాహనాలను అటవీ ప్రాంతాలలో మధ్యలో ఆపి తాము అడిగి నంత ధనము ఇచ్చు నంత వరుకు వదలరు. ఆనందానికి ఆలవాలమైన ఈ పురాతన సాంప్రదాయం కొందరి స్వార్థపరులకు ధన సంపాదన మార్గంగా మారడంతో ప్రజాభిమానాన్ని కోల్పోతున్నది.

ఐదవ రోజు భాయ్ టికా పండుగను జరుపు కుంటారు. యమ పంచకంలో ఇది చివరి రోజు. ఈ రోజున యమ ధర్మ రాజు తన చెల్లె లైన యమునా' ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాడని వీరి నమ్మిక. స్కాంద పురాణం లోని కార్తీక మహత్యం ప్రకారం పురుషులు ఈ రోజున తమ ఇంట్లో గాక తమ చెల్లెలి ఇంట్లో భోజనం చేయాలి. చెల్లెలు లేని పురుషులు ఈ రోజు కొరకు ఎవరైనైనా దత్తత తీసుకుని వారింట భోజనం చేయాలి. ఆ అవకాశం కూడా లేనివారు ఒక చెట్టు నైనా తమ చెల్లెలుగా భావించి ఆ చెట్టు క్రింద భోజనం చేయాలి.

ఆ సోదరి తన అన్నకు ఆయురారోగ్యాల నందించాలని కోరి అన్నగారి నుదుట రంగు రంగుల తిలకం దిద్ది తగు బహుమతులిస్తుంది. అదే విధంగా అన్నకూడ తన చెల్లెలికి నుదుట తిలకం దిద్ది ఆమెకు బహుమతులిస్తాడు.

ఈవిధంగా .... హిందువులు అధికంగా ఉన్న నేపాల్ దేశంలో హిందూ సాంప్రదాయ పండగలు అనేకం జరుపుకుంటారు. ఇక్కడ జరుపుకునే పండగలలో కొన్ని ప్రత్యేకమైన పండగలు కూడా గమనించ వచ్చు.
(* మూల: యమ పంచక పండగల విశేషాలు... కొన్ని స్వయంగా చూసినవి. వివరాలు మాత్రం నేపాల్ లోని ఆంగ్ల దినపత్రికలైన The himalayan, and The khatmandu post )

ప్రపంచంలో అత్యధికంగా పర్యాటకులను ఆకర్షించే దేశాలలో నేపాల్ ఒకటి. దీనికి కారణాలు అనేకం. అక్కడి ప్రకృతి రమణీయత కావచ్చు., హిందూ మతస్తులకు, బౌద్ధ మతస్తులకు సంబంధించిన అత్యున్నతమైన కేంద్రాలు కావచ్చు., ట్రెక్కింగు, రాప్టింగు వంటి సాహస క్రీడలకి ముఖ్య కేంద్రం కావచ్చు, ముఖ్యంగా అక్కడి ప్రజల స్నేహ పూరిత స్వభావం కావచ్చు. ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టున్న హిమాలయాలు, పాతాళ లోకంలో వున్నాయా అన్నట్టున లోయలు, నదులు, సెలయేళ్లు, జలపాతాలు, హిందువులకు అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రాలు, ఆలయాలు, భౌద్దులకు అతి పవిత్రమైన ప్రార్థనా మందిరాలు ఇలా కారణాలేవైనా నేపాల్ దేశం పర్యాటకులకు నయనాందకరం చేసే దేశం. నేపాల్ దేశానికి ముఖ్యమైన ఆదాయ వనరు కూడా పర్యటకమే.

మొన్నటి దాక రాజుల పరిపాలనలో ఉన్న నేపాల్ దేశం ప్రపంచంలో ఉన్న ఎకైక హిందు రాజ్యం. భారత దేశానికి ఉత్తరాన ఆనుకునే ఉన్న ఈ దేశంలోనికి అడుగు పెట్టాలంటే 
భారతీయులకు ఎటువంటి పాస్ పోర్టు / వీసా / ఎలాంటి అనుమతి పత్రాలు అవసరం లేదు. వాహనాలకు మాత్రం కొంత రుసుము తీసుకొని అనుమతిస్తారు. అదే విధంగా భారతీయులు నేపాల్ లో స్థిరాస్తులు కొనుక్కోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు. ఎటువంటి అభ్యంతరం లేదు. అందుకనే నేపాల్ లో ఉన్న పెద్ద పెద్ద హోటళ్ళు వ్యాపారం భారతీయుల చేతిలోనే ఉంది. ఇదంతా నేపాల్ --- భారత దేశాల మధ్య కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం జరుగు తున్నది. ఈ దేశంలో ఉన్న మొత్తం జనాభాలో ఎనభై శాతం హిందువులు. తక్కిన ఇరవై శాతంలో భౌద్దులు, ముస్లింలు, క్రిష్టియన్లు ఉన్నారు. హిందువులకు అత్యంత పవిత్రమైన దేవాలయాలు ఇక్కడున్నాయి. అలాగే భౌద్దులకు అత్యంత పవిత్రమైన ప్రార్థనా స్థలాలు ఇక్కడున్నాయి. హిందువులు, భౌద్దులు కలిసే ఉంటారు.

నేపాల్ లోని ద్రవ్యమును కూడా రూపాయి అంటారు. భారత్ రూపాయిని ఐ.ఆర్ అని నేపాల్ రూపాయిని ఎన్.ఆర్. అని అంటారు. ద్రవ్య మారకానికి చాల చోట్ల అవకాశం ఉంది. కాని నేపాల్ లోని ప్రతి దుకాణంలోను, ఇతర ప్రదేశాలలోను భారత్ రూపాయిని తీసుకుంటారు. భారత్ రూపాయలు వందకు నేపాల్ రూపాయలు నూట అరవై ఇస్తారు. చిన్న నాణేలు అనగా పైసలు కూడా అక్కడ చలామణి లోవున్నాయి. భారత రూపాయి మారకానికి అక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండవు.

భారత్ భూభాగంతో కలిసి ఉన్న నేపాల్ లోనికి ప్రవేశించడానికి చాలా భూమార్గాలున్నాయి. అన్నింటిలోకి ఘోరక్పూర్ వద్ద ఉన్న మార్గమే ప్రధాన మైనది. ఈ బార్డర్ లో ఇరువైపుల కలిసి ఉన్న గ్రామం పేరు సునౌలి ఇక్కడ అసాధరాణమైన భద్రతా ఏర్పాట్లేమి వుండవు. అక్కడి స్థానిక ప్రజలు మామూలుగానే అటు ఇటు తిరుగు తుంటారు. భారతీయులు ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా నేపాల్ భూభాగంలోకి ప్రవేశించవచ్చు. కాని వాహనాలకు కొంత రుసుం కడితే లోనికి అనుమతిస్తారు. అలా నేపాల్ లోనికి ప్రవేశించిన వాహనాలు ఆ దేశంలో ఎక్కడైనా తిరగవచ్చు. సరిహద్దు వద్ద నేపాల్ భూభాగం లోనికి ప్రవేశించిన పర్యాటకులకు సేద దీరడానికి, కాల కృత్యాలు తీర్చుకోడానికి అనేక ఏర్పాట్లుంటాయి. నేపాల్ భూబాగంలోనికి ప్రవేశించగానే ప్రత్యేకంగా కనిపించే విషయమేమంటే ఇంకా తెల్లవారకముందే అక్కడున్న చిన్న చిన్న అన్నశాలలు, సత్రాలు, బడ్డి కొట్టులు అన్ని తెరిచే వుంటాయి. ఆ దుకాణాల ముందు ఒక మేజా బల్ల వేసి దానిపై మద్యం సీసాలు పెట్టి వుంటారు. మందు బాబులు కూడా అప్పటికప్పుడు తమ పని కానిచ్చుకొని వెళు తుంటారు. మద్యంపై ఇక్కడ ఎటువంటి నియంత్రణ లేదు.

సరిహద్దు నుండి కొంత దూరమే మైదాన ప్రాంతం. అక్కడక్కడ పల్లెలు పంట పొలాలు వుంటాయి. ఇక్కడ వరి ప్రధాన పంట. ఆ వరి చాల ముతక రకం. వ్యవసాయం సాంప్రదాయ పద్ధతిలోనే జరుగుతున్నది. కొండ వాలున కొన్ని అడుగుల వెడల్పున చదును చేసి అక్కడే వరి పండిస్తుంటారు. ఆ పొలాలు చూడ్డానికి చాల అందంగా కనబడుతుంటాయి. కొండలకు అందమైన మెట్లు చెక్కారా అని అనిపిస్తుంది. అటు వంటి కొండల పాద భాగన మంచి పారుతున్నా అది కొన్ని వందల అడుగుల లోతులో వున్నందున ఆ నీటిని పొలాలకు పారించ లేరు. కొండల పైనుండి జారు వారే నీటి ధారలే ఈ పంటలకు జల వనరులు. ఇటు వంటి నీటి ధారలు చిన్నచిన్నవి చాల ఎక్కువ. కొన్ని పెద్ద పెద్ద జలధారలు వుంటాయి అవి జలపాతాల్లాగా కనబడుతుంటాయి. ఈ కొండలలో ప్రజలు అన్ని రకాల కూరగాయలు, పండ్లు కూడా పండిస్తుంటారు. పల్లెలు చాల పలుచగా వుంటాయి. ఇళ్లు దూర దూరంగా వుంటాయి. కొన్ని చోట్ల పొలాల మధ్యలోనే ఇళ్లుంటాయి. ప్రతి ఇంటి ముందు బంతి పూల చెట్లుంటాయి. రోడ్లు విశాలంగా వున్నా అక్కడ తిరిగే వాహనాలు చాల పాతవి. జీపుల్లాంటి డొక్కు వాహనాలు, రిక్షాలు మొదలగునవి ప్రయాణ సాధనాలు.

నేపాల్ దేశం కొండలమయమైనందున అక్కడ రోడ్డులన్ని ఘాట్ రోడ్డులే. కొండ వాలులో రోడ్డుకు సరిపడినంత మేర చదును చేసి కొండ వాలు వెంబడి వంకర టింకరగా మెలికలు తిరుగుతూ రోడ్లుంటాయి. బస్సులో వెళుతుంటే ఒకవైపు ఆకాశం అంతెత్తున్న కొండలు, మరొక వైపున పాతాళం కనిపిస్తున్నదా అన్నంత లోతున ప్రవహిస్తున్న నది ఇలా వందలాది మైళ్ల పర్యంతం కనబడుతూనే వుంటుంది. లోయలో ప్రవహిస్తున్న నదిలో అతి శుభ్రమైన నీరుంటుంది. ఆ నది కూడా అనేక మలుపులు తిరుగుతూ ఎగుడు దిగుడుగా నురగలు కక్కుతూ ప్రవహిస్తుంటుంది. ఆ నదిలో రాళ్లన్ని అతి నును దేలి కాలు పెడితే జారిపోయేటట్లుంటాయి. వాటినే సాలగ్రాం లంటారు. 
నదులు చిన్నవైనా అవి అతి వేగంగా ప్రవహిస్తుంటాయి. ఆ నదులలో సాహసికులు ప్రత్యేక బట్టలు వేసుకుని తలకు టోపి పెట్టుకొని రబ్బరు బోట్లలో పోటి పడుతుంటారు. కొండ వాలులో బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు ఇదొక ఆనంద కరమైన దృశ్యం. రోడ్డు ప్రయాణికులకు టీ, కాఫీ, అల్పాహారం అందించడానికి అక్కడక్కడా చిన్న చిన్న జనవాసాలుంటాయి. అక్కడే సాహసిక క్రీడలైన రాప్టింగ్  (నదిలో రబ్బరు బోట్ల పోటీ) ట్రెక్కింగ్ ( తాళ్ల సాయంతో కొండలనెక్కే సాహస క్రీడ) లకు కావలసిన సామాగ్రిని అద్దెకిచ్చే దుకాణాలుంటాయి. ఇటు వంటి నివాస ప్రాంతాలలో కూడా నీటి వసతికి నది అత్యంత లోతులో నున్నందున దానిపై ఆధార పడకుండా కొండలపై నుండి జాలువారే జలధారలకు పైపు తగిలించి వారి అవసరాలకు వాడుకుంటారు. ఈ రోడ్డు పై ప్రయాణించే ప్రయాణికులకు మరొక ఆశ్చర్యపరిచే వినోదం మరొకటి కనువిందు చేస్తుంది. అవతిలి కొండ వాలులో పంటలు పండించే రైతులు ఇవతల నుండి నదిని దాటి అటు పక్కకు వెళ్లాలంటే. కొన్ని వందల అడుగుల లోతుకు దిగి అతి వేగంగా ప్రవహించే నదిని దాటి తిరిగి ఆ కొండ నెక్కి తమ పొలాలకు వెళ్ళాలి. ఆ నది చిన్నదే అయినా అతి వేగంగా ప్రవహిస్తుంటుంది. అందులోని రాళ్లు అతి నునుపుగా కాలు జారేటట్టుంటాయి. ఇటు వంటి ప్రమాదాన్నుండి తప్పించుకోడానికి వారు ఒక ఉపాయం కనిపెట్టారు. ఇవతల కొంత దిగువన ఒక బలమైన స్థంభాన్ని పాతి దానికి సమాంతరంగ నదికి అవతిలి వైపున కూడా ఇలాంటి స్థంభాన్ని పాతి ఈ రెండు స్థంభాలను ఒక బలమైన ఇనుప మోకుతో అనుసందానిస్తారు. పైన చక్రాలు కట్టిన ఊయాల లాంటి ఒక పెద్దబుట్టను ఆ ఇనుప మోకుకు తగిలించి ఆ బుట్టలో కూర్చొని తమ చేతులతో ఆ ఇనుప మోకును తమవైపుకు లాగుతూ వుంటే తాము కూర్చున్న ఆ బుట్ట ముందుకు సాగి అవతలి గట్టుకు చేరుకుంటారు. ఇది ఎంతో సాహసంతో కూడిన ప్రమాదకరమైన పనిగా అనిపిస్తుంది. ఇటువంటి సాహసాలు దారి పొడుగునా కనబడుతూనే వుంటాయి. ఒక్కోచోట కేవలం ఒక మనిషే కోతిలాగ ఆ ఇనుప తాడును పట్టుకొని అవతలికి వెళ్లే సందర్భాలు కూడా చూడొచ్చు. ఇలా ఎన్నో ప్రమాద భరితమైన సాహాసాలు చూస్తు ప్రయాణిస్తున్న బస్సు ప్రయాణికులలు కూడా అత్యంత ప్రమాదం పొంచి వుంటుంది. అదేమంటే వర్షాకాలంలో కొండ చెరియలు విరిగితే అవి కచ్చితంగా ఆ రోడ్డు పైనే పడతాయి. వాహనాలపై పడితే ఇక చేయగలిగింది ఏమీలేదు. ఖాళీ రోడ్డుపై పడినా వాటిని తొలిగించేంత వరకు వారి ప్రయాణం వాయిదా పడాల్సిందే.

నేపాల్ లోని ముఖ్యమైన పట్టణాలలో పోక్రా ఒకటి. ఇది అతి చిన్న పట్టణం. కొండ కోనల్లో కట్టిన ఇళ్లతో అందంగా కనబడుతుంది. ఈ పట్టణానికి ప్రాముఖ్యతను ఆపాదించడానికి మరొక కారణమున్నది. అది పట్టణానికి అల్లంత దూరంలో మంచుతో కప్పబడిని హిమాలయా పర్వతాలు. వెండి కొండలవలే ప్రకాశిస్తున్న ఆ హిమాలయాలను దగ్గర నుండి చూడడానికి విమాన ప్రయాణాన్ని ఏర్పాట్లు చేస్తారు. ఈ చిన్న విమానాలలో హిమాలయాలకు కొంత దగ్గరికి వెళ్లి తిరిగి వస్తాయి. ఈ పట్టణాన్ని స్విజ్డర్లాండుతో పోలుస్తారు. దీనికి ఆసియాలోని స్విజ్డర్ల్యాండు అని అంటారు. హిమాలయాల అందాలను చూడడానికి మంచి సమయం సూర్యోదయానికి కొంత ముందు దాని తర్వాత కొంత సమయం. ఆ సమయానికి పర్యాటకులు తాము బస చేసిన భవనాల పైకెక్కి హిమాలయాల అందాలను తిలకిస్తుంటారు. సూర్యోదయానికి ఇంకా కొన్ని నిముషాలుందనగా ఆకాశం ఎర్ర బడుతుంది. ఆ కాంతిలో ఆ మంచు కొండలు బంగారు కాంతితో మెరిసి పోతుంటాయి. ఆ బంగారు కాంతి పొద్దెక్కే కొద్ది రంగు మారి వెండి కొండ వలే వెలుగు లీనుతుంది. ఆదృశ్యం అత్యంత నయానంద కరం. ఈ పట్టణంలో మరొక వింత దేవి జలపాతం. సాధారణంగా జలపాతాలను క్రింద నుండి పైకి చూసారు. కాని ఈ జలపాతాన్ని పైనుండి క్రిందికి చూడాలి. అంటే కొండ పైకెక్కి చూడాలని కాదు. భూమి పైనుండే విశాలమైన బావిలోనికి చూడాలి. ఆ బావి చుట్టూ ప్రమాద నివారణ కొరకు ఇనుప పట్టీలతో కంచె ఏర్పాటు చేశారు. దాని అంచున నిలబడి బావి లోనికి చూడాలి. లోపల బావి దరి లోనుండి అతి పెద్ద జల ప్రవాహం వచ్చి చాల లోతున్న బావిలోనికి పడుతుంది. ఆ ప్రవాహం ఎక్కడి నుండి వస్తుందో తెలియదు. పర్యాటకులు నిలబడిన భూమి క్రింద సుమారు ఇరవై అడుగుల లోతోలోనుండి వచ్చి బావిలోనికి పడుతుంది. ఈ జలంతో ఆ బావి నిండి పోదు. ఆ వచ్చిన నీరు ఎలా వచ్చాయో అదే విధంగా భూమి లోపలికి వెళ్లి పోతాయి. అవి ఎక్కడ బయట పడతాయో. ఈ వింత జలపాతం పోక్రా పట్టణం మధ్యలోనే ఉంది. పోక్రాకు దిగువన కొంత మైదాన ప్రాంతమున్నది. అక్కడ వరి పంట పొలాలు ఎక్కువగా ఉన్నాయి. అల్లంత దూరంలో వున్న మంచు కొండల నుండి మంచు కరిగి వచ్చే నీరే వీరి పంటలకు సాగునీరు. ఆ నీరు అనేక చిన్న చిన్న కాలువగుండా స్వచ్ఛంగా ప్రవహిస్తుంటుంది.

కాఠ్మండు నగరం కొండల మధ్యన మైదాన ప్రాంతంలో ఉంది. ఇది ఈ దేశంలో అతి పెద్ద పట్టణం, దేశ రాజధాని కూడ. ఇక్కడ ఇది పెద్ద పట్టణమైనా భారతదేశంలో పట్టణాలతో పోలిస్తే ఇది చిన్నదే. బహుళ అంతస్తుల భవనాలు, భారీ కట్టడాలు చాల తక్కువ. ఈ దేశంలోని వాహనాలు చాల పాతవి డొక్కువి కూడాను. పాత జీపుల్లాంటి వాహనాలే ఇక్కడి ప్రయాణ సాధనాలు. కాఠ్మండులో ఒక ఆకర్షన అక్కడి జూద గృహాలు. వీటిని కాసినొ అంటారు. ఇక్కడ మద్యం సేవిస్తూ, అర్థ నగ్న నృత్యాలను వీక్షిస్తూ జూదం ఆడుతారు. ఈ జూదం ఆడడానికే  దేశాలనుండి పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడి ప్రభుత్వానికి ఇదొక ఆదాయ వనరు. సాధారణ పర్యటకులు కూడా వెళుతుంటారు. ఇక్కడ పెద్ద పెద్ద షాపింగు సెంటర్లు కూడా ఉన్నాయి. కాని అవి ఎక్కువగా భారత్ లాంటి విదేశాల వర్తకులకు చెందినవే. అన్ని దేశాలకు చెందిన వస్తువులు ఇక్కడ అమ్ముతుంటారు. సామాన్యంగా ఇక్కడ తయారైన వస్తువులు అంటు ఏమి వుండవు. అన్ని విదేశాలవే. స్థానికుల కన్నా పర్యటకులే ఈ వస్తువులను కొంటుంటారు. ఇది కూడా అక్కడి ప్రజలకు, ప్రభుత్వానికి ఆదాయ వనరే. ఇక్కడ రుద్రాక్ష చెట్లెక్కువ. అందు చేత రుద్రాక్షలు ఎక్కువగా, చాల చవకగా దొరుకుతాయి. కొందరు పర్యాటకులు రుద్రాక్ష కాయలను కిలోల లెక్కన కొంటుంటారు. వాటిని పగల గొట్టి చూస్తే వారి అదృష్టం పండి అందులో ఒకటి రెండు ఏకముఖి రుద్రాక్షలు దొరికాయంటే వారి పంట పండినట్లే. వాటి ధర ఒక్కోటి కొన్ని వేల రూపాయలుంటుంది.

పోక్రా నుండి ఖాట్మండు కు పోయే దారిలో ఈ మనో కామని ఆలయం ఒక పెద్ద కొండపై ఉంది. బస్సు రోడ్డు కానుకొని త్రిశూల్ నది ప్రవహిస్తుంటుంది. ఇక్కడ నది లోనికి దిగ గలిగినంత లోతులోనే ఉంది. నదికవతల రెండు మూడు కొండలకవతల ఒక కొండపై మనో కామిని ఆలయం వెలసి ఉంది. అక్కడికి వెళ్లడానికి రోప్ వే ఏర్పాటు ఉంది. ఆ రోప్ కారులో వెళుతుంటే ఆదృశ్యం . క్రింద నది, లోయలు, కొండ వాలులో పంటలు చాల మనోహరంగా వుంటుంది. గతంలో ఈ ఆలయానికి వెళ్ల డానికి మెట్ల దారి వున్నట్లు తెలిపే మెట్ల వరుసలు ఇప్పటి కనబడతాయి. ఈ రో ప్ కారులో మనుషులతో బాటు గొర్రెలు కూడా వెళుతుంటాయి. కొండ కొసన పెద్ద ఆలయం ఉంది. ఇది పగోడ పద్ధతిలో ఉంది. ఈ ఆలయంకొరకు వెలసినదే ఇక్కడున్న చిన్న గ్రామం. ఇక్కడి పూజారులను పండితులు అంటారు. వారు భక్తులను దేవి చుట్టు కూర్చో బెట్టి పూజ చేయిస్తారు. చివరన పూలు ప్రసాదం ఇస్తారు. ఇక్కడి అమ్మవారు భక్తుల మనసు లోని కోరికలు తెలుసుకొని వాటిని నెరవేరుస్తుందని భక్తుల నమ్మిక. ఈ ఆలయ ప్రాంగణంలో పావురాలు ఎక్కువగావున్నాయి. వాటికి గింజలను మేతగా వేస్తారు. ఇది చాల పురాతన ఆలయం. ఈ ఆలయం వెనుక ఒక జంతు వధ శాల ఉంది. ఇక్కడ తరచు దేవి కొరకు జంతు బలులు ఇస్తుంటారు. ఈప్రాంతం అంతా రక్త సిక్తంగా వుంటుంది. ఆ జంతువులు అనగా గొర్రెలు కూడా రోప్ కార్లలో రావలసిందే. ఇక్కడ చిన్న చిన్న హోటళ్లు ఉన్నాయి. అందులో ప్రతి టేబుల్ ముందు మద్యం బాటిళ్లు పెట్టి వుంటాయి. ఈ కొండ పై నుండి సుదూరంలో మంచుతో కప్పబడిని హిమాలయాలు కనబడు తుంటాయి.

ఇక్కడ చూడ వలసిన ప్రదేశాలు చాల ఉన్నాయి. అందులో ఒకటి హిందువులు అత్యంత పవిత్రంగా భావించే పశుపతి నాద్ ఆలయం. ఇది శివాలయం. చాల విశాలమైనది. కాని చాలవరకు శిథిలమయం. ఇక్కడి ప్రధాన ఆలయం పగోడ ఆకారంలో చాల ఎత్తుగా వుంటుంది. ఇందులో గర్భాలయం చతురస్త్రాకారంలో వుండి నాలుగు వైపుల ద్వారాలు కలిగుంటుంది. మధ్యలో ఉన్న శివ లింగానికి నాలుగు వైపుల నాలుగు ముఖాలుంటాయి. అవి ధర్మార్థకామ మోక్షాలకు ప్రతీకలని నమ్మకం. నాలుగు ద్వారాల వద్ద నలుగురు పండితులు ఉండి పూజలు చేయిస్తుంటారు. ఇక్కడి పూజారులను పండితులు అని అంటారు. వీరందరు తెలుగు వారేనని అంటారు. వారు తరతరాల క్రితం ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. ఈ ఆలయంలోనికి హిందూవులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. కాని వచ్చే వారు హిందువు అవునో కాదో గుర్తించే ఏర్పాట్లేమి వుండవు. ఈ ఆలయం వెనుక వైపున భాగమతి నది ఉంది. అక్కడే ఆతి పెద్ద శ్మశానం ఉంది. అక్కడ ఎప్పుడు శవాలు కాలుతూనే వుంటాయి. గర్భ గుడికి ఎదురుగా అతి పెద్ద నంది ఉంది. ఆలయ ప్రాంగణంలో వివిధ మందిరాలలో కొంత మంది పండితులు భక్తులకు పూజలు వ్రతాలు చేయిస్తుంటారు. ఇక్కడ రుద్రాక్షలు ఎక్కువగా దొరుకుతాయి. రుద్రాక్ష మాలలు చాల చవకగా అమ్ముతుంటారు. భక్తులు ఒక రుద్రాక్ష మాలను కొని పూజారికిచ్చి దానిని గర్భ గుడిలోని శివుని పై వుంచి మంత్రాలు చదివి దానికి తిరిగి భక్తులకు ఇస్తారు. దాన్ని భక్తులు పవిత్రంగా భావించి ధరిస్తారు. ఈ ఆలయం పరిసర ప్రాంతాలలో అనేక దుకాణలాలలో ముత్యాలు, నవరత్నాలు, అనేక రంగుల పూసలు విక్రయిస్తుంటారు. విదేశీ యాత్రికులే వీటిని ఎక్కువగా కొంటుంటారు.

శేషశయనుని పై పవళించినట్లు ఉన్న మహావిష్ణువు నల్లరాతి భారీ విగ్రహం తక్కువ లోతు నీళ్లున్న కోనేరులో తేలియాడుతున్నట్లున్న ఈ దేవుని భక్తులు నీళ్లలోకి దిగి పూజలు చేస్తుంటారు. ఆ విగ్రహం చేతులలో శంఖు, చక్రం, గధ మొదలైన ఆయుధాలున్నాయి. ఇది స్వయంభువని, బుద్ధుని అవతారమని ఇక్కడి వారి నమ్మిక. ఇది చాల పురాతనమైనది. ఈ చుట్టు పక్కల ఉన్న దేవాలయాల శిథిలాలను చూస్తుంటే గతంలో ఇక్కడ అతి పెద్ద ఆలయం ఉండేదని అర్థం అవుతుంది. అతి పొడవైన రుద్రాక్ష మాలలు ఇక్కడ ఎక్కువగా అమ్ముతుంటారు.

హిందువులు పవిత్రంగా భావించే నూట ఎనిమిది వైష్ణవ దివ్య ధామాలలో ముక్తినాథ ఆలయం 106 వది. పోక్రానుండి ముక్తినాధ్ ఆలయానికి వెళ్లాలంటే సరైన రోడ్డు మార్గం లేదు. అంతా గతుకుల బాట. చిన్న చిన్న విమానాలు నడుపుతుంటారు. అవి కూడ వాతావరణం సరిగా లేకుంటే నడపరు. వాటిలో వెళ్లినా ఆ తర్వాత కూడా కొంత దూరం కాలి నడకన వెళ్లాల్సిందే. ఇది చాల కష్టతరమైన దారి ప్రయాసతో కూడుకున్న పని. ముక్తి నారాయణుడు స్వయంభువు. పద్మాసనంలో కూర్చొన్నట్లున్న మూర్తి. ఇక్కడ నూట ఎనిమిది ధారలలో నీళ్లు పడుతుంటాయి. ఆ నీళ్లను నెత్తిన చల్లుకుంటే నూట ఎనిమిది దివ్యధామాలు దర్శించుకున్నంత ఫలితం వస్తుందని భక్తుల నమ్మిక.

ఖాట్మండుకు సుమారు వంద కిలో మీటర్ల దూరంలో ఒక కొండ మీద ఉదయిస్తున్న సూర్యుని చూడడానికి ఒక కేంద్రం ఉంది. సూర్యోదయానికి ముందే అక్కడికి చేరుకోవాలి. అక్కడికి వెళ్లే దారి సన్నగాను మలుపులు తిరిగి వుంటుంది. కనుక పెద్ద వాహనాలు వెళ్లలేవు. చిన్న వాహనాలలో వెళ్లాలి. ఈ కొండ పైనున్న ఒక హోటల్ లో యాత్రికులకు కావలసిన టీ, కాఫీ ఫలహారాల వంటి వసతులు చాల బాగా వుంటాయి. కొండ ఎత్తుగ వున్నందున సుదూర ప్రాంతం చక్కగా కనబడుతుంది. సూర్యోదయ సమయానికి మేఘాలు అడ్డు లేకుంటే ఆ సూర్యోదయ దృశ్యం చాల అద్భుతంగా ఉంటుంది.

 
నేపాల్ దేశంలో భక్తాపూర్ ఒక చిన్న పట్టణం. గతంలో ఇది ఇక్కడి ఒక రాజ్యానికి రాజధాని. ఈ రాజధాని నగరంలో చూడవలసిన అనేక దేవాలయాలు, రాజరికపు కట్టడాలు అనేకం ఉన్నాయి. పశుపతినాధ్ ఆలయాన్ని పోలిన ఆలయం కూడా ఇక్కడ ఉంది. అలాంటి దేవాలయాలు అనేకం ఉన్నాయి . కాని అన్ని శివాలయాలే. రాజ దర్బారు హాలు చాల గంభీరంగ ఉంటుంది. ఇక్కడే దుర్గమ్మ వారి ఆలయం ఒకటి ఉంది. ఇది ఆలయం లాగ కాకుండ నివాస గృహం లాగ వుంటుంది. ఆ ఆలయాన్ని కేవలం దసరా సందర్భంలో మాత్రమే తెరుస్తారు. లోన అత్యంత సంపద ఉన్నట్లు స్థానికులు చెపుతారు. గర్భ గుడిలోనికి వెళ్లనీకున్నా పరిసర ప్రాంతాలను చూడ వీలున్నది. ఈ ప్రాంతంలోని కట్టడాలు అతి మనోహరంగా ఉన్నాయి.

ప్రకృతి పరంగ ఎత్తైన కొండలు, లోతైన లోయలు, అభయారణ్యాలతో అనేక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలతో ఎంతో ప్రశాంతంగా కనబడే నేపాల్ దేశం రాజకీయంగా అత్యంత వేడి. వాడి చర్యలు చాల ఎక్కువగా జరుగుతుంటాయి. ఇదే ఈ దేశం ఆర్థికంగా ఎదగక పోవడానికి కారణం.

నేపాల్‌లో 2001 జనాభా లెక్కల ప్రకారం మొత్తము 103 (ఒక గుర్తు తెలియని జాతితో సహా) జాతులు/కులములు ఉన్నట్లు తేలినది. కులములు అనే పద్ధతి హిందూ మతము నుండి వచ్చింది. జాతుల విభజన అనేది, చారిత్రక విశేషాల వల్ల, వారికే ప్రత్యేకమైన ప్రాంతీయ ఊహాజనితమైన కథల వల్ల జరిగింది. 2001 జనాభా లెక్కల ప్రకారం ముఖ్యమైన కులాలు క్షత్రియ (ఛెత్రి) 15.8%, బ్రాహ్మణ (హిల్) 12.7%, మధేషి 33%, మగర్ 7.1%, తమంగ్ 5.6%, నేవార్ 5.5%, మహమ్మదీయ 4.3%, కామి 3.9%, (జాతులు) రాయ్ 3.9%, గురుంగ్ 2.8%, దమాయ్/ధోలి 2.4%. మిగతా 92 కులాలు/జాతులు 2% కన్నా తక్కువగా ఉన్నారు. వీళ్ళలోనే ప్రఖ్యాతి గాంచిన షెర్పాలు కూడా ఉన్నారు.

నేపాల్‌కు నాలుగు పంచాంగాలు ఉన్నాయి. ప్రభుత్వపు సౌర మాన పంచాంగము, చంద్రమాన పంచాంగము, నేపాలి సాంప్రదాయ పంచాంగము, పాశ్చాత్య పంచాంగము. నేపాల్ మతపరమైన సెలవు దినాలన్నీ చాంద్రమాన పంచాంగము ప్రకారము ఉంటాయి. అందువల్ల నేపాలీలకు సెలవు దినాల కోసమై ఒక స్థిరమైన తేదీలు అంటూ ఉండవు. సాధారణంగా రెండు ముఖ్యమైన సెలవు దినములు దషైన్, తిహార్‌లు, అక్టోబరు, నవంబరు మాసాలలో వస్తాయి.




#Article 181: పాకిస్తాన్ (7535 words)


పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ (ఆంగ్లం: Pakistan) (ఉర్దూ: پاکستان): దక్షిణాసియా లోని దేశం. భారత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, అరేబియా సముద్రంలను సరిహద్దులుగా కలిగి ఉంది. 16 కోట్లకు పైబడిన జనాభాతో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ప్రపంచంలో ఆరవ స్థానంలోను, అత్యధిక ముస్లిము జనాభా కలిగిన దేశాల్లో రెండో స్థానంలోను ఉన్నది. కామన్‌వెల్తులోను (2004–2007లో కొంతకాలము బహిష్కరించబడినది), ఇస్లామిక్ దేశాల సంస్థలోను సభ్యత్వం ఉంది. 1947కు పూర్వం భారత అంతర్భాగమైన ఈ పాకిస్తాన్, 1947లో భారత్ నుండి వేరుపడి పాకిస్తాన్ (పశ్చిమ పాకిస్తాన్ (ప్రస్తుత పాకిస్తాన్) తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్ ల సమాహారం) ఏర్పడింది. ఈ విభజనకు ముఖ్య కారకులలో ముహమ్మద్ అలీ జిన్నా ఒక్కరు.

ప్రస్తుత పాకిస్తాన్ ప్రాంతం పురాతన సంస్కృతులకు పుట్టిల్లు. మేహర్గర్ నియోలిథిక్, కాంశ్య యుగం సింధు నాగరికత, తరువాత  పలు మతాలు, సంస్కృతులకు రాజుల పాలన కొనసాగింది. వీరులో హిందువులు, ఇండో – గ్రీక్, ముస్లిములు, తింరిద్ (టర్కో మొఘలు,ఉ), ఆఫ్ఘన్లు, సిక్కులు ఉన్నారు. ఈ ప్రాంతాన్ని పలు రాజవంశాలు పాలించాయి. ఇది పలు సామ్రాజ్యాలలో భాగంగా ఉండేది. ఇది మయూర సామ్రాజ్యం, ఆచ – ఎమెనిద్ (పర్షియా), అలెగ్జాండర్ పాలనలో ఉంది. ముహమ్మద్ అలీ జిన్నాభారతద్వీపకల్పం సాగించిన స్వతంత్ర సమరం తరువాత 1947 లో పాకిస్థాన్ ముస్లిం రాజ్యంగా అవతరించింది. ముందు భారతదేశ తూర్పు – పశ్చిమం లలో ముస్లిములు అధికంగా ఉన్న ప్రాంతాలు పాకిస్థాన్‌గా ఉండేది.

పాకిస్థాన్ అడ్మినిస్ట్రేషన్ యూనిట్లు కలిగిన ఫెడరేషన్ పార్లమెంటరీ రిపబ్లిక్ పాలనా విధానం కలిగి ఉంది. పాకిస్థాన్ సప్రదాయ , భాషాపరమైన వైవిధ్యం కలిగిన దేశం. అలాగే పాకిస్థాన్ భౌగోళికంగా , భాషాపరంగా వైవిధ్యం కలిగి ఉంది. అలాగే కేంద్రీకృత అధికారవిధానం కలిగి ఉంది.

పాకిస్థాన్ స్టాండింగ్ ఆర్మీ ఫోర్స్ కలిగిన జాబితాలో 7వ స్థానంలో ఉంది. అలాగే పాకిస్థాన్‌కు న్యూక్లియర్ పవర్ అలాగే న్యూక్లియర్ ఆయుధసంపత్తి కలిగిన దేశాలలో చోటు కల్పించబడింది.

న్యూక్లియర్ ఆయుధాలు కలిగిన ఒకేఒక ముస్లిం దేశంగా గుర్తించబడుంది. న్యూక్లియర్ ఆయిధాలు కలిగిన దక్షిణాసియా దేశాలలో రెండవస్థానంలో ఉంది. పాకిస్థాన్ అర్ధపారిశ్రాకరణ చేయబడిన ఆర్ధికవ్యవస్థ కలిగి ఉంది. అలాగే చక్కగా ఏకీకృతం చేయబడిన వ్యవసాయరగం కలిగినదేశంగానూ, ఆర్ధికపరంగా జి.డి.పి అభివృద్ధిలో అంతర్జాతీయంగా 26వ దేశంగానూ, కొనుగోలు శక్తిలో జి.డి.పి అభివృద్ధిలో అంతర్జాతీయంగా 45వ స్థానంలోనూ, ఆర్ధికంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగానూ పాకిస్థాన్ గుర్తించబడుతుంది.

స్వాతంత్రం తరువాత పాకిస్తాన్ అధికంగా సైనిక పాలిత దేశాలలో ఒకటిగా గుర్తించబడుతోంది. ఇండో- పాక్ యుద్ధాలు, రాజకీయ అస్థిరత కలిగిన దేశంగా గుర్తించబడుతోంది. పాకిస్థాన్ అధిక జనసంఖ్య, తీవ్రవాదం, పేదరికం, నిరక్షరాస్యత,లంచగొండితనం మొదలైన సవాళ్ళను ఎదుర్కొంటోంది. అయినప్పటికీ 2012 లో హ్యాపీ ప్లానెట్ జాబితాలో 16వ స్థానంలో ఉంది. పాకిస్తాన్‌కు ఐక్యరాజ్యసమితి సభ్యత్వం, కామన్‌వెల్త్ దేశం, నెక్స్ట్ లెవెన్ ఎకనమీ, ఎకనమిక్ కోపరేషన్, యునైట్జింగ్ ఫర్ కాంసెన్సస్, కలిగిన దేశాలలో ఒకటిగా ఉంది. డెవలపింగ్ 8, కైర్ంస్ గ్రూప్, క్యోటో ప్రొటొకోల్, ఇంటర్నేషనల్ కొవనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్, రీజియనల్ కోఆపరేషన్ ఫర్ డెవలప్‌మెంటు, యు.ఎన్.సి.హెచ్,ఆర్, ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్ వెస్టుమెంటు బ్యాంక్, గ్రూప్ ఆఫ్ లెవెన్, చైనా- పాకిస్తాన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు, గ్రూప్ 24, జి 20 డెవలపింగ్ నేషన్స్, ఇ.సి.ఒ.ఎస్.ఒ.సి, ఫండింగ్ మెంబర్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్, సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజియనల్ కార్పొరేషన్, సి.ఇ.ఆర్, ఎన్ సభ్యత్వం కలిగి ఉంది.

పాకిస్థాన్‌లో త్వరలో జంట రాజధాని నగరాలు ఏర్పడనున్నాయి. అందమైన మార్గల్లా పర్వత శ్రేణుల్లో కొత్తగా రాజధాని నగర నిర్మాణానికి చకచకా చర్యలు ప్రారంభమయ్యాయి. దీన్ని ప్రస్తుత రాజధాని ఇస్లామాబాద్‌కు సొరంగ మార్గం ద్వారా అనుసంధానం చేయనున్నారు. దీంతోపాటు సుమా రు రూ.77 వేల కోట్ల వ్యయంతో చేపట్టే ఈ భారీ ప్రాజెక్టులో పలు నిర్మాణ, అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టనున్నారు. సాధ్యమైనంత త్వరగా ఇది అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని నవాజ్ షరీఫ్ ఆదేశించడంతో రాజధాని అభివృద్ధి అథారిటీ (సీడీఏ) ఈ దిశగా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది.రావల్పిండి-ఇస్లామాబాద్ మధ్య రెండు రింగు రోడ్డులు, రావల్పిండిలోని రావత్ వద్ద ఒక కొత్త ఎయిర్‌పోర్టు నిర్మాణం కూడా ఈ మెగా ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి. బ్లూ ఏరియా నుంచి రావత్ వరకూ ఉన్న ఇస్లామాబాద్ హైవేను 8 నుంచి పది లైన్లకు విస్తరించడంతోపాటు రోడ్డుకు ఇరువైపులా దుబాయ్‌లోని షేక్ జాయెద్ రోడ్డు తరహాలో బహుళ అంతస్తుల వాణిజ్య భవనాలను కూడా నిర్మించనున్నారు. ఇస్లామాబాద్ హైవేకు ఇరువైపుల ఉన్న ప్లాట్లను వాణిజ్య అవసరాలకు ఇవ్వడం ద్వారా భారీ మొత్తంలో డాలర్లను రాబట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మెగా ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టాల్సిందిగా విదేశీ పెట్టుబడిదారులను, ముఖ్యంగా ప్రవాస పాకిస్థానీయులను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది.

పాక్‌లో త్వరలో తీసుకురానున్న 232వ రాజ్యాంగ సవరణ ద్వారా అత్యవసర పరిస్థితి విధింపు, న్యాయమూర్తుల, ముఖ్య ఎన్నికల అధికారి నియామకం వంటి అధ్యక్షుడి అసాధారణ అధికారాలకు కత్తెర వేయనున్నారు. రాష్ట్ర శాసనసభలను సంప్రదించకుండా అధ్యక్షుడు తనంత తానుగా దేశంలో అత్యవసర పరిస్థితిని విధించలేరు. అలాకాకుండా అధ్యక్షుడు స్వతంత్రంగా వ్యవహరించి అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తే దానికి పార్లమెంటు ఉభయసభలు 10రోజుల వ్యవధిలో ఆమోదముద్ర వేస్తేనే అమల్లోకి వచ్చే విధంగా ముసాయిదాలో పొందుపరిచారు.

పాకిస్తాన్ నుంచి ఉత్తరకొరియా, లిబియా వంటి దేశాలకు అణుపరిజ్ఞానం  అక్రమముగా తరలించిదని ఆరోపణలు ఉన్నాయి.

భారతదేశముతో 1947 నుంచి కాశ్మీరు గురించి వివాదము నడుస్తోంది.
భారత్, పాకిస్తాన్, చైనా దేశాలమధ్య కాశ్మీరు వివాదం చాలా తీవ్రమైనది. భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన మూడు యుద్ధాలకు (1947, 1965, 1999 (కార్గిల్)) అలాగే భారత్, చైనా దేశాల మధ్య 1962 (బ్రిటిష్ వలస పాలన కాలములో భారత చైనాలను విదదీసే మెక్ మెహాన్ రేఖను చైనా గుర్తించనందుకు) యుద్ధానికి కాశ్మీరు వివాదమే కారణం. జమ్ము-కాశ్మీరు సంపూర్ణ రాష్ట్రం భారతదేశపు అంతర్గత భూభాగమని భారతదేశం వాదన. కాని మొత్తం రాష్ట్రంలో సగభాగం మాత్రమే ఇప్పుడు భారతదేశం ఆధీనంలో ఉన్నది. కాశ్మీరు లోయలో కొంత భాగం పాకిస్తాన్ అధీనంలో ఉన్నది. ఆక్సాయ్‌చిన్ ప్రాంతం చైనా అధీనంలో ఉన్నది.

కాశ్మీరులో భాగమైన గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ను స్థానిక గిరిజనుల సాయంతో పాకిస్థాన్‌ 1947లో ఆక్రమించింది. ఇప్పటి వరకూ ఈ భూభాగం ఎలాంటి ప్రజాస్వామ్యం లేకుండా పాకిస్థాన్‌ అధ్యక్షుడి ప్రత్యక్ష పాలనలో ఉంది. ఇప్పుడు ఈ భూభాగంపై వాస్తవ నియంత్రణాధికారాన్ని పాకిస్థాన్‌ చైనాకు అప్పగించింది. అరబ్బు దేశాలకు, చైనాకు మధ్య సిల్క్‌ రవాణా మార్గంలో గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ భూభాగం ఉంది.

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనేందుకు ఇరుదేశాలకు చెందిన ఏడుగురు మాజీ మంత్రులు ప్రయత్నాలు ప్రారంభించారు. భారత్‌కు చెందిన జశ్వంత్‌సింగ్‌, నట్వర్‌సింగ్‌, మణిశంకర్‌ అయ్యర్ పాకిస్థాన్‌ నుంచి ఖుర్షీద్‌ ఎం.కసూరీ, సర్తాజ్‌ అజీజ్‌, అబ్దుల్‌ సత్తార్‌, గొహర్‌ అయూబ్‌ఖాన్‌ ఇరుదేశాల మధ్య నలుగుతున్న కాశ్మీర్‌ వ్యవహారం, జలాల పంపిణీ, ఉగ్రవాదం వంటి కీలక అంశాలపై వారు పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు. ఇకపై ప్రతిఏటా సమావేశం కావాలని నిర్ణయించారు.

పాకిస్థాన్ పేరులోని పాక్ అంటే ఉర్దూ, పాష్తొ , పర్షియాలలో స్వచ్చత అని అర్ధం. స్థాన్ అంటే ప్రదేశం అని అర్ధం. పాకిస్థాన్ అంటే స్వచ్చమైన ప్రదేశం అని అర్ధం. స్థాన్ అనే పర్షియన్ పదానికి మూలం సంస్కృత స్థాన్ (సంస్కృతం (దేవనాగర్): स्थान) అని భావిస్తున్నారు.1933 లో మొదటిసారిగా పాకిస్థాన్ స్వాతంత్ర సమర యోధుడు చౌద్రీ రహ్మత్ అలి ఒక కరపత్రంలో పాకిస్థాన్ డిక్లెరేషన్ పేరును పేర్కొన్నాడు., పాక్స్థాన్‌లో 3 కోట్లమంది ముస్లిములు నివసిస్తున్నారని పేర్కొన్నాడు. ఇందులో సౌత్ ఆసియా బ్రిటిష్ రాజ్ లోని పంజాబు, ఖైబర్, పఖ్తుంఖ్వల్, కాశ్మీరి, సింధీ, బలూచిస్థాన్ ప్రాంతాలు పేర్కొనబడ్డాయి. పాక్(pak) అనే పదానికి సులువుగా పలకడానికి ,అర్ధవంతం చేయడానికి పేరులో ఐ i చేర్చబడింది.

దక్షిణాసియాలోని పురాతన మానవ సంస్కృతులలో పాకిస్థాన్ సంస్కృతి ఒకటి. పాకిస్థాన్‌లో నివసించిన వారిలో ఆరంభకాల పాలియోలిథిక్ కాలానికి చెందిన సొయానియన్లు ప్రధములని విశ్వసిస్తున్నారు. పంజాబు  లోని సొయాన్ లోయలో వారు ఉపయోగించిన రాతి పముట్లు లభించాయి. పాకిస్థాన్‌లోని  అధికభూభాగంలో ప్రవహిస్తున్న సింధూనది ప్రవాహిత ప్రాంతంలో పలు సంస్కృతులు విలసిల్లాయి. నియోలిథిక్ మెహర్గర్ వీటిలో ఒకటి. కాంశ్య యుగంలో మెహంజుదార్, హరప్పాలోని సింధూనాగరికత (క్రీ.పూ 2800–1800) కూడా వీటిలో మరొకటి. .

వేదకాలం (క్రీ.పూ 1500–500) ఇండో - ఆర్యన్ సంస్కృతిగా వర్గీకరించబడింది. ఇది హిందూయిజం నుండి జనించింది. హిందూయిజం ఈ ప్రాంతంలో చక్కగా విలసిల్లింది. ముల్తాన్ ప్రముఖ్య హిందూ ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటి.

వేద సంస్కృతి పంజాబుకు చెందిన తక్షశిలలోని (ప్రస్తుతం పంజాబు లోని తక్షిల) గాంధారం వద్ద వికసించింది. క్రీ.పూ 519 లో ఈ ప్రాంతాన్ని పర్షియన్ సామ్రాజ్యం, క్రీ.పూ 326లో అలెగ్జాండర్ పాలించారు.  చంద్రగుప్తుడు స్థాపించిన మౌర్యసామ్రాజ్యం తరువాత క్రీ.పూ 185 లోఅశోకుడు ఈప్రాంతాన్ని పాలించారు.

బాక్ట్రియాకు చెందిన డెమెట్రియస్ క్రీ.పూ 180-165 లో స్థాపించిన ఇండో- గ్రీక్ రాజ్యంలో పంజాబ్, గాంధార భాగం అయ్యాయి. క్రీ.పూ 165-150 నాటికి మెనందర్ దీనిని విస్తరించాడు. తరువాత ఈ ప్రాంతంలో గ్రేకో – బుద్ధిజం సంస్కృతి వికసించింది. తక్షశిల పురాతనమైన విద్యాసంస్థగా ,అత్యున్నత విద్యను అందించిన విద్యాసంస్థగా అంతర్జాతీయ ఖ్యాతి గడించింది.

మద్యయుగం (క్రీ.శ 642–1219) ఈ ప్రాంతంలో ఇస్లాం వ్యాపించింది. ఈ సమయంలో సూఫీ మిషనరీలు అధికసంఖ్యలో బౌద్ధులను , హిందువులను ఇస్లాం మతానికి మార్చడంలో కీలకపాత్ర 
వహించారు. సింధు ప్రాంతంలో రాయ్ రాజవంశం (క్రీ.శ 489–632) ఈ ప్రాంతాన్ని పరిసర ప్రాంతాలతో చేర్చిపాలించింది. ధర్మపాలా, దేవపాలా ఈప్రాంతాన్ని పాలించిన చివరి బౌద్ధపాలకులుగా గుర్తించబడుతున్నారు. పాలా సామ్రాజ్యంలో బంగ్లాదేశ్ ఉత్తరభారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ భాగంగా ఉంది.

క్రీ.శ 711 ముహమ్మద్ బీన్ కాశిం విజేత సింధూలోయలోని పాకిస్థాన్‌ పంజాబు, ముల్తాన్ ప్రాంతాలను జయించాడు. పాకిస్థాన్ ప్రభుత్వ చారిత్రక ఆధారాలు పాకిస్థాన్ తకెత్తడానికి ఇది పునాదిగా ఉందని తెలియజేస్తున్నాయి.
 ఈ విజయం తరువాత భారత ద్వీపకల్పంలో పాలన సాగించిన ముస్లింల విజయానికి వేదిక తయారుచేసింది. తరువాత (క్రీ.శ 975–1187) లో ఘజ్నావిద్ సామ్రాజ్యం, ఘోరిద్ రాజ్యం, (క్రీ.శ 1206–1526) ఢిల్లీ సుల్తానేట్ ఈ ప్రాంతాన్ని కూడా పాలించాయి. తరువాత సుల్తానేట్ స్థానంలో (క్రీ.శ 1526–1857) నుండి ఈ ప్రాంతం మొఘల్ సామ్రాజ్యంలో భాగంగా ఉంది.

మొఘల్ పాలకులు ఈ ప్రాంతంలో పర్షియన్ సంప్రదాయం,ఉన్నతస్థాయి ఇండో- పర్షియన్ సంస్కృతి ప్రవేశపెట్టాయి.

ఈ సమయంలోనే ఈస్టిండియా కంపెనీ సముద్రతీర స్థావరాలు ఏర్పరచుకున్నది.

సముద్రం మీద ఆధిపత్యం, గొప్ప వనరులు, సాంకేతికత ఈస్టిండియా కంపెనీ సమీకరించిన సైనికశక్తి రక్షణ బ్రిటిష్ ప్రభుత్వం భారతద్వీపకల్పంలో కంపెనీ పాలనకు అనుమతించేలా చేసింది. 1765 నాటికి భారతద్వీపకల్పం మీద యురేపియన్ల ఆధిపత్యం అధికరించింది.

 చరిత్రకారులు ఇది కాలనీ పాలనకు ఆరభబిందువని వర్ణిస్తున్నారు.  ఈ సమయానికి బ్రిటిష్ ప్రభుత్వం నుండి ఈస్టిండియా కంపెనీకి లభించిన మద్దతుతో ఈస్టిండియా కంపెనీకి మరింత విశ్వాసంతో విద్య, సాంఘిక సంస్కరణలు , సంస్కృతికరంగం మొదలైన ఆర్ధికేతర రంగాలలో శక్తివంతగా ప్రవేశించడానికి అవకాశం లభించింది. 1835 లో ఇంగ్లీష్ ఎజ్యుకేషన్ యాక్ట్ (1845) , ఇండియన్ సివిల్ సర్వీస్  వంటి సంస్కరణ అమలుచేయబడింది. భారతీయ ద్వీపకల్పంలోని భారతీయ ముస్లిములు విద్యను అభ్యసించడానికి సంప్రదాయకమైన మదరసాలకు ఆగ్లేయులు మద్దతు ఇవ్వలేదు.

తరువాత దాదాపు మదరసాలు అన్ని నిధులు  సహాయం కోల్పోయాయి.

వరకు సిక్కుల ప్రాభవం అధికం అయింది.1857 లో భారతీయ తిరుగుబాటు 1857 (సిపాయీల తిరుగుబాటూ) ఈ ప్రాంతంలో బ్రిటిష్ ప్రభుత్వం , క్వీన్ విక్టోరియాలకు వ్యతిరేకంగా  జరిగిన అతిపెద్ద సైనికచర్యగా గుర్తించబడుతుంది. హిందూయిజం , ఇస్లాం అనుయాయుల మద్య మతకహాలు అధికమై హిదూ ఇస్లామిక్ సంబంధాలు క్షీణించడం వలన బ్రిటిష్ పాలనకు ప్రధాన సమస్యగా పరిణమించింది. హిందీ- ఉర్దూ వివాదాలు హిందువులు , ముస్లిముల మద్య సంఘర్షణలను మరింత అధికం చేసింది.

బెంగాలి పునరుజ్జీవనం సంప్రదాయ హిందూయిజ ఙానం జాగరూకమైంది. అలాగే అది బ్రిటిష్ ఇండియన్ సామారాజ్య సాంఘిక , రాజకీయాల మీద కూడా గొప్పగా ప్రభావం చూపింది.

బెంగాలీ పునరుజ్జీవనం ఎదుర్కోవడానికి సయ్యద్ అహ్మద్ ఖాన్ నాయకత్వంలో అలిఘర్ ఉద్యమం నిర్వహించబడింది. ఫలితంగా 1901 లో ఇండియన్ ముస్లిం లీగ్ స్థాపించబడింది.

తరువాత రెండుదేశాల విధానాన్ని ముస్లిం లీగ్ ఆదరించింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బ్రిటిష్ వ్యతిరేక విధానం, బ్రిటిష్ విలువలను స్వీకరించిన ఆల్ ఇండియా ముస్లిం లీగ్ భవిష్యత్తు పాకిస్థాన్ సాంఘిక విధానం రూపొందించాయి. మొదటి  ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ వ్యతిరేక విధానం హిందూ జర్మన్ కుట్ర మొదలైన వివాదాలు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ , జర్మన్ దేశాలమద్య సయోధ్య కలేగేలా చేసాయి. జాతీయ కాంగ్రెస్ నాయకత్వంలో అహింసా విధానంలో స్వరంత్ర పోరాటం దేశావ్యాప్తంగా వ్యాపించింది. ఈ విధానంలో మూకుమ్మడి పోరాటాలలో లక్షలాది ప్రజలు పాల్గొన్నారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా  1920 లో క్విట్ ఇండియా ఉద్యమం , 1930 లో సహాయనిరాకరణోద్యమాలలో దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారు.

. బ్రిటిష్ ఇండియాలో జాతీయ కాంగ్రెస్ లోని నెహ్రూ, అబుల్ కలాం ఆజాద్, ఆల్ ఇండియ ముస్లిం లీగ్ లోని ముహమ్మద్ ఆలి జిన్నా , సిక్కులకు నాయకత్వం వహించిన తారాసింగ్ మొదలైన భారతీయ జాతీయవాదులు  1947 జూన్ మాసంలో స్వతంత్రం , అధికార పరివర్తన షరతుల గురించి సంప్రదింపులు జరిపారు.1947 లో యునైటెడ్ కింగ్డం భారత్ విభజనకు అంగీకారం తెలిపింది. ఆగస్ట్ 14 న వాయవ్య భారతం , తూర్పు భారతంలోని అధికసంఖ్యాకులైన ముస్లిం ప్రజలను కలుపుకుంటూ పాకిస్థాన్ అవతరించింది. బలూచీస్థాన్, తూర్పు బెంగాల్, వాయవ్య సరిహద్దు భూభాగం (1901–55), పంజాబు (పాకిస్థాన్) , సింధ్ భూభాగాలు పాకిస్థాన్‌లో భాగం అయింది. భారత్ విభజన కారణంగా పంజాబ్ , బెంగాల్ లలో తీవ్రమైన మతకలహాలు చెలరేగాయి. లక్షలమంది ముస్లిములు పాకిస్థాన్‌కు తరలి వెళ్ళారు లక్షలాది హిందువులు , సిక్కులు భారత్‌కు తరలి వచ్చారు. రాజస్థానం జమ్ము కాశ్మీర్ వివాదం  మొదటి కాశ్మీర్ యుద్ధం (1948) కి దారితీసింది.

పాకిస్థాన్ అధ్యక్షుడు ఇస్కందర్ మిర్జా  టూ మాన్ రూల్  స్థానంలో ఆర్మీ చీఫ్ పాలన అమలైన తరువాత పాకిస్థాన్ స్వతంత్రం ప్రశ్నార్ధకంగా మారింది. తరువాత అధ్యక్షుడు ఇస్కందర్ పాలన తొలగించి మిర్జా  ఆర్మీ చీఫ్ జనరల్ అయూబ్ ఖాన్ పాకిస్థాన్ పాలన స్వాధీనం చేసుకున్నాడు. 1962 లో అధ్యక్షపాలన అమలైన తరువాత పాకిస్థాన్ ఆర్ధికరంగం గుర్తించతగినంగా అభివృద్ధి చెందింది. 1965 లో రెండవ ఇండో – పాక్ యుద్ధం తరువాత పాకిస్థాన్ ఆర్ధికవ్యవస్థలో పతనం మొదలైంది.

న్యూక్లియర్ నియంత్రణ, ఇస్లామైజేషన్ అభివృద్ధి సంప్రదాయవాద తత్వం అభివృద్ధి కొనసాగింది. తరువాత పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్‌లో రష్యా కార్యకలాపాకు వ్యతిరేకంగా యు.ఎస్ కార్యకలాపాలకు సహకారం అందించింది.

పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ తరువాత సంప్రదాయవాద పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎన్) అధికారం చేపట్టింది. తరువాత దశాబ్ధంలో ఈ రెండు పార్టీలు మార్చిమార్చి అధికారం చేపట్టాయి. 1980 తో పోల్చితే తరువాత దశాబ్ధంలో దేశఆర్ధిక వ్యవస్థ క్షీణించింది. తరువాత పాకిస్థాన్ దీర్ఘకాలం ద్రవ్యోల్భణం, అస్థిరత, లంచగొండితనం, పాకిస్థాన్ జాతీయవాదం, భౌగోళిక రాజకీయం, భారత్‌తో శతృత్వం, సోషలిజం పతనం, సంప్రదాయవాదం, మొదలైన అంశాలమధ్య చిక్కుకుపోయింది. 1997 లో పాకిస్థాన్ జాతీయ ఎన్నికలలో పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎన్) అత్యధిక ఆధిఖ్యత సాధించింది. 1988 లో భారత్ ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పాయ్ నేతృత్వంలో నిర్వహించబడిన పొక్రాన్ అణ్వాయుధ పరిశోధనకు సమాధానంగా ముషారఫ్ నేతృత్వంలో రెండవ పాకిస్థాన్ అణ్వాయుధ పరిశోధన నిర్వహించబడింది. 

పాకిస్థాన్ ఇస్లాం మతప్రాతిపదిక కలిగిన ప్రజాస్వామ్య దేశం. పాకిస్థాన్ ఫెడరల్ పార్లమెంటరీ విధానం కలిగి ఉంది. 1956 లో మొదటిసారిగా పాకిస్థాన్ కాంస్స్టిట్యూషన్ 
నిర్మితమైనది. అయినప్పటికీ 1958 లో నిలిపివేయబడి 1962 లో పునర్నిర్మించబడింది. సమగ్రమైన పాకిస్థాన్ కంస్టిట్యూషన్ 1973 నుండి అమలై 1977 లో జియా-ఉల్-హక్ చేత రద్దుచేయబడి 1985 లో తిరిగి అమలుచేయబడింది. పాకిస్థాన్ మిలటరీ పాకిస్థాన్ రాజకీయచరిత్ర లలో కీలకపాత్ర వహిస్తుంది. సైనిక పాలన కాలంలో అధ్యక్షుని  మిలటరీ నిర్ణయిస్తుంది. ప్రజాస్వామ్యకాలంలో అధ్యక్షుని ఎన్నిక ప్రజాస్వామ్యవిధానంలో నిర్ణయించబడుతుంది. పాకిస్థాన్‌లో బహుళపార్టీ విధానం కలిగిఉంది. 2013 మే మాసంలో పాకిస్థాన్‌లో జనరల్ ఎలెక్షన్లు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.

జసంఖ్యాపరంగా రెండవస్థానంలో ఉన్న ముస్లిందేశంగా (మొదటిస్థానంలో ఇండోనేషియా ఉంది) , అణ్వాయుధాలు కలిగిన ఏకైక ముస్లిందేశంగా పాకిస్థాన్ గుర్తించబడుతూ ప్రపంచరాజకీయాలలో కీలకపాత్ర వహిస్తుంది. సగం వ్యవసాయం , సగం పారిశ్రామిక దేశం అయిన పాకిస్థాన్ ఆర్ధికరం విదేశీవ్యవహారలతో అధికంగా ముడిపడి ఉంది. పాకిస్థాన్ సేవాసంస్థలు, కార్పొరేషన్ , పౌరవ్యవస్థ కూడా విదేశీ వ్యవహారలతో ముడివడిఉంది. 
స్థిరమైన విదేశీవిధానాలతో పాకిస్థాన్ విదేశాలతో సుముఖమైన సంబంధాలను కలిగి ఉంది. 
 భారత్ నిర్వహించిన పొక్రాన్ అణ్వాయుధ పరిశోధన తరువాత పాకిస్థాన్ అణ్వాయుధ పరిశోధన జరపడానికి దారితీసింది.

ప్రపంచం చమురుసరఫరా మార్గంలో ఉండడం , చమురూత్పత్తి చేస్తున్న మధ్యఆసియాదేశాలకు సమీపంలో ఉండడం పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిస్తుంది.

సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కాత్పొరేషన్, ఎకనమిక్ కార్పొరేషన్, జి 20 డెవలిపింగ్ దేశాల సభ్యత్వం కూడా కలిగి ఉంది. పాకిస్థాన్ ఇజ్రాయేలు మధ్య దౌత్యసంబంధాలు లేవు. అయినప్పటికీ ఇజ్రాయేలు ప్రజలు పర్యటన నిమిత్తం పాకిస్థాన్‌కు వచ్చి పోతుంటారు. 
 ఆర్మేనియాతో సంబంధాలు లేని ఒకేఒక దేశం పాకిస్థాన్ మాత్రమే. అయినప్పటికీ ఆర్మేనియన్లు ఇప్పటికీ పాకిస్థన్‌లో నివసిస్తున్నారు.

పాకిస్థాన్ మిడిల్ ఈస్ట్ దేశాలు , ఇతర ముస్లిం దేశాలతో రాజకీయ, సాంఘిక , ఆర్ధిక సంబంధాలు కలిగి ముస్లిం దేశాలలో ప్రాముఖ్యత ఉంది. పాకిస్థాన్ చైనాతో దౌత్యసంబంధాలు ఏర్పరుచుకున్న మొదటి దేశం పాకిస్థాన్. అలాగే 1962 ఇండో-చైనా యుద్ధం తరువాత పాకిస్థాన్ , చైనాల మధ్య స్నేహసంబంధాలు కొనసాగుతూ ఉన్నాయి.

 2000 లో చైనా పాకిస్థాన్ మద్య జరిగిన చైనా-పాకిస్థాన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇప్పటికీ కొనసాగుతూ ఉంది.అలాగే పాకిస్థాన్ చైనా-, ముస్లిం దేశాల మద్య వారధిలా సహకారం అందిస్తుంది. భారత్‌తో భౌగోళిక శతృత్వం ఉన్నప్పటికీ పాకిస్థాన్ టర్కీ , ఇరాన్ లతో రాజకీయ సంబంధాలను కొనసాగిస్తుంది. సౌదీ అరేబియా కూడా పాకుస్థాన్‌తో గౌరవనీయ సంబంధలు కలిగి ఉంది. . కాశ్మీర్ సంగర్షణతో భారత్ పాక్ మద్య పెద్ద అఘాతం ఏర్పడింది. కాశ్మీర్ కారణంతో ఇరుదేశాల మద్య 4 మార్లు యుద్ధం సంభవించింది.  1950 , 1980 సోవియట్-ఆఫ్ఘ యుద్ధం వంటి రాజకీయ కారణాల వలన సోవియట్ యూనియన్‌తో విబేధాలు తలెత్తాయి. పాకిస్థాన్ యునైటెడ్ స్టేట్స్ సన్నిహితసంబంధిత దేశాలలో ఒకటి. 1999 నుండి పాకిస్థాన్ రష్యాల మద్య పలురంగాలలో పరస్పర సంబంధాలు మెరుగుపడ్డాయి. 
పాకిస్థాన్ యునైటెడ్ స్టేట్స్ మద్య బలమైన అంతరంగిక సంబంధాలు ఉన్నాయి. కోల్డ్ వార్ పాకిస్థాన్ యునైటెడ్ స్టేట్స్‌తో కలిసి పనిచేసింది. 1990 పాకిస్థాన్ రహస్యంగా అణాయుధాలు తాయారుచేసిన విషయం బహిర్గతం అయిన తరువాత అమెరికా పాకిస్థాన్ సంబంధాలు బలహీనపడ్డాయి. యునైటెడ్ స్టేట్స్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా జరిపిన పోరు అమెరికా పాకిస్థాన్‌లు సన్నిహితం అయినప్పటికీ ఆఫ్ఘన్ యుద్ధం (2001) తరువాత సంబంధాలలో తీవ్రవాదం కారణంగా సమస్యలు ఎదురైయ్యాయి. 1948 నుండి ప్రత్యేక బలూచీస్థాన్ వాదులు నైరుతీ బలూచీస్థాన్‌లో తరచుగా ఆదోళన చేస్తున్నారు.

ఫెడరల్ పాత్లమెంటరీ రిపబ్లిక్ రాజ్యంగా పాకిస్థాన్ ఫెడరేషన్‌లో (పంజాబు, ఖైబర్, సింధి , బలూచీస్థాన్) నాలుగు విభాగాలు ఉన్నాయి. . , ట్రైబల్ బెల్ట్,గిల్జిట్- బలూచీస్థాన్, ఇస్లామాబాద్ కాపిటల్ టెర్రిటరీ , అజాద్ కాశ్మీర్ పేరిట నాలుగు నిర్వహణా విభాగాలు ఉన్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వం డీ ఫేక్టో స్టాండర్డ్  విధానం అనుసరిస్తుంది. 
 పాకిస్థాన్ పాలన త్రీటైర్ (పాకిస్థాన్ జిల్లాలు, తాలూకాలు , యూనియన్ కౌన్సిల్స్ ఆఫ్ పాకిస్థాన్) సిస్టం అనుసరించి నిర్వహించబడుతుంది. ఒక్కొక్క విధానానికి ఎన్నిక విధానంలో సభ్యులను ఎన్నికచేస్తారు. ట్రైబల్ ఏరియాలో ఏడు గిరిజనప్రాంతాలు , ఆరు చిన్న సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయి. పాకిస్థాన్ న్యాయవ్యవస్థ , పాకిస్థాన్ ఇంటెలిజంస్ కమ్యూనిటీ పాకిస్థాన్ చట్టపరిధిలో పనిచేస్తాయి. దీని క్రింద నేషనల్ ఇంటెలిజంస్ డైక్టరేట్‌ పరిధిలో ఫెడరల్ , ప్రివింషియల్ స్థాయిలో పనిచేస్తుంది. ఫెడరల్ ఇంచెస్టిగేషన్ ఏజన్సీ, ఇంటెలిజంస్ బ్యూరో, నేషనల్ హైవేస్, మోటర్ వేస్ ఆఫ్ పాకిస్థాన్ , పాకిస్థాన్ రేంజర్స్ , ఫ్రాంటియర్ కార్ప్స్ వంటి పారామిలటరీ దళాలు పనిచేస్తుంటాయి.

పాకిస్థాన్ కోర్ట్ సిస్టంలో పాకిస్థాన్ సుప్రీం కోర్ట్ అగ్రస్థానంలో ఉంటుంది. హైకోర్ట్ ఆఫ్ పాకిస్థాన్, ఫెడరల్ షరియట్ కోర్టులు (ఒక్కొక భూభాగానికి ఒకటి , ఫెడరల్ కాపిటల్‌లో ఒకటి), జిల్లా కోర్టులు (ఒక్కొక జిల్లాకు ఒకటి), జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు (ఒక్కొక నగరం , ఒక్కొక పట్టాణానికి ఒకటి), ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టు , సివిల్ కోర్టులు ఉన్నాయి.
పాకిస్థాన్ పీన్ల్ కోడ్ గిరిజనప్రాంతాలలో పరిమితికి లోబడి ఉంటుంది. గిరిజన ప్రాంతాలకు గిరిజన సంప్రదాయాలను అనుసరించి చట్టం అమలు చేయబడుతుంది.

పాకిస్థాన్ సైనికబలంలో ప్రంపంచం 8వ స్థానంలో ఉంది. 2001 గణాంకాలను అనుసరించి పూర్తిసమయం పనిచేసేవారి సంఖ్య 6,17,000. రిజర్వ్ దళం 5,13,000
 
పాకిస్థాన్ మిలటిరీ 1947 లో రూపొందించబడింది. పాకిస్థాన్ రాజాకీయాలలో మిలటరీ కీలకపాత్రవహించింది. జాయింట్ చీఫ్స్ ఆఫ్ కమిటీ ఆధ్వర్యంలో చైన్ ఆఫ్ కమాండ్ విధులు నిర్వహించబడుతుంటాయి. జాయింట్ స్టాఫ్ హెడ్క్వారటర్స్ రావల్పుండి మిలటరీ జిల్లాలో ఉంది. చైరమన్ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ సైనికదళానికి ఉంత్తాధికారిగా , ప్రభుత్వానికి ప్రధాన సైనిక సలహాదారుగా ఉంటాడు. 
 జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఉన్నతాధికారి సైనికదళాన్ని నియంత్రిస్తుంటాడు. అలాగే సైనికదళం , ప్రభుత్వం మధ్య వ్యూహాత్మక అనుసంధానకర్తగా ఉంటాడు. 

పాకిస్థాన్ ఆర్మీ ప్రధాన శాఖలు వాయుదళం, నౌకాదళం, పాకిస్థాన్ మారిన్. వీటికి పాకిస్థాన్ పార్లలమెంటరీ ఫోర్స్ సహకారం అందిస్తుంది
 అణ్వాయుధపరిశోధనా నియంత్రణ, ఉద్యూగనియామకం, కమాండ్, కంట్రోల్, సమాచారం, కంప్యూటర్లు, ఇంటెలిజంస్, సర్వైలెంస్, న్యూక్లియర్ కామాండ్ కంట్రోల్ సైనికదళం బాధ్యతలో భాగంగా ఉంటాయి.
 యునైటెడ్ స్టేట్స్, టర్కీ, చైనా దేశాలు పాకిస్థాన్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటూ పాకిస్థాన్‌కు అవసరమైన ఆయిధాలను సరఫరాచేస్తూ ఉన్నాయి. తరచుగా చైనా, టర్కీ దేశాలతో కలిసి సైనిక శిక్షణ నిర్వహించబడుతుంది.
 1947 నుండి జమ్ము కాశ్మీర్‌లో నాలుగుమార్లు ఇండో- పాక్ యుద్ధాలు జరిగాయి. 1947లో పాకిస్థాన్ పశ్చిమ కాశ్మీర్ భూభాగాన్ని (అజాద్ కాశ్మీర్), గిల్హిత్, బలూచీస్థాన్ స్వంతం చేసుకుంది. ఇండియా తూర్పు పాకిస్థాన్‌ను స్వంతం చేసుకుంది. 1963లో జరిగిన యుద్ధంలో తూర్పు బెంగాలీ శరణార్ధుల సమస్య తలెత్తింది. ఈ కారణంగా 1971 ఇండో- పాక్ యుద్ధం జరిగింది. కార్గిల్ వద్ద సంభవించిన సంఘర్షణ ఫలితంగా 1999లో మరొక మారు ఇండో- పాక్ యుద్ధం సంభవించింది. 1947 నుండి ఆఫ్ఘన్ పాక్ సరిహద్దు సమస్యలు సైక తురుగుబాటుకు కారణం అయింది. 1961లో  ఆఫ్ఘన్ సరిహద్దులో బజౌర్ ఏజెంసీ వద్ద 
ఉన్న పాకిస్థాన్ సైనికదళం తిరుగుబాటు చేసింది.

పాకిస్థాన్ ఐఖ్యరాజ్యసమితి శాంతిపరిరక్షణ దళంలో (యునైటెడ్ నేషంస్ పీస్ కీపింగ్ మిషంస్) భాగస్వామ్యం వహిస్తుంది. 1993 లో సోమాలియా మొగదిష్ వద్ద చిక్కుకుపోయిన అమెరికన్ సైనికులను విడిపించడానికి పాకిస్థాన్ ప్రధానపాత్ర వహించింది. యునైటెడ్ నేషంస్ నివేదికలో  యు.ఎన్ పీస్ కీపింగ్ మిషన్‌లో పాకిస్థాన్ సైనికులు అధికసంఖ్యలో ఉన్నారని  తెలిపింది.
పాకిస్థాన్ కొన్ని అరబ్ దేశాల రక్షణ బాధ్యత వహిస్తూ సైనికులను నియమించింది. అలాగే సౌనిక శిక్షణ , సలహాసంప్రదింపుల బాధ్యత వహిస్తుంది. 
 1967 లో పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ , పాకిస్థాన్ నౌకాదళ ఫైటర్ పైలట్లు మిడిల్ ఈస్ట్ సైనిక దళంగా నిలిచి సారెల్‌కు వ్యతిరేకంగా ఆరు రోజుల యుద్ధం , యోం కిప్పూర్ యుద్ధంలో పోరాడారు. 1973 లో పాకిస్థాన్ ఫైటర్ పైలట్లు ఆరు రోజుల యుద్ధంలో ఇజ్రేల్ విమానాలను కూల్చారు.

దక్షిణాసియా నైరుతిలో ఉన్న కాశ్మీర్ భూభాగం విషయంలో భారత్ పాక్ మద్య నిరంతర వివాదాలు కొనసాగుతున్నాయి. భారత్ – పాక్ కాశ్మీర్ వివాదం కొరకు భారత్ – పాక్ బృహత్తర ప్రణాళికతో మూడుమార్లు (1947, 1965, 1971) యుద్ధం జరిగింది. 1971 యుద్ధం పాకిస్థాన్ షరతులు లేని లొంగుబాటుకు సాక్ష్యంగా నిలిచింది. అలాగే ఆసమయంలో జరిగిన సిమ్లా ఒప్పందం కారణంగా బంగ్లాదేశ్కు పూర్తి స్వాతంత్ర్యం లభించింది. ఇతర తీవ్రమైన సైనిక సంఘర్షణలలో 1984 జరిగిన సైచెన్ సంఘర్షణ , 1999 లో జరిగిన కార్గిల్ యుద్ధం గుర్తించతగినవి. రాజాస్థానంగా ఉన్న లడక్ , సైచెన్‌తో చేరిన జామ్మూ – కాశ్మీర్ భూభాగంలో షుమారు 45.1% కాశ్మీర్ భూభాగం భారత్ ఆధీనంలో ఉంది. యుద్ధంలో  పాకిస్థాన్ ఆక్రమిత ప్రదేశం  కాశ్మీర్‌లో(అజాద్ కాశ్మీర్ , గిల్జిత్-బలూచీస్థాన్) 38% ఉంది. కాశ్మీర్ వివాదానికి 1947లో భారత్ పాక్‌లను విభజించిన సమయంలో బ్రిటిష్ ఆధిపత్యం తీసుకున్న నిర్ణయం మూలంగా ఉంది. విభజన సమయంలో కాశ్మీర్ భూభాగం పాక్‌తో విలీనం చేయాలా లేక భారత్‌తో విలీనం చేయాలా లేక స్వతంత్రదేశంగా ఉండాలా అన్న విషయం రాజాస్థానం అయిన కాశ్మీర్‌కు ఇవ్వాలని బ్రిటిష్ ప్రభుత్వ నిర్ణయానికి భారత్ - పాక్‌లు అంగీకరించాయి. కాశ్మీర్ మహారాజు తనరాజ్యాన్ని హరిసింగ్ భారత్‌తో విలీనం చేయడానికి అంగీకరించాడు. 
 పాకిస్థాన్ ముస్లిం ప్రజల ఆధిఖ్యత , భౌగోళికం ఆధారంగా కాశ్మీర్ భూభాగాన్ని కోరుకున్నారు. అదే కారణాలతో రెండు స్వతంత్ర రాజ్యాలు కావాలని కోరుకున్నారు.

భారత్ వివాదాన్ని 1948 లో ఐఖ్యరాజ్యసమితి వరకు తీసుకువెళ్ళారు.

 భారత్ మాత్రం సిమ్లా ఒప్పందం (1972) ఆధారంగా కాశ్మీర్ అఖండ భారతంలో భాగమని వాదించింది. సమీపకాలంలో స్వతంత్ర కాశ్మీర్ ఉద్యమం ఫలితంగా కాశ్మీర్ భారత్-పాక్ నుండి విడివడి స్వతంత్రంగా ఉండగలదని భావిస్తున్నారు.

ఫెడరల్ ప్రభుత్వం , పాకిస్థాన్ పోలీస్ వ్యసస్థ పాకిస్థాన్ చట్టం అమలు బాధ్యత వహిస్తుంది. పాకిస్థాన్‌లోని నాలుగు ప్రాంతాలు , రాజధాని ఇస్లామాబాద్ ప్రాంతాలకు విడివిడిగా పోలీస్ దళం ఉంటుంది. ఫెడరల్ స్థాయిలో పాకిస్థాన్‌లో పలు ఇంటెలిజంస్ బృందాలు పనిచేస్తుంటాయి. వీటిలో ఫెడరల్ ఇంవెస్టిగేషన్ ఏజెంసీ, ఇంటెలిజంస్ బ్యూరో, , నేషనల్ హైవేస్ , మోటర్వే భాగంగా ఉన్నాయి. అలాగే పలు పాకిస్థాన్ పార్లమెంటరీ బలగాలలో నేషనల్ గార్డ్ ఆఫ్ పాకిస్థాన్, పాకిస్థాన్ ఉత్తరభూభాగాలు, పాకిస్థాన్ రేంజర్లు (పంజాబు పాకిస్థాన్) , సరిహద్దు దళాలు ఖైబర్ పంఖుత్వా , బలూచీస్థాన్ భాగంగా ఉన్నాయి. 

సివిలియన్ పోలిస్ అధికారులలో అధికం పాకిస్థాన్ పోలీస్ వ్యవస్థలో భాగంగా ఉన్నారు. అవి నాలుగు ప్రాంతాలకు చెందిన అడిమినిస్ట్రేట్ యూనిట్లుగా ఉన్నాయి. ఇవి వరుసగా పంజాబు (పోలీస్), సింధు (పోలిస్), ఖైబర్ పంక్తువా (పోలీస్) , బలూచీస్థాన్ (పోలీస్) ఉన్నాయి. వీటికి ఇంస్పెక్టర్ జనరల్స్ ఆధిపత్యం వహిస్తారు. రాజధాని ఇస్లామాబద్ భూభాగానికి వేరుగా పోలీస్ వ్యవస్థ (కాపిటల్ టెర్రిటరీ పోలీస్), ఉంది. ది క్రైం ఇన్వెస్టిగేట్ డిపార్ట్మెంటు అఫ్ పాకిస్థాన్ నేరవిభాగానికి బాధ్యత వహిస్తూ ప్రాంతీయ పోలీస్ వ్యవస్థలో ప్రధానపాత్ర వహిస్తారు. 

పాకిస్థాన్ చట్టం అమలు విభాగంలో జాతీయరహదార్లు , మోటర్వేలు పోలీస్ భాగంగా ఉంది. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక పోలీస్ విభాగం ఉంది. నేషనల్ కౌంటర్ టెర్రరిజం అథారిటీ కూడా అందులో భాగంగా ఉంది. ప్రముఖుల రక్షణ కొరకు ఒక కౌంటర్ టెర్రరిజం విభాగం పనిచేస్తుంది. పంజాబు పాకిస్థాన్ , సింధు, పాకిస్థాన్ రేంజర్లు యుద్ధభూమిలో సేవలు అందిస్తారు. వారు పోలీస్ విభాగానికి సుఇచనలు ఇస్తూ చట్టం అమలుకు సహకారం అనిఫిస్తుంటారు. ఫ్రాంటియర్ క్రాప్స్ ఖైబర్ , బలూచూస్థాన్ ప్రాంతాలలో సేవలు అందిస్తున్నారు.

పాకిస్థాన్ భౌగోళికం , పాకుస్థాన్ వాతావరణం అత్యంత వైవిద్యం కలిగి ఉటుంది.  పాకిస్థాన్‌లో పలు వైవిధ్యమైన జంతుజాలం ఉంది. 
 పాకిస్థాన్ వైశాల్యం 7,96,095 చ.కి.మీ. ఇది దాదాపు ఫ్రాంస్ , యునైటెడ్ కింగ్డంల మొత్తం వైశాల్యానికి సమానం.

వైశాల్యపరంగా పాకిస్థాన్ అంతర్జాతీయంగా 36వ స్థానంలో ఉంది. వివాదాంశమైన కాశ్మీర్ వైశాల్యం చేర్చడం తేడాలలో వర్గీకరణలో వ్యత్యాసాలు ఉండవచ్చు. పాకిస్థాన్ అరేబియన్ సముద్రతీరం , గల్ఫ్ ఆఫ్ ఓమన్ సముద్రతీరం మొత్తం  పొడవు 1046 కి.మీ. పాకిస్థాన్ భూభాగం సరిహద్దు మొత్తం పొడవు 6774కి.మీ ఇందులో ఆఫ్ఘనిస్థాన్ – పాకిస్థాన్ సరిహద్దు పొడవు 2430 కి.మీ., పాకిస్థాన్- చైనా సరిహద్దు పొడవు 523 కి.మీ., భారత్ – పాకిస్థాన్ 2912 కి.మీ , పాకిస్థాన్ – ఇరాన్ సరిహద్దు పొడవు 909 కి.మీ. పాకిస్థాన్ సముద్రతీరాన్ని ఓమన్‌తో  పంచుకొంటూ ఉంది. , పాకిస్థాన్ ఓమన్ లను తజకిస్థాన్ కోల్డ్, నేరో వాఖన్ కారిడార్ వేరుచేస్తుంది. భౌగోళికంగా పాకిస్థాన్ దక్షిణాసియా, మిడిల్ ఈస్ట్ , మద్య ఆసియా లలో ప్రాధాన్యత కలిగిన భూభాగంలో ఉంది.

భౌగోళికంగా పాకిస్థాన్‌లోని సింధ్ , పంజాబు భూభాగాలు ఇండియన్ టెక్టానిక్ ప్లేట్‌లో ఉంది. పాకిస్థాన్‌లోని బలూచీస్థాన్ , కైబర్ పఖ్తుంఖ్య లోని అధిక భాగం యురేషియన్ ప్లేట్‌లో (ప్రధానంగా ఇరానియన్ ప్లేట్) ఉంది. గిల్జిత్ – బలూచీ స్థాన్ , కాశ్మీర్ ఇండియన్ ప్లేట్ అంచున అధికంగా భూంపాలు సంభవించడానికి ప్రాంతంలో ఉంది. దక్షిణ పాకిస్థాన్‌లో సముద్రతీరంలో గ్లాసియేటెడ్ పర్వతాలు ఉన్నాయి. ఉత్తర పాకిస్థాన్‌లో మైదానాలు, ఎడారులు , పీఠభూములు ఉన్నాయి. 

పాకిస్థాన్ భౌగోళికంగా ఉత్తర ఎగువ భూములు, సింధూనదీ మైదానం , బలూచీస్థాన్ పీఠభూమి మూడు ప్రధాన భాగాలుగా విభజించబడింది.

ఉత్తర ఎగువభూములలో కరకొరం, హిందూ కుష్ , పామిర్ పర్వతం మొదలైన పర్వతశ్రేణులు ఉంటాయి. ఇక్కడ ఎత్తైన శిఖరాలు కూడా ఉన్నాయి. వీటిలో 14  ఎయిట్ తౌజండర్స్ పర్వతశిఖరాలలో 5 పాకిస్థాన్‌లో ఉన్నాయి. ఇవి అంతర్జాతీయ పర్వతారోహకులను పాకిస్థాన్‌ వైపు ఆకర్షిస్తున్నాయి. పర్వతారోహకులను ఆకర్షించే శిఖరాలలో కె-2 ఎత్తు 8611మీ , నంగా ప్రభాత్ ఎత్తు 8126 మీ శిఖరాలు ప్రధానమైనవి.

బలూచిస్థాన్ పీఠభూమి థార్ ఎడారి తూర్పున ఉంది. దేశంలో 1609 కి.మీ పొడవున సింధూనది దాని ఉపనదులు కాశ్మీర్ నుండి అరేబియన్ సముద్రం వైపు ప్రవహిస్తున్నాయి. పంజాబుకు సింధూనది విస్తారమైన సారవంతమైన మట్టిని చేరుస్తూ ఉంటుంది.

పాకిస్థాన్ వాతావరణం ఉష్ణమడల వాతావరణానికి అతీతంగా కొంచెం వ్యత్యాసంగా ఉంటుంది. సముద్రతీర ప్రాంతంలో పొడి వాతావరణం నెలకొని ఉంటుంది. వర్షాకాలంలో అధిక వర్షపాతం కారణంగా తరచుగా వరదలు సంభవిస్తుంటాయి. అలాగే పొడి సీజన్లో తక్కువ వర్షం లేక అసలు వర్షాలు పడకుండా ఉంటుంది. పాకిస్థాన్ వాతావరణాన్ని నాలుగుగా విభజించవచ్చు. పొడిగా ఉండే శీతల వాతావరణం (డిసెంబర్ – ఫిబ్రవరి), వేడిగా పొడిగా ఉండే వసంతకాలం (మార్చ్ – మే), వేసవి , వర్షాకాలం (జూన్ – సెప్టెంబర్), వర్షాకాలాంతర సీజన్ అక్టోబర్ –నవంబర్. 

భౌగోళిక , వాతావరణ వ్యత్యాసాలు అత్యధిక జాతుల చెట్లు , మొక్కలు పుష్కలంగా పెరగడానికి దోహదం చేస్తుంది. పాకిస్థాన్‌లో కోనిఫెరస్, ఆల్పైన్ , సుబల్‌పైన్ మొదలైన వైవిద్యమైన అరణ్యాలు ఉన్నాయి. ఉత్తర భూభాగంలోని పర్వతాలలో అరణ్యాలలో స్రౌస్, పైన్ , దేవదారు చెట్లు అధికంగా కనిపిస్తుంటాయి. సులైమాన్ పర్వతాలలో మల్బరీ మొదలైన డెసిడ్యుయస్ చెట్లు అధికంగా ఉంటాయి. దక్షిణ భూభాగంలోని బలూచిస్థాన్, సింధ్ , పంజాబు ప్రాంతాలలో కొబ్బరి , ఫోనిక్స్ చెట్లు అధికంగా ఉంటాయి. పశ్చిమ పర్వతాలలో యూనిపర్, టమరిస్క్, పదునుగా ఉండే గడ్డి , పొదలు ఉంటాయి. దక్షిణంలో ఉన్న సముద్రతీర తడిభూములలో మాంగ్రోవ్ అరణ్యాలు ఉంటాయి. 
.

కొనిఫెరౌస్ అరణ్యాలు సముద్రమట్టానికి 1000-4000 మీటర్ల ఎత్తున ఉత్తరం , వాయవ్య భూభాగంలో ఉంటాయి. పొడారిన బలూచీస్థాన్ భూభాగంలో తాటి, ఈత వంటి ఏకదళబీజ చెట్లు, ఎఫెద్ర చెట్లు కనిపిస్తుంటాయి. పంజాబు , సింధ్ మొదలైన ట్రాపికల్ , సబ్ ట్రాపికల్ డ్రై అండ్ మాయిస్ట్ అరణ్యాలు ఉంటాయి. ఈ అరణ్యాలలో మల్బరీ, అకాసియా , యూకలిఫ్టస్ చెట్లు ఉంటాయి.2010 గణాంకాలను అనుసరించి పాకిస్థాన్‌లోని అరణ్యాల వైశాల్యం 2.2%.

పాకిస్థాన్‌ వాతావరణ వైవిధ్యం కలిగి ఉంది. పాకిస్థాన్‌లో దాదాపు 668 పక్షిజాతులు కనిపిస్తుంటాయి.
సాధారణంగా కాకులు, ఉడుతలు, మైనాలు, హాక్, ఫాల్కన్ , గద్దలు కనిపిస్తుంటాయి. పాలాస్ (కొహిస్థాన్)లో గుర్తించతగినంగా వెస్టర్న్ ట్రాగోపన్ ఉన్నాయి.
. పాకిస్థాన్‌లో యూరప్, మద్య ఆసియా , భారత్ నుండి వలస వస్తున్న పలు వలస పక్షులు కనిపిస్తుంటాయి.

దక్షిణ భూభాగంలోని మైదానాలలో ముంగిసలు, పునుగు పిల్లి, కుందేళ్ళు, ఆసియాటిక్ నక్క, భారత పంగోలిన్, ఎడారి పిల్లి , అడవి పిల్లి ఉన్నాయి. సింధూ ప్రాంతంలో ముగ్గర్ మొసళ్ళు ఉన్నాయి. పరిసర ప్రాంతాలలో అడవి పంది, జింక , ముళ్ళపంది , ఎలుకలు కనిపించడం సాధారణం. మద్య పాకిస్థాన్‌లో ఉన్న దిగువన ఉన్న  ఇసుక భూములలో ఆసియాటిక్ నక్కలు, చారల హైనా, అడవి పిల్లులు , చిరుతలు ఉన్నాయి. అనకూల వాతావరణ కారణంగా చెట్లు తాక్కువగా ఉండడం, జింకలు మేయడం వలన వన్యమృగాలు ఎడారిభూములలో జంతువులు భద్రతలేని స్థితిలో ఉన్నాయి.  చోలిస్థాన్‌లో స్వల్పంగా చింకారాలు కనిపిస్తుంటాయి. పాకిస్థాన్- భారత్ సరిహద్దులో చోలిస్థాన్‌లో కొన్ని ప్రాంతాలలో స్వల్పసంఖ్యలో నీల్ గాయ్ కనిపిస్తుంటుంది. ఉత్తర భూభాగంలోని పర్వతాలలో మార్కోపోలో గొర్రె, ఉరియల్, మార్ఖొర్ , ఐబెక్స్ మేకలు, ఆసియన్ బ్లాక్ బియర్ , హిమాలయన్ బ్రౌన్ బియర్ మొదలైన పలు జాతుల జంతువులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో అరుదుగా మంచు చిరుతలు, , ఆసియన్ చిరుతలు. సింధ్ ప్రాంతంలో సంరక్షితప్రాంతంలో బ్లైండ్ ఇండస్ రివర్ డాల్ఫిన్ ఉన్నాయి. అంతరించి పోతున్న దశలో ఇవి 1,100 మాత్రమే మిగిలి ఉన్నాయని భావిస్తున్నారు. . పాకిస్థాన్  ప్రాంతంలో  174 క్షీరదాలు, 177 సరీసృపాలు, 22 ఆఫిబియన్లు, 198 మంచినీటి చేపలు, 5,000 అకశేరుకాలు నమోదు చేయబడ్డాయి.

పాకిస్థాన్ వృక్షజాలం , జంతుజాలం పలు సమస్యలు ఎదుర్కొంటున్నాది. అరణ్యాల నరికివేతలో పాకిస్థాన్ అంతర్జాతీయంగా రెండవ స్థానంలో ఉంది. వేట , వాతావరణ కాలుష్యం పర్యావరణం మీద తీవ్రప్రభావం చూపుతున్నాయి.

ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఐ.యు.సి.ఎన్ గుర్తింపు పొందిన 157 సంరక్షిత ప్రాంతాలు ఉన్నాయి. ఆధునిక సరక్షిత ప్రాంతాల చట్టం అనుసరించి పాకిస్థాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ పార్క్‌లో 
వన్యమృగాలు తమ సహజసిద్ధ వాతావరణంలో తిరుగాడుతూ ఉన్నాయి. బహవల్పూర్ వద్ద ఉన్న లాల్ సుహంరా నేషనల్ పార్క్ 1972 లో స్థాపించబడింది. 
 ఇది పాకిస్థాన్‌లోని ఒకేఒక బయోస్ఫేర్ రిజర్వ్ గా గుర్తించబడుతుంది. గిల్జిత్ బల్తిస్థాన్ వద్ద ఉన్న సెంట్రల్ కరకొరం నేషనల్ పార్క్ దేశంలోని అతిపెద్ద నేషనల్ పార్క్‌గా గుర్తించబడుతుంది. దీని వైశాల్యం 13,90,100 చ.హె. పాకిస్థాన్‌లోని అతి చిన్న నేషనల్ పార్క్ అయూబ్ నేషనల్ పార్క్  వైశాల్యం 931 చ.హె.

పాకిస్థాన్ వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న దేశం. అలాగే తరువాతి 11 దేశాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. ప్రపంచపు బృహత్తర ఆర్ధికశక్తి  కలిగిన 21 దేశాలలో ఒక దేశంగా మారడానికి అవకాశం ఉన్న దేశాలలో పాకిస్థాన్ ఒకటి అని భావిస్తున్నారు.

దశాబ్ధాలుగా దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరత కారణంగా 2013 నాటికి పాకిస్థాన్ తీవ్రమైన ఆర్ధికలోటును ఎదుర్కొన్నది. తత్కారణంగా తీవ్రమైన నిర్వహణా లోపం , క్రమపరచడానికి వీలుకాని ఆర్ధిక సమస్యలను ఎదుర్కొన్నది. అలాగే కనీసావసారాలైన రైల్వే సేవలను , విద్యుత్తు ఉత్పత్తిని అందించడానికి అవసరమైన పునరుద్ధరణ , అభివృద్ధిచేయడానికి వీలుకాని పరిస్థితితులు ఎదుర్కొన్నది. పాకిస్థాన్ ఆర్ధికరంగం సెమీ ఇండస్ట్రిలైజ్‌గా భావిస్తున్నారు. సింధునదీ పరివాహక ప్రాంతాలు అభివృద్ధి చెంది ఉంది. పాకిస్థాన్ ఆర్ధికరంగం కారాచీ ఆర్ధికం , పంజాబు నగరప్రాంత ఆర్ధికంగా విభజించబడింది. ఇతరప్రాంతాలలో అభివృద్ధి తక్కువగా ఉంది. పాకిస్థాన్ 2011 జి. డి.పి202 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉండవచ్చని అంచనావేయబడింది. జి.డి.పి కొనుగోలు శక్తి 838.164 మిలియన్లు అమెరికన్ డాలర్లు.

తలసరి ఆదాయం జి.డి.పి. 1,197 అమెరికన్ డాలర్లు, కాపిటల్ జి.డి.పి 4,602 అమెరికన్ డాలర్లు , జి.డి.పి. ఋణశాతం 55.5%.
 ప్రపంచ బ్యాంక్ ఆర్ధికాభివృద్ధి కొరకు పాకిస్థాన్ వ్యూహాత్మకంగా కృషిచేస్తుందని భావిస్తుంది. సంఖ్యాపరంగా అభివృద్ధి చెందుతున్న పాకిస్థాన్ యువత దేశాభివృద్ధికి సరిపడినంత మానవవనరుల శక్తిని అందించగలదని భావిస్తున్నారు. అలాగే  దేశానికి అధికంగా సేవారంగ అభివృద్ధి , ఉపాధికల్పన వంటి సవాళ్ళను ఎదుర్కొనవలసిన అవసరం కూడా ఉంది. 2013 లో  ప్రపంచబ్యాంక్ వెలువరించిన నివేదిక ప్రపంచ ఆర్ధికశక్తిలో  పాకిస్థాన్ 24వ స్థానంలో ఉందని అలాగే కొనుగోలు శక్తిలో 45వ స్థానంలో ఉందని తెలుస్తుంది. 
దక్షిణాసియా దేశాలలో ఆర్ధికశక్తిలో పాకిస్థాన్ రెండవ స్థానంలో ఉంది. దక్షిణాసియా ఆర్ధికంలో పాకిస్థాన్ ఆర్ధికరంగ జి.డి.పి 15% ఉంది.
పాకిస్థాన్ ఆరంభం నుండి ఆర్ధికాభివృద్ధి వైవిధ్యం కలిగి ఉంది. డెమాక్రసీ సమయంలో ఆర్ధికాభివృద్ధి వేగం తక్కువగా ఉన్నప్పటికీ మార్షల్ లా అమలులో ఉన్న మూడు కాలాలో అద్భుతంగా ఉంది. అయినప్పటికీ సమానమైన , స్థిరమైన దేశాభివృద్ధికి సరైన పూనాదులు నిర్మించబడలేదు. .

పాకిస్థాన్ ఫిజికల్ పాలసీకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సహకరిస్తుంది. తరువాత సంవత్సరం ఆసియన్ డెవెలెప్మెంటు బ్యాంక్ నివేదిక పాకిస్థాన్ ఆర్ధిక సంక్షోభం తగ్గిందని తెలియజేసింది.
. 2010-11 ఫిజికల్ ఇంఫ్లేషన్ శాతం 14.1%.

జనవరి 2014 ట్రేడ్ ఆర్గనైజేషన్ సర్వే జపాన్ కంపెనీలతో వాణిజ్య సంబంధాలు అధికంగా ఉన్న దేశాలలో  తైవాన్ తరువాత స్థానంలో పాకిస్థాన్ ఉందని వెల్లడించింది. 27 జపాన్ కంపెనీలకు పాకిస్థాన్‌తో వ్యాపారసంబంధాలు ఉన్నాయని భావిస్తున్నారు.

ముడిసరుకు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్న దేశాలలో పాకిస్థాన్ ఒకటి. పాకిస్థాన్ శ్రామికశక్తి ప్రపంచంలో 10వ స్థానంలో ఉంది. పాకిస్థాన్ నుండి 11 మిలియన్ల ఉద్యోగులు యునైటెడ్ స్టేట్స్‌లో పనిచేస్తూ 11.2 బిలియన్ల అమెరికండాలర్లు పాకిస్థాన్‌కు పంపి పాకిస్థాన్ ఆర్ధికంగా 2011-12 ఫిజికల్ ఇయర్‌కు సహకరిస్తున్నారు.. 
పాకిస్థాన్ ప్రజలు ప్రధానంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ స్టేట్స్, సౌదీ అరేబియా, అరబ్ స్టేట్స్ ఆఫ్ ది పర్షియన్ గల్ఫ్, బహరియన్, కువైత్, కతార్ , ఓమన్, ఆస్ట్రేలియా, 
కెనడా, జపాన్, యునైటెడ్ కిండం, నార్వే , స్విడ్జర్లాండ్ దేశాలలో పనిచేస్తున్నారు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నివేదిక అనుసరించి అంతర్జాతీయంగా పాకిస్థాన్ ఎగుమతులు తగ్గాయని ప్రపంచస్థాయిలో 2007 లో పాకిస్థాన్ ఎగుమతులు 0.128% ఉందని పేర్కొన్నది. 2010-11 ట్రేడ్ లోటు 11.217 అమెరికన్ డాలర్లు.

పాకిస్థానీ ఆర్ధికనిర్మాణం వ్యవసాయం నుండి సేవల వైపు మార్చబడింది. 2010 వ్యవసాయం జి.డి.పి లో 21.2%. ఐఖ్యరాజ్యసమితి  ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్  నివేదిక అనుసరించి 2005 పాకిస్థాన్ 21,591,400 మెట్రిక్ టన్నుల గోధుమ ఉత్పత్తి చేసిందని ఇది ఆఫ్రికా గోధుమ ఉత్పత్తికంటే (20,304,585 మెట్రిక్ టన్నులు) అధికమని , దక్షిణ అమెరికా గోధుమ ఉత్పత్తికి (ఇది 20,304,585 మెట్రిక్ టన్నులు) సమీపంలో ఉందని తెలియజేస్తుంది.

పుష్కలమైన అవకాశం ఉన్నప్పటికీ రాజకీయ అస్థిరత అందుకు ఆడ్డుగా నిలుస్తుంది.

పాకిస్థాన్ నిర్మాణ రంగం , ఆఫ్ఘనిస్థాన్ అవసరాల కారణంగ పాకిస్థాన్ సిమెంటు కంపెనీలూ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. 2013 లోపాకిస్థాన్ 7,708,557 మెట్రిక్ టన్నుల సిమెంటు ఎగుమతి చేసింది. . 2012-2013  పాకిస్థాన్ సిమెంటు ఉత్పత్తి 44,768,250 , క్లింకర్ ఉత్పత్తి 42,636,428. పాకిస్థాన్ ఆర్ధిక రంగంలో సిమెంట్ పరిశ్రమ ప్రధానపాత్ర వహిస్తుంది.

పాకిస్థాన్ స్టేట్ బ్యాంక్ నివేదిక అనుసరించి 2010 లో పాకిస్థాన్ రాజకీయ అస్థిరత కారణంగా విదేశీ పెట్టుబడి గుర్తించతగినంత 54.6% తగ్గింది. 

పాకిస్థాన్ టెక్స్‌టైల్ పరిశ్రమ పాకిస్థాన్ ఎగుమతులలో కీలకపాత్ర వహిస్తుంది. పాకిస్థాన్  టెక్స్‌టైల్ ఉతపత్తుల ఎగుమతిలో పాకిస్థాన్ ఆసియాలో 8 వ స్థానంలో ఉంది. పాకిస్థాన్ జి.డి.పి టెక్స్‌టైల్ రంగం  లో 9.5% భాగస్వామ్యం వహిస్తుంది. టెక్స్‌టైల్ రంగం పాకిస్థాన్‌లో 1.5 కోట్లమందికి ఉపాధి కల్పిస్తుంది. 30% శ్రామికశక్తి టెక్స్‌టైల్ రంగంలో పనిచేస్తుంది. దేశంలో పనిచేస్తున్న శ్రామికుల సంఖ్య 4.9 కోట్లు. పాకిస్థాన్ పత్తి ఉతపత్తిలో ఆసియాలో 4 వ స్థానంలో ఉంది. స్పిన్నింగ్ శక్తిలో 3వ స్థానంలో ఉంది (మొదటి రెండు స్థానాలలో చైనా , భారత్ ఉన్నాయి). పాకిస్థాన్ అంతర్జాతీయ స్పిన్నింగ్ శక్తిలో 5% భాగస్వామ్యం వహిస్తుంది. పాకిస్థాన్ టెక్స్‌టైల్స్ అధికంగా కొనుగోలు చేస్తున్న దేశాలలో చైనా ద్వితీయ స్థానంలో ఉంది. చైనా పాకిస్థాన్ నుండి పత్తి, పత్తి నూలు , పత్తి వస్త్రాలు దిగుమతి చేసుకుంటుంది. యునైటెడ్ కింగ్డం మొత్త టెక్స్‌టైల్ దిగుమతులలో పాకిస్థాన్  3.3% (1.07 బిలియన్ల అమెరికన్ డాలర్లు) , చైనా 12.4% (4.61 బిలియన్ల అమెరికన్ డాలర్లు), యునైటెడ్ స్టేట్స్ 2.98% (2.98 బిలియన్ల అమెరికన్ డాలర్లు), జర్మన్ 1.6% (0.88 బిలియన్ల అమెరికన్ డాలర్లు), భారత్ 0.8% (0.888 బిలియన్  అమెరికన్ డాలర్లు) భాగస్వామ్యం వహిస్తుంది. .

పాకిస్థాన్ బ్యాంకింగ్ రంగం క్రమంగా అభివృద్ధి చెందుతూ ఉంది. బ్యాంకింగ్ రంగానికి విదేశీ , స్వదేశీ మదుపుదార్లు భాగస్వామ్యం వహిస్తున్నారు. బ్యాంకుల మద్య పోటీ అధికరిస్తూ ఉంది. దీర్ఘకాల ప్రయోజనాలు వంటి ఆకర్షణీయమైన పధకాలతో వాడుకరులను ఆకర్షించడంలో బ్యాంకులు పోటీ పడుతున్నాయి. పాకిస్థాన్‌లో 6 ఫుల్ ప్లెడ్జ్డ్ ఇస్లామిక్ బ్యాంకులు , 13 కాన్వెన్షనల్ బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి. ఇస్లామిక్ బ్యాంకింగ్ , ఇస్లామిక్ ప్రభావిత కాన్వెన్షనల్ బ్యాంకులు పాకిస్థాన్ బ్యాంకు వ్యవస్థలో 9.7%. భగస్వామ్యం వహిస్తున్నాయి.

 న్యూక్లియర్ పవర్ ప్లాంటులను నిర్మించి పాకిస్థాన్ ముస్లిం దేశాలలో ఆణుశక్తిని ఉపయోగించిన మొదటి దేశంగా గుర్తింపు పొందింది. ఈ ప్లాంటుల నిర్వహణ బాధ్యతను  పాకిస్థాన్ అటామిక్ ఎనర్జీ కమీషన్, ది సైంటిఫికండ్ న్యూక్లియర్ గవర్నమెంటల్ అథారిటీ వహిస్తున్నాయి. పాకిస్థాన్ న్యూక్లియర్ రెగ్యులేటరీ అథారిటీ న్యూక్లియ ఉపయోగాన్ని నియంత్రిస్తుంది.

 
పాకిస్థాన్‌లో ఉత్పత్తి చేయబడుతున్న విద్యుత్తులో అణుశక్తి ప్లాంటులనుండి 5.8% లభిస్తుంది. ఫాసిల్ ఫ్యూయల్(పెట్రోలియం) శక్తి 62% లభిస్తుంది, జలవిద్యుత్తు  29.9% లభిస్తుంది , కోయల్ పవర్ ప్లాంటు నుండి 0.3% విద్యుత్తు లభిస్తుంది. పాకిస్థాన్ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో లేని నాలుగు దేశాలలో పాకిస్థాన్ (మిగిలిన దేశాలు ఇండియా, ఇజ్రేల్ , నార్త్ కొరియా) ఒకటి. అయినప్పటికీ పాకిస్థాన్ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెంసీ గుడ్ స్టాండిగ్‌లో సభ్యత్వం కలిగి ఉంది. 

వాణిజ్య అవసరాలకు ఉపకరిస్తున్న న్యూక్లియర్ పవర్ ప్లాంటుకు చైనా రిపబ్లిక్ ఆసక్తిగా సహకరిస్తుంది. ఆరంభకాలంలో న్యూక్లియర్ విద్యుత్తు అధారాల నుండి చష్మా రియాక్టర్ తయారుచేయబడింది.1971 లో చందా ద్వారా మొదటిసారిగా పాకిస్థాన్ మొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అయిన  ది కరాచీ న్యూక్లియర్ పవర్ ప్లాంటు  స్థాపించబడింది. తరువాత చైనా రిపబ్లిక్ పాకిస్థాన్ పారిశ్రామిక అభివృద్ధి కొరకు న్యూక్లియర్ పవర్ ప్లాంటును పాకిస్థాన్‌కు విక్రయించింది. 2005 లో చైనా- పాకిస్థాన్‌లు జాయింట్ ఎనర్జీ సెక్యూరిటీ ప్లాన్ కొరకు సమఖ్యంగా పనిచేసాయి. 

పాకిస్థాన్ విద్యుత్తు ఉత్పత్తి పలు పరిశ్రమలకు విద్యుత్తును అందిస్తుంది. అలాగే పాకిస్థాన్ లోని నాలుగు విభాగాలకు సమానంగా విద్యుత్తును అందిస్తుంది. కారాచీ లోని  కె.ఎలెక్ట్రిక్ 

, వాటర్ , పవర్ డెవలెప్మెంటు అథారిటీ అత్యధికంగా విద్యుత్తును ఉత్పత్తి చేసి దేశానికి ఆదాయం అందిస్తుంది. 
 2014 లో పలు ప్రాజెక్ట్‌ల ద్వారా 22,797 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయబడింది.

పాకిస్థాన్ న్యూక్లియర్ రెగ్యులేటరీ అథారిటీ నుండి అనుమతి పొందిన పాకిస్థాన్ అటామిక్ ఎనర్జీ కమీషన్ మూడు వాణిజ్య అణువిద్యుత్తు కేంద్రాల నుండి అణువిద్యుత్తు ఉత్పత్తి చేస్తుంది. 
 న్యూక్లియర్ పవర్ ప్రోగ్రాం కలిగిన ఒకేఒక ముస్లిం దేశం పాకిస్థాన్  పాకిస్థాన్ విద్యుత్తు ఉత్పత్తిలో 5.8% అణువిద్యుత్తు నుండి ఉత్పత్తి చేయబడుతుంది. ధర్మల్ పవర్ స్టేషన్ నుండి 64% విద్యుత్తు ఉత్పత్తి చేయబడుతుంది. హైడ్రాలిక్ పవర్ నుండి 29.9% విద్యుత్తు ఉత్పత్తి చేయబడుతుంది.కోయల్ ఎలెక్ట్రిసిటీ నుండి 0.3% విద్యుత్తు చేయబడుతుంది.

పాకిస్థాన్ ఉత్తర ప్రాంతంలో అనేక పురాతన కోటలు ఉన్నాయి. పురాతన నిర్మాణాలు, హంజాలోయ, చిత్రల్ లోయ ప్రాంతాలలో ఇస్లామిక్ పూర్వ నాస్తిక కలాషా ప్రజలు గ్రీక్ వీరుడు అలెగ్జాండర్ సంతతి వారని భావిస్తున్నారు. పాకిస్థాన్ సంస్కృతిక రాజధాని లాహోర్‌లో మొఘల్ నిర్మాణాలకు ఉదాహరణగా ఉన్నాయి. వీటిలో బాద్షాహీ మసీదు, షాలిమార్ గార్డెంస్ (లాహోర్), జహంగీర్ సమాధి , లాహోర్ కోట ప్రధానమైనవి. ఇవి పర్యాటకులను ఆకర్షించడంలో ప్రధానపాత్ర వహిస్తున్నాయి. . 2015 అంతర్జాతీయ ఆర్ధిక సంక్షోభానికి ముందు పాకిస్థాన్‌ను వార్షికంగా 5 లక్షల మంది పర్యాటకులు సందర్శించారు. 2008 నుండి అస్థిరత కారణంగా పర్యాటకుల సంఖ్య తగ్గింది.

 5 ప్రాంతాలలో తక్షశిల, లాహోర్, కరకోం హైవే, కరీమాబాద్ (హుంజ) , సైఫుల్ ములక్ సరసు ఉన్నాయి. ఇవి అసమానమైన పాకిస్థాన్ సంస్కృతిక వారస్వత్వానికి వైవిధ్యానికి ఉదాహరణగా నిలిచాయి.2009 లో  ది వరల్డ్ ఎకనమిక్ ఫోరంస్ ట్రావెల్  టూరిజం కాంపిటీటివ్నెస్ రిపోర్ట్  ప్రపమంచ వారసత్వ సంపదలలో 25% పాకిస్థాన్‌లో ఉన్నాయి. సింధూ లోయలలో సింధూ నాగరిక చిహ్నాలు అధికంగా ఉన్న హరప్పా , మొహంజుదారోలు , 5,000 సంవత్సరాల మాంగ్రోవ్ వృక్షాలు ఉన్నాయి.

పాకిస్థాన్ ట్రాంస్‌పోర్ట్ జి.డి.పి.లో 10.5% భాగస్వామ్యం వహిస్తింది. పాకిస్థాన్ రహదారి రవాణా వ్యవస్థ భారత్, బంగ్లాదేశ్ , ఇండోనేషియా కంటే మెరుగ్గా ఉంటుంది. అయినప్పటికీ పాకిస్థాన్ రైల్వే వ్యవస్థ చైనా , భారత్ కంటే వెనుకబడి ఉంటుంది. అలాగే విమానవ్యవస్థ కూడా అభివృద్ధిచేయవలసిన అవసరం ఉంది. పాకుస్థాన్ జలమార్గవ్యవస్థ చాలా స్వల్పంగా ఉంటుంది. సముద్రతీర  నౌకావ్యవస్థ ప్రాతీయప్రజల అవసరాలను కొంతవరకు తీర్చుతూఉంది.

పాకిస్థాన్ ట్రాంస్‌పోర్ట్ వ్యవస్థకు వెన్నెముక వంటి పాకిస్థాన్ జాతీయరహదారి పొడవు 2,59,618కి.మీ. 91% ప్రయాణీకులు , 96% సరుకు రవాణాకు రహదారి ఆధారంగా ఉంది. రోడ్డు ట్రాంస్పోర్ట్ వ్యవస్థ అత్యధికంగా ప్రైవేట్ రంగం ఆధీనంలో ఉంది. సరుకు రవాణా వ్యవస్థ 95% ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్నాయి.  నేషనల్ హైవే అథారిటీ జాతీయరహదారి , మోటర్‌వేల నిర్వహణ బాధ్యత వహిస్తుంది. జాతీయరహదారి , మోటర్‌వే ఉత్తర- దక్షిణాలను కలుపుతూ దక్షిణ తీరంలో ఉన్న నౌకాశ్రయాన్ని పంజాబు , ఖైబర్ ప్రాంతాలతో అనుసంధానం చేస్తుంది. మొత్తం దేశరహదారి మార్గంలో 4.2% ఉన్న ఈ మార్గం 85% ట్రాఫిక్ ఆధారంగా ఉంది..

పాకిస్థాన్ రైల్వే మినిస్ట్రీ ఆఫ్ రైల్వే (పాకిస్థాన్) ఆధ్వర్యంలో పనిచేస్తుంది. 1947–1970 లో తరువాత దేశవ్యాప్తంగా రహదారుల నిర్మాణం , ఆర్ధికాభివృద్ధి కారణంగా పాకిస్థాన్ ఆటోమోటివ్ పరిశ్రమ అభివృద్ధి జరిగేవరకు పాకిస్థాన్ ప్రజల ప్రయాణాలకు రైలుమార్గం ప్రధానంగా ఉంది. 1990 నుండి ప్రయాణీకులు రైల్వే నుండి అధికస్థాయిలో రహదారి మార్గాల ప్రయాణాలు ఎంచుకోవడం ఆరంభం అయింది. పాకిస్థాన్‌లో ఆటోమోటివ్ పరిశ్రమ ప్రారంభించిన తరువాత ప్రజలు రహదారి మీద ఆధారపడ అధికరించింది. ప్రస్తుతం 10% పాకిస్థాన్ ప్రజలు రైప్రయాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. 4% సరికురవాణా రైళ్ళద్వారా జరుగుతుంది. వ్యక్తిగత ప్రయాణాలకు అధికంగా ఆటోమొబైల్ మీద ఆధాఅడుతున్నారు. 1990–2011 మద్య రైలు మార్గం పొడవు 8,775 నుండి 7,791 కుదించబడింది. పాకిస్థాన్ చైనా, ఇరాన్ , టర్కీ దేశాలతో వాణిజ్యం కొరకు రైల్వే సేవలలు వాడుకోవాలని ఎదురుచూస్తుంది.

పాకిస్థాన్‌లో దాదాపు మిలటరీ , సివిల్ ఉపయోగాలకు 139 విమానాశ్రయాలు ఉన్నాయి. జిన్నా ఇంటర్నేషనల్ విమానాశ్రయం పాకిస్థాన్ అంతర్జాతీయ ముఖద్వారంగా భావించబడుతుంది. అదనంగా పాకిస్థాన్‌లో ప్రధానంగా ఆలమా ఇంటర్నేషనల్ విమానాశ్రయం, బెనాజిర్ బుట్టో ఇంటర్నేషనల్ విమానాశ్రయం, పెషావర్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం, క్వెట్టా ఇంటర్నేషనల్ విమానాశ్రయం, ఫైసలాబాద్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం, సైలకోట్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం , ముల్తాన్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం మొదలైన విమానాశ్రయాలు ఉన్నాయి. పాకిస్థాన్ ఏవియేషన్ పరిశ్రమలు, జాతీయ , ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి. రాష్ట్రాలకు స్వంతమైన సంస్థలు దాదాపు 73% దేశీయ ప్రయాణాలు , సరుకురవాణా చేస్తున్నాయి. ఎయిర్ బ్లూ, షాహీన్ ఎయిర్ ఇంటర్నేషనల్ , ఎయిర్ ఇండస్ మొదలైన ప్రైవేట్ సంస్థలు తక్కువ ఖర్చుతో విమానసేవలు అందిస్తున్నాయి. 

పాకుస్థాన్‌లో ప్రధానంగా కరాచీ (పోర్ట్ ఆఫ్ కరాచీ), సింధ్ (పోర్ట్ ఆఫ్ క్వాసిం) మొదలైన నౌకాశ్రయాలు ఉన్నాయి. 1990 గ్వాడర్ పోర్ట్ , గడానీ షిప్ – బ్రేకింగ్ యార్డ్ నిర్మించున తరువాత నౌకాశ్రయ కార్యక్రమాలు బలూచీ స్థాన్‌కు మార్చబడ్డాయి. .

పాకిస్థాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాకిస్థాన్ మౌళికసదుపాయాల అభివృద్ధి , పాకిస్థాన్ ఆధునికీకరణలో ప్రభావవంతమైన పాత్రపోషిస్తుంది. పాకిస్థాన్ అకాడమీ ఆఫ్ సైంస్ , ఇంటర్నేషనల్ నథియాగలి సమ్మర్ కాలేజ్ కార్యక్రమాలలో పాల్గొనడానికి ప్రతిసంవత్సరం ప్రపంచం అంతటి నుండి నిపుణులను ఆహ్వానిస్తుంటారు.2005లో పాకిస్థాన్ అభివృద్ధి చెందుతున్న దేశాలలో భౌతికశాస్త్రం (ఫిజిక్స్ ఇన్ డెవెలెపింగ్ కంట్రీ) సెమినార్‌కు ఆతిథ్యం ఇచ్చింది. 

పాకిస్థాన్ థియరిటికల్ ఫిజిస్ట్ అబ్దుస్ సలాం తన ఎలెక్ట్రో వీక్ ఇంటరాక్షన్ కొరకు నోబుల్ బహుమతి అందుకున్నాడు.
పాకిస్థానీ శాస్త్రఙలు ఇంఫ్లుయంషియల్ పబ్లికేషన్స్ , క్రిటికల్ సైంటిఫిక్ వర్క్స్ ఇన్ ది అడ్వాంస్డ్ మాథమెటిక్స్, బయాలజీ, ఎకనమిక్స్, కంప్యూటర్ సైంస్ , జెనెటిక్స్ లలో దేశీయ , అంతర్జాతీయ స్థాయి విద్యను అందించాలని యోచిస్తున్నారు.

రసాయన శాస్త్రవేత్త సలీముజ్జామన్ సిద్దిక్వి వేపచెట్టు ఔషధీయ గుణాలను రసాయన ఉత్పత్తిదారుల దృష్టికి తీసుకువచ్చిన మొదటి పాకిస్థానీ శాస్త్రవేత్తగా గురింపు పొందాడు. 
. పాకిస్థానీ న్యూరోసర్జన్ అయూబ్ కె. ఒమ్మయ  ఒమ్మయ రిజర్వాయర్  , బ్రైన్ ట్యూమర్ , మెదడు సమస్యలకుపరిష్కార విధానాలుఆవిష్కరించాడు.

సైంటిఫిక్ రీసెర్చ్ , అభివృద్ధి పాకిస్థాన్ విశ్వవిద్యాలయాల్లో కీలకపాత్ర వహిస్తుంది. విశ్వవిద్యాలయాలు ప్రభుత్వసహకారంతో నేషనల్ పార్క్ , లాబరేటరీలు నిర్వహించబడుతున్నాయి. అలాగే సైంటిఫిక్ రీసెర్చ్ పాకిస్థాన్ పరిశ్రమలకు సహకారం అందిస్తుంది. 
 

పాకిస్థాన్‌లోని  స్పేస్ అండ్ అప్పర్ అట్మాస్పియర్ రీసెర్చ్ కమీషన్ ప్రొగ్రాం పాకిస్థాన్ చేసిన గుర్తించతగిన విన్యాసాలు , సాధనలు నమోదు చేసింది. ఈ ప్రయోగం పాకిస్థాన్ అంతరిక్ష ప్రయోగం చేసిన మొదటి దక్షిణాసియా దేశంగా చేసింది.1990 లో బాదర్ ఫస్ట్ శాటిలైట్ తాయారు చేసి విజయవంతంగా ప్రయోగించబడింది. ఈ ప్రయోగం పాకిస్థాన్‌కు అంతరిక్షంలో శాటిలైట్ నిలబెట్టిన మొదటి ముస్లిం దేశం , రెండవ దక్షిణాసియా దేశంగా గుర్తింపు తీసుకువచ్చింది. 1971 ఇండో పాక్ యుద్ధం తరువాత  పాకిస్థాన్ అండ్ వెపంస్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్  విదేశీ దండయాత్రలను అడ్డుకోవడానికి అణుబాంబును తయారుచేసింది.

భారత్‌తో పోటీ పాకిస్థాన్ అణుబాంబు పరిశోధన చేపట్టిన దేశాలజాబితాలో స్థానం పొందేలా చేసింది. 1988 లో చాగై న్యూక్లియర్ పరిశోధన తరువాత పాకిస్థాన్ అణుబాంబు తయారుచేసిన ఏడవదేశంగా గుర్తించబడింది.

పాకిస్థాన్ అంటార్కిటికా ప్రొగ్రాం స్థాపించిన తరువాత ఆటార్కిటికా పరిశోధన క్రియాశీలకంగా చేస్తున్న స్వల్పసంఖ్యలో ఉన్న దేశాలలో పాకిస్థాన్ ఒకటిగా గుర్తించబడుతుంది. పాకిస్థాన్ అంటార్కిటికా ప్రొగ్రాం పర్యవేక్షణలో అంటార్కిటాకాలో ఖండంలో రెండు రీసెర్చ్ స్టేషన్లు నిర్వహించబడుతున్నాయి. అలాగే సంవత్సరం అంతా పనిచేసేలా అదనపు బేస్ ఏర్పాటు చేయాలని భావిస్తుంది. 

 పాకిస్థాన్ కీలకమైన సాంకేతిక పబ్లికేషన్లను విడుదల చేస్తుంది. దేశీయంగా పాకిస్థాన్ సాధించిన సాఫ్ట్‌వేర్ అభివృద్ధి అంతర్జాతీయ ప్రశంశలు అందుకుంటుంది. అధికసంఖ్యలో అంతర్జాలం వాడుకుంటున్న 27 ప్రపంచ దేశాలలో పాకిస్థాన్ ఒకటి. 2000 నుండి  పాకిస్థాన్ సూపర్ కంప్యూటింగ్  లో పాకిస్థాన్ గుర్తించతగినంగా అభివృద్ధి సాధించింది. అలాగే పలు సంస్థలు పారలెల్ కంప్యూటింగ్  పరిశోధనలకు అవకాశం కల్పిస్తుంది. పాకిస్థాన్ ప్రభుత్వం ఇంఫర్మేషన్ టెక్నాలజీ ప్రాజెక్టుల కొరకు 4.6 బిలియన్లు వ్యయం చేస్తుంది. పాకిస్థాన్‌లో అధికంగా కంప్యూటర్ సాంకేతికతను మానవ వనరులు, మౌళిక వసతుల అభివృద్ధి, ఎ- గవర్నమెంటు వాడుకుంటున్నారు..

పాకిస్థాన్ ప్రజలకు ప్రాధమిక, సెంకండరీ స్థాయి విద్యను ఉచితంగా అందిస్తుంది.

పాకిస్థాన్ ప్రత్యేకదేశం అయిన తరువాత పాకిస్థాన్‌లో యూనివర్శిటీ ఆఫ్ పంజాబు విశ్వవిద్యాలయం ఒక్కటే ఉంది.

తరువాత పాకిస్థాన్ ప్రభుత్వం దేశంలో నాలుగు భూభాగాలలో వేగవంతంగా విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. అవి వరుసగా 1949లో సింధ్ యూనివర్శిటీ, 1950 లో పెషావర్ యూనివర్శీటీ, 1953 లో కరాచీ యూనివర్శిటీ , 1970 యూనివర్శిటీ ఆఫ్ బలూచీస్థాన్.  పాకిస్థాన్‌లో ప్రభుత్వ  విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ యూనివర్శిటీలు , పబ్లిక్ , ప్రైవేట్ యూనివర్శిటీలు ఉన్నాయి. పాకిస్థాన్ యూనివర్శిటీలు పరిశోధనలు , ఉన్నతవిద్యను అందిస్తున్నాయి. 
 పాకిస్థాన్‌లో 3193 ఒకేషనల్ విద్యాసంస్థలు ఉన్నాయి. పాకుస్థాన్‌లో మదరసాలు కూడా ఉన్నాయి. మదరసాలు ఉచిత ఇస్లాం విద్య, ఉచిత హాస్టల్ వసతి కల్పిస్తుంది. మదరసాలలో అధికంగా బీదవర్గం ప్రజలు విద్యను అభ్యసిస్తుంటారు.

ప్రజలవత్తిడి , పాకిస్థాన్ తాలిబన్‌లు మదరసాలను కొత్తగా తీవ్రవాదులను చేసుకోవడానికి వాడుకుంటున్నారని విమర్శలు తలెత్తడం వలన పాకుస్థానీ ప్రభుత్వం మదరసాల విద్యాస్థాయిలో విద్యాసంస్కరణలు చేపట్టింది.

పాకిస్థాన్ విద్యావిధానంలో నర్సరీ విద్య (ప్రిపరేటరీ తరగతులు), ఎలిమెంటరీ విద్య(ఒకటి నుండి ఐదు వరకు), మాధ్యమిక విద్య (ఆరు నుండి ఎనుమిది) ఉన్నత పాఠశాల (తొమ్మిది,పది) (సెకండరిక్ సర్టిఫికేట్ పొందవచ్చు) కమ్యూనిటీ కాలేజీలు (11 గ్రేడ్ , 12 గ్రేడ్) (హైయ్యర్ సెకండరీ సర్టిఫికేట్ పొందవచ్చు). తరువాత యూనివర్శిటీ ప్రోగ్రాం ద్వారా గ్రాజ్యుయేట్ , పోస్ట్ గ్రాజ్యుయేట్ విద్య. పాకిస్థానీ స్కూల్స్ సెకండరీ ఎజ్యుకేషన్ విధానం యునైటెడ్ కింగ్డం లోని కేంబ్రిడ్జి విద్యాప్రణాళికను అనుసరించి ఉంటుంది. కొంతమంది విద్యార్దులు బ్రిటిష్ కౌంసిల్ నిర్వహించే సాధారణ స్థాయి , ఉన్నతస్థాయి పరీక్షలకు హాజరు ఔతుంటారు.

హైయ్యర్ సెకండరీ సర్టిఫికేట్ పొందిన తరువాత విద్యార్ధులు ప్రొఫెషనల్ కాలేజీలలో లేక బ్యాచిలర్ డిగ్రీ కోర్సులను ఉన్నత విద్య కొరకు ఎంచుకుంటారు. విద్యార్ధులు సాధారణంగా ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బి.ఎస్) / బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బి.ఎస్.సి), బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్), బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ (మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ (ఎం.బి.బి.ఎస్), ఎండీ), దంతవైద్య డిగ్రీ (డెంటిస్ట్రీ) (బి.డి.ఎస్), పశువైద్యం (వెటరినరీ మెడిసిన్ (డి.వి.ఎం)), బ్యాచులర్ ఆఫ్ లా (ఎల్.ఎల్.బి), ఎల్ఎల్ఎం, జ్యూరిస్ డాక్టర్ (జెడి), బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (ఆర్కిటెక్చర్ బ్యాచిలర్ (బి.ఎ. ఆర్క్)), డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (ఫార్మసి డాక్టరేట్) , బాటు (నర్సింగ్ బ్యాచిలర్ (బి.నర్స్) విద్యను ఎంచుకుంటారు.

విద్యార్ధులు కొంతమంది బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, లిటరేచర్ , మేనేజ్మెంటు సైంస్, బ్యావిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బి.ఎ), బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (బి.కాం), బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎం.బి.ఎ) విద్యలను కూడా ఎంచుకుంటారు. పాకిస్థాన్ ఉన్నత విద్యలను సాధారణంగా హైయ్యర్ ఎజ్యుకేషన్ కమీషన్ (హెచ్.ఎస్.సి) పర్యవేక్షిస్తుంటారు. హైయ్యర్ ఎజ్యుకేషన్ కమీషన్ (హెచ్.ఎస్.సి) విద్యా విధానాల రూపకల్పన , దేశం అంతటా ఉన్న విశ్వవిద్యాలయాల వర్గీకరణ చేస్తుంది. 2014 అక్టోబర్‌లో పాకిస్థాన్  ఎజ్యుకేషన్ ఉద్యమకారుడు యూసఫ్‌జై నోబుల్ బహుమతి అందుకున్నాడు. అంతేకాక యూసఫ్‌జై అతిపిన్నవయస్కుడైన నోబుల్ బహుమతి గ్రహీతగా గుర్తించబడ్డాడు. 

పాకిస్థాన్ గణాంకాలను అనుసరించి 2015 లో పాకిస్థాన్ జనసంఖ్య 191,714,040. which is equivalent to 2.57% of the world population.

 2010 గణాంకాలను అనుసరించి పాకిస్థాన్ జనసంఖ్య 104 మిలియన్ల. పాకిస్థాన్‌లో 15 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన ప్రజల శాతం 35%. అధికమైన ప్రజలు దక్షిణ పాకిస్థాన్‌ లోని సింధూనది తీరంలో  నివసిస్తున్నారు. కరాచీ అత్యంత జనసాధ్రత కలిగిన వాణిజ్య ప్రాధాన్యత కలిగిన నగరంగా గుర్తించబడుతుంది. తూర్పు పాకిస్థాన్‌లో కైబర్ , ఉత్తర పాకిస్థాన్‌లో లాహోర్, ఫైసలాబాద్, రావల్పిండి, సర్గోధా, ఇస్లామాబాద్, గుజ్రంవాలా, సైల్కోట్, గుజరాత్ నగరం, ఝెలం, షైఖ్పురా, నౌషెరా, మర్దన్ , పెషావర్ నగరాలలో ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. 1990-2008 గణాంకాలను అనుసరించి నగరాలలో నివసిస్తున్నవారి శాతం 36%. దక్షిణాసియాలో అధికంగా నగరీకరణ చేయబడిన దేశాలలో పాకిస్థాన్ ప్రధమ స్థానంలో ఉంది.

ఆసుపత్రులను ఆశ్రయిస్తుంటారు. మొత్తం ప్రజలలో 19% , 30% పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. 2009 గణాంకాలను అనుసరించి జన్మించిన ప్రతి వెయ్యిమంది  శిశువులలో 87 మంది మరణిణిస్తున్నారని తెలుస్తుంది. 

Race/Ethnicity Composition

పాకిస్థాన్‌లో పలుప్రాంతాలు వాడుకలో ఉన్నాయి. దక్షిణాసియా దేశాలలో ముస్లిం జాతీయతకు చిహ్నంగా పాకిస్థాన్‌లో ఉర్దు భాషవాడుకలో ఉంది. ఉర్దూ భాష  జాతీయ సమైఖ్యతకు గుర్తుగా 75% ప్రజలకు వాడుకభాషగా ఉంది. ఉర్దూ ప్రజలకు ప్రధాన అనుసంధాన భాషగా ఉంది.. అధికారభాషగా ఉన్న ఆగ్లం ప్రభుత్వకార్యాలయాలు, వ్యాపారం , న్యాయవ్యవస్థలో వాడుకలో ఉంది. ప్రజలలో ఆంగ్లభాష ప్రధానంగా పాకిస్థానీ యాసలో వాడుకలో ఉంది. పంజాబు ప్రాంతంలో పంజాబీ భాష వాడుకలో ఉంది. దక్షిణ పంజాబీలో  సరైకి భాష వాడుకలో ఉంది. ఖైబర్‌లో పాష్తో భాష (ఇది ప్రాంతీయ భాష) వాడుకలో ఉంది. పాష్తో భాషను సింధు , బలూచీస్థాన్ ప్రజలు చక్కగా అర్ధం చేసుకుంటున్నారు. సింధూ ప్రాంతంలో సింధీ భాష, బలూచీ స్థాన్‌లో బలూచీ భాష వాడుకలో ఉన్నాయి.

పాకిస్థాన్ ప్రజలలో వలసప్రజలు కూడా ఉన్నారు. పాకిస్థాన్‌లో 1.7 మిలియన్ల ఆఫ్ఘన్ ప్రజలు తమను ఆఫ్ఘన్ పాకిస్థానీయులుగా నమోదుచేసుకున్నారు. వీరు కైబర్ ప్రాంతంలో ఉన్నారు.

వీరు గిరిజన ప్రాంతానికి చెందిన ప్రజలు. వీరి స్వల్పంగా కారచీ , క్వెట్టాలలో ఉన్నారు. 1995 గణాంకాలను అనుసరించి పాకిస్థాన్‌లో బంగ్లాదేశీయులు 1.6 మిలియన్లు ఉన్నారు.6,50,000
అఫ్ఘన్లు ఉన్నారు. 2,00,000 మంది బర్మాదేశీయులు ఉన్నారు. 2,320 మంది ఇరానియన్లు ఉన్నారు. అంతేకాక ఫిలిప్పైనీయులు, నేపాలీయులు కూడా ఉన్నారు. భారతీయ ముస్లిములు అధికంగా కరాచీలో నివసిస్తున్నారు. పాకిస్థాన్ ఇతర దేశాలకంటే అత్యధికంగా శరణార్ధులకు ఆశ్రయం ఇచ్చింది.

పాకిస్థాన్ ప్రజలు అధుకంగా నాలుగు ప్రాంతాలలో కేంద్రీకరించి ఉన్నారు. వీరు వరుసగా పంజాబీ ప్రజలు, పష్టన్ ప్రజలు, సింధీ ప్రజలు , బలూచీస్థాన్ ప్రజలు. 
 2009 గణాంకాలు అనుసరించి పంజాబీ ప్రజలు 76 మిలియన్లు (44.15%), పష్టన్ ప్రజలు 29 మిలియన్లు (15.42%) ఉన్నారు. 
. సింధీ ప్రజలు 24 మిలియన్లు(14.1%), సరైకి ప్రజలు 14.8 మిలియన్లు (10.53%)ఉన్నారు.

ఉర్దూ మాట్లాడే ముహ్జర్ ప్రజలు (భారతీయ ముస్లిములు) 13.3 మిలియన్లు (7.5%), బలూచీ ప్రజలు 6.3 మిలియన్లు (3.5%) ఉన్నారు. మిగిలిన 11.1 మిలియన్ (4.66%) ప్రజలు హజారా , కలాష్ సంప్రదాయాలకు చెందిన ప్రజలు ఉన్నారు. ప్రవాస  పాకిస్థానీ ప్రజలు 7 మిలియన్లు ఉన్నారు.

పాకిస్థాన్ జనసంఖ్యాపరంగా ప్రపంచంలోని ముస్లిం దేశాలలో రెండవ స్థానంలో ఉంది. అలాగే షియాముస్లిముల సంఖ్యలో పాకిస్థాన్ ప్రంపంచంలో రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఇరాన్ ఉంది. పాకిస్థాన్‌ ప్రజలలోలో 97% ముస్లిములు ఉన్నారు. 
 పాకిస్థాలో అహమ్మదీయులు తరువాత స్థానంలో ఉన్నారు. స్వల్పసంఖ్యలో ఉన్న అల్బియట్లు అధికారికంగా ముస్లిమేతరులుగా భావించబడుతున్నారు. 
అదనంగా క్యురేనియన్ సమూహానికి చెందిన ప్రజలు కూడా ఉన్నారు. సెప్టెంబర్ 11 యునైటెడ్ స్టేట్స్  దాడి, పాకిస్థాన్ సెక్టేరియన్ వయలెంస్ తరువాత సున్నీ , షియాలను కేంద్రీకరిస్తూ  దాడులు అధికరించాయి.

ఇస్లాం ప్రభావనికి ముందు అరబ్ ప్రంపంచ ముస్లిముల సంప్రదాయాలతో పాకిస్థానీ ముస్లిములు సమఖ్యం చేయబడ్డారు. లాహోర్ లోని అలీ హవారి (12వ శతాబ్దం) వంటి సుఫీ ముస్లిముల ప్రార్ధనా మందిరాలకు జాతీయ గుర్తింపు ఉండేది.
 సింధు ప్రాంతం షెహ్వాన్‌లో ఉన్న సుఫీయిజానికి చెందిన షహ్బాజ్ క్వాలాండర్ (12వ శతాబ్దం)  కూడా వీటిలో ఒకటి.  సుఫీయిజానికి దేశంలో దీర్ఘకాల చరిత్ర ఉంది. సుఫీయజంలో ప్రజలు గురువారాలలో ప్రార్ధనామందిరాలలో సమైఖ్యంగా ఆరాధనలు నిర్వహిస్తుంటారు. సుఫీ వార్షిక ఉత్సవాలలో సుఫీ సంగీతం , నృత్యం చోటుచేసుకుంటాయి.సమకాలీన ముస్లింవాదులు సుఫీ సంప్రదాయాన్ని విమర్శిస్తుంటారు.

పాకిస్థాన్‌లో ఇస్లాం తరువాత హిందూయిజం (1.6%) , క్రైస్తవం (1.6%) ఉన్నాయి.  1998  గణాంకాలను అనుసరించి 
బహా అనుయాయులు 30,000, సిక్కులు, బౌద్ధులు , జొరొయాస్ట్రియనిజం, ఒక్కో మతానికి 20,000 ఉన్నారు. పాకిస్థాన్‌లో స్వల్పంగా జైనిజం ఉంది.బ్రిటిష్ పాలనలో మొదటి ప్రపంచయుద్ధం , రెండవ ప్రపంచయుద్ధం కాలంలో  యునైటెడ్ కింగ్డం  కరాచీ మౌళిక వసతులు అభివృద్ధి చేసిన తరువాత రోమన్ కాథలిక్ అనుయాయులైన గోవా , తమిళ ప్రజలు కరాచీలో స్థిరపడ్డారు. 2005 గణాంకాలను అనుసరించి పాకిస్థాన్‌లో నాస్థికులు 1% మాత్రమే ఉన్నారు. 2012 నాటికి నాస్థికుల శాతం 2% చేరుకుంది.

పాకిస్థాన్ సాంఘిక జీవితం క్రమానుగతమైన ఆచారవ్యవహారాలను అనుసరించి ఉంటుంది. సంప్రదాయ ఇస్లామిక విలువలు సాఘికజీవితం , రాజకీయజీవితం మీద ప్రభావం చూపుతుంటుంది. సాధారణంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అధికంగా కనిపిస్తుంది. అయినప్పటికీ సాంఘిక , ఆర్ధిక కారణాల వలన ప్రజలు న్యూక్లియర్ కుటుంబాల వైపు (విడి విడిగా చిన్న కుటుంబాలు) అంటే మక్కువ చూపుతున్నారు. 
. స్త్రీ పురుషులకు సల్వార్ కమీజ్ సంప్రదాయ దుస్తులుగా ఉన్నాయి. ఆధునిక కాలంలో జీంస్ , టీ షర్ట్లు కూడా మక్కువ అధికం ఔతుంది.. పాకిస్థాన్‌లో 3.5 కోట్లమంది మద్యతరగతి ప్రజలు, 1.7 కోట్లమంది ఎగువ మద్యతరగతి ప్రజలు ఉన్నారని భావిస్తున్నారు. సమీపకాలంగా ఆర్ధికంగా గ్రామీణ భూస్వాములను నగరప్రముఖులు అధిగమిస్తున్నారు.  

ఈద్ -ఉల్- ఫిర్ట్, ఈద్ - అల్- అధా, రంజాన్, క్రిస్మస్, ఈస్టర్ , దీపావళి మొదలైన పాకిస్థాని పండుగలను పాకిస్థాన్ ప్రజలు అధికంగా ఆచరించబడుతున్నాయి. 
. గ్లోబలైజేషన్ అధికరించడం వలన ఎ.టి. కీర్నీ గ్లోబలైజేషన్ జాబితాలో పాకిస్థాన్ 56వ స్థానంలో ఉన్న్నట్లు తెలుస్తుంది..

పాకిస్థాన్ జాతీయ దుస్తులుగా సల్వార్ , కమీజ్ గుర్తించబడుతుంది. దీనిని పాకిస్థాన్ లోని పంజాబు, సింధు, బలూచీస్థాన్ , ఖైబర్ ప్రాతాలలోని స్త్రీపురుషులు ధరిస్తుంటారు.
అలాగే అజాద్  కాశ్మీర , గిరిజన ప్రజలు కూడా ధరిస్తుంటారు. ఒక్కో భూభాగంలో ఒక్కో తరహా శైలిలో సల్వార్ కమీజ్ ధరిస్తుంటారు. పాకిస్థాన్ ప్రజలు సూనితమైన వర్ణాలు , డిజైన్లతో రూపొందించబడిన సిల్క్, షిఫాన్, కాటన్ వస్త్రాలను ధరిస్తుంటారు. . సంప్రదాయ దుస్తులతో పురుషులు టైలరింగ్ చేయబడిన సూట్ , టై ధరిస్తుంటారు. వీటిని కార్యాలయాలు, పాఠశాలలు , ఇతర ప్రదేశాలలో ధరిస్తుంటారు.
.

ఫ్యాషన్ ప్రపంచంలో మార్పులు సంభవించిన తరువాత పాకిస్థాన్ ఫ్యాషన్ పరిశ్రమ వికసించింది. పాకిస్థాన్ ఫ్యాషన్ చారిత్రాత్మకంగా పలుదశలు దాటింది. పాకిస్థాన్ ఫ్యాషన్ భారతదేశ ఫ్యాషన్ , సంస్కృతి కంటే విలక్షణంగా ఉండి తన ప్రత్యేకత చాటుకుంటుంది. పాకిస్థాన్ ఫ్యాషన్ సంప్రదాయ , ఆధునిక మేలుకలయికగా ఉండి పాకిస్థాన్ ప్రత్యేకత గుర్తుచేస్తూ ఉంటుంది. ఆధునిక శైలికి భిన్నంగా ప్రజలు ధరించే దుస్తులు సంప్రదాయ , ప్రాంతీయ  సహజత్వానికి ప్రతీకగా ఉంటాయి. ప్రాంతీయ తరహా దుస్తులు అధిక నూతనంగా , స్వచ్చమైన రూపంతో విలక్షణంగా ఉంటాయి. లాహోర్‌లో ఉన్న పాకిస్థాన్ ఫ్యాషన్ డిజైన్ కౌంసిల్  , కరాచీలో ఉన్న ఫ్యాషన్ వీక్  పాకిస్థాన్‌లో ఫ్యాషన్ షో నిర్వహిస్తుంటాయి. 2009 లో మొదటిసారిగా పాకిస్థాన్ ఫ్యాషన్ వీక్ నిర్వహించబడింది.

పాకిస్థానీ స్త్రీల సాంఘిక అంతస్థు వ్యత్యాసంగా ఉంటుంది. స్త్రీల స్థితి సాంఘిక స్థితి, పుట్టిపెరిగిన వాతావరణం , ప్రాంతీయత మీద ఆధారపడి ఉంటుంది. అసమానంగా ఉండే ఆర్ధికసాంఘిక స్థితి , స్త్రీ విద్య పాకిస్థాన్ స్త్రీల జీవనవిధానం మీద కూడా ప్రభావం చూపుతుంది. గ్రామీణ ప్రాంతాలలో ప్రత్యేకంగా స్త్రీలపట్ల వివక్ష అధికంగా ఉంది. 
. పాకిస్థాన్ ఆవిర్భావం నుండి స్త్రీవాదం ఉచ్చస్థాయిలో వినిపిస్తుంది.. 1947 నుండి ఆల్ పాకిస్థాన్ వుమంస్ అసోసియేషన్ , ఔరత్ ఫౌండేషన్, అంతర్జాతీయ స్త్రీవాద సంస్థలు పాకిస్థాన్‌లో స్త్రీ హక్కుల రక్షణార్ధం కృషిచేస్తున్నాయి. షీలా ఇరెనె పంత్, బెనాజిర్ బుట్టో మలాల, కల్సూం నవాజ్ షరీఫ్ , బుష్రా అంసారి పాకిస్థాన్‌లోని ప్రముఖ మహిళావాదులుగా గుర్తించబడుతున్నారు. మతపరమైన ఙానం , విద్యాభివృద్ధి కారణంగా పాకిస్థాన్ లోని స్త్రీల స్థితి మెరుగైంది. అంతర్జాతీయంగా సరాసరితో పోల్చిచూస్తే పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 2014 లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం వర్గీకరణలో లింగవివక్షలో పాకిస్థాన్ అంతర్జాతీయంగా రెండవ స్థానంలో ఉందని తెలుస్తుంది.

సంప్రదాయకంగా స్త్రీలు అణిచివేతకు గురౌతున్నారు. సాధారణంగా స్త్రీలకు ఇంటిపనులు పురుషులకు ఇంటి పోషణ బాధ్యతలు వహిస్తారు. పురుషులు ధనసంపాదన బాధ్యతవహిస్తారు. అయినప్పటికీ నగరప్రాంతాలలో స్త్రీలు వృత్తిఉద్యోగాలు చేస్తూ ఇంటిఖర్చులకు ఆర్ధికంగా సహకరిస్తుంటారు. అయినప్పటికీ ఆర్ధికస్వాతంత్రం అనుభవిస్తున్న వారి శాతం తక్కువగా ఉంటుంది.

స్త్రీలు అధికంగా టీచింగ్ ఉద్యోగాలు ఎంచుముంటారు. ప్రజలలో చైతన్యం అభివృద్ధి కారణంగా స్త్రీలకు విద్యావకాశాలు అధికరిస్తున్నాయి.. మతాధికారులు కూడా ప్రస్తుతం స్త్రీవాద పోరాటాలకు , కార్యాలయాలు , గృహాలలో సమానత్వం కొరకు సహకారం అందిస్తున్నారు. .

 
పాకిస్థాన్ ప్రైవేట్ వార్తాపత్రికలు , రాష్ట్రానికి చెందిన పాకిస్థాన్ టెలివిషన్ కార్పొరేషన్ (పి.టి.వి) , పాకిస్థాన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (పి.బి.సి),21వ శతాబ్దంలో పాకిస్థాన్ రేడియో పాకిస్థాన్ మాధ్యమం మీద ఆధిపత్యం వహిస్తున్నాయి. 2000 నుండి మాధ్యమం ప్రైవేటీకరణ చేయబడిన తరువాత అధికంగా 24 గంటల వార్తాప్రసారాలు, పాకిస్థాన్ న్యూస్ చానెల్స్ , టెలివిషన్  చానెల్స్ మాధ్యమం మీద ఆధిపత్యం వహిస్తున్నాయి. అదనంగా జాతీయ ఎంటర్టైన్మెంటు , న్యూస్ చానెల్స్, వీదేశీ టెలివిషన్ ప్రసారాలు కూడా అందుబాటులో ఉన్నాయి..

లాలీ వుడ్ (ఉర్దూ చిత్రసీమ) కు కారాచీ, లాహోర్ , పెషావర్ ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. పాకిస్థాన్ ప్రజల సంస్కృతిలో ప్రధాన భాగంగా ఉన్న బాలివుడ్ చిత్రాలు 1965–2008 వరకు ప్రజలకు నిషేధించబడ్డాయి. పాకిస్థాన్ చిత్రపరిశ్రమ బలహీనంగా ఉన్నా పాకిస్థానీ ఉర్దూ నాటకాలు, నాటకరంగ ప్రదర్శనలకు ప్రజాదరణ అధికంగా ఉంది.పలు పాకిస్థానీ టెలివిషన్ ప్రసారాలు దినసరి వరుసకార్యక్రమాలను అందిస్తూ ఉన్నాయి.

పాకిస్థానీ నాటకాలు టెలివిషన్ ప్రసారాలను అధిగమిస్తున్నాయి.

పాకిస్థానీ జానపద సంగీతంలో ప్రాంతీయ జానపద సంగీతం , క్వవ్వాల్, ఘజల్ మొదలైన సంప్రదాయ శైలి భాగస్వామ్యం వహిస్తున్నాయి. అఫనంగా ఆధునికమైన పాశ్చాత్య సంగీతం కూడా ప్రజాదరణ కలిగి ఉంది.. పాకుస్థాన్‌లో అనేకమంది జానపదగాయకులు ఉన్నారు. పశ్చిమభూభాగం నుండి ఆఫ్ఘన్ శరణార్ధిల ప్రవేశించిన తరువాత పాష్తో సంగీతానికి ఆదరణ అధికం అయింది. అయినప్పటికీ పాష్తో సంగీతానికి కొన్ని ప్రాంతాలలో వ్యతిరేకత కనిపిస్తుంది. 
. పాకిస్థాన్‌లో కొంత అత్యాధునికమైన , పారదర్శకమైన మాధ్యమం పనిచేస్తుంది. పాకిస్థాన్ మాధ్యమం లంచగొండితనం వెలుగులోకి తీసుకురావడంలో ప్రధానపాత్ర వహిస్తుంది. 

పాకిస్థాన్‌కు స్వతంత్రం వచ్చిన తరువాత పాకిస్థాన్ నగరీకరణ వేగవంతం అయింది. అందుకు పలు వైవిద్యమైన కారణాలు ఉన్నాయి.

దక్షిణ పాకిస్థానీయులు అధికంగా సింధూనదీతీరంలో నివసిస్తుంటారు. అధిక జనసంఖ్య కలిగిన నగరంగా కరాచీ ప్రత్యేకత కలిగి ఉంది.

తూర్పుప్రాంత పాకిస్థాన్ ప్రజలు ఖైబర్ పఖ్తుంవా , ఉత్తర పాకిస్థాన్ లాహోర్, ఫైసాలాబాద్, రావల్పిండి, ఇస్లామాబాద్, సర్గోధా, గుజరంవాలా, సైకోట్, గుజరత్ నగరం, ఝెలం, షైయిఖ్పురా, నౌషెరా, మార్దన్ , పెషావర్ నగరాలు ఉన్నాయి. 1990–2008 మద్య కాలంలో నగరాలో నివసిస్తున్న ప్రజల శాతం 36%. ఇది పాకిస్థాన్‌ను ఆసియాలో అధికంగా నగరీకరణ దేశంగా నిలబెట్టింది. అదనంగా 50% ప్ర్జలు 5,000 మంది కంటే అధిక జనసంఖ్య కలుగిన పట్టణాలలో నివసిస్తున్నారు. . పాకిస్థాన్ ప్రజలు అధికంగా దేశీయంగానూ , విదేశాలకు వలసపోతుంటారు. అందువలన పాకిస్థాన్ ప్రజలు అధికంగా నగరాలకు వలసపోవడానికి సహకరిస్తుంది. 1998 లో ఒక విశ్లేషకుడు 1940 నుండి పాకిస్థాన్ నగరీకరణ గురించి వివరణ అందించాడు..

ఇతరదేశాల నుండి పాకిస్థాన్‌కు వలస రావడం (ప్రత్యేకంగా పొరుగుదేశాల నుండి) వలన పాకిస్థానీ నగరీకరణను మరింత అధికం చేసింది. 1971 లో బంగ్లాదేశ్ ప్రత్యేకదేశంగా అవతరించిన తరువాత పాకిస్థాన్ నగరీకరణ మరింత అధికం అయింది. సంప్రదాయానికి ముఖ్యత్వం ఇచ్చే బీహారీ పాకిస్థానీలు అధికసంఖ్యలో , స్వల్పసంఖ్యలో బెంగాలీలు పాకిస్థాన్‌కు వలసపోయారు. తరువాత బర్మీయులు పాకిస్థాన్‌కు వలసపోయారు. ఆఫ్ఘనీస్థాన్‌లో సోవియట్ యుద్ధం కూడా మిలియన్ల ఆఫ్ఘనీయులను పాకిస్థాన్‌కు తరలివెళ్ళేలా చేసింది. ఆఫ్ఘన్లు ప్రత్యేకంగా వాయవ్య పాకిస్థాన్‌కు శరణార్ధులుగా తరలివెళ్ళారు. ఆఫ్ఘన్‌ల వలస కారణంగా పాకిస్థాన్ నగరీకరణ వేగవంతం చేయవలసిన అవసరం అధికమైంది. ఆఫ్ఘన్ల రాక సాంఘిక- రాజకీయ- ఆర్ధిక సమస్యలను అధికం చేసింది. అదనంగా జనసంఖ్య అధికమవడం కారణంగా హరిత విప్లవం , రాజకీయాల అభివృద్ధికి కారణం అయింది. 
.

దాదాపు 7 మిలియన్ల పాకిస్థాన్ ప్రజలు  విదేశాలలో నివసిస్తున్నారని అంచనా. అత్యధికంగా మద్య ఆసియా, యూరప్ , నార్త్ అమెరికాలో నివసిస్తున్నారు. 
 13బిలియన్ల అమెరికన్ డాలర్లు ప్రవాస పాకిస్థాన్ విదేశీ మారకాన్ని స్వదేశానికి పంపుతున్నట్లు అంచనా. విదేశీ మారక ఆదాయంలో పాకిస్థాన్ ప్రంపంచంలో 10వ స్థావనంలో ఉంది.

ప్రవాస పాకిస్థాన్ ప్రజలను పాకిస్థాన్ ఓవర్సీస్ పాకిస్థానుకుగా గుర్తిస్తుంది. 2008 లో మినిస్ట్రీ ఆఫ్ ఓవర్సీస్ పాకిస్థానీస్ స్థాపించబడింది. ప్రవాస పాకిస్థానీయుల సంస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి ఇది పనిచేస్తూ ఉంది. ప్రవాస పాకిస్థాన్ ప్రజల విదేశీమారకం దేశం విదేశీమారక నిల్వలను పెంచడంలో రెండవస్థానంలో ఉంది. మొదటిస్థానంలో ఎగుమతులు ఉన్నాయి. 
పాకిస్థాన్ విదేశీమారకం వార్షికంగా క్రమక్రమాభివృద్ధి చెందుతూ ఉంది. 2007-2008 లలో 4 మిలియన్ల అభివృద్ధి సాధించగా 2008-2009 లో 8 మిలియన్ల అభివృద్ధికి (21.8%) చేరుకుంది.

పాకిస్థాన్ ప్రవాసపాజిస్థాన్ ప్రజల విదేశీమారకం పాకిస్థాన్ ఆర్ధికరంగలో ముఖ్యత్వవహిస్తుందని గ్రహించిన పాకిస్థాన్ ప్రభుత్వం 2004 లో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఆధ్వర్యంలో ది ఓవర్సీస్ పాకిస్థాన్ డివిషన్ స్థాపించబడింది. అదనంగా సాంఘిక సంక్షేమ పథకాలు, ఓవర్సీస్ పాకిస్థాన్ ఫౌండేషన్ ప్రవాస పాకిస్థాన్ ప్రజలకు సహకరిస్తూ ఉంది. విమానాశ్రయ సౌకర్యాలు అధికరించడం, 
నివాసగృహాల అభివృద్ధి, విద్య , ఆరోగ్యసంక్షేమ పథకాల అభివృద్ధి చేస్తూ ప్రవాస పాకిస్థానీయులకు సహకారం అందిస్తుంది. వీటిలో అతిముఖ్యమైనది తిరుగి స్వదేశం చేరుకున్న ప్రవాసపాకిస్థానీయులకు పునరావాసం ఏర్పరచడం ప్రధానమైనది.

పాకిస్థాన్‌లో ఉర్ధూసాహిత్యం, సింధూ సాహిత్యం, పంజాబీసాహిత్యం, పషో సాహిత్యం , కవిత్వం, బలోచీ అకాడమీ, పర్షియన్ సాహిత్యం, పాకిస్థానీ ఆగ్లసాహిత్యం , ఇతరసాహిత్యప్రక్రియలు ఉన్నాయి. అతిపెద్ద సాహిత్య సముదాయం అయిన ది పాకిస్థానీ అకాడమీ ఆఫ్ లెటర్స్ అంతర్జాతీయ స్థాయిలో సాహిత్యం , కవిత్వం అందిస్తుంది. ది నేషనల్ లైబ్రరీ ఆఫ్ పాకిస్థాన్ అత్యధికంగా సాహిత్యాన్ని ప్రచురణ , పోషణ బాధ్యతవహిస్తుంది. అలాగే సాహిత్యాన్ని ప్రజలకు అందజేయడానికి తగినంతగా సహకరిస్తుంది. 19వ శతాబ్ధానికి ముందు పాకిస్థాన్‌లో సాహిత్యం అధికంగా కవిత్వం, సూఫీ కవిత్వం, వివిధ సంగీత ప్రక్రియలు , పాప్ సంప్రదాయం రూపంలో  ఉండేది. కాలనీ పాలనాకాలంలో దేశీయసాహిత్యకాతులు ఆగ్లసాహిత్యంతో ప్రభావితులు అయ్యారు. వారు వివిధ రచనావిధానాలను స్వీకరించారు. వీటిలో ప్రోజ్ విధానం అధికంగా ఆదరించబడింది. 

పాకిస్థాన్‌ సాహిత్యకారుల జాబితా:-

ముహమ్మద్ ఇక్బాల్, సయ్యద్ అహమ్మద్ ఖాన్, ముహమ్మద్ ఆసాద్, అబు, ఆలా మౌదుబి , ముహమ్మద్ అలి జౌహరిలు పాకిస్థాన్ తాత్వికచిందన అభివృద్ధికి  మార్గదర్శకం వహించారు.

తరువాత బ్రిటిష్ తాత్వికచింతన ఆతరువాత ఆమెరికన్ తాత్వికచింతన పాకిస్థాన్ తత్వచింతన అభివృద్ధికి సహకరించాయి. తాత్విక వాదులు ఎం.ఎం. షరీఫ్ , సయ్యద్ జఫ్రుల్ హాసన్  1947 లో మొదటి పాకిస్థాన్ తాత్వికఉద్యమానికి తెరతీసారు. 1971 ఇండో – పాకిస్థాన్ యుద్ధం తరువాత పాకిస్థాన్‌ తాత్విక ప్రపంచంలోమార్కిజం చింతన అభివృద్ధికి జలాలుద్దీన్ అబ్దుర్ రహీం, సొభొ గియాన్‌చందని , మాలిక్ మెరాజ్ ఖలిద్  మొదలైన ప్రముఖులు సహకరించారు.. మంజూర్ అహ్మద్, జాన్ ఎలియా, హాసన్ అస్కారి రిజ్వి చితనలు పాకిస్థాన్ తత్వచింతన మీద ప్రభావం చూపారు. అంతర్జాతీయ ఖ్యతిచెందిన తాత్వికుడు  నొయాం చోకీ చింతనలు పాకిస్థాన్ తత్వచింతన, రాజకీయ , సాంఘిక చింతన మీద ప్రభావంచూపింది. 

పాకిస్థాన్ చరిత్రలో నాలుగు గుర్తించతగిన కాలాలు ఉన్నాయి. ఇస్లామిక్ కాలానికి ముందు, ముస్లిం కాలం, కాలనీ కాలం , సిధూనాగరికత ఆరంభకాలం( క్రీ.పూ 3000). 
 ఆరభకాల ఉన్నతస్థాయి నగరసంస్కృతికి  చెందిన భవనాలలో కొన్ని ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. 
 ఇస్లామిక్ కాలానికి ముందు కాలానికి చెందున మొహంజొ- దారో, హరప్పా , కోట్ దిజి వంటి మానవస్థావర ప్రాంతాలు ప్రస్తుత పర్యాటక ఆకర్షణలుగా ఉన్నాయి.. మొదటి శతాబ్దం ఆరంభంలో బుద్ధిజం , గ్రీక్ ప్రభావం కారణంగా గ్రీకో- బుద్ధిజం శైలి అభివృద్ధికి కారణం అయింది. 
 
ఈ శకానికి శిఖారాగ్రంగా గాంధారశిల్పం శైలి రూపుదిద్దుకుంది. బుద్ధిజానికి ఉదాహరణగా  ఖైబర్ పఖ్తుంక్వాలోని తాకత్- ఇ- భై బౌద్ధ ఆరామం ఒకటి. 

ప్రస్తుత పాకిస్థాన్‌లో ఇస్లాం ప్రవేశించగానే పాకిస్థాన్‌లో బుద్ధిజం ముగింపుకువచ్చింది. తరువాత క్రమంగా ఈ ప్రాంతంలో ఇస్లామిక్ నిర్మాణాలు అధికరించాయి. అతి ప్రాముఖ్యత సంతరించుకున్న ఇండో- ఇస్లామిక్ నిర్మాణాలకు ఉదాహరణగా ముల్తాన్‌లో  రుక్న్- ఇ- ఆలం (షహ్ రుక్న్- ఇ- ఆలం సమాధి) ఇప్పటికీ నిలిచిఉంది. మొఘల్ కాలానికి చెందిన పర్షియన్- ఇస్లామిక్ శైలి నిర్మాణాలలో హిందూస్థానీ కళలు చోటుచేసుకున్నాయి. మొఘల్ పాలకులకు సందర్భానుసార నివాసంగా ఉన్న లాహోర్‌లో మొఘల్ కాలానికి చెందిన పలు నిర్మాణాలు ఉన్నాయి. వాటిలో   బాద్షాహీ మసీదు , లాహోర్ కోట, ఆలంగిరీ ద్వారం, వర్ణరజితమైన మొఘల్ నిర్మాణశైలిలో నిర్మించబడిన వజీర్ ఖాన్ మసీదు అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న నిర్మాణాలు గుర్తించబడుతున్నాయి., మొఘల్ కాలానికి చెందిన మరొకొన్ని నిర్మాణాలలో లాహోరు లోని షాలీమర్ గార్డెన్లు, తట్టలోని షాజహాన్ మసీదు ఉన్నాయి. కాలనీ పాలనకు ముందు  ఇండో- యురేపియన్  శైలి కార్యాలయాలు ఇండియన్- ఇస్లామిక్ మిశ్రిత శైలిలో అభివృద్ధి చేయబడ్డాయి. కాలనీ పాలన తరువాత ఫైజల్ మసీదు, మినార్- ఇ- పాకిస్థాన్ , మజర్-ఇ- ఖ్వైద్ మొదలైన ఆధునిక నిర్మాణాలు పాకిస్థానీ జాతీయత ప్రతిబింబించేలా నిర్మిచబడ్డాయి. మౌళిక వసతులకు చెందిన నిర్మాణాలలో యునైటెడ్ కింగ్డం నిర్మాణశైలి ప్రతిబింబిస్తుంది. అలాంటి నిర్మాణాలు లాహోరు, పెషావర్ , కరాచీలలో ఉన్నాయి.

పాకిస్థాన్ ఆహారసంస్కృతిలో దక్షిణాసియా దేశాలప్రభావం అధికంగా ఉంది. 16వ శతాబ్దంలో మొఘల్ రాజుల వంటగది నుండి వెలువడిన పలు ఆహారాలు ఇప్పటికీ పాకిస్థాన్ ఆహార అలవాట్ల మీద ప్రభావం చూపుతూ ఉంది. మిగిలిన ద్వీపకల్పంలో కంటే పాకిస్థాన్‌లో అత్యధికమైన మాంసాహారాలు వాడుకలో ఉన్నాయి. ఈ మాంసాహారాలకు బ్రిటిష్, మద్య ఆసియా, మిడిల్ ఇస్ట్ దేశాల మాంసాహారాల ప్రభావం మూలంగా ఉంది. పాకిస్థానీ ఆహారాలలో మసాలా దినుసులు, మూలికలు, సీసనింగ్స్ అధికంగా వాడబడుతుంది. అల్లం, వెల్లుల్లి, పసుపు, ఎండుమిరపకాయలు , గరం మసాలా అధికమైన ఆహారల తయారీకి వాడుతుంటారు. సాధారణంగా పాకిస్థానీ ఆహారంలో చపాతీలతో కూరలు, మాంసం, కూరగాయలు, పప్పుకూరలు ఉంటాయి. అన్నంకూడా పాకిస్థాన్ ప్రధానాహారాలలో ఒకటి. వట్టి అన్నం (ప్లెయిన్ రైస్) లేక సుఘంధ ద్రవ్యాలను చేర్చి వేపిన అన్నం కూరలతో వడ్డించబడుతుంది. ఆహారంలో తీపిపదార్ధాలు కూడా ఉంటాయి. 

పాకిస్థాన్‌లోని పంజాబీప్రాంతవాసులకు సంప్రదాయపానీయం లస్సీ. దక్షిణ భూభాగంలో చాలాప్రాబల్యం పొందిన స్వీటుగా సోహన్ హల్వాకు ప్రత్యేకత ఉంది. ఇది పాకిస్థాన్ అంతటా ఆదరణ కలిగి ఉంది. .

బ్రిటిష్ పాలనా కాలం నుండి పాకిస్థాన్ క్రిడారంగం అభివృద్ధిచెందింది. పాకిస్థాన్ జాతీయక్రీడ హాకీ. పాకిస్థాన్ క్రీడాకారులు 3 మార్లు (1960-1968-1984) ఓలింపిక్ స్వర్ణపతకాలను సాధించారు. 
 పాకిస్థాన్ 4 మార్లు పురుషుల ప్రపంచ హాకీకప్ (1971-1978-1982-1994) గెలుచుకుంది. 

పాకిస్థాన్ ప్రజలకు అత్యంత అభిమానపాత్రమైన క్రీడ క్రికెట్. పాకిస్థాన్ నేషనల్ క్రికెట్ క్రీం (షాహీన్) 1992 ప్రపంచ క్రికెట్  సాధించింది. 2007 ఐ.సి.సి. వరల్డ్ ట్వంటీ పోటీలలో రన్నర్‌ స్థానం దక్కించుకున్నది. 2009లో 
తీవ్రవాదులు శ్రీలంక క్రికెట్ క్రీడాకారుల మీద మిలిటెంట్లు దాడి చేసారు. ఫలితంగా పాకిస్థాన్ క్రికెట్ క్రీడకు కొంత అవరోధం ఏర్పడింది.. అయినప్పటికీ 2015 మే ఇంటర్నేషనల్ క్రికెట్ తిరిగి పాకిస్థాన్ చేరుకుంది. జింబావే టీం పాకిస్థాన్‌ పర్యటనలో మొత్తం పోటీలు గట్టి బందీబస్తు మద్య లాహోరులో నిర్వహించబడ్డాయి. అన్ని పోటీలు హౌస్ ఫుల్ సాధించి సరికొత్త చరిత్రను సృషిటించాయి.
. తరువాత పలుపోటీలకు ద్వారాలు తెరచుకున్నాయి.

స్క్వాష్ లో అంతర్జాతీయస్థాయి క్రీడాకారుడు జహంగీర్ ఖాన్ , జంసర్ ఖాన్‌లు పలుమార్లు చాంపియన్ షిప్ సాధించి చరిత్ర సృష్టించారు. 
. 
జంసర్ ఖాన్ బ్రిటిష్ ఓపెన్ స్క్వాష్ చాంపియన్‌షిప్ కూడా 10 మార్లు సాధించి విజయం సాధించాడు.

పాకిస్థాన్ క్రీడాకారులు పలుమార్లు ఒలింపిక్ క్రీడలలో పాల్గొన్నారు. పాకిస్థాన్ క్రీడాకారులు ఒలింపిక్ క్రీడలలో హాకీ, బక్సింగ్, అథ్లెట్లు,ఈత , షూటింగ్ మొదలైన క్రీడలలో పాల్గొన్నారు.
 పాకిస్థాన్ సాధించిన 10 ఒలింపిక్ స్వర్ణపతకాలలో 8 హాకీ క్రీడాకారులు సాధించినవే. పాకిస్థాన్ క్రీడాకారులు కామంవెల్త్ క్రీడలు , ఆసియన్ క్రీడలలో 65 -160 పతకాలు సాధించారు.

పాకిస్థాన్‌లో జాతీయస్థాయి పోలో ప్రబలంగా ఉంది. దేశంలో పలుప్రాంతాలలో పోలో క్రీడలు నిర్వహించబడుతున్నాయి. బాకిసింగ్, బిలియర్డ్స్, రోయింగ్, కయకింగ్, కేవింగ్, టెన్నిస్, కాంట్రాక్ట్ బ్రిడ్జ్, గోల్ఫ్ , వాలీబల్ మొదలైన క్రీడాలలో కూడా పాకిస్థాన్ క్రీడాకారులు చురుకుగా పాల్గొంటూ వీటిని అంతర్జాతీయ , జాతీయ స్థాయిలో పాల్గొంటున్నారు.
 లాహోర్ , కారాచీలలో బాస్కెట్ బాల్‌ ప్రాబల్యం కలిగిఉంది.

భారత్ పాక్ యుద్దం 1965
భారత్ పాక్ యుద్దం 1971




#Article 182: మాల్దీవులు (483 words)


మాల్దీవుల గణతంత్రరాజ్యం భారతదేశానికి నైఋతిన హిందూ మహాసముద్రంలో కొన్ని పగడపు దీవుల సముదాయాలతో ఏర్పడిన దేశం. మాల్దీవులలో 26 పగడపు దిబ్బలలో మొత్తం 1,196 పగడపు దీవులు ఉన్నాయి.

మాల్దీవుల యొక్క ప్రాచీన చరిత్ర అస్పష్టముగా ఉంది. మాల్దీవుల కథల ప్రకారం, కోయిమాలే అనే ఒక సింహళ యువరాజు తన పెళ్ళికూతురైన శ్రీలంక చక్రవర్తి కుమార్తెతో పాటు ఒక మాల్దీవుల లగూన్ లో చిక్కుకొని అక్కడే స్థిరపడి మాల్దీవుల మొదటి సుల్తాన్‌గా పరిపాలించాడని ప్రతీతి.

శతాబ్దాలుగా ఈ దీవుల అభివృద్ధిపై దగ్గరగా ఉన్నఅరేబియా సముద్ర, హిందూ మహాసముద్ర తీరాల నుండి వచ్చిన నావికుల ప్రభావము ఉంది. మలబార్ (ఇప్పటి భారతదేశంలోని కేరళ) తీరానికి చెందిన మోప్లా సముద్రపు దొంగలు ఈ దీవులను ఎంతో ఇబ్బందికి గురి చేసారు. 16వ శతాబ్దములో పోర్చుగీసు వాళ్ళు ఈ దీవులను తమ ఆధీనములోనికి తెచ్చుకుని 15 సంవత్సరాలు (1558-1573) వరకూ పాలించారు. వారిని మహమ్మద్ అల్ ఆజమ్ అనే దేశభక్తి గల వీరుడు తరిమివేశాడు.

చాలాకాలం స్వతంత్ర మహమ్మదీయ రాజ్యంగా ఉన్నా (1153-1968) మాల్దీవులు ఇంగ్లీషు వారి రక్షణగల దేశంగా ఉండేది (1887-జులై 25 1965). గణతంత్ర రాజ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం జరిగినా మహమ్మదీయ సామ్రాజ్యంగానే ఉండిపోయింది. ఇస్లామ్ మతానికి మారక ముందు మాల్దీవులలో బౌద్ధం విలసిల్లింది. ఈ మత మార్పిడికి కూడా రన్నమారి అనే సైతాను గురించిన ఊహాజనితమైన నమ్మశక్యము కాని కథ ప్రచారంలో ఉంది.

బ్రిటీషు వారి నుండి 1965లో స్వాతంత్ర్యము పొందినా సుల్తాను రాజ్యమే తరువాతి 3 సంవత్సరాలు పరిపాలన సాగించింది. 1968 నవంబరు 11 లో దాన్ని రద్దు చేసి ఇప్పటి పేరుతో గణతంత్ర రాజ్యముగా మార్చడం జరిగింది. పర్యాటక రంగము, మత్స్య పరిశ్రమ ఈ దీవుల సమూహములో అభివృద్ధి చెందింది.

మాల్దీవుల ఆర్థికవ్యవస్థ అనేక శతాబ్దాలనుండి, మత్స్య పరిశ్రమ, సముద్ర ఉత్పత్తులపైనే పూర్తిగా ఆధారపడి ఉంది. నేటికీ ఇవే ప్రజల ప్రధాన జీవనాధారాలు. అందువల్లే ప్రభుత్వము మత్స్య పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది.

దేశ ఆర్థిక వ్యవస్థలోనూ, ఇక్కడి మత్స్య పరిశ్రమ చరిత్రలోనూ 1974లో సాంప్రదాయ విధానమైన ధోనిలో చేపలు పట్టే పద్ధతిని యాంత్రికీకరించడము ఒక పెద్ద మైలురాయిగా భావిస్తారు. 1977లో ఒక జపానుకు చెందిన కంపెనీ యొక్క సహకారముతో చేపలను డబ్బాలలో నింపే పరిశ్రమను ఫెలివారూ దీవిలో స్థాపించారు. 1979లో మత్స్యరంగము యొక్క అభివృద్ధికి అవసరమైన పాలసీ మార్గదర్శకాలపై ప్రభుత్వానికి సలహాలు, సూచనలూ చేసేందుకు ఒక మత్స్యపరిశ్రమ సలహా సంఘాన్ని ఏర్పాటు చేశారు. మానవవనరుల అభివృద్ధి పథకాలు 80వ దశకపు తొలినాళ్లలో ప్రారంభమయ్యాయి. మత్స్య పరిశ్రమ విద్యను పాఠశాలలో పాఠ్యాంశముగా చేర్చారు. ఫిష్ అగ్రవేటింగ్ డివైజులను, నావిగేషనల్ సహాయకారక యంత్రాలను అనేక ప్రధాన ప్రాంతాలలో యేర్పాటు చేశారు. అంతేకాక, మాల్దీవుల మత్స్యరంగ ఎక్స్‌క్లూజివ్ ఆర్థిక జోను (EEZ) ప్రారంభము మత్స్య పరిశ్రమ అభివృద్ధికి మరింత దోహదము చేసింది. ప్రస్తుతం, మాల్దీవుల మత్స్య పరిశ్రమ జాతీయ స్థూల ఆదాయములో 15% పైగా చేకూర్చటమే కాక, దేశంలోని 30% పైగా జనాభాకు ఉపాధి కల్పిస్తుంది. మాల్దీవుల విదేశీ మారక ఆర్జనలో పర్యాటక రంగము తర్వాత స్థానము మత్స్యపరిశ్రమదే.

పర్యటక రంగము యొక్క అభివృద్ధి మొత్తం మాల్దీవుల యొక్క ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదం చేసింది. ఈ రంగము అనేకమందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పించడమే కాకుండా ఇతర సంబంధిత రంగాలలో ఆదాయమార్గాలను పెంపొందించింది. ప్రస్తుతం, పర్యాటకరంగము దేశం యొక్క అతిపెద్ద విదేశీమారక వనరు. జాతీయ స్థూల ఆదాయములో పర్యాటక రంగము యొక్క వాటా 20%. దేశం మొత్తం 86 పర్యాటక రెసార్టులు పనిచేస్తు ఉండగా, 2000 సంవత్సరములో 4,67,154 మంది పర్యాటకులు మాల్దీవులకు విచ్చేసినట్టు నమోదయ్యింది.

దేశములో పర్యాటక రంగము అభివృద్ధితో చాపల అల్లకం, లక్కపని, హస్తకళలు, కొబ్బరితాళ్ళ తయారీ వంటి అనేక సాంప్రదాయక కుటీర పరిశ్రములకు కూడా ఊతమిచ్చింది. కొత్తగా అభివృద్ధి చెందిన పరిశ్రమలలో ముద్రణ, పీవిసి పైపుల తయారీ, ఇటుకల తయారీ, సముద్రములో ఉపయోగించే ఇంజన్ల మరమ్మత్తు, షోడా నీళ్ళ బాట్లింగ్ పరిశ్రమ, దుస్తుల తయారీ మొదలైనవి ముఖ్యమైన పరిశ్రమలు.

మౌమూన్ అబ్దుల్ గయూమ్, 1978లో మొదటి ఎన్నుకోబడిన అధ్యక్షుడు. అప్పటి నుండి ఆయనే అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన అధికారదర్పముతో పరిపాలించాడు. 1988లో ఆయనకు వ్యతిరేకముగా జరిగిన ఒక కుట్రనుండి భారత రక్షక దళాల సహాయముతో తప్పించుకున్నాడు.

మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా ఇబ్రహీం మహ్మద్ సోలి నవంబరు 17న ప్రమాణస్వీకారం చేశారు.

మాల్దీవులు ప్రపంచములోనే అతి చదునైన దేశముగా పేరుగాంచింది. దేశములోని అత్యున్నత స్థానము కేవలం 2.3 మీటర్లే. పెరుగుతున్న సముద్రమట్టము మాల్దీవుల ఉనికికి ప్రమాదకారిగా మారే అవకాశమున్నదని నివేదికలు వచ్చినప్పటికీ, వాస్తవానికి ఇటీవలి దశకాలలో సముద్రమట్టము కొంచెం తరిగినది.




#Article 183: థాయిలాండ్ (3866 words)


థాయ్‌లాండ్ అధికారికంగా కింగ్డం ఆఫ్ థాయ్‌లాండ్ గా పిలువబడుతుంది. సాధారణంగా సియాం అని పిలువబడే థాయ్‌లాండ్, ఇండోచైనా ద్వీపకల్పం మద్యభాగంలో ఉపస్థితమై ఉంటుంది. 
థాయ్‌లాండ్ ఉత్తరదిశలో బర్మా, లావోస్, తూర్పుదిశలో లావోస్,కంబోడియా, దక్షిణ దిశలో గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్, మలేషియా, పడమర దిశలో అండమాన్ సముద్రం, దక్షిణ బర్మా ఉన్నాయి. థాయ్‌లాండ్ సముద్ర సరిహద్దులలో ఆగ్నేయంలో గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్ యందు వియత్నాం, ఇండోనేషియా, భారతదేశం ఉన్నాయి. ఇది దక్షిణాసియా దేశాలలో ఒకటి. థాయ్‌లాండ్ రాచరిక పాలన కలిగిన దేశం. థాయ్‌లాండ్‌లో రాజు 9వ రామా పాలన కొనసాగుతుంది. 9వ రామా 1946 నుండి థాయ్‌లాండ్ దేశాన్ని పాలిస్తూ, ప్రపంచంలో అత్యధిక కాలం పాలిచిన నాయకుడిగా ఉండడమేకాక థాయ్‌లాండ్ చరిత్రలో అత్యధిక కాలం పాలించిన రాజుగా చరిత్రలో స్థానం సంపాదించాడు. థాయ్‌లాండ్ రాజు రాజ్యానికి అధ్యక్షుడు, సైనికదళాధిపతి, బౌద్ధమతానునయుడు, అన్ని మతాలను ఆదరించేవాడుగా ఉంటాడు.

థాయ్‌లాండ్ సుమారు 5,13,000 చదరపు కిలోమీటర్ల (1,96,000 చదరపు మైళ్ళు) విస్తీర్ణంతో, ప్రపంచంలో 51వ అతి పెద్ద దేశం. జనసాంద్రతలో ప్రపంచంలో 20వ స్థానంలో ఉంది. థాయ్‌లాండ్ జనసంఖ్య 6.4 కోట్లు. థాయ్‌లాండ్‌లో అతిపెద్ద, రాజధాని నగరం బాంకాక్. బాంకాక్ థాయ్‌లాండ్ దేశానికి రాజకీయ, వాణిజ్య, పారిశ్రామిక, సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లుతుంది. థాయ్‌లాండ్ ప్రజలలో 75% మంది థాయ్ సంప్రదాయానికి చెందినవారు. 14% మంది ప్రజలు థాయ్ చైనీయులు, 3% మంది ప్రజలు మలే సంప్రదాయానికి చెందిన వారు. మిగిలిన అల్పసంఖ్యాకులలో మోనులు, ఖెమరానులు, వివిధ గిరిజన సంప్రదాయానికి చెందినవారు కలరు. థాయ్‌లాండ్ అధికారిక భాష థాయ్, మతం బౌద్ధమతం. బౌద్ధమతాన్ని థాయ్‌లాండులో 95% ప్రజలు అనుసరిస్తున్నారు. థాయ్‌లాండ్ 1985, 1996లో అతివేగంగా ఆర్థికాభివృద్ధి చెంది, ప్రస్తుతం ఒక పారిశ్రామిక దేశంగా, ప్రధాన ఎగుమతి కేంద్రంగా తయారైనది. దేశాదాయంలో పర్యాటక రంగం కూడా ప్రధానపాత్ర వహిస్తుంది. దేశంలో, చట్టబద్ధంగా, చట్టవ్యతిరేకంగా, 20 లక్షల వలసప్రజలు నివసిస్తున్నారు. అలాగే దేశంలో అభివృద్ధి చెందిన దేశాలనుండి వచ్చి చేరిన బహిష్కృతులు అనేకమంది నివసిస్తున్నారు.

థాయ్‌లాండ్‌ను ఇక్కడి ప్రజలు సాధారణంగా మెయాంగ్ థాయ్‌ అని పిలుస్తూ ఉంటారు, ఇతరులు  ది ఎక్సోనిం సియాం  అని సియాం, శ్యాం, శ్యామ అని కూడా అంటారు. 'శ్యామా' అంటే సంస్కృతంలో 'నల్లని 'అని అర్ధం. 1851-1868 మధ్యకాలంలో సియాం రాజ్యాన్ని మాంకట్ రాజు పరిపాలించాడు. 1939 జూన్ 23న ఈ దేశం పేరు థాయ్‌లాండ్ గా మార్చబడింది.1945 నుండి 1949 మే 11 వరకు థాయ్‌లాండు తిరిగి సియాంగా పిలుబడింది. తరువాతి కాలంలో మరల థాయ్‌లాండుగా మార్చబడింది. థాయ్ అనే మాట చలా మంది అనుకున్నట్లు 'స్వతంత్రం' అని అర్ధం వచ్చే పదముకు సంబంధించినది కాదు; అక్కడ నివసించే ఒక జాతి ప్రజలను సూచిస్తుంది. ప్రముఖ పరిశోధక విద్యార్థిఒకరు థాయ్ అంటే  ప్రజలు ,  మానవుడు  అని అర్ధమని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఇప్పటికీ థాయ్‌లాండ్ గ్రామాలలో ప్రజలను ఉద్దేశించడానికి 'ఖోన్ 'కు బదులుగా 'థాయ్'ని వాడుతుంటారు. థాయ్ అనే మాటకు స్వేచ్ఛ అని అర్ధం కూడా ఉంది. దక్షిణాసియాలో యురోపియన్ ఆక్రమణకు గురికాని ఒకే ఒక్క దేశం థాయ్‌లాండ్ కనుక ఇక్కడి ప్రజలు తమదేశాన్ని  ద లాండ్ ఆఫ్ ఫ్రీడం  (స్వతంత్ర భూమి) అని సగర్వంగా పిలుచుకుంటారు. అయినప్పటికి కొందరు ప్రజలు ప్రాథెట్ థాయ్, మెయాంగ్ థాయ్ లేక చిన్నాగా థాయ్ అనీ అంటుంటుంటారు. థాయ్ అంటే దేశం అయినప్పటికీ నగరం, పట్టణం అని కూడా అర్ధం స్పూరిస్తుంది. రాచా అనాచక్ థాయ్ అంటే థాయ్‌లాండ్ సామ్రాజ్యం అని అర్ధం. రాచా అంటే సంస్కృతంలో రాజా, రాజరికం అని అర్ధం. అనా అంటే సంస్కృతంలో ఆఙ అని అర్ధం. చక్ అంటే సంస్కృతంలో చక్రం అనగా అధికారానికి, పాలనకు గుర్తు. థాయ్‌లాండ్ జాతీయగీతాన్ని 1930లో దేశభక్తుడైన పీటర్ ఫియట్ రచించాడు.

థాయ్ ల్యాండ్ ఉద్భవనం కొద్ది కాలమే ఉన్న 1238 నాటి సుఖోథాయ్ రాజ్యానికి ఆపాదిస్తారు. దీని తర్వాత ఆయుత్థాయ రాజ్యం 14వ శతాబ్దంలో స్థాపించబడింది. థాయ్ సంస్కృతి చైనా, భారతదేశముల వల్ల ప్రభావితము చెందినది. మిగిలిన దక్షిణాసియా దేశాముల వలె థాయ్‌లాండ్‌లో 40,000 సంవత్సరాలాకు పూర్వమే మానవులు నివసించిన ఆధారాలు ఉన్నాయి. మొదటి శతాబ్దంలో ఖేమర్ సామ్రాజ్యానికి చెందిన ఫ్యునాన్ పాలనా సమయం నుండి థాయ్‌లాండ్ ప్రజలమీద భారతీయ సంప్రదాయ, మత ప్రభావం అధికంగా ఉంది. ఆయుత్థాయ వద్ద ఉన్న  వాట్ చైనావాతానారాం  అవశేషాలు 1767లో బర్మీయులు రాజా హిబంషిన్ ఆధ్వర్యంలో ఈ దేశంలో సాగించిన భస్మీపటలానికి గుర్తుగా నిలిచాయి. 13వ శతాబ్దంలో ఖేమర్ సామ్రాజ్య పతనం తరువాత థాయ్, మాన్, మలాయ్ రాజ్యాలు వర్ధిల్లాయి. ఈ ప్రదేశాలలో పురాతత్వ పరిశోధనలు, కళాఖండాలు, సియాం సామ్రాజ్య అవశేషాలు ఇప్పటికీ విశేషంగా లభిస్తున్నాయి. 12 వ శతాబ్ధానికి ముందు థాయ్ లేక సియామీ సామ్రాజ్యానికి చెందిన బుద్ధసంప్రదాయాన్ని అనుసరించే సుఖోథాయ్ పాలనసాగినట్లు 1238లో లభించిన ఆధారాలు తెలియజేస్తున్నాయి.

యురోపియన్ల వత్తిడికి ప్రతిగా యురోపియన్ సామ్రాజ్యలకు లోబడని ఏకైక దక్షిణాసియా దేశంగా థాయ్‌లాండ్ నిలబడింది. నాలుగు శతాబ్ధాల కాలంగా శక్తివంతమైన పాలకులు దీర్ఘకాలం థాయ్‌లాండ్‌ను పాలించడమే ఇందుకు ప్రధాన కారణం. థాయ్‌లాండ్ పాలకులు ఫ్రెంచ్ ఇండోచైనా, బ్రిటిష్ సామ్రాజ్యం వత్తిడి, శత్రువానికి 4 శతాబ్ధాల కాలం ఎదురొడ్డడం విశేషం అని చెప్పవచ్చు. దక్షిణాసియా దేశాలు ఫ్రెంచ్, బ్రిటిన్ సామ్రాజ్యల మద్య ఉన్నందున థాయ్‌లాండ్ పశ్చిమదేశాల ప్రభావానికి లోనయ్యింది. పశ్చిమదేశాల ప్రభావంతో 19వ శతాబ్దంలో వివిధరకాల సంస్కరణలు జరిగాయి. అలాగే ప్రధానంగా మెకాంగ్ తూర్పు భాగంలో విస్తారమైన భూభాగం ఫ్రెంచ్ వశపరచుకోగా బ్రిటన్‌ ప్రభుత్వం అంచలంచలుగా మలే ద్వీపకల్పంలోని భూభాగాలను స్వాధీనం చేసుకుంది.

పెనాంగ్‌తో మొదలైన నష్టం కొనసాగి చివరకు మలే సంప్రదాయక ప్రజలు నివసిస్తున్న నాలుగు ప్రాంతాలు కూడా ఆక్రమణకు లోనయ్యాయి. తరువాత 1909లో ఆంగ్లో - సియామీ ఒప్పందం కారణంగా ఆ నాలుగు భూభాగాలు మలేషియా ఉత్తరభూభాగ ప్రాంతాలుగా అయ్యాయి. 1932లో సైన్యానికి చెందిన ఖానా రాసడాన్నా బృందం, సివిల్ అధికారుల యకత్వంలో రక్తపాతరహిత ఉద్యమం చెలరేగి పాలనాధికారం చేతులుమారింది. రాజా ప్రజాధిపాక్ సియాం భూభాగాన్ని ప్రజలహస్థగతం చేయడంతో శతాబ్దాలుగా సాగిన రాజులపాలన ముగింపుకు వచ్చింది.
రెండవ ప్రపంచయుద్ధం సమయంలో జపాన్ థాయ్‌లాండ్ అధికారాన్ని మయాయ్ సరిహద్దులకు మార్చమని వత్తిడి చేసింది. థాయ్‌లాండ్ దేశంమీద దండయాత్ర చేసిన జపాన్ థాయ్‌లాండ్ సైన్యాలను ప్లిక్ పిబల్సంగ్రం వద్ద 6-8 గంటల వరకు నిలిపి ఉంచాయి. 1941 డిసెంబరు 21 న జరిగిన ఈ సంఘటన తరువాత జపాన్ థాయ్‌లాండ్ సైన్యాలకు దారి ఇచ్చింది. థాయ్‌లాండ్, జపాన్ ఫ్రెంచ్, బ్రిటిష్ సైన్యాలకు ఎదురించి పోరాడడానికి రహస్యఒప్పందం కుదుర్చుకున్నాయి. 1942లో థాయ్‌లాండ్ జపాన్ సాయతో అమెరికా, యునైటెడ్ కింగ్‌డం మీద యొద్ధం ప్రకటించింది. థాయ్‌లాండ్ అదేసమయం సెరీ-థాయ్ పేరుతో జపాన్‌ను అడ్డుకునే ఉద్యమం కూడా కొనసాగించడం విశేషం. థాయ్‌లాండ్- బర్మా డెత్-రైల్వే పనిలో 2,00,000 ఆసియన్ (ప్రధానంగా రోముషాకు చేరినవారు) కూలీలు, 60,000 సంయుక్త సైనికదళ సభ్యులు పాల్గొన్నారు. యుద్ధం తరువాత థాయ్‌లాండ్ అమెరికా సహాయ దేశంగా మారింది.
ప్రచ్ఛన్న యుద్ధం తరువాత థాయ్‌లాండ్ మిగిలిన అభివృద్ధి చెందుతున్న దేశాలమాదిరిగా రాజకీయ అస్థిరత వంటి సమస్యలను ఎదుర్కొంది. అయినప్పటికీ 1880 నాటికి స్థిరమైన సమృద్ధి, స్వాతంత్ర్యం సాధించింది.

థాయ్‌లాండ్ 1400 లో మలాయ్ ద్వీపకల్పం మీద ఆధిక్యత సాధించింది. మలాక్కా అనకూడా పిలువబడే ఈ భూభాగంలో టమాసెక్ (ప్రస్తుత సింగపూర్), అండమాన్ ద్వీపాలలో కొన్ని, జావా కాలనీ కూడా అంతర్భాగంగా ఉండేది. అయినప్పటికీ చివరకు సుల్తాన్ ప్రభుత్వానికి మద్దతుగా దాడి చేసిన బ్రిటిష్ సైన్యాల ధాటికి వెనుకంజ వేయక తప్పలేదు. మలాయ్ సుల్తాన్ రాజ్యానికి చెందిన ఉత్తర భూభాగం నుండి థాయ్ రాజాకు బంగారు పుష్పాలరూపంలో సంవత్సర కానుకలు సామంతరాజులు ఇచ్చే కప్పంలా అందుతూ ఉండేవి. మలాయ్ సామ్రాజ్యంలో 
బ్రిటిష్ ప్రవేశం తరువాత  ఆంగ్లో-సియామీస్  ఒప్పందం తరువాత బ్యాంకాక్ వరకు రైల్వే మార్గం నిర్మించడానికి సన్నాహాలు ఆరంభం అయ్యాయి. ఈ ఒప్పంద తరువాత సాతన్, పట్టాని భూభాగాలు థాయ్‌లాండుకు ఇవ్వబడ్డాయి.

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత మలాయ్ ద్వీపకల్పం జపానీయుల చొరబాటుకు గురైంది. 1942 నుండి 2008 వరకు కమ్యూనిస్టుల ఆధిపత్య కొనసాగింది. చైనా సాంస్కృతిక విప్లవం తరువాత 
చైనా, వియత్నాం భూభాగంలో కమ్యూనిస్టుల ప్రాభవం తగ్గడంతో థాయ్, మలయా శాంతి కొరకు పోరాటం సాగించారు. రెండవ ప్రపంచయుద్ధం తరువాత పి.యు.ఎల్.ఒ కొరకు సుకర్నో మద్దతుతో శాంతిపోరాటం తీవ్రం అయింది. ఈ పోరాటానికి మద్దతుగా నిలిచిన బౌద్ధులు, ముస్లిములు అత్యధికంగా ప్రాణాలు అర్పించవలసిన పరిస్థితి ఎదురైంది.

థాయ్‌లాండ్ అత్యధికంగా అంతర్జాతీయ, ప్రాంతీయ సంస్థలలో భాగస్వామ్యం వహిస్తుంది. థాయ్‌లాండ్ అలీనోద్యమరాజ్యాలలో ప్రధానమైనది అలాగే యునైటెడ్ స్టేట్స్ స్పెషల్ వాచ్ లిస్ట్ 301 దేశాలలో ప్రాధాన్యత కలిగి ఉంది. అసోసేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్ (ఎ.ఎస్.ఎ.ఎన్) లో క్రియాశీలక సభ్యత్వం కలిగి ఉంది. థాయ్‌లాండ్ మిగిలిన ఆగ్నేయాసియా దేశాలైన ఇండోనేషియా, మలేషియా,ఫిలిప్పైన్స్,సింగపూర్, బ్రూనై,లావోస్,కంబోడియా,బర్మా, వియత్నాం లతో సంబంధాలను అభివృద్ధి చేసుకుంటుంది. అలాగే సంవత్సర విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొంటూ ఉంది. ఆర్థిక, వాణిజ్యం, బ్యాంకింగ్, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలకు సహాయసహకారాలు అందిస్తుంది. 2003లో ఎ.పి.సి.ఇకి ఆతిథ్యం ఇచ్చింది. థాయ్‌లాండ్ గత ఉపముఖ్యమంత్రి డాక్టర్ సుపాచై పనిట్చ్‌పక్డి ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్‌గా ఐక్యరాజ్యసమితి 
ట్రేడ్ ఎండ్ డెవలప్మెంట్ సమావేశంలో ( యు.ఎన్.సి.టి.ఎ.డి) పాల్గొన్నాడు. థాయ్‌లాండ్ 2005 లో ఈస్ట్ ఆసియా సమ్మిట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నది.

గత కొన్నిసంవత్సరాలుగా అంతర్జాతీయ వేదిక మీద చురుకైన పాత్రపోషిస్తుంది. తూర్పు తైమూర్ ఇండోనేషియా నుండి స్వాతంత్ర్యం పొందిన తరువాత థాయ్‌లాండ్ మొదటిసారిగా ఐక్యరాజ్యసమితి శాంతి దళాలలో భాగస్వామ్యం వహించింది. థాయ్‌లాండ్ సైనిక బృందాలు ఇప్పుడు ఐక్యరాజ్యసమితి శాంతిసైన్యంలో నిలిచాయి. అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచుకోవడంలో భాగంగా థాయ్‌లాండ్ ప్రాంతీయ సంస్థలు, అమెరికా సంస్థలు,  ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోపరేషన్ ఇన్ యూరప్  సంస్థలలో భాగస్వామ్యం వహిస్తుంది.
ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ పునర్నిర్మాణ కార్యక్రమాలలో థాయ్‌లాండ్ బృందాలు పనిచేస్తున్నాయి. థాయ్‌లాండ్ చైనా, ఆస్ట్రేలియా, బహ్రయిన్,భారతదేశం అరియు అమెరికా లతో వ్యాపారసంబంధాలకు ప్రయత్నాలు చేస్తున్నది. తరువాత అధికథరల కారణంగా తీవ్రవిమర్శలకులోనై థాయ్ పరిశ్రమలు తుడిచిపెట్టుకు పోయాయి. థాక్సిన్ విదేశీసహాయాన్ని నిరాకరించి నిధిసహాయ దేశాలతో కలిసి పొరుగున ఉన్న మెకాంగ్ భూభాగ అభివృద్ధి కొరకు కృషిచేసింది. థాక్సిన్ పొరుగున ఉన్న లావోస్ వంటి వెనుకబడిన దేశాలకు థాయ్‌లాండ్ నాయకత్వం వహించాలని అభిలషిస్తూ వాటి అభివృద్ధి కొరకు వివిధ ప్రణాళికలను ప్రవేశపెట్టింది. థాక్సిన్ వివాదాస్పదంగా నిరంకుశ బర్మాప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగిస్తుంది. యు.ఎస్ నాయకత్వం వహించిన ఇరాక్ యుద్ధానికి 423 మంది శక్తివంతమైన యోధులను పంపి సహకరించింది. 2004 సెప్టెంబరులో థాయ్ తన బృందాలను వెనుకకు తీసుకుంది. ఈ యుద్ధంలో థాయ్ ఇద్దరు యోధులు మరణించారు.

పీపుల్స్ అలయంస్ ఫర్ డెమాక్రసీ లీడర్ కాసిట్ పిరోమ్యాను విదేశాంగమంత్రిగా నియమించాడు. విదేశాంగమంత్రిగా నియమించడానికి ముందు కాసిట్ కంబోడియా వ్యతిరేక పార్టీకి నాయకత్వం వహించాడు. 2009లో థాయ్, కంబోడియాల మద్య పెద్దేత్తున యుద్ధం చెలరేగింది. సరిహద్దులకు సమీపంలో ఉన్న 900 సంవత్సరాల విహియర్ హిందూ ఆలయం సమీపంలో ఈ యుద్ధం జరిగింది. కంబోడియా ప్రభుత్వం తాము 4 థాయ్ సైనికులను చంపామని 10 మందిని యుద్ధఖైదీలుగా పట్టుకున్నామని ప్రకటించారు. అయినప్పటికీ థాయ్‌లాండ్ మాత్రం తమ సైనికులు మరణినించినట్లుగాని గాయపడినట్లుగాని అంగీకరించలేదు. యుద్ధం తాము ఆరంభించలేదని రెండు దేశాలు గట్టిగా వాదించాయి.

థాయ్ సైనికదళం  ది రాయల్ థాయ్ ఆర్ముడ్ ఫోర్స్  అనిపిలివబడుతుంది. ఇందులో రాయల్ థాయ్ ఆర్మీ, ది రాయల్ థాయ్ నేవీ, రాయల్ థాయ్ ఎయిర్ అంతర్భాగంగా పారామిలిటరీ దళాలు ఉంటాయి. అంతేకాక పారామిలటరీ దళాలు కూడా ఇందులో అంతర్భాగంగా ఉంటాయి. ప్రస్తుతం సైన్యం మొత్తం సంఖ్య 8,00,000 మంది నియమించబడి ఉన్నారు.
రాజా భూమిబోల్ అదుల్యతేజ్ (9వ రామా ) సైన్యాలకు నామమాత్ర అధ్యక్షత (చొంతాక్) వహిస్తాడు. థాయ్‌లాండ్ రక్షణ మంత్రిత్వశాఖ థాయ్ సైనికదళాల నిర్వహణా వ్యవహారాలను చూసుకుంటుంది. థాయ్ సైనిక ప్రధానకార్యాలయ ఆధ్వర్యంలో సైనికదళం బాధ్యతలు నిర్వహిస్తుంది. సైనికాధికారిగా థాయ్‌లాండ్ రక్షణదళ ఉన్నతాధికారి బాధ్యతలు నిర్వహిస్తాడు.
థాయ్‌లాండ్ సైనికదళ వ్యయం దాదాపు 100 కోట్లు అమెరికన్ డాలర్లు.

రాజ్యాంగబద్ధంగా సైన్యంలో పనిచేయడం ప్రతిఒక్క పౌరుని బాధ్యతగా భావించబడుతుంది. అయినప్పటికీ రిజర్వ్ దళ శిక్షణలో చేరనివారిలో 21సంవత్సరాలు నిండిన వారికి సవచ్చంధ సైనికసేవలో కాని లేక ఆపత్జాల సైనిక బృందాలలో కాని పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. శిక్షణాకాలానికి అభ్యర్థులకు కాలనిర్ణయానికి ప్రత్యేక నియమాలు ఉంటాయి. 6-24 మాసాల శిక్షణ వారి విద్యార్హత, వారి రిజర్వ్ శిక్షణ లేక సైనికదినంలో (సాధారణంగా ఏప్రిల్ 1 వ తారీఖు ) వారి స్వచ్ఛంద సేవ మీద ఆధారపడి ఉంటుంది. గుర్తింపు పొందిన కళాశాల 1 విద్య పూర్తిచేసిన వారికి సంవత్సర ఆపత్కాల సైనిక శిక్షణకు కాని వారి జిల్లాలోని సైనిక కాత్యాలయంలో 6 మాసాల పనిచేయడానికి అర్హులౌతారు. 3 సంవత్సరాల పట్టవిద్య పూర్తిచేసిన వారు 1 సంవత్సరం ఆపత్కాల సైనికసేవ లేక వారి వారి జిల్లాలలో ఆరుమాసాల సేవకు అర్హులౌతారు. అంటే 1 సంవత్సర విద్య పూర్తిచేసినవారికి ఒక సంవత్సర శిక్షణార్హత ఉంటుంది.

థాయ్‌లాండ్ వైశాల్యం 5,13,120 చదరపు కిలోమీటర్లు (1,98,120 చదరపు మైళ్ళు. వైశాల్యారంగా థాయ్‌లాండ్ ప్రపంచంలో 51వ స్థానంలో ఉంది. ఇది యోమన్ కంటే స్వల్పంగా చిన్నది అలాగే స్పెయిన్ కంటే స్వల్పంగా పెద్దది. థాయ్‌లాండ్ పలు విభిన్న భూభాగాలకు పుట్టిల్లు. థాయ్ ఉన్నతభూములు ( హైలాండ్స్) అనిపిలువబడే పర్వతభూభాగం థాయ్‌లాండ్ ఉత్తరదిశలో ఉన్నాయి. తనాన్ తాంగ్ చై పర్వతావళిలో సముద్రమట్టానికి 2,565 మీటర్ల (8,415 అడుగులు ) ఎత్తులో ఉన్న ఇంతానాన్ శిఖరం దేశంలో ఎత్తైన భూభాగంగా భావించబడుతుంది. ఈశాన్యంలో సముద్రతీరం, మెకాంగ్ నది సరిహద్దుల మద్య  ఖోరత్ పీ,ఠభూమి  ఉంది. దేశం మద్యభాగంలో ప్రధానంగా థాయ్‌లాండ్ అఖాతం (గల్ఫ్) వద్ద సముద్రసంగమం చేస్తున్న చయో ఫర్యా నదీ మైదానం ఆధిక్యత కలిగి ఉంది.

దక్షిణ థాయ్‌లాండ్ భుభాగంలో సన్నని క్రా ఇస్త్మస్ మలేషియా వరకు విస్తరించి ఉంది. థాయ్‌లాండ్ జసంఖ్య, ప్రధాన వనరులు, సహజసిద్ధమైన భూభాగం, సాంఘిక అరియు ఆర్థిక స్థితిగతుల భేదంకలిగిన ఆరుభాగాలుగా రాజకీయంగా విభజించబడి ఉంది. థాయ్‌లాండ్ భౌతిక ఆకర్షణీయతకు ఈ వైవిధ్యాలు విపరీతంగా భాగస్వామ్యం వహిస్తున్నాయి.

చయో ఫర్యా, మెకాంగ్ నదులు గ్రామీణ థాయ్‌లాండ్ స్థిరమైన వనరుగా భావించబడుతుంది. ఈ రెండు నదులు, ఉపనదులు థాయ్‌లాండ్ వ్యవసాయ ఉత్పత్తికి ఆధారభూతంగా ఉదహరించబడుతున్నాయి. 3,20,000 కిలోమీటర్ల (1,24,000 మైళ్ళ ) పొడవైన థాయ్‌లాండ్ అఖాత సముద్రతీరాలో చాయో ఫర్యా, మెకాంగ్, బాంగ్ పకాంగ్, తాపి నదులు సముద్రసంగమం చేస్తున్నాయి. ఇది థాయ్‌లాండ్ పర్యాటకరంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. థాయ్ అఖాతం లోతు తక్కువైన స్వచ్ఛమైన జలాలు పర్యాట్కులను అత్యధికంగా ఆకర్షిస్తున్నాయి. 
ప్రధానంగా దక్షిణ తీరంలో ఉన్న క్రా ఇస్త్మస్ ప్రాతం ప్రముఖ పర్యాటక ఆకర్షణగా ఉంది. థాయ్‌లాండ్ అఖాతం పారిశ్రామికంగా కూడా ప్రాముఖ్యత కలిగి ఉంది. థాయ్‌లాండ్ ప్రధాన నౌకాశ్రయం అయిన సతాహిప్ పోర్ట్ బాంకాక్ ఇన్‌లాండ్ సీపోర్ట్ ప్రవేశంగా ఉంది. అత్యధికంగా పర్యాటక ఆకర్షణ కలిగిన విలాసవంతమైన రిసార్ట్లు ఉన్న అండమాన్ సముద్రతీర ప్ర్రంతం ఆసియాలో పసిద్ధి చెందాయి. ఫూకెట్, క్రబీ, రనాంగ్, ఫంగ్ న్గా, ట్రాంగ్, సుందరమైన థాయ్‌లాండ్ ద్వీపాలు అన్నీ అండమాన్ సముద్రతీరంలో ఉన్నాయి. 2004లో సంభవించిన సునామీ సంఘటనలను అధిగమించి ఆసియా ఉన్నత వర్గానికి చెందిన ప్రజలకు ఇవి జలక్రీడా మైదానాలుగా ఉన్నాయి. సూయజ్, పనామా కాలువల మాదిరిగా  తాయ్ కెనాల్  నిర్మించి రవాణా సౌకర్యాన్ని ఏర్పరచాలన్న వ్యూహాత్మకంగా ప్రణాళికలు సాగుతున్నాయి. థాయ్ రాజకీయనాయకులు సహితం ఈ ప్రణాళికకు మద్దతు తెలుపుతున్నారు. ఈ కాలువ నిర్మాణంతో సింగపూర్ నౌకాశ్రయ చార్జీలు తగ్గడం అలాగే చైనా, భారత్‌లతో వాణిజ్యసంభంధాలు మెరుగుపడగలవని యోచిస్తున్నారు. మలాకా సంధిలోని సముద్రచోరులనుండి రక్షణ లభించడం రవాణా సమయం తగ్గడం వంటి ప్రయోజనాలే కాక ఆసియాలో థాయ్‌లాండ్ ప్రధాన నౌకాకేంద్రంగా మారే అవకాశాల దృష్ట్యా ఈ ప్రభుత్వ ప్రణాళికు వ్యాపారవర్గాల మద్దతు కూడా లభిస్తుంది. థాయ్‌లాండ్ దక్షిణతీర నౌకాశ్రయాలు దేశ ఆర్థికరంగ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుంది. ప్రధానంగా పర్యాటకరంగం ద్వారా లభిస్తున్న దేశాదాయం ఇప్పుడు సేవారంగానికి విస్తరించడం ద్వారా థాయ్‌లాండ్ ఆసియా సేవాకేంద్రగా మారనున్నది. ఇంజనీరింగ్ ప్రాధాన్యత కలిగిన ఈ కాలువ నిర్మాణానికి సుమారుగా 20-30 బిలియన్ల అమెరికన్ డాలర్ల వ్యయం కాగలదని భావిస్తున్నారు. ఉష్ణమండల ఉష్ణోగ్రతలు కలిగిన థాయ్‌లాండ్ వాతావరణం మీద వర్షాల ప్రభావంకూడా అధికంగానే ఉంటుంది. వర్షాలతో కూడిన, వెచ్చని, చల్లని సౌత్-వెస్ట్ వర్షపాతం మే మాసం మద్య నుండి సెప్టెంబరు వరకు కొనసాగుతుంది. దక్షిణ ఇస్త్మస్ వేడి, తడితో కూడిన మిశ్రిత వాతావరణం కలిగి ఉంటుంది.

థాయ్‌లాండ్‌లో అక్షరాస్యత అత్యున్నతమైన స్థాయిలో ఉంది. అలాగే థాయ్‌లాండ్‌లో చాక్కగా నిర్వహిస్తున్న విద్యావిధానంలో కిండర్‌గార్డెన్, లోయర్ సెకండరీ, అప్పర్ సెకండరీ పాఠశాలలు, లెక్కకు మించిన ఒకేషనల్ కాలేజులు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రైవేట్ రంగ విద్యావిధనం కూడా చక్కగా అభివృద్ధి చెంది అన్ని రంగాలకు చెందిన విద్యను అందిస్తూ ప్రభుత్వరంగ విద్యాసంస్థలను అధిగమించింది. 14 సంవత్సరాల వరకు నిర్భంధ విద్యావిధానం అమలులో ఉంది. అలాగే ప్రభుత్వం 17 సంవత్సరాల వరకు ఉచిత విద్యను అందిస్తుంది.

విద్యావిధానం విద్యార్థులపై కాఏంద్రీకృతమై ఉంది. అయినప్పటికీ పాఠ్యాంశాలు మాత్రం నిరంతరం మార్పులకు లోనౌతున్న కారణంగా ఉపాధ్యాయులకు తాము బోధించవాసినది ఏమిటో తెలియక, పాఠ్యపుస్తకాల రచయితలు తమపనిని కొనసాగించఏని స్థితిలో ఉన్నారు. ఇది కొన్ని సంవత్సరాల నుండి విశ్వవిద్యాలయాలలో సహితం వివాదాంశంగా మారింది. అయినప్పటికీ 

థాయ్‌లాండ్‌లో సైన్స్ గురించిన పరిశోధనలు, ఆర్థిక సంబంధిత బాధ్యతను  ది నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ  విభాగం వహిస్తుంది. భౌతిక, రసాయనిక, మెటీరియల్ సైంసెస్ సంబంధిత విషయాలకు  ది సిన్‌క్రోట్రాన్ లైట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్.ఎ.ఆర్) సంస్థ సహకారం అందిస్తున్నది. ఇది  సురానరీ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ  (ఎస్.యు.టి) లో అంతర్భాగంగా ఉంది. ఈ ఇన్‌స్టిట్యూటుకు  మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎం.ఒ.ఎస్.టి) ఆర్ధికసాయం అందిస్తుంది. దక్షిణాసియాలో అత్యధిక ఆర్ధికసాయంతో నడుస్తున్న ఇన్‌స్టిట్యూట్‌గా భావించబడుతుంది. ఎస్.ఒ.ఆర్.టి.ఇ.సి సింక్రోట్రాన్ ముందుగా జపాన్‌లో ఆరంభించి తరువాత థాయ్‌లాండుకు తరలించబడింది.

థాయ్‌లాండ్‌ ప్రభుత్వం 23,000 వై.వై అంతర్జాల అనుసంధాన కేంద్రాలు ప్రజల కొరకు అందిస్తుంది. థాయ్‌లాండ్‌లో అంతర్జాలం 10గిగాబైట్ల హైస్పీడ్ ఫైబర్-ఆప్టిక్ లైన్లు ఉన్నాయి. ఐ.ఎస్.పి , కె.ఐ.ఆర్.జెడ్ సంస్థలు నివాసగృహాలకు అంతర్జాల వసతి అందిస్తుంది. థాయ్‌లాండ్ ప్రభుత్వం అంతర్జాలాన్ని సెంసార్ చేసి కొన్ని సైట్స్‌ను ప్రజలకు చేరకుండా అడ్డుకుంటుంది. రాయల్ థాయ్ పోలీస్, ది కమ్యూనికేషన్ అథారిటీ, సమాచార మంత్రిత్వశాఖ సెంసార్ బాధ్యత వహిస్తుంది.

థాయ్‌లాండులో అణుధార్మిక విద్తుత్ సంస్థలు లేవు. అయినప్పటికీ 2026లో ఆరంభించడానికి అవకాశం ఉంది. ప్రస్థుతం 80% విద్యుత్తు ఫాసిల్ ఫ్యూయల్ నుండి లభిస్తుంది.

థాయ్‌లాండ్ సరికొత్తగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ ఆర్ధికాభివృద్ధి సాధిస్తున్న దేశాలలో ఒకటి. 1985-1996 మద్య అత్యధికసాయిలో సాధించిన అభివృద్ధి తరువాత థాయ్‌లాండ్ ద్రవ్యం సంవత్సరానికి 12.4% అభివృద్ధి రేటును నమోదు చేస్తుంది. 1997లో దేశం ఎదుర్కొన్న ఆర్ధికసంక్షోభం కారణంగా దేశ ఆర్ధిక అభివృద్ధి 1.9% పతనం అయింది. సంక్షోభాన్ని నివారించలేని అసమర్ధత కారణంగా  చవాలిత్ యోంగ్‌చైయుధ్ రాజ్యాంగం మంత్రిమండలితో సహా రాజీనామా చేయవలసిన పరిస్థితి ఎదురైంది. 1978 నాటికి అమెరికన్ డాలరుకు బదులుగా 25 బాహ్త్‌ (థాయ్ ద్రవ్యం) 1997 నాటికి 56 బాహ్త్‌ల స్థాయికి పతనం అయింది. 1998 నాటికి మరో 10.8% పతనం అయింది. ఈ పతనం ఆసియన్ ఆర్థిక సంక్షోభం మీద మరింత ప్రభావం చూపింది. 1999 లో థాయ్‌లాండ్ ఆర్థికవ్యవస్థ కోలొకోవడం ప్రారంభం అయింది. అత్యధికంగా పెరిగిన ఎగుమతులే ఇందుకు ప్రధానకారణం. 2001లో సరళీకృతం చేయబడిన ప్రపంచ ఆర్థికవ్యవస్థ కారణంగా థాయ్‌లండ్ 2.2% ఆర్థికాభివృద్ధి సాధ్యమైంది. తురువాత కాలంలో థాయ్‌లాండ్ ఆసియా ఆర్థికవ్యవస్థలో క్రమాభివృద్ధి సాధించింది. బలహీనమైన బాహ్త్ ఎగుమతులను ప్రోత్సహించిఅడమేకాక భారి ప్రణాళికలు, ప్రధానమంత్రి అందిచిన ప్రోత్సాహం దేశాంతర్గత కొనుగోలుశక్తి అధికం అయింది. 2002,2003, 2004 సంవత్సరానికి 5.7% ఆర్థికాభివృద్ధి సాధ్యమైంది.2005,2006, 2007 సంవత్సర అభివృద్ధి 4-5% అభివృద్ధి కొనసాగింది. 2008 నాటికి అమెరికన్ డాలర్ బలహీనపడడం, థాయ్‌లాండ్ ద్రవ్యం బలపడడం కొనసాగిన కారణంగా 2008 నాటికి అమెరికన్ డాలర్‌కు ఎదురుగా బాహ్త్ 33 స్థాయికి అభివృద్ధి కొనసాగింది.

థాయ్‌లాండ్ సంవత్సరానికి సేవలరూపంలో అందిస్తున్నది, వస్తురూపంలో ఎగుమతి చేస్తున్న వాణిజ్యం విలువ 105 అమెరికన్ డాలర్లు. ఎగుమతులలో ప్రధానమైనవి థాయ్ బియ్యం, వస్త్రాలు, పూలు, మత్య ఉత్పత్తులు,రబ్బర్, ఆభరణాలు, కార్లు, కంప్యూటర్లు, విద్యుత్తు పరికరాలు మొదలైనవి. బియ్యం ఎగుమతులలో థాయ్‌లాండ్ మొదటి స్థానంలో ఉంది. థాయ్‌లాండ్ సంవత్సరానికి 6.5 మిలియన్ టన్నులు బియ్యం ఎగుమతి చేస్తున్నది. దేశంలో ప్రధాన పంట వరి. 27.25% సారవంతమైన భూములతో థాయ్‌లాండ్ పంటభూములు అధికంగా కలిగిన దేశాలలో మహా మెకాంగ్ భూభాగంలో ప్రథమ స్థానంలో ఉంది. థాయ్‌లాండ్ సాగుభూములలో 55% వరి పంటకు ఉపయోగించబడుతుంది.

విజయవంతంగా నడుస్తున్న విద్యుత్తు ఉపయోగ పరికరాలు, విడిభాగాలు, కంప్యూటర్లు విడిభాగాలు, కార్ల సంబంధిత ఉత్పత్తులు దేశాదాయానికి ఉపకరిస్తుండగా. థాయ్‌లాండ్ ఆదాయానికి పర్యాట్కరగం నుండి 6% ఆదాయం లభిస్తుంది. అలాగే పేదరికం, సాంస్కృతిక పరిస్థితులు మిళితమైన కారణంగా చట్టవిరుద్దమైన కార్యకలాపాలతో సంపాదించిన న్యాయవిరుద్ధమై ద్రవ్యంతో 2003 లో థాయ్‌లాండ్ జి.డి.పి 3% అభివృద్ధి చెందింది. ఇలా చేరిన ద్రవ్యం విలువ సుమారు 3 బిలియన్ల (300 కోట్లు) అమెరికన్ డాలర్లని అంచనా. 1993 లో 
చట్టవిరుద్దమైన కార్యకలాపాలతో సంపాదించిన ద్రవ్యంతో థాయ్‌లాండ్ జి.డి.పి 2.7% పెరిగిందని చులాలాంకోన్ విశ్వవిద్యాలయం అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. పర్యాటక రంగం నుండి 
లభిస్తున్న ఆదాయంలో 10% చట్టవిరోధ కార్యకలాపాలద్వారా లభిస్తుందని అంచనా. థాయ్‌లాండ్ జి.డి.పి విలువ 602 బిలియన్ల ( 60200 కోట్లు ) అమెరికన్ డాలర్లు. థాయ్‌లాండ్ ఆర్థికశక్తి దక్షిణాసియాలో ద్వితీయ స్థానంలో ఉంది. ప్రథమ స్థానంలో ఇండోనేషియా ఉంది. థాయ్‌లాండ్ తలసరి ఆదాయం దక్షిణాసియా దేశాలలో 4వ స్థానంలో ఉంది. మొదటి 3 స్థానాలలో సింగపూర్, బ్రూనై, మలేషియా ఉన్నాయి. పొరుగున ఉన్న లావోస్, బర్మా, కంభోడియా దేశాలకు థాయ్‌లాండ్ ఆర్థికరంగం మూలాధారంగా ఉంది. 1997-1998 ఆసియా ఆర్థిక సంక్షోభానికి అనేక ఇతరకారణలాతో ఎగుమతులు ప్రధాన కారణమైయ్యాయి. ప్రపంచంలో ఆటోమోటివ్, విద్యుత్తు ఉపయోగ పరికరాలు ఏగుమతులలో థాయ్‌లాండ్ ప్రథమ స్థానంలో ఉంది. 1997, 2010 మద్యకాలంలోంపరిశ్రమల సమ్మిళితం, సంపద విక్రయాల విలువ 81 మిలియన్ల (8,100 కోట్లు) అమెరికండాలర్లని థాయ్ ఫార్ంస్ ప్రకటించింది. 2010 లో మాత్రమే ఈ విక్రయాలు సరికొత్త రికార్డ్ సృష్టిస్తూ 12 మిలియన్ల (1,200 కోట్లు) అమెరికండాలర్లని అంచనా. 2011 లో జరిగిన పి.టి.టి కెమికల్స్ పి.సి.ల్ కపెనీ సమ్మిళితం అతి పెద్ద విక్రయంగా భావించబడుతుంది.ఈ విక్రయం విలువ 3.8 బిలియన్ల (380 కోట్లు).

థాయ్‌లాండ్ శ్రామికులలో 49% వ్యవవసాయక్షేత్రాలలో పనిచేస్తున్నారు. అయినప్పటికీ 1980లో వ్యవసాయక్షేత్రాలలో 70% శ్రామికులు పనిచేసేవారు. పారిశ్రామిక సంస్థలకు శ్రామికులు అధికంగా 
తరలిపోవడంతో వ్యవసాయరంగం శ్రామికుల కొరత సమస్యను ఎదుర్కొంటున్నది. 1962-1983 మద్యకాలంలో వ్యవసాయరంగం 4.1% అభివృద్ధిని సాధించింది. తరువాత సంవత్సరాలలో సరాసరి 2.2% అభివృద్ధి కొనసాగింది. వస్తువుల ఎగుమతి, సేవారంగంలో జి.డి.పి అభివృద్ధి కొనసాగుతున్న తరుణంలో వ్యవసాయరంగ జి.డి.పి మాత్రం తగ్గుముఖం పట్టింది. 2011లో థాయ్‌లాండ్ నిరుద్యోగం 0.4%తో ఆరంభం అయింది. సమీపకాలంలో అనుకోకుండా తలెత్తిన తిరుగుబాటు, సైకప్రపాలన ప్రభావం వలన దేశంలో అస్థిరత ఏర్పడినప్పటికీ జి.డి.పి అభివృద్ధి మాత్రం 4-5% వద్ద నిలదొక్కుకుంది. సివిలియన్ పాలనలో 5-7% ఉన్న జి.డి.పి రాజకీయ అస్థిరత వలన కొంత క్షీణించింది.

థాయ్‌లాండ్ సాధారణంగా మెట్రిక్ విధానం అనుసరిస్తున్నా భూ పరిమాణ కొలతలకు అంగుళాలు, అడుగుల వంటి సంప్రదాయక విధానాలను అనుసరిస్తుంది. కొన్ని సమయాలలో వడ్రంగి పనికి ఉపకరించే కొయ్యను కొలడానికి కూడా ఈ పద్ధతి అనుసరించబడుతుంది. విద్యాబోధనకు బి.ఇ ( బౌద్ధ శకం) విధానంలో కాలగణన జరుగుతున్నప్పటికీ పౌరసేవలకు, ప్రభుత్వ ఒప్పందాలకు, వార్తాపత్రికలకు, బ్యాంకింగ్, పరిశ్రమలు, వాణిజ్య సంబంధిత వస్షయాలకు మాత్రం పాశ్చాత్య విధానంలో క్రీస్తుశకం కాలగణను అనుసరిస్తుంది.

థాయ్‌లాండ్ అధికారిక భాష థాయ్ - కడై. ఇది లావోస్, బర్మాలోని షాన్ భాషకు సమీపంగ ఉంటుంది. దక్షిణ చైనా సరిహద్దులకు సమీపంగా ఉన్న హన్నియన్ యోమన్ నగరాలలో ఉపభాషలు కొన్ని మాట్లాడబడుతున్నాయి. థాయ్ - కడై భాషా విద్యబోధనకు, ప్రభుత్వనిర్వహణకు ఉపకరిస్తూ దేశమంతటా వాడుకలో ఉంది. మద్య థాయ్‌లాండ్‌లో వాడుకలో ఉన్న భాష ప్రామాణిక భాషగా భావించబడుతుంది. ఇది థాయ్ అక్షరమాల, అబుగిడా లిపి ( ఖేమర్ లిపి ప్రభావితంగా ఏర్పడినది) గా వాడబడుతుంది. పలు ఇతర భాషలు వాడుకలో ఉన్నాయి. 
దక్షిణ థాయ్ భాష దక్షిణ థాయ్‌లాండ్‌లో మాట్లాడబడుతుంది. ఉత్తర భూభాగంలో ఉత్తర థాయ్ భాష మాట్లాడబడుతుంది. స్వతంత్రరాజ్యమైన లానథాయ్ భూభాగంలో ఉత్తర థాయ్ భాష మాట్లాడబడుతుంది. థాయ్‌లాండ్ పలు అల్పసంఖ్యాక భాషాకు కూడా ఆతిథ్యం ఇస్తుంది. వీటిలో పెద్దది లావో యాసతో కూడిన ఇసాన్ ఉత్తర థాయ్ భాష మాట్లాడబడుతుంది. ఇది ఒక్కోసారి థాయ్ భాషగా పరిగణించబడుతుంది. ఈ భాషను మాట్లాడే ప్రాంతం ఒకప్పుడు లావోస్ రాజ్యంలో (లన్ క్సనంగ్ సామ్రాజ్యం) ఉంటూ వచ్చింది. సుదూర దక్షిణ ప్రాంతంలో మలేషియా దేశ ప్రధాన భాషైన మలాయ్ యాసతో కూడిన యావీ భాష మాట్లాడబడుతుంది. అత్యధికంగా ఉన్న చైనీయులు వైవిధ్యమైన చైనా భాషలు మాట్లాడబడుతున్నాయి. టియోచ్యూ వీటిలో ప్రధానమైనది.

మాన్-ఖేమర్ కుటుంబం చెందిన మాన్, వియట్, మ్లబ్రి, ఆస్ట్రోనేషియన్ కుటుంబానికి చెందిన ఒరంగ్ అస్లి, చాం, మోకెన్. సినో - టిబెటన్ కుటుంబానికి చెందిన లావా, అఖాన్, ఇతర థాయ్ భాషలైన నియా, ఫూథాయ్, సియాక్ వంటి పలు గిరిజన భాషలు కూడా వాడుకలో ఉన్నాయి. హమాంగ్ ప్రజల మధ్య హమాంగ్ భాష వాడుకలో ఉంది. దీనిని భాషాకుటుంబానికి చెందిన ప్రజలకు వాడుకలో ఉన్న భాషగా గౌరవిస్తున్నారు. పాఠశాలలలో ఆంగ్లభాషను నిర్బంధం చేస్తున్నప్పటికీ ఆంగ్లభాషను ధారాళంగా మాట్లాడుతున్న ప్రజలసంఖ్య మాత్రం తక్కువగా ఉన్నారు. ప్రత్యేకంగా నగరానికి వెలుపల నివసిస్తున్న ప్రజల మధ్య ఆగ్లభాష వాడకం తక్కువగా ఉంది.

థాయ్‌లాండ్‌లో సాధారణంగా తరవాడ బుద్ధమతం ఆచరణలో ఉంది. ప్రపంచంలో తరవాడ బుద్ధిజం ఉన్నతమైన బుద్ధమతంగా భావించబడుతుంది. చివరి గణాంకాలను అనుసరించి బుద్ధమతావలంబీకులలో 94.6% మంది తరవాడ బుద్ధిజాన్ని అనుసరిస్తున్నారని భావిస్తున్నారు. థాయ్‌లాండ్‌లో రెండవ స్థానంలో ఉన్న ముస్లిం మతాన్ని 4.6% ప్రజలు ఆచరిస్తున్నారు. 
థాయ్‌లాండ్‌ దక్షిణ భూభాగాలలో పట్టాని, యాల, నరాథివాట్, సంగ్కాల చుంఫాన్‌లో కొంతభాగం ముస్లిములు అధికంగా ఉన్నారు. జనసంఖ్యలో క్రైస్తవ మతావలంబీకులు 07% ఉన్నారు. దేశంలోని నగరాలలో స్వల్పసంఖ్యలో సిక్కు మతావలంబీకులు, హిందూ మతావలంబీకులు ఉన్నారు. దేశంలో 17వ శతాబ్ధనికి చెందిన ప్రజలలో కొందరు జ్యూయిష్ మతావలంబీకులు కూడా ఉన్నారు.

థాయ్ సంస్కృతి భారతీయ, లావో, బర్మా, కంబోడియా, చైనా సంస్కృతుల ప్రభావంతో రూపుదిద్దుకుంది. థాయ్ సంప్రదాయాలు కూడా భారతీయ, కంబోడియా, చైనా, ఇతర దక్షిణాసియా సంప్రదాల వలన ప్రభావితమై ఉంది. థాయ్‌లాండ్ దేశీయ మతం తరవాడ బుద్ధిజం ఆధునిక థాయ్‌లాండ్ ఒక ప్రత్యేకతగా ఉంది. థాయ్ బుద్ధిజం కాలానుగుణంగా హిందూయిజం, అనిమిజం అలాగే పూర్వీకుల ఆరాధనా విధానాల వంటి అనేక మతవిశ్వాలతో ప్రభావితమైంది. థాయ్ అఫ్హికారిక క్యాలెండర్ బౌద్ధశక ఆధారితంగా తయారుచేయబడింది. ఇది గ్రిగేరియన్ క్యాలెండరుకు (పాశ్చాత్య) 543 సంవత్సరాలకు ముందు ఉంటుంది. ఉదాహరణగా క్రీ.శ 2012 థాయ్ క్యాలెండరులో 2555 ఉంటుంది.

భారతదేశం నుంచి విస్తరించిన హిందూ, బౌద్ధమతాల ప్రభావాలు కాంభోజదేశం నుంచి థాయ్‌లాండ్‌లోకి ప్రవేశించింది. అంతేకాక భారతదేశం నుంచి విజ్ఞాన కృషి చేయడానికి వచ్చిన బ్రాహ్మణులు, వ్యాపారానికి వచ్చిన వర్తకులు ఈ మతప్రచారం చేశారు. థాయ్‌లాండ్‌లోని మతం, భాష, సంస్థలు, లిపి, కళలు, సాహిత్యం వంటివాటిలో భారతీయ ముద్ర కనిపిస్తుంది.

థాయ్ ప్రజల నిర్లక్ష్యానికి గురైన పలు ప్రత్యేక ఆదివాసి ప్రజలలో కొంతమంది బర్మా, లావోస్, కంబోడియా, మలేషియాలలో ప్రవేశించి వారితో కలిసిపోయారు. మిగిలిన వారు వారి సంప్రదాయాలకు ప్రాంతీయ సంస్కృతో సంప్రదాయాలు, అంతర్జాతీయ సంప్రదాయాలను మిశ్రితంచేసి సరికొత్త వరవడిని సృష్టించుకున్నారు. చైనా నుండి వచ్చి చేరిన ప్రజలు కూడా థాయ్ ప్రజలలో గుర్తించతగినంతగా ఉన్నారు. వీరు ప్రత్యేకంగా బ్యాంకాక్, దాని పరిసరప్రాంతాలలో ఉన్నారు. వారు తాయ్ ప్రజలతో మిశితం అవడం వలన వారు ఆర్థిక, రాజకీయ రంగాలలో ప్రత్యేక స్థానం వహిస్తున్నారు. వారికి ఉన్న అంతర్జాతీయ కుటుంబ సంప్రదాయ సంబంధాలతో వారు వ్యాపార సంబంధాలు ఏర్పరచుకుని వాణిజ్యరంగంలో విజయం సాధించారు. ఖోన్ షో థాయ్‌లాండ్ కళాప్రదర్శనలలో ప్రాబల్యం సంతరించుకుంది.

థాయ్ యువత ఒకరిని ఒకరు కలుసుకున్న సమయాలలో వాయ్ అని ఒకరికి ఒకరు అభినందనలు తెలుపుకుంటారు. వాయ్ అంటే రెండుచేతులు కలిపి నమస్కరించి తల వంచి చేతి వేళ్ళను తాకుతూ తమ గౌరవాన్ని తెలియజేస్తూ మాటలలో  సవాస్దీ ఖ్రాప్  అని పురుషులకు,  సవాస్దీ కా  అని స్త్రీలకు పలుకుతారు. వయసులో పెద్దవారు కూడా అలాగే ప్రతిస్పందిస్తారు. 
అధికారులు, పెద్దవారు, పూజ్యులు ప్రత్యేకంగా ఇలా గౌరవాన్ని అందుకుంటారు. భారతదేశం, నేపాల్ దేశాలలో నమస్కారం పోలినదే వాయ్. ఫుట్ బాల్ క్రీడ థాయ్ సంప్రదాయక క్రీడ అయిన మాయ్ క్రీడను అధిగమించింది. సమకాలీన థాయ్‌లాండ్ యువత ఈ క్రీడలను చూడడానికి ఉత్సుకత చూపిస్తున్నారు. థాయ్ ప్రజలు అధికంగా ఆదరిస్తున్న ఇతర క్రీడలలో గాలిపటాలు ఎగురవేయడానికి ప్రత్యేకస్థానం ఉంది.

థాయ్ ఆహార సంస్కృతిలో ప్రధానంగా ఐదు రుచులు ప్రాధాన్యత వహిస్తాయి. అవి వరుసగా తీపి, ఖారం, వగరు, చేదు, ఉప్పు. థాయ్ వంటలలో తెల్లగడ్డలు, మిరపకాయలు, నిమ్మకాయ రసం, నిమ్మగడ్డి, ఫిష్ సాస్ ప్రధానంగా చోటుచేసుకుంటాయి. థాయ్ ప్రధాన ఆహారం బియ్యం. ప్రత్యేకంగా జాస్మిన్ బియ్యం ( దీనిని హాం మాలి రైస్ అని కూడా అంటారు) దాదాపు తాయ్ ఆహారలు అన్నింటికి చేర్చుకుంటారు. బియ్యం ఎగుమతిలలో అంతర్జాతీయంగా ప్రథమస్థానంలో ఉన్న థాయ్‌లాండ్‌లో ఒక వ్యక్తి ఒక సంవత్సరానికి సరాసరి 100 కిలోల బియ్యం తన ఆహారంలో ఉపయోస్తున్నాడు. థాయ్‌లాండ్ నుండి సేకరించిన 5,000 వరివంగడాలు ఫిలిప్పైన్‌లో ఉన్న   రైస్ జెనె బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రైస్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్  (ఐ.ఆర్.ఆర్.ఐ) సంరక్షించబడుతున్నాయి. థాయ్‌లాండ్ రాజు ఐ.ఆర్.ఆర్.ఐ అధికారిక పోషకుడుగా ఉంటాడు.

అనేక ఆసియన్ సంస్కృతుల మాదిరిగా థాయ్‌లాండ్ మతసంప్రదాయాలు పూర్వీకులపట్ల గౌరవం ప్రదర్శినడానికి ప్రధాన్యత ఇస్తాయి. వంశానుగతంగా వచ్చిన సంస్కృతి వలన సేవాభావం, ఔదార్యం థాయ్ సంస్కృతిలో భాగమై ఉంది. పెద్దరికం అన్నది థాయ్ సంప్రదాయంలో అత్యంత ప్రధాన్యత కలిగి ఉంది. పండుగలు, సంప్రదాయ వేడుకలు, కుటుంబ నిర్ణయాలు చేయడంలో పెద్దలకు సముచిత స్థానం ఉంటుంది. సంతానంలో పెద్దవారు చిన్నవారి పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు.

థాయ్‌లాండ్ సంస్కృతిలో కాలితో మరొకరి తలను తాకడం నిషేధం. థాయ్‌లాండ్ ప్రజలు కాళ్ళు శరీరంలో హీనమైన భాగంగా భావించడమే ఇందుకు కారణం. థాయ్ ప్రజలు గతకొన్ని సనత్సరాలుగా పలుభాషా సాహిత్యాన్ని చదివి ఆనందిస్తున్నారు. సమీపకాలంగా దేశంలో పలుభాషా సాహిత్యం అందుబాటులోకి రావడమే ఇందుకు కారణం. దేశంలో ఆంగ్ల, థాయ్, చైనా పత్రికలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలను ఆకర్షించడానికి పలు థాయ్ పత్రికలు కూడా ఆంగ్లశీర్షికలను ప్రచురిస్తుంటాయి. థాయ్‌లాండ్ వాణిజ్యంలో అధికంగా ఆంగ్లభాషను ఉపయోగిస్తారు. అలాగే కొంత వరకు ఇతర భాషలను కూడా మాట్లాడుతుంటారు.

థాయ్‌లాండ్ దేశంలో వార్తా పత్రికల ప్రచురణ దక్షిణాసియాలోనే ప్రత్యేకత కలిగి ఉంది. 2013 వ సంవత్సరంలో దేశంలో ఒకరోజుకు 13 మిలియన్ల దినపత్రికలు విక్రయించబడ్డాయి. బ్యాంకాక్ లోని అప్ కౌంటీ ప్రాతం మీడియాకు ప్రధానంగా స్థావరంగా వర్ధిల్లుతుంది. ఉదాహరణగా 2003-2004 థాయ్‌లాండ్స్ పబ్లిక్ రిలేషంస్ డిపార్ట్మెంట్ నివేదికలను అనుసరించి థాయ్‌లాండ్ ఈశాన్యభాగంలో 116 వార్తాపత్రికలు, రేడియో, టి.వి, కేబుల్ సంస్థలు పనిచేస్తున్నాయి.

నకోన్‌ రాచసీమ రాష్ట్రంలో క్రీ.శ 11వ శతాబ్దానికి చెందిన హిందూ దేవాలయం ఉంది. అందులోని శివలింగం, నంది విగ్రహాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అక్కడికి 15 కి.మీల దూరంలో పిమాయ్‌ చారిత్రాత్మక పార్కు ఉంది. 11-12 శతాబ్దాల్లో నిర్మించిన ఈ నగరం పేరు వాస్తవానికి విమయపుర తరువాతి కాలంలో విమయ, పిమాయ్‌గా మారింది. హిందూఖేమర్‌ వంశస్థులు నిర్మించిన ఈ నగరం కాంబోడియా నిర్మాణ శైలిలో ఉంటుంది. ఇక్కడ తప్పకుండా చూడాల్సిన మరో ప్రదేశం కోరట్‌. ఇక్కడ తవ్వకాల్లో బయటపడిన ఆదిమానవుల అవశేషాలను ప్రదర్శనలో ఉంచారు. దేశంలో సందర్శించాల్సిన మరో నగరం ఆయుతయ. ఇది కోరట్‌ - బ్యాంకాక్‌ మధ్య చావ్‌ ప్రాయా నది ఒడ్డున ఉన్న ప్రాచీన నగరం. ఆయుతయ... మన అయోధ్య నుంచి వచ్చిందని అభిప్రాయం. ఈ నగరంలో చాయ్‌వతనరం బౌద్ధాలయం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినంత ప్రధానమైనది. నాలుగు గోపురాల నడుమ 35 మీటర్ల ప్రధాన గోపురం నాటి నిర్మాణ శైలిని, నైపుణ్యాన్ని కళ్ళకు కడుతోంది.

థాయ్‌ల్యాండ్‌ పండుగల్లో సోంక్రన్‌, లోయ్‌క్రతాంగ్‌ ప్రధానమైనవి. ప్రాచీన థాయ్‌ క్యాలెండర్‌ ప్రకారం సంవత్సరాదిన అంటే ఏప్రిల్‌ ఒకటోతేదీన మొదలయ్యే సోంక్రన్‌ మన హోలీ లాంటిదే. ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ మూడురోజులపాటు ఉత్సాహంగా జరుగుతుంది. అలాగే లోయ్‌ క్రతాంగ్‌ పండుగ మన బతుకమ్మ, కార్తీక పౌర్ణమి వేడుకల్ని గుర్తు చేస్తుంది. అరటి దొప్పలో ఆకులు, పూలు, క్యాండిల్‌‌స అమర్చి నీటిలో వదులుతారు.

దేశంలో వ్యవసాయానికి, పశుసంపదకు ప్రసిద్ధి పొందిన ప్రదేశం కూడా కౌయాయ్‌ రీజియన్‌ మాత్రమే. ప్రత్యేక వాహనాల్లో వైన్‌ యార్డు మొత్తం తిరిగి చూడవచ్చు. కౌయాయ్‌ డెయిరీ ఫామ్‌‌సకి కూడా ప్రసద్ధి. చోక్‌చాయ్‌ ఫామ్‌ ఆసియాలోకి పెద్దది. 50 ఏళ్లుగా నడుస్తున్న ఈ ఫామ్‌ గొప్ప పర్యాటక ప్రదేశం కూడ. సాధారణ పర్యాటకులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు... ఏడాదికి కనీసం మూడు లక్షల మంది సందర్శిస్తారు. సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ బయోడీజిల్‌, ఐస్‌క్రీమ్‌ వంటి పాల ఉత్పత్తులు తయారుచేసే చోక్‌చాయ్‌ ఫామ్‌ ఎప్పుడూ సందడిగా ఉంటుంది. సందర్శకుల బస కోసం అత్యాధునిక గుడారాలు, వినోదం కోసం కౌబాయ్‌ షోవంటి వినోద కార్యక్రమాలు, రెస్టారెంట్లు, షాపింగ్‌ సెంటర్లు ఉన్నాయి.

థాయ్‌లో పట్టాయాలో బీచ్‌ రిసార్టులు, హోటళ్లు ఉన్నట్లే కౌయాయ్‌లో రిసార్టులు పచ్చటి చెట్లు, పర్వత శ్రేణుల మధ్య ఉన్నాయి. ఇక్కడ ప్రతి రిసార్‌‌ట, హోటల్‌ పర్యాటకుల వినోదాల కోసం ఏదో ఒక ప్రత్యేక ఏర్పాటు చేస్తుంది. అమ్యూజ్‌మెంట్‌ పార్కులు, అడ్వెంచర్‌ స్పోర్‌‌ట్స, స్విమ్మింగ్‌ పూల్‌‌స, కౌబాయ్‌ షోలవంటి వినోద కార్యక్రమాలు నిరంతరం సాగుతూనే ఉంటాయి. అరడజనుపైగా గోల్‌‌ఫ మైదానాలు ఉన్నాయి. దారిపొడవునా ప్రీమియం ఔట్‌లెట్‌‌స, లోటస్‌ మాల్‌‌స వంటి షాపింగ్‌ సెంటర్లు ఉంటాయి. ఇక్కడి పాలియో షాపింగ్‌ మాల్‌లో ఏదీ కొనకుండా విండో షాపింగ్‌ చేయడమూ చక్కని అనుభవమే. కౌయాయ్‌ ప్రాంతంలోనే ఉన్న డాన్‌క్వియాన్‌ ప్రాంతం పాటరీకి ప్రసిద్ధి.

మరకత బుద్ధుడు థాయ్‌ టూర్‌లో మరో ప్రత్యేకత బ్యాంకాక్‌లో ఎమరాల్‌‌డ బుద్ధుడిని చూడడం. వాట్‌ ప్రాకయో (ఎమరాల్‌‌డ బౌద్ధ ఆలయం) కాంబోడియా నిర్మాణ శైలిలో ఉంటుంది. పచ్చని గ్రానైట్‌ రాతితో నిర్మించిన బుద్ధుడి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం శతాబ్దాల క్రితం భారతదేశం నుంచి కాంబోడియా, లావోస్‌, వియత్నాం దేశాలగుండా చేతులు మారుతూ బ్యాంకాక్‌ చేరింది. బౌద్ధులు జీవితంలో ఒక్కసారైనా మరకత బుద్ధుడిని దర్శించుకోవాలనుకుంటారు. ఈ ఆలయం బ్యాంకాక్‌లో చావ్‌ప్రాయ నది ఒడ్డున ఉంది. ఈ నదికి మరో ఒడ్డున నిర్మించిన వాట్‌ అరుణ్‌ దేవాలయం మరో అద్భుత కట్టడం. 79 మీటర్ల పొడవైన పగోడా సూర్య కాంతితో మిలమిలా మెరుస్తూంటుంది. ఇటాలి యన్‌శైలిలో ఉన్న థాయ్‌ రాజపస్రాదం ఆనంద సమక్రోమ్‌ కూడా చూసి తీరాల్సిన కట్టడమే. బ్యాంకాక్‌లో చూడాల్సిన అనేక విశేషాల్లో జిమ్‌ థామ్సన్‌ హౌస్‌ మ్యూజియం, సువాన్‌ పక్కడ్‌ ప్యాలెస్‌ మ్యూజియం ఉన్నాయి. సువాన్‌ పక్కడ్‌ మ్యూజియం ప్రాచీన థాయ్‌ ఇళ్ల నిర్మాణాన్ని అనుసరించి ఉంటుంది. రాజవంశస్తులు దేశ, విదేశాల నుంచి సేకరిం చిన అనేక వస్తువులు ఇందులో ఉన్నాయి.

బ్యాంకాక్‌లో షాపింగ్‌ సెంటర్లలో ప్రముఖమైనది ఆసియాటిక్‌ షాపింగ్‌ సెంటర్‌. ఇది కూడా చావ్‌ప్రాయ నది ఒడ్డునే ఉంది. ఇందులో వందల షాపులు, అనేక రెస్టారెంట్లు ఉన్నాయి. అలాగే పహూరత్‌ బాంబే మార్కెట్‌ కూడ. ఇది థాయ్‌లాండ్‌కు వలస వెళ్లిన భారతీయులు ఏర్పాటు చేసుకున్న మార్కెట్‌. థాయ్‌లాండ్‌లో వాతావరణం మన వాతావరణాన్నే తలపిస్తుంది. కాబట్టి ఇక్కడ పర్యటనకు మన వాళ్లు ప్రత్యేక దుస్తులవంటి ఏర్పాట్లు చేసుకోనక్కర్లేదు. థాయ్‌లాండ్‌లో పర్యాటకం ముఖ్యమైన పరిశ్రమ, అక్కడి వారు టూరిస్టుల పట్ల ఆదరాభిమానాలు చూపిస్తారు. గొడవలు ఏమున్నా పార్లమెంటుకే పరిమితం. టూరిస్టులు నిర్భయంగా దేశంలో ఎక్కడైనా పర్యటిం చవచ్చు అని థాయ్‌లాండ్‌ పర్యాటకం అథారిటీ ప్రకటించింది.

పర్వతశ్రేణులు, దట్టమైన అడవులు, జలపాతాలు, సెలయేళ్లు, క్రూరమృగాల సంచారం, అరుదైన పక్షుల కిలకిలరవాలు, ఆది మానవుల అవశేషాలు సహజత్వాన్ని ప్రతిబింబిస్తుంటే... అత్యాధునికతకు ప్రతీకగా హాలిడే రిసార్ట్స, గోల్‌‌ఫ కోర్టులు ఉన్నాయి. టూరిస్టుల కోసం క్యాంపింగ్‌, నైట్‌ సఫారీ, ట్రెకిగ్‌కు ఏర్పాట్లు ఉన్నాయి. హనీమూన్‌ కపుల్‌ని అలరించే బ్యూటిఫుల్‌ స్పాట్‌లతోపాటు పిల్లలతో వచ్చిన కుటుంబాలు సేదదీరే సౌకర్యం ఉన్న ప్రదేశం కౌయాయ్‌. ఈ పార్‌‌క పురావస్తు పరిశోధన, ప్రాచీన కళలు, నిర్మాణం వంటి అంశాలపై ఆసక్తి ఉన్న వారికి సరైన గమ్యస్థానం కూడ. కౌయాయ నేషనల్‌ పార్‌‌క నాలుగు రాషా్టల్ల్రో విస్తరించి ఉంది. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.

బ్యాంకాక్‌లో ఏ వీధిలో చూసినా మసాజ్‌ సెంటర్లు కనిపిస్తాయి. ఇది వారి సంప్రదాయ వైద్యవిధానం. థాయ్‌ల్యాండ్‌ మసాజ్‌ సెంటర్ల మీద మన వాళ్లకు ఏ అభిప్రాయం ఉన్నా థాయ్‌ వాసులు మాత్రం దాన్ని పవిత్రంగా భావిస్తారు. మనం కేరళ ఆయుర్వేద మసాజ్‌ను గౌరవించినట్లు.

థాయ్‌లాండ్‌ వెళ్లాలంటే వీసా ఆన్‌ అరైవల్‌ సౌకర్యం ఉంది. వెట్‌ బ్యాగ్రౌండ్‌లో తీసిన రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, రెగ్యులర్‌ కౌంటర్‌లో 1000 బాత్‌లు లేదా తత్కాల్‌ కౌంటర్‌లో 1200 బాత్‌ల ఫీజు చెల్లించాలి. డబ్బును రెండుమూడు వేల బాత్‌లుగా, మిగిలినది డాలర్లుగా తీసుకువెళ్ళటం మంచిది. దేశంలో కరెన్సీ ఎక్సే్చజ్‌ సెంటర్లు చాలా ఉన్నాయి. డాలర్లను క్షణాల్లో థాయ్‌ బాత్‌లుగా మార్చుకోవచ్చు. థాయ్‌ బాత్‌ విలువ దాదాపుగా రూపాయి ఎనభై పైసలు. నాలుగు రోజుల ట్రిప్‌కు ఒక్కరికీ 20 నుంచి 25 వేల రూపాయవుతుంది. హోటల్‌ రెంట్‌ రోజుకు వెయ్యి నుండి ఆరేడు వేల వరకు ఉంటుంది. మరింత సమాచారం కోసం థాయ్‌లాండ్‌ పర్యాటకం అథారిటీ వెబ్‌సైట్‌ చూడవచ్చు. థాయ్‌ సంప్రదాయ నాట్యం లికాయ్‌. ఈ కళాకారులు బౌద్ధాలయాల్లో ప్రదర్శనలిస్తారు. ఈ నాట్యం చేసేటప్పుడు కళాకారుల వస్త్రధారణ, కథాంశం అన్నీ భారతీయతను పోలి ఉంటాయి.




#Article 184: చైనా (2085 words)


ఇతరవాడుకలు రిపబ్లిక్ ఆఫ్ చైనా లేదాతైవాన్

చైనా అని సాధారణంగా పిలువబడే చైనా ప్రజల గణతంత్రం ( పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా) తూర్పు ఆసియాలో అతిపెద్ద దేశం, ప్రపంచంలోని అతిపెద్ద దేశాలలో ఒకటి. 130 కోట్ల (1.3 బిలియన్) పైగా జనాభాతో ప్రపంచంలోని అతి పెద్ద జనాభా గల దేశంగా 
చైనా ఉంది. చైనా రాజధాని నగరం బీజింగ్ (Beijing).అతిపెద్ద నగరం షాంఘై (shangai).చైనా ఏక పార్టీ పాలిత దేశం. 
చైనాలో 22 భూభాగాలు ఉన్నాయి., వీటిలో 5 స్వయం ప్రతిపత్తి (అటానిమస్) కలిగిన భూభాగాలు, నాలుగు డైరెక్ట్ కంట్రోల్డ్ మునిసిపాలిటీలు (బీజింగ్, తియాజిన్, షాంగై , చాంగ్క్వింగ్), రెండు స్వయంపాలిత భూభాగాలు (హాంగ్‌కాంగ్ , మాకౌ) ఉన్నాయి. పి.ఆర్.సిలో ఉన్న ఫ్రీ ఏరియా ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ చైనా భూభాగాలను రిపబ్లిక్ ఆఫ్ చైనా పాలనలో ఉన్నాయి. తైవాన్, కిన్మెన్, మత్సు, ఫ్యూజియన్ , దక్షిణాసియా అధీనంలో ఉన్న ద్వీపాలు రాజకీయ స్థితి వివాదాస్పదంగా ఉంది.

, తక్లమకన్ ఎడారి, ఉత్తరంలో ఉన్న ఉప ఉష్ణమండల అరణ్యాలు ఉన్నాయి. హిమాలయ, కరకొరం, పామిర్ పర్వతాలు , తియాన్ షాన్ పర్వతావళి (ఇవి చైనాను దక్షిణాసియా , మధ్య ఆసియా నుండి వేరుచేస్తున్నాయి) ఉన్నాయి. టిబెట్ నుండి ప్రవహిస్తున్న యాంగ్త్జే నది , ఎల్లో నది (ప్రపంచంలో ఆరవ పెద్దనది) ఉన్నాయి. పసిఫిక్ సముద్రతీరంలో ఉన్న చైనా సముద్రతీరం పొడవు 4,500 కి.మీ. సముద్రతీరం వెంట బొహై సముద్రం, యెల్లో సముద్రం, తూర్పు చైనా సముద్రం , దక్షిణ చైనా సముద్రం ఉన్నాయి.

చైనా సంస్కృతి అతి పురాతనమైనది. చైనా ప్రపంచపు పురాతనమైనది.  ఉత్తర చైనా మైదానాన్ని పచ్చ నది ఫలవంతం చేస్తుంది. చైనా రాజకీయ చరిత్రలో వంశపారంపర్య రాజవంశాలు ఉన్నాయి. ఆరంభకాలంలో క్రీ.పూ 2800 లో పచ్చ నదీతీరంలో సెమీ మిథలాజికల్ రాజవంశం పాలించింది. క్రీ.పూ 221 నుండి క్విన్ రాజవంశం చైనాలోని పలుప్రాంతాలను స్వాధీనపరచుకుంది.
తరువాత రాజ్యం విస్తరించబడి పలుమార్లు సంస్కరించబడింది. 1911 లో క్విన్ సామ్రాజ్యాన్ని త్రోసివేసి చైనా రిపబ్లిక్ (1912-1949) అవతరించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయిన తరువాత కమ్యూనిస్ట్ పార్టీ చైనా ప్రధాన భూభాగంలోని కుయోమింతాంగ్‌ను ఓడించి 1948 అక్టోబరు 1న రిపబ్లిక్ ఆఫ్ చైనాను స్థాపించించింది. క్యుమింతాంగ్ తిరిగి ప్రస్తుత తైపే వద్ద రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చైనా సంక్లిష్టమైన, అతిపెద్ద ఆర్థికవ్యవస్థ కలిగి ఉంది. 1978లో చైనాలో ఆర్థిక సంస్కరణలు జరిగినప్పటి నుండి, అతివేగంగా జి.డి.పి. అభివృద్ధి చేసిన దేశాలలో ఒకటిగా చైనా గుర్తింపు పొందింది. 2019 గణాంకాలను అనుసరించి నామినల్ జి.డి.పి. అభివృద్ధిలో చైనా ప్రపంచంలో మొదటి స్థానంలో ఉందని తెలుస్తుంది. 2014 గణాంకాలను అనుసరించి నామినల్ జి.డి.పి. అభివృద్ధిలో చైనా ప్రపంచంలో రెండవ స్థానంలో ఉందని తెలుస్తుంది.అతిపెద్ద మొత్తంలో సరుకులను ఎగుమతి చేసే దేశాలలో చైనా రెండవస్థానంలో ఉంది. అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాలలో చైనా ఒకటి. అత్యధిక సంఖ్యలో సైనిక బృందాలను కలిగి ఉన్న దేశాలలో కూడా చైనా ఒకటి. 1971 నుండి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (పి.ఆర్.సి) ఐక్యరాజ్యసమితి సభ్యత్వం కలిగి ఉంది. చైనా, వరల్డ్ ట్రేడ్ ఆర్త్గనైజేషన్, ఆసియా పసిఫిక్ ఎకనమిక్ కార్పొరేషన్, బి.ఆర్.ఐ.సి.ఎస్, ది షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్, ది బి.సి.ఐ.ఎం, జి-20 మేజర్ ఎకనమీస్ వంటి  పలు ఫార్మల్ , ఇంఫార్మల్ బహుళజాతి సంస్థలలో సభ్యత్వం కలిగి ఉంది. చైనా గొప్పశక్తిగా, అలాగే ఆసియాలో అతిపెద్ద శక్తిగా గుర్తించబడుతోంది. విమర్శకులు చైనా అపార సామర్థ్యం గల దేశంగా అవతరించగలదని భావిస్తున్నారు.

గడులు.. గీతలు.. బొమ్మలుగా ఉండే చైనా భాష చాలా చిత్రంగా,సంక్లిష్టంగా ఉంటుంది. చైనా వారు ఈ భాషను 'మండారిన్' అని పిలుస్తారు. అక్కడి నిఘంటువుల ప్రకారం చూస్తే సుమారు 56,000 గుర్తులు (కేరక్టర్లు) ఉన్నాయని చెబుతారు. ఎక్కువగా మాత్రం 3,000 గుర్తులు వాడతారు. ఇవి వస్తే 99 శాతం చైనా భాషను నేర్చేసుకున్నట్టే. చైనా అక్షరాలు రాయడానికి కనీసం 1 నుంచి గరిష్ఠంగా 64 గీతలు గీయాల్సిఉంటుంది!

పురాతత్వ పరిశోధకులు  ఆరంభకాల హోమినీడ్లు 2,50,000 , 2.24 మిలియన్ సంవత్సరాల ముందు చైనాలో నివసించారని భావిస్తున్నారు. జౌకౌడియన్  (ప్రస్తుత బీజింగ్) లోని ఒక గుహలో క్రీ.పూ 6,80,000 - 7,80,000 మద్య నివసించిన హోమినీడ్ శిలాజాలు లభించాయి. 
 పీకింగ్ మాన్ హోమో ఎరెక్టస్‌కు (మొదటిసారిగా అగ్నిని ఉపయోగించిన మానవుడు) ఒక ఉదాహరణ. పీకింగ్ మాన్ ప్రదేశంలో 18,000-11,000 హోమో సాపైంస్ కాలానికి చెందిన అవశేషాలు కూడా లభించాయి. క్రీ.పూ 7,000 కాలానికి ముందు నుండి ప్రోటో- రైటింగ్ ఉనికిలో ఉందని తెలుస్తుంది. దామెయిడ్ సమీపంలో 5,800-5,400 కాలానికి చెందిన దడివాన్ సంస్కృతి ,  5 మిలియన్ల సంవత్సరాలకు ముందు నాటి బొంపొ సంస్కృతి విలసిల్లిందని తెలుస్తుంది..కొంతమంది పరిశోధకులు క్రీ.పూ 7 మిలియన్ సంవత్సరాలకు ముందున్న జైహూ చిహ్నాలు అతిపురాతనమైనవని భావిస్తున్నారు.

చైనా సంప్రదాయం అనుసరించి క్రీ.పూ 2100 సంవత్సరాలకు చెందిన క్సియా రాజవంశం చైనాను పాలించిన మొదటి రాజవంశంగా భావిస్తున్నారు. 
 1959లో హెనన్‌లో ఎర్లిటౌ సంస్కృతికి చెందిన కాంస్య యుగం (బ్రోంజ్ ఏజ్) నాటి అవశేషాలను పరిశోధించిన చరిత్రకారులు ఇది పురాణకాలానికి చెందిన సామ్రాజ్యం అని భావిస్తున్నారు. ఇది నిరూపితం చేయబడకుండా ఉంది. ఈ ప్రాంతం క్సియా సామ్రాజ్యంలోనిదై ఉండాలి లేక సమకాలీన మరొక సంస్కృతికి చెందినదని భావిస్తున్నారు. 
తరువాత షాంగ్ వంశం గురించి సమకాలీన రికార్డుల ద్వారా లభించిన సమాచారం నమోదైన సమాచారంలో ఆరంభకాలం నాటిదని భావిస్తున్నారు. 
షంగ్ రాజవంశం తూర్పు చైనాలోని యెల్లోనదీ మైదానాన్ని క్రీ.పూ 11- 7శతాబ్ధాలలో పాలించారు. షంగ్ రాజవంశానికి చెందిన ఒరాకిల్ బోన్ స్క్రిప్ట్  (ఒరాకిల్ ఎముకల వ్రాత) (క్రీ.పూ 1200)   , ఆధునిక చైనా లిపిసంబంధిత పూర్వీకుల వ్రాతలు లభించాయి.

షంగ్ వంశం మీద విజయం సాధించి ఝౌ రాజవంశం క్రీ.పూ 7-5 శతాబ్ధాల మధ్య పాలన సాగించింది. క్రమంగా భూస్వాములు రాజ్యపాలన చేపట్టారు. ఝౌ వంశం బలహినపడిన తరువాత పలు స్వతంత్ర రాజ్యాలు తలెత్తాయి. తరువాత వసంతం , హేమంతకాలాలో రాజ్యాలమధ్య 300 సంవత్సరాల కాలం నిరంతర యుద్ధాలు సాగాయి. తరువాత క్రీ.పూ 5-3 శతాబ్ధాల కాలంలో సాగించిన యుద్ధాల మధ్య 7 శక్తివంతమైన రాజ్యాలు అవతరించాయి. ఈ రాజ్యాలకు ప్రత్యేకంగా రాజు, మంత్రివర్గం , సైన్యం ఉన్నాయి.

క్రీ.పూ 221 నాటికి క్విన్ రాజవంశం ఇతర ఆరు రాజ్యాల మీద విజయం సాధించిన తరువాత రాజ్యాలమధ్య యుద్ధాలకు ముగింపు లభించింది. తరువాత మొదటి సమైక్య చైనా సామ్రాజ్యం అవతరించింది. క్విన్ షి హంగ్ తనకు తానే  మొదటి క్విన్ చక్రవర్తిగా ప్రకటించికుని చైనా అంతటా సంస్కరణలు చేపట్టాడు. సంస్కరణలలో చైనీస్ భాషను ప్రవేశపెట్టడం, కొలతలు, కొలపరిమాణాలు, కరెంసీ , బండి ఇరుసుల పొడవు నిర్ణయించడం మొదలైనవి ప్రధానమైనవి. తరువాత 15 సంవత్సరాలకు క్విన్ షి హంగ్ మరణం తరువాత క్విన్ రాజవంశం అధికారం కోల్పోయింది. తరువాత అథోరిటేరియన్ పోలీస్ నాయకత్వంలో రాజ్యమంతటా తిరుగుబాటు తలెత్తింది. .

తరువత క్రి.పూ 206 నుండి క్రీ.శ 220 వరకు పాలించిన హాన్ రాజవంశం సంస్కృతి ప్రజలలో వ్యాపించి ప్రస్తుత కాలం వరకు నిలిచి ఉంది.
 హాన్ వంశం పాలనలో దక్షిణ కొరియా, వుయత్నాం, మంగోలియా , మధ్య ఆసియా ప్రాంతాలలో సైనిక చర్యలు కలహాలు అధికరించాయి. అలాగే మధ్య ఆసియాలో సిల్క్ రోడ్డు స్థాపనకూడా సాధ్యం అయింది. పురాతన ప్రపంచంలో హాన్ చైనా అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉండేది.
 
హాన్ రాజకుటుంబీకులు ఆచరించిన కంఫ్యూషియనిజం ప్రజలలో ప్రాచుర్యం పొదింది. క్విన్ చట్టాలు, అధికారిక నియమాలను వదిలి హాన్ సరికొత్త పాలనా విధానాలను ప్రవేశపెట్టింది.

హాన్ పాలన ముగింపుకు వచ్చిన తరువత ప్రజలలో ఐకమత్యం విచ్ఛిన్నమై సరికొత్తగా మూడు రాజ్యాలు అవతరుంచాయి. క్రీ.శ 581లో చైనా సుయీ రాజవంశం నాయకత్వంలో సమైక్యపరచబడింది. గొగుర్యేవో - సుయీ యుద్ధాలలో  నాటికి మంగోల్ వీరుడు కుబ్లైఖాన్ యువాన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. 1279లో యువాన్ శేధభాగాన్ని అంతటినీ జయించింది. మంగోల్ దండయాత్రకు ముందు చైనా పౌరుల సంఖ్య 120 మిలియన్లు అయింది. 1300 నాటికి గణాంకాలు చైనా పౌరుల సంఖ్యను 60 మిలియన్లుగా నమోదు చేసింది. 
 ఝుయువాన్ జంగ్ అనే కర్షకుడు 1368లో యువాన్ సామ్రాజ్యాన్ని త్రోసి మింగ్ సామ్రాజ్య స్థాపన చేసాడు. మింగ్ పాలనలో చైనా మరొక స్వర్ణయుగాన్ని చూసింది. ఆ సమయంలో చైనా ప్రపంచంలో శక్తివంతమైన నౌకానిర్మాణం చేసింది. చైనా ఆసమయంలో కళలు , సంస్కృతి అభివృద్ధితో సంపన్నమైన ఆర్థికవ్యవస్థను కలిగి ఉండేది. జంగ్ హీ నాయకత్వంలో ప్రపంచదేశాలన్నింటినీ చైనీయులు అన్వేషణ సాగించారు. మింగ్ సామ్రాజ్యం ఆరంభంలో నైనా రాజధాని నాంజింగ్ నుండి బీజింగ్‌కు తరకించబడింది.మింగ్ పాలనా కాలంలోవాంగ్ యాంగ్ మింగ్ మొదలైన తత్వవేత్తలు  కొంత విమర్శకు గురైయ్యారు.నియో కంఫ్యూషియనిజం వ్యక్తిత్వవాదం , నైతికవాదంతో మరింత విస్తరించింది..

చైనలో చివరి రాజరిక  వ్యవస్థ 1644లో ఆరంభమై 1912తో కొసనసాగింది. విజయవంతం అయిన సామ్రాజ్యంగా క్వింగ్ పాలనలో క్వింగ్ వ్యతిరేకత, హైజిన్ (సముద్ర నిషేధం) , సిద్ధాంతిక సాహిత్య విచారణ మొదలైనవి నిరంకుశ అణిచివేతకు గురైయ్యాయి. 

అలాగే తైవాన్ జపాన్ స్వతంత్రంగా వ్యవహరించడం ఆరంభం అయింది.

పుంటి హక్కా క్లాన్ యుద్ధాలు (1855-67), నిజాన్ తిరుగుబాటు (1851- 78), మియో తిరుగుబాటు (1854- 73), పంతే తిరుగుబాటు (1856-73) , దుంగన్ తిరుగుబాటు (1862-77), విజయవంతం అయిన 1860 స్వశక్తి ఉద్యమం 1880-1890 లమద్య వరుస సైనిక చర్యలతో అణిచివేయబడ్డాయి.

అయినప్పటికీ తరువాత అధ్యక్షపదవి పూర్వపు క్వింగ్ జనరల్‌కు యుయాన్ షికైకు ఇవ్వబడింది. యువాన్ షికై 1915 లో తననుతాను చైనాచక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. తరువాత ఆయన స్వంతసైన్యం వ్యతిరేకత , ప్రముఖులఖండన సింహాసనాన్ని వదిలి తిరిగి రిపబ్లిక్ స్థాపించవలసిన పరిస్థితి ఎఉదురైంది.

క్యూమింతాంగ్ దేశరాజధానిని నాంజింగ్‌కు తరలించాడు. క్యూమింతాంగ్ యాత్-సెన్- డాక్టరిన్ పేరిట రాజకీయ శిక్షణా విధానాన్ని ప్రవేశపెట్టి చైనాను ఆధునిక ప్రజాపాలనకు తీసుకువచ్చాడు.

రెండవ ప్రపంచ యుద్ధంలో కూటని దేశాలలో చైనా మిగిలిన మూడు దేశాలతో కలిసి  ఫోర్ పోలీస్ మెన్  అని వర్ణించబడింది. రెండవ ప్రపంచయుద్ధంలో విజయం సాధించిన దేశాలలో చైనా కూడా ఒకటిగా పరిగణించబడింది. 1945లో జపాన్ లొంగిపోయిన తరువాత పెస్కడోర్స్‌తో చేర్చిన తైవాన్ తిరిగి చైనావశం చేయబడింది. 
చైనా విజయం సాధించిన దేశాలలో ఒకటిగా నిలిచినప్పటికీ ఆర్ధికంగా పూర్తిగా దెబ్బతిన్నది. యుద్ధం వలన కలుగిన నష్టాలు పరిస్థితిని మరింతగా దిగజార్చాయి. క్యూమింతాంగ్ , మద్య అవిశ్వాసం కొనసాగడం 1947 అంతర్యుద్ధానికి దారితీసింది. రాజ్యంగం తిరిగి పునఃస్థాపితం చేయబడింది. యుద్ధానంతర పరిణామాలు రిపబ్లిక్ ఆఫ్ చైనా అంతటా అశాంతి నెలకొనడానికి దారితీసాయి.

 1950లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ హైనాన్‌లో నిలిచి రిపబ్లిక్ నుండి భూభాగాలను వేరుచేయడానికి , టిబెట్ను ఆక్రమించడానికి  ప్రయత్నించింది. 

మావో పాలనలో 1-2 మిలియన్ల భూస్వాములను హతమార్చి చేపట్టబడిన వ్యవసాయసంస్కరణలు కర్షకుల ఆదరణను పొందాయి. మావో నాయకత్వంలో చైనా స్వతంత్ర పారిశ్రామిక ఆధారితమైన ఆర్థికవ్యవస్థను , అణ్వాయుధ సంపత్తిని సాధించింది. 
 తరువాత చైనా పౌరుల సంఖ్య 550 నుండి 900 ల మిలియన్లకు చేరుకుంది. మావో ఆర్థిక , సాంఘిక సంస్కరణల చేసినప్పటికీ   గ్రేట్ చైనీస్ ఫామైన్ గా వర్ణించబడిన కరువు సమయంలో 45 మిలియన్ల మరణాలు సంభవించాయి. 1958-1961 మద్య సాగిన కరువులో మిలియన్లకొద్దీ ప్రజలు ఆకలితో మరణించారు. 1966లో మావో కూటమి ఆరంభించిన సస్కృతిక విప్లవం రాజకీయ ప్రతీకారం , సాంఘిక తిరుగుబాటుకు దారితీసింది. ఈ సంఘర్షణలు 1976లో మావో మరణంతో 
ముగింపుకు వచ్చాయి.

మావో మరణం తరువాత డెంగ్ క్సియోపింగ్ అధికారం చేపట్టి ఆర్ధిక సంస్కరణలు చేసాడు. కమ్యూనిస్టు పార్టీ అధికారాన్ని కోల్పోయింది. తరువాత చైనా సోషలిజ ఆధారిత ప్రత్యేకమైన స్వంత 
పాలనావిధానం ఏర్పాటు చేసుకుంది. 1982లో చైనాలో ప్రస్తుత రాజ్యాంగవిధానం ప్రవేశపెట్టబడింది. 

చైనాపౌరుల జీవనస్థితి వేగవంతంగా అభివృద్ధిదశలో ముందుకుసాగింది. అయినప్పటికీ కేంద్రీకృతమైన రాజకీయాధికారం శక్తివంతంగా మారింది.
 2012 లోవాంగ్ లిజున్ సంభవం తరువాత దశాబ్ధకాల కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో  మార్పులు సంభవించాయి. 18వ కమ్యూనిస్టు పార్టీ సమావేశంలో క్సి జిన్‌పింగ్ కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రెటరీగా హ్యూజింటోని నియమించాడు. క్సి జింపింగ్ నాయకత్వంలో చైనాప్రభుత్వం ఆర్థికసంస్కరణలను చేపట్టింది. ఆర్థిక సంస్కరణలు నిర్మాణాత్మక అస్థిరత , అభివృద్ధి మాంధ్యానికి దారితీసాయి.
 క్సి-లి నాయకత్వం సంస్కరణలలో ఒకే ఒక బిడ్డ , ఖైదు విధానాన్ని ప్రవేశపెట్టింది.

ప్రపంచదేశాలలో భూవైశాల్యపరంగా చైనా రెండవ స్థానంలో ఉంది. మొదటిస్థానంలో రష్యా ఉంది. అయినా భూభాగం , జలభాగం కలిసిన వైశాల్యపరంగా చైనా మూడు లేక నాల్గవస్థానంలో ఉంది. రష్యా,కెనడా , అమెరికాసమ్యుక్తరాష్ట్రాల మొత్తం వైశాల్యం మొదటి మూడుస్థానాలలో ఉందని భావిస్తున్నారు. 
 చైనా మొత్తం వైశాల్యం 96,00,000 చదరపు మైళ్ళు ఉంటుందని అంచనా. 
. ఇది ఎంసైక్లోపీడియా బ్రిటానికా అంచనా అనుసరించి 95,72,900 చదరపు మైళ్ళు ఉంటుందని అంచనా. 
  ఐక్యరాజ్యసమితి ఇయర్ బుక్ అనుసరించి 9596961చదరపు మైళ్ళు ఉంటుందని అంచనా. 
, సి.ఐ.ఎ వరల్డ్ బుక్ అంచనా అనుసరించి 9596961 చదరపు మైళ్ళు ఉంటుందని అంచనా. 
  చైనాలోని యాలు ముఖద్వారం నుండి గల్ఫ్ ఆఫ్ తొంకిన్ మద్యదూరం  22117 కి.మీ ఉంటుందని అంచనా.  . చైనా సరిహద్దు దేశాల సంఖ్య రష్యా కాక 14 ఉన్నాయి. 
చైనా తూర్పు ఆసియా వరకు విస్తరించి ఉంది. చైనా సరిహద్దులో వియత్నాం, లావోస్ , బర్మా దేశాలు , ఆగ్నేయ ఆసియాదేశాలైన  భారతదేశం, భూటాన్, నేపాల్ , పాకిస్థాన్  ఉన్నాయి.  దక్షిణాసియా దేశాలైన ఆఫ్ఘనిస్థాన్, తజకిస్థాన్, కిర్గిజికిస్థాన్ ఉన్నాయి. మద్య ఆసియాదేశాలైన రష్యా, మంగోలియా , ఉత్తర కొరియా ఉన్నాయి.  అదనంగా చైనా సముద్రసరిహద్దులలో జపాన్, వియత్నాం, ఫిలిప్పైంస్ , దక్షిణ కొరియా ఉన్నాయి. 

చైనా 18° నుండి  54° ఉత్తర అక్షాంశం , 73° నుండి 135° తూర్పు రేఖాంశంలో ఉంది. తూర్పున యెల్లో సీ , తూర్పుచైనా సీ సారవంతమైన మైదానాలతో నిండి జసాంధ్రత అధికంగా కలిగి ఉంది. ఉత్తరంలో మంగోలియన్ మైదానం పచ్చికబయళ్ళతో పచ్చగా ఉంటుంది. దక్షిణచైనా పర్వతప్రాంతం , దిగువ పర్వతావళి అత్యధికంగా ఉంటుంది. మద్య తూర్పు ప్రాంతం చైనాలోని యెల్లోనదీమైదానం , యంగ్త్జే అనే రెండు నదీమైదానాల మద్యఉంటుంది. అదనంగా చైనాలో క్సి, మెకాంగ్, బ్రహ్మపుత్ర , అమూర్ నదులు ప్రవహిస్తున్నాయి. పశ్చిమంలో 
హిమాలయ పర్వతశ్రేణి ఉంటుంది. ఉత్తర చైనాలో తక్లమకన్ ఎడారి , గోబీ ఎడారి ఉన్నాయి. చైనా నేపాల్ సరిహద్దులో ప్రపంచంలో ఎత్తైన శిఖరంగా గుర్తించబడుతున్న ఎవెరెస్ట్ శిఖరం (సముద్రమట్టానికి 8,848 మీ)  ఉంది. చైనాలోని అత్యంత దిగువ ప్రాంతంలోని తుర్పాన్ డిప్రెషన్‌లో ఉన్న అయిడింగ్ సరసు (సముద్రమట్టానికి -15 మీ దిగువన ఉంది) ప్రంపంచంలో అత్యంత దిగువన ఉన్న ప్రాంతాలలో మూడవ స్థానంలో ఉందని గుర్తించబడుతుంది. 
 చైనా వాతావరణాన్ని  డ్రై సీజన్ , వెట్ మాంసూన్ ఆధిక్యత చేస్తుంది. అది శీతాకాలం , వేసవి కాలం మద్య వ్యత్యాసం అధికరించడానికి కారణం ఔతుంది. ఎగువ నుండి శీతాకాలంలో ఉత్తర పవనాలు చల్లని , పొడిగాలులు వీద్తుంటాయి. వేసవిలో దక్షిణ సముద్రతీరం నుండి వెచ్చని తేమగాలులులు వీస్తుంటాయి. చైనా వాతావరణం ఒక్కొక ప్రంతానికి ఒక్కోలా వౌవిధ్యంగా ఉంటుంది. వైవిధ్యమైన భౌగోళిక స్థితి ఇందుకు ప్రధానజారణంగా ఉంది. చైనాలో పర్యావరణ వివాదాలలో ఏడారుల విస్తరణ ఒకటి. గోబీ ఎడారి స్థితి ఇందులో ప్రధానమైనది. 

అత్యధికంగా వైవిధ్యం కలిగిన 17 దేశాలలో చైనా ఒకటి., పర్యావరణ  ప్రాధాన్యత కలిగిన ప్రదేశంలో ఉండడం , ఇండోమాలయ , పాలియార్కిటిక్ ప్రాంతంలో ఉండడం ఇందుకు ఒక కారణం. చైనాలో 34,687 జాతుల జంతువులు , వాస్కులర్ మొక్కలు చైనాను ప్రపంచదేశాలలో బయోడైవర్శిటీ కలిగిన దేశాలలో మూడవస్థానంలో నిలిపింది. మొదటి రెండు స్థానాలలో బ్రెజిల్ , కొలంబియా దేశాలు ఉన్నాయి. 1992 జూన్ 11 న చైనా  రియో డీ జనెరియో లో జరిగిన  కాంవెంషన్ ఆన్ బయోడైవర్శిటీ మీద సంతకం చేసి 1993 జనవరి 5న సమావేశంలో భాగస్వామ్యం వహించింది. 2010 సెప్టెంబరు 10న జరిగిన సమావేశం తరువాత చైనా  బయోడైవర్శిటీ ఏక్షన్ ప్లాన్  తయారుచేసింది.
చైనాలో 551 జాతుల క్షీరదాలు ఉన్నాయి. క్షీరదాల సంఖ్యలో చైనా అంతర్జాతీయంగా మూడవస్థానంలో ఉంది. 1221 జాతుల పక్షులు ఉన్నాయి. పక్షిజాతులతో చైనా అంతర్జాతీయంగా చైనాను ఎనిమిదవ స్థానంలో ఉంది. 424 సరీసృపాలతో  , 333 జాతుల ఉభయచరాలతో  చైనా అంతర్జాతీయంగా ఏడవ స్థానంలో ఉంది. జీవవైవిధ్యం అధికంగా ఉన్న చైనాలో హోమోసేపియన్‌ జాతికి చెందిన గిరిజనులు అత్యధికసంఖ్యలో ఉన్నారు. చైనాలో ఉన్న జంతువులలో 840 జాతులు అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉన్నాయి. మానవ నివాసాల అవసరం, కాలుష్యం , అహారపదార్ధాలను  అధికంగా పండించవలసిన అవసరం, ఔషధాల మూలికల ఉపయోగం , జంతువుల ఉన్ని ఉపయోగం కారణంగా జతువులు అతరించిపోతున్న స్థితికి చేరుకున్నాయి. 
 అంతరించిపీతున్న జంతువులు 2005 నుండి చట్టబద్ధంగా సంరక్షించబడుతున్నాయి. దేశంలో 2,349 అభయారణ్యాలు ఉన్నాయి. వీటి మొత్తం వైశాల్యం 149.95 మిలియన్ హెక్టారులు ఉంటుంది. ఇది చైనా వైశాల్యంలో 15% ఉంటుంది.
చైనా 32,000 వస్కులర్ మొక్కలు  , అనేక అడవి జాతివృక్షాలు ఉన్నాయి. ఉత్తర భూభాగంలో కోల్డ్ కోనిఫెరస్ చెట్లు అధికంగా ఉన్నాయి. ఇవి దుప్పి , ఆసియన్ ఎలుగు , 120 పక్షిజాతులకు ఆధారంగా ఉన్నాయి.. దిగువన ఉన్న మాయిస్టర్ కోనిఫర్ అరణ్యాలలో దట్టమైన వెదురుపొదలు ఉన్నాయి. ఎగువన జూనీపర్ , టాక్సస్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వెదురు పొదల స్థానాన్ని రోడోడెండ్రాన్ చెట్లు ఆక్రమించాయి. దక్షిణ , మద్య చైనాలో ఉప ఉష్ణమండల జాతి చెట్లు అధికంగా ఉన్నాయి. ఇక్కడ 1,46,000 జాతుల చెట్లు ఉన్నాయి. యున్నన్ , హైనన్ ద్వీపాలలో ఉష్ణమండల , సీజనల్ వర్షారణ్యాలు ఉన్నాయి. ఇక్కడ చైనాలోని జంతువులు , వృక్షాలలో నాగువవంతు ఉన్నాయి. 
చైనాలో 10,000 జాతుల శిలీంధ్రాలు  
, 6,000 జాతుల హైఘర్ ఫంగీ నమోదు చేయబడ్డాయి.

సమీపకాలంలో చైనా పర్యావరణ వివాదాలను ఎదుర్కొంటున్నది. 

 అలాగే చైనా నదులలో 40% పరిశ్రమల నుండి వెలువడుతున్న వ్యర్ధాలు వ్యవసాయ వ్యర్ధాల కారణంగా కలుషితమౌతున్నాయని 2011 గణాంకాలు వివరిస్తున్నాయి. కాలుష్యసమస్యల కారణంగా ఈశాన్యచైనా ప్రజలు నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. చైనా  రిన్యూవబుల్ ఎనర్జీ కమర్షియలైజేషన్  (పునరుత్పాదక శక్తి వ్యాపారీకరణ) కొరకు అత్యధికంగా పెట్టుబడి చేసిన దేశంగా గుర్తించబడుతుంది. 2011లో చైనా ఇందు కొరకు 52 బిలియన్ల అమెరికడాలర్లను పెట్టుబడి చేసింది. చైనా రిన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీ అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది. ప్రాంతీయ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రణాళికల కొరకు అత్యధికంగా వ్యయంచేస్తూ ఉంది. 2009 నాటికి చైనా ఖర్చుచేస్తున్న విద్యుత్తులో 17% రిన్యూవబుల్ ఎనర్జీ ద్వారా లభించిందని భావిస్తున్నారు. జలవిద్యుత్తు ప్రణాళికల నుండి చైనా 197 గిగాబైట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయబడుతుందని అంచనా. 2011లో చైనా ప్రభుత్వం 618.55 బిలియన్ల అమెరికా డాలర్లు వాటర్ ఇంఫ్రాస్ట్రక్చర్ , డిసాలినేషన్ ప్రణాళిక కొరకు మంజూరు చేసింది. 2020 నాటికి వరద నివారణ నిర్మాణాలు పని చేసుకుని కరువును నివారించగకమని ప్రభుత్వం భావిస్తుంది.
 2013లో చైనా 277 బిలియన్ల అమెరికన్ డాలర్ల వ్యయంతో పంచవర్ష ప్రణాళిక ప్రారంభించింది. ఇది ప్రత్యేకంగా ఉత్తరచైన  అభివృద్ధి కొరకు కృషిచేస్తుందని అంచనా.

ప్రంపంచంలో బహిరంగంగా సోషలిజాన్ని బలపరుస్తున్న దేశాలలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఒకటి. 
చైనీస్ ప్రభుత్వవిధానం వైవిధ్యమైన కమ్యూనిస్టు  సోషలిస్టు విధానాన్ని అనుసరిస్తున్నట్లు వర్ణించబడుతుంది.  కానీ చైనా నియంతృత్వ , సంస్థాగత సమ్మిశ్రిత పాలనా విధానం అనుసరిస్తుంది. అనేక కట్టుబాట్ల మద్య ఇంటర్నెట్ (ఇంటర్నెట్ సెంసార్ చేయడంపట్ల వ్యతిరేకత ఉంది), పత్రికా స్వాతంత్ర్యం, అసెంబ్లీ స్వాతంత్ర్యం, పిల్లలను పొందే స్వతంత్రం, ఫ్రీ ఫార్మేషన్ ఆఫ్ సోషల్ ఆర్గనైజేషన్ , మతస్వాతంత్ర్యం ప్రజలకు అందుబాటులో ఉన్నాయి చైనా ప్రస్తుత రాజకీయ , ఆర్థిక విధానాలను వారి నాయకులచేత  పీపుల్స్ డెమొక్రటిక్ డిక్టేటర్‌షిప్, సోషలిజం విత్ చైనీస్ కారెక్టరిస్టిక్స్, సోషలిస్ట్ మార్కెట్ ఎకనమిగా మార్చబడవచ్చని భావిస్తున్నారు.

చైనా దేశం కమ్యూనిస్టు పార్టీచేత పాలించబడుతుంది. పీపుల్స్ రిపబ్లిక్ ఎన్నికలు వారసత్వవిధానంలో నిర్వహించబడుతున్నాయి. లోకల్ పీపుల్స్ కాంగ్రెస్ నేరుగా ఎన్నుకొనబడుతుంది.  ఆఫ్ చైనాలో ఉన్నత స్థాయిలో ఉన్న  పీపుల్స్ కాంగ్రెస్ , నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సభ్యులను క్రిందస్థాయి సభ్యులుగా పీపుల్స్ కాంగ్రెస్ చేత పరోక్షంగా ఎన్నుకొంటారు. రాజకీయ విధానం వికేంద్రీకరణ , ప్రాంతీయ ఉపప్రాంతీయ నాయకులు గనీయమైన స్వయంప్రతిపత్తి కలిగి ఉంటారు. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ , చైనీస్ పీపుల్స్ పొలిటకల్ పార్టీలకు చెందున ( పీపుల్స్ రిఓబ్లిక్ ఆఫ్ చైనాలోని రాజకీయ పక్షాలు) డెమొక్రటిక్ పార్టీలుగా భావించబడుతున్నాయి.

 



#Article 185: ఇరాన్ (6076 words)


ఇరాన్ (పురాతన నామం = పర్షియా) (పర్షియన్: ایران) నైఋతి ఆసియాలోని ఒక మధ్యప్రాచ్య దేశము. 1935 దాకా ఈ దేశము పాశ్చాత్య ప్రపంచములో పర్షియా అని పిలవబడేది. 1959లో  ఉభయ పదములు ఉపయోగించవచ్చని ప్రకటించారు.కానీ ప్రస్తుత ఇరాన్ ను ఉద్దేశించి పర్షియా పదము వాడుక చాలా అరుదు. ఇరాన్ అను పేరు   అర్థం ఆర్య భూమి.

ఇరాన్ కు వాయువ్యాన అజర్‌బైజాన్ (500 కి.మీ), ఆర్మేనియా (35 కి.మీ), ఉత్తరాన కాస్పియన్ సముద్రము, ఈశాన్యాన తుర్కమేనిస్తాన్ (1000 కి.మీ), తూర్పున పాకిస్తాన్ (909 కి.మీ), ఆఫ్ఘనిస్తాన్ (936 కి.మీ), పశ్చిమాన టర్కీ (500 కి.మీ), ఇరాక్ (1458 కి.మీ), దక్షిణాన పర్షియన్ గల్ఫ్, ఒమాన్ గల్ఫ్ లతో సరిహద్దు ఉంది. 1979లో, అయాతొల్లా ఖొమేని ఆధ్వర్యములో జరిగిన  పర్యవసానముగా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ (جمهوری اسلامی ایران) గా అవతరించింది.

ఇరాన్లో, పెర్షియన్, అజర్బైజాన్, కుర్దిష్ (కుర్దిస్తాన్), లూర్ అత్యంత ముఖ్యమైన జాతి సమూహాలు.

ఇరాన్ యొక్క జాతీయత పర్షియా నుండి ఉద్భవించింది. పర్షియా అన్నపదము నేటి ఇరాన్, తజికిస్తాన్, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్, కాకసస్ ప్రాంతాలకు ఉన్న ప్రాచీన గ్రీకు పేరు పర్సిస్ నుండి వచ్చింది. క్రీ.పూ 6వ శతాబ్దములో ఈ ప్రాంతాలన్నీ ఆకెమెనిడ్ వంశము యొక్క పాలనలో గ్రీస్ నుండి వాయువ్య భారతదేశము వరకు విస్తరించిన మహాసామ్రాజ్యములో భాగముగా ఉన్నాయి. అలెగ్జాండర్ మూడు ప్రయత్నాల తర్వాత ఈ సామ్రాజ్యాన్ని జయించగలిగాడు. అయితే పర్షియా వెనువెంటనే పార్థియన్, సస్సనిద్ సామ్రాజ్యాల రూపములో స్వతంత్రమైనది. అయితే ఈ మహా సామ్రాజ్యాలను 7వ శతాబ్దములో ఇస్లాం అరబ్బీ సేనల చేత చిక్కినది. ఆ తరువాత సెల్జుక్ తుర్కులు, మంగోలులు, తైమర్‌లేను ఈ ప్రాంతాన్ని జయించారు.

ఇరాన్ లోని కషఫ్రద్, గంజ్ పార్ ప్రాంతాలలో లభించిన కళా అవెశేషాలు ఆరంభకాల ఇరాన్ చరిత్రను వివరిస్తున్న మొదటి ఆధారాలుగా భావిస్తున్నారు. ఇవి దిగువ 
పాలియో లిథిక్ శకానికి (క్రీ.పూ 8,00,000 - 2,00,000) సంబంధించినవని భావిస్తున్నారు. ఇవి నీన్దేర్తల్ మద్య పాలియో లిథిక్ శకానికి (క్రీ.పూ 2,00,000- 80,000) సంబంధించినవని భావిస్తున్నారు. ఇవి జాగ్రోస్ లోని వార్వాసి, యఫ్తెష్ గుహ ప్రాంతాలలో లభించాయి.
క్రీ.పూ 10,000- 8,000 సంవత్సరాలకు పూర్వం ఇరాన్ ప్రాంతాలలో చోగా గోలన్, చొఘా బొనట్ వ్యవసాయ సమూహాలు వర్ధిల్లాయి. 

 అలాగే జాగ్రోస్ ప్రాంతంలోసుసా, చొఘా మిష్ వ్యవసాయ సమూహాలు వర్ధిల్లాయి. 

సుసా నగరం స్థాపన రేడియో కార్బన్ (క్రీ.పూ 4,395) జరిగిందని భావిస్తున్నారు. 
 ఇరాన్ పీఠభూమి అంతటా పలు పాలియోలిథిక్ శకానికి చెందిన ప్రాంతాలు ఉన్నాయి. ఇవి దాదాపు క్రీ.పూ 4,000 ప్రాంతానికి చెందినవని భావిస్తున్నారు. 
 
కాంస్య యుగ కాలంలో ఇరాన్ ప్రాంతంలో ఈళం, జిరోఫ్ట్, జయందేష్ సంస్కృతి మొదలైన సంస్కృతులు వర్ధిల్లాయి. వీటిలో ప్రధానంగా ఈళం సంస్కృతి ఇరాన్ వాయవ్యప్రాంతంలో వర్ధిల్లింది. ఈళం సంస్కృతి సుమేరియన్ భాష, ఎలమైట్ సంఙాలిపి జనించిన కాలానికి సమకాలీనమని (క్రీ.పూ 3,000) భావిస్తున్నారు.
 
ఎలమైట్ రాజ్యం మెడియన్, అచమెనిడ్ సామ్రాజ్యాలు అవతరించే వరకు కొనసాగింది. క్రీ.పూ 3,400 - 2,000 మద్యకాలంలో వాయవ్య ఇరాన్ కురా- అరాక్సెస్ సంస్కతి ప్రజల నివాసిత ప్రాంతంగా ఉంది. కురా- అరాక్సెస్ కౌకాసస్, అనటోనియా ప్రాంతాలలో కూడా విస్తరించింది. క్రీ.పూ 2000 సంవత్సరాల నుండి పశ్చిమ ఇరాన్ స్వాత్ ప్రాంతంలో నివసించిన అస్యరియాలు
సమీప ప్రాంతాలను వారి భూభాగంలో కలుపుకుని పాలించార.

క్రీ.పూ 2000 యురేషియన్ స్టెప్పీల నుండి పురాతన ఇరానియన్ ప్రజలు (ప్రొటో ఇరానియన్) ఇరాన్ ప్రాంతానికి వచ్చి చేరిన  
ప్రజలు ఇరాన్ స్థానిక ప్రజలకు సమానంగా భావించారు. 
తరువాత ఇరానియన్ ప్రజలు మహా ఇరాన్ ప్రాంతానికి తరిమివేయబడ్డారు. తరువాత ప్రస్తుత ఇరాన్ భూభాగం మీద పర్షియన్, మెడియన్ మరియన్ పార్థియన్ గిరిజనులు ఆధిక్యత సాధించారు. 
క్రీ.పూ 10-7 వ శతాబ్దంలో  ప్రి - ఇరానియన్- కింగ్డంస్  ద్వారా సంఘీభావంగా జీవించిన ఇరానియన్ ప్రజలు ఉత్తర మెసొపటేనియాకు చెందిన అసిరియన్ ఎంపైర్ ఆధిక్యతకు లోనయ్యారు. 
 రాజా సయాక్సెరెస్ పాలనలో మెడేస్, పర్షియన్లు బాబిలోన్‌కు చెందిన నబొపొలస్సార్‌, స్కిథియన్లు, చిమ్మెరియన్లతో కూటమి ఏర్పరుచుకుని అస్సిరియన్ సామ్రాజ్యాన్ని ఎదొర్కొన్నారు. అస్సిరియన్ సామ్రాజ్యంలో క్రీ.పూ 616-615. మద్యలో అంతర్యుద్ధం సాగింది. 
తరువాత శతాబ్ధాల కాలం సాగిన అస్సిరియన్ పాలన నుండి ఇరాన్ ప్రజలు విడిపించబడ్డారు. . 
క్రీ.పూ డియోసెల్సా పాలనలో సంఖైఖ్యపరచబడిన మెడియన్ ప్రజలు క్రీ.పూ 612 నాటికి మెడియన్ సామ్రాజ్యస్థాపన చేసారు. వారు సంపూర్ణ ఇరాన్, అనటోలియా మీద ఆధిక్యత సాగించారు. ఇది ఉరార్తు రాజ్యానికి ముగింపుకు రావడానికి కారణం అయింది.

క్రీ.పూ 550 లో మందానే, మొదటి కంబైసెస్ సైరస్ ది గ్రేట్ మేడియన్ సామ్రాజ్యాన్ని స్వాధీనపరచుకుని పరిసర నగరాలను రాజ్యాలను సమ్మిళితం చేస్తూ అచమెనింద్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మెడియా మీద విజయం  పర్షియన్ తిరుగుబాటుగా గా వర్ణించబడింది. అస్సిరియన్ పాలకుని చర్యలకారణంగా ఉత్తేజితులైన బురౌహా తరువాత వేగంగా ఇతర ప్రాంతాలకు విస్తరించి పర్షియన్లతో కూటమి ఏర్పరుచుకున్నారు. తరువాత సైరస్ నాయకత్వంలో విజాయాలు సాధించి సాంరాజ్యాన్ని లిబియా,బాబిలోన్ పురాతన ఈజిప్ట్ , బాల్కన్‌లోని కొన్ని భాగాలు , యూరప్ వరకు విస్తరించారు. అలాగే ఇది సింధు , అక్సస్ నదుల పశ్చిమ తీరం వరకు విస్తరించింది.

అచమెనింద్ సామ్రాజ్యం నల్ల సముద్రం తీర ప్రాంతాలు ఈశాన్య గ్రీస్ , దక్షిణ బల్గేరియా (థారెస్ను) లో చాలావరకు ఇరాన్, అజర్బైజాన్, అర్మేనియా, జార్జియా, టర్కీ యొక్క మోడర్న్ భూభాగాలు చేర్చారు, మేసిడోనియా (Paeonia), ఇరాక్ యొక్క అత్యంత, సిరియా, లెబనాన్, జోర్డాన్, ఇజ్రాయెల్, పాలస్తీనా, సుదూర పశ్చిమ లిబియా, కువైట్, ఉత్తర సౌదీ అరేబియా, UAE , ఒమన్, పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ యొక్క భాగాలు, మధ్య ఆసియా, పురాతన ఈజిప్ట్ యొక్క అన్ని కేంద్రాలు కలిపిన ప్రాచీన జనాభాతో మొదటి ప్రపంచ అతిబృహత్తర ప్రభుత్వం , అతిపెద్ద సామ్రాజ్యం స్థాపించబడింది. క్రీ.పూ 480 లో స్థాపించబడిన అచమెనిద్ సాంరాజ్యంలో 50 మిలియన్ల ప్రజలు నివసించారు. 
 గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనుసరించి ఆసమయంలో అచమెనింద్ పాలనలో ప్రంపంచంలోని 44% ప్రజలు పాలించబడ్డారని భావిస్తున్నారు. ఆకాలంలో జనసంఖ్యా పరంగా అచమెనింద్ సాంరాజ్యం ప్రథమస్థానంలో ఉందని భావిస్తున్నారు. గ్రీక్ చరిత్రలో ఇది శత్రురాజ్యంగా భావించబడి బానిసలుగా పట్టుబడి రాజభవనాలు, రహదారులు , గోపురాల నిర్మాణపుపనులకు నియోగించబడిన యూదులు, బాబిలోనియన్లను విడిపించడానికి ప్రయత్నించారు. చక్రవర్తి ఆధీనంలో అధికారం కేంద్రీకరించబడింది. పౌరసేవ, బృహత్తరసైన్యం మొదలైన పాలనా అభివృద్ధి విధానాలు తరువాత వెలసిన సాంరాజ్యాలకు ప్రేరణకలిగించింది. 
అచమెనింద్ సాంరాజ్యంలో క్రీ.పూ 352-350 మద్య పురాతన ప్రపంచ 7 అద్భుతాలలో ఒకటైన  హలికర్నాసస్ మౌసోలియం నిర్మించబడింది. 
లోనియన్ తిరుగుబాటు ఆరంభమై అది గ్రీకో- పర్షియన్- యుద్ధాలుగా పరిణమించి క్రీ.పూ 5వ శతాబ్దం అర్ధభాగం వరకు కొనసాగాయి. పర్షియన్లు బాల్కన్, తూర్పు యురేపియన్ యురేపియన్ భూభాలనుండి వైదొలగడంతో యుద్ధం ముగింపుకు వచ్చింది.

క్రీ.పూ 334 లో మహావీరుడు అలెగ్జాండర్ అచమెనింద్ సామ్రాజ్యం మీద దండెత్తి ఇస్సస్ యుద్ధంలో చివరి అచమెనింద్ చక్రవర్తి మూడవ డారియస్ మీద విజయం సాధించాడు. అలెగ్జాండర్ చిన్న వయసులోనే మరణించడంతో ఇరాన్ సెలెయుసిడ్ సామ్రాజ్యానికి చక్రవర్తి హెలెనిస్టిక్ చక్రవర్తి వశపరచుకున్నాడు. 2వ శతాబ్దం అర్ధభాగంలో తలెత్తిన పార్ధియన్ సామ్రాజ్యం ఇరాన్ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. తరువాత పర్షియన్-రోమన్ల మద్య శతాబ్ధకాల విరోధం కొనసాగింది. విరోధం కారణంగా పలు రోమన్- పార్ధియన్ యుద్ధాలు కొనసాగాయి. తరువాత 5 శతాబ్ధాలకాలం భూస్వామ్య ప్రభుత్వం కొనసాగింది. క్రీ.శ 224 లో ఇరాన్ సస్సనిద్ సామ్రాజ్యం వశం అయింది. 
బైజంటైన్ సామ్రాజ్యం తనపొరుగున ఉన్న శత్రుసామ్రాజ్యంతో అవి రెండు శక్తివంతమైన రెండు రాజ్యాంగశక్తులుగా 4 శతాబ్ధాలకాలం నిలిచాయి.

అచమెనింద్ మద్య సరిహద్దులను ఏర్పరుస్తూ సస్సనిడ్లు స్టెసిఫోన్ రాజధానిగా చేసుకుని సామ్రాజ్యస్థాపన చేసారు. సస్సనిద్ సామ్రాజ్యం ఉనికిలో ఉన్న కాలం ఇరాన్ ప్రభావంతమైన కాలంగా భావిస్తున్నారు. పురాతన రోం సంస్కృతి 
 ఆఫ్రికా సంస్కృతి  చైనా సంస్కృతి, భారతీయ సంస్కృతి ఇరాన్‌ను ప్రభావితం అధికంగా ఉంది. 
 ఇవి ప్రాముఖ్యత సంతరించుకున్న మెడీవల్ కళ తూర్పు ఆసియా కళా రూపుదిద్దుకోవడంలో ప్రధానపాత్ర వహించాయి. 
 పర్షియన్, సస్సనిద్ సామ్రాజ్యాలలో అత్యధికప్రాంతాలలో రోమన్ - పర్షియన్ యుద్ధపర్యవసనాల నీడ ప్రసరించింది. రోమన్లు పశ్చిమతీరంలో అనటోలియా, పశ్చిమ కౌకాసస్, మెసపటోమియా, లెవంత్ 700 సంవత్సరాలు నిలిచిఉన్నారు. ఈ యుద్ధాలు రోమన్లు, సస్సనింద్ సామ్రాజ్యాలు అరబ్బుల చేతిలో అపజయం పొందడానికి కారణం అయిమ్యాయి.

అచమెనింద్ సంతతి ప్రజలు పర్షియన్లు, సస్సనిదులు స్థాపించిన రాజ్యాలు శాఖలు అనటోలియా, కౌకాసస్, పొంటస్,మిహ్రందీలు, అరససిద్ సామ్రాజ్యాలు, డాగెస్తాన్ ప్రాంతాలలో ఏర్పాటుచేయబ డ్డాయి.

దీర్ఘకాలం బైజాంటైన్ - సస్సనిద్ యుద్ధాలు కొనసాగాయి. వీటిలో బైజాంటైన్- సస్సనిద్ యుద్ధం 602-628 వరకు కొనసాగింది. సస్సనిద్ సామ్రాజ్యం అంతర్యుద్ధాలు ముగింపుకు వచ్చిన తరువాత 

ఆరంభంలో అరబ్ రషిదున్ కాలిఫేట్ చేతిలో ఓటమి పొందిన తరువాత ఇరాన్ అరబ్ కాలిఫేట్ ఆధీనం అయింది. ఇరాన్‌లో ఉమ్మయద్ కాలిఫేట్, అబ్బాసిద్ కాలిఫేట్‌లు పాలించారు.అరబ్ దండయాత్ర తరువాత దీర్ఘకాలం ఇరాన్ ఇస్లాం మతరాజ్యంగా మార్చబడింది. రషిదున్ కాలిఫేట్, ఇమయత్ కాలిఫేట్ మవాలి, నాన్ కనవర్టెడ్ (దిమ్మీ) ఇరానీయుల పట్ల వివక్ష చూపబడింది. వారిని ప్రభుత్వోద్యాగాలకు, సైనిక ఉద్యోగాలకు దూరం చేస్తూ అదనంగా వారికి జిజ్యా సుంకం విధించబడింది.
 
గుండే షపూర్‌లో  అకాడమీ ఆఫ్ గుండే షపూర్  స్థాపించబడింది. ఆసమయంలో ఇది ప్రపంచ వైద్యకేంద్రంగా విలసిల్లింది. దండయాత్ర తరువాత సజీవంగా నిలిచిన అకాడమీ ఇస్లామిక్ సంస్థ  గా నిలిచింది.

ఇస్లామిక్ స్వర్ణయుగం 10-11 శతాబ్ధాల నాటికి శిఖరాగ్రం చేరుకుంది. శాస్త్రీయదృక్పథాలకు ఇరాన్ ప్రధానప్రాంతం అయింది. 10శతాబ్దం తరువాత పర్షియన్ భాషతో అరబిక్ భాషలు శాస్త్రీయ, తాత్విక, చారిత్రక, సంగీత , వైద్యశాస్త్రాలకు ఉపయోగించబడ్డాయి. నాసిర్ అల్-దిన్ అల్- తుసి, అవిసెన్నా, కొతుబ్ అల్-దిన్ షిరాజ్, బిరున్ మొదలైన ఇరానియన్ రచయితలు శస్త్రీయ రచనలు చేయడంలో ప్రధానపాత్ర వహించారు. అబ్బాసిద్ శకంలో సంభవించిన సంస్కృతి పునరుజ్జీవనం ఇరాజియన్ జాతీయతను గుర్తించేలా చేసింది. 
గతంలో ఇరాన్‌లో చేసిన అరబినీయత తిరిగి పునరావృతం కాలేదు. ఇరానియన్ షూబియా ఉద్యమం అరబ్ ప్రభావం నుండి ఇరానీయులు స్వతంత్రం పొందేలా చేసింది.
 
ఉద్యమఫలితంగా పర్షియన్ భాషా కావ్య రచయిత  ఫెర్డోస్  ను వెలుగులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఫెర్డోస్‌కు ఇరానియన్ సాహిత్యంలో శాశ్వతస్థానం ఉంది. 10వ శతాబ్దంలో టర్కీ నుండి గిరిజనులు మద్య ఆసియా నుండి ఇరాన్ పీఠభూమికి మూకుమ్మడిగా వలసవచ్చి స్థిరపడ్డారు. ఆరంభంలో అబ్బాసిద్ సైన్యంలో. ఇరానియన్ , అరబ్ స్థానంలో  టర్కిక్ గిరిజనయువకులు బానిస సైన్యం (మమ్లుల్క్స్) గా నియమించబడ్డారు. ఫలితంగా బానిససైన్యం రాజకీయాధికారం సంపాదించారు.

తరువాత సెల్జుక్లు ఒకవైపు సంపూఋణ పర్షియన్ గుర్తింపుతో అనటోలియాలో రుం సుల్తానేట్ అభివృద్ధి చెందడానికి అవకాశం ఇచ్చారు. 
 
పర్షియన్ సంస్కృతి దత్తు తీసుకుని టర్కీ పాలకులు సరికొత్త టర్కీ- పర్షియన్ సంస్కృతి జనించడానికి అభివృద్ధిచెందడానికి అవకాశం ఇచ్చారు.

మరికొంతమంది చరిత్రకారులు 20వ శతాబ్దం వరకు ఇరాన్ ప్రజల సంఖ్య మంగోలియన్ దండయాత్రకు ముందున్న స్థాయికి చేరుకోలేదని భావిస్తున్నారు.
 
మంగోల్ సాంరాజ్యం విభజితం అయిన తరువాత 1256లో చంగిస్ఖాన్ మనుమడు హులగుఖాన్ ఇరాన్‌లో ఇల్ఖనేట్ సాంరాజ్యం స్థాపించాడు. 1370 లో తైమూర్ ఇరాన్‌ను వశపరచుకుని తైమూర్ సాంరాజ్యస్థాపన చేసాడు. తరువాత 156 సంవత్సరాల కాలం తైమూర్ సాంరాజ్యపాలన కొనసాగింది. 1387 లో తైమూర్ ఇస్ఫాహన్ మూకుమ్మడి హత్యలకు ఆదేశాలుజారీ చేయడంతో 

ఆరంభంలో అజర్బైజన్‌తో ఇరానియన్ భూభాగమంతా అధికారాన్ని విస్తరించాడు. తరువాత సమీపప్రాంతాలను కూడా అధికారపరిధిలోకి తీసుకువచ్చి మహా ఇరాన్ (గ్రేటర్ ఇరాన్) అంతటా ఇరానీ గుర్తింపు కలుగజేసాడు. ఇస్మాయిల్ సఫావిద్ సాంరాజ్యంలో సున్నీ , షియా స్థానంలో ఇరానీ సున్నియిజం వచ్చేలా చేసాడు. షియా ఇస్లాం విస్తరించి ఉన్న కౌకాసస్, ఇరాన్,అనటోనియా , మెసపటోనియా ఇరానీ సున్నీయిజం విస్తరించింది. ఫలితంగా ఆధునిక ఇరాన్ , రిపబ్లిక్ ఆఫ్ అజర్బైజన్ మాత్రమే అధికారిక షియా ముస్లిం దేశాలుగా గుర్తించబడుతున్నాయి. రెండు దేశాలలో షియా ముస్లిముల ఆధిఖ్యత ఉంది. అలాగే రెండు దేశాలు షియా ముస్లిం సఖ్యలో ప్రధమ , ద్వితీయ స్థానాలలో ఉన్నాయి. 
 సఫావిద్ , ఆటమిన్ సాంరాజ్యాల మద్య నెలకొన్న శతాబ్ధాల భౌగోళిక , సిద్ధాంతాల శతృత్వం 
పలు  ఆటమిన్ - పర్షియన్ యుద్ధాలకు దారితీసింది. అబ్బాస్ ది గ్రేట్ కాలంలో (1587-1629) లలో సఫావిద్ శకం శిఖరాగ్రం చేరింది. 
 చుట్టూ ఉన్న ఆటమిన్ శత్రువులను ఆణిచివేసి సామ్రాజ్యాన్ని పశ్చిమ యురేషియాలో శాస్త్రీయ, కళాకేంద్రంగా మార్చబడింది. సఫావిద్ కాలంలో కౌకాసస్ ప్రజలు అధికంగా ఇరాన్ ప్రజలతో సమ్మిళితం కావడం తరువాత పలు శతాబ్ధాలకాలం ఇరాన్ చరిత్ర మీద ప్రభావం చూపింది. 
ఆటమిన్‌తో నిరంతర యుద్ధాలు, అంతర్యుద్ధాల, విదేశీ జోక్యం (ప్రధానంగా రష్యా జోక్యం) కారణంగా 1600 చివర - 1700 ఆరంభకాలం నాటికి సామ్రాజ్యం క్షీణదశకు చేరుకుంది. పష్టన్ 1722లో తిరుగుబాటుదారులు ఇస్ఫాహన్ స్వాధీనపరుచుకుని సుల్తాన్ హుస్సైన్‌ను ఓడించి హొతకి సామ్రాజ్యస్థాపన చేసారు. 

నాదిర్షా హత్య తరువాత ఇరాన్‌లో స్వల్పకాలం అల్లర్లు, అంతర్యుద్ధాలు కొనసాగాయి. 1750లో కరీం ఖాన్ జంద్ సామ్రాజ్యస్థాపన చేసిన తరువాత ఇరాన్‌లో శాతి, సుసంప్పన్నత నెలకొన్నది. భౌగోళికంగా మునుపటి ఇరాన్ సామ్రాజ్యాలతో పోల్చితే జంద్ సామ్రాజ్యం పరిమితమైనది.కౌకాసస్ ప్రాంతంలోని పలు ప్రాంతాలు స్వతంత్రం ప్రకటించుకున్నాయి. అలాగే ప్రాంతీయంగా పలు కౌకాసస్ ఖనాటేలు పలనాధికారం చేపట్టారు. అయినప్పటికీ స్వయంపాలనకు బదులుగా రాజులంతా జంద్ చక్రవర్తికి సామంతులుగా నిలిచారు. 
కనాటేలు మద్య ఆసియాలోని వ్యాపార మార్గాల మద్య విదేశీ వాణిజ్యాధికారం దక్కించుకున్నారు.

 
ఇది పొరుగున ఉన్న రష్యా సామ్రాజ్యానికి తగినంత లాభం చేకూర్చింది. 19వ శతాబ్ధపు రుస్సో- పర్షియన్ యుద్ధాల ఫలితంగా రష్యన్లు కాకసస్ భూభాగం అంతటినీ స్వాధీనం చేసుకున్నారు. ఇరాన్ అంతర్భాగంగా ఉన్న డాగెస్థాన్, జార్జియా, అర్మేనియా, అజర్బైజన్ భూభాగాలను శాశ్వతంగా కోల్పోయింది. అరాస్ నది ఉత్తరభాగంలో ప్రస్తుత అజర్బైజన్, జార్జియా, డాగెస్థాన్, అర్మేనియా 19వ శతాబ్దంలో రష్యన్లు ఆక్రమించేవరకు ఇరాన్ ఆధీనంలో ఉన్నాయి. ఇరాన్ లోని ట్రాంస్కౌకాసస్, నార్త్ కౌకాసస్ భూభాగాలను రష్యా ఆక్రమించిన తరువాత ఈ ప్రాంతాలలోని ముస్లిములు ఇరాన్ వైపు తరలి వెళ్ళారు. 
 ఆర్మేనియన్లు కొత్తగా రూపొందించబడిన రష్యా భూభాలలో నివసించడానికి మొగ్గుచూపారు. 
.

అప్పటి నుండి ఇరాన్ చట్టానికి ఇవి ఆధారభూతంగా ఉన్నాయి. 1911లో మొహమ్మద్ అలీ షా ఓడించబడి పదవీచ్యుతుడు అయ్యేవరకు రాజ్యాంగ కలహాలు కొనసాగాయి. 
పరిస్థితి చక్కదిద్దే నెపంతో రష్యా 1911లో ఉత్తర ఇరాన్‌ను ఆక్రమించి ఆక్రమిత ప్రాంతంలో సంవత్సరాల కాలం సైన్యాలను నిలిపిఉంచింది. ప్రపంచయుద్ధం సమయంలో 
బ్రిటన్ ఇరాన్ లోని అధిక భూభాగం ఆక్రమించి 1921 నాటికి పూర్తిగా వెనక్కు తీసుకుంది.ప్రపంచయుద్ధం మిడిల్ ఇష్టర్న్ థియేటర్‌లో భాగంగా మొదటి ప్రపంచయుద్ధం సమయంలో ఆటమిన్ దంయాత్ర కారణంగా పర్షియన్ యుద్ధం ఆరంభం అయింది. ఆటమిన్ ప్రతీకారాఫలితంగా ఇరాన్ సరిహద్దుప్రాంతాలలోని ఉర్మియా లోపల, పరిసరాలలో ఉన్న అస్సిరియన్ ప్రజలను ఆటమిన్ సైన్యం మూకుమ్మడిగా సంహరించింది. అక్వా మొహమ్మద్ ఖాన్ పాలనలో క్వాజర్ పాలన ఒకశతాబ్ధకాలం అసంబద్ధ పాలనగా గుర్తించబడింది.

అయతుల్లాహ్ రుహొల్లాహ్ ఖోమేని షా  వైట్ రివల్యూషన్ కు  క్రియాశీలక విమర్శకుడు అవడమే కాక బహిరంగంగా ప్రభుత్వాన్ని విమర్శించాడు. ఖోమేని 18 సంవత్సరాలకాలం ఖైదు చేయబడ్డాడు. 1964లో ఖోమేని విడుదల చేయబడిన తరువాత ఖోమేని బహిరంగంగా యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వాన్ని విమర్శించాడు. షా ఖోమేనిని దేశబహిషృతుని చేసాడు. ఖోమేని మొదటిసారిగా టిబెట్ చేరి ఆతరువాత ఇరాక్ ఆతరువాత ఫ్రాంస్ చేరాడు.

విప్లవం 1978 లో షాకు వ్యతిరేకంగా ప్రధాన వివరణలు తరువాత మొదలైంది. ఇరానియన్ విప్లవం , ఇరానియన్ డిమాంస్ట్రేషన్లు ఆరంభం అయిన ఒక సంవత్సరం తరువాత షా దేశబహిష్కరణ , ఖోమేని ప్రవేశం జరిగాయి. షా టెహ్రాన్‌కు పారిపోగా ఖోమేని ఇరాన్‌లో ప్రవేశించాడు. 1979లో ఇరాన్‌లో కొత్త ప్రభుత్వం రూపొందించబడింది. 
 
ఇరానియన్ రిపబ్లిక్ రెఫరెండం తరువాత 1979 ఏప్రెల్ మాసంలో ఇరాన్ అధికారికంగా ఇస్లామిక్ రిపబ్లిక్ అయింది. 1979 లో రెండవ ఇరానియన్ రిఫరెండం ద్వారా  ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్  అంగీకారం పొందింది.
అతి త్వరలో దేశవ్యాప్తంగా కొత్తప్రభుత్వానికి వ్యతిరేకత తలెత్తింది. 1979 కుర్దేష్ రిబెల్లియన్, 1979 ఖుజెస్థాన్ తిరుగుబాటు, సిస్తాన్ , బలూచీస్థాన్ తిరుగుబాటు , ఇతర ప్రాంతాలలో తిరుగుబాటు మొదలైనవి తలెత్తాయి. తరువాత కొన్ని సంవత్సరాలకాలం తిరుగుబాట్లు కొనసాగాయి. కొత్త ప్రభుత్వం ఇస్లామేతర రాజకీయ ప్రత్యర్ధులను అణిచివేతకు గురిచేసింది.
నేషనలిస్టులు , మార్కిస్టులు ఆరంభంలో ఇస్లాం ప్రజలతో కలిసి షాను పడగొట్టారు. తరువాత ఇస్లాం ప్రభుత్వం లక్షలాది మందిని వధించింది. 

 మొహమ్మద్ రేజ్ పహలవి ఇరాన్ రావడానికి మరణశిక్షను ఎదుర్కొనడానికి యు.ఎస్ నిరాకరించడంతో
జిమ్మీ కార్టర్ ఇరాన్ నిర్బంధంలో ఉన్న అమెరికన్లను విడిపించడానికి చేసిన రాజీ ప్రయత్నాలు, ఆపరేషన్ ఇగల్ క్లా విఫలం కావడం రోనాల్డ్ రీగన్ అమెరికా అద్యక్షపదవికి రావడానికి కారణం అయింది. జిమ్మీ కార్టర్ చివరి అధికార దినం రోజున చివరి నిర్బంధితుడు విడుదల చేయబడ్డాడు.

ఇరాన్- ఇరాక్ యుద్ధం తరువాత 1989 లో అక్బర్ హషెమి రఫ్స్తంజాని, ఆయన ప్రభుత్వం వ్యాపార అనుకూల కార్యసాధక విధానం స్థాపన చేయడానికి దృష్టికేంద్రీకరించారు. 1997లో రఫ్స్తంజానిని వెన్నంటి మొహమ్మద్ ఖటామీ ఇరాన్ సంస్కరణ ఆరద్శంతో పదవిని అలంకరించాడు. ఆయన ప్రభుత్వం దేశాన్ని అత్యంత స్వతంత్రం చేయడంలో సఫలత సాధించడంలో విఫలం అయింది.

. 2009 ఇరానియన్ అధ్యక్ష ఎన్నికలలో అహ్మదెనెజాదీ 62.63% ఓట్లను స్వంతంచేసుకోగా ప్రత్యర్థి మీర్- హుస్సేన్- మౌసవి 33.75% ఓట్ల్లతో రెండవ స్థానంలో నిలిచాడు. . 2009లో అత్యధికంగా అక్రమాలు జరిగాయని అభియోగాలు తలెత్తాయి. 

ఇరాన్ 1648195 చ.కి.మీ వైశాల్యంతో ప్రపంచ 18 అతిపెద్ద దేశాల జాబితాలో ఒకటిగా ఉంది. 
. వైశాల్యపరంగా ఇరాన్ దాదాపు యునైటెడ్ కింగ్డం, ఫ్రాంస్, జర్మనీలకు సమానం. అలాగే యు.ఎస్ స్టేట్ అలాస్కా కంటే కొంచం అధికం. 
 ఇరాన్ 24°-40° డిగ్రీల ఉత్తర అక్షాంశం, 44°-64° డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. వాయవ్య సరిహద్దు దేశాలుగా అజర్బైజన్ ( )), ఆర్మేనియా, ఉత్తర సరిహద్దులో కాస్పియన్ సముద్రం, ఈశాన్య సరిహద్దులో తుర్క్మేనిస్థాన్, తూర్పు సరిహద్దులో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, పశ్చిమ సరిహద్దులో టర్కీ, ఇరాక్ఉన్నాయి. దక్షిణంలో పర్షియాగల్ఫ్, ఓమన్ ఉన్నాయి.

ఇరాన్ లోని ఇరాన్ పీఠభూమి కాస్పియన్ సముద్రం నుండి ఖుజెస్థాన్ వరకు విస్తరించి ఉంది. ఇరాన్ ప్రపంచంలోని అత్యధిక పర్వతప్రాంతం కలిగిన దేశాలలో ఒకటిగా ప్రత్యేకత కలిగి ఉంది. 
ఇరాన్ భూభాంలో కఠినమైన పర్వతభాగం ఆధిక్యత కలిగి ఉంది. పర్వభూభాగం పలు నదీప్రవాహాలను, పీఠభూములను ఒకదానితో ఒకటి వేరుచేస్తూ ఉంటుంది. జనషాంధ్రత అధికంగా కలిగిన పశ్చిమభూభాగంలో కౌకాసస్ పర్వతాలు, జాగ్రోస్ పర్వతాలు, అల్బోర్జ్ పర్వతాలు (ఇది ఇరాన్‌లో అత్యధిక ఎత్తైన పర్వతశిఖరం) వంటి పర్వతభాగం అధికంగా ఉంది. హిందూఖుష్ పశ్చిమ భాగంలో ఉన్న దామావంద్ పర్వతం యురేషియాలో ఎత్తౌనభూభాగంగా గుర్తించబడుతుంది. 
 ఇరన్ ఉత్తరభాగంలో జంగిల్స్ ఆఫ్ ఇరాన్ అని పిలువబడుతున్న దట్టమైన వర్షాఫ్హారారణ్యాలు ఉన్నాయి. 
 తూర్పుభూభగంలో దష్త్ ఇ కవిర్ (ఇరాన్ లోని అతివిశాలమైన ఎడారి), దష్త్ ఇ లట్ వంటి ఎడారి భూభాగం ఉంది. అలాగే ఉప్పునీటి సరసులు కూడా ఉన్నాయి. అత్యంత ఎత్తుగా ఉన్న పర్వతభూగాలు ఈ భూభాలకు నీరు లభ్యం కావడానికి అడ్డుగా ఉన్నందున ఇవి ఎడారులుగా మారాయి. కాస్పియన్ సముద్రతీరంలో మాత్రమే మైదానభూభాగం ఉంది. పర్షియన్ సముద్రతీరంలో చిన్న చిన్న మైదానాలు ఉన్నాయి. 

ఇరాన్ కాస్పియన్ సముద్రతీరం జంగిల్స్ ఆఫ్ ఇరాన్ వెంట వాతావరణం ఎడారి వాతావరణం లేక సెమీ అరిడ్ నుండి ఉప ఉష్ణమండల వాతావరణం ఉంటుంది. ఉత్తరతీరంలో అరుదుగా ఉష్ణోగ్రత ఫ్రీజింగ్ స్థాయికంటే తక్కువగా ఉంటుంది అలాగే మిగిలిన సమయాలలో తడివాతావరణం ఉంటుంది. వేసవి ఉష్ణోగ్రత అరుదుగా 29° డిగ్రీల సెల్షియస్ దాటుతుంది. 
 

వార్షిక వర్షపాతం తూర్పు మైదానంలో 680 అంగుళాలు, పశ్చిమ భాగంలో 700 అంగుళాలు ఉంటుంది. జాగ్రోస్ ప్రాంతంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఇక్కడ శీతాకాలంలో 0 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత, అధికమైన హిమపాతం ఉంటుంది. మద్య, తూర్పు భాగాలలో పొడివాతావరణం ఉంటుంది. ఇక్కడ వర్షపాతం 200 అంగుళాలకంటే తక్కువగా ఉంటుంది. 
 

వేసవి ఉష్ణోగ్రత 38° డిగ్రీల సెల్షియస్ ఉంటుంది. పర్షియన్ సముద్రతీరం, గఫ్ ఆఫ్ ఓమన్ భాగాలలో స్వల్పమైన శీతాకాలం,అత్యంత వేడి, తేమ కలిగిన వాతావరణం ఉంటుంది. వార్షిక వర్షపాతం 135 అంగుళాలు ఉంటుంది. 

ఇరాన్‌లో తోడేలు, హరిణాల, అడవి పంది, ఎలుగుబంట్లు సహా నక్కలు, చిరుతపులి, యురేషియా లినక్స్, నక్కలు మొదలైన జంతుజాలం ఉంది.

ఇరాన్‌లో గొర్రెలు, పశువులు, గుర్రాలు నీటిగేదెలు, గాడిదలు, ఒంటేలు పెంపుడుజంతువులుగా పోషించబడుతున్నాయి. నెమలి, వేపక్షులు, కొంగ, గ్రద్ద, ఫాల్కన్స్ కూడా ఇరాన్ స్థానిక వన్యప్రాణులుగా ఉంటాయి.

ఇరాన్ లోని జంతువులలో అంతరించిపోతున్న ఆసియన్ చిరుతపులి ఒకటి. దీనిని ఇరాన్ చిరుత అని కూడా అంటారు. వీటి సంఖ్య 1979 నుండి తగ్గుముఖం పడుతూ ఉంది. 
ఇరాన్ లోని ఆసియన్ సింహాలన్ని అంతరించిపోయాయి. 20వ శతాబ్ధపు ఆరంభకాలంలో కాస్పియన్ పులి జీవించి ఉంది. ఇరన్‌లో  ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కంసర్వేషన్ ఆఫ్ నేచుర్ రెండ్ లిస్ట్ లోని 20 జాతుల జంతువులు ఉన్నాయి. ఇది ఇరాన్ పర్యావరణానికి రహస్య బెదిరిపు అని భావిస్తున్నారు. ఇరానియన్ పార్లమెంటు పర్యావరణాన్ని అలక్ష్యం చేస్తూ అపరిమితంగా గనులు త్రవ్వకానికి, అభివృద్ధి పనులకు అనుమతి ఇస్తుంది.

ఇరాన్ ఇరాన్ ప్రాంతాలుగా విభజించబడింది. ఇరాన్ 31 ప్రంతాలుగా (ఓస్టన్) విభజించబడింది. ఒక్కొక ప్రాంతానికి ఒక్కొక గవర్నర్ (ఒస్తాందార్) నియమించబడతాడు. ప్రాంతాలను కౌటీలుగా విభజిస్తారు. కౌంటీలను జిల్లాలు (బక్ష్), సబ్ జిల్లాలు (దేహెస్తాన్) గా విభజిస్తారు. ప్రపంచంలో నగరప్రాంతం అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇరాన్ ఒకటి. 1950-2002 ఇరాన్ నగరప్రాంత జనసంఖ్య 27% నుండి 60% నికి చేరుకుంది.
 ఐక్యరాజ్యసమితి ఇరాన్‌లో 2030 నాటికి 80% ప్రజలు నగరప్రాంతనివాసితులు ఔతారని అంచనా వేస్తుంది.
 2006-2007 ఇరాన్ గణాంకాలను అనుసరించి దేశీయ వలసప్రజలు తెహ్రాన్, ఇస్ఫహన్, అహ్వజ్, క్వాం నగరాల సమీపాలలో నివసిస్తున్నారని అంచనా.

ఇరాన్ లోని అతిపెద్ద నగరం, ఇరాన్ రాజధాని తెహ్రాన్ జనసంఖ్య 7,705,036. మిగిలిన పెద్ద నగరాల మాదిరిగా తెహ్రాన్ కూడా జసంఖ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నది.

ముస్సద్ జనసంఖ్య 2,410,800. ఇది ఇరాన్ పెద్ద నగరాలలో ద్వీతీయస్థానంలో ఉంది. ఇది రెజవి ఖొరసన్ రాజధాని. ఇది ప్రంపంచంలోని షియాల పవిత్రనగరాలలో ఒకటి. 
ఇక్కడ  ఇమాం రెజా మందిరం  ఉంది. ప్రతి సంవత్సరం ఇమాం రెజా మందిరం సందర్శించడానికి 15-20 మిలియన్ల యాత్రికులు వస్తుంటారు. ఇది ఇరాన్ పర్యాటకకేంద్రాలలో ఒకటి. 

ఇరాన్ ప్రధాన నగరాలలో 1,583,609 జనసంఖ్య కలిగిన ఇస్ఫహాన్ ఒకటి. ఇది ఇస్ఫహాన్ ప్రాంతంలో  నక్వష్-ఇ-జహన్ స్క్వేర్  ఉంది. నక్వష్-ఇ-జహన్ స్క్వేర్ ప్రపంచవారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. నగరంలో 11-19వ శతాబ్ధానికి చెందిన విస్తారమైన ఇస్లామీయ భవనాలు ఉన్నాయి. నగరం చుట్టూ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్న కారణాంగా ఇస్ఫహాన్
ఇరాన్ ప్రధాన నగరాలలో జనసంఖ్యాపరంగా మూడవ స్థానానికి చేరింది. ఇస్ఫహాన్ మహానగర వైశాల్యం 1,430,353 చ.కి.మీ.

ఇరాన్ ప్రధాన నగరాలలో 1,378,935 జనసంఖ్య కలిగిన తబ్రిజ్ నగరం నాలుగవ స్థానంలో ఉంది. ఇది తూర్పు అజర్బైజన్ ప్రాంతానికి రాజధానిగా ఉంది. ఇది ఇరాన్ రెండవ పారిశ్రామిక నగరంగా ఉంది. మొదటిస్థానంలో తెహ్రాన్ ఉంది. 1960 వరకు తబ్రిజ్ ఇరాన్ ప్రధాన నగరాలలో రెండవ స్థానంలో ఉండేది. ఇది మునుపటి ఇరాన్ రాజధానులలో ఒకటి. క్వాజర్ రాజకుటుంబం నివాసిత నగరం ఇదే. ఇరాన్ సమీపకాల చరిత్రలో ఈ నగరం ప్రాధాన్యత వహించింది.

ఇరాన్ ప్రధాన నగరాలలో 1,377,450 జనసంఖ్య కలిగిన కరాజ్ నగరం ఐదవ స్థానంలో ఉంది. ఇది అల్బోర్జ్ ప్రాంతంలో ఉంది. ఇది తెహ్రాన్‌కు 20కి.మీ దూరంలో అల్బోర్ఝ్ పర్వతపాదాల వద్ద ఉంది. అయినప్పటికీ ఈ నగరం తెహ్రాన్ పొడిగింపుగా ఉంటుంది.

ఇరాన్ ప్రధాన నగరాలలో 1,214,808 జనసంఖ్య కలిగిన షిరాజ్ నగరం ఆరవ స్థానంలో ఉంది. ఇది ఫార్స్ ప్రాంతంలో ఉంది. మొదటి బాబిలోన్ సంస్కృతికి ఈ ప్రాంతాన్ని గొప్పగా ప్రభావితం చేసింది. క్రీ.పూ 9వ శతాబ్దం పురాతనకాల పర్షియన్లు ఇక్కడ నివసిస్తున్నారు. క్రీ.పూ 6వ శతాబ్దంలో వీరు అచమెనింద్ సామ్రాజ్యంలో పెద్ద రాజ్యాలకు పాలకులుగా ఉన్నారు. అచమెనింద్ సామ్రాజ్యానికి చెందిన నాలుగు రాజధానులలో రెండు (పెర్సిపోలీస్, పాసర్గాడే) షిరాజ్ సమీపంలో ఉన్నాయి. అచమెనింద్ సామ్రాజ్యానికి పెర్సిపోలీస్ ఉత్సవకేంద్రంగా ఉండేది. ఇది ఆధునిక షిరాజ్ నగరానికి సమీపంలో ఉంది. 1979లో  సిటాడెల్ ఆఫ్ పెర్సిపోలీస్ ను  యునస్కో ప్రపంచవారసత్వ సంపదగా గుర్తించింది.

ఇరాన్ ప్రభుత్వం ఆధీనంలో ఆయిల్ , బృహత్తర పరిశ్రమలు ఉంటాయి. గ్రామీణ వ్యవసాయం , చిన్న తరహా పరిశ్రమలు , ఇతర సేవాసంస్థలు ప్రజల పైవేట్ యాజమాన్యంలో ఉంటాయి. 2014లో ఇరాన్ జి.డి.పి. 404.1 బిలియన్ల అమెరికన్ డాలర్లు. తలసరి కొనుగోలు శక్తి 17,000 అమెరికన్ డాలర్లు. ప్రపంచ బ్యాంక్ ఇరాన్‌ను ఎగువ- మధ్యతరగతి ఆర్ధికశక్తిగా వర్గీకరించింది. 
 

  ది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్  ఇరాన్ అభివృద్ధి పనులకు బాధ్యత వహిస్తుంది. ఇరాన్ కరెంసీకి కూడా బాధ్యత వహిస్తుంది. ట్రేడ్ యూనియన్లను గుర్తించడం లేదు. ఉద్యోగుల నియామసం , రక్షణ బాధ్యత వహిస్తున్న  ఇస్లామిక్ లేబర్ కౌంసిల్ కు  మాత్రం ప్రభుత్వ గుర్తింపు ఉంది. 

ఇరానియన్ లోటు బడ్జెట్ ఒక చారిత్రాత్మక సమస్య. 

ప్రభుత్వం అడ్డుచెప్తుంది.

ప్రభుత్వం ఆర్ధిక సంస్కరణలను కొనసాగిస్తూనే ఉంది. ఇది అయిల్ సంబంధిత ఆదాయం వైవిధ్యమైన రంగాలకు తరలించబడుతుందని సూచిస్తుంది. ఇరాన్ బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ , ఔషధతయారీ రంగాలమీద దృష్టిసారించింది. 
అయినప్పటికీ జాతీయం చేయబడిన బాన్యాద్ సంస్థ నిర్వహణ బలహీనంగా ఉండడం దానిని అశక్తతకు గురిచేయడమే కాక సంవత్సరాల తరబడి పోటీ ఎదుర్కొనడంలో అసఫలం ఔతుంది. ప్రభుత్వం పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తుంది. విజయాలతో ఇరాన్ లంచగొండితనం , పోటీకి నిలవలేక పోవడం మొదలైన సమస్యలను ఎదుర్కొంటున్నది. ప్రపంచ పోటీలో ఇరాన్ 139 దేశాలలో 69వ స్థానంలో ఉందని అంచనా. కార్ తయారీ , ట్రాంపోర్టేషన్, నిర్మాణం సంబంధిత వస్తూత్పత్తి, గృహోపకరణాలు, ఆహారం , వ్యవసాయ ఉత్పత్తులు, ఆయుధాలు, ఔషధాలు, సమాచారం సాంకేతికత, విద్యుత్తు పెట్రో కెమికల్స్ ఉత్పత్తిలో మిడిల్ ఈస్ట్ దేశాలలో ఇరాన్ ఆధిక్యత సాధించింది. 
. 2012లో  ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్  నివేదికలు అనుసరించి చెర్రీ, సౌ చెర్రీ, కుకుంబర్ , ఘెర్క్న్, ఖర్జూరం, వంకాయ మొక్కలు, కామన్ ఫిగ్, పిస్టాచియోస్, క్వింస్, వాల్నట్ , పుచ్చకాయలు మొదలైన ఉత్పత్తులలో ప్రపంచదేశాలలో మొదటి ఐదు దేశాలలో ఇరాన్ఒకటిగా ఉందని గుర్తించింది. 
 ఇరాన్ వ్యతిరేకంగా  ఎకనమిక్ శాంక్షన్లు  (ప్రధానంగా క్రూడ్ ఆయిల్ మీద అంక్షలు) ఇరాన్ ఆర్ధికరంగాన్ని దెబ్బతీస్తున్నాయి. అంక్షలు కారణంగా 2013లో అమెరికన్ డాలర్‌కు బదులుగా రియాల్ విలువ పతనం కావడానికి కారణం అయింది. 2013 కు ముందు ఒక అమెరికన్ డాలర్ విలువ 16,000 రియాన్లు ఉండగా అంక్షలు తరువాత 36,000 రియాన్లకు పతనం అయింది.

ఇరాక్తో యుద్ధం కారణంగా ఇరాన్ పర్యాటకరం క్షీణించినప్పటికీ తరువాత తగినంత కోలుకున్నది. 2004లో 1,659,000 పర్యాటకులు ఇరాన్‌ను సందర్శించారు. 2009లో 2.3 మిలియన్ పర్యాటకులు ఇరాన్‌ను సందర్శించారు. మద్య ఆసియా రిపబ్లిక్కుల నుండి పర్యాటకులు అధికంగా వస్తున్నారు. యురేపియన్ యూనియన్ , ఉత్తర అమెరికా నుండి 10% పర్యాటకులు వస్తున్నారు. ఇరాన్ లోని ఇస్ఫహన్, మస్సద్ , షిరాజ్ నగరాలు పర్యాటకులను అధికంగా ఆకర్షిస్తున్నాయి. 2000 లో నిర్మాణరంగం, కమ్యూనికేషన్, ఇండస్ట్రీ స్టాండర్స్ , వ్యతిగత శిక్షణ తీవ్రమైన పరిమితులను ఎదుర్కొన్నది. 

 దేశీయ పర్యాటకంలో ఇరాన్ ప్రపంచంలో మొదటిస్థానంలో ఉంది. 
 ప్రచారంలో బలహీనత రాజకీయ అస్థిరత ప్రంపంచంలోని కొన్ని ప్రాంతాలలో ప్రజలలో అపోహ, పర్యాటకరంగంలో ప్రణాళికల బలహీనత 
ఇరాన్ పర్యాటకరంగాన్ని బలహీనపరుస్తుంది.

ఇరాన్ సహజ వాయు వనరులలో ప్రపంచంలో ద్వితీయ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో రష్యా ఉంది. ఇరాన్ సహజవాయు ప్రమాణం 33.6 ట్రిలియన్ క్యూబిక్ మీటర్లు. 
 సహజ వాయు ఉతపత్తిలో ఇరాన్ మూడవ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో రష్యా, ఇండోనేషియా ఉన్నాయి. ఆయిల్ నిలువలో ఇరాన్ 4 వ స్థానంలో ఉంది. 153,600,000,000 బ్యారెల్ ఆయిల్ నిలువ ఉంటుందని అంచనా. ఇరాన్ లోని ఓ.పి,ఇ.సి. ప్రంపంచంలో ఎగుమతులలో ద్వితీయ స్థానంలో ఉంది.

 

అధికరిస్తున్న పరిశ్రమల కారణంగా 8% విద్యుత్తు అవసరం అధికం అయిందని గణాంకాలు సూచిస్తున్నాయి. న్యూక్లియర్, హైడ్రో ఎలెక్ట్రిక్ ప్లాంటులు స్థాపించడం ద్వారా 53,000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరాలని ఇరాన్ ఆసించింది. 

ఇరాన్‌లో విద్య అధికంగా కేద్రీకృతం చేయబడ్డాయి.  కె-12 ఎజ్యుకేషన్ మిసిస్ట్రీ ఆఫ్ ఎజ్యుకేషన్  పర్యవేక్షణలో పనిచేస్తుంది. ఉన్నత నిద్య  మినిస్ట్రీ ఆఫ్ సైన్సు రీసెర్చ్ అండ్ టెక్నాలజీ  పర్యవేక్షణలో పనిచేస్తుంది. 2008 గణాంకాలను అనుసరించి వయోజన అక్షర్యత 85%. 1976లో ఇది 36.5% ఉండేది. హైస్కూల్ డిప్లోమో అందిన తరువాత జాతీయ విశ్వవిద్యాలయం ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత అయిన తరువాత ఉన్నత విద్యకు అర్హత పొందవచ్చు. ఇరానియన్ యూనివర్శిటీ ఎంట్రెంస్ ఎగ్జాంస్ (కాంకర్), ఇది యు.ఎస్ ఎస్.ఎ.టి ఎగ్జాం లాంటిది. అధికంగా విద్యార్ధులు 1-2 సంవత్సరాల  యూనివర్శిటీ- ప్రిపరేషంస్- స్కూల్ప్రి- యూనివర్శిటీ  చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇది  జనరల్ సర్టిఫికేట్ ఆఫ్ జ్యుకేషన్, బకలౌరేట్‌కు సమానం. ప్రి యూనివర్శిటీ కోర్స్ పూర్తిచేసిన తరువాత విద్యార్థులు ప్రీ యూనివర్శిటీ సర్టిఫికేట్ సంపాదిస్తారు.

ఉన్నత విద్య వైవిధ్యమైన స్థాయిలో డిప్లొమాలను అందిస్తుంది. రెండుసంవత్సరాల ఉన్నత విద్య తరువాత కర్దాని (ఫాక్వా ఇ డిప్లొమా) విడుదల చేయబడుతుంది. 4 సంవత్సరాల ఉన్నత విద్య తరువాత కర్సెనాసి (బ్యాచిలర్ డిగ్రీ) విడుదల చేయబడుతుంది. దీనిని లికాంస్ అని కూడా అంటారు. తరువాత 2 సంవత్సరాల అనంతరం కర్సెనాసి ఇ అర్సద్ (మాస్టర్ డిగ్రీ) విడుదల చేయబడితుంది. తరువాత మరొక ప్రవేశపరీక్ష తరువాత పి.హెహ్.డి (డాక్టర్ డిగ్రీ) విడుదల చేయబడుతుంది. వెబొమెట్రిక్ ర్యాంకింగ్ ఆఫ్ వరల్డ్ యూనివర్శిటీ  నివేదిక అనుసరించి దేశంలోని విశ్వవిద్యాలయాలలో తెహ్రాన్ యూనివర్శిటీలు 468వ స్థానంలో ఉంది, తెహ్రాన్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైంసెస్ 612వ స్థానంలో ఉంది, ఫెర్డోసీ యూనివర్శిటీ ఆఫ్ మస్సద్ 815వ స్థానంలో ఉంది. 1966- 2004 మద్య ఇరాన్ ప్రచురణా వ్యవస్థ 10 రెట్లు అభివృద్ధి చెంది ఔట్ పుట్ గ్రోత్‌లో ప్రథమ స్థానంలో ఉంది. 
 
ప్రస్తుత పరిస్థితి కొనసాగితే ఎస్.సి.ఇమాగో అనుసరించి 2018 నాటికి పరిశోధనలలో ఇరాన్ ప్రంపంచంలో 4వ స్థానానికి చేరుకుంటుందని అంచనా.
 

 సురేనా 2 రొబోట్‌ను యూనివర్శిటీ ఆఫ్ తెహ్రాన్ ఇంజనీరింగ్ విద్యార్థులు రూపొందించారు. ది ఇంస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలెక్ట్రానిక్స్ రూపొందించిన సురేనా ప్రపంచంలోని ఐదు ప్రముఖ రొబోట్లలో ఒకటిగా భావించబడుతుంది. 

]
ఇరాన్ బయోమెడికల్ సైంసెస్‌లో  ఇంస్టిట్యూట్ ఆఫ్ బయోకెమెస్ట్రీ అండ్ బయోఫిజిక్స్  యునెస్కో గుర్తింపు పొందింది. 
 

 2009 ఫిబ్రవరి 2న ఇరాన్‌లో తయారుచేయబడిన ఉపగ్రాహాన్ని 1979లో రివల్యూషన్ 30వ వార్షికోత్సవం సందర్భంలో కక్ష్యలో ప్రవేశపెట్టారు. 
 దేశీయంగా తయారుచేసిన ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టిన దేశాలలో ఇరాన్ 7వ స్థానంలో ఉంది.1950 ఇరానియన్ న్యూక్లియర్ ప్రోగ్రాం ప్రారంభించబడింది. యూరైడ్ ఉతపత్తి, న్యూక్లియర్ ఫ్యూఉఅల్ సైకిల్ పూర్తిగా నియంత్రించడంలో ఇరాన్ ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది. ఇరానియన్ పరిశోధకులు ఇరాన్ వెలుపల కూడా ప్రధాన పరిశోధనలో పాల్గొంటున్నారు. 1960లో అలి జవన్ గ్యాస్ లేజర్ సృష్టించిన పరిశోధకులలో ఒకడుగా గుర్తించబడ్డాడు. లోట్ఫి జడేహ్  ఫ్యూజీ సెట్ తెరఫీ ని  కనిపెట్టాడు. ఇరానియన్ కార్డియాలజిస్ట్ టాఫీ ముస్సివంద్ కృత్రిమ కార్డియల్ పంప్‌ను కనిపెట్టి అభివృద్ధి చేసాడు. శామ్యుయేల్ రాహ్బర్ డయాబిటీస్ చికిత్సా విధానం రూపొందించాడు. స్ట్రిగ్ థియరీలో ఇరానియన్ ఫిజిక్స్ శక్తివంతంగా ఉంది. ఇరానియన్ పరిశోధకులు పలు పరిశోధనా పత్రాలను ప్రచురించారు. ఇరానియన్ - అమెరికన్ స్ట్రింగ్ థియరిస్ట్ కంరాన్ వఫా ఎడ్వర్డ్ విట్టెన్‌తో కలిసి  వఫా- విట్టెన్ థియోరెం  ప్రతిపాదించాడు. 2014 ఆగస్టులో మర్యం మీర్ఖాని మాథమెట్క్స్ ఉన్నత పురస్కారం అందుకున్న మొదటి ఇరానియన్, మొదటి మహిళగా గుర్తించబ డింది.

పలు మతాలు, సంప్రదాయాలకు చెందిన ప్రజలు నివసిస్తున్న దేశం ఇరాన్. అందరినీ సమైక్యంగా పర్షియన్ సంస్ఖృతిలో భాగస్వామ్యం వహిస్తున్నారు. 
 
సమీపకాలంగా ఇరాన్ జననాలశాతం గణనీయంగా క్షీణిస్తూ ఉంది. 
 ఇరాన్ శరణార్ధులకు అభయం ఇవ్వడంలో ప్రంపంచంలో ప్రథమస్థానంలో ఉంది. ఇరాన్‌లో 1 మిలియంకంటే అధికమైన శరణార్ధులు నివసిస్తున్నారు. వీరిలో అధికంగా ఆఫ్ఘనిస్థాన్, ఇరాక్ దేశాలకు చెందినవారు ఉన్నారు. 

 ఇరాన్ గణాంకాలను అనుసరించి 5మిలియన్ ఇరానీయులు విదేశాలలో పనిచేస్తున్నారని భావిస్తున్నారు. 
 ఇరానియన్ రాజ్యాంగ నియమాలను అనుసరించి ఇరాన్ ప్రభుత్వం ప్రతి ఇరానియన్ పౌరుడు సోషల్ సెక్యూరిటీ,రిటైర్మెంట్, నిరోద్యోగం, వృద్ధాఒయం, అశక్తత, విపత్తులు, ఆపదలు, ఆరోగ్యం, వైద్య చికిత్స, సంరక్షణాసేవలు మొదలైన సౌకర్యాలను కలిగిస్తుంది.

ప్రజలలో అత్యధికులు పార్శీభాషను మాట్లాడుతుంటారు. పర్షియన్ భాష ఇరాన్ అధికారిక భాషగా ఉంది. ఇండో- యురేపియన్, ఇతర సంప్రదాయాలకు చెందిన భాషలు కూడా ఇరాన్‌లో 
వాడుకలో ఉన్నాయి. దక్షిణ ఇరాన్‌లో ల్యూరీ, లారీ భాషలు వాడుకలో ఉన్నాయి. ఉత్తర ఇరాన్‌లోని గిలాన్, మజందరన్ ప్రాంతాలలో గిలకి, మజందరానీ భాషలు వాడుకలో ఉన్నాయి. ఇవి పర్షియన్, ఇతర ఇరానియన్ భాషల యాసలతో చేర్చి మాట్లాడబడుతున్నాయి. ఇవి రెండు పొరుగున ఉన్న కౌకాససియన్ భాషలతో ప్రభావితమై ఉన్నాయి. 
కుర్ధిస్థాన్ ప్రాంతంలో దాని సమీపప్రాంతాలలో కుర్ధిష్ భాషలు అధికంగా వాడుకలో ఉన్నాయి. ఖుజెస్థాన్‌లో పర్షియన్ భాషలు వాడుకలో ఉన్నాయి. 
అదనంగా గిలాన్, తాలుష్ అధికంగా వాడుకలో ఉన్నాయి. ఇవి పొరుగున ఉన్న అజబైజాన్ ప్రాంతంలో కూడా విస్తరించి ఉన్నాయి. 
టర్కిక్ భాషలలో అజర్బైజనీ భాష అధికంగా వాడుకలో ఉంది. ఇది ఇరాన్ అధికారిక భాష పర్షియన్ భాషకు తరువాత స్థానంలో ఉంది. 
 ఇరానీ అజర్బైజనీ, ఖుజస్థానీ అరబిక్ భాషలు ఖుజస్థానీ అరబ్బులకు వాడుకలో ఉన్నాయి.

ఆర్మేయిన్, జార్జియన్, నియో- అరామియాక్ భాషలు అల్పసఖ్యాక ప్రజలకు వాడుకలో ఉన్నాయి. సికాషియన్ భాష సికాషియన్ ప్రజలలో వాడుకలో ఉండేది. కానీ పలుసంవత్సరాల కాలం గడిచిన తరువాత ప్రజలు ఇతర భాషలకు అలవాటుపడిన కారణంగా ప్రస్తుతం సికాషియన్ భాష మాట్లాడే ప్రజలసంఖ్య చాలావరకు తగ్గింది. 
 భాషాప్రాతిపదిక రాజకీయాల కారణంగా భాషాపరంగా జనసంఖ్యను నిర్ణయించడంలో వాదోపవాదాలు ఉన్నాయి. అధికంగా అత్యధిక వాడుకలో ఉన్న ప్రథమ, ద్వితీయ స్థానాలలో ఉన్న భాషలు (పర్షియన్, అజర్బైజన్) గౌరవించబడుతున్నాయి. సి.ఐ.ఎ వరల్డ్ ఫాక్ట్ బుక్ అనుసరించి పర్షియన్లు 53%,అజర్బైజన్లు 16%,ఖుర్దిష్ 10%, మజందరానీ, గిలకీ 7%, ల్యూరీ 7%, అరబిక్ 2%, టర్క్మెనీ 2%, బలోచీ 2%, అర్మేనియన్, జార్జియన్, నియో-అరమియాక్, చిర్కాషియన్ భాష% ఉంటుందని భావిస్తున్నారు.

ఇరాన్ సంప్రదాయ ప్రజలశాతం గురించిన వాదోపవాదాలు ఉన్నాయి. అధికంగా ప్రథమ ద్వితీయ స్థానాలలో ఉన్న పర్షియన్, అజర్బైజనీ సంప్రదాయాలు గౌరవించబడుతున్నాయి. ఇరానియన్ గణాంకాలు బలహీనంగా ఉన్నందున ది వరక్డ్ ఫాక్ట్ బుక్ ఆధారంగా ఇరానియన్ భాషలు మాట్లాడుతున్న ప్రోటో-ఇండో-యురేపియన్, ఎత్నోలింగ్స్టిక్ ప్రజలు 79% ఉంటారని భావిస్తున్నారు. పర్షియన్ ప్రజలలో మజందరాని, గిలకి ప్రజలు, 61%, కుర్దిష్ ప్రజలు 10%, ల్యూరీ ప్రజలు 6%, బలోచీ ప్రజలు 2% ఉన్నారు. మిగిలిన 21%లో ఇతర సంప్రదాయ ప్రజలలో అజబైజనీ ప్రజలు 16%, అరబ్ ప్రజలు 2%, తుర్క్‌మెన్ ప్రజలు, టర్కిక్ ప్రజలు 2%, ఇతరులు 1% (అర్మేనియన్, తలిష్, జార్జియన్, సికాషియన్, అస్సిరియన్ ప్రజలు) ఉన్నారు.
ది లిబరరీ ఆఫ్ కాంగ్రెస్ కొంత వ్యత్యాసమైన అంచనాలు: పర్షియన్ ప్రజలు (మజందరనీయ, గిల్కీ, తాల్ష్) 65%, అజబైననీయులు 16%, ఖుర్దీలు 7%, క్యూరీలు 6%, బ్లోచీలు 2%, టర్కిక్ గిరిజనులు క్వష్క్వై ప్రజలు 1%, తుర్క్మెనీలు 1% ఇరనీయేతర ప్రజలు (ఆర్మేనియన్లు, జార్జియన్లు, అస్సిరియన్లు, సికాషియన్లు, అరబ్బులు) 3% ఉన్నారని తెలియజేస్తున్నాయి. పర్షియన్ ప్రధాన భాషగా ఉన్న ప్రజలు 65% ఉన్నారు. ద్వితీయభాషగా ఉన్న ప్రజలు 35% ఉన్నారు. 

ఇతర ప్రభుత్వేతర అంచనాలు అనుసరించి పర్షియన్, అజర్బౌజియన్ ప్రజలు దాదాపు వరక్డ్ ఫాక్ట్ బుక్, లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ సూచించిన సంఖ్యకు సమీపంలో ఉన్నాయి. పరిశోధకులు, ఆర్గనైజేషన్ అంచనాలు ఈ రెండు గ్రూపుల అంచనాలతో విభేదిస్తున్నాయి. వారి అంచనాలు అనుసరించి అజర్బైనీయులు 22-30% ఉండవచ్చని అంచనా. అధికమైన సంస్థల అంచనాలు 25% ఉంటుందని సూచిస్తున్నాయి. 
 16% లేక 30% లాలో ఏది వాస్తవమైనా అజబైనీయులు అధికసంఖ్యలో నివసిస్తున్న దేశం ఇరాన్ మాత్రమే.

చారిత్రాత్మకంగా ఇఆరాన్‌లో అచమెనింద్, పార్ధియన్, సస్సనిద్ సామ్రాజ్యాల పాలనలో జొరాష్ట్రియన్ మతం ఆధిక్యతలో ఉంది. సస్సనిద్ సామ్రాజ్యం పతనమై ముస్లిములు ఇరాన్‌ను ఆక్రమించిన తరువాత జొరాస్ట్రియన్ స్థానంలో ఇస్లాం చేరింది. ప్రస్తుతం ఇస్లాం శాఖలైన ట్వెల్వర్, షియా శాఖలు 90%-95% ఉన్నారని భావిస్తున్నారు. 
 4% నుండి 8% ఇరానీయులు సున్నీ మతానికి చెందిన (ప్రధానంగా ఖుర్దిష్, బలోచీ ప్రజలు) వారు, మిగిలిన 2% ప్రజలు ముస్లిమేతర ప్రజలు. వీరిలో క్రైస్తవులు, పర్షియన్ యూదులు, బహియాలు, మాండియన్లు, యజీదులు, యర్సన్లు, జోరాస్ట్రియన్లు ఉన్నారు. 

జొరాస్ట్రియన్లు ఇరాన్ దేశ పురాతన మతానికి సంబంధించిన వారు. ఇరాన్‌లో జొరాస్ట్రియన్ దీర్ఘకాలచరిత్ర ప్రస్తుత కాలంవరకు కొనసాగుతుంది. జుడియిజానికి ఇరాన్‌లో దీర్ఘకాల చరిత్ర ఉంది. వీరు పర్షియన్ ఆక్రమిత బాబిలోనియాకు చెందినవారు. ఇజ్రేల్ రూపొందిచిన తరువాత, 1979 ఇజ్రేల్ విప్లవం తరువాత వీరిలో అనేకులు ఇజ్రేలుకు తరలివెళ్ళారు. సమీపకాల గణాంకాలను అనుసరించి ప్రస్తుతంలో ఇరాన్‌లో 8,756 యూదులు నివసిస్తున్నారని అంచనా. ఇరాన్ ఇజ్రేల్‌కు వెలుపల మిడిల్ ఈస్ట్ దేశాలలో యూదులు అధికంగా నివసిస్తున్న దేశం ఇరాన్ మాత్రమే. 

ఇరాన్‌లో 250,000 - 370,000 క్రైస్తవులు నివసిస్తున్నారని అంచనా. ఇది అల్పసంఖ్యాకులలో అధికమని భావిస్తున్నారు. ఇరానియన్ ఆర్మేనియన్లలో అధికంగా అస్సిరుయన్లు ఉన్నారు.
క్రైస్తవులు, జ్యూడిజం, జొరాష్ట్రియన్లు, సున్ని ముస్లిములను అధికారికంగా ప్రభుత్వం గుర్తించింది. వీరికి ఇరాన్ ప్రభుత్వంలో తగినాన్ని స్థానాలు రిజర్వ్ చేయబడి ఉన్నాయి. 
 బహా విశ్వాసానికి చెందిన ప్రజలు ఇరాన్‌లో అత్యధిక ముస్లిమేతర ప్రజలుగా ఉన్నారు. వీరు అధికారికంగా గుర్తించబడలేదు. 19వ శతాబ్దం నుండి వీరు వివక్షకు గురిచేయబడుతున్నారు. 1979 విప్లవం నుండి బహైస్ హింస అధికమైంది. హింసలో పౌరహక్కుల నిరాకరణ, స్వతంత్రం, ఉన్నత విద్యకు అనుమతి నిరాకరణ ఉద్యోగనియామకాల నిరాకరణ భాగంగా ఉన్నాయి. 
 ఇరాన్ ప్రభుత్వం మతేతర గణాంకాల విడుదలకు వ్యతిరేకంగా ఉంది. నాస్థికులలో అధికంగా ఇరానియన్ అమెరికన్లు ఉన్నారు.

ఇరానీ సంస్కృతి ప్రపంచం లోని ప్రాచీన సంస్కృతుల్లో ఒకటి.అసలు 'ఇరాన్' అనే పదం 'ఆయిర్యాన' అను పదం నుండి ఉధ్భవంచింది.ఇరానీయుల సంప్రాదాయల కు,భారతీయ సంప్రదాయలకు దగ్గరి పోలిక ఉంది.వారు అగ్ని ఉపాసకులు.వారు కూడా ఉపనయనాన్ని పోలిన ఒక ఆచారాన్ని పాటిస్తారు.దీనిని బట్టి వారి పూర్వికులు కూడా ఆర్యులే నని పలువురు చరిత్రకారుల అభిప్రాయం.

అన్నీ ప్రాచీన నాగరికతల వలెనే, పర్షియన్ నాగరికతకు కూడా సంస్కృతే కేంద్ర బిందువు. ఈ నేల యొక్క కళ, సంగీతం, శిల్పం, కవిత్వం, తత్వం, సాంప్రదాయం, ఆదర్శాలే ప్రపంచ విఫణీలో ఇరానియన్లకు గర్వకారణము. ఇరానీ ప్రజలు తమ నాగరికత ఆటుపోట్లను తట్టుకొని వేల సంవత్సరాల పాటు మనుగడ సాగించడానికి దాని యొక్క సంస్కృతే ఏకైక ప్రధాన కారణమని భావిస్తారు.

నమోదు చేయబడిన ఆరంభకాల ఇరాన్ చరిత్ర దిగువ పాలియోలిథిక్ శకం (లోవర్ పాలియో లిథిక్) నుండి లభిస్తుంది. 
ప్రపంచంలో ఇరాన్ భౌగోళిక, సాంస్కృతిక ఆధిక్యత కలిగి ఉంది. ఇరాన్ పశ్చిమప్రాంతం ప్రత్యక్షంగా గ్రీస్, మెసెడోనియా, ఇటలీ, ఉత్తర ఇరాన్‌లో రష్యా, దక్షిణ ఇరాన్‌లో ఆర్మేనియా ద్వీపకల్పం, దక్షిణాసియా, తూర్పు ఆసియా సంస్కృతులతో ప్రభావితమై ఉంది.

వివిధ ప్రాంతాలు, కాలాలలో ఇరానియన్ కళలు పలు వైవిధ్యమైన శైలికలిగి ఉంటాయి. వివిధ రీతి కళల మూలాంశాలు ఒకదానితో ఒకటి సంబధితమై ఉంటాయి. 
 ఇరాన్ కళలలో కాంబినేషన్ మరొక ప్రధానమైన అంశంగా ఉంటుంది. ప్రత్యేకంగా ఇరానియన్ మిథాలజీ సంబంధిత మానవ, జంతువు రూపాల మిశ్రితమైన అంశాలతో కళరీతులు రూపొందించబడుతుంటాయి.

ఇరానియన్ కళాలలో పలు విభాగాలు ఉంటాయి. ఇందులో నిర్మాణకళ, నేత, మృణ్మయపాత్రలు, అందమైన దస్తూరి, లోహపు పని, రాతిశిల్పాలు భాగస్వామ్యంవహిస్తూ ఉంటాయి. 
మెడియన్, అచమెనింద్ సామ్రాజ్యాలు విడిచివెళ్ళిన కళాసంస్కృతి తరువాత కాలాలో జనించిన కళలకు ఆధారభూతమై ఉన్నాయి. పార్ధియన్ కళ ఇరానియన్, హెల్లెంస్టిక్ మిశ్రిత కళారూపమై ఉంటుంది. ఈ కళకు రాజరిక వేట యాత్రలు, పట్టాభిషేకాలు ఆధారమై ఉంటుంది. 
 
సస్సనిద్ కళ యురేపియన్, ఆసియన్ మిశ్రిత మెడీవల్ కళలో ప్రధానపాత్ర వహిస్తుంది. ఇది తతువాత మెడీవల్ కళను ఇస్లాం ప్రపంచంలోకి తీసుకువచ్చింది. ఇస్లామిక్ ప్రాచీన భాష, సాహిత్యం, న్యాయమీమాంశ, ఆరంభకాల ఇస్లాం తాత్వికత, ఇస్లామిక్ వైద్యం, ఇస్లామిక్ నిర్మాణకళ, సైన్సు కలిసిన సస్సనిద్ కళారూపంగా మారింది. 
 ఉత్సాహపూరితమైన సమకాలీన ఆధునిక ఇరానియన్ కళ1940 నుండి ప్రభావం చూపుతుంది. 1949లో తెహ్రాన్‌లో మొహమ్మద్ జావేద్ పౌర్, సహచరులు చేత  అపదాన గ్యాలరీ  నిర్వహించబడుతుంది. 1950లో మార్కోస్ గ్రిగోరియన్ ఇరాన్ మోడరన్ ఆర్ట్ ను ప్రబలం చేసాడు. ఇరానియని తివాసి నేత  కాంశ్య యుగం  కాలం నుండి కొనసాగుతుంది. ఇరాన్ కళలలో ఇది ప్రాముఖ్యత కలిగి ఉంది. ప్రంపంచ కార్పెట్ తయారీలో, చేతితో నేసిన తివాసీలను ఎగుమతి చేయడంలో ఇరాన్ ప్రథమస్థానంలో ఉంది. ప్రపంచ తివాసీ ఎగుమతులలో ఇరాన్ 30% భాగస్వామ్యం వహిస్తుంది. ఇరానియన్ క్రౌన్ జువల్స్ తయారీ అంతర్జాతీయ ప్రాముఖ్యత సంతరించుకుంది.

ఇరనీ నిర్మాణకళాచరిత్ర క్రీ.పూ 7వ శతాబ్దంలో ఆరంభం అయింది. 
ఇరానియన్లు మొదటిసారిగా గణితం, జామెంట్రీ, జ్యోతిషం నిర్మాణకళలో ప్రవేశపెట్టారు. ఇరానియన్ నిర్మాణాలు ఉన్నతప్రమాణాలు కలిగిన నిర్మాణం, సౌందర్యం మిశ్రితమై ఉంటుంది. క్రమంగా పురాతన సంప్రదాయాలు, అవుభవాల నుండి వెలుపలకు వచ్చింది. . ఇరానియన్ నిర్మాణకళ సమైక్యంగా అంతరిక్షం చిహ్నాలు మూలాంశాలుగా కలిగి ఉంటుంది. 

ఇరాన్ పురాతన నిర్మాణ అవశేషాలు అధికంగా కలిగిన దేశాలలో అంతర్జాతీయంగా 7వ స్థానంలో ఉంది. యినెస్కో గుర్తించిన ఇరాన్ పురాతన నిర్మాణ అవశేషాలు అంతర్జాతీయ పర్యాటకులను అధికంగా ఆకర్షిస్తున్నాయి.

ఇరాన్ సాహిత్యం ప్రంపంచపు పురాతన సాహిత్యాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. ఇరాన్ సాహిత్యం అవెస్టా, జొరాష్ట్రియన్ సాహిత్య కవిత్వం కాలానికి చెందినదిగా భావిస్తున్నారు.

ఇరానియన్ సంప్రదాయ సాహిత్యం, సైన్సు, మెటాఫిజిక్సులలో కవిత్వం ఉపయోగించబడింది. పర్షియన్ భాష కవిత్వం రూపొందించి బధ్రపరచడానికి అనుకూలమైనదిగా ఉంది. ఇది ప్రంపంచంలోని నాలుగు ప్రముఖ సాహిత్యాలలో ఒకటిగా భావించబడుతుంది. 
పర్షియన్ భాషలు ఇరానియన్ పీఠభూమి ద్వారా చైనా నుండి సిరియా, రష్యా వరకు వాడుకలో ఉన్నాయి. ఇరాన్‌లో రూమీ, ఫెర్డోస్, హాఫెజ్, సాదీ షిరాజ్, ఖయ్యాం, నెజామీగంజమి మొదలైన ప్రముఖ కవులు ఉన్నారు. 
 ఇరానియన్ సాహిత్యం జియోతె, థొరెయు, రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ మొదలైన రచయితలను ఆకర్షించింది.

ఇరానియన్ తాత్వికతకు  ఇండో- ఇరానియన్  మూలంగా ఉంది. దీనిని జొరాస్ట్రియన్ బోధనలు ఇరాన్ తత్వశాత్రం మీద అత్యంత ప్రభావం చూపాయి. 
ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఆఫ్ ఫిలాసఫీ అనుసరించి విషయచరిత్ర, త్వత్వశాస్త్రం ఇండో- ఇరానీయులతో ప్రారంభం అయిందని భావిస్తున్నారు. ఇది క్రీ.పూ 1500 లలో సంభవించిందని భావిస్తున్నారు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ  జొరాష్ట్రా తత్వశాస్త్రం యూదులు , ప్లాటోనిజం ద్వారా పశ్చిమదేశాలలో ప్రవేశించిందని భావిస్తున్నారు. 
భారతీయ వేదాలు , ఇరానియన్ అవెస్టాలకు పురాతనకాలం నుండి సంబంధాలు ఉన్నాయని భావిస్తున్నారు. వేదాలు , అవెస్టా రెండు ప్రధాన తాత్వికశాత్రాలుగా గౌరవించబడుతున్నాయి. ఇవి ఆధారభూతమైన వ్యత్యాసంతో రూపొందించబడ్డాయి. విశ్వంలోని మానవుల స్థితి , సంఘం సంబంధిత సమస్యలపరిష్కారంలో మానవులపాత్రను తెలియజేస్తున్నాయి. సైరస్ సిలిండర్  మనవ హక్కుల ప్రారంభ రూపం  అని భావిస్తున్నారు. ఇవి మానవులలో ఉదయించే ప్రశ్నలకు , ఆలోచనలకు సమాధానమే తత్వశాస్త్రం అని భావించబడుతుంది. తత్వశాస్త్రం అచమెనింద్ సాంరాజ్యంలోని జొరాష్ట్రియన్ పాఠశాలలలో  జరాథుస్త్రా పేరుతో తత్వశాస్త్రం బోధించబడింది. జొరాష్ట్రియన్ పాఠశాలలో ఆరంభకాల విద్యార్థులు జొరాష్ట్రియన్ మతసిద్ధాంతాలను అవెస్టన్ భాషలో అధ్యయనం చేసారు. వీటిలో షికంద్- గుమానిక్ - విచార్, డేంకర్ద్, జాత్స్ప్రం మొదలైన గ్రంథాలు అవెస్టా, గథాస్ లకు ఆధారగ్రంధాలుగా ఉన్నాయి.

ఇరానియన్ పురాణాలలో ఇరానియన్ జాపదసాహిత్యం, గాథలు మిశ్రితమై ఉంటాయి. అవి దేవతల గురించి మంచి, చెడు కార్యాల ఫలితాలను వివరిస్తుంటాయి. అలాగే గొప్ప కావ్యనాయకులు, అద్భుతాలను వివరిస్తుంటాయి.

పురాణాలు ఇరాన్ సంస్కృతిలో ప్రముఖపాత్ర వహిస్తుంటాయి. కౌకసస్, అనటోలియా, మద్య ఆసియా, ప్రస్తుత ఇరాన్ కలిసిన గ్రేటర్ ఇరాన్ అందులోని ఎత్తైన పర్వతశ్రేణి ఇరాన్ పురాణాలలో ప్రముఖపాత్ర వహిస్తున్నాయి.

ఫెర్డోస్ విరచిత షహ్నమెహ్ గ్రంథం ఇరాన్ పురాణసాహిత్య గ్రంథాలలో ప్రధానమైనదిగా భావించబడుతుంది. అందులో జొరాష్ట్రియనిజం సంబంధిత విస్తారమైన పాత్రలు, కథనాలు చోటుచేసుకున్నాయి. దీనికి అవెస్టా, డెంకద్, బుందహిష్న్ ఆధారంగా ఉన్నాయి.

ఇరాన్‌లో మూడు అధికారిక క్యాలెండర్‌లు వాడుకలో ఉన్నాయి. వీటిలో ప్రధానమైనది సోలార్ హిజ్రి క్యాలెండర్. అంతర్జాతీయ క్యాలెండర్‌గా  గ్రిగేరియన్ క్యాలండర్  వాడుకలో ఉంది. ఇది క్రైస్తవ పండుగలకు ఆధారంగా ఉంది. అలాగే ఇస్లామిక్ క్యాలెండర్ ఇస్లామిక్ పండుగలకు ఆధారంగా ఉంటాయి.

ఇరాన్ జాతీయ వార్షిక పర్వదినాలలో  నౌరజ్  ప్రధానమైనది. పురాతన సంప్రదాయానికి గుర్తుగా ఇది మార్చి 21న జరుపుకుంటారు. ఇది కొత్తసంవత్సర ఆరంభదినంగా భావించబడుతుంది. 
దీనిని వివిధ మతాలకు చెందిన ప్రజలు ఆనందంగా జరుపుకుంటారు. అయినప్పటికీ ఇది జిరాష్ట్రియన్ల పండుగ. ఇది మానవత్వానికి మాస్టర్ పీస్ ఆఫ్ ఓరల్ అండ్ ఇంటాణ్జిబుల్ హెరిటేజ్ ఆఫ్ హ్యూమనిటీ  (అగోచరమైన ఊహాత్మక మానవ వారసత్వం) భావించబడుతుంది. ఇది పర్షియన్ కొత్తసంవత్సరంగా పరిగణించబడుతుంది.
 

జాతీయ పర్వదినాలతో వార్షికంగా రంజాన్, ఈద్-అల్-ఫిత్ర్, డే ఆఫ్ అసురా (రుజ్ ఇ అసురా) ముస్లిముల పండుగలుగా జరుపుకుంటారు. క్రిస్మస్, లెంట్ (సెల్లే ఇ రుజె),, ఇష్టర్ పండుగలను క్రైస్తవుల పండుగలుగా జరుపుకుంటారు. పూరిం, పాసోవర్ (ఈద్ ఇ ఫతిర్), తూ బీష్వత్ పండుగలను యూదులు జరుపుకుంటారు.

ఇరాన్ పురాతన సంగీతపరికరాలకు పుట్టిల్లు. క్రీ.పూ 3 వ మైలేనియానికి చెందిన సంగీత పరికరాలు ఇరాన్‌లో పురాతత్వ పరిశోధనశాఖ నిర్వహించిన త్రవ్వకాలలో లభించాయి. . 
ఇరానియన్లు నిలువు, అడ్డం, కోణాలతో ఉన్న సంగీతపరికరాలను మదక్తు, కుల్-ఇ- ఫరాహ్ సమీపంలో కనుగొనబడ్డాయి. ఇక్కడ పెద్ద ఎత్తున ఎలమైట్ పరికరాలు నమోదు చేయబడ్డాయి. అస్సిరియన్ ప్రాంతలలో పలు హార్ప్స్ నమోదు చేయబడ్డాయి.అస్సిరియన్ ప్రాంతాలలో పలు నిలువు హార్ప్స్ చిత్రాలు ఉన్నాయి. ఇవి క్రీ.పూ. 865-650 నాటికి చెందినవని భావిస్తున్నారు.

 పార్ధియన్ సామ్రాజ్యంలో ఒకవిధమైన కావ్యసంగీతంలో యువతకు శిక్షణ ఇవ్వబడింది. జాతీయ కావ్య చిత్రాలు, పురాణాలు  షహ్నమెహ్ , ఫెర్డోస్ ప్రక్రియలలో ప్రతిబింబీంచాయి.

సస్సనిద్ సంగీతం చరిత్ర జిరాష్ట్రియన్ రచనలలో కనిపిస్తున్నాయి. ఇది ఆరంభకాల సస్సనిద్ చరిత్రలో నమోదు చేయబడింది. సాస్సనిద్ రాజసభలలో ఖొస్రొ సంగీతప్రక్రియ పోషించబడింది. ఇందులో రంతిన్, బంషద్, నకిస, అజాద్, సర్కాష్ , బర్బాద్ విధానాలు ఉంటాయి.

కొన్ని ఇరానియన్ సంప్రదాయ సంగీత పరికరాలలో సాజ్, తార్, డోతర్, సెతార్, కామంచె, హార్ప్, బర్బాత్, సంతూర్, తంబూర్, క్వనన్, డాప్, తాంబాక్ , నే ప్రధానంగా ఉన్నాయి.

 ఇరాన్ ప్రధాన ఆర్కెస్ట్రాలో  ఇరాన్ నేషనల్ ఆర్కెస్ట్రా  ది మెలాల్ ఆర్కెస్ట్రా , తెహ్రాన్ సింఫోనీ ఆర్కెస్ట్రా భాగంగా ఉన్నాయి. క్వాజర్ శకంలో ఇరానియన్ పాప్ మ్యూజిక్ వెలుగులోకి వచ్చింది. 1950 లో విగుయన్(కింగ్ ఆఫ్ పాప్ అండ్ జాజ్ ప్రదర్శకుడు) పాప్ గాయకుడుగా కీర్తిగడించాడు. 1970లో ఇరానియన్ సంగీతప్రపంచంలో సంభవించిన విప్లవాత్మక మార్పు సంభవించిన సమయంలో ఇరానియన్ పాప్ మ్యూజిక్ స్వర్ణయుగం ఆరంభం అయింది. స్థానిక సంగీతపరికరాలకు ఆధునిక ఎలెక్ట్రానిక్ గితార్ వాడుకలోకి వచ్చింది. ఈ సమయంలో హయేదేహ్, ఫరమార్జ్ అస్లాని, ఫర్హాద్ మెహ్రద్, గూగూష్, ఎబి మొదలైన సంగీతకారులు ప్రముఖకళాకారులుగా ఉన్నారు
ఇరానియన్ రాక్, ఇరానియన్ హిప్ హాప్ ప్రవేశించిన తరువాత యువత పాత సంగీతప్రక్రియను విడిచి కొత్తపంథాను అనుసరించడం మొదలైంది. 
తరువాత ఇరాన్ సంగీతప్రక్రియలలో కొత్త సంగీత విధానాల ప్రభావం చూపాయి.

ఇరాన్ థియేటర్ సంస్కృతి పురాతనత్వంకగి పురాతన చరిత్రతో ముడివడి ఉంది. తెపే సియాక్, తెపే మౌసియన్ మొదలైన చరిత్రకు పూర్వంనాటి ప్రాంతాలలో నృత్యసంబంధిత ఆరంభకాల ఆధారాలు లభించాయి. 
కావ్యలలో వర్ణించబడిన ఉత్సవ కాల వేదికలలో (సౌగ్ ఇ సివాష్, మొగ్ఖొషి) నృత్యాలు, నటన సంబంధిత విషయాలు థియేటర్ సస్కృతికి ఆరంభం అని భావిస్తున్నారు. ఇరానియన్ పురాణరచనలైన హెరొడోటోస్, క్సెనొఫోన్ లలో ఇరానియన్ నృత్యం, థియేటర్ గురించిన వర్ణనలు చోటుచేసుకున్నాయి.

ఇరాన్ చలనచిత్రాలు ప్ర్రంరంభానికి ముందు పలు కళాప్రక్రియలు రూపొందించబడ్డాయి. వీటిలో క్సెమే షాంబ్ బాజి (పప్పెటరిఉ), సాయే బాజీ (తోలుబొమ్మలు), రూ- హౌజీ (హాస నాటకాల్య్), తాజియే (సారో నాటకాలు) మొదలైనవి ప్రధానమైనవి. రోష్టంఅండ్ సొహార్బ్ కావ్యం ఆధాంగా రూపొందించబడిన రోష్టం అండ్ సొహాబ్ (షహనమె) ప్రస్తుత ఇరాన్ ఆధునిక నాటకరంగ ప్రదర్శనకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.

ఇరాన్ చరిత్రలో విషయుయల్ ప్రాతినిథ్యానికి ఉదాహరణలు  పర్సెపోలీస్ బాస్ రిలీఫ్ కాలానికి చెందినవి (క్రీ.పూ. 500). పురాతన అచమెనింద్ సాంరాజ్యానికి పర్సెపోలీస్ ఉత్సవ కేంద్రంగా ఉంది. 
సస్సనింద్ శకంలో ఇరానియన్ విష్యుయల్ ఆర్ట్స్ శిఖరాగ్రం చేరుకున్నాయి. ఈ సమయంలో తాక్వ్ బొస్టన్‌లో అబాస్ - రిలీఫ్ నుండి చిత్రీకరించిన వేటదృశ్యాలు ఉన్నాయి. ఈ కాలానికి చెందిన ఇటువంటి కళారూపాలు అధునాతన విధానాలలో అత్యున్నత ప్రమాణాలతో రూపొందించడ్డాయి. ఇవి చలనచిత్రాల క్లోజప్ దృశ్యాలకు మూలంగా ఉండవచ్చని భావిస్తున్నారు. వీటిలో గాయపడిన అడవిపంది వేట ప్రాంతం నుండి తప్పించుకుని పోవడం చిత్రీకరించబడింది.

 తరువాత రుస్సీ ఖాన్, అర్దాషిర్ ఖాన్ , అలి వకిల్  తెహ్రాన్‌లో సరికొత్త థియేటర్లను ప్రారంభించారు. 1930 ప్రారంభం వరకు తెహ్రాన్‌లో 15 సినిమా థియేటర్లు ఇతర ప్రాంతాలలో 11 థియేటర్లు ప్రారంభించబడ్డాయి.1930లో మొదటి ఇరానియన్ మూకీ చిత్రం  ప్రొఫెసర్ ఓవంస్ ఒహనియన్  చేత నిర్మించబడింది. మొదటి 1932లో శబ్ధసహిత చలన చిత్రం  లోరీ గిర్ల్ అబ్దొల్ హుస్సేన్ సెపంత చేత నిర్మించబడింది.

ఈ ప్రయత్నాలు 1973 తెహ్రాన్ వరల్డ్ ఫెస్టివల్ విజయానికి కారణం అయ్యాయి. 

సినిమా), జాఫర్ పనాహీ వంటి దర్శకులు పరిచయమై ప్రజలకు ఆరాధనీయులు అయ్యారు. 1977లో ఆయన  టేస్ట్ ఆఫ్ చెర్రీ  చిత్రం కొరకు పాల్మే డ్'ఓర్ అవార్డ్ అందుకున్న తరువాత ప్రపంచచిత్రరంగానికి ఇరాన్ చిత్రాలగురిచి అవగాహనకలిగింది.

కేంస్ ఫిలిం ఫెస్టివల్, వెనిస్ ఫిలిం ఫెస్టివల్, బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ మొదలైన అంతర్జాతీయ వేదికలలో ఇరానియన్ చిత్రాలు నిరంతరాయంగా ప్రదర్శించబడిన తరువాత ఇరాంచిత్రరాజాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి.2006లో 6 వైవిధ్యమైన శైలి కలిగిన ఇరానియన్ చిత్రాలు బెర్లిన్ ఫిల్ం ఫెస్టివల్‌లో ప్రదర్ శించబడ్డాయి. ఇరాన్ చిత్రరంగంలో ఇది చరిత్ర సృష్టించిందని విమర్శకులు అభిప్రాయపడ్డారు. ప్రముఖ ఇరానియన్ దర్శకుడు అస్ఘర్ ఫర్హంద్  బెస్ట్ ఫారిన్ లాంగ్యుయేజ్  కొరకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు, అకాడమీ అవార్డును అందుకున్నాడు. 2012లో టైం మాగజిన్ ప్రంపంచంలోని 100 ప్రతిభావంతులైన వారిలో ఒకడుగా అస్ఘర్ ఫర్హంద్‌ను పేర్కొన్నది.

పురాతన అనిమేషన్ రికార్డులు క్రీ.పూ 3 మైలేయానికి చెందినవి.ఆగ్నేయ ఇరాన్‌లోని  బర్ంట్ సిటీలో 5,200 వందల పురాతనమైన    ఎర్తెన్ గ్లోబ్లెట్  ఒకటి కనుగొనబడింది. అనిమేషన్‌కు ప్రపంచంలోని పురాతన చిహ్నాలలో ఇది ఒకటి అనిభావిస్తున్నారు.1950 లో ఆధునిక ఇరాన్‌లో అనిమేషన్ కళ అభ్యసించబడుతుంది. 4 దశాబ్ధాల ఇరాన్ అనిమేషన్ తయారీ , మూడు దశాబ్ధాల అనుభవం ఉన్న    కానూన్న్ఇంస్టిట్యూట్ , తెహ్రాన్ ఇంటర్నేషనల్ అనిమేషన్ ఫెస్టివల్ 1999 లో నిర్వహించబడింది. ప్రతి రెండు సంవత్సరాలకు 70 దేశాలకంటే అధికమైన దేశాల నుండి ప్రతినిధులు ఈ ఉత్సవానికి హాజరౌతుంటారు. ఇది ఇరాన్‌ను అతిపెద్ద అనిమేషన్ మార్కెట్టుగా మార్చింది.

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రాజకీయవిధానం 1979 ఇరాజ్ రాజ్యాంగ విధానం, ప్రభుత్వ అధికకారకార్యవర్గం అనుసరించి ఉంటుంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఇస్లామిక్ న్యాయవిధానాల సంరక్షణ, పర్యవేక్షణ బాధ్యతవహిస్తాడు.
సుప్రీం లీడర్ ఆర్ం ఫోర్స్ల కమాండర్ ఉండి సైన్యం, ఇంటెలిజంస్, రక్షణ బాధ్యతల నిర్వహణ, యుద్ధం, శాంతి లేక సంధిప్రయత్నాలు నిర్ణాయీధికారం కలిగి ఉంటాడు. న్యాయాధికారం, రేడియో, టేలివిషన్ నెట్వర్క్స్, పోలీస్, మిలటరీ కమాండింగ్ బాధ్యతవహించడానికి గార్డియన్ కౌంసిల్ 12 సభ్యులలో 

 సుప్రీం లీడర్ తరువాత రాజ్యాంబద్ధమైన అధికారిగా ఇరాన్ అధ్యక్షుడు ఉంటాడు. 

అధ్యక్షుని ఎన్నిక 4సంవత్సరాలకు ఒకమారు ఉంటుంది. అధ్యక్షుడు తిరిగి మరొకమారు మాత్రమే ఎనూకొనబడడానికి అర్హత కలిగి ఉంటాడు. 
అధ్యక్ష పదవికి పోటీచేవారు గార్డియంకౌంసిల్ అనుమతి పొందవలసిన అవసరం ఉంది. అధ్యక్షుడు రాజ్యాంగం అమలు, నిర్వహణాధికారాలు (సుర్పీం లీడర్ అధికారాలకు అతీతం) కలిగి ఉంటాడు. 8 మంది ఉపాధ్యక్షులు అధ్యక్షునికి సహాయంగా పనిచేస్తారు. ఇరాన్ లెజిస్లేచర్ యునికెమరల్ బాడి అని పిలువబడుతుంది. 
ఇరాన్ పార్లమెంటులో 290 మంది సభ్యులు ఉంటారు. ఇరాన్ పార్లమెంటు అంతర్జాతీయ ఒప్పందాలు, దేశీయ బడ్జెట్ అనుమతి మొదలైన బాధ్యతలు వహిస్తుంది. పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీ సభ్యులను అందరూ గార్డియన్ కౌంసిల్ అనుమతి పొందవలసిన అవసరం ఉంది.
గార్డియన్ కౌంసిల్‌లో 12 మంది న్యాయాధికారులలో 6 సుప్రీం లీడర్ చేత నియమించబడతారు. ఇతరులను ఇరానియన్ పార్లమెంటు చేత నియమించబడతారు. జ్యూడీషియల్ సిస్టం హెడ్ జ్యూరిస్టుల నియామకం చేస్తాడు. 
కౌంసిల్ వీటో అధికారం కలిగి ఉంటుంది. చట్టం షరియా (ఇస్లామిక్ చట్టం), రాజ్యాంగానికి అనుకూలంగా లేకుంటే అది పరిశీలన కొరకు తిరిగి పార్లమెంటులో ప్రవేశపెట్టబడుతుంది.
 ఎక్స్పెడియంసీ కౌంసిల్ పార్లమెంటు, గార్డియన్ కౌంసిల్ వివాదాల ఆదేశాధికారం ఉంటుంది. అలాగే సుప్రీం లీడర్ సలహామండలిగా సేవలు అందిస్తుంది. 
 ప్రాంతీయ నగర కౌంసిల్ (లోకల్ సిటీ కౌంసిల్) ను ప్రజాఓటింగ్ విధానంలో ఎన్నుకుంటారు. వీరిని ఇరాన్‌లోని నగరాలు, గ్రామాలకు చెందిన ప్రజలందరూ కలిసి ఎన్నుకుంటారు.

సుప్రీం లీడర్ ఇరాన్ జ్యుడీషియరీ అధ్యక్షుని నియమిస్తాడు. జ్యుడీషియరీ అధ్యక్షుడు సుప్రీం కోర్ట్ అధ్యక్షుడు, ప్రాసిక్యూటర్లను నియమిస్తాడు. 
. పబ్లిక్ కోర్టులు సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరిస్తుంది. ఇస్లామిక్ రివల్యూషనరీ కోర్టులు జాతీయ రక్షణ మొదలైన కేసులను పరిష్కరిస్తాయి. ఇస్లామిక్ రివల్యూషనరీ కోర్టుల నిర్ణయాలు అంతిమమైనవి ఇక్కడ ఇచ్చిన తీర్పు తరువాత మరెక్కడా అప్పీల్ చేసుకోవడానికి వీలు ఉండదు. 
ది స్పెషల్ క్లరికల్ కోర్టులు క్లరిక్ కేసుల పరిష్కారం, ప్రజల వ్యక్తిగత కేసులను పరిష్కరిస్తుంది. స్పెషల్ క్లరికల్ కోర్టులు స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. సుప్రీం లీడర్ మాత్రమే వీటిమీద ఆధిక్యత కలుగి ఉంటాడు. స్పెషల్ క్లరికల్ కోర్టుల తీర్పు అంతిమమైనది ఇక్కడ తీర్పు ఇచ్చిన తరువాత మరెక్కడా అప్పీల్ చేయడానికి వీలు ఉండదు. 
 అసెంబ్లీ ఎక్స్పర్టులు 86 మంది సభ్యులను 8 సంవత్సరాలకు ఒకసారి ఓటుహక్కుతో అధ్యక్ష, పార్లమెంటు ఎన్నికలలో ఎన్నుకుంటారు. 
సభ్యుల అర్హతను గార్డియన్ కౌంసిల్ నిర్ణయిస్తుంది. సుప్రీం లీడర్‌ను అసెంబ్లీ ఎన్నుకుంటుంది. అసెంబ్లీ ఎప్పుడైనా సుప్రీం లీడర్ నియామకం రద్దుచేసే అధికారం కలిగి ఉంటుంది. సుప్రీం లీడర్ నిర్ణయాలను సవాలు చేసే అధికారం అసెంబ్లీకి ఉండదు.

విడుదలకు ముందు  ది మినిస్ట్రీ ఆఫ్ ఎర్షాద్  అనుమతి పొందవలసిన అవసరం ఉంది. ఇరాన్ అంతర్జాల సేవలు 1993 నుండి మొదలైయ్యాయి. ఇరానియన్ యువతలో ఇది అత్యంత ఆదరణ సంతరించుకుంది.

ఇరానియన్ ప్రభుత్వం అధికారికంగా న్యూ వరల్డ్ ఆర్డర్ స్థాపించింది. ఇందులో ప్రపంచ శాంతి, గ్లోబల్ కలెక్టివ్ సెక్యూరిటీ (అంతర్జాతీయ సమైక్యరక్షణ), న్యాయనిర్ణయం భాగంగా ఉన్నాయి.
రివల్యూషన్ తరువాత ఇరాన్ విదేశీ సంబంధాలు అన్నీ రెండు అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఇరాన్‌లో విదేశీయుల జోక్యాన్నిబహిష్కరించడం, అభివృద్ధి చెందుతున్న, అలీన దేశాలతో సత్సంబంధాలు అభివృద్ధి చేసుకోవడం ప్రధానాంశాలుగా ఉన్నాయి.2005 నుండి  న్యూక్లియర్ ప్రోగ్రాం ఆఫ్ ఇరాన్  అంతర్జాతీయంగా వివాదాంశం అయింది. ఇరాన్ తన ప్రత్యర్థులతో యుద్ధసమయంలో (ప్రత్యేకంగా ఇజ్రేల్ మీద) అణ్వాయుధ ప్రయోగం చేయగలదన్నది వివాదాంశంగా ఉంది.  ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం  అణ్వాయుధ తయారీకి దారితీస్తుందని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 
ఇది ఐక్యరాజ్యసమితి ఆర్థిక మంజూరీలను నిషేధించడానికి దారితీసింది. 2009 నుండి ఇది ఇరాన్‌ను మిగిలిన ప్రపంచదేశాలలో ఆర్థికంగా ఒంటరిని చేసింది.  ది యు.ఎస్.డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజంస్) ఇరాన్‌ను అణయుధ తయారీ చేయలేదని 2013 లో వెల్లడించింది.

ఇరాన్ జి -77, జి -24, జి-15, ఐ.ఎ.ఇ.ఎ., ఐ.ఎ.బి.ఆర్.డి., ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ (ఐ.డి.ఎ), ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఐ.డి.బి), ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐ.ఎఫ్.సి), ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐ.ఎల్.ఓ), ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐ.ఎం.ఎఫ్), ఇంటర్నేషనల్ మారిటైం ఆర్గనైజేషన్, ఇంటర్పోల్ (సంస్థ), ఇస్లామిక్ సహకార సంస్థ (ఓ.ఐ.సి, ఓ.పి.ఎ.సి., మొదలైన అంతర్జాతీయ సంస్థలలో సభ్యత్వం కలిగి ఉంది. ఐక్యరాజ్యసమితి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రస్తుతం వరల్డ్ ట్రేడ్ ఆగనైజేషన్ వద్ద పర్యవేక్షణ అర్హత కలిగి ఉన్నాయి.

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రెండు విధానైన సైనిక శక్తిని కలిగి ఉంది. రెగ్యులర్ ఫోర్స్‌లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఆర్మీ, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఎయిర్ ఫోర్స్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్నేవీ, ఆర్మీ ఆఫ్ ది గార్డియంస్ ఆఫ్ ది ఇస్లామిక్ రివల్యూషన్‌లలో 5,45,000 క్రీయాశీలక బృందాలు ఉన్నాయి. ఇరాన్‌లో 3,50,000 రిజర్వ్ దళాలు ఉన్నాయి. 
 ఇరాన్‌లో పారామిలటరీ వాలంటీర్ మిలిటియా ఫోర్స్ (ఐ.ఆర్.గి.సి) ఉంది దీనిని బసీజ్ అని కూడా అంటారు. ఇందులో 90,000 ఫుల్ టైం యాక్టివ్ యూనిఫాం సభ్యులు ఉంటారు. 11 మిలియన్ల స్త్రీ పురుష బసీజ్ సభ్యులు పిలుపు అందుకున్న తరువాత సైనికసేవలో పాల్గొనడానికి సిద్ధంగా ఉంటారు. గ్లోబల్ స్ర్క్యూరిటీ ఆర్గనైజేషన్ అంచనా అనుసరించి ఇరాన్ ఒక మిలియన్ పురుషులను తరలించిందని భావిస్తున్నారు. 
వరల్డ్ ట్రూప్ మొబలైజేషన్‌లో ఇది అత్యధికం అని భావిస్తున్నారు. 2007లో ఇరాన్ మిలటరీ కొరకు జి.డి.పిలో 2.6% (తసరి 102 అమెరికన్ డాలర్లు ) వ్యయం చేస్తుంది. పర్షియన్ గల్ఫ్ దేశాలలో ఇది అత్యల్పం. ఇరాన్ మిలటరీ డాక్టరిన్  డిఫరెంస్ థియరీ  అధారితమై ఉంది. 2014లో మిలటరీ వ్యయం కొరకు ఇరాన్ 15 బిలియన్లు వ్యయం చేస్తుంది.
ఇరాన్ సిరియా, ఇరాక్, లెబనాన్ (హెజ్బొల్లాహ్) సైనిక చర్యలకు వేలకొలది మిస్సైల్స్, రాకెట్లు అందిస్తూ మద్దతు ఇస్తుంది.

 సమీపకాలంలో హూట్ (మిస్సైల్స్), కౌసర్, జెల్జా, ఫతేష్ -110, షాహబ్-3, షెజ్జిల్ మిసైల్స్, ఇతర స్వయం చోదిత బాహనాలు (అన్ మాండ్ ఏరియల్ వెహికస్) తయారీ గురించి ఇరాన్ అధికారిక ప్రకటనలు చేసింది. అత్యాధునిక బాసలిక్ మిసైల్స్‌లో ఫాజర్-3 (ఎం.ఆర్..వి)ఒకటి. ఇది లిక్విడ్ ఫ్యూయల్‌తో పనిచేసే మిసైల్. ఇది దేశంలో తయారు చేయబడి అందించబడింది.

ఇరాన్ జనసంఖ్యలో మూడింట రెండువంతులు 25 సవత్సరాల లోపువారు. ఇరాన్‌లో సంప్రదాయ, ఆధునిక క్రీడలు ఆడబడుతున్నాయి. 

పోటో క్రీడ జన్మస్థానం ఇరాన్. ఇది ఇరాన్‌లో పర్షియన్ భాషలో  కౌగాన్, పహలవని కొస్టి (హిరోయిక్ మల్లయుద్ధం) అని పిలువబడుతుంది.  ఫ్రీ స్ట్రైల్ రెస్ట్లింగ్  సంప్రదాయంగా ఇరాన్ జాతీయక్రీడగా గౌరవించబడుతుంది.  ఇరాన్ నేషనల్ ఫ్రీ స్ట్రైల్ రెస్ట్లింగ్ అథెట్లు  బృదం ఒలింపిక్ క్రీడలలో పాల్గొంటారు. 

ఇరాన్ క్రీడలలో ప్రాబల్యత సంతరించుకున్న క్రీడలలో రెండవ స్థానంలో ఉన్న క్రీడ  వాలీబాల్ .  ఇరాన్ మెంస్ వాలీబాల్ టీం  2014 ఎఫ్.ఐ.వి.బి. వాలీబాల్ వరల్డ్ లీగ్  లో 4వ స్థానంలోనూ,  2014 ఎఫ్.ఐ.వి.బి. వాలీబాల్ మెన్స్ వరల్డ్ చాంపియంషిప్  లో 6వ స్థానంలోనూ ఉంది. అలాగే ఆసియన్ నేషనల్ టీంలలో ఉన్నత ఫలితాలు సాధించింది. 

పర్వతాలు అధికంగా ఉన్న ఇరాన్ పర్వతారోహకులకు వేదిగగా ఉంది. ఇరాన్  హైకింగ్ , రాక్ క్లైంబింగ్ 
 పర్వతారోహణ  లకు అనుకూలమైనది.

ఇరాన్ స్కీయింగ్ రిసార్టులకు నిలయం. 13 ski resorts operate in Iran, ఇరాన్ లోని  తోచల్, డిజిన్ , షెంషెక్ రిసార్టులు ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఇవి తెహ్రాన్‌కు మూడు గంటల ప్రయాణదూరంలో ఉన్నాయి. తోచల్ రిసార్ట్ ప్రపంచ ఎత్తైన రిసార్టులలో 5వ స్థానంలో ఉంది. ( ఎత్తున ఉంది).

బాస్కెట్ బాల్ ఇరాన్‌లో ప్రాముఖ్యత సంతరించుకుంది. 2007 నుండి   ఇరాన్ బాస్కెట్ బాల్ టీం  మూడుమార్లు ఎఫ్.ఐ.బి.ఎ. ఆసియా చాంపియన్ షిప్‌ను గెలుచుకుంది. 

ఇరాన్ ఆహారాలు వైవిధ్యతను కలిగి ఉంటాయి. వీటి మీద పొరుగుప్రాంతాల ఆహారవిధానాలు విపరీతంగా ప్రభావితం చూపుతున్నాయి. ఊక్కొక ప్రాంతం ఆహారాలు, వండేవిధానం  సంప్రదాయాలు , శైలి వైవిధ్యం కలిగి ఉంటాయి.

ఇరానియన్ ఆహారం బియ్యం, మంసం, కోడి మాసం, చేపలు , కూరగాయలు, వేళ్ళు , మూలికలను అధికంగా వాడుతుంటారు, మూలికలను అధికంగా ప్లం, దానిమ్మ, క్వింస్, ప్రూనెస్, అప్రికాట్స్  మొదలైన పండ్లతో మొలకలను చేర్చి తీసుకుంటుంటారు.

ఇరానీయులు సాధారణంగా సాదా యోగర్ట్ (ఒక విధమైన పెరుగు) ను మధ్యాహ్న భోజం , రాత్రి భోజనాలతో తింటూంటారు. ఇరాన్‌లో యోగర్ట్ ప్రధాన ఆహారాలలో ఒకటిగా ఉంది. అహారంలో సమతుల్యత కొరకు సుచాసన చేర్చడానికి కుంకుమ పువ్వు, ఎండిన నిమ్మకాయలు, దాల్చిన చెక్క , పార్స్లీ  కలిపి కొన్ని ప్రత్యేకమైన వంటకాలను వండుతుంటారు. ఎర్రగడ్డలు , తెల్లగడ్డలు వంటలతో చేర్చి వండుతూ వటిని విడిగా కూడా భోజనసమయాలలో వడ్డిస్తుంటారు. వీటిని సహజసిద్ధంగా తరిగిన ముక్కలు  , ఊరగాయరూపంలో భోజనం , ఉపాహారాలతో అందిస్తారు. ఇరాన్‌లో  కవీర్ ప్రాముఖ్యత సంతరించుకుంది.




#Article 186: తజికిస్తాన్ (2618 words)


తజికిస్తాన్ అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ తజికిస్తాన్ (ఆంగ్లం : Tajikistan) (తజక్ భాష : Тоҷикистон), (పర్షియన్ : تاجیکی ) పూర్వపు తజిక్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, మధ్య ఆసియాలోని ఒక దేశము. దీనికి ఆఫ్ఘానిస్తాన్, చైనా, కిర్గిజ్ స్తాన్,, ఉజ్బెకిస్తాన్లతో సరిహద్దులు ఉన్నాయి. దక్షిణంలో ఉన్న పాకిస్థాన్‌ను వాఖన్ కారిడార్ వేరు చేస్తుంది. తజికిస్తాన్ అంటే తజిక్ ల మాతృభూమి అని అర్థం. మద్య ఆసియాలో తజికిస్తాన్ పర్వతమయమైన భూబంధిత సార్వభౌమత్వాధికారం కలిగిన దేశం. 2013 గణాంకాలను అనుసరించి జనసంఖ్య 8 మిలియన్లని అంచనా. జసంఖ్యాపరంగా తజకిస్థాన్ ప్రపంచదేశాలలో 98 వ స్థానంలో ఉంది. దేశ వైశాల్యం 143100 చ.కి.మీ. వైశాల్యపరంగా తజకిస్థాన్ ప్రపంచదేశాలలో 96వ స్థానంలో ఉంది. తజకిస్థాన్ సంప్రదాయంగా తజిక్ ప్రజలకు స్థానిక ప్రదేశంగా ఉంది. ప్రస్తుతం దేశంలో తజకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్థాన్ ప్రజలు నివసిస్తున్నారు.

ప్రస్తుత తజకిస్థాన్ ప్రాంతంలో పూర్వం పలు ఆసియన్ సంప్రదాయాలకు నిలయంగా ఉంది. తర్జం నగరంలో నియోలిథిక్, కాంశ్యయుగం కాలంనాటి ప్రజలు నివసించారు. తరువాత తజకిస్థాన్ పలు మతాలకు, సంస్కృతులకు చెందిన పాలకులు ఈ ప్రాంతాన్ని పాలించారు. బక్ట్రియా- మర్గియానా (ఆక్సస్ సంస్కృతి), అండ్రొనొవొ సంస్కృతి, బుద్ధిజం, నెస్టోరియన్ క్రిస్టియానిటీ, జొరొయాస్ట్రియనిజం, మనిచీయిజం మొదలైన పలుసంస్కృతులకు చెందిన పాలకులు ఈ ప్రాంతాన్ని పాలించారు. 
ఈ ప్రాంతం పలు సామ్రాజ్యాలలో భాగమై పలు రాజవంశాల పాలనలో ఉంది. తిమురిడ్ రాజవంశం, రష్యన్ సామ్రాజ్యం ఈ ప్రాంతాన్ని పాలించాయి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నత తరువాత 1991 తజకిస్థాన్ స్వతంత్రరాజ్యంగా మారింది. 1992-1997 మద్య కాలంలో తజకిస్థాన్ స్వతంత్రం కొరకు అంతర్యుద్ధాన్ని ఎదుర్కొన్నది. యుద్ధం చివర స్థిరమైన రాజకీయ స్థితి నెలకొనడమే కాక దేశాభివృద్ధికి అవసరమైన విదేశీసాహాయం కూడా లభించింది.

తజకిస్థాన్ నాలుగు ప్రాంతాలు కలిగిన ఒక  ప్రెసిడెంషియల్ రిపబ్లిక్ . తజకిస్థాన్ లోని 8 మిలియన్ల ప్రజలలో అత్యధికులు తజకి సంప్రదాయానికి చెందిన ప్రజలు. వీరు తజకీ భాషను (ఆధునిక పర్షియన్ యాసలలో ఒకటి) మాట్లాడుతుంటారు. రష్యాభాష కూడా ప్రజలలో అధికంగా వా డుకలో ఉంది. దేశంలో 90% భూమి పర్వతమయంగా ఉంటుంది. 
దేశ ఆర్థికరంగం అధికంగా అల్యూమినియం, పత్తిపంట మీద ఆధారపడి ఉంది. దేశం జి.డి.పి. ప్రపంచదేశాలలో 126వ స్థానంలో ఉంది. కొనుగోలుశక్తి ప్రపంచదేశాలలో 136వ స్థానంలో ఉంది.

తజకిస్థాన్ అంటే  తజకీల భూమి  అని అర్ధం. స్థాన్ అంటే పర్షియన్ భాషలో ప్రదేశం అని అర్ధం. or country 
తజకీలు ఇస్లామిక్ పూర్వకాలానికి (7వ శతాబ్ధానికి ముందు ) చెందిన గిరిజనులు.

ఈ ప్రాంతపు సంస్కృతులు క్రీ.పూ 4వ శతాబ్ధానికి చెందినవి. వీటిలో కాంశ్యయుగం, బక్ట్రియా- మర్గియానా ఆర్కియాలాజికల్, అండ్రినొవొ సంస్కృతి, సరజం (ప్రపంచ వారసత్వసంపద)లు ప్రధానమైనవి. కొంతమంది పరిశోధకులు క్రీ.పూ 7-6 శతాబ్దాలు ఆధునిక తజకిస్థాన్‌లో జరవ్షన్ లోయ అచమెనింద్ సామ్రాజ్యంలో భాగం కాకముందు కాంభోజరాజ్యంలో భాగంగా ఉన్నాయని భావిస్తున్నారు.
అలెగ్జాండర్ ఈ ప్రాంతాన్ని జయించిన తరువాత గ్రేకో-బక్టిరియన్ రాజ్యంలో (అలెగ్జాండర్ తరువాత పాలన) భాగం అయింది. ఉత్తర తజకిస్థాన్ (ఖుజంద్, పంజకెంట్) సొగ్డియాలో భాగంగా ఉండేది. క్రీ.పూ 150 లో నగర- రాజ్యాల కూటమి స్కిథియన్లు, యుయేజీ నోమాడిక్ గిరిజనజాతుల ఆధీనంలో ఉన్నాయి. సిల్క్ రోడ్డు ఈ ప్రాంతం గుండా నిర్మించబడింది. చైనా చక్రవర్తి వూ ఆఫ్ హన్ పాలనా కాలంలో (క్రీ.పూ 141) అన్వేషకుడు ఝంగ్ క్వియాన్ దండయాత్రచేసిన సమయంలో హాన్ సామ్రాజ్యం (చైనా), సిగ్డియానాల మద్య వ్యాపారసంబంధాలు ఉండేవి. సొగ్డియన్లు ఈ ప్రాంతంలో వ్యవసాయం, వడ్రంగి పని, గ్లాస్ తయారీ, వుడ్‌కార్వర్స్ పనులు, వ్యాపార సౌకర్యాలు కలిగించడంలో ప్రముఖపాత్ర వహించారు.క్రీ.శ 1వ శతాబ్దంలో కుషన్ సామ్రాజ్యం (యుయేజీ సముదయకూటమి) ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుని 4వ శతాబ్దం వరకు పాలించింది. ఈ కాలంలో ఈ ప్రాంతంలో బుద్ధిజం, నెస్టోరియన్ క్రిస్టియానిటీ, జొరొయాష్ట్రియనిజం, మనియాచిజం ఆచరణలో ఉండేవి. 
 తరువాత తజకిస్థాన్ ప్రాంతం మద్య ఆసియా, చైనా మద్య వ్యాపార మార్గంగా, ఇస్లామిక్ ప్రధాన ప్రాంతంగా ప్రాముఖ్యత కలిగి ఉంది.
అరబ్ పాలనను త్రోసి సనిద్ సామ్రాజ్యం ఈ ప్రాంతంమీద ఆధిక్యత సాధించింది. తరువాత సమర్ఖండ్, భుకారా నగరాలను (ప్రస్తుతం ఈ నగరాలు ఉజ్బెక్స్థాన్లో ఉన్నాయి) విస్తరించింది. ఇవి తజకిస్థాన్ సంస్కృతికి కేంద్రంగా మారాయి. తరువాత వీటిని టిబెట్ సామ్రాజ్యం ఆతరువాత చైనా 650-680 స్వాధీనం చేసుకున్నాయి. 710 ఈ ప్రాంతాలను తిరిగి అరేబియన్లు స్వాధీనం చేసుకున్నారు. కరా- ఖండ్ ఖనటే ట్రాంసోక్సానియాను (అందులో ఆధునిక ఉజ్బెకిస్థాన్,తజకిస్థాన్,దక్షిణ కిర్గొజ్స్థాన్, నైరుతీ కజకిస్థాన్ ఉన్నాయి) స్వాధీనం చేసుకుని 

 క్రమంగా కరా- ఖండీలు ఈ ప్రాంతంలోని పర్షియన్- అరేబియన్ ముస్లిం సంస్కృతిలో కలిసిపోయారు. 13వ శతాబ్దంలో జంఘిస్ ఖాన్ మంగోలీ ఖవరెజ్మియా దండయాత్ర తరువాత మంగోలీ సామ్రాజ్యం దాదాపు మద్య ఆసియా ప్రాంతం అంతటినీ తమ అధీనంలోకి తీసుకుంది. దాదాపు ఒక శతాబ్దం తరువాత ఆధునిక తజకిస్థాన్ జగటై కనాటే పాలనలోకి మారింది. 
తమర్లనే తింరుద్ సామ్రాజ్యస్థాపన చేసి 14వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని తనస్వాధీనంలోకి తీసుకున్నాడు.

 

బదులుగా రష్యన్ బృందాలు త్వరగానే పస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అయినప్పటికీ తజకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాలలో ఘర్ష్ణలు కొనసాగాయి. 

 
తరువాత సంఘర్షణల పర్యవసానంగా సోవియట్ సంఘటిత వ్యవసాయవిధానాల వలన మద్య ఆసియా, తజికిస్థాన్‌ ప్రాంతాలు కరువుతో పీడించపడ్డాయి. కరువు పలువురు ప్రణాలను బలితీసుకున్నది.1924లో ఉజ్బెకిస్థాన్‌లో భాగంగా తజిక్ అటానిమస్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ రూపొందించబడింది. 1929లో తజిక్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ (తజిక్ ఎస్.ఎస్.ఆర్) గా ప్రత్యేక రిపబ్లిక్ రూపొందించబడింది. అయినప్పటికీ సంప్రదాయక తజిక్ నగరాలైన సమర్కండ్, బుఖారాలు ఉజ్బెక్ ఎస్.ఎస్.ఆర్.లో ఉండిపోయాయి. 

మాస్కో 1927-1934, 1937-1938 మద్య రెండు దఫాలుగా ప్రక్షాళన కార్యక్రమాలను చేపట్టింది. ఫలితంగా తజకిస్థాన్ కమ్యూనిస్టు పార్టీకి చెందిన అన్నిస్థాయిలకు చెందిన 10,000 మంది బహిస్కరణకు గురైయ్యారు. బహిష్కరణకు గురైనవారి స్థానంలో సంప్రదాయ రష్యా ప్రజలు పంపబడ్డారు. ఫలితంగా రష్యాప్రజలు అన్ని స్థాయిలలో ఆధిక్యత సాధించారు. 
మొదటి సెక్రటరీ పదవిలో కూడా రష్యన్లు నియమించబడ్డారు. 1926, 1959 మద్య తజకిస్థాన్‌లో రష్యనుల తరలింపు 1% నుండి 13% అధికరించింది. సోవియట్ శకంలో తజికిస్థాన్ కమ్యూనిస్ట్ పార్టీ మొదటి సెక్రటరీ ( 1946-1956 ) గా పనిచేసిన రాజకీయనాయకుడు బొబొజాన్ ఘఫురోవ్ మాత్రమే గుర్తించతగిన దేశీయేతర ఒకేఒక రాజకీయనాయుకుడుగా ఉన్నాడు. 
 ఆయన తరువాత తేసున్ ఉల్బజయేవ్ (1956-61), జబ్బొర్ రసుల్ఫ్వ్ (1961-1982), రహమాన్ నబియేవ్ (1982-1985, 1991-1992) ఈ పదవిని చేపట్టారు. 1939లో మొదటి ప్రపంచయుద్ధంలో తజకిస్థానీయులు నిర్బంధంగా సోవియట్ సైన్యంలో నియమించబడ్డారు. 2,60,000 మంది తజికిస్థానీయులు జర్మని,ఫిన్లాండ్, జపాన్ లతో పోరాటం సాగించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో 60,000 (4%), 1,20,000 (4%). 15,30,000 మంది పౌరులు మరణించారు. యుద్ధం తరువాత స్టాలిన్ పాలనలో తజికిస్థాన్‌లో వ్యవసాయం, పరిశ్రమలు విస్తరించబడ్డాయి. 
 

 అలాగే 1000 మందిలో విశ్వవిద్యాలయ డిగ్రీపుచ్చుకున్న వారి సంఖ్య కూడా తక్కువగా ఉండేది. 

దేశంలో అకస్మాత్తుగా అంతర్యుద్ధం ఆరంభం అయింది. అంతర్యుద్ధంతో పలు వర్గ ఘర్షణలు మొదలైయ్యాయి. 
. హింసకారణంగా 5,00,00 కంటే అధికంగా నివాసితులు పేదరికం అధికరించడం, పశ్చిమదేశాలు, ఇతర సోవియట్ రిపబ్లిక్కులలో మంచి ఉద్యోగవకాశాలు దేశం నుండి పారిపోయారు. 

 
యుద్ధం ముగింపు తరువాత తజకిస్థాన్ పూర్తిగా ధ్వంసం చేయబడిన తరువాత ఎన్నికలు నిర్వహించబడ్డాయి. యుద్ధంలో 1,00,000 మంది మరణించారు. 1.2 మిలియన్ల ప్రజలు దేశీయంగా, పొరుగుదేశాలకు ఆశ్రితులుగా వెళ్ళారు. 1997లో అఖ్యరాజ్యసమితి జోక్యంతో రహమాన్, గెర్డ్ డి మెర్రం నాయకత్వంలో ప్రతిపక్షపార్టీల మద్య శాంతి ఒప్పందం జరిగింది. ఒప్పందంలో 30% యునైటెడ్ తజిక్ అపోజిషానికి మంత్రివర్గపదవులు ఇవ్వడానికి అవకాశం కలిగించింది. 
 

 2010 లో ఒ.ఎస్.సి.ఇ. రహమాన్ పాలనలో మధ్యమాన్ని అణచడం, తీవ్రంగా సెంసార్ చేయడం గురించి మరింతగా విమర్శించింది. తజిక్ ప్రభుత్వం తజక్, విదేశీ వెబ్‌సైట్లను సెంసార్ చేయడం, ప్రచురణా సంస్థల మీద పన్నును అధికరించడం చేస్తుంది. 
స్వతంత్ర వార్తాపత్రికలు, ప్రచురణాచర్యలు హింసకు గురౌతున్నాయి.2005 వేసవి వరకు రష్యా సరిహద్దు దళాలు తజిక్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో నిలుపబడ్డాయి. 2001 సెప్టెంబరు దాడి తరువాత ఫ్రాన్స్ సైనికదళాలు నాటో ఎయిర్ ఆపరేషన్‌కు మద్దతుగా దుషన్‌బే ఎయిర్ పోర్ట్‌లో నిలిచాయి. యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ, యునైటెడ్ స్టేట్స్ మేరిన్ దళాల అధికారులు కొన్ని వారాలపాటు సమైక్య శిక్షణ కొరకు అప్పుడప్పుడు తజకిస్థాన్‌కు వస్తుంటారు. 2010లో భారతప్రభుత్వం దుషన్‌బేకు ఆగ్నేయంలో ఉన్న అయ్ని ఎయిర్ బేస్ పునర్నిర్మాణ కార్యక్రమాలను (70 మిలియన్ల అమెరికన్ డాలర్లు) చేపట్టి పూర్తిచేసింది. అది ప్రస్తుతం తజికిస్థాన్ ప్రధాన ఎయిర్ బేస్‌గా ఉపయోగించబడుతుంది. అయని ఎయిర్ బేస్ ఉపయోగం గురించి రష్యా ఆందోళన చెందుతున్నట్లు కొన్ని మాటలు ప్రచారంలో ఉన్నాయి.. అలాగే రష్యా దుషంబే వెలుపల బృహత్తర ఎయిర్ బేస్‌ను నిర్వహిస్తుంది.2010లో తజిక్ జైళ్ళ నుండి 25 మంది తీవ్రవాదులు తప్పించుకున్న తరువాత అధికారులు తూర్పుభాగంలోని ఇస్లామిక్ మెటీయరిలిజం గురించి ఆందోళన చెందారు. తరువాత సెప్టెంబరులో రష్త్ లోయ వద్ద 28 మంది తజిక్ సైనికులు తీవ్రవాదుల దాడిలో మరణించారు. 
 మరొక దాడిలో 30 మంది సైనికులు మరణించారు. 
ఘరం వెలుపల జరిగిన ఘర్షణలో 3 మంది తీవ్రవాదులు మరణించారు. తరువాత 2010 నవంబరులో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కేంద్రప్రభుత్వం తూర్పు భాగాన్ని ఆధీనంలోకి తీసుకుని రష్త్ లోయలో సైనికచర్య తీసుకొనవలెనని నిర్ణయం తీసుకొనబడింది. 2012 జూలైలో గొర్నొ- బదఖ్షన్ ఘర్షణలు తలెత్తాయి.

స్వతత్రం వచ్చిన వెంటనే తజికిస్థాన్‌లో అంతర్యుద్ధం మొదలైంది. రష్యా, ఇరాన్ నేపథ్యంలో పలు వర్గసంఘర్షణలు ఒకరితో ఒకరు పోరాడుకున్నారు. 
. యుద్ధం కారణంగా పరిశ్రమలలో నియమించబడిన 40,000 మందిలో 25,000 మంది రష్యాకు పారిపోయారు. 1997లో యుద్ధం ఉపశమించింది. 1999లో జరిగిన శాంతిపూరితమైన వాతావరణంలో ఎన్నికల తరువాత తజికిస్థాన్ ప్రభుత్వం రూపొందించబడింది. 

 అధికారిక రిపబ్లిక్ తజికిస్థాన్ అధ్యక్షపీఠానికి, పార్లమెంటు సభ్యులను ఎన్నుకోవడానికి ఎన్నికలను నిర్వహిస్తుంది. ఆధిక్యత కలిగిన పార్టీ విధానంలో పాలన నిర్వహించబడుతుంది.  పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ తజికిస్థాన్  వరుసగా పార్లమెంటులో ఆధిక్యత కలిగి ఉంది. ఎమోమల్లి రహమాన్ 1994 నవంబరు నుండి అధ్యక్ష పీఠాన్ని అలంకరించాడు. కొఖిర్ రసుల్జొడా ప్రధానమంత్రి పదవి బాధ్యత వహించాడు. మతుబ్ఖాన్ దవ్లతొవ్ మొదటి ఉపముఖ్యమంత్రిగా మురొదలి అలిమర్దన్, రుక్వియా కుర్బనివ సహాయ ఉపముఖ్యమంత్రులుగా ఉన్నారు.

 The government insisted that only minor violations had occurred, which would not affect the will of the Tajik people. 2006 నవంబరు 6 ఎన్నికలను ప్రధానప్రతిపక్షాలు బహిష్కరించాయి. 
 తజిక్ అధ్యక్షుడు, ఇరాన్ విదేశాంగ మంత్రి సమావేశం తరువాత తజికిస్థాన్ సంఘై కోపరేషన్ ఎన్నికలలో ఇరాన్ సభ్యత్వానికి తజికిస్థాన్ మద్దతు తెలిపంది. పత్రికాస్వతంత్రానికి ప్రభుత్వం అధికారికంగా మద్దతు ఇస్తుంది. అయినప్పటికీ పత్రికలమీద షరతులు విధిస్తూనే ఉంది.  వార్  పీస్  ఇంస్టిట్యూట్ నివేదిక అనుసరించి తజిక్ న్యూస్, ఫర్ఘన, సెంట్రాసియా, ప్రాంతీయ, విదేశీ వెబ్ సైట్లను నిషేధించబడ్డాయి అని తెలియజేస్తుంది. 
పత్రికావిలేఖరులు వివాదాంశమైన వార్తలను అందించడానికి ఆటంకాలు ఉన్నాయి.

తజికిస్థాన్ భూబంధిత దేశం. అలాగే వైశాల్యపరంగా తజికిస్థాన్ మద్య ఆసియాలో అతిచిన్న దేశంగా గుర్తించబడుతుంది. ఇది ఉత్తర అక్షాంశంలో 36°, 41° N (a small area is north of 41°, తూర్పురేఖా ంశం 67° - 75° ఉంది. ఇది పామిర్ పర్వతాలతో నిండి ఉంది. 
దేశవైశాల్యంలో సముద్రమట్టానికి 3000 మీ ఎత్తున ఉంది. దిగువ భూభాగం ఫర్గన కఫర్నేషన్ లోయ, వఖ్ష్ నదికి (అము దర్యా నుండి ప్రవహిస్తున్నాయి) దక్షిణ తీరంలో ఉంది. దుషంబే కఫర్నేషన్ లోయ దక్షిణంలో ఉంది.

అము దర్య, పంజ్ నదులు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్నాయి. తజికిస్థాన్ పర్వతాలలో ఉన్న గ్లాసియర్లు నదీజలాలకు ప్రధాన ఆధారంగా ఉంది. ఇవి ఆరా సముద్రంలో సంగమిస్తున్నాయి. 
తజికిస్థాన్‌లో 10కి.మీ పొడవైన నదులు 900 ఉన్నాయి.

తజకిస్థాన్‌లో 4 పాలనా విభాగాలు ఉన్నాయి. ప్రాంతాలు (ప్రొవింస్ ) ; (విలోయత్) సుఘ్ద్, ఖత్లాన్, స్వయం ప్రతిపత్తి కలిగిన గొర్నొవ్- బదాక్షన్ (జి.బి.ఎ.ఒ),, సుబోర్దినేషన్ రిపబ్లిక్. 
ప్రతివిభాగం పలు ఉపవిభాగాలుగా (జిల్లాలు) (నొహియా, రైన్) విభజించబడి ఉన్నాయి. జిల్లాలు జమోత్స్ (స్వయంపాలిత గ్రామాలు), గ్రామాలు (క్వాష్లోక్విస్). 2006 గణాంకాలను అనుసరించి 367 జమోత్‌లు ఉన్నాయి.

సోవియట్ యూనియన్‌, మద్య ఆసియాలో అత్యంత వెనుకబడిన రిపబ్లిక్ తజికిస్థాన్.  
ప్రస్తుతం 47% తజికిస్థాజ్ జి.డి.పి. విదేశాలలో నివసిస్తున్న తజికిపౌరుల నుండి లభిస్తుంది. (తజికీలు అధికంగా రష్యాలో పనిచేస్తుంటారు). 
 దేశం ప్రస్తుత ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంది. లంచగొండితనం, అసమానమైన ఆర్థిక సంస్కరణలు, ఆర్థిక నిర్వహణలో అసమర్ధత. విదేశాలలో పనిచేస్తున్న ఉద్యోగుల ద్వారా అందుతున్న ధనం, అక్యూమినియం, పత్తి అమ్మకాలద్వారా లభిస్తున్న విదేశీ ఆదాయం తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాలకు సహకారిగా ఉంటుంది. 2000 లో మునుపటి అంతర్యుద్ధంలో చిన్నభిన్నమైన దేశపరిస్థితి చక్కదిద్దడానికి శాంతిస్థపనకు విదేశీధనసహాయం సహాయకారిగా ఉంది. 
రెండు సంవత్సరాల తీవ్రమైన కరువు వలన ఆహారపదార్ధాల కొరతను విదేశీ ఆర్థికసహాయం తీర్చింది. 2001 ఆగస్టులో రెడ్ క్రాస్ కరువు బాధిత దేశాలైన తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్‌లకు సహకరించవలసిందిగా ప్రకటిస్తూ ఐక్యరాజ్యసమితికి కూడా సహాయం కొరకు పిలుపును అందించింది. అయినప్పటికీ దేశంలో ఇప్పటికీ ఆహారం సమస్యగానే ఉంది. 2012 జనవరిలో తజకిస్థాన్ ప్రజలలో 6,80,152 మంది ఆహార అబధ్రతతో జీవిస్తున్నారు. వీరిలో 6.70,852 మంది ఫేస్ 3 (నిశితమైన ఆహారం, జీవనోపాధి సమస్య) ఆహార అబధ్రత, 3000 మంది ఫేస్ 4 (హ్యూమనిటేరియన్ ఎమర్జెంసీ) సమస్యలో చిక్కుకున్నారు.

యుద్ధం తరువాత 2000-2007 మద్యకాలంలో తజికిస్థాన్ గణనీయమైన ఆర్థికాభివృద్ధి సాధించింది. తజికిస్థాన్ జి.డి.పి. 9.6% నికి చేరుకుందని వరల్డ్ బ్యాంకు డేటా తెలియజేస్తుంది. ఇది మద్య ఆసియా దేశాలలో తకకిస్థాన్ ఆర్థికస్థితి పరంగా అభివృద్ధి సాధించింది. ప్రత్యేకంగా ఆర్థికంగా క్షీణస్థితితికి చేరిన తుర్క్మేనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ కంటే తజికిస్థాన్ అభివృద్ధి స్థాయికి చేరుకున్నాడు. తజికిస్థాన్ ఆర్థికరంగానికి అల్యూమినియం, పత్తి ఉత్పత్తి, విదేశీ ఉద్యోగుల సంపాదన సహకరిస్తుంది. పత్తి పంట వ్యవసాయంలో 60% ఆక్రమించి ఉంది, 75% గ్రామీణులకు పత్తి పంట మద్దతు ఇస్తుంది, 45% నీటిపారుదల అందుతున్న భూమి పత్తి పంటకు ఉపయోగపడుతుంది. 
 ప్రభుత్వానికి స్వంతమైన తజిక్ అల్యూమినియం కంపెనీ మద్య ఆసియాలో అతిపెద్ద అల్యూమినియం పరిశ్రమగా గుర్తించబడుతుంది. అలాగే ప్రంపంచం లోని అతిపెద్ద అల్యూమినియం పరిశ్రమలలో ఒకటిగా గుర్తించబడుతుంది. తజకిస్థాన్ నదులు వఖ్ష్ నది, పంజ్ నదులు జలవిద్యుత్తుకు ఆధారంగా ఉన్నాయి. ప్రభుత్వం జలవిద్యుత్తు ఉత్పత్తిచేసి దేశీయ వాడకానికి, విద్యుత్తు ఎగుమతి కొరకు పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తుంది. తజికిస్థాన్ లోని న్యూరెక్ డాం ప్రపంచంలోని ఎత్తైన ఆనకట్టగా గుర్తించబడుతుంది. 670 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన సంగ్తుడా-1 జలవిద్యుత్తు కేంద్రంలో 2008 జనవరి 18 నుండి రష్యాకు చెందిన  ఆర్.ఎ.ఒ ఎనర్జీ జెయింట్  యు.ఇ.ఎస్ పనిచేస్తుంది. 
 సంగ్తుడా-2 లో ఇరాన్, జరఫ్షన్ కొరకు చైనాకు చెందిన సినో- హైడ్రో పనిచేస్తున్నాయి. 335 మీ ఎత్తైన రోగన్ పవర్ ప్లాంటు నిర్మాణం పూర్తయితే ప్రంపంచంలో ఎత్తైనదని గుర్తించబడుతున్న న్యూరెక్ ఆనకట్టను అధిగమిస్తుంది. సి.ఎ.సి.ఎ. 1000 ప్లాంటు తజికిస్థాన్ నుండి పాకిస్థాన్‌కు ఆఫ్ఘనిస్తాన్ పవర్ ట్రాన్స్‌మిట్ ద్వారా 1000 మెగావాట్ల విద్యుత్తును తరలించడానికి ప్రణాళిక రూపొందించబడింది.. ట్రాంస్ మిషన్ మొత్తం పొడవు 750 కి.మీ. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కలిసి పనిచేయనున్న ఈ ప్రణాళికలో డబల్యూ.బి, 
ఐ.ఎఫ్.సి, ఎడి.బి, ఐ.డి.బి సంస్థలు పనిచేయనున్నాయి. ఈ ప్రణాళిక మొత్తం విలువ 865 మిలియన్ల అమెరికన్ డాలర్లు. మిగిలిన విద్యుత్తు అవసరాలకు చిన్న మొత్తంలో సహజవాయువు, పెట్రోలియం వనరులు, తగినంత బొగ్గు నిలువలు విద్యుత్తు ఉతపత్తికి సహకరిస్తున్నాయి.  2014లో ప్రపంచంలోని అధికంగ విదేశీ వలస ఉద్యోగుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాలలలో తజికిస్థాన్ మొదటి స్థానంలో ఉంది. 2014కు ముందు విదేశీ ఉద్యోగుల సంపాదన జి.డిపిలో 45% ఉండగా రష్యాలో సంభవించిన ఆర్థిక సంక్షోభం కాతణంగా 2015 నాటికి అది 40%కి పతనం చెందగలదని భావించారు. రష్యాలోని తజిక్ శ్రామికులు మిలియన్ల తజికిస్థాన్ ప్రజల ఆర్థికస్థితికి ఆధారంగా ఉన్నారు. 2014-2015 రష్యన్ ఆర్థికస్థితి దిగజారడం కారణంగా తజికిస్థాన్ యువకులు రష్యా నుండి మాతృదేశానికి తిరిగి రాగలరని చెప్పింది. 20% తజికిస్థానీయులు 1.25 అమెరికన్ డాలర్ల దినసరి ఆదాయంతో జీవిస్తున్నారని కొన్ని అంచనాలు తెలియజేస్తున్నాయి. 
 తజికిస్థాన్ నుండి వలసపోవడం, విదేశీసంపాదన ఆర్థికంగా తీవ్రమైన ప్రభావం కలిగించలేదు. 2010 లో తజికిస్థాన్ విదేశీ ఉద్యోగుల ఆదాయం 2.1 బిలియన్ల అమెరికన్ డాలర్లు. ఇది 2009 కంటే అధికం. 2006 తజికిస్థాన్ వరల్డ్ బ్యాంక్ తజికిస్థాన్ విధానం నివేదికలో తగత కొన్ని సంవత్సరాలుగా జికిస్థాన్ ఆర్థికరంగాన్నీ విదేశీ ఉద్యోగుల ఆగాయం నడిపించి పేదరికాన్ని కొంత తగ్గించిందని వివరించింది. మాదకద్రవ్యాలు చేరవేయడం తజికిస్థాన్ చట్టవిరుద్ధమైన ఆదాయాలలో ఒకటి. అంతర్జాతీయ సేవాసంస్థలైన యు.ఎన్.ఒ.డి.సి., యు.ఎస్, రష్యా, ఆఫ్ఘన్ అధికారుల కృషిఫలితంగా చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాల తరలింపును అదుపులోకి వచ్చింది. తజికిస్థాన్ హెరాయిన్, ఓపియం జప్తు ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. మాదకద్రవ్యాల ద్వారా లభిస్తున్న ధనం ప్రభుత్వాన్ని కలుషితం చేస్తుంది. తజికిస్థాన్ అంతర్యుద్ధంలో రెండువైపులా పాల్గొని ప్రస్తుతం అధికారపదవులు చేపట్టిన వారిలో పలువురికి మాదకద్రవ్యాల వ్యాపారంలో సంబంధాలు ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. యు.ఎన్.ఓ.డి.సి. తజికిస్థాన్‌తో పనిచేస్తూ సరిహద్దు రక్షణలో శిక్షణ ఇస్తుంది. అలాగే సమైక్య సరిహద్దు దళాను నియమించి  తజికిస్థాన్ డ్రగ్ కంట్రోల్ ఏజెంసీ  స్థాపనలో భాగస్వామ్యం వహించింది. తజికిస్థాన్  ఎకనమిక్ కోపరేషన్ ఆర్గనైజేషన్  (ఇ.సి.ఒ) లో శాశ్వత సభ్యత్వం కలిగి ఉంది.

రైలురోడ్డు మొత్తం పొడవు 680 కి.మీ. రైలు గేజ్ 1530మి.మీ ఇది రష్యా గేజ్ పరిమాణం. దేశం దక్షిణప్రాంతంలోని ప్రధాన భూభాగాలను, రాజధానిని పారిశ్రామిక ప్రాంతాలను (హిసార్, వఖ్ష్ లోయలు), ఉజ్బెకిస్థాన్, తుర్క్మెనిస్థాన్, కజక్స్థాన్, రష్యాలను అనుసంధానిస్తూ రైలు మార్గం నిర్మించబడుతుంది. అంతర్జాతీయ సరుకు రావాణా ఈ మార్గంలో చేరవేయబడగలదని భావించారు. ప్రస్తుతం నిర్మించబడిన క్వర్ఘంతెప్ప - కులాబ్ రైలు మార్గం కులాబ్ జిల్లా దేశం కేద్రభాగాలను అనుసంధానిస్తుంది.

రన్‌వేలు ఉన్నాయి. అందులో రెండింటికి 3,000 మీ పొడవైన రన్‌వేలు ఉన్నాయి. 2015 ఏప్రిల్ నాటికి దేశం ప్రధాన విమానాశ్రయం దుషంబే నుండి రష్యాలోని ప్రధాన నగరాలు, మద్య ఆసియాకు అలాగే ఢిల్లీ, దుబాయ్, ఫ్రాంక్‌ఫర్ట్, ఇస్తాంబుల్, కాబూల్, ఉరుంక్వి నగరాలకు విమానసేవలు అందించబడుతున్నాయి. రష్యా నుండి ఖుజంద్ వరకు అంతర్జాతీయ విమానాలు నడుపబడుతున్నాయి. కులాబ్, ఖుర్గోంతెప నుండి విమానసేవలు పరిమితంగానే లభిస్తున్నాయి. ఖొరోగ్ విమానాశ్రయం దేశీయ విమానసేవలు అందిస్తుంది. తజికిస్థాన్‌లో రెండు ప్రధాన విమానసేవలు ( సోమన్ ఎయిర్ లైన్, తజిక్ ఎయిర్ లైన్) ఉన్నాయి. అవి

తజికిస్థాన్ రహదార్ల మొత్తం పొడవు 27,800 కి.మీ. ప్రయాణ సౌకర్యాలలో 90% ఆటోమొబైల్స్ పూర్తిచేస్తున్నాయి. సరుకురవాణాలో 80% రహదారి మార్గంలో చేరవేయబడుతుంది. 

 వీటికి అంతర్జాతీయ సంస్థలు నిధిసహాయం చేస్తున్నాయి. 
వీరిలో 70% 30 సంవత్సరాల లోపు వారు. 30% ప్రజలు 14-30 సంవత్సరాల వయస్కులు. 
బదఖ్షన్ లోని పమిరి ప్రజలు, స్వల్పసంఖ్యలో యగ్నొబీలు, గణీయమైన సంఖ్యలో ఇస్మైలీలు కూడా తజికీప్రజలుగా భావించబడుతున్నారు. తజికిస్థాన్‌లోని ప్రజందరూ తజికిస్థానీయులుగా పిలువబడుతున్నారు.

తజికిస్థాన్ ప్రాంతీయ భాష తజికీ అధికారభాషగా ఉంది. సమాచారచేరవేతకు, వ్యాపారానికి రష్యా భాష వాడుకలో ఉంది. రాజ్యాంగం  రష్యాభాష  సంప్రదాయ ప్రజల వాడుక భాష గా ఆమోదించబడినప్పటికీ 2009 రాజ్యాంగ సవరణ తరువాత రష్యాభాష రద్దుచేయబడింది. పేదరికం ఉన్నప్పటికీ సోవియట్ పాలనలో ఉచిత విద్య ఫలితంగా తజికిస్థాన్ అక్షరా శ్యత అధిక్ంగానే ఉంది. ప్రజలలో 95.5% వ్రాత, చదవే శక్తిని కలిగి ఉన్నారు. ప్రజలలో అత్యధికులు సున్నీ ఇస్లాం మతాన్ని అవలంబిస్తున్నారు. 

తజికిస్థాన్ లోని 80% ప్రజలకు తజిక్ భాష మాతృభాషగా ఉంది. ప్రస్తుత తజికిస్థాన్ లోని దుషంబే (రాజధాని), ఖుజండ్, కులాబ్, పంజకెంట్, కుర్గొంటెప, ఖొరుఘ్, ఇస్తరవ్షన్ మొదలైన నగరకేంద్రాలలో ఉజ్బెకీలు, కిర్గీజులు, రష్యన్లు అల్పసంఖ్యాకులుగా ఉన్నారు.

తజికిస్థాన్ ఆగ్నేయంలో ఉన్న గొర్నొ- బదఖ్షన్ అటానిమస్ ప్రొవింస్‌లో చైనా, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో పమిరిప్రజలు ఉన్నారు. వీరిని తజికీ సంప్రదాయ ప్రజలుగా భావిస్తారు. అయినప్పటికీ వీరు తజికీ ప్రజలకంటే భాషాపరంగా, సాంస్కృతికంగా వేరుపడి ఉంటారు. తజికిస్థాన్ లోని మిగిలిన ప్రాంతాలలో నివసిస్తున్న అధికమైన సున్నీ ముస్లిములు, పమిరీలు ఉత్సాహంగా ఇస్లామైలీ మతాన్ని అనుసరిస్తుంటారు. అలాగే షుఘ్ని, రుషని, ఖుఫి, వాఖి మొదలైన పలు ఇరానీ భాషలు మాట్లాడుతుంటారు. ఎత్తైన పమిరీ పర్వతంలో ఒంటరిగా నివసిస్తున్న వీరు పలు పురాతన సస్కృతి, సంప్రదాయాలను సంరక్షిస్తుంటారు. దేశమంతటా కనుమరుగౌతున్న జానపద కళలు వీరి వద్ద సజీవంగా ఉన్నాయి.

ఉత్తర తజికిస్థాన్ లోని పర్వతప్రాంతాలలో యఘ్నొబి ప్రజలు నివసిస్తున్నారు. ప్రస్తుతం యఘ్నొబి ప్రజల సంఖ్య 25,000 ఉండవచ్చని భావిస్తున్నారు. 20వ శతాబ్దంలో బలవంతపు వలసలు వీరి సంఖ్యను క్షీణింపజేస్తున్నాయి. వీరు యఘ్నొబి భాషను మాట్లాడుతుంటారు. పురాతనమైన సొగ్డియన్ భాష ఆధునిక రూపమే యఘ్నొబి.

తజికిస్థాన్ కళాకారులు దుషంబే టీ హౌస్ రూపొందించారు. అది 1988లో బౌల్డర్, కొలరాడో సిస్టర్ సిటీకి కాముకగా ఇవ్వబడింది. .

సున్ని ఇస్లాంకు చెందిన హనాఫి స్కూల్ 2009లో అధికారికంగా ప్రభుత్వ అనుమతి పొందింది. తజికిస్థాన్ తనతాను లైకిక రాజ్యంగా ప్రకటించుకుంది. దేశంలో ప్రజలకు పూర్తి మతస్వాతంత్ర్యం ఇవ్వబడింది. ప్రభుత్వం ఈద్- ఉల్- ఫితిర్, ఈద్ అల్ అధా పండుగలకు శలవు దినంగా ప్రకటించింది. యు.ఎస్ స్టేట్ డిపార్ట్మెంటు, పీ రీసెర్చ్ నివేదిక అనుసరించి తజికిస్థాన్ ప్రజలలో 98% ముస్లిములు ఉన్నారు. వారిలో దాదాపు 87%-95% సున్నీ ముస్లుములు, దాదాపు 3% ప్రజలు షియా ముస్లిములు, 7% ఏశాఖను వెల్లడించని ముస్లిములు ఉన్నారని తెలియజేస్తున్నాయి. 
మిగిలిన 2% ప్రజలు రష్యన్ ఆర్థడాక్స్ . కాథలిక్ క్రైస్తవులు, జొరాష్ట్రియన్, బుద్ధిజానికి చెందినవారై ఉన్నారు. అత్యధిక ముస్లిములు రంజాన్ ఉపవాసం ఉంటారు. గ్రామాలలో మాడింట 1 వంతు, పట్టణాలలో 10% ప్రజలు దినసరి ప్రార్థనలలో పాల్గొంటారు. బుఖారన్ యూదులు తజికిస్థాన్‌లో క్రీ.పూ 2వ శతాబ్దం నుండి నివసిస్తుండేవారు. ప్రస్తుతం వారిలో ఎవరూ జీవించి లేరు.

వివిధ మతస్థుల మద్య సంబంధాలు సాధారణంగా సుముఖంగానే ఉంటాయి. ప్రధానమైన ముస్లిం నాయకుల మద్య కొంత భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. 
అల్పసంఖ్యాక మతస్థులు వివక్షకు గురౌతున్నారని నాయకుల భావన. మత సంస్థలు దేశరాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఇస్లామిక్ రినైసెంస్ పార్టీ తజకిస్థాన్ అంతర్యుద్ధం (1992-1997) యుద్ధంలో ప్రధాన పోరాటవీరులుగా ఉన్నారు. వారు తజికిస్థన్‌ను ముస్లిం దేశంగా ప్రకటించాలని కోరుకుంటున్నారు. 
 
శుక్రవార ప్రార్థనలు జరిపే మసీదులు పరిమితంగానే ఉన్నాయి.కొందరు ఇది వివక్ష అని భావిస్తున్నారు. .
చట్టపరంగా మతసంస్థలు స్టేట్ కమిటీ, ప్రాంతీయ అధికారుల ద్వారా నమోదు చేసుకోవాలి. 10 మంది సభ్యులు ఉండాలి. ప్రాంతీయ ప్రభుత్వాధికారులు ప్రార్థనాప్రదేశాన్ని పరిశీలించాలి. సభ్యులు బహిరంగంగా ప్రార్థనకు మనుషులను సమీకరించకూడదు. నమోదు చేయడంలో వైఫల్యం పెద్ద ఎత్తున జరిమానా చెల్లించడానికి దారితీస్తుంది. అంతేకాక ప్రర్ధనా ప్రాంతాన్ను మూతవేయడం సంభవిస్తుంది. అనుమతి పొందండంలో ప్రాంతీయస్థాయిలో సమస్యలు ఉన్నాయని ప్రజల భావన. 18 సంవత్సరాల లోపు వారు బహిరంగ ప్రార్థనలకు అనర్హులు.

తజికీ ప్రభుత్వం ఆరోగ్యసంరక్షణా విధానాలను అభివృద్ధిచేసి విస్తరించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ ఆరోగ్యసంరక్షణ అవసరమైనదానికంటే తక్కువగా, ఔషధాల సరఫరా కొరతతో బలహీనంగా ఉంది. లేబర్, సోషల్ వెల్ఫేర్ 2000లో తజికిస్థాన్‌లో 1,04,272 ఆరోగ్యసేవలకొరకు నమోదుచేసుకున్నారని వెల్లడించింది. వీరు తజికిస్థాన్‌లోని పేదరికంతో బాధపడుతున్న ప్రజలు. తజికిస్థాన్ ప్రభుత్వం, వరల్డ్ బ్యాంకు ఈ ప్రజలకు సహాయంగా నిలిచి పేదరికాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి. 

 2012 గణాంకాలను అనుసరించి శిశుమరణాల శాతం 1000 మందికి 37. 2011 గణాంకాలను అనుసరించి ప్రతి 1,00,000 మంది ప్రజలకు 170 మంది వైద్యులు ఉన్నారు. 2010 గణాంకాలను ఆనుసరించి 457 పిల్లలు, పెద్దలు పోలియోబారిన పడగా నియంత్రణలోకి తీసుకువచ్చే ముందు వీరిలో 29 మంది ప్రాణాలను విడిచిపెట్టారు..

తజికిస్థాన్‌లో విద్య 11 సంవత్సరాల ప్రాథమికవిద్య, సెకండరీ విద్యావిధానం అనుసరిస్తుంది. అయినప్పటికీ 2016 నుండి ప్రభుత్వం 12 సంవత్సరాల ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలను యోచిస్తుంది. . తజికిస్థాన్‌లో అధిక సంఖ్యలో విద్యాసంస్థలు ఉన్నాయి. ఖుజంద్ స్టేట్ యూనివర్శిటీలో 76 డిపార్ట్మెంట్లు, 15 ఫాకల్టీలు ఉన్నాయి. 

ప్రభుత్వం విద్య కొరకు 2005-2012 కొరకు గి.డి.పి నూండి 3.5% నుండి 4.1% వ్యయం చేస్తుంది. ఒ.ఇ.సి.డి చేస్తున్న వ్యయం (6%) కంటే ఇది తక్కువ. 
 ఐక్యరాజ్యసమితి దేశంలోని విద్యావసారాలకు తజికిస్థాన్ చేస్తున్న వ్యయం చాలదని అభిప్రాయపడుతుంది.
అకాడింగ్ యు.ఎన్.ఎస్.ఎఫ్ సర్వే అనుసరించి తజికిస్థాన్ బాలికలలో 25% మంది నిర్భంధ ప్రాథమిక విద్యను అభ్యసించడంలో పేదరికం, బాలికల పట్ల చూపుతున్న వివక్ష కారంణంగా వైఫల్యం చెందుతున్నారు. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ తజికిస్థాన్ అక్షారాశ్యతా శాతం అధికంగానే ఉంది.

తజికిస్థాన్ పర్వతాలు హిల్ క్లైంబింగ్, మౌంటెన్ బైకింగ్, రాక్ క్లైంబింగ్, స్కీయింగ్, స్నోబోర్డింగ్, పర్వతారోహణ మొదలైన పలు ఔట్ డోర్ క్రీడలకు అవకాశం కల్పిస్తుంది. వసతులు పరిమితంగా ఉన్నప్పటికీ ఫాన్, పామిర్ పర్వతాలకు హైకింగ్ టూర్లు, తజికిస్థాన్‌లో ఉన్న 7,000 శిఖరాలకు దేశీయ, అంతర్జాతీయ పర్యటనలు ఏర్పాటు చేయబడుతున్నాయి.

అసోసియేషన్ ఫుట్ బాల్ తజికిస్థాన్‌లో అత్యంత ప్రాబల్యం సంతరించుకుంది. తజకిస్థాన్ నేషనల్ ఫుట్ బాల్ టీం ఎఫ్.ఎఫ్.ఎ, ఆసియన్ ఫుట్ బాల్ కాంఫిడరేధన్‌లో పాల్గొన్నాయి. 
తజికిస్థాన్ లోని ప్రముఖ క్లబ్బులు తజిక్ లీగ్ లో పోటీ చేస్తున్నాయి. 2012లో తజికిస్థాన్ క్రికెట్ ఫెడరేషన్ ప్రారంభించబడింది. ఇది తజకిస్థాన్ ప్రభుత్వం తరఫున క్రీడలలో పాల్గొంటుంది. 
అదే సంవత్సరం దీనికి ఆసియన్ క్రికెట్ కైంసిల్ సభ్యత్వం లభించింది. తజికిస్థాన్ రగ్బీ టీం ఇప్పుడిప్పుడే అభివృద్ధిపధంలో సాగుతుంది.

తజికిస్థాన్ స్వతంత్రం పొదాక తజికిస్థానీ అథెట్లు ముగ్గురు ఒలింపిక్ పతకాలు సాధించారు. వారు వరుసగా రెస్ట్లర్ యూసప్ అబ్దుసల్మొవ్, (2008 రెస్టిలింగ్), సమ్మర్ ఒలింపిక్స్ - మెంస్ ఫ్రీస్ట్రైల్ 84 కి.గ్రా. (నీజింగ్ 2008), జుడోకా రసూల్ (జుడో 2008 సమ్మర్ ఒలింపిక్స్- మెంస్ 73 కి.గ్రా; కాంశ్యం: బీజింగ్), బాక్సర్ మవ్జున చొరీవ (బాక్సొంగ్ 2012 ఒలింపిక్స్- వుమెన్ లైట్ వెయిట్; కాంశ్యం).

గొర్నొవ్ - బదఖ్షన్ అటానిమస్ రీజియన్ రాజధాని ఖొరుగు (తజకిస్థాన్ అత్యధిక ఆటిట్యూడ్ ) వద్ద బండీ క్రీడ నిర్వహించబడుతుంది.




#Article 187: ఉజ్బెకిస్తాన్ (2972 words)


రిపబ్లిక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ (Republic of Uzbekistan) మధ్య ఆసియా లోని భూపరివేష్టిత దేశం (నలువైపులా భూమితో చుట్టబడిన దేశము). ఈ దేశానికి పడమర, ఉత్తరాన కజకస్తాన్, తూర్పున కిర్గిజ్ స్తాన్, తజికిస్తాన్, దక్షిణాన ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్ దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి.

ఉజ్బెకిస్థాన్ ఒకప్పుడు గొక్తర్స్ (టర్కిక్ ఖగ్నాటే), తరువాత తింరుద్ సామ్రాజ్యం భాగంగా ఉండేది. ప్రస్తుతం ఉజ్బెకిస్థాన్ ప్రాంతాన్ని 16వ శతాబ్దంలో టర్కీ మాట్లాడే నొమాడ్స్ ఆక్రమించుకున్నారు. 19వ శతాబ్దంలో ఈ ప్రాంతం రష్యా సామ్రాజ్యంలో ఉంది. 1924లో ప్రస్తుత ఉజ్బెకిస్థాన్ ప్రాంతం సోవియట్ యూనియన్ సరిహద్దు రిపబ్లిక్‌గా (ఉజ్బెక్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్) అయింది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నత తరువాత 1991 ఆగస్టు 31న ఉజ్బెకిస్థాన్  ఉజ్బెకిస్థాన్ రిపబ్లిక్ గా ప్రకటించబడింది. మరుసటి అధికారికంగా స్వతంత్ర దినం జరుపుకుంది.

ఉజ్బెకిస్థాన్ అధికారిక డెమొక్రటిక్ , లౌకిక, యూనిటరీ స్టేట్, రిపబ్లిక్ రాజ్యాంగం వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వం కలిగిన దేశం. దేశ అధికారిక భాష ఉజ్బెకి. ప్రజలలో 85% ప్రజలకు టర్కీ భాష వాడుకలో ఉంది, అయినప్పటికీ రష్యన్ భాష దేశమంతటా వ్యాపించి ఉంది. ఉజ్బెకి ప్రజలు 81%, రష్యన్లు 5.4%, తజకీలు 4%, కజఖ్ ప్రజలు 3% ఇతరులు 6.5% ఉన్నారు. ఉజ్బెకిస్థాన్ ప్రజలలో అత్యధికులు ముస్లిములు  ఉజ్బెకిస్థాన్ కామ్ంవెల్త్ దేశాలు, ఆర్గనైజేషన్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ కోపరేషన్ ఇన్ యూరప్, యునైటెడ్ నేషంస్ (ఐఖ్యరాజ్యసమితి) , షంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సభ్యత్వం కలిగి ఉంది.

ఉజ్బెకిస్థాన్ ఆర్ధికరంగం ప్రధానంగా పత్తి, బంగారం, యురేనియం , సహజవాయువు మొదలైన కమ్మోడిటీ ఉత్పత్తి మీద ఆధారితమై ఉంది.

ఉజ్బెకిస్థాన్‌లో మొదటిగా నివసించిన ప్రజలు ప్రస్తుతం కజక్‌స్థాన్ ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి వచ్చిన ఇరానియన్ నోమాడ్‌లని భావిస్తున్నారు. 
 వీరు క్రీ.పూ 1వ శతాబ్ధానికి చెందినవారని భావిస్తున్నారు. వీరికి ఇరానియన్ భాషలు వాడుకలో ఉండేవి. వీరు మద్య ఆసియాలో స్థిరపడి నదుల వెంట విస్తారమైన నీటిపారుదల విధానాన్ని స్థాపించారు.  ఈ సమయంలో బుహొరొ (బుకారా) సమర్క్వండ్ (సమర్కండ్) , తాష్కెంట్ ప్రభుత్వం , ఉన్నత సాంస్కృతిక కేంద్రాలుగా ఉద్భవించాయి. బి.సి 5వ శతాబ్దం నాటికి బాల్ట్రియన్, సొఘడియన్ , యుఫ్హేహి (టొఖరియన్) ఈ ప్రాంతంలో ఆధిక్యత సాధించి ఈ ప్రాంతంలో పాలన సాగించారు.

చైనా పశిమప్రాంతంలో పట్టువ్యాపారం అభివృద్ధి చేసింది. ఈ వ్యాపారాన్ని అవకాశంగా తీసుకున్న ఇరానియన్ నగరాలు వ్యాపార కేంద్రాలుగా వర్ధిల్లాయి. ఉజ్బెకిస్థాన్ ప్రాంతంలోని నగరాలు , ట్రాంసొక్సియానా (మౌవాయుర్నా) (అరబు విజయం తరువాత ఇవ్వబడిన పేరు) గ్రామీణ నివాసిత ప్రాంతాలు , తూర్పు ప్రాంతాం (ప్రస్తుత చైనాలోని క్సింజియాంగ్), సొగడియన్ ప్రాంతాలు ఇఆరానియన్ వ్యాపారవేత్తలు చేసిన వ్యారాభివృద్ధితో సంపన్నమైనాయి.  సిల్క్ రోడ్డు (పట్టు రహదారి), బుఖారా,, సమరక్వాడ్ అతి సంపన్న నగరాలుగా అభివృద్ధిచెందాయి. ఆ సమయంలో ట్రాంస్క్సియానా అతిపెద్ద ప్రతిభావంతమైన, శక్తివంతమైన అలాగే పురాతన పర్షియన్ ప్రాంతంగా విలసిల్లింది. 

మక్డోనియన్ పాలకుడు అలెగ్జాండర్ కంక్వర్డ్ సొగడియానా, బచిరాలను జయించాడు. అలెగ్జాండర్ అచమెనింద్ సామ్రాజ్య చక్రవర్తి మూడవ డారిస్ కుమార్తె రొక్సియానాను వివాహమాడాడు. పర్షియన్ సామ్రాజ్యం అచమెనింద్ భూభాగాలు ఆధునిక ఉజ్బెకిస్థాన్‌లో ఉన్నాయి. ఈ విజయం అలెగ్జాండరుకు ప్రాబల్యత తీసుకువచ్చింది. రాజ్యం తరువాత క్రీ.పూ 1 వ శతాబ్ధానికి యుయేజీ ఆధీనంలోకి వచ్చింది. ఉజ్బెకిస్థాన్‌ను పలు సంవత్సరాలు పర్షియన్ పాలకులు పార్ధియన్, సస్సనిద్ పాలకుల ఆధీనంలో ఉంది. 
అలాగే టర్కీకి చెందిన హెప్తలైట్, గొక్తుర్క్ ప్రజలు కూడా కొంతకాలం ఈ ప్రాంతానికి పాలకులు అయ్యారు.

చెంఘిజ్ ఖాన్ మరణం తరువాత 1227లో మంగోల్ సామ్రాజ్యం ఆయన నలుగురు కుమారులు, సభ్యులకు విభజించబడింది. విభజన తరువాత మంగోల్ చట్టాన్ని అనుసరించి పలు తరాలవరకు ఈ ప్రాంతంలో మంగోలు వంశస్థుల పాలన కొనసాగింది. ట్రాంసొక్సియానా పాలన చెంఘిజ్ ఖాన్ రెండవ కుమారుని వారసుడు ఛగతై ఖాన్ ఆధీనంలో ఉండేది. ఛగతై ఖాన్ పాలనలో ఈ ప్రాంతంలో సంపద పెరిగి, శాంతి నెలకొన్నది. అలాగే సమైక్య మంగోలు సామ్రాజ్యం శక్తివంతమైన సామ్రాజ్యంగా నిలిచింది. 

 తైమూర్ ఆక్రమిత నగరాలలో తీవ్రమైన హింస, మూకుమ్మడి హత్యలు చోటుచేసుకున్నాయి.

తైమూర్ తాను జయించిన విస్తారమైన భూభాగం నుండి పలు కళాకారుల, విద్యావేత్తలను రాజధాని సమరఖండ్‌లో సమీకరించడం ద్వారా ఈ ప్రాంతాన్ని చివరిగా వర్ధిల్లజేసాడు. వీరి మద్దతుతో తైమూర్ తన సామ్రాజ్యాన్ని సుసంపన్నమైన ఇస్లామిక్ సంస్కృతితో నింపాడు. తైమూర్, ఆయన వారసుల పాలనా కాలంలో సమరఖండ్, ఇతర ప్రాంతాలలో మతపరమైన, ఘనమైన నిర్మాణకళాఖండాల పని చేపట్టబడింది. 
అమీర్ తైమూర్ వైద్యపరిశోధనలు, భౌతికశాస్త్రం పరిశోధకులు, కళాకారులను పొరుగుదేశాలతో (భారతదేశంతో చేర్చి) పరస్పర మార్పిడి చేసుకునే విధానానికి శ్రీకారం చుట్టాడు. 
 తైమూర్ మనుమడు ఉలఘ్ బెగ్ ప్రపంచపు ఉత్తమ జ్యోతిష్కులలో ఒకడుగా గుర్తించబడ్డాడు. తైమురిదీలు స్థానికంగా పర్షియన్లు అయినప్పటికీ తైమూరిద్ కాలంలో ట్రాంసొక్సియానా ప్రాంతంలో ఛగతై భాష లిఖితరూపం చేయబడింది. ఛగయియద్ రచయిత  అలి షిర్ నవై  నగరంలో ప్రఖ్యాతి గడించాడు.

తౌమూర్ రాజ్యం తౌమూర్ మరణం తరువాత రెండుగా విభజించబడింది. తింరుదియన్ల అంతర్గతయుద్ధం ఉజ్బెకిస్థాన్ లోని ఆరల్ సీ ఉత్తర ప్రాంతంలో నివసిస్తున్న నొమాడిక్ గిరిజనులను ఆకర్షించింది. 1501 లో ఉజ్బెకిస్థాన్ సైన్యం ట్రాంసొక్సియానా మీద దండేత్తింది. . ఎమిరేట్ బుఖారా (ఖనాటే బుకారా) లో బానిసవ్యాపారం ప్రాముఖ్యత సంతరించుకుని స్థిరంగాపాతుకుంది. 1821 దాదాపు 25,000 నుండి 60,000 వరకు తజిక్ బానిసలు ఉన్నారని భావిస్తున్నారు. 
 రష్యన్లు ప్రవేశించక ముందు ప్రస్తుత ఉజ్బెకిస్థాన్ ఎమిరేట్ ఆఫ్ బుఖారా, ఖనాటే ఆఫ్ ఖివా మద్య విభజించబడింది.

 1813లో ఆరంభమైన గ్రేట్ గేం పీరియడ్ ఆంగ్లో-రష్యన్ కాంవెంషన్ (1907) వరకు కొనసాగింది.

ఉజ్బెకిస్థాన్ వైశాల్యం 447400 చ.కి.మి. వైశాల్యపరంగా ఉజ్బెకిస్థాన్ ప్రంపంచదేశాలలో 56వ స్థానంలోనూ , జనసంఖ్యాపరంగా 42వ స్థానంలోనూ ఉంది. 

ఉజ్బెకిస్థాన్ ఉత్తర అక్షాంశంలో 37°, 46° తూర్పురేఖాంశంలో 56°, 74° ఉంది. ఉజ్బెకిస్థాన్ తూర్పు పడమరలుగా 1425 కి.మీ, ఉత్తర దక్షిణాలుగా 930కి.మీ విస్తరించి ఉంది. దేశ ఉత్తర, వాయవ్య సరిహద్దులలో కజకస్తాన్, ఆరల్ సముద్రం, నైరుతీ సరిహద్దులో టుర్క్‌మెనిస్తాన్, ఆగ్నేయ సరిహద్దులో తజికిస్తాన్, ఈశాన్య సరిహద్దులో కిర్గిజిస్తాన్ ఉన్నాయి. మద్య ఆసియాలోని పెద్దదేశాలలో ఉజ్బెకిస్థాన్ ఒకటి. అలాగే నాలుగు సరిహద్దులలో మధ్య ఆసియా దేశాలు ఉన్న ఒకే దేశంగా గుర్తించబడుతుంది. ఉజ్బెకిస్థాన్ దక్షిణ సరిహద్దును 150 కి.మీ పొడవున ఆఫ్ఘనిస్థాన్తో పంచుకుంటుంది.

ఉజ్బెకిస్థాన్ శుస్కిత (డ్రై) భూబంధిత దేశం. అంతేకాక ప్రపంచంలో అన్నివైపులా భూబంధిత దేశాల మద్య ఉన్న రెండు దేశాలలో ఉజ్బెకిస్థాన్ ఒకటి. మరొక దేశం లీక్కిన్‌స్టైన్. ఉజ్బెకిస్థాన్‌లో బంధిత జలసముద్రాలు ఉన్నాయి. ఉజ్బెకిస్థాన్‌ నదులు సముద్రాన్ని చేరవు. ఉజ్బెకిస్థాన్‌ నదీముఖద్వారం సమీపంలో 10% వ్యవసాయభూములు ఉన్నాయి. మిగిలిన దేశం ఎడారి, పర్వతాలతో నిండి ఉంటుంది. ఉజ్బెకిస్థాన్‌ లోని అత్యున్నత శిఖరం ఖజ్రెత్ సుల్తాన్. ఇది సముద్రమట్టానికి 4643 మీ ఎత్తున సుఖందర్యా ప్రాంతంలోని గిస్సార్ పర్వతశ్రేణికి దక్షిణ ప్రాంతంలో తజికిస్తాన్ సరిహద్దులో దుషంబే వాయవ్యంలో ఉంది. ఉజ్బెకిస్థాన్ రిపబ్లిక్‌లో కాంటినెంటల్ వాతావరణం నెలకొని ఉంటుంది. వార్షికంగా వర్షపాతం 100- 200 మి.మీ ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటి గ్రేడ్ చేరుకుంటుంది. శీకాల ఉష్ణోగ్రత 23-9 డిగ్రీల సెంటిగ్రేట్ ఉంటుంది.

ఉజ్బెకిస్థాన్ వైవిధ్యమైన సహజత్వంతో నిండిన, సుసంపన్నమైన దేశం. బృహత్తర పత్తి ఉత్పత్తి కేంద్రం ముసుగులో దశాబ్ధాల తరబడి సోవియట్ యూనియన్ అనుసరిస్తున్న విధానాల ఫలితంగా దేశంలో విపత్కర పరిస్థితులు ఎదురైయ్యాయి. వ్యవసాయ క్షేత్రాలు దేశంలో అధికరించిన కాలుష్యానికి ప్రధాన కారణం అయ్యాయి. అలాగే దేశంలోని జలం, వాయువు అత్యంత కలుషితం అయ్యాయి. భూగోళంలోని అతిపెద్ద భూబంధిత సముద్రాలు నాల్గింటిలో ఆరల్ సముద్రం ఒకటి. భూమి ఉపయోగించడానికి వాయువులో ఆర్ధత అధికరించడానికి ఇది చాలా సహకరిస్తుంది. 1960 నుండి ఆరల్ సముద్రజలాలు దుర్వినియోగం చేస్తున్న కారణంగా సముద్రవైశాల్యం 50%, జలాలు మూడు భాగాలు క్షీణించాయి. విశ్వనీయమైన అధికారిక ఏజెంసీ లేక ఆర్గనైజేషన్ డేటా సేకరించబడ లేదు. ఇందులోనిజలాలు అధికంగా పత్తిపొలాలకు మళ్ళించబడ్డాయి. పత్తి పంట పెరగడానికి అధిక మొత్తంలో నీరు అవసరం.
సోవియట్ ప్రభుత్వం ఆనకట్ట కట్టాడానికి తగినంత నిధి మంజూరు చేయని కారణాంగా 1960 లో సోవియట్ శాస్త్రవేత్తలు, రాజకీయవాదులు ఆరల్ సముద్రజలాలను పత్తిపంటకు ఉపయోగించడానికి మార్గదర్శకం వహించారు.  ఆరల్ సముద్రతీరంలో ఉజ్బెకిస్థాన్ లోని కరకల్పక స్థాన్ ప్రాంతంలో అధిక శాతం ఉప్పు, కలుషిత మట్టి విస్తరుంచి ఉంది. దేశంలోని జలవనరులలో అత్యధికశాతం వ్యవసాయానికి ఉపకరించబడుతున్నాయి. వ్యవసాయానికి 84% జలాలు ఉపకరించడం కారణంగా సముద్రజలాలలో ఉప్పు శాతం అధికరిస్తుంది. పత్తిపంట పెరగడానికి క్రిసంహారకాలు, ఎరువులు పెద్ద మొత్తంలో ఉపయోగించడం మట్టి కాలుష్యానికి కారణం ఔతుంది. 
 ఉజ్బెకిస్థాన్‌లోని  యు.ఎన్.డి.పి క్లైమేట్ రిస్క్ మేనేజిమెంట్  దేశం పర్యావణాన్ని చదిద్దాలని అభిలషిస్తుంది.

ఉజ్బెకిస్థాన్ రిపబ్లిక్ రాజ్యాంగం ఉజ్బెకిస్థాన్ రిపబ్లిక్ డెమొక్రసీ  కామన్ హ్యూమన్ ప్రిన్సిపల్  ఆధారంగా నిర్మితమైనదని దృఢంగా చెప్తుంది. ఉజ్బెకిస్థాన్ తన పౌరునికి రక్షణ, విశ్వసనీయమైన మానవహక్కులు కలిగిస్తుంది. ఉజ్బెకిస్థాన్ అధిక మానవీయ సాంఘిక రూపకల్పనకు చట్టలలో మరిన్ని మార్పులు చేస్తూ ఉంది. 300 చట్టాలకంటే అధికంగా పౌరుల హక్కులు, ఆధారభూతమైన స్వతంత్రం సంరక్ష ణకొరకు రూపొందించబడ్డాయి. 
 2005 ఆగస్టు 2 అధ్యక్షుడు ఇస్లాం కరిమొవ్ ఉజ్బెకిస్థాన్‌లో 2008 జనవరి1 నుండి మరణశిక్షను రద్దుచేస్తూ సంతకం చేసాడు . అలాగే వారు  ఉజ్బెకిస్థాన్‌లో పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ఆందోళన వెలిబుచ్చారు.

నివేదికలను అనుసరించి పెద్ద ఎత్తున హింస, దౌర్జన్యం, అక్రమ నిర్బంధం, స్వతంత్రాన్ని నిరోధించే పలు చర్యలు సంభవించాయని తెలియజేస్తున్నాయి. మతం, ఉపన్యాసాలు, మాధ్యమాలు,సమావేశాలు, సభానిర్వహణ మొదలైన వాటి మీద నిర్ధంధాలు ఉన్నాయి. ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వం గ్రామీణ స్త్రీలకు బలవంతపు స్టెరిలైజేషన్ మంజూరు చేసిందని భావిస్తున్నారు. మతసంస్థల సభ్యులు, స్వతంత్ర పత్రికాసంపాదకులు, హ్యూమన్ రైట్స్ కార్యకర్తలు, రాజకీయ కార్యకర్తలకు వ్యతిరేకంగా దౌర్జన్యం చేయడం, నిరోధ చర్యలు 
తీసుకోవడం పతిపక్ష పార్టీ సభ్యుల మీద నిషేధం విధించడం మొదలైన మానవహక్కుల ఉల్లంఘన జరిగిందని నివేదికలు తెలియజేస్తున్నాయి. 2005 సివిల్ అంరెస్ట్ ఇన్ ఉజ్బెకిస్థాన్  సంఘటనలో 100 మంది ప్రజలు మరణించారు. ఉజ్బెకిస్థాన్ మానవహక్కుల చరిత్రలో ఇది ఒక గుర్తించతగిన సంఘటనగా భావించబడుతుంది.
 మానవహక్కుల ఉల్లంఘన విషయంలో ఆందోళన కనబరుస్తూ స్వతంత్రంగా పరిశోధన చేయడానికి యునైటెడ్ స్టేట్స్, ఉరేపియన్ యూనియన్, ది యునైటెడ్ నేషన్స్, ది ఒ.ఎస్.సి.ఇ చైర్నన్ - ఇన్- ఆఫీస్, ది ఒ.ఎస్.సి.ఇ ఆఫీస్ ఫర్ డెమొక్రటిక్ ఇంస్టిట్యూషంస్, హ్యూమన్ రైట్స్ అభ్యర్ధన చేసుకున్నాయి.

ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వం పౌరుల హాక్కులను నిరాకరించడం, చట్టవిరోధంగా మానవ హక్కుల ఉల్లంఘన చేయడం, ప్రతిస్పందన తెలియజేయడానికి స్వతంత్ర నిరోధం, సభానిర్వహణా స్వతంత్రనిరోధం మొదలైన ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడుతుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నది.

ఉజ్బెకిస్థాన్ 12 పాలనా విభాగాలుగా విభజించబడింది (విలోయత్లర్ ఏకవచనంలో విలోయత్), ఒక అటానిమస్ రిపబ్లిక్ (రెప్పబ్లిక), ఒక స్వతంత్ర నగరం (షహర్) ఉన్నాయి.

తాష్కెంట్ విలోయతి గణాంకాలలో తాష్కెంట్ నగరం గణాంకాలు చేర్చబడ్డాయి.

ప్రొవింసెస్ అదనంగా జిల్లాలు (తుమన్) లుగా విభజించబడ్డాయి.

ఉజ్బెకిస్థాన్ మద్య ఆసియాలో అత్యంత జనసాంధ్రత కలిగిన దేశంగా భావించబడుతుంది. దేశ జనాభా 3,10,25,500. 2008 గణాంకాలను అనుసరించి ఉజ్బెకిస్థాన్‌లో 14 వయసు లోబడినవారు 34.1% ఉన్నారు. 1996 అధికారిక ఆధారాలను అనుసరించి ఉజ్బెకియన్లు 80% ఉన్నారని భావిస్తున్నారు. రష్యన్లతో కలిసి ఇతర సంప్రదాయానికి చెందినవారు 5.5%, తజిక్ ప్రజలు5%, కరకల్ప్కాలు 3%, తాతార్లు 1.5% ఉన్నారు. తజిక్ ప్రజలసంఖ్య గురించిన అభిప్రాయభేదాలు ఉన్నాయి. తజిక్ సంఖ్య తగ్గించబడిందని వారు 20-30% ఉండవచ్చని పశ్చిమదేశీయ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. 
ఉజ్బెకీయులు మద్య ఆసియాకు చెందిన టర్కో- పర్షియన్ ప్రజలతో (సార్ట్) మిశ్రితం అయ్యారు. ప్రస్తుతం ఉజ్బెకీయులు తమ పూర్వీకం మగోలీయులు, ఇరానీయులు అని తెలుపుతున్నారు. 
 ఉజ్బెకిస్థాన్‌లో కొరియన్ సంప్రదాయానికి చెందిన ప్రజలు ఉండేవారు. వీరు 1937-38 లలో స్టాలిన్ చేత బలవంతంగా సోవియట్ యూనియన్ నుండి వెలుపలికి పంపబడ్డారు. ఉజ్బెకిస్థాన్‌లో తాష్కెంట్, సమర్ఖండ్ ప్రాంతంలో స్వల్పసంఖ్యలో అమెరికన్ ప్రజలు ఉన్నారు. దేశంలో 88% ముస్లిములు ఉండగా వీరిలో అత్యధికులు సున్నీ ముస్లిములు, 5% షియా ముస్లిములు ఉన్నారు, 9% ఈస్టర్న్ ఆర్థడాక్స్, 3% ఇతరమతాలకు చెందినవారు ఉన్నారు. ది యు.ఎస్ స్టేట్ డెవెలెప్మెంటు ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడం రిపోర్ట్ (2004) 0.2% బౌద్ధులు (కొరియన్ సంప్రదాయ ప్రజలు) ఉన్నారని రెలియజేస్తుంది. ఉజ్బెకిస్థాన్ లోని బుకారాలో నివసిస్తున్న యూదులు వేలాది సంవత్సరాలుగా నివసిస్తున్నారని భావిస్తున్నారు. 1989 గణాంకాలను అనుసరించి ఉజ్బెకిస్థాన్‌లో 94,900 మంది యూదులు నివసిస్తున్నారని భావిస్తున్నారు. 1989 గణాంకాలను అనుసరించి యూదులు 5% ఉండేవారని సోవియట్ యూనియన్ పతనం చెందిన తరువాత యూదులు యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, ఇజ్రేల్‌కు వెళ్ళారు. 2007 నాటికి ఉజ్బెకిస్థాన్‌లో 5000 మంది యూదులు మాత్రమే నివసిస్తున్నారని అంచనా.
 ఉజ్బెకిస్థాన్‌లో రష్యన్లు 5.5% ఉన్నారు. సోవియట్ కాలంలో తాష్కెంటులో రష్యన్లు, ఉజ్బెకీయులు సరిసమానంగా ఉండేవారు.

 సోవియట్ యూనియన్ పతనం తరువాత గణనీయమైన రష్యన్లు ఆర్థికప్రయోజనాల కొరకు ఇక్కడ నుండి తరలి వెళ్ళారు. 

. మాస్కెటియన్ తుర్కులు 1989 ఫర్గన హిసాత్మక చర్యల తరువాత దేశం వదిలి వెళ్ళారు. ఉజ్బెకిస్థాన్ లోని 10% శ్రామికులు విదేశాలలో (అధికంగా రష్యా, కజక్ స్థాన్) లో పనిచేస్తున్నారు. 

 ఈ సాధన సోవియట్ యూనియన్ విద్యావిధానం కారణంగా సంభవించింది. 

 54% ప్రత్యేకత ప్రతిపాదించబడని ముస్లిములు, 18% సున్నీ ముస్లిములు, 1% షియా ముస్లిములు ఉన్నారు. 
 ఉజ్బెకిస్థాన్‌లో సోవియట్ శక్తి ముగింపుకు వచ్చిన తరువాత హేతువాదం స్థానంలో మతావలంబన చోటుచేసుకుంది.

యూదులు ఇక్కడ స్థిరపడ్డారు. సిల్క్ రోడ్డు పరిసరాలలో నివసిస్తున్న యూదుల మీద ఇతర సంప్రదాయాలు దృష్టి కేంద్రీకరించాయి. యూదులు ఇక్కడకు వచ్చిన తరువాత 1,500 పూర్వం పర్షియన్ల వేధింపుకు గురైయ్యారు.

యూదులు పలు శతాబ్దాలుగా సమయాలలో పాలకుల వలన సంభవించిన కష్టనష్టాలను సహిస్తూ వర్ధిల్లారు. 14వ శతాబ్దంలో తమర్లనే పాలనాకాలంలో సమర్ఖండ్ పునర్నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ఆ కారణంగా సమఖండ్ యూదుల ప్రధాన కేంద్రం అయింది. తమర్లనే మరణించిన తరువాత యూదులు ముస్లిముల తీవ్రమైన శతృత్వం, కఠిన నియమాలు,యూదులు ఊరికి వెలుపల యూదుల క్వార్టర్లలో మాత్రమే నివసించాలన్న నిబంధనలు వంటి కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నారు. యూదుల ద్వారాలు, దుకాణాలు ముస్లిముల కంటే దిగువన ఉండాలన్న నిబంధన ఉండేది. యూదులు నల్లటి టోపీలు, కార్డ్ బెల్టు ధరించాలన్న నియమంతో యూదుల వాదన సభలలో చెల్లుబాటు కాకూడదన్న నియమం ఉండేది. 

ఉజ్బెకిస్థాన్‌లో ఉజ్బెకీ భాష మాత్రమే అధికారభాషగా ఉంది. 1992 దీనీని వ్రాయడానికి అధికారికంగా లాటిన్ లిపిని వాడుతున్నారు. తజిక్ సంప్రదాయ ప్రజలు అధికంగా నివసిస్తున్న బుఖారా, సమర్ఖండ్ నగరాలలో తజిక్ భాష అధికంగా వాడుకలో ఉంది. తజిక్ భాష కాసన్, చస్ట్,ఫర్గన నదీతీరంలో ఉన్న రిష్టన్ లోయ, అహంగరన్, మిడిల్ సిర్ దర్యాలోని బఘిస్తాన్, షహ్రిషబ్జ్, కితాబ్, కఫిరింగన్, చగనియన్ నదీ లోయ ప్రాంతాలలో అధికంగా వాడుకలో ఉంది. ఉజ్బెకిస్థాన్ జనసంఖ్యలో 10-15% ప్రజలలో తజికిభాష వాడుకలో ఉంది. టర్కిక్ భాషలలో ఒకటైన కరకల్పక్ భాష (కజక్ భాషకు సమీపంలో ఉంటుంది) కరకల్పక్స్థాన్ రిపబ్లిక్‌లో వాడుకభాషగా, అధికారిక భాషగా ఉంది.

రష్యన్ భాష సంప్రదాయక ప్రజల వాడుక భాషగా ఉంది. ప్రత్యేకంగా నగరాలలో సాంకేతిక, సైంటిఫిక్, ప్రభుత్వ, వ్యాపార అవసరాలకు రష్యన్ భాష వాడుకలో ఉంది. రష్యన్ భాష 14% ప్రజలకు వాడుక భాషగా ఉంది. రష్యన్ భాష అత్యధికులకు ద్వితీయభాషగా వాడుకలో ఉంది. గ్రామీణప్రాంతాలలో రష్యన్ భాష మితంగానే వాడుకలో ఉంది. ప్రస్తుతం నగరప్రాంత విద్యార్థులలో కూడా రష్యన్ భాషానైపుణ్యం తక్కువగా ఉంది. 2003 గణాంకాలను అనుసరించి దాదాపు సగంకంటే అధికంగా రష్యాభాషను మాట్లాడే, అర్ధం చేసుకునే శక్తి కలిగి ఉన్నారు. ఉజ్బెకిస్థాన్, రష్యాల మద్య ఉన్న స్నేహపూరిత రాజకీయ వాతావరణం కారణంగా అధికారిగా రష్యాన్ భాష పట్ల నిర్లక్ష్యం వహించడం వదిలి వేయబడింది. 

బంగారు నిలువకలిగిన దేశాలలో ఉజ్బెకిస్థాన్ ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. ఉజ్బెకిస్థాన్ నుండి వార్షికంగా 80 టన్నుల బంగారాన్ని వెలికితీస్థుంది. ఉజ్బెకిస్థాన్ రాగి నిల్వలు ప్రపంచంలో 10వ స్థానంలో, యురేనియం నిల్వలు ప్రపంచంలో 12వ స్థానంలోనూ ఉన్నాయి. ఉజ్బెకిస్థాన్ యురేనియం ఉత్పత్తి అంతర్జాతీయంగా 7వ స్థానంలో ఉంది. 
 
ది ఉజ్బెకి నేషనల్ గ్యాస్ కంపెనీ, ఉజ్బెక్నెఫ్త్‌గ్యాస్, గ్యాస్ 60 నుండి 70 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తితో అంతర్జాతీయంగా 11వ స్థానంలో ఉన్నాయి. 
. దేశంలో గుర్తించబడని ఆయిల్, సహజవాయు నిల్వలు ఉన్నాయి: ఉజ్బెకిస్థాన్‌లో 194 హైడ్రోకార్బన్ ఉన్నాయి. వీటిలో 98 కండెంసటే, సహజవాయు నిల్వలు, 96 కండెంసతే నిలువలు ఉన్నాయి. 

ఉజ్బెకిస్థాన్ పెద్ద సంస్థలలో ఉజ్బెకిస్థాన్ ఎనర్జీ సెక్టర్‌కు చెందిన చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్ (సి.ఎన్.పి.సి), పెట్రోనస్, ది కొరియా నేషనల్ ఆయిల్ కార్పొరేషన్, గజ్‌ప్రొం, లుకొయిల్, ఉజ్బెకిస్థానెఫ్తెగ్యాస్ ప్రధానమైనవి.  కామంవెల్త్ ఆఫ్ ఇండిపెండెంస్ స్టేట్స్  (సి.ఐ.ఎస్ ఎకనమీ)లతో ఉజ్బెకిస్థాన్ ఎకనమీ మొదటి సంవత్సరంలో పతనం అయింది. ఉజ్బెకిస్థాన్ విధానంలో మార్పులు, సంస్కరణలు మొదలైన ఏకీకృత ప్రయత్నం కారణంగా 1995 తరువాత ఉజ్బెకిస్థాన్ ఎకనమీ కోలుకున్నది.  1998, 2003 మద్యకాలంలో వార్షికంగా 4% అభివృద్ధి తరువాత 7-8% అభివృద్ధితో ఉజ్బెకిస్థాన్ ఆర్థికరంగం గణనీయంగా అభివృద్ధి చెందింది. ఐ.ఎం.ఎఫ్ నివేదిక అనుసరించి  2008 ఉజ్బెకిస్థాన్ జి.డి.పి దాదాపు రెండింతలు అయింది. 2003 నుండి వార్షిక ద్రవ్యోల్బణం 10%ని కంటే తక్కువగా ఉంది. 
ఉజ్బెకిస్థాన్ వార్షిక జి.ఎన్.ఐ తలసరి (1,900 అమెరికన్ డాలర్లు. కొనుగోలు శక్తి (2013) 3,800 అమెరికన్ డాలర్లు). ఉత్పత్తి కమ్మోడిటీల మీద కేంద్రీకృతం చేయబడింది. ఉజ్బెకిస్థాన్ పత్తి ఉత్పత్తిలో ప్రపంచంలో 7వ స్థానంలో ఎగుమతిలో ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. అలాగే బంగారు ఉత్పత్తిలో ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది. ఉజ్బెకిస్థాన్ గణనీయంగా సహజవాయు ఉత్పత్తి, బొగ్గు, రాగి, ఆయిల్, వెండి, యురేనియం ఉత్పత్తి చేస్తుంది.

ఉజ్బెకిస్థాన్ వ్యవసాయం 26% శ్రామికులకు ఉపాధి కల్పిస్తూ 18% జి.డి.పి అభివృద్ధికి సహకరిస్తుంది. వ్యవసాయ భూములు 4.4 మిలియన్లు (10%) ఉన్నాయి. 
 పత్తి పంట కోత సమయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇప్పటికీ వేతనరహిత ఉపాధ్యాయులుగా వ్యవసాయభూములలో పనిచేయడానికి తరలించబడుతుంటారు. ఉజ్బెకిస్థాన్ పత్తిని దక్షిణకొరియాలో బ్యాంక్ పత్రాలను తయారుచేయడానికి ఉపయోగిస్తుంటారు. 
ఉజ్బెకిస్థాన్‌లో బాలకార్మికులు టెస్కో మొదలైన పలు సంస్థలలో పనికి నియమించబడుతున్నారు. చి.ఎ. మార్క్స్  స్పెంసర్, గాప్, హెచ్ఎం. సంస్థలు ఉజ్బెకిస్థాన్ పత్తిని బహిష్కరించాయి. 

స్వతంత్రం వచ్చిన తరువాత ఆర్థికసవాళ్ళను ఎదుర్కొనడానికి ప్రభుత్వం సంస్కరణలు చేపట్టింది. దిగుమతులు తగ్గించడం, సరిపడిన విద్యుదుత్పత్తి స్వయంగా సాధించడం సంస్కరణలలో చోటుచేసుకున్నాయి. 1994 నుండి విజయవంతమైన  ఉజ్బెకిస్థాన్ ఎకనమిక్ మోడెల్  గురించి ప్రభుత్వ మాధ్యమాలు ప్రకటిస్తున్నాయి. 
 ఆర్థిక స్థబ్ధత, దిగ్భ్రాంతి, పౌపరిజం (భిక్షమెత్తడం) కంటే సంకరణలు చక్కని మార్గమని కూడా ప్రకటించింది. క్రమమైన ఆర్థిక సంస్కరణ వ్యూహం స్థూల ఆర్థిక సంస్కరణలు, నిర్మాణాత్మకమైన సంస్కరణలను పక్కకు నెట్టింది. ప్రభుత్వం మీద సరికొత్తగా బ్యూరోక్రసీ ప్రభావం అధికరించింది. దేశంలో లంచగొండితనం వేగవంతంగా అధికరించింది. 2005 ఉజ్బెకిస్థాన్ లంచగొండితనం అంతర్జాతీయంగా 159 దేశాలలో 137 వ స్థానంలో ఉంది. 2007 ఉజ్బెకిస్థాన్ లంచగొండితనం అంతర్జాతీయంగా 179 దేశాలలో 175 వ స్థానంలో ఉంది. దేశంలోని ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ పత్తి, బంగారం, మొక్కజొన్న, గ్యాస్ ఉతపత్తి ద్వారా ఆదాయాన్ని అధికరించ్చని సలహా ఇచ్చింది. 
సమీపకాలంలో ఉన్నత స్థాయి లంచం సంబంధిత మోసాలు ప్రభుత్వం,స్టెల్లా సొనెరియా మొదలైన అంతర్జాతీయ సంస్థల ఒప్పందాల మీద ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ సంస్థలు ఉజ్బెకిస్థాన్ లోని లంచగొండితనం మోసాల కారణంగా వ్యాపారం బాధించపడుతుందని భావిస్తున్నాయి. ఎకనమిస్ట్ ఇంటెలిజెంస్ యూనిట్ నివేదిక అనుసరించి ప్రభుత్వం ప్రైవేట్ రంగం అభివృద్ధికి వ్యతిరేకంగా ఉందని తెలియజేస్తుంది. ఉజ్బెకిస్థాన్ విదేశీ పెట్టుబడులను తిప్పి కొడుతున్నారు. సి.ఐ.ఎస్ లో తలసరి లోయస్టుగా ఉంది. ఉజ్బెకిస్థాన్‌లో ప్రవేశిస్తున్న సంస్థలు ఉజ్బెకిస్థాన్ మార్కెట్‌లో కరెంసీ మార్పిడి చేయడం శ్రమతోకూడుకున్న పని అని తెలియజేస్తున్నాయి. 

ఉజ్బెకిస్థాన్ స్వతంత్రం పొందిన తరువాత 1992-1994 అనియత్రిత ద్రవ్యోల్బణం (1000%)ఎదుర్కొన్నది. ఐ.ఎమెఫ్ పర్యవేక్షణలో క్రమపరిచే విధానాలు చేపట్టింది. 1997 నాటికి ద్రవ్యోల్బణం 50% తీసుకువచ్చింది. 2002 నాటికి 22% వచ్చింది. 2003 వార్షిక ద్రవ్యోల్బణం 10%, నిర్భంధమైన ఆర్థిక విధానాల ఫలితంగా 2004లో ద్రవ్యోల్భణం 3.8% నికి చేరుకుంది. 
 2006 నాటికి 6.9%, 2007 నాటికి 7,6% ఉంది. 

ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వం విదేశీ దిగుమతులను పలు మార్గాలలో కట్టిదిట్టం చేసింది. అధికమైన దిగుమతి సుంకం అందులో ఒకటి. ప్రాంతీయ ఉత్పత్తులను సంరక్షించడానికి ఎక్సిజ్ డ్యూటీ వివక్షాపూతితంగా అత్యధికంగా ఉంటుంది. అధికారిక అనధికార పన్నులు మిశ్రితమై ఉంటాయి. ఈ కారణంగా వస్తువుల ధరలు 100 నుండి 150% అధికరిస్తుంటాయి. అందువలన దిగుమతి వస్తువులు ప్రజలకు అందుబాటులోకి రావడం శ్రమతో కూడుకున్నది. దిగుమతి ప్రతిబంధన అధికారింగా ప్రకటించబతూ ఉంది. పలు సి.ఐ.ఎస్ సంస్థలు అధికారిక ఉజ్బెకిస్థాన్ దిగుమతి సుంకాలను తప్పించుకుంటున్నది. అత్యావసర వస్తువుల దిగుమతికి ప్రభుత్వం పన్నురాయితీ ప్రకటిస్తుంది.

 అందుకు ప్రపంచ మార్కెట్తులో అధికరించిన బగారం, పత్తి ధరలు, అభివృద్ధి చేయబడిన సహజవాయువు, ఎగుమతులను అధికరించడం, విదేశాలలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య అధికరించడం సహకరిస్తున్నాయి. ప్రస్తుతం దేశజి.డి.పి మిగులు 9%-11% (2003-2005) ఉంది. విదేశీ మారకం, బంగారం నిలువలు రెండింతలు (3 బిలియన్ అమెరికన్ డాలర్లు) అయింది.  2010 విదేశీమారకం 10 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. 
 హెచ్.ఎస్.బి.సి. బ్యాంక్ సర్వే అనుసరించి ఉజ్బెకిస్థాన్ ఆర్థికరగం తరువాతి దశాబ్ధాలలో ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికరంగాలలో ఒకటిగా (మొదటి 26 ) గుర్తించబడుతుంది.

.

ఉజ్బెకిస్థాన్ పలు సంప్రదాయ, సాంస్కృతిక ప్రజల మిశ్రితం. వీరిలో ఉజ్బెకీయులు అధికంగా ఉన్నారు. 1995 71% ఉజ్బెకిస్థాన్ ప్రజలు ఉజ్బెకీయులే. అల్పసంఖ్యాకులలో ప్రధానులు రష్యన్లు (8%). తజికీలు (5-30%). కజఖ్ ప్రజలు (4%), తాతర్ ప్రజలు (2.5%), కరకల్పకులు (2%) ఉన్నారు. ఉజ్బెకిస్థాన్ లోని ఉజ్బెకేతర ప్రజలు క్రమంగా క్షీణిస్తున్నారు. రష్యా, ఇతర అల్పసంఖ్యాక ప్రజలు ఉజ్బెకిస్థాన్ వదిలి సోవియట్ యూనియన్‌లోని ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు.

ఉజ్బెకిస్థాన్ 1991లో స్వతంత్రదేశం అయింది. దేశంలో ముస్లిం ఛాందసవాదం విస్తరిస్తుందని కొందరు ఆదోళన చెందుతున్నారు. దేశం మతస్వతంత్రం ఇవ్వడానికి వ్యతిరేకంగా ఉందని 
భావిస్తున్నారు. 1994లో ఉజ్బెకిస్థాన్ ప్రజలలో సగం మంది ముస్లిములున్నారు. 

మద్య ఆసియన్ సంప్రదాయ సంగీతం షష్మక్వాం. ఇది 16వ శతాబ్దంలో బుఖారా ఆప్రాంతానికి రాజధానిగా ఉన్న సమయంలో నూతనంగా రూపొందించబడింది. షష్మక్వాం అజబైజని, ముగాం, ఉయుఘూర్ ముక్వాం సంగీతాలకు సామీప్యంలో ఉంటుంది. ఇందులో ఆరు ముక్వాములు (శాఖలు) ఉన్నందున ఈ సంగీతానికి ఈ పేరు వచ్చింది. ఇందులోని శాఖలు ఆరు పర్షియన్ సంప్రదాయ రీతులు శాఖలుగా ఉంటాయి. కచేరీలో మద్య మద్యలో సూఫీ కవిత్వం వచనరూపంలో చోటు చేసుకోవడం దీని ప్రత్యేకత.

వివాహాది శుభకార్యాలలో కూడిన సమయంలో ఈ కచేరీలు శ్రోతలను ఆనందింపజేయడం వలన ఉజ్బెకిస్థాన్‌లో ఫోల్క్- పాప్ శైలి కూడా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఉజ్బెకిస్థాన్ సంప్రదాయ సంగీతం పాప్ సంగీతానికీ మద్య ఎంతో వ్యత్యాసం కనిస్తుంది. పురుషులు సోలో సంగీతం వినడంలో ఆసక్తి కనబరుస్తారు. పురుషుల మద్య జరిగే ఉదయం, సాయంకాల సమయాలలో సంగీతం కచేరీలు చోటుచేసుకుంటుంది. సంప్రదాయ సంగీతంలో షాష్ మక్వం ప్రధానమైనది. దీనిని సంపన్నకుటుంబాల మద్దతు లభిస్తూ ఉంది. కొన్ని మార్లు రెండు భాషల మిశ్తితంగా పాటలు రూపొందించబడుతుంటాయి. కొన్ని మార్లు సంగీతంలో పద్యసాహిత్యం కూడా సంగీతంలో చోటుచేసుకుంటుంది. 1950లో ఫోల్క్ సంగీతానికి తక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఇది రేడియో స్టేషన్లలో ప్రసారం చేయడం నిలిపివేయబడింది. దీనికి ఫ్యూడల్ సంగీతం అని పేరు మార్చి దీని మీద నిషేధం విధించబడింది. జానపద సాహిత్యం వారి స్వంతబాణిలో ప్రచారం చేయబడుతూనే ఉంది. పలువురు ఇది స్వతంత్రమైన అనుభూతిని అందిస్తుందని అభిప్రాయపడుతుంటారు. 

ఉజ్బెకిస్థాన్ అక్షరాస్యతా శాతం 99.3%. అయినప్పటికీ ప్రస్తుతం 15 సంవత్సరాలకు లోబడిన వారిలో 76% మాత్రమే పాఠశాలలో ప్రవేశించారు. 3-6 సంవత్సరాల బాలబాలికలు ప్రి స్కూల్‌లో 20% మాత్రమే హాజరు ఔతున్నారు. ఇది ఇంకా భవిష్యత్తులో క్షీణిస్తుందని భావిస్తున్నారు. విద్యార్థులు సోమవారం నుండి శనివారం వరకు పాఠశాలకు హాజర్ ఔతుంటారు. 9వ సంవత్సర విద్యాసంవత్సరంతో మాధ్యమిక విద్య ముగుస్తుంది. మాద్యమిక విద్య తరువాత వాణిజ్య, సాంకేతిక విద్యను అభ్యసిస్తారు. ఉజ్బెకిస్థాన్‌లో రెండు అంతర్జాతీయ పాఠశాలలు ఉన్నాయి. రెండూ తాష్కెంటులో ఉన్నాయి. అవి తాధ్కెంటు ఇంటర్నేషనల్ స్కూల్ కె- 12. ఇంటర్నేషనల్ కరికులం స్కూల్.

ఉజ్బెకిస్థాన్ విద్యావిధానం తీవ్రమైన లోటు బడ్జెట్ సమస్యను ఎదుర్కొంటుమ్న్నది.విద్యా చట్టవిధానంలో 1992 నుండి సంస్కరణలు ప్రారంభం అయ్యాయి. అయినప్పటికీ భౌతిక విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయి. కరికులం రివిషన్ కూడా బలహీనంగా ఉంది. ఉపాద్యాయులకు ఇవ్వబడుతున్న తక్కువ స్థాయి జీతాలు ఇందుకు ప్రధాన కారణగా ఉన్నాయి. భవననిర్మాణం వంటి మౌలిక సదుపాయాలకు తగినంత వ్యయం చేయకపోవడం విద్యానాణ్యత లోపించడానికి మరొక కారణం. విద్యావిధానంలో లంచగొండితనం సంపన్నులు 
ఉపాధ్యాయులను, పాఠశాల అధికారులను ప్రలోభపెట్టి పాఠశాలలకు, పరీక్షలకు హాజరు కాకుండా హయ్యర్ గ్రేడు సాధించడానికి సహకరిస్తుంది. 

ఉజ్బెకిస్థాన్ విశ్వవిద్యాలయాలు వార్షికంగా 6,00,000 మంది పట్టభద్రులను తయారు చేస్తున్నాయి. తాష్కెంటు వెస్ట్ మినిస్టర్ యూనివర్శిటీ, ఇషా యూనివర్శిటీ తాధ్కెంటు ఆంగ్లమాధ్యమంలో విద్యాధ్యయనం చేయడానికి సహకరిస్తున్నాయి.

ఉజ్బెకి ఆహారసంప్రదాయం మీద ప్రాంతీయ వ్యవసాయప్రభావం అధికంగా ఉంది. ఉజ్బెకిస్థాన్‌లో ధాన్యం అధికంగా పండించబడుతుంది. అందువలన రొట్టెలు, నూడిల్స్ ఉజ్బెకీయుల 
ఆహారంలో అధికంగా చోటుచేసుకుంటున్నాయి. ఉజ్బెకీయుల ఆహారంలో నూడిల్స్ ఆధిక్యత వహిస్తుంది. దేశంలో గొర్రెలు విస్తారంగా ఉన్నందున ఆహారంలో మటన్ ప్రధాన మాంసాహారంగా ఉంది.

ఉజ్బెకిస్థాన్ చిహ్నంగా భావించబడుతున్న ఆహారం పులావ్. బియ్యం, మాంసం ముక్కలు, తురిమిన కేరెట్లు, ఎర్రగడ్డలు కలిపి తయారు చేయబడుతుంది. వివాహనిశ్చయం వంటి సందర్భాలలో అతిధులకు ఒషీ నహార్, నహార్ లేక మార్నింగ్ పులావ్ ప్రతి ఉదయం ఉదయపు అల్పాహారంగా (ఉదయం 6-8 గంటల మధ్య ) వడ్డించబడుతుంది. 
ఇతర ముఖ్యమైన ఆహారాలలో కొవ్వుతో చేర్చిన పెద్ద మాంసపు ముక్కలను (ప్రధానంగా మటన్), తాజా కూరగాయలు చేర్చి తయారుచేయబడే షుప్రా (షుర్వ్ లేక షొర్వ) అనే సూప్ ప్రధానమైనది. వీటిలో నర్యన్ సూప్, లాఘ్మన్ సూప్ ఉన్నాయి. నూడిల్స్ ఆధారిత వంటకాలు సూప్ లాగా లేక ప్రధాన ఆహారంగా కూడా అందించబడుతుంది. మంటి (డంప్లింగ్), చూచ్వర, సమోసా, స్టఫ్డ్ పొకెట్స్ చిరుతిండిగ లేక ప్రధాన ఆహారంగా తింటారు. కూరగాయలు, మాంసం కలిపి చేయబడిన డిమ్లమ, పలు కబాబులు సాధారణంగా ప్రధాన ఆహారంగా అందించబడుతుంది.

గ్రీన్ టీ జాతీయ వేడి పానీయం రోజంతా సేవిస్తుంటారు. టీ హౌసెస్ (చాయ్ ఖానా) సాంస్కృతిక ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. తాధ్కెంటులో బ్లాక్ టీకి ప్రాధాన్యత ఇస్తారు. అయినా గ్రీన్ టీ, బ్లాక్ టీలను పాలు, పంచదార లేకుండా సేవిస్తుంటారు. టీ సాధారణంగా ప్రధాన ఆహారంతో సేవించినా అతిథులకు మర్యాదాపూర్వకంగా గ్రీన్ టీ కానీ బ్లాక్ టీ కానీ అందించడం అలవాటు. 
చల్లని యోగర్ట్ పానీయం అయ్రన్ వేసవి పానీయంగా సేవించబడుతుంది. అయినప్పటికీ ఇది టీ, కాఫీలకు ప్రత్యామ్నాయం కాదు.

మద్యపానం దేశంలో పశ్చిమదేశాలకంటే తక్కువగానే వ్యాపించింది. ముస్లిందేశాలలో ద్రాక్షారసం ప్రాముఖ్యత సంతరించుకుని ఉంది. లౌకిక దేశమైన ఉజ్బెకిస్థాన్‌లో 14 వైనరీలు ఉన్నాయి. వీటిలో 1927లో సమర్ఖండ్‌లో స్థాపించబడిన కువ్రెంకో వైనరీ ప్రబలమైనది. సమర్ఖండ్‌ వైనరీ నుండి ప్రాంతీయ ద్రాక్షపండ్ల నుండి డిసర్ట్ వైన్ తయారు చేయబడుతుంది. 
ఉజ్బెకిస్థాన్‌లో గుల్యకండోజ్, షిరిన్, అలీటికో, కబర్నెట్ లికర్నొ (లిబర్నొ సౌవిగ్నన్: రష్యన్) డిసర్ట్ వైనులు తయారుచేయబడుతున్నాయి. ఉజ్బెకిస్థాన్ వైన్‌లు అంతర్జాతీయ అవార్డులను గెలిచాయి. వీటిని రష్యా, ఇతరదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

ఉజ్బెకిస్థాన్ గత రేసింగ్ సైకిలిస్ట్  డ్జమొలిడైన్ అబ్దౌజపరోవ్ స్వస్థలం. అబ్దౌజపరోవ్ టౌర్ డీ ఫ్రాంస్  గ్రీన్ జర్సీ పాయింట్ పోటీ లో మూడుమార్లు విజయం సాధించాడు. 
 
అబ్దౌజపరోవ్ ప్రమాదకరమైన విన్యాసాలు ప్రదర్శించడంలో సిద్ధహస్థుడు కనుక ఆయనకు తాష్కెంటు టెర్రర్  అనే మారుపేరు ఉంది.

ఆర్తూర్ టేమజోవ్  2000 వేసవి ఒలింపిక్ క్రీడా పోటీ  లలో మల్లయుద్ధం (రెస్ట్లింగ్) విజయం సాధించాడు. అలాగే 2004 వేసవి ఒలింపిక్ క్రీడ  , 2008 వేసవి ఒలింపిక్ క్రీడ , 2012 వేసవి ఒలింపిక్ క్రీడలలో పురుషుల 120 కి.గ్రా పోటీలో బంగారు పతకాలు సాధించాడు.

ప్రొఫెషనల్ బాక్సర్ రుస్లన్ చగెవ్ ఉజ్బెకిస్థాన్ డబల్యూ.బి.ఎ పోటీలలో పాల్గొన్నాడు. 2007 డబల్యూ.బి.ఎ  చాంపియన్ పోటీలో నికొలవి వాల్యూవ్‌ను ఓడించి రుస్లన్ చగెవ్ విజయం సాధించాడు. రుస్లన్ చగెవ్ రెండుమార్లు చాంపియన్ షిప్ సాధించిన తరువాత 2009 లో వ్లాదిమీర్ కిలిత్‌స్చొకొ చేతిలో అపజయం పొందాడు.

ప్రపంచ చాంపియన్ మైకేల్ కొల్గ్నొవ్ స్ప్రింట్ కనొయర్ కె.1 500 మీ ఒలింపిక్ పోటీలో కాంశ్య పతకం సాధించాడు. జిమ్నాసిస్ట్ అలెగ్జాండర్ షతిలోవ్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ కాంశ్య పతకం సాధించాడు.  , జిమ్నాసిస్ట్ ఒక్సన చౌసొవితిన  దేశం కోసం మొత్తంగా 70 పతకాలు సాధించాడు.

ఉజ్బెకిస్థాన్ అంతర్జాతీయ కురష్ అసోసియేషన్ స్వస్థలం. ఉజ్బెక్ యుద్ధకళను ఆధునికీకరణ , అంతర్జాతీయీకరణ చేసి రూపొందించిన యుద్ధకళ కురష్.

ఉజ్బెకిస్థాన్‌లో  అసోసియేషన్ ఫుట్ బాల్   అత్యంత ప్రాబల్యత సంతరిం ఉకుంది. ఉజ్బెకిస్థాన్ ప్రీమియర్ ఫుట్ బాల్ లీగ్ (ఉజ్బెక్ లీగ్) తరఫున  2015 నుండి 16 టీంలు క్రీడలలో పాల్గొంటున్నాయి. ప్రస్తుత చాంపియన్లు (2014) ఎఫ్.సి. పఖ్తకొర్. ఎఫ్.సి. పఖ్తకొర్ 10 ఉజ్బెకిస్థాన్ టైటిల్స్ సాధించి ఉజ్బెకిస్థాన్ ఫుట్ బాల్ బృందంలో ప్రధమ స్థానంలో ఉంది.

ఉజ్బెకిస్థాన్‌లో చెస్ క్రీడ కూడా ప్రజాదరణ కలిగి ఉంది. చెస్ క్రీడాకారుడు రుస్టం కసింద్ఝనొవ్ 2004లో ఎఫ్.ఐ.డి.ఇ వరల్డ్ చెస్ చాంపియన్ షిప్ సాధించాడు.

ఉజ్బెకిస్థాన్ అదనంగా జూడో, టీం హ్యాండ్ బాల్, బేస్ బాల్, టీక్వండో, బాస్కెట్ బాల్, ఫుత్సల్ క్రీడలను ఆదరిస్తుంది.




#Article 188: మంగళగిరి (1222 words)


మంగళగిరి గుంటూరు జిల్లాలోని పట్టణం. పిన్ కోడ్: 522503. గుంటూరు - విజయవాడ జాతీయ రహదారి పై గుంటూరుకు 20 కి.మీ దూరంలో ఉన్న ఈ చారిత్రక పట్టణములో ప్రసిద్ధి చెందిన, పురాతనమైన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఉంది. మంగళగిరి అనగానే పానకాల స్వామి స్ఫురణకు వస్తాడు. మంగళగిరి పట్టణం ఒక పురపాలక సంఘం, రాష్ట్ర శాసనసభకు ఒక శాసనసభ
నియోజకవర్గం.

సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
మంగళగిరి మండలం లోని కురగల్లు దాని పరిధిలోని హామ్లెట్స్, కృష్ణాయపాలెం. నవులూరు(గ్రామీణ) దాని పరిధిలోని హామ్లెట్స్, నిడమర్రు, యర్రబాలెం, బేతపూడి గ్రామాలు ఉన్నాయి.

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

మంగళగిరి క్రీ.పూ.225 నాటికే ఉనికిలో ఉన్నట్లు తెలుస్తోంది. ధాన్యకటకం రాజధానిగా క్రీ.పూ.225 నుండి క్రీ.శ.225 వరకు పాలించిన ఆంధ్ర శాతవాహనుల రాజ్యంలో మంగళగిరి ఒక భాగం. క్రీ.శ.225 నుండి క్రీ.శ.300 వరకు ఇక్ష్వాకులు పరిపాలించారు. ఆ తరువాత మంగళగిరి పల్లవుల ఏలుబడిలోకి వచ్చింది. పిమ్మట కంతేరు రాజధానిగా పాలించిన ఆనందగోత్రిజులు|ఆనందగోత్రిజుల అధీనంలోకి వచ్చింది. క్రీ.శ.420 నుండి క్రీ.శ.620 వరకు విష్ణు కుండినులు మంగళగిరిని పరిపాలించారు. రెండవ మాధవ వర్మ విజయవాడ రాజధానిగా చేసుకొని మంగళగిరిని పరిపాలించాడు. క్రీ.శ.630 నుండి చాళుక్యుల ఏలుబడి సాగింది.

ఇక్కడ ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వాస్తవంగా రెండు దేవాలయాల కింద లెక్క. కొండ కింద ఉన్న దేవుడి పేరు లక్ష్మీనరసింహ స్వామి. కొండ పైన ఉన్న దేవుడిని పానకాల స్వామి అని అంటారు. కొండ పైని దేవాలయంలో విగ్రహమేమీ ఉండదు; కేవలం తెరుచుకుని ఉన్న నోరు ఆకారంలో ఒక రంధ్రం ఉంటుంది. ఆ తెరచుకొని ఉన్న రంధ్రమే పానకాల స్వామిగా ప్రజల నమ్మకం.మంగళగిరి పానకాలస్వామికి ఒక ప్రత్యేకత ఉంది. పానకాలస్వామికి పానకం (బెల్లం, పంచదార, చెరకు) అభిషేకం చేస్తే, అభిషేకం చేసిన పానకంలో సగం పానకాన్ని స్వామి త్రాగి, మిగిలిన సగాన్ని మనకు ప్రసాదంగా వదిలిపెడతాడుట. ఎంత పానకం అభిషేకించినా, అందులో సగమే త్రాగి, మిగిలిన సగాన్ని భక్తులకు వదలడం ఇక్కడ విశేషం. అందుకనే స్వామిని పానకాలస్వామి అని పిలుస్తారు.

మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి గాలిగోపురం రాష్ట్రంలో అత్యంత ఎత్తయినది.రెండు శతాబ్దాలను పూర్తిచేసుకుంది.మంగళగిరి గాలిగోపురాన్ని తొలగించి దానిస్థానే మళ్లీ అదేరీతిలోనూతనంగా కొత్త గోపురం నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.11 అంతస్తులతో 157 అడుగుల ఎత్తును కలిగి...కేవలం 49 అడుగుల పీఠభాగంతో గాలిలో ఠీవిగా నిలబడినట్టు కనిపిస్తూ సందర్శకులను అబ్బురపరిచే అద్వితీయ నిర్మాణమిది.దీనిని 1807-09 కాలంలో నాటి ధరణికోట జమిందారు శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు నిర్మించారు. ఈ గోపుర పీఠభాగం పూర్తిగా రాతిచే నిర్మితమైంది. ఈ రాతి కట్టడానికి అన్నీ వైపులా పగుళ్లు వచ్చాయి.గోపుర పీఠభాగం త్రీడీ లేజర్ స్కానర్‌తో పునాదుల అంతర్భాగాన్ని స్కానింగ్ చేయించాలని భక్తులు కోరుతున్నారు.మంగళగిరి గోపురాన్ని ఈ ప్రాంత ప్రజలు వారసత్వ సంపదగా భావిస్తుంటారు.

పానకాలస్వామికి ఇక్కడ డ్రమ్ముల కొద్దీ పానకాన్ని తయారు చేస్తుంటారు. పానకం తయారీ సందర్భంగా కింద ఎంతగా ఒలికిపోయినా ఈగలు చీమలు చేరవట. సృష్టిలో ధర్మం పూర్తిగా నశించి యుగ సమాప్తి దగ్గరపడినపుడు మాత్రమే పానకం ఒలికినపుడు ఈగలు, చీమలు చేరడం ఆరంభమవుతుందని అంటారు. మద్రాసులోని సెయింట్‌ జార్జి ఫోర్ట్‌ గవర్నర్‌ రస్టెయిన్‌షామ్‌ మాస్టర్‌ మచిలీట్నం నుంచి మద్రాసు వెడుతూ 1679 మార్చి 22వ తేదిన మంగళగిరి చేరుకున్నాడు. ఆ రాత్రి ఆయన ఇక్కడే బసచేసి, ఈ మహత్తును గురించి విని, స్వయంగా కొండపైకి వెళ్లి పానకాలరాయుని సన్నిధిని పరిశీలనగా చూశారు. ఇదేదో గమ్మత్తుగా ఉందని, తనకైతే నమ్మశక్యంగా లేదన్నారు. మంగళగిరిలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. హేతువాదులు మంగళగిరి కొండ ఓ అగ్ని పర్వతమని, దీనిలో గంధకం ఉందని, ఎప్పటికైనా పేలిపోయే ప్రమాదముందని, ఆ విపత్తు నుంచి మంగళగిరిని రక్షించేందుకే, గంధకాన్ని ఉపశమింపజేసేందుకే, నిత్యం పానకాన్ని నివేదించాలని, పూర్వీకులు దేవుని పేరిట ఈ ఏర్పాటు చేశారని వాదిస్తుంటారు.

ప్రాచీన కాలం నుండి, మంగళగిరి చేనేతకు, వైష్ణవ మతానికి ప్రసిద్ధి చెందింది. ఎందరో చారిత్రక ప్రముఖులు మంగళగిరిని సందర్శించారు. వారిలో అద్వైత సిద్ధాంతకర్త ఆది శంకరాచార్యులు, విశిష్టాద్వైతాన్ని ప్రవచించిన రామానుజాచార్యులు, ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మధ్వాచార్యులు ప్రముఖులు. వల్లభాచార్యులు ఇక్కడి నుండే తన ప్రవచనాలను వినిపించాడు. చైతన్య మహాప్రభు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించాడు. ఆయన పాద ముద్రలు కొండ వద్ద కనిపిస్తాయి అంటారు. తాళ్ళపాక అన్నమాచార్యుని మనుమడు, తాళ్ళపాక చిన తిరుమలయ్య 1561లో రామానుజ సమాజానికి ఇక్కడ భూమి దానం చేసాడు.

శ్రీ కృష్ణదేవరాయల కాలంలో ఆయన మంత్రి తిమ్మరుసు మంగళగిరిని సందర్శించి, విజయస్థూపం నిర్మింపజేసాడు. కొండవీటి మంత్రి సిద్ధరాజు తిమ్మరాజు గుడిని అభివృద్ధి చేసి, దానికి భూదానం చేసాడు. అబ్బన కవి ఇక్కడి దేవాలయాన్ని అనేక సార్లు సందర్శించాడు. తన అనిరుద్ధ చరిత్రను నరసింహస్వామికి అంకితమిచ్చాడు.

ప్రధాన వీధిలో, రామాలయం వద్ద శాసన స్తంభం వీధి అనే వీధి ఉంది. ఈ వీధిలో ఎనిమిది ముఖాలు కలిగిన ఒక శాసనం ఉంది. ఈ కారణం చేత ఈ వీధికి ఆ పేరు వచ్చింది. ఈ శాసనంలో 46 పంక్తులు తెలుగులోను, 4 పర్షియన్ ‍లోను వ్రాసి ఉన్నాయి. 1565 నుండి మంగళగిరి గోల్కొండ కుతుబ్‌ షాహిల పాలనలో ఉండేది. 1593లో కుతుబ్‌ షాహి వృత్తి పన్ను బాగా పెంచేసాడు. అది కట్టలేని చేనేత కార్మికులు మచిలీపట్నం వంటి ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. ఈ విషయం తెలిసిన సుల్తాను వాళ్ళను వెనక్కి రప్పించమని తన సేనాధిపతి ఖోజా ఆలీని ఆదేశించాడు. ఖోజా ఆలీ పుల్లరి తీసివేస్తున్నట్లు, ఇతర పన్నులను నాలుగు వాయిదాలలో కట్టవచ్చని ప్రకటించి అదే విషయాన్ని ఈ శాసనంపై వ్రాయించాడు.

మంగళగిరి మధ్యలో, అర ఎకరం వైశాల్యంలో కోనేరొకటుంది. దీని పేరు కల్యాణ పుష్కరిణి. 1558లో విజయనగర రాజుల అధీనంలో ఉండగా దీనిని తవ్వించారు. చాలా లోతైన ఈ కోనేటికి నాలుగు వైపుల మెట్లు ఉన్నాయి. లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి చెందిన ఈ కోనేటిలో రెండు బావులు ఉన్నట్లుగా చెబుతారు. గుడికి తూర్పున శివలింగం ఉంది. 1832 నాటి కరువులో కోనేరు ఎండిపోయి, 9,840 తుపాకులు, 44 గుళ్ళు బయట పడ్డాయి. ఇవి పిండారీలకు చెందినవి. కోనేటి అడుగున బంగారు గుడి ఉందని ప్రజలు అనుకుంటారని 1883లో గార్డన్‌ మెకెంజీ కృష్ణా జిల్లా మాన్యువల్‌న్‌లో రాసాడు. 19వ శతాబ్దం|19వ శతాబ్దిలో మారెళ్ళ శీనయ్యదాసు కోనేటిలో ఆంజనేయ స్వామి గుడిని నిర్మించి రెండెకరాల స్థలాన్ని దానమిచ్చాడు. శతాబ్దాలపాటు ప్రజలీ కోనేటి నీటితో దేవునికి అభిషేకం జరిపించారు. 2004లో కృష్ణా పుష్కరాల సందర్భంగా కోనేటికి ప్రహరీగోడ నిర్మించారు.

పానకాలస్వామి దేవాలయం (కొండమీది గుడి) మెట్ల మొదట్లో ఈ శాసనం ఉంది. శ్రీ కృష్ణదేవరాయలచే ఈ శాసనం ప్రతిష్ఠింపబడినదని చెబుతారు. వాస్తవానికి ఇది రాయల మహామంత్రి సాళువ తిమ్మరుసుకు చెందినది. 1515 జూన్‌ 23 న శ్రీ కృష్ణదేవరాయలు కొండవీటిని జయించి ఈ శాసనం వ్రాయించాడు. రాయల విజయాన్ని సూచించే ఈ స్తంభాన్ని జయ స్తంభం అన్నారు. అమరావతి పాలకుడైన నాదెండ్ల తిమ్మయ్య ఇచ్చిన 19 దానశాసనాల ప్రసక్తికూడా దీనిపై ఉంది. దీనిలోని 198వ వరుస నుండి 208వ వరుస వరకు మూడు ముఖ్యమైన చారిత్రక సమాచారాలు ఉన్నాయి. 

లక్ష్మీనరసింహస్వామి గుడిమీద (కొండ కింది గుడి)గల రాతి చెక్కడాలకు చారిత్రక ప్రాధాన్యత ఉంది. 1558లో సదాశివ రాయలు విజయనగర రాజ్యాన్ని పాలించేటపుడు, అప్పటి కొండవీటి సామంతుడు తిమ్మరాజయ్యచే ఈ చెక్కడం లిఖించబడింది. అప్పట్లో రాజ్యంలోని వారసుల్లో తిరుమల రాజు ఒకడు. అతడు తిమ్మరాజయ్యకు మేనమామ. ఈ 143 పంక్తుల చెక్కడంలో తిమ్మరాజయ్య ఇచ్చిన దానాల వివరాలు ఉన్నాయి. అందుకే దీనిని ధర్మ శాసనం అని అంటారు.
చెక్కడాలపై నున్న వివరాలు ఇలా ఉన్నాయి: పన్నులు తొలగించబడ్డాయి. విజయనగర సామంత రాజైన తిరుమలరాజు 28 గ్రామాలలోని 200 కుంచాల భూమిని (10 కుంచాలు = 1 ఎకరం) గుడికి దానమిచ్చాడు. నంబూరు, తాళ్ళూరు, నల్లపాడు, మేడికొండూరు, వీరంభొట్ల పాలెం (రాంభొట్ల వారి పాలెం?), తాడికొండ, పెదకొండూరు, గొడవర్త్గి, దుగ్గిరాల, ఉప్పలపాడు, వడ్లమాను, కుంచెన పల్లి, కొలనుకొండ, ఆత్మకూరు, లాం, గోరంట్ల, గోళ్ళమూడిపాడు, నిడమర్రు, కురగల్లు, ఐనవోలు, శాఖమూరు గ్రామాల్లో భూమిని దానం చేసాడు. వాణిజ్య మండలి ముఖ్యుడైన పాపిశెట్టిని మంగళగిరికి అధికారిగా నియమించారు. ఈ చెక్కడంపై ముగ్గురు రాజ వంశీకుల ప్రస్తావన ఉంది. వారు: సదాశివ రాయలు, తిరుమల రాజు, తిమ్మరాజు. వారు జరిపిన ఉత్సవాలు, గుడికి చేసిన అభివృద్ధి గురించి కూడా ప్రసక్తి ఉంది. గుడి కొరకు 5 విధాల విగ్రహాలను, 10 రకాల ఉత్సవ రథాలను తయారు చేయించారు, కోనేటిని తవ్వించారు, పూల తోటలను పెంచారు.

వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు పరిపాలనా కాలంలో చెంచులు గ్రామాలపైబడి దోచుకుంటూ ఉండేవారు. ఈ దోపిడీలను అరికట్టడానికి ఆయన 150 మంది చెంచు నాయకులను ఆహ్వానించి, వారిని మట్టుపెట్టించాడు. దానితో ప్రజలకు దోపిడీల బెడద తగ్గినా, ఆయన అశాంతికిలోనయ్యాడు. పాప పరిహారార్ధం దేవాలయాల నిర్మాణం చెయ్యమన్న కొందరు పెద్దల సూచన మేరకు అనేక దేవాలయాలను కట్టించాడు. 1807-09లో నరసింహ స్వామి దేవాలయానికి 11 అంతస్తుల గాలి గోపురాన్ని నిర్మింపజేసాడు.

బ్రిటిషువారి పాలనలో అడవులను ఆక్రమించి అక్కడి వారికి జీవన భృతి లేకుండా చేసారు. వారు చివరికి దొంగలుగా మారారు. బ్రిటిషు ప్రభుత్వం వివిధ ప్రదేశాల్లో వీరికి ప్రత్యేకంగా ఆవాసం కల్పించింది. 1913లో అటువంటిదే ఒక స్థావరం మంగళగిరి వద్ద కృష్ణా నదికి బకింగ్‌హాం కాలువకు మధ్య ఏర్పాటు చేసారు. అప్పటినుండి 1932 వరకు శాల్వేషను ఆర్మీ అనే సంస్థ దీనిని నిర్వహించేది. 1932 నుండి 1956 వరకు పోలీసుశాఖ నిర్వహణలో ఉండేది. 1956లో సాంఘిక సంక్షేమ శాఖ అధీనంలోకి వచ్చింది. 1962లో ప్రభుత్వం వారికి నేరస్తులనే ముద్రను తొలగించి, వారి జీవనార్ధమై 156 ఎకరాల భూమిని పంచింది.

రామనాధం చినకోటయ్య, చినకోటయ్యల వృద్ధుల సేవా ఆశ్రమం, పాత మంగళగిరి.

పాత మంగళగిరిలో, దుర్గానగర్ లో, బైపాస్ రహదారిపైన వేసేసియున్న ఈ ఆలయంలో, 2015,నవంబరు-7వ తేదీ శనివారంనాడు, అయ్యప్పస్వామి, గణపతి, కుమారస్వామి, మాలికాపు రత్తమ్మ దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠా, త్రికలశ శిఖర ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. [2]

మంగళగిరి పట్టణంలోని రైల్వే స్టేషను రహదారిపై, కోర్టు ఎదుట ఉన్న ఈ ఆలయ అష్టమ ప్రతిష్ఠాపన మహోత్సవాలు, 2016,ఫిబ్రవరి-13వ తేదీ, మన్మధనామ సంవత్సరం, మాఘశుద్ధ పంచమి, శనివారంనాడు వైభవంగా నిర్వహించారు. [5]

పాత మంగళగిరిలోని ఈ ఆలయంలో, ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా, 2015,డిసెంబరు-18వ తేదీ శుక్రవారంనాడు, ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. [3]

పాతమంగళగీరిలో కారంపుడి వారి అంకమ్మ దేవర గుడి దిగుడుబావివద్ద ఉంది. అంకమ్మదేవర పూజలు రెండొందలు సంవత్సరాలుగా, ప్రతి ముక్కోటి ఏకాదశీ రోజున జరుపుతారు. ఒకప్పుడు జంతు బలులతో పూజలుచేసేవారని,ఇప్పుదు శాకాహార వంటకాలతో సమారాదన కారంపుడి ఇంటిపేరుకల కుటుంబాలవారు అందరూకలసి చేసుకొంటారు ...

మంగళగిరిలోని శాలివాహననగర్ లో ఉన్న ఈ పురాతన ఈ ఆలయాన్ని ఇటీవల పునర్నిర్మించారు. నూతన ఆలయంలో, 2016,ఏప్రిల్-10, ఆదివారంనాడు ఉదయం విగ్రహాల గ్రామోత్సవం, సాయంత్రం అంకురార్పణ నిర్వహించి, 11వతేదీ సోమవారం ఉదయం 11 గంటలకు విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించెదరు. [6]

మంగళగిరి పట్టణంలో పెద్ద కోనేరు వద్దయున్న ఈ ఆలయంలో, 2017,ఫిబ్రవరి-10వతేదీ శుక్రవారంనాడు, ద్వజస్తంభ ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. [7]

గ్రేటర్ మంగళగిరిలో కలుపదలచిన గ్రామాలు:నవులూరు(గ్రామీణ),ఆత్మకూరు(గ్రామీణ),చినకాకాని




#Article 189: కొండపల్లి (627 words)


కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి చెందిన ఈ కొండపల్లి కృష్ణా జిల్లా, ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 228., ఎస్.టి.డి కోడ్ = 0866.

కొండపల్లి విజయవాడ గుండా పోయే జాతీయ రహదారి 221 మీద విజయవాడకు 16 కి.మీ. దూరములో ఉంది.

ఈ గ్రామానికి సమీపంలో ఈలప్రోలు,ఇబ్రహీంపట్నం, పైదూరుపాడు, గడ్డమనుగు, వెలగలేరు, జి.కొండూరు గ్రామాలు ఉన్నాయి.

ఇబ్రహీంపట్నం, విజయవాడ గ్రామీణ, మైలవరం, తుళ్ళూరు

ఈ గ్రామానికి రైల్వే సౌకర్యం హైదరాబాదు-విజయవాడ రైల్వే లైను వల్ల కల్పించబడింది.

ఈ గ్రామం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొండపల్లి బొమ్మలకు పుట్టినిల్లు. తేలికైన పొనికి చెక్కతో చేసిన ఈ బొమ్మలు దశాబ్దాల తరబడి ప్రజలను అలరిస్తున్నాయి.ఒకసారి తయారు చేసిన దానిని మూసగా పోసి చేసే వీలులేదు. ఒకసారి తయారు చేసి దానిని ముద్రగుద్దే ప్రశ్నేలేదు. మొదటిది ఎంత సమయం, ఎంత కళాదృష్టి, ఎంత ఏకాగ్రతతో చేసారో రెండవదీ అంతే సమయం, దృష్టి, ఏకాగ్రతలతో చేయబడుతూ కొండపల్లి గ్రామస్తులకు మాత్రమే సాధ్యమైన గొప్ప పనివాడితనం కొండపల్లి బొమ్మ.

కొండపల్లి బొమ్మలు తేలికైన పొనికి అనే చెక్కతో తయారు చేస్తారు. ముందుగా చెక్క మీద తయారు చేయవలసిన బొమ్మ ఆకారాన్ని చెక్కుతారు. తరువాత రంపపు పొట్టు, చింత గింజల నుండి వచ్చిన పొడితో కావలసిన ఆకారములో మలుస్తారు. బొమ్మలకు ప్రత్యేకంగా వేరే అతకవలసిన భాగాలు, మార్పులు చేస్తారు. తరువాత వాటికి సున్నం పూసి ఎండపెడతారు. ఆ తరువాత ఆరిన సున్నంపై రంగులు పూస్తారు. కొండపల్లి బొమ్మలలో ప్రసిద్ధి చెందినవి ఏనుగు అంబారి -మావటివాడు,నాట్యం చేస్తున్న నృత్యకళాకారిణిల బొమ్మ, పల్లెలలో తలపాగా పంచె కట్టుకొన్న పురుషుల సంఖ్య, చీరలు కట్టుకొన్న స్త్రీల సంఖ్య కల జీవనవ్యవస్థ సూచించే ప్రజల బొమ్మలు ముఖ్యమైనవి. పౌరాణిక ప్రముఖులు, పక్షులు, జంతువులు, పండ్లు, కూరగాయలు, ఇళ్ళు మొదలైన ఎన్నో రూపాల్లో ఈ బొమ్మలు తయారు చేస్తారు. అన్ని తీర్ధ యాత్రా స్థలాల్లోను, హస్తకళా కేంద్రాలలోను ఇవి లభిస్తాయి. ఈ బొమ్మల తయారీలో ఉన్న శైలి, 17 వ శతాబ్దంలో రాజస్థాన్ రాష్ట్రములో బొమ్మల తయారీ శైలి ఒకే విధంగా ఉండడం వల్ల ఈ కళాకారులు రాజస్థాన్ నుండి ఇక్కడకు వలస వచ్చారని భావిస్తారు. కొండపల్లిలో పూర్వం 150 వరకు కుమ్మరి కుటుంబాలు కుండలు తయారు చేసి జీవనం సాగించేవారు. ప్రస్తుతం 10 నుంచి 15మంది మాత్రమే ఈ వృత్తిలో ఉన్నారు.

ముసునూరి కమ్మరాజుల కాలంలో ఈ కోట నిర్మితమైనది. ఢిల్లీ సుల్తానులను పారద్రోలి ఈ దేశాన్ని పరాయిపాలన నుంచి విముక్తి చేసిన తెలుఁగు వీరుడు ముసునూరి ప్రోలయ రాజ్యాన్ని సుభక్షింగా, శత్రు దుర్బేధ్యంగా మలచే ప్రయత్నంలో ఈ త్రిలింగ దేశంలో అనేక కోటల నిర్మాణాలు చేపట్టాడు. అందులో భాగంగా కొండపల్లి కోట నిర్మాణానికి పూనుకున్నాడు. ఈ కోట నిర్మాణం ప్రోలయ వారసుడైన కాపయ కాలంలో పూర్తి అయింది. కాపయ ఈ కోట నిర్మాణం దిగ్విజయంగా పూర్తి చేసి గుంటూరు జిల్లా కొల్లూరులో శాసనం వేయించాడు. అడపా, దాసరి, అట్లూరి అనే గృహనామాలు కలిగిన కమ్మరాజులు సుమారు 100 ఏళ్లు ఈ కోటని గజపతుల సామంతులుగా పాలించారు. ముసునూరి కమ్మ రాజులని కొండపల్లి కమ్మరాజులు అని వ్యవహరిస్తారు. దీనిలో మూడంతస్తుల రాతి బురుజు ఉంది. ఇక్కడ విరూపాక్ష దేవాలయం ఉంది.

కొండ చుట్టూ శుత్రుదుర్భేద్యమైన ప్రాకారం. రాజమహల్ గోడలపై కళాఖండాలను తీర్చిదిద్దారు. దర్బారు నిర్వహించే రాజమహల్, రాణి, పరివారం నివాసముండే రాణీమహల్, నర్తనశాల, నేటి రైతు బజార్లను తలపించే అంగడి, నేరగాళ్లను ఉంచే కారాగారం, ఆయుధాగారం, ప్రజలు స్నానం చేయడానికి వీలుగా పెద్ద కొలను, రాజ కుటుంబీకుల కోసం మరో కొలను, గుంపులుగా తరలివెళ్లడానికి, ఏనుగులు, గుర్రాలు వెళ్లడానికి వీలుగా రహదారుల నిర్మాణం -ఇవన్నీ ఒక కొండపైనే ఉన్నాయి. కొండపల్లి కోటను ప్రస్తుతము పునర్నిర్మిస్తున్నారు. క్రీశ1687 మధ్య కాలంలో మొగల్ చక్రవర్తి ఔరంగజేబు, తరువాత గోల్కొండ నవాబులు అనంతరం నాజర్ జంగ్ పరిపాలించారు.

క్రీ.శ. 1766లో జనరల్ కాలియేడ్ కోటను ఆక్రమించి, కెప్టెన్ మాడ్గే ఆధ్వర్యంలో ఈ కోటకు కొన్ని మరమ్మతులు చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయి. చివరగా కీశ 1767లో బ్రిటీష్ వారు కొండపల్లి కోటను తమ ఆధీనంలోకి తీసుకుని తమ సిపాయీలకు శిక్షణ పాఠశాలను ఏర్పాటు చేశారు. అయితే ఆర్థిక సమస్యలతో క్రీశ1859లో ఈ శిక్షణ పాఠశాలను మూసివేశారు. ఆ తరువాత దీనిని పట్టించుకున్నవారు లేరు. 1962 నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలోకి వచ్చాక రక్షిత కట్టడంగా ప్రకటించారు.
కొండపల్లి ఖిల్లాకి వెళ్ళేందుకు జూపూడి మీదుగా కొండపైకి రోడ్డుమార్గం ఉంది. కొండపల్లి నుండి నడక మార్గం కూడా ఉంది. 

గత 10 నెలల నుండి కొండపల్లి కోటకు మరమ్మత్తులు చేస్తున్నారు. అందులో భాగంగా గజశాల తూర్పువైపు కోట గోడలను పటిష్ఠ పరచే పనులు జరుగుచుండగా, 2016,జనవరి-14వతేదీనాడు దేవతామూర్తుల విగ్రహాలు ఆలయ స్తంభాలు వెలుగు చూసినవి. ఈ విగ్రహాలను పరిశీలించిన పురావస్తుశాఖ అధికారులు, వీటిని ముసునూరి కమ్మరాజులు, శ్రీ కృష్ణదేవరాయల కాలంనాటివిగా గుర్తించారు.

కొండపల్లిలో పద్మసాలీలు ఎక్కువ. ఇప్పుడు కొన్ని కుటుంబాలు మాత్రమే ఈ వృత్తి చేస్తున్నాయి. వీరిలో దామెర్ల  ఇంటి పేరుగల వారు ఉన్న ప్రాంతం దామెర్ల వారి వీధిగా పేరు గాంచింది. వీరు నరసరావుపేట దగ్గర వున్న కుంకలగుంట గ్రామం నుండి వలస వచ్చారని తెలుస్తుంది. వీరు పూర్వీకులు దాసాంజనేయస్వామి విగ్రహాన్ని కొండపల్లి ఖిల్లా మీద నుండి తీసుకువచ్చి దామెర్ల వారి వీధిలో ప్రతిష్ఠించారు. దీనికి మరల దామెర్ల సత్యనారాయణ పున:ప్రతిష్ఠ చేసారు.

[3] ఈనాడు కృష్ణా/మైలవరం; 2013,అక్టోబరు-12; 1వపేజీ.
[4] ఈనాడు కృష్ణా/మైలవరం; 2013,నవంబరు-2; 1వపేజీ. 
[5] ఈనాడు కృష్ణా/మైలవరం; 2013,నవంబరు-6; 1వపేజీ.
[6] ఈనాడు కృష్ణా/మైలవరం; 2014,జనవరి-21; 2వపేజీ.
[7] ఈనాడు కృష్ణా/మైలవరం; 2014,మార్చి-25; 2వపేజీ.
[8] ఈనాడు కృష్ణా/మైలవరం; 2014,మార్చి-31; 2వపేజీ.
[9] ఈనాడు కృష్ణా/మైలవరం; 2014,జూన్-19; 2వపేజీ. 
[10] ఈనాడు కృష్ణా/మైలవరం; 2015,ఫిబ్రవరి-18; 1వపేజీ.
[11] ఈనాడు కృష్ణా/మైలవరం; 2015,మార్చి-6; 1వపేజీ.
[12] ఈనాడు కృష్ణా/మైలవరం; 2015,మార్చి-11; 1వపేజీ.
[13] ఈనాడు అమరావతి; 2015,మే-25; 33వపేజీ.
[14] ఈనాడు అమరావతి; 2015,జులై-13; 32వపేజీ.
[15] ఈనాడు అమరావతి; 2017,జనవరి-16; 3వపేజీ.




#Article 190: ఉదయగిరి (1002 words)


ఉదయగిరి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం లోని గ్రామం, ఆ మండలానికి కేంద్రము. ఇది ఉదయగిరి శాసనసభ నియోజకవర్గానికి కేంద్రం కూడా. ఇది సమీప పట్టణమైన బద్వేలు నుండి 56 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3814 ఇళ్లతో, 15870 జనాభాతో 4268 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 8011, ఆడవారి సంఖ్య 7859. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2463 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 546. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 591640.పిన్ కోడ్: 524236.

ఉదయగిరి నెల్లూరుకు వాయువ్యమున 96 కి.మీ దూరములో ఉంది. 14వ శతాబ్దములో విజయనగర రాజులు కట్టించిన కోట శిథిలాలకు ప్రసిద్ధి. ఇక్కడ 938 మీ ఎత్తైన సంజీవ కొండ వైద్య సంబంధిత వనమూలికలకు ప్రసిద్ధి. ఈ గిరిలో 365 దేవస్థానాలు 101 కోనేరులు ఉన్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ఉదయగిరిలో పల్లవుల, చోళుల కాలం నాటి దేవాలయాలు ఉన్నాయి.

చరిత్రలో ఉదయగిరి పట్టణం యొక్క తొలి ప్రస్తావన 14వ శతాబ్దంలో కనిపిస్తుంది. ఒడిషా గజపతుల సేనాని అయిన లాంగుల గజపతి ఉదయగిరిని రాజధానిగా చేసుకుని చుట్టుపక్కల ప్రాంతాలను పరిపాలించాడు. 1512లో ఉదయగిరి కృష్ణదేవరాయల పాలనలోకి వచ్చింది. కోట చాలా దిశలనుండి శత్రు దుర్భేద్యమైనది. దీన్నీ తూర్పు వైపున ఉన్న అడవి బాట ద్వారా లేదా పశ్చిమం వైపున ఉన్న కాలిబాట ద్వారానే ముట్టడించే అవకాశమున్నది. సంవత్సరకాలం పాటు జరిగిన కోట దిగ్భంధనం ఫలితంగా ప్రతాపరుద్ర గజపతి ఉదయగిరి కోటను కోల్పోయాడు.

గజపతుల పాలనలోనూ ఆ తర్వాత విజయనగర పాలనలోనూ కోటను విస్తరించాడు. మొత్తం పట్టణాన్ని, దానిని ఆనుకుని ఉన్న వెయ్యి అడుగుల ఎత్తున్న కొండ చుట్టూ పటిష్ఠమైన గోడకట్టించారు. కోటలో మొత్తం నిర్మాణాలు ఉన్నాయి. అందులో 8 కొండపైన, 5 దిగువన ఉన్నాయి. కోటలో అనేక ఆలయాలు, తోటలు కూడా ఉండేవి.

ఈరాజ్యమొకప్పుడు భోగభాగ్యములతో తులతూగుతూ ఉండేది. పండితులు, కవులు, గాయకులు పలువురు ఈరాజ్యానికి వన్నె తెచ్చారు. ఇప్పుడు పూర్వవైభవమంతాపోయింది. పూర్వవైభవాన్ని సంరింపజేసే ఉదయగిరికొండ, ఉదయగిరిదుర్గము మాత్రమూ ఉన్నాయి. కలివి కర్రతో చక్కని చెంచాలూ, చిన్నవీ పెద్దవీ, నేడు ఈకడి శిల్పులు తయారుచేస్తున్నారు. చేతికర్రలు, పాంకోళ్ళు, కవ్వాలు, గరిటెలు-అన్నీ కర్రవే ఇప్పటికీ తయారు చేస్తున్నారు.

విజయనగర సామ్రాజ్యము స్థాపించినప్పటినుంచీ అనగా 14వశతాబ్దము మొదటిభాగంనుంచీ ఉదయగిరి రాజప్రతినిధి ఉండే స్థలముగా ఏర్పాటైనది. ఉదయగిరి రాజ్యములో నేటి నెల్లూరు కడప జిల్లాలు చేరియున్నవి. ఉదయగిరి రాజ్యమునకే ములికనాడు అని పేరు. అనాటి కవులూ, వారు వ్రాసిన కావ్యాలూ పెక్కు ఉన్నాయి. సమిరకుమారవిజయము రచించిన పుష్పగిరి తిమ్మన్న ఆత్మకూరుతాలూకావాడు. విక్రమార్క చరిత్రము వ్రాసిన వెన్నలకంటి సిద్ధనకు జక్కన కవి కృతి ఇచ్చెను. ఈ సిద్ధనమంత్రి ఉదయగిరి రాజ్యమున మత్రిగా ఉండెను.

ఉదయగిరి దుర్గమునేలే బసవరాజు మంత్రియైన గంగన్నకు దుగ్గనకవి తాను రచించిన నాసికేతూపాఖ్యానము కృతి ఇచ్చెను. ఈకాలమున ఉదయగిరి దుర్గము విజయనగరరాజుల చేతులలో నుండి గజపతుల చేతులలో పడెను. బసవరాజే గజపతుల తరుపున ఉదయగిరి దుర్గమును స్వాధీనము చేసుకొని తన యేలుబడిలో నుంచుకొనెనట. ప్రబోధచంద్రోదయమును రచించిన మల్లనసింగనలు పై గంగన్నకే తన కావ్యమును కృతి ఇచ్చిరి.
దూబగుంట నారాయణ కవి తాను రచించిన పంచతంత్రమును పై బసవరాజుకు అంకితమిచ్చెను.
ఉదయగిరి రాజ్యము సంగీతవిద్యలో కూడా పేరు తెచ్చుకొన్నది. అచ్యుతరాయ రామరాయల కాలములలో ఉదయగిరి రాజ్యమునకు రాజప్రతినిధగా రామామాత్యుడుండెను. ఇతడు సర్వమేళకళానిధి అనే ప్రసిద్ధ సంగీత గ్రంథమును రచించెను. దానిని రామరాయలకు అంకితమిచ్చెను. ఇతనికి వాగ్గేయకారతోడరుమల్లు అను బిరుదు ఉంది. అక్బరు కాలమున ఆర్థికమంత్రిగా నుండిన తోడరుమల్లు చూపిన ప్రతిభవంటి ప్రతిభను ఇతడు మంత్రిగానుండి చూపుటచేత, సర్వకళానిధి రచించుటవల్లనూ ఈబిరుదు ఇతనికి ఇచ్చిరట.
ఉదయగిరి గ్రామమునకు కొండాయపాలెం అని పేరుకూడ.

ఉదయగిరి కొండమీద ఒక ఆలయమున్నది. దానికి వల్లభరాయ దేవాలయమని పేరు. వల్లభరాయడను మంత్రి దానిని నిర్మించెనట. దేవాలయము పక్కన చక్కని కోనేరు ఉంది. ఈ వల్లభరాయుడు శ్రీకృష్ణ దేవరాయ ల ప్రతినిధి యట. క్రీదాభిరామము న శ్రీనాధుడు వల్లభరాయని పేర వ్రాసినట్లున్నూ, ఆ వల్లభరాయడు ఉదయగిరిసీమలోని మోపూరు గ్రామమున వెలసిన భైరవస్వామి భక్తుడనిన్నీ శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు వ్రాసియున్నారు. ఈ ఇద్దరు వల్లభరాయలు ఒకరేనని పరిశోధకులు చెప్పుదురు.

రావూరుతాలూకా మొలకలపుండ్లకు కొద్ది దూరములో ఒక కొండ ఉంది. దానిని సిద్ధులయ్యకొండ అంటారు. దానిపై గుహాలయమొకటి ఉంది. ఆలయములో మూడు ప్రతిమలున్నవి. ఒకప్రతిమ నవకోటిసిద్ధుల పేరను, రెండవ ప్రతిమ నవనాధసిద్ధుల పేరను, మూడవది సారంగధరుని పేరను ప్రసిద్ధిచెంది యున్నవి. పై సిద్ధులు కొండపై తపస్సు చేసుకొనుచుండగా సారంగధరుడు వారిని దర్సించుకోవడానికి పోయినాడట. ఈ సారంగధరుడొక సిద్ధుడు.

ఉదయగిరి అనే గ్రామనామం ఉదయ అనే పూర్వపదం, గిరి అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. గిరి అనే పదం పర్వతసూచి, దీనికి కొండ అనే అర్థం వస్తోంది. ఉదయ అన్న పదం సాదృశ్యబోధకసూచి

ఇంకా గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 15, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు ఏడు,ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు,ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, 2 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల ఉంది. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది. ఒక ప్రభుత్వ అనియత విద్యా కేంద్రం ఉంది. 

సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్, సమీప దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల నెల్లూరులో ఉన్నాయి.

ఉదయగిరిలో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు , 10 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.  ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. 

గ్రామంలో9 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఐదుగురు, డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు, ఇద్దరు నాటు వైద్యులు ఉన్నారు. 10 మందుల దుకాణాలు ఉన్నాయి. 

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. 

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు. 

ఉదయగిరిలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. 

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి. 

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. 

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. 

ఉదయగిరిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

ఉదయగిరిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

ఉదయగిరిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

వరి, సజ్జలు

ఉదయగిరి ఐ.సి.డి.ఎస్.ప్రాజెక్టుకు జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చినది. ఈ ప్రాజెక్టులో ప్రతి సంవత్సరం లగానే, 2020-ఆగస్టు మొదటివారంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల నిర్వహణ కార్యక్రమంపై తీసిన డాక్యుమెంటరీ చిత్రాన్ని బి.పి.ఎస్.ఐ సంస్థకు పంపించగా, ఆ సంస్థ వారు, ఊదయగిరి కేంద్రాన్ని ఊత్తమ ఫీడింగ్ కేంద్రంగా గుర్తించినారు. రాష్ట్రంలో మొత్తం 3 కేద్రాలను ఉత్తమ కేంద్రాలుగా గుర్తించగా, వాటిలో ఉదయగిరి కేంద్రం ఒకటి. [1]

[1] ఈనాడు నెల్లూరు;2020,సెప్టెంబరు-25;1వపేజీ.




#Article 191: చినగంజాము (164 words)


చినగంజాము, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక గ్రామం.., మండలం.

ఈ గ్రామ సమీపంలోని కొమ్మమూరు కాలువ వద్ద అనేక బౌద్ధ ఆనవాళ్ళు కనబడినవి. ఇటీవల రెండు ఎకరాలస్థలంలో త్రవ్వకాలు కొనసాగినవి. బొద్ధభిక్షువులకోసం పలకరాళ్ళతో నిర్మించిన విహారాలు ఇక్కడ ప్రత్యేకం. ఇక్కడ మూడు చిన్న చిన్న స్థూపాలు వెలికి తీసినారు. వీటి నిర్మాణానికి పూర్తిగా ఇటుకలే వాడినారు. బుద్ధ విగ్రహం, మట్టికుండలు, పాళీభాషలో వ్రాసిన శాసనాలు లభించినవి. ఇంకా త్రవ్వకాలు జరపవలసి ఉంది. [4]

దీనికి గంధపురి అనే పేరు కూడా ఉంది.

కడవకుదురు 3.7 కి.మీ, పెదగంజాం 5.2 కి.మీ, సంతరావూరు 7.1 కి.మీ, గొనసపూడి 7.5 కి.మీ, పుల్లరిపాలెం 7.5 కి.మీ.

వేటపాలెం 11.6 కి.మీ, నాగులుప్పలపాడు 16.8 కి.మీ, ఇంకొల్లు 17.3 కి.మీ.

ఇది విజయవాడ-చెన్నై రైలుమార్గంలోని ఒక రైల్వే స్టేషన్.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

ఈ ఆలయంలో స్వామివారి తిరునాళ్ళు, ఫాల్గుణ పౌర్ణమి, గురువారం రాత్రి వైభవంగా నిర్వహించారు. తిరునాళ్ళ సoదర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అందముగా అలంకరించారు. భక్తులు ప్రత్యేక ఆకుపూజా కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. విద్యుత్తు ప్రభ కట్టినారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నవి. తెల్లవారుఝాము వరకు సాగిన వీరబ్రహ్మేంద్రస్వామి నాటకాన్ని భక్తులు ఉత్సాహంగా తిలకించారు. ఈ తిరునాళ్ళకు చినగంజాం, కొత్తపాలెం గ్రామాల నుండి ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఆలయ కమిటీ వారు త్రాగునీరు, తదితర సౌకర్యాలు కలుగజేసినారు.

వరి, అపరాలు, కాయగూరలు

వ్యవసాయం, వ్యవసాయాదారిత వృత్తులు




#Article 192: మోటుపల్లి (182 words)


మోటుపల్లి, ప్రకాశం జిల్లా, చినగంజాము మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 523 184., ఎస్.ట్.డి.కోడ్ = 08594.

మోటుపల్లి రేవు (Motupalli), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము ప్రకాశం జిల్లాలోని చినగంజాము నుండి 12 కిలోమీటర్ల దూరములో ఉంది.

మార్కోపోలో సందర్శనా కాలములో మోటుపల్లిని ఒక తెలివైన రాణి పాలించేదని, ఆమె తన ప్రజలను న్యాయముగా సమానముగా పాలించేదని పేర్కొన్నాడు. ఆమె రాజ్యములోని ప్రజలు బియ్యము, మాంసము, పాలు, పండ్లు, చేపలు తిని జీవించేవారని రాసాడు. ఇతరత్రా చెప్పుకోదగిన విషయాలలో రాజ్యంలోని వజ్రాల ఉత్పాదన గురించి, రాజులకు తగినటువంటి సున్నితమైన వస్త్రాల గురించి, పుష్కలమైన మృగసంపద, భారీ గొర్రెలను గురించిన సంగతులు రాసాడు.

ఈ గ్రామానికి తూర్పుదిశలో అరమైలు విస్తీర్ణంలో బౌద్ధమత స్థల ఆనవాళ్ళు ఉన్నట్లు గుర్తించారు. 200 అడుగుల విస్తీర్ణం, 12 అడుగుల ఎత్తు ఉన్న దీనిని కాసులదిబ్బ అనిపిలుస్తున్నారు. ఇక్కడ నీటిగుంతలకోసం త్రవ్వడంతో ఇత్తడిసామాగ్రి, స్థూపానికి సంబంధించిన కొన్ని ఆధారాలు లభించినవి. ఒకప్పుడు ఇక్కడ మహా వెలుగు వెలిగిన బౌద్ధస్థూపం ఉన్నట్లు, తరువాత కాలగర్భంలో కలిసిపోయి, ఇక్కడ వీరభద్రస్వామి, కోదండరామస్వామి ఆలయాల నిర్మాణం జరిగినట్లు తెలియుచున్నది. [7]

వేటపాలెం 11.6 కి.మీ, నాగులుప్పలపాడు 16.8 కి.మీ, చీరాల 19.4 కి.మీ, ఇంకొల్లు 17.3 కి.మీ.

శ్రీ వీరభద్రస్వామివారి ఆలయం.

శ్రీ కోదండస్వామివారి ఆలయం.

వరి, అపరాలు, కాయగూరలు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మోటుపల్లి గ్రామ పంచాయతీ యానాదిసంఘంలో, 2015, ఏప్రిల్-30వతేదీనాడు, సింహవాహనంపై ఉన్న, లోహంతో చేసిన కనకదుర్గమ్మ ప్రతిమ బయటపడినది. [6]

[4] ఈనాడు ప్రకాశం; 2013, జూలై-11; 8వపేజీ.
[5] ఈనాడు ప్రకాశం; 2013, జూలై-25; 8వపేజీ.
[6] ఈనాడు ప్రకాశం; 2015, మే-2; 15వపేజీ.
[7] ఈనాడు ప్రకాశం; 2015, డిసెంబరు-12; 8వపేజీ.




#Article 193: వెంకటగిరి (442 words)


వెంకటగిరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఒక చారిత్రక పట్టణము, అదే పేరు గల మండలం. పిన్ కోడ్ నం. 524 132. 

జనాభా లెక్కల ప్రకారం 2001 నాటికి 48,341 మంది వున్నట్లు సమాచారం. వెంకటగిరి ఆక్ష్యరాస్యత 67%. ఇది దేశ అక్షరాస్యత కంటే 8% ఎక్కువ. 
వెంకటగిరి భౌగోళికాంశాలు, అక్షాంశ రేఖాంశాలు .

వెంకటగిరి చరిత్ర కలిగిన ముఖ్య పట్టణము. మద్రాసు రాష్ట్రములో భాగమైన వెంకటగిరి సంస్థానమును వెలుగోటి వంశమునకు చెందిన వెలుగోటి రాయుడప్ప నాయని 1600లో స్థాపించెను.
కుటుంబ రికార్డుల ప్రకారం, చెవిరెడ్డి అనే జమీందారు, తన పొలం దున్నుతుండగా 9 లక్షల ఖజానా దొరికింది. ఈ ధనంతో, వరంగల్ రాజు యొద్దకు మార్గము సుగమమం చేసుకుని అతన్ని ప్రసన్నం చేసుకొని వెంకటగిరి కోట అధికారాన్ని పొందగలిగాడు. ఇతని వారసులు వెంకటగిరి జమీందారులుగా వెలుగొందుతూ వచ్చారు. 1802 లో లార్డ్ క్లైవు కాలంలో సనద్ ను పొందారు. తమ వంశం జమీందార్లు రాజా అనే బిరుదును వాడుతూ వచ్చారు.

వెంకటగిరి జమీందారుల పూర్వీకుడైన యాచమనాయుడు 1614లో రెండవ తిరుమల దేవరాయల తర్వాతి విజయనగర సామ్రాజ్య వారసత్వంపై జరిగిన పోరాటంలో తిరుమల దేవరాయలు వారసునిగా నిర్ణయించిన శ్రీరంగరాయలకు అనుకూలంగా పోరాడారు. వారసత్వపు తగాదాల్లో జగ్గరాయుడు అనే రాచబంధువు శ్రీరంగరాయల కుటుంబాన్ని అంతా చంపేసినా, రంగరాయల కుమారుడు కుమారుడైన రామదేవరాయలను సింహాసనంపై నిలిపారు.

మద్రాసు రాష్ట్రములో భాగమైన వెంకటగిరి సంస్థానమును వెలుగోటి వంశమునకు చెందిన వెలుగోటి రాయుడప్ప నాయని 1600లో స్థాపించెను. అతని వారసులు :

వెంకటగిరి అనే గ్రామనామం వెంకట అనే పూర్వపదం, గిరి అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. గిరి అనే పదం పర్వతసూచి, దీనికి కొండ అనే అర్థం వస్తోంది. వెంకట అనేది దైవ సూచి, శ్రీనివాసుని మరో పేరు వెంకట.

కలిమిలి నామదేయంతో రాజ్యపాలన చేస్తున్న చంద్రగిరి రాజైన వెంకటపతి రాజు మామ గొబ్బూరి జగ్గరాజును కర్నూలు జిల్లా వెలుగోడు పాలకులు, శ్రీకృష్ణ దేవరాయ ప్రతినిధి అయిన వెలుగోటి వెంకటాద్రి నాయుడు గొబ్బూరి జగ్గరాజును దాడిచేసి కలిమిలి నుంచి వెళ్లగొట్టారు. తరువాత ఈచోటనే వైష్ణవ నామధేయమైన వెంకటగిరి పేరుతో కిశకం 1600 పూర్వం రాజ్య నిర్మాణం జరిగింది. వెంకటగిరి సంస్ధాధీశులు, కాకతీయుల లాగా పోలేరమ్మను ఇలవేల్పుగా భావించలేరు. అందువల్ల వెంకటగిరి సంస్ధానాధీశులు ఏ రీతిగా పోలేరమ్మకు జాతర చేస్తున్నారో తెలుసుకోవడం సందర్భోచితం.

వెంకటగిరి సంస్ధానం మాలవాడైన రేచడు బలిదానంతో కీశకం 1170 - 1210 ప్రాంతంలో తెలంగాణాలోని నల్గొండ జిల్లా ఆమనగల్లులో తొలి రాజ్యస్ధాపన జరిగింది. వెంకటగిరి సంస్ధానాదీశుల మూల పురుషుడు చెవిరెడ్డి. ఇతని పేరుతోనే వెంకటగిరిలో చెవిరెడ్డిపల్లి గ్రామం ఉంది. ఇతడు బేతాళుని అంశంతో ధన, ధాన్యరాశులు పొందటానికి సేద్యగాడైన రేచడు బలికావడం జరిగింది. తన బలికావడానికి ముందు చెవిరెడ్డి కొన్ని కోరికలు కోరడం జరిగింది. వాటిలో భాగమే తన పేరుతో వెంకటగిరి సంస్ధానాదీశులు గోత్రం ఏర్పాటుచేయడం, సంస్ధానాదీశుల వారసుల వివాహాల సందర్భంగా రేచడి జాతి వారికి వివాహం జరిపించి వారి అక్షింతలు చల్లుకోవడంతోపాటు తన ఇలవేల్పు, ఇష్ట దైవమైన పోలేరమ్మకు జాతర జరిపించేటట్లుగా వరం కోరినట్లుగా తెలుస్తున్నది. అందువల్లనే వెంకటగిరి సంస్ధానాదీశులు కీ.శ. 1601 ప్రాంతంలో నేటి బాలాయపల్లి మండలంలోని మన్నూరు గ్రామానికి యాచసముద్రం అనే పేరు పెట్టడం జరిగింది.1992 నుండి పోలేరమ్మ గుడి దేవాదాయ శాఖ పరిధిలోకి రాబడి, వారి ఆధ్వర్యంలో జాతర జరుగుతున్నది. ‘‘ గ్రామశక్తి పోలేరమ్మ జాతర చరిత్ర ’’ పేరుతో ప్రముఖ న్యాయవాధి, పరిశోధకులు పెనుబాకు వేణు 2003వ సంవత్సరంలో రచించి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇది ఎందరో పరిశోధకులకు, విద్యార్థులకు జాతర ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. రచయిత పెనుబాకు వేణు కలం నుండి నెల్లూరుజిల్లా గ్రామనామ నిఘంటువు, అక్షర రూపం దాల్చనున్నది.

వెంకటగిరి

వెంకటగిరి పట్టణం పట్టుచీరలకు ప్రసిద్ధి.

ఈ ఆలయం స్థానిక మసీదు వీధిలో ఉన్నది. 

పోలేరమ్మ జాతరకు చాలా ప్రసిద్ధి. ఈ ముఖ్య పట్టణము లోని ప్రజలు ప్రతి సంవత్సరం పోలేరమ్మ జాతర చాలా భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుకుందురు. ఈ జాతర ప్రతి సంవత్సరం వినాయక చవితి తరువాతి 3వ బుధవారం, గురువారం న జరుపుకుంటారు.

ఈ పట్టణమునకు దగ్గర లో రేణిగుంట వద్ద తిరుపతికి అంతర్జాతీయ విమానశ్రయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాక ఇక్కడ అనేక పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు.




#Article 194: మంజీరా నది (262 words)


మంజీరా (; ), గోదావరి యొక్క ఉపనది. మహారాష్ట్రలో దీనిని మాంజ్రా లేదా మాంజరా అని కూడా వ్యవహరిస్తారు. ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. మహారాష్ట్రలోని బీఢ్ జిల్లా, పటోడా తాలూకాలోని బాలాఘాట్ పర్వతశ్రేణి యొక్క ఉత్తరపు అంచుల్లో 823 మీటర్ల ఎత్తున పుట్టి, గోదావరి నదిలో కలుస్తుంది. ఈ నది యొక్క పరీవాహక ప్రాంతం 30,844 చ.కి.మీ.లు

మంజీరా నది సాధారణంగా తూర్పు, ఆగ్నేయంగా మహారాష్ట్రలోని ఉస్మానాబాద్, కర్ణాటకలోని బీదర్, తెలంగాణలోని మెదక్ జిల్లాల గుండా 512 కిలోమీటర్లు ప్రవహించి, సంగారెడ్డి వద్ద దిశను మార్చి ఉత్తరంగా ప్రవహిస్తుంది. ఆ దిశగా మరో 75 కిలోమీటర్లు ప్రవహించి నిజామాబాదు జిల్లాలో ప్రవహిస్తుంది. 102 కిలోమీటర్ల దిగువ నుండి ఇది మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుగా ఉంది. ఈ నది యొక్క జన్మస్థానం నుండి గోదావరిలో కలిసే దాకా మొత్తం 724 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. 823 మీటర్ల ఎత్తు నుండి 323 మీటర్లకు దిగుతుంది. మంజీరా నది యొక్క ప్రధాన ఉపనదులు, తిర్నా నది. ఘర్నీ, దేవన్ నది, తవర్జా, కారంజ నది, హలయి, లెండీ, మనర్ నది. ఉపనదులతో సహా మంజీరా నది యొక్క మొత్తం పరీవాహక ప్రాంతం 30,844 చ.కి.మీ.లు. పరీవాహక ప్రాంతంలో సాలీనా 635 మి.మీ.ల వర్షపాతం కురుస్తుంది. పరీవాహక ప్రాంతం మహారాష్ట్రలో 15,667 చ.కి.మీ.లు కర్ణాటకలో 4,406 చ.కి.మీ.లు, తెలంగాణలో 10,772 చ.కి.మీ.లు విస్తరించి ఉంది.

ఈ నది మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో ప్రవహించి, నైరుతి దిక్కునుండి నిజామాబాదు జిల్లాలో ప్రవేశించి, రెంజల్‌ మండలములోని కందకుర్తి గ్రామం వద్ద గోదావరిలో కలుస్తుంది. మంజీరానది పై, ఇదివరకటి బాన్స్‌వాడ బ్లాక్‌ లోని అచ్చంపేట గ్రామం వద్ద నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణము జరిగింది. ఈ ప్రాజెక్టులో భాగముగా 35 M.V.A.ల స్థాపక సామర్ధ్యము కలిగిన జలవిద్యుత్‌ కేంద్రము కూడా ఉంది.

మంజీరా నది యొక్క నీటిని వినియోగించుకోవటానికి మొట్టమొదట నిర్మించిన ప్రాజెక్టు మెదక్ జిల్లాలోని ఘన్‌పూర్ ఆనకట్ట. ఈ ఆనకట్ట ద్వారా నీటిని మళ్ళించి మెదక్ జిల్లాలోని ఐదు వేల ఎకరాలకు నీరు అందించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కుడి కాలువ (మహబూబ్ నహర్)ను కూడా నిర్మించారు. 1904లో నిర్మించబడిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 18 లక్షల రూపాయలు ఖర్చయ్యింది. ఆ తరువాత ఈ ప్రాజెక్టు మరింతగా సద్వినియోగ పరచుకొనేందుకు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహాదుర్ ఎడమ కాలువ (ఫతే నహర్)ను నిర్మించాడు. ఘన్‌పూర్ ఆనకట్ట యొక్క ప్రస్తుత ఆయకట్టు 30 వేల ఎకరాలు.




#Article 195: ఆలంపూర్ (193 words)


అలంపూర్,  తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ మండలానికి చెందిన గ్రామం.

ఇది సమీప పట్టణమైన కర్నూలు నుండి 25 కి. మీ. దూరంలో ఉంది

ఆలంపూర్లో భూ వినియోగం కింది విధంగా ఉంది:

వరి, జొన్న

ఇది ఒక చారిత్రక ప్రాధాన్యం గల ప్రదేశం.ఇక్కడ ఏడవ శతాబ్దానికి చెందిన ప్రాచీన నవబ్రహ్మ ఆలయం ఉంది. భారతదేశంలోని 18 శక్తిపీఠాలలో ఇది ఒకటి. ఇది హైదరాబాదు నకు సుమారుగా రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా భావింపబడింది. (సిద్ధవటం, త్రిపురాంతకం, ఉమామహేశ్వరంలు దక్షిణ, తూర్పు, ఉత్తర ద్వారాలుగా భావింపబడినాయి). తుంగభద్ర, కృష్ణా నదులు అలంపూర్ కు దగ్గరలో కలుస్తాయి. ఇక్కడి తొమ్మిది నవ బ్రహ్మ దేవాలయములు కూడా శివాలయాలే

అలంపురం సమీపంలో కృష్ణ, తుంగభద్ర నదులు సంగమించడం వల్ల ఈ ప్రాంతాన్ని దక్షిణకాశీగా అభివర్ణిస్తూ ఉంటారు. అలనాటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలుకు 27 కిలో మీటర్ల దూరంలో ఉంది. మహబూబ్‌నగర్‌కి 90 కిలోమీటర్ల దూరంలోనూ, హైదరాబాద్‌కి 200 కిలో మీటర్ల దూరంలోనూ నెలకొని ఉన్న అలంపురం అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవది. అలాగే, ఈ క్షేత్రంలో నవ బ్రహ్మలు కొలువై ఉన్నారు. క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో బాదామీ చాళుక్యులు ఈ ఆలయాలను నిర్మించారు. అలంపూర్ చుట్టూ నల్లమల అడవులు వ్యాపించి ఉన్నాయి. తుంగభద్ర నది ఎడమ గట్టున అలంపూర్ ఆలయం ఉంది. శాతవాహన, బాదామీ చాళుక్యులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యాధిపతులు, గోల్కొండకి చెందిన కుతుబ్‌ షాహీ ల కాలంలో ఈ ఆలయం అభివృద్ధి చెందింది. అలంపురాన్ని పూర్వం హలంపురంగానూ, హటాంపురంగానూ వ్యవహరించేవారని క్రీస్తు శకం 1101 సంవత్సరం నాటి శాసనం తెలియజేస్తోంది. ఈ శాసనం పశ్చిమ చాళుక్య రాజు త్రిభువనమల్ల విక్రమాదిత్య-4 కాలం నాటిది. జోగులాంబ, బ్రహ్మేశ్వరస్వామి వార్ల ఆలయాలు చారిత్రక ప్రసిద్ధి చెందినవి.




#Article 196: మాచర్ల (530 words)


మాచర్ల, గుంటూరుకు 110 కి.మీ. దూరంలోను, నాగార్జునసాగర్‌కు 25 కి.మీ. దూరంలో ఉన్న ఒక పట్టణం.ఈ పట్టణం హైదరాబాదు నుండి 160 కి.మీ. దూరంలో ఉంది. వివిధ ప్రాంతాల నుండి మాచర్లను కలుపుతూ రోడ్డు మార్గాలు, రైలు మార్గం (గుంటూరు-మాచర్ల రైలు మార్గం) ఉన్నాయి. ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులే కాక, ప్రైవేటు బస్సులు కూడా నడుస్తూ ఉన్నాయి.ఈ పట్టణంలో హైహవ రాజుల కాలంలో నిర్మించిన చెన్నకేశవస్వామి దేవాలయం ఉంది.పురాతన కాలములో దీనిని మహాదేవిచర్ల అని పిలిచేవారు. ఇక్కడ జరిగే వార్షిక ఉత్సవం చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో ఇక్కడికి  దూరప్రాంతాాల నుండి  యాత్రికులూ, భక్తులూ వస్తుంటారు. ఈ దేవాలయం 12-13 వ శతాబ్దాలలో నిర్మించబడింది. ఈ దేవాలయము ఎదురుగా ఓ పెద్ద ధ్వజస్తంభం చెక్కతో చేయబడి ఇత్తడితో కప్పబడినదై వెలుగొందుతుంది. గుడికి ఎదురుగా నాలుగు స్తంభాల మంటపాలు ఉన్నాయి.

క్రీ.శ. 1182 లో పలనాటి యుద్ధంగా పేరొందిన దాయాదుల పోరు మాచర్ల, గురజాల పట్టణాల మధ్య జరిగింది. ఈ యుద్ధం పల్నాటి హైహయ వంశంతో పాటు తీరాంధ్రలోని రాజవంశాలన్నింటినీ బలహీనపరచి కాకతీయ సామ్రాజ్య విస్తరణకు మార్గం సుగమం చేసింది. హైహయరాజుల కాలంలో ఈ ప్రాంతంలో గొప్పచెరువు వుండేదని, దానిమధ్యలో మహాదేవి ఆలయం వుండడం వలన ఈ ప్రాంతానికి మహాదేవిచర్ల అనే పేరు వాడుకలో మాచర్లగా రూపాంతరం చెందిందని చరిత్రకారుల కథనం. తరువాతికాలంలో బ్రహ్మనాయుడు మలిదేవరాజుకి పల్నాటిరాజ్యంలో కొంతభాగమిప్పించి, గురజాలనుండి విడిపోయి మాచర్ల రాజధానిగా పాలింపజేశాడు.

మాచర్ల, చుట్టు పక్కల గల గ్రామాలకు  చెప్పుకోదగ్గ విద్యాకేంద్రం. ప్రాథమికి విద్య నుండి ఇంజనీరింగ్ విద్య వరకూ చదువుకునే సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడి ముఖ్యమైన విద్యా సంస్థలు:

దేవళ్ళమ్మ చెరువు:- పట్టణంలోని 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చెరువు, 58 ఎకరాలలో విస్తరించియున్నది. 1950 వరకు ఈ చెరువు కేవలం మంచినీటి చెరువుగానే ఉపయోగపడినది సాగర్ కుడి కాలువలు నిర్మాణం జరుగక ముందు, ఈ చెరువు పల్నాడులోనే ఒక పెద్ద త్రాగునీటి చెరువుగా గుర్తింపు పొందినది. సాగర్ కాలువ వచ్చిన తరువాత నిరాదరణకు గురై, ప్రస్తుతం ఆక్రమణల పాలై, క్రమేణ కుంచించుకు పోతున్నది. [9]

స్థానిక రోప్ లైన్ కాలనీలో ఉన్న ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం, 2015,ఆగస్టు-14వ తేదీ శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శనివారం ఉదయం నుండియే భక్తులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. మద్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించారు. 

ఈ ఆలయం అతి పురాతనమైనది. ఈ ఆలయం, శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం ప్రక్కన ఉంది. ఈ దేవాలయం గోడలమీద పురాతన కాలంలో చెక్కిన శిల్పసంపద దాగి ఉంది. [7]

ఈ ఆలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని, ప్రతి సంవత్సరం, స్వామివారి బ్రహ్మొత్సవాలు, వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి రోజూ స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో స్వామివారు ప్రతి రోజూ ఒక్కో అవతారంలో దర్శనమిస్తారు. [3]

ఈ ఆలయంలో 2016,అక్టోబరు-16, ఆదివారంనాడు నూతనంగా నిర్మించిన శివపార్వతుల విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు. [11]

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, చైత్రమాసంలో స్వామివారి బ్రహ్మొత్సవాలు 15 రోజులపాటు వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి రోజూ స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. [4]

మాచర్ల పట్టణంలోని నెహ్రూనగరులో వేంచేసియున్న ఈ అలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను, 2015,మే నెల-23వ తేదీ శనివారంనాడు వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం నుండియే ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భగా స్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. [6]

పలనాడులో బ్రహ్మనాయుడు, మలిదేవుల పాలనకు పూర్వం, జైనులు ఈ ప్రాంతంలో ఓటిగూళ్లను కట్టించారు. మూలవిరాట్‌ లేకుండా దేవాలయం మాత్రమే ఉండే వాటిని ఓటిగుళ్లుగా పిలుస్తారు. ప్రస్తుతం మాచర్ల ఆదిత్యేశ్వర ఆలయంలో శిథిలమైన గుడిని ఓటిగుడిగా ప్రముఖ రచయిత గుర్రం చెన్నారెడ్డి తన పలనాటి చరిత్ర పుస్తకంలో రాశారు. దేవళమ్మ చెరువు సమీపంలోని కట్టడం కూడా ఓటిగుడిగా ఆయన పేర్కొన్నారు.

మాచర్ల పట్టణంలోని చంద్రవంక వాగు ఒడ్డున నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు, 2015,మే నెల-4వ తేదీ సోమవారం నుండి ప్రారంభమైనవి. సోమ, మంగళవారాలలో వేదపండితులు ప్రత్యేకపూజలు, యాగాలు నిర్వహించి, ఆరవ తేదీ బుధవారంనాడు, అమ్మవారి విగ్రహావిష్కరణ వైభవంగా నిర్వహించారు. [4]

మాచర్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీచెన్నకేశ్వస్వామివారి ఆలయ సమీపంలో నెలకొనియున్న ఈ ఆలయంలో, ఆలయ పునరుద్ధరణ, కలశ స్థాపన వేడుకలు, 2017,జూన్-4వతేదీ ఆదివారం ఉదయం 8-59 కి ప్రత్యేకపూజా కార్యక్రమాల మధ్య, వైభవంగా నిర్వహించారు. [13]

పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు మూడురోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు. చివరి రోజున శ్రీ సువర్చలా సమేత శ్రీ వీరాంజనేయస్వామివారల కళ్యాణమహోత్సవం కన్నులపండువగా నిర్వహిస్తారు. అనంతరం స్వామివారికి గ్రామోత్సవం నిర్వహిస్తారు. [5]

మాచర్ల పాతూరులోని ఈ ఆలయంలో 2017,ఫిబ్రవరి-10వతేదీ శుక్రవారంనాడు, మాఘపౌర్ణమి సందర్భంగా, శ్రీ గోపయ్యస్వామి, శ్రీ తిరుపతమ్మ తల్లి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో భక్తులకు భారీగా అన్నసమారాధన నిర్వహించారు. [12]

ప్రత్తి, మిరప, వరి ప్రధాన వాణిజ్యపంటలు. నాణ్యమైన నాపరాయికి ఈ ప్రాంతంలోని క్వారీలు ప్రసిద్ధి. ఇక్కడి నుండి నాపరాయి ఇతర రాష్ట్రాలకూ,విదేశాలకూ ఎగుమతి అవుతుంది.




#Article 197: సిక్కిం (1114 words)


 సిక్కిం (Sikkim) భారతదేశపు హిమాలయ పర్వతశ్రేణులలో ఒదిగి ఉన్న ఒక రాష్ట్రము. భారతదేశంలో అన్ని రాష్ట్రాలకంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం. వైశాల్యంలో రెండవ చిన్న రాష్ట్రం (అన్నింటికంటే చిన్నది గోవా). 1975 వరకు సిక్కిం చోగ్యాల్ రాజ వంశీకుల పాలనలో ఉండే ఒక స్వతంత్ర దేశము. 1975లో ప్రజాతీర్పు (రిఫరెండం) ను అనుసరించి సిక్కిం భారతదేశంలో 22వ రాష్ట్రంగా విలీనమైంది. ఈ చిన్న రాష్ట్రానికి ఉత్తరాన నేపాల్, తూర్పున, ఉత్తరాన టిబెట్ (చీనా), ఆగ్నేయాన భూటాన్ దేశాలు అంతర్జాతీయ సరిహద్దులుగా ఉన్నాయి. దక్షిణాన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఉంది.

సిక్కిం అధికారిక భాష నేపాలీ. రాజధాని గాంగ్‌టక్ అన్నింటికంటే పెద్ద పట్టణం. హిందూమతము, వజ్రయాన బౌద్ధం ప్రధానమైన మతాలు. చిన్నదే అయినా సిక్కింలో పలువిధాలైన భూభౌతిక ప్రాంతాలన్నాయి. దక్షిణ ప్రాతం ఉష్ణమండల అరణ్యాలను పోలి ఉంటుంది. ఉత్తర ప్రాంతం టుండ్రాలలాగా ఉంటుంది ప్రపంచంలో 3వ ఎత్తైన శిఖరంగల కాంచనగంగ పర్వతం సిక్కిం, నేపాల్లలో విస్తరించి ఉంది. ఎంతో ప్రకృతి సౌందర్యాలను ఒనగట్టుకొన్నందువల్లా, ప్రశాంత రాజకీయ స్థిరత్వం వల్లా సిక్కిం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.

కాని తరువాత సిక్కింకు, బ్రిటిష్ఇండియావారికి మధ్య సంబంధాలు క్షీణించాయి. 1861 తరువాత సిక్కిం బ్రిటిషువారి అధీనంలో మన్నే దేశమైంది. 1947లో ప్రజాభిప్రాయం సిక్కింను భారతదేశంలో విలీనం చేయాలని వచ్చింది. కాని భారత ప్రధాని నెహ్రూ భారతదేశ రక్షణలో సిక్కిం స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడడానికి అంగీకరించాడు. మళ్ళీ ప్రజలలో ఉద్యమం బలపడింది. భారతదేశంలో విలీనం కావాలని 97.5% ప్రజలు తీర్పునిచ్చారు. 1975 మే 16న రాజరికం రద్దయి, సిక్కిం భారతదేశంలో విలీనమైంది. దీనిని అప్పటి చైనా గుర్తించలేదు. చివరకు 2003లో సిక్కింను భారతదేశంలో భాగంగా చూపెడుతూ చైనా అధికారికపటాన్ని విడుదల చేసింది.

సిక్కిం ప్రభుత్వ వ్యవస్థ భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో వలెనే - కేంద్రంచే నియమించ బడ్డ గవర్నరు, పాలనా బాధ్యత గల ముఖ్యమంత్రి, ఒక శాసన సభ, ఒక హైకోర్టు (దేశంలో అతి చిన్న హైకోర్టు) - ఇలా ఉంటుంది. సిక్కింలో 32 శాసనసభ నియోజక వర్గాలు, ఒక లోక్‌సభ, ఒక రాజ్యసభ నియోజక వర్గాలు ఉన్నాయి.

ఎక్కువగా పర్వతమయమైన సిక్కిం రాష్ట్రంలో వ్యవసాయానికి ఉపయోగపడే భూమి చాలా తక్కువ. కొద్ది కొండ వాలులు మాత్రం వ్యవసాయానికి అనుగుణంగా పైకప్పు వ్యవసాయం (టెర్రేస్ ఫార్మింగ్) కోసం మార్చబడ్డాయి. మంచునదులవల్ల కొన్ని లోతట్టులోయప్రాంతాలలో వ్యవసాయం జరుగుతున్నది. ముఖ్యంగా తీస్తా నది, దాని ఉపనదియైన రంగీత్ నది సిక్కిం ఆర్థిక వ్వస్థవకు చాలా కీలకమైనవి. దేశంలో మూడో వంతు దట్టమైన అరణ్యాలతో కూడి ఉంది.

ఉత్తరము, తూర్పు, పడమర దిశలలో బ్రహ్మాండమైన హిమాలయ పర్వతశ్రేణులు అర్ధచంద్రాకారంలో రాష్ట్రాన్ని చుట్టి ఉన్నాయి. దక్షి భాగంలోనే ఎక్కువ జనావాసమైన ప్రదేశాలున్నాయి. మొత్తంమీద రాష్ట్రంలో 28 పర్వత శిఖరాలు, 21 హిమానీనదాలు (గ్లేషియర్స్), 227 ఎత్తైన ప్రాంతపు సరసులు, 5 ఉష్ణజలపు ఊటలు, 100కు పైగా నదులు, ఏరులు ఉన్నాయి. సరస్సులలో త్సోంగ్మో సరసు, ఖెంచియోపల్రి సరసు ముఖ్యమైనవి. రాష్ట్రాన్ని టిబెట్, భూటాన్, నేపాల్లతో కలుపుతూ 8 పర్వతలోయ మార్గాలున్నాయి.

సిక్కిం దక్షిణాన (ఎక్కువ జనావాసమైన ప్రాంతంలో) సమఉష్ణమండలం వాతావరణం ఉంటుంది . క్రమంగా ఉత్తరానికి వెళ్లేసరికి టుండ్రా వాతావరణం ఉంటుంది. సరాసరి ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలు సెంటీగ్రేడ్. చలికాలంలో మంచు కురుస్తుంది. వర్షాకాలంలో వర్షపాతం చాలా ఎక్కువ. ఒకసారి 11రోజులు అవిరామంగా వర్షం కురిసింది. వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం బాగా ఎక్కువ. ఉత్తర ప్రాంతంలో మైనస్ 40 డిగ్రీల సెంటీగ్రేడు కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది.

సిక్కిం దిగివ హిమాలయాల యొక్క ప్రకృతివనాలలో ఉంటుంది మూడు భారతదేశ పర్యావరణప్రాంతాలలో ఇది ఒకటి. అడవులు కలిగి ఉన్న ప్రాంతాలలో వివిధ రకాల జంతువులు మరియూ చెట్లూ చేమలూ ఉన్నాయి. రాష్ట్రం మొత్తం ఎత్తుపళ్లాలుగా ఉండటం వలన ఉష్ణమండలంలో కనిపించే చట్లూచేమలతో పాటుగా శీతల ప్రదేశాలలో పెరిగే మొక్కలు కూడా మనకు కనపడతాయి. ఇంత చిన్న ప్రాంతములో ఇంత వైవిధ్యాన్ని ప్రదర్శించే అతి కొన్ని ప్రాంతాలలో ఇది ఒకటి.

ర్హోడోడెన్డ్రాన్ సిక్కిం రాష్ట్ర చెట్టు. ఇది సిక్కింలోని అన్ని ప్రదేశాలలో (ఎత్తులలో) పెరుగుతుంది, ఆయా ప్రదేశాలలో లభించే ఉష్నోగ్రతల తేడాలతో ఈ చెట్టు యొక్క జాతులు కూడా మారతాయి. ఆర్కిడ్లు, అత్తిచెట్లు, లారెల్, అరటి, సాల్ చెట్లు, వెదురు సిక్కింలోని తక్కువ ఎత్తు ఉన్న ప్రదేశాలలో పెరుగుతాయి, ఈ చెట్లకు ఓ మాదిరి ఎండా తగలాలి. కొచెం ఎత్తు ఉన్న ప్రదేశాలలో 1500 మీటర్ల నుండి మొద్లుకొని ఓక్, చెస్ట్నట్ మాపెల్, బిర్చ్, ఆల్డర్ మరియూ మాగ్నోలియా వంటి చెట్లు పెద్ద సంఖ్యలో కనపడతాయి. బాగా ఎత్తైన ప్రదేశాలలో (3500 నుంచి 5000 మీటర్లు) జునిపర్, పైను, ఫిర్, సైప్రస్ మరియూ ర్హోడోడెన్డ్రాన్స్ పెరుగుతాయి. సిక్కింలో 5,000 కు పైగా పుష్పించే మొక్కలు, 515 అరుదైన ఆర్కిడ్లు, 60 ప్రిమ్యులా స్పీసీస్లు, 36 రోడోడెండ్రాన్ స్పీసీస్లు, 11 ఓక్ చెట్టు రకాలు, 23 వెదురు రకాలు, 16 కోనిఫర్ స్పీసీస్లు, 362 రకాల ఫెర్న్‌లు, ఫెర్న్ సంబంధిత మొక్కలు, 8 చెట్టు ఫెర్న్లు, 424 రకాలకు పైగా ఔషధ మూళికలు ఉన్నాయి.

ఇక్కడ కనిపించే వన్యమృగాలలో మంచు చిరుత, కస్తూరి జింక, భోరల్, హిమాలయ థార్, ఎర్ర పాండా, హిమాలయ మర్మోట్, సెరోవ్, గోరల్, మొరిగే జింక సాధారణ లాంగుర్, హిమాలయాల నల్ల ఎలుగుబంటి, మచ్చల చిరుత, మార్బల్డ్ పిల్లి, చిరుత పిల్లి, అడవి కుక్క, టిబెట్ తోడేలు, హాగ్ బాడ్గర్, బింటూ-రాంగ్, అడవి పిల్లి, సివెట్ పిల్లి. ఆల్పైన్ ప్రాంతములో సాధారణంగా కనిపించే జంతువులలో జడల బర్రెలను (యాక్‌) ప్రధానంగా పాల కోసం, మాంసం కోసం, గాడిద లాగ బరువులు మోయించడానికి ఉపయోగిస్తారు.

సిక్కిం యొక్క పక్షిసంపదలో లింపేయన్ ఫీసంట్, ఎర్రకొమ్ముల ఫీసంట్, మంచు పాట్రిడ్జ్, మంచు కోడి, లామ్మెర్గేయర్ మరియూ గ్రిఫ్ఫన్ వాల్చర్లు, వీటితోపాటుగా బంగారు గ్రద్దలు, కవుజులు, ప్లోవర్లు, వుడ్కాక్లు, స్యాం పైపెర్లు, పావురాలు, ఫ్లైకాచర్లు, బ్లాబ్బర్లు మరియూ రాబిన్లు కనపడతాయి. సిక్కిం మొత్తమ్మీద 550 పక్షుల స్పీసీస్లు నమోదయ్యాయి. అందులో కొన్ని అంతరించిపోతున్న ప్రాణులుగా ప్రకటించబడ్డాయి.

సిక్కిం ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి ఉంది. ఏలకులు, నారిజకాయలు, యాపుల్పళ్ళు, తేయాకు, ఆర్చిడ్ పూలు ముఖ్యమైన వ్యవసాయోత్పత్తులు. భారతదేశంలో ఏలకుల ఉత్పత్తిలో సిక్కిందే అగ్రస్థానము. పర్వతమయమైన నేలకావడంవల్లా, రవాణా ఇబ్బందులవల్లా పరిశ్రమలు చాలా తక్కువ. మద్యంతయారీ, చర్మం ఉత్పత్తులు, వాచీలు వంటి కొద్ది పరిశ్రమలు దక్షిణాన మెల్లీ, జోర్థాంగ్ ప్టణాలలో ఉన్నాయి. కాని పారిశ్రామికంగా 8.3 % వృద్ధితో సిక్కిం మంచి అభివృద్ధి సాధిస్తున్నది.

ఇటీవలి కాలంలో పర్యాటక రంగంపై శ్రద్ధ, పెట్టుబడులు పెరిగాయి. ఇందుకు సిక్కింలో ఎన్నో ఆకర్షణలున్నాయి. ఇంకా సిక్కింలో రాగి, డోలోమైట్, సున్నపురాయి, గ్రాఫైటు, మైకా, ఇనుపు, బొగ్గు ఖనిజాలు త్రవ్వబడుతున్నాయి. లాసా (టిబెట్) తో కలిపే నాథులా పర్వతమార్గం 1962 భారత్-చైనా యుద్ధం తరువాత మూసివేయబడింది. దీన్ని తిరిగి వినియోగించడం మొదలుపెడితే వాణిజ్యం బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

సిక్కింలో 4 జిల్లాలన్నాయి - తూర్పు సిక్కిం (రాజధాని: గాంగ్టక్), పశ్చిమ సిక్కిం (రాజధాని: గేజింగ్), ఉత్తర సిక్కిం (రాజధాని: మంగన్), దక్షిణ సిక్కిం (రాజధాని: నమ్చి). దేశంలో అన్ని జిల్లాల లానే పాలనా పద్ధతులు ఉన్నాగాని, సరిహద్దురాష్ట్రమైనందున ఎక్కువ ప్రాతంలో భారతసైన్యానికి గణనీయమైన పాత్ర, అధికారాలు ఉన్నాయి.

'లెప్చా' తెగలవారు సిక్కింలో పురాతనకాలం నుండి నివాసముంటున్నవారు. 'భూటియా'లు (భూటాన్ నుండి వలస వచ్చిన వారు), 'దమాయ్'లు కూడా స్థానికులే అని చెప్పవచ్చును . కాని 19వ శతాబ్దంలో వలసవచ్చిన నేపాలీలు సిక్కింలో అత్యధిక జనాభా గల జాతి. ఇంకా మార్వాడీలు, బీహారీలు, బెంగాలీలు వ్యాపార, ఉద్యోగాలలో ఎక్కువగా ఉన్నారు.

హిందూమతం, బౌద్ధమతం ప్రధాన మతాలు. కొద్దిపాటి క్రైస్తవులు, చాలాకొద్దిమంది మహమ్మదీయులు ఉన్నారు. సిక్కింలో ఎప్పుడూ మత ఘర్షణలు జరుగలేదు.

నేపాలీ భాష ఎక్కువగా మాట్లాడుతారు. హిందీ, ఇంగ్లీషు, సిక్కిమీస్, లెప్చా, లిమ్బూ, బెంగాలీ భాషల వినియోగం కూడా గణనీయం.

మొత్తం సిక్కిం జనాభా 5,40,493 (భారతదేశంలో అతి తక్కువ జనాభా గల రాష్ట్రం) - ఇందులో పురుషులు 2,88,217 - స్త్రీలు 2,52,276. చదరపు కిలోమీటరుకు 76 మంది జనాభా మాత్రమే ఉంది. రాజధాని గాంగ్టక్ జనాభా 50,000. సగటు తలసరి ఆదాయం 11,356 రూపాయలు. ఇది భారతదేశంలో బాగా ఎక్కువ స్థానంలో ఉంది.

సిక్కింలో దీపావళి, దసరా వంటి హిందువుల పండుగలు, లోసార్, లూసాంగ్, సగదవా, ల్హబాబ్, డ్యూచెన్, ద్రుప్కాతెషి, భుమ్చు వంటి బౌద్ధుల పండుగలు, ఇంకా క్రిస్టమస్, ఆంగ్లనూతన సంవత్సరాది - ఈ ఉత్సవాలన్నీ జరుపుకుంటారు. పాశ్చాత్య సంగీతము, హిందీ సినిమా పాటలు, స్థానిక నేపాలీ గీతాలూ కూడా జనప్రియమైనవి. 

నూడిల్స్ తో వండే వంటకాలు - తుప్కా, చౌమెయీన్, తంతుక్, ఫక్తూ, గ్యాతుక్, వాంటొన్ - ఎక్కువగా తింటారు. కూరగాయలు, మాంసము వాడకం కూడా ఎక్కువ. ఎక్సైజ్ పన్నులు తక్కువైనందున మద్యం చౌక, వఅడకం కూడా బాగా ఎక్కువ.

సిక్కింలో ఎక్కువ ఇండ్లు వెదురుతో చేయబడుతాయి. పైన పేడతో అలుకుతారు గనుక చలికాలం లోపల వెచ్చగా ఉంటుంది.

పక్యోంగ్ విమానాశ్రయం సిక్కిం రాష్ట్ర రాజధాని గాంగ్టక్ సమీపంలోని పకియోంగ్ పట్టణంలో గ్రీన్ ఫీల్డ్ ఆర్.సి.ఎస్ విమానాశ్రయం, రైలు మార్గాలు లేవు. పొరుగు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి విమానాశ్రయం గాంగ్టక్కు 124 కి.మీ. దూరంలో ఉంది. అక్కడికీ, బాగ్డోగ్రాకూ హెలికాప్టర్ సర్వీసున్నది. సిలిగురికి 16 కి.మీ. దూరంలోని 'క్రొత్త జల్పాయ్‌గురి' సిక్కింకు దగ్గరలోని రైలు స్టేషను. సిలిగురినీ గాంగ్‌టక్ నూ కలుపుతూ జాతీయ రహదారి (National Highway 31A) ఉంది.

అధిక వర్షాల వల్లా, హిమపాతాల వల్లా, కొండ చరియలు పడడం వల్లా సిక్కిం రహదారులు కొన్ని తరచూ చెడిపోతూ ఉంటాయి. చాలా రహదారుల బాధ్యత భారతసైన్యానికి సంబంధించిన సరిహద్దు రోడ్ల సంస్థ (Border Roads Organisation) నిర్వహిస్తుంది. 1857 కి.మీ. రోడ్లు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీలో ఉన్నాయి.

సిక్కింలోని అధిక వర్షపాతం వల్లా, అనేక నదుల వల్లా ణిటి సదుపాయం పుష్కలంగా ఉంది. ఎన్నో జల విద్యుత్కేంద్రాలున్నాయి.

అక్షరాస్యత 69.68% - అందులో మగవారిది 76.73%, మహిళలలో 61.46%. మొత్తం 1545 ప్రభుత్వ విద్యా సంస్థలు, 18 ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నాయి. 12 ఉన్నత విద్యా కేంద్రాలున్నాయి. వాటిలో సిక్కిం మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాగా పెద్ది. . చాలా మంది విద్యార్థులు ఉన్నత విద్యకై పొరుగు రాష్ట్రంలోని సిలిగురి, కలకత్తా వెళుతుంటారు.

నేపాలీ పత్రికలు సిక్కింలో విరివిగా ప్రచురించబడుతాయి. ఇంగ్లీషు, హిందీ పత్రికలు పొరుగు రాష్ట్రాలనుండి ఎక్కువగా వస్తుంటాయి. 'సిక్కిం హెరాల్డ్' అనేది ప్రభుత్వం ప్రచురించే వార పత్రిక.

రాష్ట్రంలో ఒక ఆకాశవాణి (అల్ ఇండియా రేడియో) ప్రసార కేంద్రం ఉంది. దేశమంతటా లభించినట్లుగానే టెలివిజన్ కార్యక్రమాలు 'డిష్'లద్వారా లభిస్తాయి. అలాగే 'సెల్ ఫోను' సదుపాయాలున్నాయి. ఇంటర్నెట్ సదుపాయం పట్టణ ప్రాంతాలలోనే అధికంగా లభ్యం.




#Article 198: తమిళనాడు (788 words)


తమిళనాడు భారతదేశపు దక్షిణాన ఉన్న ఒక రాష్ట్రము. కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, పుదుచ్చేరిలు దీని సరిహద్దు రాష్ట్రాలు. తమిళనాడుకు ఆగ్నేయాన సముద్రంలో శ్రీలంక ద్వీపమున్నది. శ్రీలంకలో గణనీయమైన తమిళులున్నారు..తమిళనాడు అధికార భాష తమిళ్.

తమిళనాడు రాజధాని చెన్నై. 1996కు ముందు దీని అధికారికనామము 'మద్రాసు'. ఇంకా కోయంబత్తూరు, కడలూరు, మదురై, తిరుచిరాపల్లి, సేలం, తిరునల్వేలి తమిళనాట ముఖ్యమైన నగరాలు.

తమిళనాడు బహుముఖంగా ప్రాముఖ్యత సంతరించుకున్న రాష్ట్రం. సంప్రదాయాలనూ, ఆధునికతనూ కలగలిపిన సమాజం. సాహిత్యము, సంగీతము, నాట్యము తమిళనాట ఈనాటికీ విస్తారమైన ఆదరణ కలిగి ఉన్నాయి. పారిశ్రామికంగానూ, వ్యాపార రంగంలో, సినిమా రంగంలో, వ్యవసాయంలో, విద్యలోనూ కూడా గణనీయమైన అభివృద్ధి సాధించింది. దేశరాజకీయాలలో తమిళనాడు కీలకమైన పాత్ర కలిగిఉన్నది.

తమిళనాడు ప్రాంత చరిత్ర 6000 సంవత్సరాలు పైగా పురాతనమైనది. సింధునదీలోయలో (హరప్పా, మొహంజొదారో) మొదట ద్రవిడుల నాగరికత పరిఢవిల్లిందనీ, తరువాత ఆర్యుల దండయాత్రల కారణంగా ద్రవిడులు దక్షిణప్రాంతానికి (ప్రస్తుత తమిళ, తెలుగు, కన్నడ, మలయాళీ ప్రాంతాలు) క్రమేపీ విస్తరించారని ఒక ప్రబలమైన వాదన. కానీ ఈ వాదనకు బలమైన వ్యతిరేకత కూడా ఉంది. ఏమయినా తమిళ సమాజం పట్ల చాలామంది అవగాహన 'ద్రావిడనాగరికత' అనే అంశం ఆధారంగా మలచబడింది.

తమిళనాడు, చుట్టుప్రక్కల ప్రాంతాలలో వేరువేరు కాలాలలో పల్లవ, చేర, చోళ, పాండ్య, చాళుక్య, విజయనగర రాజుల రాజ్యం సాగింది. దాదాపు అన్ని సమయాలలోనూ 'కొంగునాడు' (కోయంబత్తూరు, ఈరోడ్, కరూర్, సేలం ప్రాంతాలు) ఒక విశిష్టమైన స్వతంత్ర ప్రతిపత్తిని నిలుపుకొంది. వ్యవసాయ ప్రధానమైన ఈ ప్రాంతాలలో ఇప్పటికీ సాంస్కృతిక విలక్షణత కనుపిస్తుంది.

క్రీ.ఫూ. 6వ శతాబ్దములో మదురై, తిరునల్వేలి కేంద్రంగా కులశేఖరుడు స్థాపించిన పాండ్యరాజ్యం వర్ధిల్లింది. వారి కాలంలో గ్రీసు, రోములతో వాణిజ్య సంబంధాలు ఉండేవి.
తరువాత చేర రాజులు మలబారు తీర ప్రాంతం (ఇప్పటి కేరళ) లో రాజ్యమేలారు. ఇది సైనికంగా బలమైన రాజ్యం. వారికాలంలో రోముతో వాణిజ్యం మరింత అభివృద్ధి చెందింది.

మరల 9వ శతాబ్దంలో రాజరాజచోళుని నాయకత్వంలోను, తరువాత అతని కుమారుడు రాజేంద్రచోళుని నాయకత్వంలోను చోళుల రాజ్యం బలంగా విస్తరించింది. చోళుల సామ్రాజ్యం ఒడిషా, బెంగాలు, బీహారుల వరకు విస్తరించింది. తూర్పు చాళుక్యులను, చేరరాజులను, పాండ్యరాజులను ఓడించారు. లంక, అండమాన్-నికోబార్ దీవులు, లక్షద్వీపాలు, సుమత్రా, జావా, మలయా, పెగూ ద్వీపాలను చోళరాజులు తమ అధీనంలోకి తెచ్చుకొన్నారు. 13వ శతాబ్దం తరువాత చోళుల పాలన అస్తమించింది.

ఇక ఐరోపా వారి యుగం ఆరంభమైంది. 1609లో డచ్చివారు పులికాట్ వద్ద ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. 1639లో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ వారు మద్రాసులో స్థావరం నెలకొలిపారు. స్థానిక నాయకుల మధ్య తగవులు బ్రిటిష్ వారి విస్తరణకు మంచి అవకాశమిచ్చాయి. 1760లో ఫ్రెంచివారిని 'వందవాసి' (Wandywash war) యుద్ధంలోను, డచ్చివారిని 'తరంగంబడి' యుద్ధంలోను, తరువాత టిప్పు సుల్తానును మైసూరు యుద్ధంలోను ఓడించి, బ్రిటిష్ వారు దక్షిణభారతదేశంలో ఎదురులేని ఆధిపత్యాన్ని సాధించుకొన్నారు. అప్పటినుండి మద్రాసు ప్రెసిడెన్సీ రూపు దిద్దుకుంది.

వీరపాండ్య కట్టబొమ్మన, మారుతుస్, పులితేవన్ వంటి కొందరు పాలెగాళ్లు బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీనెదిరించి వీరోచితంగా పోరాడారు గాని ప్రయోజనం లేకపోయింది.

బ్రిటిష్ రాజ్యం కాలంలో విశాలమైన మద్రాసు ప్రెసిడెన్సీలో ఇప్పటి తమిళనాడుతోబాటు ఆంధ్ర, కర్ణాటక, కేరళలలోని కొన్నిభాగాలు కలసి ఉండేవి. 1947 లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అదే మద్రాసు రాష్ట్రమైనది. భాషా ప్రాతిపదికన 1953లో తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంగా విభజించారు. బళ్ళారి ప్రాంతం మైసూరు రాష్ట్రంలో కలుపబడింది. 1956లో మద్రాసు రాష్ట్రంలోని పశ్చిమభాగాలు కొన్ని కేరళ, మైసూరు (ఇప్పటి కర్ణాటక) రాష్ట్రాలలో కలుపబడ్డాయి.

అన్నాదురై నాయకత్వంలో 'ద్రవిడ మున్నేట్ర కజగం' (డి.యమ్.కె, DMK) పార్టీ 1956లో ఎన్నికలలోకి దిగింది. 1960 దశకంలో జరిగిన హిందీ వ్యతిరేక ఆందోళన సమయంలో డి.యమ్.కె బలం పుంజుకుంది. 1967లో కాంగ్రసును చిత్తుగా ఓడించి అధికారం కైవసం చేసుకుంది. 1969లో అన్నాదురై మరణించడంతో కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యాడు.

కరుణానిధి నాయకత్వంతో విభేదించిన సినీ నటుడు ఎమ్.జి.రామచంద్రన్ ( ఎమ్.జి.ఆర్, MGR)1972లో పార్టీనుండి విడిపోయి 'అఖిల భారత ద్రవిడ మున్నేట్ర కజగం' (AIADMK) స్థాపించాడు. 1977 నుండి 1987 వరకు ఎమ్.జి.ఆర్. ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 1987లో ఎమ్.జి.ఆర్. మరణానంతరం పార్టీలో సంక్షోభం ఏర్పడింది. కాని ఎమ్.జి.ఆర్. భార్య జానకి రామచంద్రన్ నాయకత్వంలోని భాగం నిలబడలేకపోయింది. జయలలిత నాయకత్వంలో ఎ.ఐ.డి.ఎమ్.కె. స్థిరపడింది.

మొత్తంమీద 1967 నుండి డి.ఎమ్.కె, ఎ.ఐ.డి.ఎమ్.కె. ఈ రెంటిలో ఏదో ఒక పార్టీ అధికారంలో ఉంటున్నది.

ఐనా తమిళనాడులో కాంగ్రెసు, బి.జె.పి, కమ్యూనిస్టులు వంటి జాతీయ పార్టీలు, పి.ఎమ్.కె., ఎమ్.డి.ఎమ్.కె వంటి ప్రాంతీయ పార్టీలు కూడా చెప్పుకోదగినంత ప్రాబల్యం కలిగి ఉన్నాయి. శ్రీ లంకలోని తమిళుల సమస్య కూడా తమిళనాడు రాజకీయాలపై గణనీయమైన ప్రభావం కలిగి ఉంది.

బొంబాయి (బాలీవుడ్) తరువాత చెన్నై భారతదేశంలో సినిమారంగానికి ముఖ్యమైన నిలయం. సినిమా రంగానికి సంబంధించిన సదుపాయాలు ఎక్కువగా 'కోడంబాకం' ప్రాంతంలో ఉన్నందున తమిళనాడు సినిమా రంగాన్ని 'కోలీవుడ్' అని చమత్కరిస్తారు. ఒకప్పుడు నాలుగు దక్షిణ భారత భాషలకూ మద్రాసే ప్రధాన సినిమా పరిశ్రమ కేంద్రం. ఇప్పుడు తక్కిన రాష్ట్రాలలో చిత్ర పరిశ్రమ వృద్ధి చెందునందువల్ల 'చెన్నై' ప్రాముఖ్యత కాస్త పలచబడింది. అయినా తమిళ సినీ రంగం, తెలుగు సినీ రంగం కుడి ఎడమగా ఉంటూ వస్తున్నాయి.

ఇక తమిళనాడు రాజకీయాలలో సినిమా ప్రభావం ప్రపంచంలో మరక్కడా లేనంత ప్రబలం. దాదాపు సినీపరిశ్రమ, రాజకీయ రంగం కలగలిపి ఉంటున్నాయి.

భారతదేశం ఆర్థిక వ్యవస్థలో తమిళనాడు మూడవ స్థానం ఆక్రమిస్తుంది. పారిశ్రామికంగానూ, వ్యాపార పరంగానూ తమిళనాడు బహుముఖంగా అభివృద్ధి చెందింది.

వస్త్రాలకు సంబంధించిన వ్వసాయోత్పత్తులు, యంత్రాలు, ముడి సరకులు, వస్త్రాల కర్మాగారాలు, చేనేత కార్మికులు కూడా తమిళనాడు ఆర్థికరంగంలో ముఖ్యమైన వనరులు. ఒక్క తిరుపూర్ పట్టణం నుండే 2004లో 5వేల కోట్ల విలువైన వస్త్రాలు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. ఇక్కడ 7,000 దుస్తుల పరిశ్రమలు 10 లక్షల కార్మికులకు ఉపాధి కల్పిస్తుంది.

చెన్నై చుట్టుప్రక్కల ఇంజినీరింగ్ ఉత్పత్తుల పరిశ్రమలు ఇతోధికంగా ఉన్నాయి. ఫోర్ద్, హ్యుండై, మిత్సుబిషి కారు ఫ్యాక్టరీలు, ఎమ్.ఆర్.ఎఫ్, టి.ఐ.సైకిల్స్, అశోక్ లేలాండ్, కల్పక్కం అణు విద్యుత్ కర్మాగారము, నైవేలి లిగ్నైట్ పరిశ్రమ, సేలం స్టీల్స్, మద్రాస్ సిమెంట్, టైటాన్ వాచెస్, తమిళనాడు పేపర్  పల్ప్, తోలు పరిశ్రమలు - ఇవి కొన్ని ముఖ్యమైన పరిశ్రమలు.

శివకాశి పట్టణం ముద్రణ, బాణసంచా, అగ్గిపెట్టెలు పరిశ్రమలకు భారతదేశంలో అగ్రగామి.

బెంగళూరు తరువాత చెన్నై రెండవ సాఫ్ట్వేర్ కేంద్రము.

ప్రభుత్వసేవలను కంప్యూటరీకరంచడంలో తమిళనాడు అగ్రగామి.

ఇంకా చెన్నై వైద్య, పరిశోధన, విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నది. ముఖ్యంగా ప్రాథమిక విద్యకు ప్రభుత్వధనం బాగా వినియోగింపబడుతూ ఉంది. 'బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం' అనే పధకం తమిళనాడులోనే ప్రారంభమైంది.

ఇక సామాజిక అంశాలలో వెనుకబాటు తనం కూడా కొన్ని విషయాలలో కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. వాఠిలో ఒకటి - కొన్ని ప్రాంతాలలో - ఆడ శిశువులను చంపివేయడం.

తమిళనాడు రాష్ట్రములో 30 జిల్లాలు ఉన్నాయి. ధర్మపురి జిల్లాను రెండుగా విభజించి క్రిష్ణగిరి ముఖ్యపట్టణముగా క్రిష్ణగిరి జిల్లా, 30వ జిల్లాగా యేర్పడినది. 

పొంగల్ (సంక్రాంతి) తమిళనాట ప్రధానమైన పండుగ. ఇంకా దీపావళి, విషు (తమిళ ఉగాది), దసరా, వినాయక చవితి కూడా జరుపుకుంటారు. అలాగే మహమ్మదీయ, క్రైస్తవ పండుగలు కూడా పెద్దయెత్తున జరుపబడతాయి. తమిళనాడులో ముఖ్యమైన కుంభాభిషేకం, తైపూసం, ఆడివెల్లి వంటి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.

వేలాంకిణి చర్చి, నాగూరు మసీదు లలో ఉత్సవాలలో అన్ని మతాలవారు పాలుపంచుకుంటారు.

తమిళనాడు పర్యాటకులను ఎన్నోవిదాలుగా ఆకర్షిస్తుంది. పురాతన ఆలయాలు, నింగినంటే గోపురాలు, ఆధునిక నగరాలు, పల్లెటూరి జీవన విధానం, సాగర తీరాలు, పార్కులు, అడవులు, వేసవి విడుదులు, పరిశ్రమలు, సినీ స్టూడియోలు, పట్టుచీరలు, బంగారం దుకాణాలు, ఆధునిక వైద్యశాలలు - ఇలా అన్ని విధాల పర్యాటకులకూ తమిళనాడు చూడదగింది.




#Article 199: త్రిపుర (155 words)


త్రిపుర () ఈశాన్య భారత దేశము లోని రాష్ట్రము. రాష్ట్ర రాజధాని అగర్తల, ఇక్కడ మాట్లాడే ప్రధాన భాషలు బెంగాళీ, కోక్‌బరోక్.

త్రిపుర స్వాతంత్ర్యానికి మునుపు ఒక రాజ్యముగా ఉండేది. 1949 లో భారత దేశములో విలీనమయ్యేవరకు గిరిజన రాజులు మాణిక్య అనే పట్టముతో త్రిపురను శతాబ్దాలుగా పరిపాలించారు. వీరి రాజ్యము యొక్క రాజధాని దక్షిణ త్రిపురలో గోమతీ నది తీరమున రంగమతిగా పేరుపొందిన ఉదయపూర్ లో ఉంది. రాజధానిని తొలుత పాత అగర్తలకు ఆ తర్వాత 19వ శతాబ్దములో ప్రస్తుత అగర్తలకు తరలించబడింది. 
రాచరిక పరిపాలనకు వ్యతిరేకముగా గణముక్తి పరిషద్ ఉద్యమము ప్రారంభమైనది. ఈ ఉద్యమము యొక్క విజయానికి ఫలితముగా త్రిపుర భారత దేశములో విలీనమైనది. దేశ విభజన తీవ్ర ప్రభావము చూపిన ప్రాంతములలో త్రిపుర కూడా ఒకటి. రాష్ట్రములో ఇప్పుడు బెంగాళీలు (ఇందులో చాలామంది 1971లో బంగ్లాదేశ్ యేర్పడిన తర్వాత పారిపోయి ఇక్కడ ఆశ్రయము పొందిన వారే) స్థానిక గిరిజనులు పక్కపక్కనే సహజీవనము సాగిస్తున్నారు.

త్రిపుర రాష్ట్రాన్ని ప్రస్తుతము విప్లవ్ కుమార్  ముఖ్యమంత్రిగా భా.జ.పా పరిపాలించుచున్నది. 1977 వరకు రాష్ట్రాన్ని కాంగ్రేసు పార్టీ పరిపాలించింది. 1978 నుండి 1988 వరకు వామపక్ష కూటమి పరిపాలించి, తిరిగి 1993లో అధికారములోకి వచ్చింది. 1988 నుండి 1993 వరకు భారత జాతీయ కాంగ్రేసు, త్రిపుర ఉపజాతి యుబ సమితి యొక్క సంకీర్ణ ప్రభుత్వము పాలించింది.2018లో జరిగిన ఎన్నికలలో అప్పటి వరకు ఉన్న వామపక్ష కోటను బద్దలుకొట్టి భాజపా అధికారంలోకి వచ్చింది.




#Article 200: ఒడిషా (391 words)


ఒడిషా  (; ) లేదా ఒరిస్సా (పాత పేరు; Orissa) భారతదేశం తూర్పు తీరాన ఉన్న రాష్ట్రం. దీని వైశాల్యం 60,162 చ.మైళ్ళు (1,55,820 చ.కి.మీ.). 2001 లెక్కల ప్రకారం జనాభా 3,67,06,920. November 4, 2011 న ఈ రాష్ట్రం యొక్క పేరును ఒడిషాగా మారుస్తూ భారత రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.ఒడిషాకు ఉత్తరాన ఝార్ఖండ్ రాష్ట్రం, ఈశాన్యాన పశ్చిమ బెంగాల్, దక్షిణాన ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమాన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలున్నాయి. తూర్పున బంగాళాఖాతం సముద్రమున్నది.కోణార్క, పూరి, భువనేశ్వర్లు ప్రసిద్ధి చెందిన మందిరాలు గల పట్టణాలు. ఒరియా ప్రధాన భాష. ఒరిస్సా పేరును ఒడిషా గా, ఒరియాను ఒడియాగా మార్చడానికి కేంద్రం ఆమోదించింది.

ఒడిషా రాష్ట్రానికి పశ్చిమ, ఉత్తర భాగాలలో తూర్పు కనుమలు, ఛోటానాగపూర్ పీఠభూమి ఉన్నాయి. ఇది దట్టమైన అడవుల ప్రాంతం. లోపలి ప్రాంతాలు అరణ్యాలు, కొండల మయం. ఆదివాసులు, తెగలు ఇక్కడ నివసిస్తున్నారు. 
తూర్పు కనుమలకు, సముద్రానికి మధ్యభాగంలోని మైదాన ప్రాంతం సారవంతమైన వ్వవసాయభూమి. తీరప్రాంత మైదానాలు ప్రధాన జనావాసకేంద్రాలు. మహానది, బ్రాహ్మణి నది, బైతరణి నది డెల్టాలు కూడా ఇక్కడే ఉన్నాయి. తీర రేఖ తిన్నగా (చీలకుండా) ఉండడంవల్ల మంచి నౌకాశ్రయాలకు అవకాశంలేదు. ఒక్క పరదీప్ మాత్రం నౌకలకు అనుకూలమైనది. తీర ప్రాంతాలు, మహానది డెల్టా సారవంతమైన నేలలు. సక్రమంగా మంచి వర్షపాతం ఉండడంవల్ల ఏటా రెండు వరి పంటలు పండుతాయి.

బంగాళాఖాతంలో జనించే తుఫానుల తాకిడికి ఒరిస్సా తీరప్రాంతం తరచు నష్టపోతూ ఉంటుంది. 1999 అక్టోబరులో వచ్చిన తుఫాను వల్ల 10,000 మంది మరణించాఱు. తీవ్రమైన నష్టం వాటిల్లింది

ఎక్కువ కాలం ఒడిషా కళింగరాజుల పాలనలో ఉండేది. క్రీ.పూ. 250 లో మగధ రాజు ఆశోకుడు తీవ్రమైన యుద్ధంలో కళింగరాజులను జయించాడుగాని, ఆ యుద్ధంలోని రక్తపాతానికి పశ్చాత్తాపం చెంది, శాంతి మార్గాన్ని అవలంబించాడు. తరువాత దాదాపు 100 సంవత్సరాలు ఈ ప్రాంతం మౌర్యుల పాలనలో ఉంది. కళింగరాజుల పతనానంతరం ఒరిస్సా ప్రాంతాన్ని వేరువేరు వంశాల రాజులు పాలించారు.

ముస్లిం దండయాత్రల ప్రధానమార్గానికి ప్రక్కగా ఉన్నందువల్లా, కొద్ది దండయాత్రలకు బలమైన ప్రతిఘటన చేయగలగడం వల్లా ఈ ప్రాంతం చాలా కాలం మహమ్మదీయుల పాలనలోకి రాలేదు. కాని 1568లో ముఘల్ సామ్రాజ్యంలో కలుపబడింది.

ముఘల్ రాజుల పతనం తరువాత ఒడిషాలో కొంత భాగం బెంగాలు నవాబుల పాలనలోను, మరి కొంత భాగం మరాఠా లపాలనలోను ఉంది. 1936లో బీహారులో కొంతభాగం చేర్చి ఒడిషా ప్రాదేశిక విభాగం ఏర్పరచబడింది. 1948లో 24 రాజసంస్థానాల విలీనం వల్ల ఒడిషా వైశాల్యం, జనాభా దాదాపు రెట్టింపు అయ్యింది.

ఒడియా అధికారిక భాష. ఒడిషాలో సాంస్కృతిక వారసత్వం సుసంపన్నమైనది. భువనేశ్వర్ లో మందిరాలు, పూరీ రథయాత్ర, పిపిలి హస్తకళలు, కటక్ వెండినగిషీలు, పట చిత్రాలు, వివిధ ఆదిమవాసుల (కొండజాతుల) వారి కళలు, ఆచారాలు - ఇవన్నీ ఒడిషా సాంస్కృతిక ప్రతీకలు.

ఒడిషా జనాభాలో దాదాపు 24% వరకు ఆదిమవాసులు. ఇది చాలా రాష్ట్రాలకంటే ఎక్కువ. 87% జనాభా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఎక్కువ భూమి కొద్ది మంది అధినంలో ఉండడంవలనా, అభివృద్ధి కార్యక్రమాలు ఆదివాసి ప్రాంతాలకు విస్తరిచకపోవడం వలనా ఒరిస్సాలో పేదరికం బాగా ఎక్కువనే చెప్పవచ్చును.

ఒడిషాలో శిశుమరణాలు 1000 కి 97. ఇది దేశంలో బాగా అధికం. 60% పైగాజనులకు సరైన సదుపాయాలు (నీరు, విద్యుత్తు, నివాసయోగ్యమైన ఇల్లు వంటివి) అందుబాటులోలేవు. వీటికి తోడు తుఫానులు, వరదలు, అనావృష్టి వంటి ప్రకృతివైపరీత్యాలు ఒడిషా అభివృద్ధికి ప్రధానమైన అడ్డంకులు.

ఒడిషా రాష్ట్రపాలన భారతదేశంలోని అన్ని రాష్ట్రాల పాలనా విధానాన్ని అనుసరించే ఉంటుంది (గవర్నరు, ముఖ్య మంత్రి, కాబినెట్, అసెంబ్లీ మొదలగునవి)

ఒడిషా ఆర్థిక స్థితికి ముఖ్యమైన వనరులు:

కొన్ని గణాంకాలు:

Mobile pos -

ఒడిషాలో పలు విద్యాలయాలు, విశ్వ విద్యాలయాలు ఉన్నాయి

దర్మ కిరన్ ఆయుర్వేద కాలేజీ హీదారాబాద్




#Article 201: కన్నడ భాష (258 words)


సిరిగన్నడగా పేరొందిన  పురాతన ద్రావిడ భాషలలో ఒకటి. అన్ని మాండలికాలతో కలుపుకొని సుమారు 5 కోట్ల మంది మాట్లాడే ఈ భాష భారత దేశ దక్షిణాది రాష్ట్రాలలో పెద్ద రాష్ట్రమైన కర్ణాటక యొక్క అధికార భాష. దక్షిణ భారత దేశంలో తెలుగు, తమిళ్ ల తర్వాత అత్యధిక మంది ప్రజలు కన్నడ భాషను మాట్లాడుతారు.

కన్నడ భాష దాదాపుగా 2500 సంవత్సరములుగా మాట్లాడబడుచున్నది, దాని లిపి 1900 సంవత్సరములుగా వాడుకలో ఉంది.

కన్నడ మూడు విధముల భేదములకు లోబడి ఉన్నది అవి లింగ, సంఖ్య కాల భేదములు.

ఈ భాషలో మౌఖిక, లిఖిత రూపములలో నిర్ధిష్టమైన తేడా ఉన్నది వ్యావహారిక భాష ప్రాంతము నుండి ప్రాంతమునకు మార్పు చెందును. వ్రాతపూర్వక భాష చాలావరకు కర్ణాటక ప్రాంతమంతా ఇంచుమించు ఒకలానే ఉంటుంది కానీ వ్యావహారిక భాషలో సుమారుగా 20 మాండలికాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో కొడవ (కూర్గ్ జిల్లాలో), కుండా (కుండపురా లో) హవ్యాక (ముఖ్యంగా దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, శివమోగ్గ, సాగర, ఉడిపి లోని హవ్యాక బ్రాహ్మణులది), ఆరే భాషే (దక్షిణ కర్ణాటక లోని సూల్ల్యా ప్రాంతము), సో'లిగా కన్నడ, బడగ కన్నడ, గుల్బర్గా కన్నడ, హుబ్లి కన్నడ మొదలుగునవి.

ఒక సమీక్ష ప్రకారం, భారత దేశంలోని ఆదళిత భాషాలల్లో అత్యధిక మాండలికం (Dialect) లలో మాట్లాడే భాషాలల్లో కన్నడ భాష అగ్రస్థానంలో ఉంది.

కన్నడ భాషను ప్రధానముగా భారతదేశము లోని కర్ణాటక రాష్ట్రములో, అల్ప సంఖ్యలో ఇరుగుపొరుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ,, తమిళునాడు, కేరళ, మహారాష్ట్రలో మాట్లాడుతారు. అమెరికా, యునైటెడ్ కింగ్‌డం, కెనడాలలో కూడా చెప్పుకోదగిన సంఖ్యలో కన్నడ మాట్లాడే ప్రజలు ఉన్నారు. 

కన్నడ, కర్ణాటక రాష్ట్ర అధికార భాష, భారతదేశపు 22 అధికార భాషలలో ఒకటి.

కన్నడ అక్షరమాలను  చూడండి

కన్నడ భాషలో 32 అక్షరాలు ఉన్నాయి.సంస్కృతమ్ము వ్రరయాడానికి 16 అక్షరాలు ఉన్నాయి.
తమిళ్ లాగే కన్నడలో కూడా మాహాప్రాణాక్షరాలు ప్రజలు పలుకరు.
కేవలం బరహంలో దీన్ని వాడుతారు.
కన్నడ లిపి కదంబ లిపినుంది ఉద్భవించింది. ఇతర భారతీయ భాషలలాగే ఒత్తులతో కూడి మూల అక్షరాలు అనేక ద్విత్వాక్షరాలు ఏర్పడటము వలన లిపి కొంత సంక్లిష్టమైనదే. మూలాక్షరాలు 52 అయినా అనేక గుణింతాలు, వత్తులతో కలిపి అనేక అక్షరాలు యేర్పడతాయి. 

ప్రామాణిక కీబోర్డు ఉపయోగించి కన్నడ అక్షరాలను టైప్ చేయడానికి అనేక లిప్యాంతరీకరణ పద్ధతులు ఉన్నాయి. అందులో ఐట్రాన్స్ పై అధారితమైన బరాహ, కర్ణాటక ప్రభుత్వ కన్నడ లిప్యాంతరీకరణ ప్రామాణికమైన నుడి ముఖ్యమైనవి.




#Article 202: ఒడియా భాష (168 words)


ఒరియా (ଓଡ଼ିଆ ), భారతదేశానికి చెందిన ఒడిషా రాష్ట్రములో ప్రధానముగా మట్లాడే భారతీయ భాష. ఒరియా కూడా భారతదేశ అధికార భాషలలో ఒకటి. దీన్ని సాధారణంగా ఒడియా అని అంటారు. ఒరియా ఇండో-ఆర్యన్ భాషా కుటుంబానికి చెందిన భాష. ఇది 1500 సంవత్సరాలకు పూర్వము తూర్పు భారతదేశములో మట్లాడుతున్న మాగధి లేదా పాళీ అనే ప్రాకృత భాష నుండి నేరుగా ఉద్భవించినదని భావిస్తారు. ఒరియాకు ఆధునిక భాషలైన బెంగాళీ, అహోమియా (అస్సామీ) తో చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. ఒరియా భాషాపై పర్షియన్, అరబిక్ భాషల ప్రభావము చాలా స్వల్పము.

ఒరియాకు 13వ శతాబ్దము నుండి ఘనమైన సాహితీ వారసత్వము ఉంది. 14వ శతాబ్దములో నివసించిన సరళ దాస్, ఓరియా వ్యాసునిగా పేరుపొందాడు. 15వ, 16వ శతాబ్దములలో, జయదేవుని కృతులు, చైతన్య కృతులు ప్రాభవములోకి వచ్చాయి. ఆ కాలములో ప్రసిద్ధి చెందిన కవులలో ఉపేంద్ర భంజ కూడా ఒకడు. ఆధునిక యుగములో ఒరియాలో విశిష్ట రచనలు చేసినా వారిలో ఫకీర్ మోహన్ సేనాపతి, మనోజ్ దాస్, కిషోర్ చరణ్ దాస్, కాలిందీ చరణ్ పాణిగ్రాహి,, గోపీనాథ్ మొహంతి ముఖ్యులు.

ఒరియా సాంప్రదాయకముగా బౌద్ధ, జైన మతాలచే ప్రభావితమైనది. ఒరియాను ఒరియా లిపిలో రాస్తారు. తెలుగు భాష లాగే ఒడియా భాషలో అనేక మాండలికాలు ఉన్నాయి. దక్షిణ ఒడిషాలో మాట్లాడే ఒడియా భాషలో తెలుగు ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఒడియా మాండలికాలలో రెల్లి భాష ఒకటి. ఈ మాండలికాన్ని రెల్లి జాతీయులు మాత్రమే మాట్లాడుతారు. వీరు ఒడిషా నుంచి వలస వచ్చి కోస్తా ఆంధ్రలోని అనేక జిల్లాలలో స్థిరపడిన వారు.




#Article 203: నేపాలీ భాష (147 words)


నేపాలీ () ఇండో-ఆర్యన్ భాషా కుటుంబానికి చెందిన భాష. నేపాలీ భాషను నేపాల్, ఇండియా, భూటాన్, కొంత భాగము బర్మా దేశాలలో మట్లాడతారు. ఇది నేపాల్, భారత దేశాలలో అధికార భాష. నేపాల్లో దాదాపు సగ భాగము ప్రజలు నేపాలీని మాతృభాషగా మాట్లాడతారు. ఇంకా చాలా మంది నేపాలీలు ద్వితీయ భాషగా మట్లాడతారు.

నేపాలీ తమ భాషను ఖస్కూరా అని పిలుచుకుంటారు. ఇదేకాక అనేక పేర్లతో చలామణి అవుతుంది. ఆంగ్లములో సాధారణంగా నేపాల్ కు చెందిన భాష కాబట్టి నేపాలీ లేదా నేపాలీస్ అని అంటారు. ఖస్కూరాను గోర్ఖాలీ లేదా గుర్ఖాలీ (గూర్ఖాల భాష), పర్బతీయ (పర్వత ప్రాంతాల భాష) అని కూడా అంటారు.

హిమాలయ పర్వత సానువులలో తూర్పు నేపాల్ నుండి భారత రాష్ట్రాలైన ఉత్తరాంచల్, హిమాచల్ ప్రదేశ్ వరకు మాట్లాడే పహారీ భాషలలో నేపాలీ అన్నిటికంటే ప్రాచ్యమైనది. నేపాలీ అనేక టిబెటో-బర్మన్ భాషలకు, ప్రత్యేకముగా నేవారీ భాషకు సన్నిహితముగా అభివృద్ధి చెందినది. అందువలన నేపాలీపై టిబెటో-బర్మన్ ప్రభావాలు కనిపిస్తాయి. 
 
నేపాలీ భాషా హిందీకి చాల దగ్గరి బంధువు. అయితే నేపాలీ హిందీ కంటే కొంచెము సాంప్రదాయబద్ధమైంది. పర్షియన్, ఆంగ్ల పదాలు అరువుతెచ్చుకోకుండా సంస్కృతము నుండి అభివృద్ధి చెందిన పదాలు ఎక్కువగా ఉపయోగించబడినవి. ప్రస్తుతం నేపాలీ, దేవనాగరి లిపిలో రాయబడుతున్నది. నేపాల్లోనే అభివృద్ధి చెందిన భుజిమోల్ అనే పాతలిపి కూడా ఉంది.

కొన్ని నేపాలీ వాక్యాల ఉదాహరణలు:




#Article 204: మలయాళ భాష (543 words)


మలయాళం (മലയാളം)  దక్షిణ భారతదేశములోని కేరళ రాష్ట్రములో అధికార భాష. నాల్గున్నర కోట్ల మంది ప్రజలు మాట్లాడే ఈ భాష భారతదేశము యొక్క 22 అధికార భాషలలో ఒకటి. మలయాళ మాట్లాడే వారిని మలయాళీలు అంటారు. అరుదుగా కేరళీలు అనికూడా అంటారు.దక్షిణ భారత దేశంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల తర్వాత మలయాళం అత్యధిక మంది ప్రజలు మాట్లాడుతారు.

మలయాళ ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. మట్లాడే భాష, రాసే విధానము రెండూ తమిళ భాషకు చాలా దగ్గరగా ఉన్నాయి. మలయాళానికి సొంత లిపి ఉంది.

మలయాళం దక్షిణ ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన నవీన భాష. తమిళం, కన్నడం, కోట, కోడగు భాషలు కూడా ఈ భాషా ఉపకుటుంబానికి చెందినవే. వీటిలో తమిళానికి మలయాళంతో పోలిక ఎక్కువ. తమిళ, మలయాళ భాషలకు మూలమైన ఆది తమిళ-మలయాళ భాష తొమ్మిదొ శతాబ్దం నుండి వేర్పడటం ప్రారంభమై ఆ తరువాత నాలుగైదు శతాబ్దాలుగా రెండుగా చీలిపోయిందని నమ్మకం. అలా మలయాళం తమిళం నుండి వేరుపడి స్వతంత్ర భాషగా వెలసింది. మలయాళం అవతరించిన తొలి దశలలో తమిళం అధికార భాష ,  పండిత భాష కావడం వల్ల దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. మలయాళ సమాజంలో బ్రాహ్మణుల రాకతో భాష మీద సంస్కృత ప్రభావం హెచ్చింది. కానీ సంస్కృత ప్రభావంలేని కోదుం మలయాళం అను స్వచ్ఛమైన మలయాళ మాండలికం ఇప్పటికీ కేరళలోని కొన్ని చోట్ల వ్యవహరంలో ఉంది. నంబూద్రీలు కేరళ సాంస్కృతిక జీవితంలో అడుగుపెట్టడం, అరబ్బుల వర్తక సంబంధాలు, కేరళపై పోర్చుగీసు దండయాత్ర, సామంతరాజ్యాల స్థాపన అనేక రోమాన్స్, సెమెటిక్ ,  ఇండో-ఆర్యన్ భాషాగుణాలు మలయాళ భాషలో ఇమిడిపోవడానికి దోహదం చేశాయి.

మలయాళంలో లభ్యమైన ప్రప్రథమ లిఖిత ఆధారం కీ.శ.830కి చెందిన వాయప్పళ్లి శాసనం. 
ఆది మలయాళ సాహిత్యాన్ని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి

ఇరవైయవ శతాబ్దం చివరి వరకు మలయాళ కవిత్వంలో ఈ మూడు వర్గాల ప్రభావం కనబడుతుంది. పొట్టు రీతిలో అతి ప్రాచీనమైనదిగా 'రామచరితం', మణిప్రవాలంలో 'వైశికతంత్రం' ప్రసిద్ధిగాంచినవి. ఈ రెండు పన్నెండవ శతాబ్దమునకు చెందినవి. ప్రస్తుతము లభ్యమవుతున్న అతి ప్రాచీన మలయాళ గద్య రచన 'భాషకౌటిల్యం'. ఇది చాణక్యుని అర్థశాస్త్రం పై సరళ మలయాళంలో వ్రాయబడిన వ్యాఖ్యానం. విభిన్న కాలాల మలయాళ గద్యం వేర్వేరు భాషల ప్రభావం కలిగి ఉంటుంది. అలా ప్రభావితం చేసిన భాషలు తమిళం, సంస్కృతం, ప్రాకృతం, పాళీ, హీబ్రూ, హిందీ, ఉర్దూ, అరబిక్, పర్షియన్, సిరియాక్, పోర్చుగీసు, డచ్, ఫ్రెంచి ,  ఆంగ్లం. ప్రస్తుత మలయాళ సాహిత్యంలో పద్యాలు, నవలలు, నాటకాలు, జీవిత చరిత్రలు ,  సాహిత్య విమర్శలు విరివిగా ఉన్నాయి.

అఖిల భారత బ్రాహ్మీ లిపి నుండి గ్రంథి లిపి ద్వారా వట్టెఱుతు (గుండ్రపాటి వ్రాత) గా మలయాళ లిపి ౧౩వ శతాబ్దంలో అవతరించింది. తెలుగులాగా మలయాళ లిపికూడా syllabic గా ఉంటుంది, అంటే వీరు కూడా సంయుక్తాక్షరాలుగా వ్రాస్తారు.

౧౯౬౦లో మలయాళంలోని వివిధ స్వల్పంగా వాడే సంయుక్త పదములకు గల ప్రత్యేక అక్షరాలు తొలగించబడినవి. అలాగే అన్ని హచ్చులతోను ఉకారం ఒకేలాగా ప్రవర్తంచేలా చేసారు. ఉదాహరణకు అంతకు ముందు 'కు'లో ఉవత్తు 'గు'లో ఉవత్తు వేరేలా ఉండేవి.

మలయాళంలో ప్రస్తుతం ౫౩ అక్షరాలు ఉన్నాయు. వీటిలో ౨౦ అచ్చులు, మిగిలినవి హల్లులు. ౧౯౮౧లో కొత్త వ్రాత పద్ధతిని ప్రవేశ పెట్టారు. ఈ కొత్త పద్ధతి typesetలోని మొత్తం అక్షరాలను ౯౦౦ల నుండి ౯౦కి తగ్గించింది. ఇలా చేయడం వలన మలయాళ లిపి టైపురైటర్ల మీద కంప్యూటర్ కీబోర్డుల మీద ఇమడగలిగింది.

౧౯౯౯లో చిత్రజకుమార్ ,  కేహెచ్ హుస్సేన్ స్థాపించిన 'రచన అక్షర వేది' అనే సంస్థ మెత్తం ౯౦౦లకు పైబడి సంయుక్తాక్షరాలు గల ఫాంటులను 
తిరువనంతపురంలో విడుదల చేసింది. దీనితో బాటు ఒక editor software ను కూడా విడుదల చేసారు. ఇక ౨౦౦౪లో వీటినే ఫ్రీ సాఫ్టవేర్ ఫౌండేషన్ యొక్క రిచర్డ్ స్టాల్మన్ గారు GNU License క్రింద కొచ్చిన్లో విడుదల చేసారు.

ప్రాంతం, కులం, వృత్తి, సామాజిక స్థాయి, శైలి ,  register లను బట్టి ఉచ్ఛారణా పద్ధతులు, vocabulary, and distribution of grammatical and phonological elements లో తారతమ్యాలు కనిపిస్తాయి. సంస్కృతం యొక్క ప్రభావం బ్రాహ్మణ మాండలికాలలో అధికంగాను, హరిజన మాండలికాలలో అత్యల్పంగానూ ఉంటుంది. ఆంగ్లం, సిరియాక్, లాటిన్ ,  పోర్చుగీసు భాషల నుండి అరువుతెచ్చుకున్న పదాలు క్రైస్తవ మాండలికంలోనూ, అరబిక్ ,  ఉర్దూ పదాలు ముస్లిం మాండలికంలో విరివిగా కనిపిస్తాయి. మలయాళం సంస్కృతం నుండి వేలకొద్ది నామవాచకాలు, వందలాది క్రియాపదాలు ,  కొన్ని indeclinables అరువుతెచ్చుకున్నది. కొన్ని పదాలు సంస్కృతం నుంచి మలయాళ భాషకు చేరుకున్నాయ్యి.

సంస్కృతం తర్వాత మలయాళ భాషను అత్యధికంగా ప్రభావితం చేసిన భాష ఆంగ్లం. ఆధునిక మలయాళ భాషలోని వందలాది individual lexical items and many idiomatic expressions ఆంగ్లభాషా సమన్వితాలే.

అధికార భాషగా ,  పాఠశాలలు, కళాశాలలో బోధనా మాధ్యమంగా మలయాళం అభివృద్ధి చెందుతున్నది. భాషలో శాస్త్రీయ పరిభాష నెమ్మదిగా అభివృద్ధి చెందుతున్నది. ఉదార స్వభావులైన మలయాళీలు తమ భాషతో సహా ఇతరభాషలు సహజీవనం సాగించడానికి ఎల్లప్పుడూ ఆహ్వానించారు. ఇతర భాషలతో జరిగిన ఈ పరస్పరలే మలయాళ భాష యొక్క వృద్ధి అనేక రీతులలో దోహదం చేశాయి.




#Article 205: హిందీ (262 words)


హిందీ భాష (దేవనాగరి: हिन्दी) ఉత్తర, మధ్య భారతదేశములో మాట్లాడే ఒక భాష. అనేక మంది హిందీయేతర భారతీయులు కూడా భ్రమ పడుతున్నట్లుగా హిందీ భారతదేశ జాతీయ భాష (దేశ భాష) కానే కాదు. దేశ భాష అనే హోదాను రాజ్యాంగం ఏ భాషకూ ఇవ్వలేదు. ఎందుకంటే ఈ దేశం వివిధ సంస్కృతులు, భాషలు కలిగిన అనేక రాజ్యాల కలయిక. ఇండో-ఆర్యన్ ఉప కుటుంబానికి చెందిన ఇండో-యూరోపియన్ భాష. మధ్యయుగమునకు చెందిన ప్రాకృత మధ్య యుగపు ఇండో-ఆర్యన్ భాషల నుండి, పరోక్షంగా సంస్కృతము నుండి ఉద్బవించింది. హిందీ సాంకేతిక, పుస్తక యొగ్యమైన పదజాలమంతా చాలా మటుకు సంస్కృతము నుండి పొందింది. ఉత్త్రర భారత దేశములో ముస్లిం ప్రభావము వలన పర్షియన్, అరబిక్, టర్కిష్ పదాలు హిందీలో చేరి ఉర్దూ భాష పుట్టింది. ప్రామాణిక (శుద్ధ) హిందీ ప్రసంగాలలో, రేడియో, టి.వి. వార్తలలో వాడబడుతుంది. రోజువారీ భాష మటుకు చాలా రకాలుగా ఉండే హిందుస్తానీ భాష రకము. బాలీవుడ్ సినిమాలలో ఈ విషయము కనిపెట్టవచ్చును.

భాషా శాస్త్రజ్ఞులు హిందీ, ఉర్దూ లను, ఒకటే భాష కానీ హిందీను దేవనాగరి లిపిలోను, ఉర్దూను పర్షియన్ లిపిలోను వ్రాయడము మాత్రమే తేడా అని భావిస్తారు. భారత విభజనకు ముందు హిందీ, ఉర్దూలను ఒకటే భాషగా భావించేవారు కాబట్టి ఈ తేడా చాలా మటుకు రాజకీయము అని కూడా చెప్పవచ్చు.

కేంద్ర ప్రభుత్వ రెండు అధికార భాషల్లో హిందీ ఒకటి. కేంద్ర ప్రభుత్వంలో ఆంగ్లంను కూడా తొలగించి హిందీని మాత్రమే దేశమంతటా ఉపయోగించేలా చేయాలని తొలుత రాజ్యాంగంలోనే రాసినా, ఇందుకు హిందీయేతర భారతీయులు ఒప్పుకోకపోతుండటంతో ఆ లక్ష్యం ఇప్పటికైతే నేరవేరలేదు. అయితే అఖిల భారత స్థాయిలో ఎంపికలు జరిగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో హిందీ వాళ్ళకు ఉద్యోగం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయనీ, దీనికి కారణం అనేక రకాల పరీక్షలను కేవలం ఇంగ్లీషు, హిందీల్లో మాత్రమే పెడుతుండటమేననే ఆరోపణ ఎప్పటినుంచో ఉంది. కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు దేశవ్యాప్తంగా ఉన్నవైనప్పటికీ వాటిలో ఉద్యోగాలకైతే ఆంగ్లంతోపాటు హిందీ కూడా రావడం తప్పనిసరి చేశారు. దీంతో అలాంటి సంస్థల్లోనైతే అత్యధిక శాతం ఉద్యోగాలు కేవలం హిందీ వాళ్ళకే దక్కుతున్నాయని హిందీయేతర భారతీయులు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఈ పద్ధతి మారాలని సామాజిక మాధ్యమాల్లో యువత పోస్టులు పెట్టడం ఈమధ్య సాధారణమైపోతోంది.

హిందీ సాహిత్య చరిత్రలో క్రీ.శ. 1318 నుండి 1643 వరకు భక్తి యుగంగా ఆచార్య రామచంద్ర శుక్లా భావించారు. వీరిలో రామ భక్తులు కొందరు కాగా మరికొందరు కృష్ణ భక్తులు.




#Article 206: అస్సామీ భాష (604 words)


Assamese (#2437;#2488;#2478;#2496;#2527;#2494;)  or Asamiya or Oxomiyaగా పేరొందిన ఈ భాష ఈశాన్య భారత దేశంలో గల అస్సాం రాష్ట్రంలో మాట్లాడే భాష. ఇది అస్సాం రాష్ట్ర భాష. అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో, మరికొన్ని ఈశాన్య భారత దేశంలోని రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో ఈ భాష ఉపయోగంలో ఉంది. కొంతమంది అస్సామీలు భూటాన్, బంగ్లాదేశ్ లలో కూడా ఉన్నారు. ప్రవాసులు తమతో భాషను ప్రపంచంలో వివిధ ప్రాంతాలకు తీసుకుని వెళ్ళారు. ఇండో యూరోపియన్ భాషలలో అత్యంత తూర్పులో మాట్లాడే భాష అస్సామీనే. ఈ భాష సుమారుగా 2 కోట్ల మంది మాట్లాడుతారు 

మగధి ప్రాకృతము ఏకాదిగా అస్సామీ, బెంగాలీ, ఒరియా భాషలు అవిర్భవించాయి. మగధి ప్రాకృతము అపభ్రంశ భాషకు తూర్పు శాఖ. అస్సామీ లిపిలో లభ్యమైన మొట్ట మొదటి వ్రాత ప్రతులు ఆరు లేక ఏడవ శతాబ్దానికి చెందినవి. అప్పుడు కామరూప వర్మన్ రాజుల పరిపాలనలో ఉండేది. (ఇప్పటి అస్సాం రాష్ట్రం లోని చాలా భాగం అప్పటి కామరూప రాజ్యంలో భాగమై ఉండేది). అస్సామీ భాష గుర్తులు 9 వ శతాబ్ధానికి చెందిన 'చర్యపద' లో కనిపిస్తాయి. చర్యపద బౌద్ధ శ్లోకాలు 1911 లో నేపాల్లో కనుగొనబడ్డాయి, ఇవి అపభ్రంశ కాలంతమున వచ్చినవి. అస్సామీ భాష తొలి ఉదాహరణలు కమత రాజైన దుర్లభ నారాయణ కాలం 14 వ శతాబ్ధ తొలి రోజుల్లో కనిపిస్తాయి. చర్యపద తర్వాత అస్సామీ భాష పై టిబెటో-బర్మన్, ఆస్ట్రిక్ భాషా కుంటబాల ప్రభావంతో, ఆ భాషకు characteristic expressiveness మరియూ రమణీయతనును సమకూర్చాయి.

అస్సామీలో బలమైన లేఖనా సంప్రదాయము చరిత్రలో చాల ముందునుంచీ గమనించబడింది. ఉదాహరణలు, శాసనములలోను, భూమి పట్టాలలోను, మధ్య యుగ రాజులు వేయించిన రాగి ఫలకాలలోను కనుగొనవచ్చు. అస్సాంలో ధార్మిక, చారిత్రక గ్రంథాలు, కామరూపి గ్రంథాలు సాంచీ చెట్టు యొక్క బెరడు మీద వ్రాయబడినవి. అస్సామీ లిపికి, నగరిలిపితో దగ్గరి సంబంధాలు కనిపిస్తాయి. నగరి, హిందీ భాష ఉపయోగించే తొలి రూపలలోనిది. ప్రస్తుత ప్రమాణీకరించబడిన అస్సామీ లిపి ప్రమాణిక బెంగాలీ లిపిని కొద్దిపాటి మార్పులతో తీసుకోబడింది. అస్సామీ పూర్తిగా ధ్వన్యానుగుణంగా వ్రాయబడే భాష కాదు. కానీ రెండవ అస్సామీ నిఘంటువు అయిన హెమ్ కొహ్, అక్షరాలను వ్రాసే విధం (స్పెల్లింగ్) ను సంస్కృతాధారంగా ప్రమాణీకరించింది.

ప్రస్తుత కాలంలో ఉపయోగించే అస్సామీస్ వేర్లు తూర్పు అస్సాంకు చెందిన సిబసాగర్ పట్టణానికి చెందిన భాషలో ఉన్నాయి (1872లో బ్రిటిష్ రాజ్ ఆస్సామీని రాష్ట్ర అధికార భాషగా ప్రకటించింది), కానీ ఈ శతాబ్ధ ఆరంభంలో అన్ని కార్య కలాపాలు సిబసాగర్ నుండి గౌహతికి మార్పు చెందడంతో ప్రస్తుత భాష మీద గౌహతీ ప్రాభావం కూడా చాలా ఉంది.

ప్రస్తుతము పాఠశాలలో చెప్పే, వార్తా పత్రికలలో ప్రచురించే అస్సామీ భాష వివిధ మండలీకాల కూర్పు అని చెప్పవచ్చు. బణికాంత కకతి భాషను రెండు మాండలీకాలుగా విభజించెను (1) తూర్పు మాండలీకము (2) పడమర మాండలీకము. కానీ ఈమధ్యనే జరిపిన linguistic studies నాలుగు మాండలీకాలను గుర్తించాయి (Moral 1992), ఈనాలుగు మాండలీకాలను తూర్పు నుంచి పడమర వైపుగా కింద పొందుపరచబదడినవి:
 

అస్సామీ భాషా చరిత్రను స్థూలంగా మూడు కాలాలుగా విభజించవచ్చు.

ఈ కాలాన్ని మళ్ళీ రెండు భాగాలుగా విభజించవచ్చు (1) Pre#8211;Vaishnavite and (2) Vaishnavite ఉప కాలాలు. మనకు తెలిసినంత వరకు అస్సామీ తొలి రచయిత హేమా సరస్వతి, ఈయన 'ప్రహరాద చరిత' అనె చిన్న పద్యాన్ని రచించారు. ఇంద్ర నారాయణ రాజు కాలానికి (1350-1365) చెందిన కవి హరిహర విప్ర 'అశ్వమేధ పర్వ' రచించాడు. అదే కాలానికి చెందిన 'కవిరత్న సరస్వతి' 'జయ్ద్రధ వధ' ని రచించాడు. ఇంకొక కవి రుద్ర కందలి 'ద్రోణ పర్వ'ను అస్సామీలో అనువదించాడు. Vaishnavite ఉప కాలంలో ప్రసిద్ధి కెక్కిన కవి మాధవ కందలి. ఈయన పూర్తి రామాయణాన్ని అస్సామీలో అనువదించాడు. మాధవ కందలికి జయంతపుర కచారీ రాజైన మహా మాణిక్య అండదండలు ఉండేవి. 
హేమా సరస్వతి తన రచనలలో తనని కామరూపలో జన్మించిన వైష్ణవగా పరిచయం చెసుకున్నాడు. ఈయన ఉపయోగించిన భాష కామరూపి. మాధవ కందలి కూడా కామరూపినే ఉపయోగించాడు.

ఈ కాలము అహొం సభలలోని చారిత్రక వ్యాసాలకు సంబంధించింది. అహొంలు వారితో పాటు చరిత్రను లిఖించే ఒక ఆచారాన్ని కూడా పట్టుకొచ్చారు. మొదట అహొం సభలలో చారిత్రక గ్రంథాలను వారి 'టిబెటొ -చైనీస్' భాషలోనే రచించారు, కానీ అస్సామీను సభలో ఉపయోగించే భాషగా చేసినప్పటి నుండి, ఈ చారిత్రక గ్రంథాలను కూడా అస్సామీ భాషలోనే రచించేవారు. 17 వ శతాబ్ద ఆరంభం నుండి ఈ చారిత్రక గ్రంథాలు అధిక సంఖ్యలో రచించబడ్డాయి. వీటిని బురంజీ అని అస్సమీలో అంటారు. బురంజీలు ధార్మిక గ్రంథాలు రాసే శైలినుండి పూర్తి విరుద్ధంగా ఉండేవి. వయాకరణము, స్పెల్లింగులలో ఎవో కొద్దిపాటి మార్పులు తప్ప ఆధునిక భాషనే వాడారు.

అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీలు 1819 లో అస్సామీలో ప్రచురించిన బైబిలుతో ఆధునిక అస్సామీ యుగము మొదలైనదని చెప్పవచ్చును. బణికాంత కకతి పుస్తకంలో Assamese, its Formation and Development (1941, Published by Sree Khagendra Narayan Dutta Baruah, LBS Publications, G.N. Bordoloi Road, Gauhati-1, Assam, India) #8211;  చెప్పినట్టుగా మిషనరీలు తూర్పు అస్సాంకు చెందిన సిబసాగర్ ను తమ కార్య కలాపాలకు కెంద్రంగా చేసుకున్నయి. అదే విధంగా తూర్పు మాండలీకాన్ని వారి సాహిత్య ప్రయోజనాలకి ఉపయోగించుకున్నయి. 1836 లో మొట్ట మొదటి అచ్చు యంత్రన్ని ఈ మిషనరీలు సిబసాగర్ లో ప్రతిష్టించారు. 1846 లో అరునోదయ్ అనే మాస పత్రికను ఆరంభించారు. 1848 లో అస్సామీ వ్యాకరణం పై నాథన్ బ్రౌన్ వ్రాసిన ప్ుస్తకాని ప్రచురించారు. ఎం. బ్రాన్ సన్ కూర్చిన మొట్ట మొదటి అస్సామీ - ఆంగ్ల నిఘంటువు 1867 లో మిషనరీలు ప్రచురించయి.

ISO 639-1: as
ISO 639-2: asm




#Article 207: ఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులు (1664 words)


ఆంధ్రా సంస్కృతినుండి ఆంధ్రా నదులని వేరు చేయడం కష్టం.నదుల విషయంలో ఆంధ్రాసీమ చాలా సౌభాగ్యవంతమైంది. తెలుగు సీమ గోదావరి, కృష్ణ నది, తుంగభద్ర, పెన్న, మున్నేరు, శబరి, మొదలైన నదుల చేత సుసంపన్నం చేయబడింది. సుమారు 25 నదులు ఉన్నాయి. అందులో గోదావరి, కృష్ణ, పెన్న, నాగావళి, వంశధార ముఖ్య నదులు.సహజంగా ప్రవహించే జల ప్రవాహాన్ని నది అంటారు.నదులను రెండు రకాలుగా చెప్పకోవచ్చు.జీవ నదులు, వర్షాధార నదులు, జీవనదులు ఎల్లకాలం ప్రవహిస్తూ ఉంటాయి.ఇవి సహజంగా దూర ప్రాంతాలలో పుట్టి కొన్ని వేల,వందల కి.మీ.దూర ప్రయాణం చేసి సముద్రంలో కలుస్తాయి.వర్షాధార నదులు కేవలం వర్షాకాలం మాత్రమే ప్రయాణించి కొన్ని సముద్రంలో, కొన్ని ఇతర పెద్ద నదులలో కలసి ప్రయాణిస్తాయి.వీటిని ఉప నదులుగా కూడా వ్యవహరిస్తుంటారు.

గోదావరి నది, తొలుత మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో త్రయంబకేశ్వరంలో పుట్టింది. ఇది 1,465 కి.మీ. (910 మైళ్ళు) తూర్పుకు ప్రవహిస్తుంది.దీని ప్రవాహం అది ప్రవహించే ప్రయాణ మార్గంలో మహారాష్ట్రలో (48.6%), తెలంగాణలో (18.8%), ఆంధ్రప్రదేశ్‌లో (4.5%), ఛత్తీస్‌గడ్లో (10.9%), ఒడిశాలో (5.7%) కి. మీ. దూరం ప్రయాణించి, చివరిలో విస్తారమైన ఉపనదుల ద్వారా బంగాళాఖాతం కలుస్తుంది. ఈ నది 312. 812 చదరపు కి.మీ. (120.777 చదరపు మైళ్ళు) విస్తీర్ణం కలిగి ఉంది. ఇది భారత ఉపఖండంలోని అతిపెద్ద నదీ పరీవాహక ప్రాంతాలలో ఒకటిగా ఉంది, గంగా, సింధు నదులు మాత్రమే పెద్ద పారుదల విస్తీర్ణం కలిగి ఉన్నాయి. పొడవు,పరీవాహక ప్రాంత పరంగా గోదావరి ద్వీపకల్పం భారతదేశంలో అతిపెద్దది, దీనిని దక్షిణా గంగా అని కూడా అంటారు. గోదావరి నదికి ప్రతి 12 ఏళ్లకు ఒకసారి 12 రోజులు పుష్కరాలు జరుగుతాయి.ఈ పుష్కరాలలో రెండు తెలుగు రాష్ట్రాలనండి,పొరుగు రాష్ట్రాల నుండి భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొంటారు.

కృష్ణా నదిని, కృష్ణవేణి అని కూడా అంటారు. ఇది మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌కు సమీపంలోని పడమటికనుమలలో మహాదేవ్ పర్వతశ్రేణిలో సముద్ర మట్టానికి సుమారు 1,300 మీటర్ల (4,300 అడుగులు) ఎత్తులో ఉద్భవించింది. ఇది భారతదేశంలో పొడవైన నదులలో ఒకటి. కృష్ణ నది పొడవు 1,400 కి. మీ. (870 మైళ్ళు) మహారాష్ట్రలో 282 కి. మీ. (175 మైళ్ళు) ప్రవహిస్తుంది.నది మూలం మహారాష్ట్రలోని సతారా జిల్లా, వాయి తాలూకాకు ఉత్తరాన, జోర్ గ్రామానికి సమీపంలో ఉన్న మహాబలేశ్వర్ వద్ద ఉంది. తూర్పు తీరంలో ఆంధ్రప్రదేశ్‌లోని హంసలదీవి (కోడూరు సమీపంలో) వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.ఇది తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే ముందు కర్ణాటక రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది.ఈ నది డెల్టా భారతదేశంలో అత్యంత సారవంతమైన ప్రాంతాలలో ఒకటి.ఆంధ్రప్రదేశ్‌లోని అతిపెద్ద నగరం విజయవాడ కృష్ణానదీ తీరానఉంది. శ్రీశైలం డాం, నాగార్జునసాగర్ డాం ఈ నదిపై నిర్మించబడినవి.గంగా, గోదావరి, బ్రహ్మపుత్ర నదుల తరువాత భారతదేశంలో నీటి ప్రవాహం,నదీ పరీవాహక ప్రాంతాల పరంగా కృష్ణ నది నాల్గవ అతిపెద్ద నది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు నీటిపారుదల ప్రధాన వనరులలో ఇది ఒకటి

తుంగభద్ర నది, కర్ణాటక రాష్ట్రం పశ్చిమ కనుములలో తుంగ,భద్ర అనే రెండు నదులుగా ఆవిర్భవించినవి.రెండు కలసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య సరిహద్దులో ప్రవహించే ముందు, చివరికి కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం గ్రామానికి సమీపంలో ఉన్న కృష్ణా నదిలో కలుస్తుంది.రెండు నదులు కలసినందున దీనికి తుంగభద్ర అని పేరు వచ్చింది తుంగభద్రా నది మీద కర్ణాటక రాష్ట్రంలో హోస్పేట వద్ద ఆనకట్ట నిర్మించబడింది.రామాయణ ఇతిహాసంలో, తుంగాభద్ర నదిని పంప అనే పేరుతో వ్యవహరించబడింది.ఈ నదీ తీరాన మంత్రాలయం అనే పుణ్యక్షేత్రం ఉంది.

ఈ పెన్నా నదిని పెన్నార్, పెన్నెర్, పెన్నేరు, ఉత్తరా పినాకిని అని కూడా అంటుంటారు. పెన్నానది కర్ణాటక రాష్ట్రం, మైసూరు జిల్లాలోని నంది కొండలలో పుట్టి,అది పెద్దదై తూర్పు దిశగా కర్ణాటక రాష్ట్రం గుండా ప్రవహించి, అనంతపురం జిల్లాలోని హిందూపూర్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రంలో ప్రవేశ్తుంది. ఇది 597 కి.మీ. (371 మైళ్ళు) దూరం ప్రవహిస్తుంది.దీని ప్రవాహ విస్తీర్ణం (బేసిన్) 55,213 చ. కి. మీ.ఉంది.కర్ణాటకలో 6,937 చ. కి.మీ. విస్తీర్ణంలో ప్రవహించగా,ఆంధ్రప్రదేశ్‌లో 48,276 చ. కి. మీ. విస్తీర్ణంలో ప్రవహిస్తుంది.

కిన్నెరసాని నది, తెలంగాణలోని వరంగల్, భద్రాద్రి జిల్లాల గుందా ప్రవహించి, భద్రాచలానికి కాస్త దిగువన, పశ్చిమ గోదావరి జిల్లాలో బూర్గంపాడు, వేలేరు గ్రామాల మధ్యన గోదావరిలో కలుస్తుంది. ఇది గోదావరికి ముఖ్యమైన ఉపనది.తెలంగాణ రాష్ట్రం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,పాల్వంచ వద్ద ఈ నదిపై కిన్నెరసాని ఆనకట్ట అని పిలువబడే ఆనకట్టను ఈ నదిపై నిర్మించారు.ఆనకట్ట యొక్క వెనుక జలాలు చుట్టుపక్కల కొండలతో చుట్టుముట్టబడి కిన్నెరసాని వన్యప్రాణులను అభయారణ్యం పరిసరాల్లో రక్షించబడతాయి.ఈ నది తెలంగాణలోని గోదావరి కుడి ఒడ్డున ప్రవహిస్తుంది.ప్రధాన గోదావరి నదితో సంగమం కావడానికి ముందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సాధారణ సరిహద్దును ఏర్పరుస్తుంది.

కుందేరు నది కర్నూలు జిల్లాలోని ఎర్రమల కొండలలో ఉద్బవించింది.అక్కడ నుండి దక్షిణ దిశలో ప్రవహించి వైఎస్ఆర్ జిల్లాలోని కమలాపురం వద్ద పెన్నా నదిలో కలుస్తుంది.నంద్యాల పట్టణం కుందేరు నది తీరాన ఉంది.కుందేరు నదిని కుందూ,కుముద్వతి అని కూడా వ్యవహరిస్తారు.

గుండ్లకమ్మ నది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు- మధ్య భాగం గుండా ప్రవహించే కాలానుగుణ జలమార్గం.తూర్పు కనుమల శాఖకు చెందిన నల్లమల అడవులలోని కొండలలో కర్నూలు జిల్లా, నంద్యాల, ఆత్మకూరు మండలాల సరిహద్దులో గుండ్ల బ్రహ్మేశ్వరం వద్ద 800 మీటర్ల (2900 అడుగులు) ఎత్తులో పుడుతుంది. దీని ప్రధాన రిజర్వాయర్ సముద్రమట్టానికి 425 మీటర్ల ఎత్తులో ప్రకాశం జిల్లాలోని అర్ధవీడు గ్రామానికి 6 కి.మీ. దూరంలో ఉంది.దట్టమైన అటవీ కొండల నుండి అనేక వంపుల తిరుగుతూ ప్రయాణించేటప్పుడు అనేక పర్వత ప్రవాహాలు దీనిలో కలుస్తాయి. ఇది ఉత్తర ఈశాన్య దిశగా ప్రవహిస్తుంది. కుంభం పట్టణం సమీపంలో ఉన్న మైదానంలోకి ప్రవేశించి.అదే పేరుగల పట్టణం గుండా ప్రవహిస్తుంది. నల్లమల కొండల నుండి ఉద్భవించిన అన్ని నదులలో గుండ్లకమ్మ అతిపెద్దది.

గోస్తినీ నది, తూర్పు కనుమలలోని అనంతగిరి కొండలలో జన్మించింది.నది మూలానికి సమీపంలో ఉన్న బొర్రా గుహల గుండా ఈ నది ప్రవహిస్తుంది. భీమునిపట్నం సమీపంలో తీరం ద్వారా బంగాళాఖాతం సముద్రంలో కలవటానికి ముందు 120 కి. మీ. దూరం ప్రవహిస్తుంది.నదీ పరీవాహక ప్రాంతం రెండు తీర జిల్లాలైన విజయనగరం, విశాఖపట్నం జిల్లాల గుండా సాగుతుంది.విశాఖపట్నం జిల్లా మొత్తం వైశాల్యంలో 3% గోస్తినీ నది పరీవాహక విస్తీర్ణం పరిధిలో ఉంది. ఈ నది వర్షాధారం ఆధారపడి ప్రవహిస్తుంది.సగటున 110 సెం.మీ. వర్షపాతం అందుతుంది.ఎక్కువ భాగం నైరుతి రుతుపవనాలపై ఆధారపడి ఉంది.

చంపావతి నది, విజయనగరం జిల్లా, మెంటాడ మండలంలోని ఆండ్ర గ్రామానికి సమీపంలో సముద్ర మట్టానికి 1,200 మీటర్ల ఎత్తులో ఉద్భవించింది. ఈ నది తూర్పువైపుకు ప్రవహిస్తుంది.కొనాడ గ్రామానికి సమీపంలో ఉన్న బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది విజయనగరం జిల్లాలోని గజపతినగరం, నెల్లిమర్ల, సరిపల్లి, డెంకాడ, పాలెం నాతవలాస గ్రామాల గుండా ప్రవహిస్తుంది. ఈ నదిలో నాలుగు ప్రధాన ఉపనదులు ఎడువంపుల గెడ్డ, చిట్టా గెడ్డ, పోతుల గెడ్డ, గాడి గెడ్డ కలుస్తాయి.దీని పారుదల విస్తీర్ణం 1,410 చ. కి.మీ.ఉంది. 1965 నుండి 1968 మధ్యకాలంలో చంపావతి నది మీద డెంకాడ అనకట్ట నిర్మించబడింది. 5,153 ఎకరాల (20.85 చ. కి. మీ.) అయకట్టుకు సాగునీరు కల్పించడానికి విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని సరిపల్లి గ్రామానికి సమీపంలో ఈ ప్రాజెక్ట్ ఉంది. 6,690 హెక్టార్లకు నీటిపారుదల నీటిని సరఫరా చేయడానికి తారకరామ తీర్థ సాగరం బ్యారేజీని కూడా ఈ నదిపై నిర్మించారు.

చిత్రావతి నది, కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబల్లాపూర్‌లో పుట్టి,అదే జిల్లా గుండా ప్రవహించి పెన్నా నదిలో కలిసే ముందు అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాలగుండా ప్రవహించి గండికోట వద్ద పెన్నా నదిలో కలుస్తుంది. అందువలన దక్షిణ భారతదేశంలో ఇది అంతర్రాష్ట్ర నదిగా, పెన్నా నదికి ఉపనదిగా పేర్కొంటారు.చిత్రావతి నది ప్రవాహ విస్తీర్ణ పరిమాణం (బేసిన్) 5,900 చ.కి.మీ. ఉంది. పుట్టపర్తి యాత్రికుల పట్టణం దీని ఒడ్డునే ఉంది.

మహేంద్రతనయ నది, ఒడిషా రాష్ట్రం, గజపతి జిల్లాలోని తుపారసింగి గ్రామం వద్ద మహేంద్రగిరి కొండల్లో పుట్టి గజపతి, రాయగడ జిల్లాల గుండా ప్రవహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెడుతుంది. మహేంద్రతనయ నది శ్రీకాకుళం జిల్లాలో మధ్య తరహా నది.మహేంద్రతనయ నది వంశధార నదికి ప్రధాన ఉపనది,ఇది మహేంద్రగిరి కొండల నుండి ఉద్భవించింది.అందువలననే ఈ నదిని మహేంద్రతనయ అనే పేరు సార్థకంమైంది. నది పొడవు 90 కి.మీ. (56 మైళ్ళు) ఉంది. ఈ నది శ్రీకాకుళం జిల్లా,సోంపేట మండలం, బారువ గ్రామం సమీపంలోని బంగాళాఖాతంలో విలీనం అవుతుంది.

చెయ్యేరు నది, చిత్తూరు జిల్లాలో ఉద్భవించిన బహుద, పంచ నదుల సంగమం ద్వారా చెయ్యేరు నది ఏర్పడింది.చెయ్యేరు నది పెన్నా నదికి ఉపనది.చెయ్యేరు నది కడప, చిత్తూరు జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఈ నది మీద బాదనగడ్డ వద్ద అన్నమయ్య ప్రాజెక్టు నిర్మించబడింది.వైఎస్ఆర్ జిల్లాలోని సిద్ధవటం మండలంలోని గుండ్లమడ వద్ద కుడి ఒడ్డు ఉపనదిగా పెన్నానదిలో చేరే ముందు 87 కి.మీ. దూరం ప్రవహించింది. చెయ్యేరు ఏర్పడటానికి బహుద, పంచ నదుల రెండు ప్రవాహాలు రాయవరం వద్ద కలుస్తాయి.దీని మొత్తం చదరపు వైశాల్యం 7,325 కి. మీ. ఉంది. ఈ నది ఒడిషా రాష్ట్రంలోని కలహండి జిల్లా, తువాముల్ రాంపూర్ ప్రాంతంలోని లఖ్‌బహాల్ గ్రామానికి సమీపంలో ఉన్న ఒక కొండ నుండి ఉద్భవించింది.ఇది అక్కడనుండి రాయగడ జిల్లాకు చెందిన కలహండి, కల్యాన్సింగ్‌పూర్, నక్రుండి, కెర్పాయ్ ప్రాంతాలను తాకి, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం దాటిన తరువాత కల్లేపల్లి గ్రామ సమీపంలో బంగాళాఖాతం విలీనం అయ్యింది.ఇది దాని స్వంత పరీవాహక ప్రాంతం కలిగిన స్వతంత్ర నది.నది మొత్తం పొడవు సుమారు 256 కి.మీ. (159 మైళ్ళు) ఉంటుంది. వీటిలో 161 కి.మీ. (100 మైళ్ళు) ఒడిషాలో ప్రయాణించగా, మిగిలిన ప్రయాణం ఆంధ్రప్రదేశ్‌లో సాగింది. పరీవాహక ప్రాంతం 9,510 చ. కి.మీ. (3,670 చ. మైళ్ళు) కలిగి ఉంది. నది బేసిన్ ఎత్తైన ప్రాంతాలు ప్రధానంగా గిరిజన జనాభా కలిగిన కొండ ప్రాంతాలు.ఇది ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం,విజయనగరం జిల్లాలలో ప్రవహిస్తుంది.

వంశధార నది, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రుషికుల్య, గోదావరి మధ్య తూర్పు దిశలో ప్రవహించే నది వంశధార.దీనిని బాన్షాధర నది అని కూడా అంటారు,ఈ నది ఒడిషా రాష్ట్రంలోని కలహండి జిల్లాలోని తువాముల్ రాంపూర్, ఒడిషాలోని రాయగడ జిల్లాలోని కల్యాణసింగాపూర్ సరిహద్దులో ఉద్భవించి, 254 కి.మీ. దూరం ప్రయాణించి, కళింగపట్నం వద్ద సముద్రంలో కలుస్తుంది. నదీ పరీవాహక ప్రాంతం మొత్తం 10,830 చ. కి.మీ.శ్రీకాకుళం జిల్లాలోని ముఖలింగం, కళింగపట్నం పర్యాటక ఆకర్షణలు ఈ నది ఒడ్డున ఉన్నాయి.మహేంద్రతనయ నది ఒడిషాలోని గజపతి జిల్లాలో ఉద్భవించిన వంశధార ప్రధాన ఉపనది నది.నీటిపారుదల ఉపయోగం కోసం నది నీటిని మళ్లించడానికి శ్రీకాకుళం జిల్లాలోని రేగులపాడు బ్యారేజీ నిర్మాణంలో ఉంది.

పాపాఘ్ని నది, పాపగ్ని కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలోని నంది కొండలలో ఉద్భవించింది.దక్షిణ భారతదేశంలో శాశ్వత, అంతరరాష్ట్ర నది, ఇది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఇది పెన్నా నదికి కుడి ఒడ్డున ఉపనదిగా ఉంది. పాపాగ్ని అనేది పాపా (పాపం) అగ్ని (అగ్ని) అనే పదాల సమ్మేళనం. పురాణాల ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతంలో నివసించే చెంచులు అమాయక గిరిజన నాయకుడిని చంపిన ఒక రాజు, తన పాపానికి శిక్షగా కుష్టు వ్యాధితో బాధపడ్డాడు. అతను పాపగ్ని లోయలో తపస్సు చేసి, నదిలో మునిగిపోయిన తరువాత మాత్రమే అతనికి ఈ వ్యాధి తగ్గింది. దానిపై నది తన పాపాలను బూడిదగా మార్చిందని చెప్పబడింది.తద్వారా దీనికి పాపగ్ని అనే పేరు వచ్చిందని అంటారు. పాపాఘ్ని నదీ తీర ప్రాంతంలో చిక్‌బళ్లాపూర్ వద్ద అత్యంత పురాతనమైన పాపాఘ్ని మఠం ఉంది.

పెన్ గంగా నది, మొత్తం పొడవు 676 కి.మీ. (420 మైళ్ళు).పెన్ గంగా నది మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని అజంతా శ్రేణులలో ఉద్భవించింది.అక్కడనుండి ఇది బుల్ధనా జిల్లా, వాషిమ్ జిల్లాల గుండా ప్రవహిస్తుంది.ఇది వాషిమ్ జిల్లా రిసోడ్ తాలూకాలోని షెల్గావ్ రాజ్గురే గ్రామానికి సమీపంలో ఉపనదిగా కాస్ నదిని కలుపుకుంటుంది.వాషిమ్, హింగోలి జిల్లాల సరిహద్దు గుండా ప్రవహిస్తుంది.ఇది యావత్మల్ జిల్లా, చంద్రపూర్ జిల్లా, నాందేడ్ జిల్లా మధ్య సరిహద్దుగా గుర్తిపు పొందింది.ఇది మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు వెంట ప్రవహిస్తుంది. ఇది నాందేడ్‌లోని మహూర్ సమీపంలో పస్ నదితో సంగమం చేస్తుంది.చంద్రపూర్ జిల్లాలోని చంద్రపూర్ తాలూకా, వాధ అనే చిన్న గ్రామానికి సమీపంలో పెన్ గంగా వార్ధ నదిలో కలుస్తుంది.వార్ధా నది ప్రాణహిత నదిలోకి కలసి ఇది చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రికి తూర్పున బంగాళాఖాతంలో కలసి ముగుస్తుంది.

సాగిలేరు నది, పెన్నార్ నదికి ఉపనది.సాగిలేరు నది వెలిగొండ, నల్లమల కొండల మధ్య ఉంది.ఇది ఉత్తర-దక్షిణ దిశలగుండా ప్రవహిస్తుంది. నది పరీవాహక ప్రాంతంలో ఎరుపు, నలుపు, బంకమన్ను నేలలు ఉన్నాయి.తడి, పొడి నీటిపారుదల పంటలు ఈ ప్రాంతంలో సాగుబడి చేస్తారు.ఎక్కువుగా సజ్జలు, రాగి, జొన్న, వేరుశనగ, కూరగాయలు పండిస్తారు.ఈ నదిపై నీటిపారుదల ప్రాజెక్టులు కడప జిల్లాలోని బి. కోడూరు, కలసపాడు మండలాల్లో ఉన్నాయి. వీటితో పాటు నదిపై అనేక లిఫ్ట్ ఇరిగేషన్, చిన్న నీటిపారుదల ప్రాజెక్టులు ఉన్నాయి.

సువర్ణముఖి (స్వర్ణ ముఖి) నది, చిత్తూరు జిల్లాకు చెందిన నది.చంద్రగిరి మధ్య తొండవాడ సమీప కొండప్రాంతం ఈ నది జన్మస్థానం. పాకాల సమీపంలో ఉన్న పాలకొండలో ఆదినాపల్లి వద్ద చిన్నవాగులా పుట్టింది. ధూర్జటి తన రచనల్లో దీన్ని 'మొగలేరు' అని ప్రస్తావించాడు.స్వర్ణముఖి నదీ పరీవాహక ప్రాంతంలో పవిత్ర హిందూ పుణ్యక్షేత్రాలైన తిరుమల, శ్రీకాళహస్తీశ్వరాలయం, తొండవాడ వద్ద ఉన్న అగస్తేశ్వరాలయం, గుడిమల్లం దగ్గరున్న పరశురామేశ్వరాలయం, గాజులమండ్యం దగ్గరున్న మూలస్థానేశ్వరాలయం ఉన్నాయి. ఇది జీవనది కాదు. సాధారణంగా అక్టోబరు నుంచి డిసెంబరు దాకా ప్రవహిస్తుంది.ఈ నది భీమా, కల్యాణి నదులలో సంగమించి, తొండవాడలో త్రివేణి సంగమంగా మారి, ఉత్తరవాహినిగా ప్రవహించి తూర్పున బంగాళాఖాతంలో విలీనం అవుతుంది.ఈ నదిని గురించి ఒక పురాణగాథ ఉంది.పూర్వం అగస్త్య మహర్షి బ్రహ్మను గురించి తపస్సుచేసి ఈ నదిని దేవలోకం నుంచి క్రిందికి తెప్పించినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తుంది. శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని నిర్మించేటపుడు ఆలయ నిర్మాణంలో సహకరించిన కూలీలు రోజూ సాయంత్రం నదిలో స్నానం చేసి, ఇసుక వారి చేతుల్లోకి తీసుకుంటే నది వారు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలంగా దాని విలువచేసేంత బంగారంగా మారేది. అందుకే ఈ నదికి సువర్ణముఖి, స్వర్ణముఖి అనే పేర్లు వచ్చాయి.25 మిలియన్ క్యూబిక్ మీటర్ల లైవ్ స్టోరేజ్‌తో కల్యాణి ఆనకట్టను 1977 లో దీనికి ఉపనదిగా ఉన్న కల్యాణి నది మీద నిర్మించబడింది.

సువర్ణముఖి నది, ఒడిషా రాష్ట్రంలోని తూర్పు కనుమలలో ఉద్బవించింది.ఈ నది విజయనగరం జిల్లా, వంగర మండలం కొండశేఖరపల్లి వద్ద జిల్లాలోకి ప్రవేశిస్తుది. జిల్లాలో మొత్తం 17 కి.మీ. మేర ప్రవహించి వంగర మండలంలోని సంగం గ్రామం వద్ద నాగావళి నదిలో కలుస్తోంది. సువర్ణముఖి నదిపై మడ్డువలస ప్రాజెక్టు నిర్మాణం చేయబడింది.దీనికి రెండు కాలువలు ఉన్నాయి. వీటి ద్వారా 24,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతోంది.కుడి కాల్వ రాజాం, వంగర, రేగిడి, సంతకవిటి, జి.సిగడాం మండలాల పరిధిలో మొత్తం 50 కిలోమీటర్ల పొడవున ఉంది.ఎడమ కాల్వ వంగర మండలం పరిధిలో 5 కి.మీ. మేర విస్తరించి ఉంది.

శబరి నది, గోదావరి నదికి ఉపనది. ఇది తూర్పు గోదావరి జిల్లా లోని కూనవరం వద్ద గోదావరి నదిలో కలుస్తుంది. ఇది ఒడిశా రాష్ట్రంలోని తూర్పు కనుమలలో పడమరకు వాలుగాఉన్న సింకరం కొండ శ్రేణుల నుండి 1370 సముద్రపు మీటర్ల ఎత్తు నండి ప్రవహిస్తుంది. దీనిని ఒడిషాలో కోలాబ్ నది అని కూడా పిలుస్తారు.శబరి నదీ పరీవాహక ప్రాంతానికి దాదాపు 1250 మి.మీ. వార్షిక సగటు వర్షపాతం లభిస్తుంది. ఇది ఛత్తీస్‌గడ్, ఒడిషా రాష్ట్రాల మధ్య ఉమ్మడి సరిహద్దును ఏర్పరుస్తుంది. గోదావరి నదిలో విలీనం కావడానికి ముందు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది

బహుదా నది, ఒడిషా రాష్ట్రం, గజపతి జిల్లాలోని తూర్పు కనుమలలోని సింఘరాజ్ కొండల నుండి బాహుదా నది లూబా గ్రామానికి సమీపంలో ఉద్భవించింది. ఇది 55 కి.మీ. వరకు ఈశాన్యదిశలో ప్రవహిస్తుంది.తరువాత అది ఆగ్నేయ దిశకు మారి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే ముందు ఒడిశాలో 17 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో 18 కి.మీ. దూరం ప్రవహిస్తుంది. తిరిగి ఈశాన్య దిశకు మారి ఇది ఒడిశాలో 6 కి.మీ. దూరం ప్రవహించి సునాపురపేట గ్రామానికి సమీపంలో బంగాళా ఖాతంలో కలిసింది. దీని మొత్తం పొడవు 96 కిలోమీటర్లు, ఒడిషాలో 78 కి.మీ. ప్రవహించగా,18 కి.మీ. ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తుంది.  




#Article 208: హిమాచల్ ప్రదేశ్ (183 words)


హిమాచల్ ప్రదేశ్ (हिमाचल प्रदेश)
వాయువ్య భారతదేశములోని ఒక రాష్ట్రము. రాష్ట్రానికి తూర్పున టిబెట్ (చైనా), ఉత్తరాన, వాయువ్యమున జమ్మూ కాశ్మీరు, నైఋతిన పంజాబ్, దక్షిణాన హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, ఆగ్నేయమున ఉత్తరాఖండ్ రాష్ట్రములు సరిహద్దులుగా ఉన్నాయి.

హిమాచల్ ప్రదేశ్ యొక్క విస్తీర్ణము 55,658 చ.కి.మీలు (21,490 చ.కి.మైళ్లు), 1991 జనాభా ప్రకారము రాష్ట్రము యొక్క జనాభా 5,111,079. 1948లో 30 పర్వత రాజ్యాలను కలిపి ఒక పాలనా విభగముగా హిమాచల్ ప్రదేశ్ యేర్పడినది. 1971, జనవరి 25న భారతదేశ 18వ రాష్ట్రముగా అవతరించింది.

రాష్ట్ర రాజధాని షిమ్లా. ధర్మశాల, కాంగ్ర, మండి, కుల్లు, చంబా, డల్‌హౌసీ, మనాలీ ఇతర ముఖ్య పట్టణాలు. రాష్ట్రములో చాలామటుకు ప్రాంతము పర్వతమయము. ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన శివాలిక్ పర్వతశ్రేణులు ఉన్నాయి. శివాలిక్ శ్రేణి ఘగ్గర్ నది జన్మస్థలము. రాష్ట్రములోని ప్రధాన నదులు సట్లెజ్ (భాక్రానంగల్ డ్యాం ప్రాజెక్టు ఈ నది మీదే ఉన్నది), బియాస్ నది. సట్లెజ్ నది మీద కంద్రౌర్, బిలాస్‌పూర్ వద్ద నున్న బ్రిడ్జి ఆసియాలో కెళ్లా ఎత్తైన వంతెనలలో ఒకటి.

కాంగ్రి, పహారీ, పంజాబీ, హిందీ, మండియాలీ రాష్ట్రములో ప్రధానముగా మట్లాడే భాషలు. హిందూ మతము, బౌద్ధ మతము, సిక్కు మతము రాష్ట్రములోని ప్రధాన మతములు. రాష్ట్రములోని పశ్చిమ భాగములోని ధర్మశాల, దలైలామా, అనేక టిబెట్ శరణార్ధులకు ఆవాసము.

రోడ్లు ప్రధాన రవాణా మార్గములు. రోడ్లు కురుచగా మెలికలు తిర్గుతూ తరచూ ఊచకోతలు, భూమి జారడాల మధ్య ఉండటము వలన ప్రయాణము మెళ్లిగా సాగుతుంది. ఋతుపవనాల కాలములో పరిస్థితి మరింత భయానకము అవుతుంది. ప్రభుత్వము యాజమాన్యములో నడుస్తున్న హిమాచల్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్ రాష్ట్రమంతటా బస్సులు నడుపుతుంది. దాదాపు అన్ని ప్రాంతాలకు టెలిఫోన్, మొబైల్ ఫోన్ సౌకర్యములు ఉన్నాయి.




#Article 209: ఉత్తరాఖండ్ (282 words)


BASWARAJ 1ST KING

ఉత్తరాఖండ్ (హిందీ:उत्तराखण्ड) ఉత్తర భారతదేశంలోని ఒక రాష్ట్రము. ఇది 2006 వరకు ఉత్తరాంచల్ గా పిలవబడింది. ఉత్తరాఖండ్ 2000 సంవత్సరము నవంబరు 9న భారతదేశంలో 27వ రాష్ట్రంగా ఏర్పడింది. ఇది అంతకు ముందు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక భాగము. 1990నుండి కొద్దికాలం శాంతియుతంగా సాగిన ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం విజయవంతమై ఉత్తరాఖండ్ రాష్ట్రం ఆవిర్భవించింది. ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి హద్దులు. ఉత్తరాన చైనా (టిబెట్), నేపాల్ దేశాలతో సరిహద్దులున్నాయి. రాష్ట్రం యొక్క తాత్కాలిక రాజధాని డెహ్రాడూన్. ఇదే ఈ రాష్ట్రంలో అతి పెద్ద నగరం. హైకోర్టు మాత్రం నైనిటాల్లో ఉంది. రాష్ట్రానికి నట్టనడుమున ఉన్న గైర్సాయిన్ అనే చిన్న గ్రామాన్ని ముందుముందు రాజధానిగా తీర్చిదిద్దాలనే ప్రతిపాదన ఉంది.

ఉత్తరాఖండ్‌లో పశ్చిమప్రాంతాన్ని ఘఢ్వాల్ అనీ, తూర్పు ప్రాంతాన్ని కుమావూ అనీ అంటారు. ఉత్తరాఖండ్ ఎంతో అందమైన రాష్ట్రం. ఉత్తర ప్రాంతం హిమాలయ పర్వత సానువుల్లో హిమవాహినులతోనూ, దక్షిణ ప్రాంతం దట్టమైన అడవులతోనూ కనుల పండువుగా ఉంటుంది. ఎన్నో ప్రత్యేకమైన జీవజాలాలు (భరల్, మంచుపులి వంటివి), వృక్ష సంపత్తి ఈ ప్రాంతానికి పరిమితం. భారతదేశానికి జీవనాడులైన గంగా, యమునా నదులు ఉత్తరాఖండ్‌లోని హిమవాహినులలో పుడుతున్నాయి. తరువాత అవి ఎన్నో ఏరులు, సరసులు, హిమపాతాలతో కలసి మహానదులై మైదానంలో ప్రవేశిస్తున్నాయి.
 
ఉత్తరాఖండ్ రాష్ట్రానికి పర్యాటకుల వల్ల వచ్చే ఆదాయం ఒక ముఖ్యమైన ఆర్థికవనరు. బ్రిటిష్ కాలం నుండి ముస్సోరీ, ఆల్మోరా, రాణీఖేత్‌లు వేసవి యాత్రికులకు మంచి ఆకర్షణలుగా అభివృద్ధి చెందాయి. అంతే కాకుండా హరిద్వార్, ఋషీకేశ్, బదరీనాధ్, కేదారనాధ్ వంటి చాలా పుణ్య క్షేత్రాలు వేల సంవత్సరాలుగా భక్తులకు దర్శనీయ స్థానాలుగా పేరుగొన్నాయి. పర్వాటక పరిశ్రమను మరింత అభివృద్ధి చేయడానికి రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తున్నది.

ఇంకా వివాదాస్పదమైన తెహ్రీ ఆనకట్ట నిర్మాణం ఈ రాష్ట్రంలో భాగీరధీ-భిలంగనా నదిపై 1953లో ప్రారంభమైంది.

స్థానిక ప్రజలు తమను తాము ఘర్వాలీలు, కుమావొనీలు అని చెప్పుకుంటారు. కుమావొనీలలో కొంతమంది పహాడీ అని చెప్పుకొంటారు. ఎక్కువమంది హిందూ మతస్థులు. ఇంకా గడచిన శతాబ్దంలో వలస వచ్చిన నేపాలీ సంతతి వారున్నారు. జధ్, మర్చా, సౌకా తెగలవారు భారత్-టిబెట్ సరిహద్దులలో నివసిస్తున్నారు. వీరందరినీ కలిపి భోటియాలంటారు. తెరాయి పర్వతప్రాంతాలలో తారు, భుక్షా తెగలవారున్నారు. దక్షిణ తెరాయి ప్రాంతంలో గుజ్జర్లనే సంచార పశుపాలకజాతులవారు న్నారు.

ఉత్తరాఖండ్ రాష్ట్రము అధికభాగం హిమాలయ పర్వతసానువులలో ఉంది. ఎత్తునుబట్టి వాతావరణమూ, భూస్వరూపమూ మారుతూ ఉంటాయి. ఎత్తయిన ప్రాంతాలలో మంచు కొండలూ, హిమానదాలూ ఉండగా, తక్కువ ఎత్తులున్నచోట ఉష్ణమండల వాతావరణమూ, దట్టమైన అడవులూ ఉన్నాయి. మరీ ఎత్తయిన స్థలాలు మంచుకొండలతోనూ, రాతినేలతోనూ ఉన్నాయి.

అక్కడి ప్రత్యేక భౌగోళిక లక్షణాల కారణంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చక్కని రాష్ట్రీయ ఉద్యానవనాలున్నాయి.

ఉత్తరాఖండ్ 13 జిల్లాలుగా విభజించ బడింది.




#Article 210: హర్యానా (281 words)


హర్యాణా (హింది: हरयाणा, Haryana )
వాయువ్య భారతదేశములోని రాష్ట్రము. దీనికి ఉత్తరాన పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రములు, పశ్చిమాన, దక్షిణాన రాజస్థాన్ సరిహద్దులుగా ఉన్నాయి. తూర్పున యమునా నది హర్యాణా, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రములకు సరిహద్దుగా ఉంది. ఘగ్గర్ నది, మర్ఖందా, తంగ్రి, సాహిబీ మొదలైన నదులు రాష్ట్రము గుండా ప్రవహించుచున్నాయి.

హర్యాణా ఉత్తరాన 27 డిగ్రీల 37' నుండి 30 డిగ్రీల 35' అక్షాంశముల మధ్య, 74 డిగ్రీల 28' నుండి 77 డిగ్రీల 36' రేఖాంశముల మధ్య ఉంది. హర్యాణా రాష్ట్రము సముద్రమట్టమునకు 700 నుండి 3600 అడుగుల ఎత్తున ఉంది. పరిపాలనా సౌలభ్యము కొరకు రాష్ట్రము నాలుగు విభాగములుగా విభజించబడింది. అవి అంబాలా, రోతక్, గుర్‌గావ్, హిస్సార్. రాష్ట్రము 19 జిల్లాలు, 47 ఉప-విభాగములు, 67 తాలూకాలు, 45 ఉప-తాలూకాలు, 116 బ్లాకులుగా విభజించబడింది. హర్యాణాలో మొత్తము 81 నగరములు, పట్టణములు, 6,759 గ్రామాలు ఉన్నాయి. 1,553 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణములో అడవులు ఉన్నాయి. హర్యాణా యొక్క నాలుగు ముఖ్య భౌగోళిక విశేషాలు.

ప్రపంచంలోని పురాతన, అతిపెద్ద నాగరికతలలో, సింధు లోయ నాగరికత ఉంది. రాఖిగిరి వంటి అనేక తవ్వకాల ప్రదేశాలు పురావస్తు పరిశోధనల యొక్క ముఖ్యమైన ప్రదేశాలు. అత్యంత అభివృద్ధి చెందిన మానవ నాగరికత సింధు నది వెంట వృద్ధి చెందింది, ఇది ఈ ప్రాంతంమధ్యలో ఒక సారి ప్రవహించింది.సింధు లోయలో సుగమం చేసిన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పెద్ద ఎత్తున వర్షపునీటి సేకరణ వ్యవస్థ, టెర్రకోట ఇటుక, విగ్రహ ఉత్పత్తి, నైపుణ్యం కలిగిన లోహపు పని (కాంస్య, విలువైన లోహాలు రెండింటిలోనూ) ఉన్నాయి. వాస్తవానికి సింధు నాగరికత ఆధునిక మానవ అభివృద్ధికి దారితీసింది.హర్యానాను సుల్తానేట్లు, మొఘలులు వంటి అనేక రాజవంశాలలో పాలించారు. ఇది ఆఫ్ఘన్లు, తిముత్ ఆక్రమణల క్రింద కూడా ఉంది.పంజాబ్ ప్రాంతములో అధికముగా హిందీ మాట్లాడే భాగము హర్యాణా అయినది. పంజాబీ మాట్లాడే భాగము పంజాబ్ రాష్ట్రము అయినది. ప్రస్తుత హర్యాణా జనాభాలో హిందువులు అధిక సంఖ్యాకులు. భాషా సరిహద్దు మీద ఉన్న ఛండీగఢ్కేంద్ర పాలిత ప్రాంతముగా యేర్పడి రెండు రాష్ట్రములకు రాజధానిగా వ్యవహరింపబడుతున్నది.

నౌరంగాబాద్, భివానీలోని మిత్తతల్, ఫతేబాద్ లోని కునాల్, హిస్సార్ దగ్గరి అగ్రోహా, జింద్ లోని రాఖీగర్హీ, రోతక్ లోని రూఖీ, సిర్సాలోని బనావలి మొదలైన ప్రాంతములలో జరిపిన పురావస్తు త్రవ్వకాలలో హరప్పా సంస్కృతి, హరప్ప పూర్వ సంస్కృతుల ఆధారములు లభించినవి. కురుక్షేత్ర, పెహోవా, తిల్‌పట్, పానిపట్ ప్రాంతాలలో దొరకిన మట్టి కుండలు, శిల్పాలు, ఆభరణాలు మహాభారత కథకు చారిత్రతకు ఆధారములు సమకూర్చినాయి. ఈ ప్రాంతాలన్ని మహాభారతములో ప్రీతుదక (పెహోవ), తిలప్రస్థ (తిల్‌పట్), పానప్రస్థ (పానిపట్), సోనప్రస్థ (సోనిపట్) గా ఉల్లేఖించబడినవి.

వైశాల్యము.44,212 చ.కి.




#Article 211: గోవా (1071 words)


గోవా (गोवा, Goa ) భారతదేశంలో పశ్చిమతీరాన అరేబియా సముద్రం అంచున ఉంది. ఈ ప్రాంతాన్ని కొంకణ తీరమని కూడా అంటారు. గోవాకు ఉత్తరాన మహారాష్ట్ర, తూర్పు, దక్షిణాన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఇది దేశంలో వైశాల్యపరంగా రెండవ అతిచిన్న రాష్ట్రం. జనాభా పరంగా నాలుగవ అతిచిన్న రాష్ట్రం. సిక్కిం, మిజోరామ్, అరుణాచల్ ప్రదేశ్లు గోవా కంటే తక్కువ జనాభా కలిగి ఉన్నాయి.

గోవా రాజధాని పనజీ. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వర్తకులు గోవాలో స్థావరం ఏర్పరచుకొన్నారు. కొద్దికాలంలోనే అధికారాన్ని బలవంతంగా హస్తగతం చేసుకొన్నారు. 450 ఏండ్ల తరువాత, 1961లో భారత ప్రభుత్వం సైనికచర్య ద్వారా గోవాను తన అధీనంలోకి తీసుకొన్నది.

చక్కని బీచ్ లు, ప్రత్యేకమైన కట్టడాలు, విశిష్టమైన వన సంపద - ఇవన్నీ కలిపి గోవా మంచి పర్యాటక కేంద్రంగా కావడానికి తోడ్పడ్డాయి.

గోవా లేదా గోమాంటక్ అని పిలిచే ఈ రాష్ట్రానికి ఆ పేరు ఎలా వచ్చిందనే విషయంపై స్పషష్టమైన ఆధారాలు లేవు. ఈ ప్రాంతానికి మహాభారతంలోనూ, ఇతర ప్రాచీన గ్రంథాలలోనూ గోపరాష్ట్రం, గోవరాష్ట్రం, గోపకపురి, గోపక పట్టణం, గోమంచాల, గోవపురి వంటి పేర్లు వాడబడినాయి. ఆప్రాంత అనే పేరు కూడా వాడబడింది.

గోవా ప్రాంతాన్ని చరిత్రలో మౌర్యులు, శాతవాహనులు, బాదామి చాళుక్యులు, సిల్హార వంశస్తులు, దక్కన్ నవాబులు పాలించారు. 1312 లో ఇది ఢిల్లీ సుల్తానుల వశమైనది. 1370లో విజయనగరరాజు మొదటి హరిహర రాయలు గోవాను జయించాడు. 1469లో బహమనీ సుల్తానులు దీనిని కైవసం చేసుకొన్నారు. అనంతరం బీజాపూర్ నవాబు ఆదిల్‌షా తన రెండవ రాజధానిగా చేసుకొన్నాడు.

పడమటి కనుమలులోని కొంకణ తీరాన ఉన్న గోవాకు 101 కి.మీ. సముద్ర తీరము ఉంది. మాండవి, జువారి, తెరెఖోల్, ఛపోరా, బేతుల్అనేవి గోవాలోని నదులు. జువారి నది ముఖద్వారాన ఉన్న మార్ముగోవా నౌకాశ్రయం మంచి సహజ నౌకాశ్రయం. జువారి, మాండవి నదులు, అంతటా విస్తరించిన వాటి ఉపనదులు గోవాలో మంచి నీటి వసతి, రవాణా వసతి కలిగించాయి. ఇంకా కదంబ రాజులు తవ్వించిన 300పైగా పాతకాలపు చెరువులు, 100 పైగా ఔషధిగుణాలున్న ఊటలు ఉన్నాయి.

గోవా నేల ఎక్కువ భాగం ఖనిజలవణాలుగల ఎర్రనేల. లోపలి నదీతీరాలలో నల్లరేగడి నేల ఉంది. గోవా, కర్ణాటక సరిహద్దులలో మోలెమ్, అన్‌మోడ్ల మధ్యనున్న శిలలు భారత ఉపఖండంలోన అత్యంత పురాతనమైనవాటిలోకి వస్తాయి. కొన్ని శిలలు 3,600 మిలియన్ సంవత్సరాల పురాతనమైనవని గుర్తించారు.
 
ఉష్ణవాతావరణ మండలంలో, అరేబియా సముద్రతీరాన ఉన్నందున గోవా వాతావరణం వేడిగాను, తేమగాను ఉంటుంది. వేసవి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు సెంటీగ్రేడ్ వరకు వెళతాయి. వర్షాకాలం (జూన్ - సెప్టెంబరు) పుష్కలంగా వర్షాలు కురుస్తాయి. డిసెంబరు - ఫిబ్రవరి కాలం చలికాలం. ఉష్ణోగ్రత 20 డిగ్రీలు సెంటీగ్రేడు వరకు జారుతుంది.

ప్రజల తలసరి సగటు ఆదాయం తక్కిన భారతదేశంలో కంటే గోవాలో ఒకటిన్నర రెట్లు ఎక్కువ. గోవా ఆర్థికరంగం వృద్ధికూడా 1990-2000 కాలంలో 8.23% సాదింపబడింది. పర్యాటక రంగం గోవా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. భారతదేశానికి వచ్చే మొత్తం విదేశీయాత్రికులలో 12% మంది గోవాను సందర్శిస్తున్నారు. ముఖ్యంగా తీరప్రాంతంలో యాత్రికులు ఎక్కువ.

లోపలి భాగంలో మంచి ఖనిజ సంపద ఉంది. ముడి ఇనుము, బాక్సైటు, మాంగనీసు, సిలికా వంటి ఖనుజాలు బాగా లభిస్తున్నాయి.

వ్యవసాయం కూడా చాలామందికి జీవనోపాధి. వరి, జీడిమామిడి, పోక, కొబ్బరి ప్రధానమైన వ్యవసాయోత్పత్తులు. చాల మందికి వ్యవసాయం రెండవ ఆదాయపు వనరుగా ఉంటున్నది. 40 వేలవరకూ జనాభా మత్స్య పరిశ్రమ ఆధారంగా జీవిస్తున్నారు.

పురుగు మందులు, ఎరువులు, టైరులు, ట్యూబులు, చెప్పులు, రసాయనములు, మందులు వంటి మధ్య తరహా పరిశ్రమలున్నాయి. ఇంకా చేపలు, జీడిమామిడి, కొబ్బరి వంటి ఉత్పత్తులపై ఆధారపడిన వ్యసాయిక పరిశ్రమలున్నాయి. ఆల్కహాలుపై తక్కువ పన్ను ఉన్నందున గోవాలో మద్యం ఖరీదు తక్కువ.

విదేశాలలో పనిచేసే కార్మికులు స్వదేశంలో తమ కుటుంబాలకు పంపే ధనం కూడా గోవా ఆదాయంలో ముఖ్యమైనది.

మండవి నది ఎడమ ఒడ్డున ఉన్న పనజి లేదా పంజిమ్‌లో గోవా అధికార కార్యాలయాలున్నాయ. మాండవి నది అవతలి ఒడ్డున ఉన్న పోర్వీరిమ్లో గోవా శాసన సభ ఉంది. న్యాయ విషయాలకొస్తే గోవా ముంబై, (బొంబాయి) హైకోర్టు పరిధిలోకి వస్తుంది. పనజిలో ఒక హైకోర్టు బెంచి ఉంది. జాతీయ స్థాయి పార్లమెంటులో గోవానుండి రెండు లోక్‌సభ స్థానాలు, ఒకరాజ్యసభ స్థానము ఉన్నాయి. గోవా అసెంబ్లీలో 40 మంది సభ్యులున్నారు. అన్ని రాష్ట్రాలలాగానే గవర్నరు, ముఖ్యమంత్రి, మంత్రి మండలి, శాసన సభ్యులుతో కూడిన పాలనా వ్యవస్థ ఉంది.

గోవాలో ముఖ్యమైన రాజకీయ పార్టీలు:

మిగిలిన రాష్ట్రాలలో బ్రిటిష్ పద్ధతిలో మతం ప్రకారం పౌర చట్టాలు(civil laws) అమలులో ఉన్నాయి. కాని గోవాలో పోర్చుగీసు వారి పద్ధతి ప్రకారం యూనిఫాం సివిల్ కోడ్ అమలులో ఉంది.

వైశాల్యము.3,702 చ.కి.

గోవా నివాసిని ఆంగ్లంలో గోవన్ అని, కొంకణిలో గోయెంకర్ అని, మరాఠీలో గోవేకర్ అని, పోర్చుగీసు భాషలో మగవారిని గోయెస్ Goês అని, ఆడువారిని గోయెసా Goesa అని అంటారు.

ఇప్పుడు గోవా జనాభా 13,47,668 - ఇందులో 6,87,248 మంది పురుషులు, 6,60,420 స్త్రీలు. మిగిలిన వివరాలు

గోవాను రెండు జిల్లాలుగా విభాజించారు.

ఈ రెండు జిల్లాలను మొత్తం 11 తాలూకాలుగా విభజించారు. ఉత్తర గోవాలో బార్డేజ్, బికోలిం, పెర్నెం, పోండ, సతారి, తిస్వాది తాలూకాలు ఉంటే దక్షిణ గోవాలో కనకోన, మోర్ముగోవ, క్వేపెం, సాల్సెటె, సాంగ్వెం.

ప్రైవేటు ఆపరేటర్లు నడిపే బస్సులు గోవాలో ప్రధానమైన రవాణా సౌకర్యం. ప్రభుత్వ రంగంలో ఉన్న కదంబ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషను ముఖ్యమైన రూట్లలోను, కొన్ని గ్రామీణ ప్రాంతాలలోను బస్సులు నడుపుతుంది. కాని ఎక్కువ మంది ప్రయాణాలకు తమ స్వంత వాహనాలనే వినియోగిస్తుంటారు. ముఖ్యంగా ద్విచక్రవాహనాల వినియోగం ఎక్కువ.

ఇంకా టాక్సీలు, ఆటో రిక్షాలు ప్రజల ప్రయాణాలకు అద్దెకు దొరికే వాహనాలు. మోటారు సైకిలు టాక్సీ అనేది గోవాకు ప్రత్యేకమైన అద్దె టాక్సీ - ఇవి పసుపు, నలుపు రంగుల్లో ఉండే మోటారు సైకిళ్ళు. వీటిని నడిపేవారిని పైలట్లు అంటారు. ప్రయాణీకుడు వెనుక సీటులో కూర్చుంటాడు. ఇవ్వాల్సిన కిరాయి ముందుగానే బేరమాడుకుంటారు.

కొన్ని చోట్ల నదులు దాటడానికి ఫెర్రీలు వాడతారు. గోవాలో రెండు రైల్వే లైనులున్నాయి - ఒకటి స్వాతంత్ర్యానికి పూర్వం నిర్మించిన వాస్కో డ గామా - హుబ్లీ మార్గం. మరొకటి 1990 దశకంలో నిర్మించిన కొంకణ్ రైల్వే మార్గం.

ఎక్కువగా మిలిటరీ అవసరాలకు వాడే దబోలిమ్ ఎయిర్‌పోర్టు మాత్రమే గోవాలో ఉన్న ఎయిర్‌పోర్టు. మార్ముగోవా నౌకాశ్రయం ఎక్కువగా గోవాలో లభించే ఖనిజ సంపద రవాణాకు ఉపయోగపడుతుంది. పనజి పోర్టునుండి ముంబైకి ప్రయాణీకులను చేరవేసే స్టీమర్లు బయలుదేరతాయి.

గణేష్ చతుర్ధి, క్రిస్టమస్, ఆంగ్ల సంవత్సరాది, షిగ్మో పండుగ, గోవా కార్నివాల్ (కార్నివాల్ అంటే తిరనాళ్లు) - ఇవి గోవాలో పెద్ద ఎత్తున జరుపుకొనే ఉత్సవాలు.

సాంప్రదాయిక కొంకణి జానపద గీతాలు, సాంప్రదాయిక మందో సంగీతం, పాశ్చాత్య సంగీతం, గోవా ట్రాన్స్ సంగీతం (గోవా ట్రాన్స్ సంగీతం) - వీటన్నింటికీ గోవాలో మంచి ప్రజాదరణ ఉంది.

వరి అన్నము, చేపల కూరా - ఇవి గోవా వాసుల ప్రధాన దైనిక ఆహారము. కొబ్బరి, మసాలా దినుసులు, జీడిమామిడి, మిర్చి వంటి ద్రవ్యాలు వాడి తయారుచేసే ఎన్నో రుచికరమైన వంటలు గోవా ప్రత్యేకం. జీడి మామిడి పండునుంచి, కొబ్బరి కల్లునుంచి తయారు చేసే ఫెని అనే మద్యం గోవాలో అత్యంత సామాన్యం.

గోవాలో రెండు ప్రపంచ వారసత్వ స్థలాలు (వరల్డ్ హెరిటేజ్ సైట్స్) ఉన్నాయి. బామ్ జీసస్ బసిలికా (Bom Jesus Basilica). ఇక్కడ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ దేహమును భద్ర పరచారు. ప్రతి పదేళ్ళకూ ఒకసారి ఈ శరీరాన్ని పూజకై వెలికి తీసి ప్రజలు చూసేందుకు అనుమతిస్తారు. 2004లో ఈ కార్యక్రమం జరిగింది.

భారత-పోర్చుగీసు శైలిలో నిర్మించిన పాతకాలపు ప్రాసాదాలు గోవాలో మరొక ఆకర్షణ. కాని ఇవి ప్రస్తుతం చాలావరకు శిథిలమయ్యే పరిస్థితిలో ఉన్నాయి. పాంజిమ్‌లోని ఫౌంటెన్‌హాస్ (Fontainhas) అనే ప్రాంతం సాంస్కృతిక ప్రాంతంగా గుర్తింపబడింది. గోవా జీవనాన్నీ, నిర్మాణాలనూ ప్రతిబింబించే పేట అని దీనిని చెప్పవచ్చును. కొన్ని హిందూ దేవాలయాలలో (ఉదాహరణ - మంగ్వేషి మందిరం) కూడా ఈ శైలి కనిపిస్తుంది.

గోవాలో ఫుట్‌బాల్ బాగా జనాదరణ ఉన్న ఆట. మైదానాల్లోనూ, పొలాల్లోనూ వర్షాలు లేనపుడు ఫుట్‌బాల్ ఆట బాగా ఆడుతారు. గోవాలో చాలా ఫుట్‌బాల్ క్లబ్బులున్నాయి. ఇటీవలి కాలంలో క్రికెట్ పట్ల జనాకర్షణ బాగా పెరుగుతున్నది. మార్‌గావ్ లోని 'ఫటోరా స్టేడియమ్' ఈ ఆటల పోటీలకు ఉన్న మంచి వసతి. హాకీ మూడవ ప్రజాదరణ గల ఆట.

గోవాలోని 1,424 చ.కి.మీ. అరణ్యంలో ఎక్కువ భాగం ప్రభుత్వాధీనంలో ఉన్నది. ముఖ్యంగా పడమటి కనుమలలోని వనాలు దక్షిణ అమెరికాలోని అమెజాన్ నదీ ప్రాంతపు అరణ్యాలలాగానే వివిధ వృక్ష, జంతు జాలానికి ఆవాసమైన ఉష్ణమండలపు వనాలు. వెదురు, మరాఠా బార్క్స్s, chillar barks and the bhirand వంటి వన్యోత్పత్తులు ఈ అడవులలో లభిస్తాయి.

గోవా అంతటా కొబ్బరి చెట్లు, తోటలు సర్వ సాధారణం. ఇంకా జీడి మామిడి, టేకు, మామిడి, పనస, పైనాపిల్, నేరేడు వంటి చెట్లుకూడా అడవులలో గాని, తోటలలో గాని బాగా ఉన్నాయి.

గోవా అడవులలో నక్కలు, అడవి పందులు, వలస పక్షులు, కింగ్ఫిషర్ పక్షులు, మైనాలు, చిలుకలు వంటి జంతు సంపద ఎక్కువ. వివిధ రకాలైన చేపలు, సరోవర జీవులు, సముద్ర జీవులు ఉన్నాయి. గోవాలో పాములు కూడా ఎక్కువే. ఇవి ఎలుకల సంఖ్యను అదుపులో ఉంచుతాయి.

గోవాలో పెక్కు జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి కొన్ని

అన్ని ప్రాంతాలలాగానే ఆల్ ఇండియా రేడియో సర్వీసు, ప్రధాన టెలివిజన్ సర్వీసులు ఉన్నాయి. అన్ని ముఖ్యమైన మొబైల్ సెల్‌ఫోను సర్వీసులు ఉన్నాయి.

ముఖ్యమైన వార్తా పత్రికలు: ఆంగ్లంలో హెరాల్డ్ (ఇది గోవాలో బాగా పాత పత్రిక. 1983 వరకు ఓ హెరాల్డో అనే పోర్చుగీసు పత్రిక) ), గోమంతక్ టైమ్స్, నవహింద్ టైమ్స్. ఇవి కాక జాతీయ వార్తా పత్రికలు చదువుతారు.

ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు కూడా విద్యా సదుపాయాలను అందిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలలో ఎక్కువగా మరాఠీ, కొంకణి మాధ్యమాలున్నాయి. దేశమంతటావలెనే ఇంగ్లీషు మీడియం చదువుకు జనాదరణ పెరుగుతున్నది.

ఉన్నత విద్యకు కాలేజీలున్నాయి. గోవా విశ్వ విద్యాలయం అనేది గోవాలో ఒకే ఒక విశ్వ విద్యాలయం. రెండు ఇంజినీరింగ్ కాలేజీలు, ఒక మెడికల్ కాలేజి ఉన్నాయి. మెరైన్ ఇంజినీరింగ్, హోటల్ మానేజిమెంట్, టూరిజమ్ వంటి కోర్సులకు గోవా ప్రసిద్ధం.

కొన్ని స్కూళ్ళలో పోర్చుగీసు భాష మూడవ భాషగా బోధిస్తారు.




#Article 212: మిజోరాం (159 words)


మిజోరామ్ (Mizoram) భారతదేశము ఈశాన్యప్రాంతంలోని ఒక రాష్ట్రము. 2001 జనాభా లెక్కల ప్రకారము మిజోరామ్ జనాభా సుమారు 8,90,000. మిజోరామ్ అక్షరాస్యత 89%. ఇది దేశంలో కేరళ తరువాత అత్యధిక అక్షరాస్యత సాధించిన రాష్ట్రము. .

మిజోరామ్‌లో అత్యధికశాతం జనులు మిజోతెగ (జాతి) కు చెందినవారు. వీరిలో కొన్ని ఉపజాతులున్నాయి. రెండింట మూడొంతులు 'లూసాయ్' తెగకు చెందినవారు. 'రాల్తే', 'హ్మార్', 'పైహ్తే', 'పోయ్', 'పవి' తెగలుకూడా 'మిజో'లోని ఉపజాతులే. అయితే 'చక్మా' అనే తెగవారు మాత్రం మిజో జాతికి చెందరు. వీరు 'అరకాన్' జాతికి సంబంధించినవారు.

మొత్తం రాష్ట్ర జనాభాలో 85% క్రైస్తవులు - ముఖ్యంగా బాప్టిస్టు లేదా ప్రెస్బిటీరియన్ వర్గం. దాదాపు మిజోజాతివారు అంతా క్రైస్తవులే. చుట్టుప్రక్కలున్న నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాలలో కూడా క్రైస్తవమతం ప్రధానమైనది. ఎక్కువగా హిందువులు, తరువాత ముస్లిములు ఉన్న భారతదేశంలో ఈశాన్యరాష్ట్రాలలోని ఈ సోదరీరాష్ట్రాల విలక్షణతల్లో క్రైస్తవమతం ఒకటి. చక్మా తెగవారు ప్రధానంగా ధేరవాద బౌద్దమతస్తులు. కాని వారి ఆచారాల్లో హిందూసంప్రదాయాలు, అడవిజాతి సంప్రదాయాలు (Animism) కలసి ఉంటాయి.

ఇటీవలి కాలంలో కొందరు మిజోలు యూదు మతాన్ని అందిపుచ్చుకొంటున్నారు. యూదులలోనుండి దూరమైన తెగలలో మిజోలు ఒకరు అని ఒక స్థానిక పరిశోధకుడు వెలువరించిన పరిశోధనా పఠనము దీనికి స్ఫూర్తి. 1980 నుండి దాదాపు 5 వేలమంది మిజోలు, కుకీలు యూదుమతాన్ని స్వాగతించిన కుటుంబాలకు చెందినవారు. కాని స్థానిక చర్చివర్గాలు ఈ వాదనను పూర్తిగా తిరస్కరిస్తున్నాయి. మిజోరామ్‌లో 7,50,000 పైగా జనాభాను ప్రభావితం చేయగలందున చర్చిలు గణనీయమైన ప్రతిష్ఠ కలిగిఉన్నాయి.




#Article 213: ఉత్తరప్రదేశ్ (497 words)


ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh, హిందీ: उत्तर प्रदेश, ఉర్దూ: اتر پردیش) భారతదేశంలో అత్యధిక జనాభా గల అతి పెద్ద రాష్ట్రము. వైశాల్యం ప్రకారం 5 వ పెద్ద రాష్ట్రము. ఉత్తర ప్రదేశ్ కు పరిపాలనా కేంద్రము లక్నో. కాని రాష్ట్ర ప్రధాన న్యాయస్థానం మాత్రం అలహాబాదులో ఉంది. ఇంకా ఆగ్రా, అలీగఢ్, అయోధ్య, వారాణసి, గోరఖపూర్, కాన్పూర్ ముఖ్యమైన నగరాలు. ఉత్తరప్రదేశ్ పొరుగున ఉత్తరాంచల్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్, బీహార్ రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తరాన నేపాల్తో అంతర్జాతీయ సరిహద్దు ఉంది.

ఉత్తరప్రదేశ్ ప్రధానంగా గంగా యమునా మైదానప్రాంతంలో విస్తరించి ఉంది. ఇది బాగా జన సాంద్రత ఎక్కువైన ప్రాంతము. 2000 సంవత్సరంలో పార్లమెంట్ చట్టం ప్రకారం అప్పటి మరింత విస్తారమైన ఉత్తరప్రదేశ్ లోని ఉత్తర పర్వతప్రాంతం ఉత్తరాంచల్ అనే ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. అయినా గాని ఉత్తరప్రదేశ్ దాదాపు 18కోట్ల జనాభా కలిగి ఉంది. ఇది భారతదేశంలో పెద్దరాష్ట్రము మాత్రమే కాదు. ప్రపంచంలోనే జనాభా పరంగా ఉత్తరప్రదేశ్ కంటే పెద్ద దేశాలు 5 మాత్రమే ఉన్నాయి. అవి - చైనా, భారత్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇండొనేషియా, బ్రెజిల్. సమకాలీన భారత రాజకీయాలలో ఉత్తరప్రదేశ్ పాత్ర చాలా కీలకమైనది కావడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం.

భారతదేశంలో ఆర్థిక అభివృద్ధిపరంగా ఉత్తరప్రదేశ్ వెనుకబడిన రాష్ట్రాలలో ఒకటి. మొత్తం రాష్ట్రంలో అక్షరాస్యత బాగా తక్కువ. అందునా మహిళలలో అక్షరాస్యత మరీ తక్కువ (భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ ఇదే పరిస్థితి ఉన్నది)

గంగా యమునా పరీవాహక ప్రాంతం పురాతన నాగరికతకు నిలయమైనందున పురాణకాలం నుండి ఉత్తరప్రదేశ్, బీహార్, దాని పరిసర ప్రాంతాలు (ఢిల్లీతో సహా) భారతదేశ చరిత్రలో ప్రముఖంగా కనిపిస్తాయి. ఎన్నో రాజవంశాలు, రాజ్యాలు ఈ ప్రాతంలో విలసిల్లాయి, అంతరించాయి.

అవధ్ (ఓధ్) రాజ్య సంస్థానమూ, బ్రిటిష్ రాజ్యభాగమైన ఆగ్రా కలిపి 1902 నుండి సంయుక్త పరగణాలు (యునైటెడ్ ప్రావిన్సెస్) అని పిలువబడ్డాయి. తరువాత రాంపూర్, తెహ్రి సంస్థానాలు కూడా అందులో విలీనం చేయబడ్డాయి. 1947లో భారతస్వతంత్రము తరువాత దీనినే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పరచారు. ఇలా చేయడం వల్ల యు.పి. అనే సంక్షిప్తనామం కొనసాగింది. 2000 సం.లో దీనిలో కొంత వాయువ్యభాగాన్ని ఉత్తరాంచల్ అనే ప్రత్యేక రాష్ట్రంగా విభజించారు.

ఉత్తర ప్రదేశ్ లోని 70 జిల్లాలు 17 విభాగాలుగా పరిగణించ బడుతాయి. అవి ఆగ్రా, అజంగడ్, అలహాబాదు, కాన్పూర్, గోరఖ్‌పూర్ , చిత్రకూట్, ఝాన్సీ, దేవీపటణ్, ఫైజాబాద్, బాహ్రూచ్, బరేలీ, బస్తీ, మీర్జాపూర్, మొరాదాబాద్, మీరట్, లక్నో, వారాణసి, సహరాన్పూర్.

హిందీ, ఉర్దూ - రెండు భాషలూ రాష్ట్రంలో అధికార భాషలుగా గుర్తింపబడ్డాయి. పశ్చిమప్రాంతంలో మాట్లాడే ఖరీబోలీ (కడీబోలీ) భాష హిందీ, ఉర్దూ భాషలకు మాతృక వంటిది. 19వ శతాబ్దంలో హిందీ భాష ఇప్పుడున్న స్థితికి రూపు దిద్దుకొంది. లక్నోలో మాట్లాడే భాష లక్నొవీ ఉర్దూ ప్రధానంగా స్వచ్ఛమైన ఉర్దూగా పరిగణిస్తారు. ఈ భాషనే కవిత్వంలో విరివిగా వాడుతారు. ఇంకా కోషాలి, బ్రజ్ (2000 సంవత్సరాలు పురాతనమైన భాష), బాఘేలి, బుందేలి, భోజపురి భాషలు వేరువేరు ప్రాతాలలో మాట్లాడుతారు. భోజపురి భాష మాట్లాడేవారు ఉత్తరప్రదేశ్, బీహారు, నేపాల్ లలో విస్తరించి ఉన్నారు.

భారత రాజకీయాలలో ఉత్తరప్రదేశ్ చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహాదుర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, చరణ్ సింగ్, వి.పి.సింగ్ ఇలా ఎందరో భారత ప్రధానమంత్రులు ఉత్తర ప్రదేశ్ నుండి దేశానికి నాయకులయ్యారు. అటల్ బిహారీ వాజపేయి కూడా లక్నో నుండి ఎన్నికయ్యారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీకి చెందిన యోగి ఆదిత్యనాద్ .

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం విద్యపై గణనీయమైన పెట్టుబడి పెట్టింది. ఫలితాలు ఒక మాదిరిగా ఉన్నాయి. ముఖ్యంగా ఆడువారు విద్యలో బాగా వెనుకబడి ఉన్నారు. 1991 గణాంకాల ప్రకారం 7 సంవత్సరములు పైబడిన బాలికలలో 25 % మాత్రం అక్షరాస్యులు. ఇదే సంఖ్య గ్రామీణ ప్రాంతాలలో 19%, వెనుకబడిన జాతులలో 8 నుండి 11% ఉండగా, వెనుకబడిన జిల్లాలలో మొత్తం అక్షరాస్యత 8% మించలేదు.

అలాగని ఉన్నత విద్యకు అవకాశాలు గణనీయంగానే ఉన్నాయి. రాష్ట్రంలో 16 విశ్వ విద్యాలయాలు, 3 సాంకేతిక విశ్వ విద్యాలయాలు, ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాన్పూరు), ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ (లక్నో), చాలా ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలీజీలు ఉన్నాయి.

తాజ్ మహల్ ( తాజ్) మొఘల్ భవన నిర్మాణ శాస్త్రానికి ఒక గొప్ప ఉదాహరణగా గుర్తించబడింది.ఇది పర్షియా, భారతీయ, ఇస్లాం భవన నిర్మాణ అంశాల శైలితో నిర్మించబడింది.1983వ సంవత్సరంలో తాజ్ మహల్‌ను యునెస్కో ప్రపంచ పూర్వ సంస్కృతి ప్రదేశంగా మార్చింది., భారత దేశంలో ఉన్న ముస్లిం కళ ఆభరణంగా ఉదాహరించింది.అంతేగాక విశ్వవ్యాప్తంగా మెచ్చుకొనబడిన వాటిలో ఒక దివ్యమైన ప్రపంచ పూర్వ సంస్కృతిగా అభివర్ణించింది.




#Article 214: మధ్య ప్రదేశ్ (498 words)


మధ్య ప్రదేశ్ (Madhya Pradesh) (హిందీ:मध्य प्रदेश) - పేరుకు తగినట్లే భారతదేశం మధ్యలో ఉన్న ఒక రాష్ట్రం. దీని రాజధాని నగరం భోపాల్. ఇంతకు పూర్వం దేశంలో వైశాల్యం ప్రకారం మధ్యప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రంగా ఉండేది. కాని 2000 నవంబరు 1 న మధ్యప్రదేశ్‌లోని కొన్నిభాగాలను వేరుచేసి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.

మధ్యప్రదేశ్ భౌగోళిక స్వరూపంలో నర్మదా నది, వింధ్య పర్వతాలు, సాత్పూరా పర్వతాలు ప్రధాన అంశాలు. తూర్పు, పడమరలుగా విస్తరించిన ఈ రెండు పర్వతశ్రేణుల మధ్య నర్మదానది ప్రవహిస్తున్నది. ఉత్తర, దక్షిణ భారతదేశాలకు తరతరాలుగా ఈ కొండలు, నది హద్దులుగా పరిగణింపబడుతున్నాయి. మధ్యప్రదేశ్‌కు పశ్చిమాన గుజరాత్, వాయువ్యాన రాజస్థాన్, ఈశాన్యాన ఉత్తర ప్రదేశ్, తూర్పున ఛత్తీస్‌గఢ్, దక్షిణాన మహారాష్ట్ర రాష్ట్రాలతో హద్దులున్నాయి.

భాషా (యాస) పరంగాను, సాంస్కృతికంగాను మధ్యప్రదేశ్‌ను ఈ ప్రాంతాలుగా విభజింపవచ్చును.

మధ్య ప్రదేశ్‌లోని 48జిల్లాలను 9 డివిజన్‌లుగా విభజించారు. ఆ డివిజన్లు: భోపాల్, చంబల్, గ్వాలియర్, హోషంగాబాద్, ఇండోర్, జబల్‌పూర్, రేవా, సాగర్, ఉజ్జయిన్.

ఉజ్జయిని (అవంతీ నగరం అనికూడా పేరు) ఒకప్పటి మాల్వా రాజ్యానికి రాజధాని. క్రీ.పూ. 6వ శతాబ్దిలోనే భారతదేశంలో నగరాలు, నాగరికత రూపుదిద్దుకొటున్న సమయంలో ఇది ఒక ప్రధాన నాగరిక కేంద్రంగా వర్ధిల్లింది. ధానికి తూర్పున బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఛేది రాజ్యం ఉండేది. క్రీ.పూ. 320లో చంద్రగుప్త మౌర్యుడు ఉత్తరభారతాన్ని అంతటినీ మౌర్య సామ్రాజ్యం క్రిందికి తెచ్చాడు. అందులో ఇప్పటి మధ్యప్రదేశ్ అంతా కలిసి ఉంది. క్రీ.పూ. 321 నుండి 185 వరకు సాగిన మౌర్యసామ్రాజ్యం అశోక చక్రవర్తి అనంతరం పతనమయ్యింది. అప్పుడు మధ్యభారతంపై ఆధిపత్యంకోసం శకులు, కుషాణులు, స్థానిక వంశాలు పోరుసాగించాయి.

క్రీ.పూ.1వ శతాబ్దం నాటికి పశ్చిమభారతంలో ఉజ్జయిని ప్రధాన వాణిజ్యకేంద్రం. గంగామైదానం ప్రాంతాలకు, అరేబియా సముద్రం తీరానికి మధ్యనున్న వాణిజ్యమార్గంలో ఉన్న నగరం. హిందూ, బౌద్ధ మతాల కేంద్రం. 
క్రీ.శ. 1 నుండి మూడవ శతాబ్దం వరకు మధ్యప్రదేశ్‌లో కొంతభాగం శాతవాహనుల అధీనంలో ఉండేది.

మహాకోసలలోని గొండ్వానాలో గోండ్ రాజ్యాలు నెలకొన్నాయి. 13వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానులు మధ్యప్రదేశ్‌ను జయించారు. ఢిల్లీ సుల్తానుల పతనం తరువాత మళ్ళీ కొంతకాలం స్థానిక స్వతంత్రరాజుల పాలన సాగింది. గ్వాలియర్‌లో తోమార రాజపుత్రులు, మాళ్వాలో ముస్లిం సులతానులు (వీరి రాజధాని మండూ) రాజ్యం చేశారు. 1531లో మాళ్వా సులతానులను గుజరాత్ సుల్తానులు జయించారు.

అక్బరు చక్రవర్తి (1542-1605) కాలంలో మధ్యప్రదేశ్‌లో అధికభాగం ముఘల్ సామ్రాజ్యం క్రిందికి వచ్చింది. గొండ్వానా, మహాకోసల రాజ్యాలు గోండ్‌‌రాజుల పాలనలోనే ఉన్నాయి. వీరు ముఘల్ సామ్రాజ్యానికి నామమాత్రంగా సామంతులుగా ఉండేవారు. 1707లో ఔరంగజేబు మరణానంతరం ముఘల్ సామ్రాజ్యం బలహీనపడింది. అప్పుడే మధ్యభారతంలో మరాఠాలు తమ ప్రాభవాన్ని విస్తరింపజేసుకొనసాగారు. 1720-1760 మధ్య మధ్యప్రదేశ్ చాలాభాగం మరాఠాల అధీనంలోకి వచ్చింది. మరాఠా పేష్వాల అనుజ్ఞలకు లోబడి స్వతంత్ర మరాఠా రాజ్యాలు మధ్యప్రదేశ్‌లో నెలకొన్నాయి. ఇండోర్‌కు చెందిన హోల్కర్‌లు మాళ్వాను పాలించారు. నాగపూర్‌కు చెందిన భోంసలే‌లు మహాకోసల, గొండ్వానాలను, మహారాష్ట్రలోని విదర్భను పాలించారు. 
ఒక మరాఠా సేనాధిపతి ఝాన్సీ రాజ్యాన్ని స్థాపించాడు. ఆఫ్ఝన్‌ సేనాధిపతి దోస్త్ మొహమ్మద్ ఖాన్‌వంశానికి చెందిన వారు భోపాల్‌ను పాలించారు. 1761లో మూడవ పానిపట్టు యుద్ధం తరువాత మరాఠా విస్తరణకు కళ్ళెం పడింది.

ఆ కాలంలో బ్రిటిష్‌వారు బెంగాల్, బొంబాయి, మద్రాసులలో స్థావరాలు ఏర్పరచుకొని భారతదేశంలో తమ అధీనాన్ని విస్తరించుకొనసాగారు. తత్కారణంగా 1775 - 1818 మధ్య మూడు ఆంగ్ల-మరాఠా యుద్ధాలు జరిగాయి. మూడవ యుద్ధం తరువాత బ్రిటిష్‌వారి అధిపత్యానికి దాదాపు ఎదురులేకుండా పోయింది. మహాకోసల ప్రాంతం (సౌగార్, నెర్బుద్ద విభాగాలు) బ్రిటిష్ రాజ్యంలో కలిసిపోయింది. దీనిని మధ్య పరగణాలు (Central Provinces) అని పిలచేవారు. ఇండోర్, భోపాల్, నాగపూర్, రేవా, మరి చాలా చిన్న సంస్థానాలు బ్రిటిష్‌వారికి లోబడిన రాజ్య సంస్థానాలయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని ఉత్తరభాగరాజసంస్థానాలు Central India Agency పాలనలో నడచేవి.

మధ్యప్రదేశ్‌లో ఎన్నో ప్రదేశాలు సహజసౌందర్యానికి, అద్భుతమైన నిర్మాణాలకు ప్రసిద్ధి చెందాయి. మూడు స్థలాలు ప్రపంచ వారసత్వ స్థలాలుగా (World Heritage Sites) ఐక్యరాజ్యసమితి విద్యా సాంస్కృతిక సంస్థ (UNESCO) చే గుర్తింపబడ్డాయి. అవి

ఇంకా చారిత్రిక నిర్మాణాలకు పేరుపొందిన స్థలాలు

మధ్యప్రదేశ్‌లో పర్యటనకు సంబంధించిన వివరాలకోసం  చూడండి.

మధ్యప్రదేశ్‌లో ఎన్నో జాతీయ ఉద్యానవనాలు (National Parks) ఉన్నాయి. వాటిలో కొన్ని:

ఇంకా కొన్ని ప్రకృతిసహజ విశేషాలున్న స్థలాలు:

మధ్యప్రదేశ్‌లో ప్రధానంగా మాట్లాడే భాష హిందీ. ప్రామాణికమైన హిందీతోబాటు ఒకోప్రాంతంలో ఒకో విధమైన భాష మాట్లాడుతారు. ఈ భాషలను హిందీ మాండలికాలు అని కొందరూ, కాదు హిందీ పరివారానికి చెందిన ప్రత్యేకభాషలని కొందరూ భావిస్తారు. ఇలా మాట్లాడే భాషలు (యాసలు) : మాళ్వాలో మాల్వి, నిమర్‌లో నిమడి, బుందేల్‌ఖండ్‌లో బుందేలి, బాగెల్‌ఖండ్‌లో బాఘేలి. ఇంకా మధ్యప్రదేశ్‌లో మాట్లాడే భాషలు - భిలోడి భాష, గోండి భాష, కాల్తో భాష; ఇవన్నీ ఆదిమవాసుల భాషలు. మరాఠీ భాష మాట్లాడేవారు కూడా మధ్యప్రదేశ్‌లో గణనీయంగా ఉన్నారు.




#Article 215: రాజస్థాన్ (287 words)


రాజస్థాన్ (Rajasthan) (राजस्थान) భారత దేశంలో వైశాల్యం ప్రకారం అతి పెద్ద రాష్ట్రం. రాజస్థాన్ కు పశ్చిమాన పాకిస్తాన్ దేశం ఉంది. ఇంకా నైఋతిన గుజరాత్, ఆగ్నేయాన మధ్య ప్రదేశ్, ఈశాన్యాన ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాన పంజాబు రాష్ట్రాలు రాజస్థాన్ కు హద్దులు. మొత్తం రాజస్థాన్ వైశాల్యం 3లక్షల 42వేల చదరపు కి.మీ. (1,32,139 చదరపు మైళ్ళు)

రాజస్థాన్ రాష్ట్రంలో ప్రధానమైన భౌగోళిక అంశం థార్ ఎడారి. ఆరావళీ పర్వత శ్రేణులు రాజస్థాన్ భూభాగాన్ని మధ్యగా విడగొడుతున్నాయి. ఈ పర్వతాలు ఋతుపవనాలను అడ్డుకోవడం వల్ల పశ్చిమ ప్రాతంలో వర్షపాతం దాదాపు శూన్యం. అందువల్ల అది ఎడారిగా మారింది. మరొప్రక్క దట్టమైన అడవులతో గూడిన రణథంబోర్ నేషనల్ పార్క్ (పులులకు సంరక్షణాటవి), ఘనా పక్షి ఆశ్రయం, భరత్ పూర్ పక్షి ఆశ్రయం ఉన్నాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరం.

రాజపుత్రులచే పాలింపబడింది గనుక రాజస్థాన్ రాజపుటానా రాష్ట్రంగా వ్యవహరించేవారు. రాజస్థాన్ చరిత్రలో ఎక్కువకాలం యుద్ధప్రియులైన చిన్న చిన్న రాజపుత్ర వంశపు రాజుల పాలనలో సాగింది. ఈ ప్రాంతాన్ని బయటివారెవరూ పూర్తిగా ఆక్రమించలేకపోయారు. అయితే వేరు వేరు ఒడంబడికలద్వారా బ్రిటిష్ పాలకులు మాత్రం పెత్తనం చలాయించారు. ఈ విధమైన చరిత్ర వల్ల రాజస్థాన్ లో చాలా చారిత్రిక నిర్మాణాలు, కోటలు, సంస్కృతి విలక్షణంగా నిలబడ్డాయి. అందువల్లనే అక్కడ అభివృద్ధి కొరవడిందనీ, సమాజంలో అసమానతలు ప్రబలి ఉన్నాయనీ, స్త్రీలు బాగా వెనుకబడ్డారనీ కొదరి వాదన.

రాజస్థాన్ లో ఎన్నో కోట కట్టడాలు ఇప్పటికీ క్షత్రియుల రాచరికానికి, చరిత్రకి అద్దంపడుతుంటాయి.

అచల్గర్ కోట: మౌంట్ అబూకి 11 కి. మీ. దూరంలో ఈ కోటను పరమార వంశస్థులు కట్టారు. తరువాత 1452లో ఈ కోటకు రాణా కుంభ అనే రాజు అచల్గర్ అని పేరు పెట్టాడు. ఈ కొటలో 1513 లో కట్టబడిన జైన్ దేవాలయాలు కూడా ఉన్నాయి.

రాజస్థాన్ లో ఇప్పటికీ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎక్కువగా ఉంది. ఆక్కడి స్త్రీలు ఆచారాలను, సంప్రదాయలను గౌరవిస్తారు, తూచా తప్పకుండా పాటిస్తారు. భారత దేశంలో విడాకుల సంఖ్య అతి తక్కువగా ఉన్న 2, 3 రాష్ట్రాలలో రాజస్థాన్ ఒకటి. దేశంలో ఇతర రాష్ట్రాలలో కాకుండా అక్కడి స్త్రీలు బయటకు ఒంటరిగా వెళ్ళుట, ఫ్యాషన్ గా ఉండుట కనిపించరు. సినిమా, మీడియా ప్రభావం అతి తక్కువగా ఉండటం, పురుషుల కట్టుబాట్ల పట్టింపు దీనికి కారణాలుగా చెప్పవచ్చు. అక్కడ ఇద్దరి వ్యక్తుల మధ్య వాగ్వివాదాలు అతి తక్కువ. పోలీసులు సాధారణంగా రోడ్ల పై కనిపించరు.

రాజస్థాన్ లో 33 జిల్లాలు ఉన్నాయి.

రాజస్థాన్ చరిత్ర, సాహిత్యం ఎన్నో వీరగాధలతో నిండి ఉన్నాయి. ఎందరో త్యాగశీలురూ, ధైర్యశాలురూ చరిత్రలో గుర్తుండిపోయారు. వారిలో కొందరి పేర్లు

భారతదేశంలో చాలా పవిత్రంగా భావించే హిందూ, జైన మందిరాలు కొన్ని రాజస్థాన్‌లో ఉన్నాయి:




#Article 216: అసోం (1015 words)


అసోం (ఇదివరకటి పేరు అస్సాం) (অসম) ఈశాన్య భారతదేశము లోని ఒక రాష్ట్రం. దీని రాజధాని దిస్పూర్. హిమాయల పర్వత సానువుల్లో ఉన్న ప్రాంతము చూట్టూ అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ మొదలైన ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. అసోం యొక్క ముఖ్య వాణిజ్య నగరమైన గౌహాతి సప్త సోదరీ రాష్ట్రాలుగా పిలవబడే ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారము. ఈ రాష్ట్రాలన్నీ మిగిలిన భారత భూభాగానికి అస్సాంకు పశ్చిమ బెంగాల్తో ఉన్న సరిహద్దుతో కలపబడి ఉన్నాయి. ఈ కురుచైన పట్టీని కోడిమెడ అని వ్యవహరిస్తుంటారు. అసోంకు భూటాన్, బంగ్లాదేశ్ దేశాలతోతో సరిహద్దులు ఉన్నాయి.

కొందరు అస్సాం అసమ లేదా అస్సమ అనే సంస్కృత పదము యొక్క అపభ్రంశమని భావిస్తారు. ఈ పదము పర్వతమయమైన ఈ ప్రాంతము యొక్క వర్ణనకు కచ్చితంగా సరిపోతుంది. మరికొందరు ఈ పదము అస్సాం ప్రాంతాన్ని 600 సంవత్సరాల పాటు పరిపాలించిన అహోంలకు సంబంధించినదని భావిస్తారు. 1228కి పూర్వము ఈ పదాన్ని ఉపయోగించిన ఆధారాలు లేకపోవడము, చారిత్రక గంథాలు అహోంలను అసాంలని కూడా పేర్కొనడం ఈ వాదానికి ఊతానిస్తున్నాయి.

అసమ లేదా అస్సమ అన్న పదాలు కామరూపను భాస్కర వర్మ పరిపాలించిన కాలములో వాడబడింది. ఆ కాలములో ప్రస్తుత ఉత్తర అసోం భూమి నుండి విషవాయువులు విరజిమ్ముతూ అనివాసయోగ్యముగా ఉండేది. కొంతమంది కామరూప నేరస్థులు శిక్షను తప్పించుకోవడానికి ఈ ప్రాంతానికి పారిపోయి వచ్చారని చైనా యాత్రికుడు హ్యుయాన్ త్సాంగ్ యొక్క యాత్రా రచనల వల్ల తెలుస్తున్నది. వీరే అసమ లేదా అస్సమ అని పిలవబడ్డారు. హ్యుయాన్ త్సాంగ్ అస్సమ ప్రజలు దాడిచేస్తారనే భయముతో చైనాకు ఈ మార్గము గుండా తిరిగి వెళ్లలేదు. కామరూపి భాషలో, ఈ పదానికి వింత మనిషి/పాపితో పాటు ఎవ్వరితో పోల్చలేని వ్యక్తి అనే అర్ధం కూడా ఉంది. అయితే పూర్వపు కామరూపి గ్రంథాలలో ఈ ప్రాంతాన్ని అసమ లేదా అసం లేదా అసోం అని వ్యవహరించనే లేదు.

బ్రిటిషు జనరల్ పై ఏదేని కారణము వల్ల ఈ పేరు ఎన్నుకోలేదు. ఈయన ఆంథెరా అస్సమ అనే ఒక శాస్త్రీయ నామము నుండి ఆంథెరాను వదిలేసి మిగిలిన పేరును తీసుకున్నాడు అంటారు. ఈ పద ప్రయోగము తొలిసారిగా బ్రిటీషు వారు యాండబూ అకార్డ్ తరువాత ఎగువ అస్సాం రాష్ట్రమును సృష్టించినప్పుడు జరిగింది. కాని ఈ వాదన అంత నమ్మదగినదిగా లేదు. ఆంథెరా అస్సమ అనే ఒక విధమైన పట్టుపురుగు అస్సాం ప్రాంతంలో అంతటా ఉంది. కనుక అస్సాం ప్రాంతపు పేరు ఆ పురుగుకు తగిలి ఉండ వచ్చును కాని ఆ పురుగుపేరు ప్రాంతానికి వర్తించకపోవచ్చును.

ఆంగ్ల అక్షరము T ఆకారములో ఉండే ఈ రాష్ట్రము భౌగోళికముగా మూడు ప్రాంతాలుగా విభజించవచ్చు. ఉత్తరాన బ్రహ్మపుత్ర నదీలోయ, మధ్యన కర్బి, చాచర్ కొండలు, దక్షిణాన బరక్ లోయ. అసోం రాష్ట్రములో మార్చి నుండి సెప్టెంబరు వరకు భారీ వర్షాలు కురుస్తాయి. వేసవి నెలల్లో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా అన్ని కాలాల్లోనూ మితముగా ఉంటాయి.

అస్సాంలో జీవ సంపద, అడవులు, వణ్యప్రాణులు పుష్కలముగా ఉన్నాయి. ఒకప్పుడు కలప వ్యాపారము జోరుగా సాగేది అయితే భారతదేశ సుప్రీం కోర్టు దీన్ని నిషేధించడముతో అది తగ్గింది. ఈ ప్రాంతములో అనేక అభయారణ్యాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది, అరుదైన భారతీయ ఖడ్గమృగానికి ఆలవాలమైన కాజీరంగా జాతీయ వనము. రాష్ట్రములో అత్యధికంగా వెదురు ఉత్పత్తి అవుతుంది. కానీ వెదురు పరిశ్రమ ఇంకా ఆరఁభ దశలోనే ఉంది. వన్య ప్రాణులు, అడవులు, వృక్షసంపద, నదులు, జలమార్గాలు అన్నీ ఈ ప్రాంతాకి ఎంతో ప్రకృతి సౌందర్యాన్ని తెచ్చుపెడుతూ పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతున్నాయి.

అతివృష్టి, చెట్ల నరికివేత,, ఇతరత్రా కారణాల వల్ల ప్రతి సంవత్సరం వరదలు సంభవించి విస్తృత ప్రాణ నష్టము, ఆస్తి నష్టము వాటిల్లడమే కాకుండా జీవనోపాధికి ముప్పు జరుగుతున్నది. భూకంప బాధిత ప్రాంతములో ఉన్న అస్సాం 1897లో (రిక్టర్ స్కేలు పై 8.1 గా నమోదైనది), 1950లో (రిక్టర్ స్కేలు పై 8.6 గా నమోదైనది) రెండు అతిపెద్ద భూకంపాకలకు గురైనది.

అస్సాం,, పరిసర ప్రాంతాలు పురాణకాలంలో ప్రాగ్జ్యోతిషం అనబడేవని మహాభారతంలో చెప్పబడింది. అక్కడి ప్రజలు కిరాతులనీ, చీనులనీ అనబడ్డారు. కామరూప రాజ్యానికి ప్రాగ్జ్యోతిషపురం రాజధాని.

మధ్యయుగంలో దీనిపేరు కామరూప, లేదా కమట. అక్కడ రాజ్యమేలిన వంశాలలో వర్మ వంశం ప్రధానమైనది. కనోజ్‌ను పాలించిన హర్షవర్ధనుని సమకాలీనుడైన భాస్కరవర్మ కాలంలో జువన్‌జాంగ్ అనే చైనా యాత్రికుడు కామరూప ప్రాంతాన్ని సందర్శించాడు. ఇంకా కచారి, చూటియా వంశాలు కూడా రాజ్యమేలాయి. వీరు ఇండో-టిబెటన్ జాతికి చెందిన రాజులు.

తరువాత టాయ్ జాతికి చెందిన అహోమ్ రాజులు 600 సంవత్సరాలు పాలించారు. కోచ్ వంశపు రాజులు అస్సాం పశ్చిమభాగాన్నీ, ఉత్తర బెంగాల్‌నూ పాలించారు. ఈ రాజ్యం అప్పుడు రెండు భాగాలయ్యింది. పశ్చిమ భాగం మొగల్‌చక్రవర్తుల సామంతరాజ్యమైంది. తూర్పు భాగం అహోం రాజుల పాలన క్రిందికి వచ్చింది. మొత్తానికి బ్రిటిష్ వారి కాలం వరకూ ఎవరూ అస్సాంను పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకొనలేక పోయారు.

అహోం రాజులలోని అంతర్గత కలహాల కారణంగా అది 1821 నాటికి బర్మా పాలకుల సామంతరాజ్యంగా మారింది. దానితో బర్మావారికి, బ్రిటిష్ వారికి వైరం మొదలయ్యింది. మొదటి ఆంగ్ల-బర్మా యుద్ధము తరువాత 1826లో యాండబూ ఒడంబడిక ప్రకారం అస్సాం బ్రిటిషు అధీనంలోకి, బెంగాలు ప్రెసిడెన్సీలో భాగంగా, తీసుకోబడింది. 1905-1912 మధ్య అస్సాం ఒక వేరు పరగణా అయ్యింది.

భారత స్వాతంత్ర్యం తరువాత అహోం రాజ్యభాగం, ప్రస్తుత అరుణాచల్ ప్రదేశ్, నాగా పర్వత ప్రాంతం, కచారి రాజ్య ప్రాంతం, లూషాయ్ పర్వత ప్రాంతం, గారో పర్వత ప్రాంతం, జైంతియా పర్వత ప్రాంతం - ఇవన్నీ అస్సాం రాష్ట్రంలో చేర్చ బడ్డాయి. రాజదానిగా షిల్లాంగ్ నగరం ఏర్పడింది. సిల్హెట్ ప్రాంతం వారు పాకిస్తాన్‌లో చేరారు. మణిపూర్, త్రిపుర సంస్థానాలు ప్రత్యేక పరగణాలయ్యాయి.

స్వాతంత్ర్యం తరువాత 1960 - 1970 దశకాలలో అస్సాం రాష్ట్రంలోంచి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, మిజోరామ్ రాష్ట్రాలు వేరుచేయబడ్డాయి. రాజధాని దిస్పూర్కు మార్చబడింది. పెరుగుతున్న గౌహతి నగరంలో దిస్పూర్ కలిసిపోతున్నది. అస్సామీస్‌ను అధికారిక భాషగా చేయాలని సంకల్పించినపుడ కచార్ జిల్లా వాసులూ, ఇతర బెంగాలీ భాష మాటలాడేవారూ ప్రతిఘటించారు. ఇది తీవ్రమైన ఉద్యమమైంది.

అస్సామీ, బోడో భాష రాష్ట్ర అధికార భాషలు. భాషా శాస్త్ర యుక్తముగా ఆధునిక అస్సామీ భాష తూర్పు మాగధి ప్రాకృతం నుండి ఉద్భవించింది. అయితే ఈ ప్రాంతములో మాట్లాడే ఇతర టిబెటో-బర్మన్, మోన్-ఖమెర్ భాషల యొక్క ప్రభావము కూడా అధికాముగానే ఉంది. బోడో ఒక టిబెటో-బర్మన్ భాష.

బ్రిటీషు వారి రాకతో, బెంగాల్ విభజనతో బరక్ లోయలో బెంగాళీ (సిల్హెటి) యొక్క ప్రాబల్యము హెచ్చింది. నేపాళీ, హిందీ రాష్ట్రములో మాట్లాడే ఇతర ముఖ్య భాషలు

ఆదిమవాసుల ఆచారాలు, అందిపుచ్చుకున్న సంప్రదాయాలు కలగలిపి ఉండటం వల్ల మిగిలిన ప్రాంతాలకంటే అస్సామీ సంస్కృతి కాస్త భిన్నమైన, సుసంపన్నమైన సంస్కృతిగా అభివృద్ధి చెందింది.

అస్సామీ ఆచార వ్యవహారాలలో గమోసా కు ఒక విశిష్టమైన స్థానముంది. ఇది ఒక దీర్ఘ చతురస్రాకారపు గుడ్డ. మూడు ప్రక్కల ఎరుపుగాని, వేరే రంగులో గాని అంచు ఉంటుంది. నాలుగవ ప్రక్క అల్లిక అంచుగా ఉంటుంది. దీనికి వళ్ళు తుడుచుకొనేది అనే సామాన్య అర్ధం చెప్పవచ్చును. నిజంగానే వళ్ళు తుడుచుకోవడానికి వాడినా, గమోసాను మరెన్నో విధాలుగా వాడుతారు. రైతులు మొలగుడ్డగా వాడుతారు. బిహూ నాట్యకారులు చిత్రమైన ముడివేసి తలగుడ్డగా వాడుతారు. ప్రార్థనా సమయంలో మెడలో వేసుకొంటారు. సమాజంలో ఉన్నతిని తెలుపుకొనే విధంగా భుజాన వేసుకొంటారు. బిహు పండుగకు పెద్దవారికి గమోసాలు సమర్పించుకోవడం ఆనవాయితీ. ఏదయినా భక్తిగా, ఆదరంగా భావించే వస్తువును నేలమీద పెట్టరు. ముందుగా గమోసా పరచి, దానిపై ఉంచుతారు. గామ్+చాదర్ (అనగా పూజా గదిలో పురాణ గ్రంథాన్ని కప్పి ఉంచే గుడ్డ) - అనే కామరూప పదం గమోసాకు మూలం. అన్ని మతాలువారూ గమోసాను ఇదే ఆదరంతో దైనందిన జీవితంలో వాడుతారు

బిహు పండుగ అస్సాంలో ఎక్కువ మంది జరుపుకొనే పండుగ. ఇది సంవత్సరంలో మూడు సార్లు వస్తుంది. మాఘ్ (జనవరి), బోహాగ్ (ఏప్రిల్), కతి (అక్టోబరు)

దుర్గాపూజ కూడా అస్సాంలో బాగా పెద్దయెత్తున జరుపుకొనే పండుగ. అస్సాంలో స్థిరపడిన లక్షలాది బెంగాలీయుల ప్రభావం కూడా ఈ పండుగ ప్రాచుర్యానికి కొంత కారణం కావచ్చును.

భిన్నజాతులు, సంస్కృతుల సమ్మేళనం కారణంగా అస్సాం జానపద సంగీతంలో చాలా వైవిధ్యం కానవస్తుంది. దీనికి ఆధునిక సంగీతంలోని బాణీలు జోడించడం వల్ల మరింత సుసంపన్నమైనది. రుద్ర బారువా, భూపేన్ హజారికా, ఖాగెన్ మహంత - వీరు ప్రసిద్ధులైన సంగీతకారులలో కొందరు.

తేయాకు ఉత్పత్తి అస్సాం ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైనది. సముద్ర మట్టానికి దగ్గర ఎత్తులో పండే అస్సాం తేయాకుకు ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. కామెల్లియా అస్సామికా Camellia assamica అనేది అస్సాము పేరుతో ప్రసిద్ధమైన ఒక తేయాకు రకం. (ఇటువంటి గౌరవం అస్సాంకూ, చైనాకు మాత్రమే దక్కింది కామెల్లియా సినెసిస్Camellia sinensis అనే పేరుతో ఒక చైనా తేయాకు రకం ఉంది.

అస్సాంలో తేయాకు వ్యవసాయం బ్రిటిషువారు వృద్ధి చేశారు. ఆ కాలంలో బీహారు, ఒడిషా ప్రాంతాలనుండి కూలీలుగా వచ్చి చాలామంది ఇక్కడ స్థిరపడ్డారు.

ముడి చమురు, సహజవాయువు కూడా అస్సాం ఉత్పత్తులలో ప్రధానమైనవి. ప్రపంచంలో చమురు ప్రప్రథమంగా అమెరికాలోని టిటస్‌విల్లిలోలభించింది. రెండవ స్థలం అస్సాం. ఇక్కడ అప్పుడు త్రవ్విన బావిలో ఇప్పటికీ చమురు ఉత్పత్తి కొనసాగుతున్నది.

బ్రిటిషు అధికారం నుంచి అస్సాం ప్రాంతంలోని వేరువేరు పరగణాలు ప్రశాంతంగా స్వతంత్రభారతదేశంలో విలీనం చేయబడ్డాయి. కాని తరువాత ఈ ప్రాంతంలోని అభివృద్ధి బాగా కుంటుపడింది. ఫలితంగా తీవ్రవాద వర్గాలు, వేర్పాటు వాద వర్గాలు ప్రాభవం సంపాదించగలిగాయి. గ్రామీణ ప్రాంతంలోని తీవ్రమైన నిరుద్యోగ సమస్య వీరికి అనుకూలమైన పరిస్థితులను కూరుస్తున్నాయి.

దీనికి తోడు వివిధ తెగల మధ్య వైరాలు, పొరుగు దేశాలనుంచి కొన సాగుతున్న వలసలు, వెనుకబాటుతనం - ఇవన్నీ అస్సాంను వెంటాడుతున్న సమస్యలు. కొన్ని తెగల మధ్య ఘర్షణలు చాలా తీవ్రంగ ఉంటున్నాయి.




#Article 217: బీహార్ (481 words)


బీహార్ (बिहार) భారతదేశపు తూర్పుభాగాన ఉన్న ఒక రాష్ట్రము. రాజధాని పాట్నా.

బీహార్‌కు ఉత్తరాన నేపాల్ దేశము సరిహద్దున్నది. పశ్చిమాన ఉత్తర ప్రదేశ్, దక్షిణాన ఝార్ఖండ్, ఈశాన్యాన పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలున్నాయి. బీహార్ రాష్ట్రం హిందీ మాట్లాడే ప్రాంతపు మధ్యనుంది. సారవంతమైన గంగానదీ మైదానం బీహార్‌లో విస్తరించి ఉంది.

బీహారు చరిత్ర పురాతనమైనది. ఒకప్పుడు ఇది మగధ ప్రాంతము.నేటి పాట్నా ఆనాటి పాటలీపుత్రనగరం. మౌర్యసామ్రాజ్యానికి రాజధాని. అప్పటినుండి వెయ్యేళ్ళకాలం ప్రముఖ రాజకీయ, సాంస్కృతిక, విద్యా కేంద్రంగా వెలిగింది. నలందా, విక్రమశీల విశ్వవిద్యాలయాలు ప్రపంచప్రఖ్యాతి గాంచినవి.

'విహారం' అనే సంస్కృతపదం నుండి 'బీహార్' పేరు రూపొందింది.

మతాలకు జన్మస్థానం

బౌద్ధ, జైన మతాలకు బీహార్ జన్మస్థలం. బోధ్‌గయలో గౌతమబుద్ధుడు జ్ఙానోదయం పొంది, ధర్మ బోధన ఆరంభించాడు. జైనమత ప్రవక్త మహావీరుడు బీహారులోని వైశాలిలో జన్మించాడు.

విదేశీయుల దండయాత్రలతో బీహార్ ప్రాభవం బాగా దెబ్బతిన్నది. 12వ శతాబ్దంలో మహమ్మదు ఘోరీ సైన్యం వశమైంది. మధ్యలో ససరాం నుండి వచ్చిన షేర్‌ షా సూరి ఆరేళ్ళు రాజ్యమేలినప్పుడు బీహార్ కొంత వైభవాన్ని మళ్ళీ చవిచూచింది. కలకత్తా నుండి పెషావర్ (పాకిస్తాన్) వరకు గ్రాండ్‌ట్రంక్ రోడ్డు ఆ కాలంలోనే వేయబడింది.

బీహారు ఎక్కువ భాగం సారవంతమైన మైదాన ప్రాంతం. గంగ, శోణ, బాగమతి, కోసి, బుధి గండక్, ఫల్గు వంటి ఎన్నో నదుల బీహారు భూభాగంలో ప్రవహిస్తున్నాయి. దక్షిణ బీహారులో చిన్న కొండలున్నాయి.

డిసెంబరు, జనవరి మాసాలు చలికాలం ఉష్ణోగ్రతలు 5 నుండి 10 డిగ్రీలు సెల్సియస్ వరకు నమోదవుతాయి. వేసవికాలం ఏప్రిల్, మే లలో 40-45 డిగ్రీలవరకు వెళ్తుంది. జూన్ నుండి సెప్టెంబరు వరకు వర్షాకాలం.

భారతదేశంలో బాగా పేదరాష్ట్రాలలో ఒకటిగా బీహారు గుర్తింపబడుతుంది. దీనికి చాలా కారణాలు చెబుతారు. తక్కువ అక్షరాస్యత, కేంద్రం నిర్లక్ష్యత (ఇదివరకు కలకత్తా, ఇప్పుడు ఢిల్లీ), కులాలవారీగా, మతాలవారీగా చీలిపోయిన సమాజం, సంస్కరణలు రాకపోవడం, నాయకుల అవినీతి - ఇలాంటి చాలా కారణాలున్నాయి.

బీహారు శాసన, పాలనా విధానం అన్ని రాష్ట్రాలవలెనె ఉంది. - గవర్నరు, ముఖ్య మంత్రి, శాసన సభ, సివిల్ సర్వీసు, న్యాయ వ్యవస్థ వగయిరా.

దాదాపు దశాబ్దం పైగా బీహారు రాజకీయాలలో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రముఖ వ్యక్తిగా ఉంటూ వచ్చాడు.

బీహారులో రెండు విమానాశ్రయాలున్నాయి. పాట్నా, గయ

రైల్వే వ్వస్థ బీహారులో బాగా విస్తరించి ఉంది. అన్ని ప్రధాన నగరాలకు రైలు కనెక్షన్లున్నాయి.

బీహారు రోడ్డు రవాణా వ్యవస్థ అంత బాగా లేదు. రోడ్లు బాగుండకపోవడం ఇందుకొక కారణం.

అన్ని మతాలవారికి బీహారు నెలవైనట్లే అన్ని పండుగలూ జరుపబడతాయి.మకర సంక్రాంతి, సరస్వతీ పూజ దసరా, హోలీ, ఈద్-ఉద్-ఫిత్రా, ఈద్-ఉద్-జోహా (బక్రీద్), ముహర్రం, శ్రీరామ నవమి, రథయాత్ర, రాఖీ, మహాశివరాత్రి, దీపావళి, లక్ష్మీపూజ, క్రిస్టమస్, మహావీర జయంతి, బుద్ధపూర్ణిమ, ఇంకా అనేక జాతీయ, ప్రాంతీయ ఉత్సవాలు బీహారులో సంరంభంగా జరుపుకొంటారు

అయితే దీపావళి తరువాతి వారంలో వచ్చే ఛత్ లేదా దలాఛత్ పండుగ మాత్రం బీహారుకు ప్రత్యేకం, బీహారీలకు చాలా ముఖ్యం. ఇది సూర్యుడిని ఆరాధించే పండుగ. ఈ ఆచారాన్ని వలస వెళ్ళిన బీహారీలు తమతో తీసుకెళ్ళినందున ఇప్పుడు దేశమంతటా ప్రధాన నగరాలలో ఛత్ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.

బీహారులో గంగా మైదానంలో సంస్కృతి పురాతనమైనట్లే వారి జానపద సంగీతం చాలా పురాతనమైనది. ఎంతో వైవిధ్యము కలిగినది. జీవనంలో అన్ని సందర్భాలకూ, ఉత్సవాలకూ ఆయా విశిష్ట బాణీలలో జానపద గేయాలున్నాయి. ఇంకా హాస్యాన్నీ, ఆనందాన్నీ కలగలిపిన హోలీ పాటలు కూడా చాలా ఉన్నాయి.

బీహారులో హిందీ, ఉర్దూ మాత్రమే కాకుండా మరెన్నో స్థానిక భాషలున్నాయి. భోజపురి, మైథిలి, మాగహి, ఆంగిక వంటివి. వీటిని కొంత వరకు హిందీ మాండలికాలని కూడా పరిగణిస్తూ ఉంటారు. వీటన్నింటినీ కలిపి బీహారీ భాష అని కూడా వ్యవహరిస్తుంటారు.

బీహారు నండి ఎందరో ప్రసిద్ధ కవులు, రచయితలు ఉన్నారు. రాజా రాధికా రమణ సింగ్, శివ పూజన్ సహాయ్, దివాకర ప్రసాద్ విద్యార్ధి, నిరాలా, రామ్ బిక్ష్ బేనిపురి, దేవకీ నందన్ ఖత్రి (చంద్ర కాంత నవలా రచయిత), విద్యాపతి (మైథలి భాషా రచయిత) వంటి వారు.

బీహారులో భోజపురి భాష సినిమా పరిశ్రమ బాగా వేళ్ళూనుకొంది. కొద్దిపాటి మైధిలి సినిమా పరిశ్రమ కూడా ఉంది.

ఒకప్పుడు విద్యలకు నిలయమై, ప్రపంచ స్థాయిలూ ఉండే నలందా, విక్రమశిల విశ్వవిద్యాలయాలు 13వ శతాబ్దంలో నాశనమయ్యాయి. తరువాత బీహారులో అంత గొప్ప విద్యాలయాలు వచ్చాయని చెప్పలేము. బీహారు జనాభాకు, మారుతున్నఅవసరాలకూ, ఆశయాలకూ అనుగుణమైన విద్యావకాశాలు బీహారులో అభివృద్ధి చెందలేదు.

విద్యా వ్యవస్థ తక్కిన భారతదేశంలో లానే ఉంది.

 

బీహారులో 5 విశ్వ విద్యాలయాలున్నాయి.

బీహారులో ప్రభుత్వాధీనంలో 3 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. - పాట్నా, భాగల్పూర్, ముజఫర్‌పూర్




#Article 218: అరుణాచల్ ప్రదేశ్ (699 words)


అరుణాచల్ ప్రదేశ్ భారత దేశములోని ఒక రాష్ట్రము. భారత దేశ పాలనలో ఉన్నా, ఈ ప్రాంతాన్ని టిబెట్ స్వయంప్రతిపత్త ప్రాంతములో భాగమని చైనా వాదన. భారత, చైనాల మధ్య వివాదాస్పదముగా మిగిలిన ప్రాంతాలలో అక్సాయి చిన్తో పాటూ అరుణాచల్ ప్రదేశ్ కూడా ఒకటి. ఈ రాష్ట్రానికి దక్షిణాన అస్సాం రాష్ట్రము, ఆగ్నేయాన నాగాలాండ్, తూర్పున బర్మా, పశ్చిమాన భూటాన్ సరిహద్దులుగా ఉన్నాయి. ఇటానగర్ రాష్ట్ర రాజధాని. 
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఈ రాష్ట్రాన్ని గానీ, రాష్ట్రము యొక్క ఉత్తర సరిహద్దైన మెక్‌మెహన్ రేఖను గానీ అధికారికముగా గుర్తించడంలేదు. చైనా ఈ ప్రాంతాన్ని దక్షిణ టిబెట్ గా (藏南 పిన్యిన్:Zàngnán) వ్యవహరించి ఈ ప్రాంతాన్ని టిబెట్ స్వయంప్రతిపత్త ప్రాంతము యొక్క ఆరు సరిహద్దు కౌంటీల మధ్య విభజించినది: (పశిమము నుండి తూర్పుకు) కోన కౌంటీ, లుంఝే కౌంటీ, నంగ్ కౌంటీ, మైయిన్లింగ్ కౌంటీ, మేదోగ్ కౌంటీ,, ఝాయూ కౌంటీ. అయితే అదే సమయములో చైనా, ఇండియా రెండు దేశాలు ఒక వాస్తవాధీన రేఖను నిర్ణయించాయి. ఈ వివాదం ఎంటువంటి అందోళనలకు దారితీసే అవకాశము లేదని భావిస్తున్నారు.

ఇదివరకు ఈశాన్య సరిహద్దు ప్రాంతముగా పిలవబడుతున్న ఈ ప్రాంతము 1987 వరకు అస్సాం రాష్ట్రములో భాగముగా ఉండేది. తూర్పున భద్రతా పరిస్థితులను, చైనా-ఇండియా ఘర్షణలను దృష్టిలో పెట్టుకొని అరుణాచల్ ప్రదేశ్ కు రాష్ట్ర స్థాయి కల్పించడమైనది.

ఇక్కడి గిరిజనుల తొలి పూర్వీకులు అవగత చరిత్రకు మునుపే టిబెట్ నుండి ఇక్కడికి వలస వచ్చారు. తరువాతి కాలంలో థాయి, బుర్మా నుండి వలస వచ్చిన వారు వీరితో చేరారు.

అపతానీ  అనే తెగకు చరిత్ర గురించిన అవ్గాహన ఉన్నప్పటికీ, రాష్ట్ర వాయవ్య ప్రాంత భాగాల గురించి తప్ప మిగతా ప్రాంతం గురించి పెద్దగా తెలియదు. లభ్యమౌతున్న చరిత్ర 16 వ శతాబ్దం నాటి అహోం చరిత్ర గాథలు మాత్రమే. గిరిజన మోన్‌పా, షెర్దూక్‌పెన్ తెగలవారు స్థానిక పాలకుల గురించిన చరిత్రను రికార్డు చేస్తూ వచ్చారు. వాయవ్య ప్రాంతాలు క్రీ.పూ. 500, క్రీ.శ. 600 మధ్య విలసిల్లిన మోన్‌పా రాజ్య ఏలుబడిలోకి వచ్చాయి. తరువాత ఉత్తర ప్రాంతాలు టిబెట్ పాలనలోకి వచ్చాయి. రాష్ట్రం లోని మిగత ప్రాంతాలు, ముఖ్యంగా మయాన్‌మార్ కు చేరువగా ఉన్న ప్రాంతాలు అహోంల పాలనలోకి వచ్చాయి. 1858లో ఈ ప్రాంతాలను బ్రిటిషు వారు భారత్ లో కలిపేసారు.

పశ్చిమ సియాంగ్ లోని సియాంగ్ పర్వత పాదాల వద్ద గల 14 వ శతాబ్దపు హిందూ దేవాలయం, మాలినీతన్ గుడి శిథిలాల తవ్వకాల్లో రాష్ట్ర పురాతన చరిత్ర గురించిన కొత్త విషయాలు తెలిసాయి. హిందూ దేవతల బొమ్మలు, మండపాలు బయల్పడ్డాయి. స్థానికలకు ఇది తీర్థయాత్రాస్థలంగా మారిపోయింది. భిస్మాక్‌నగర్ వద్ద గల మరో సాంస్కృతిక స్థలం వద్ద లభించిన ఆధారాలను బట్టి ఇక్కడ స్థానిక నాగరికత వర్ధిల్లిందని తెలుస్తోంది. తవాంగ్ జిల్లాలో గల మూడో సాంస్కృతిక వారసత్వ స్థలం, తవాంగ్ బౌద్ధారామం వద్ద బౌద్ధ మతావలంబీకులైన తెగల ప్రజల చరిత్రకు చెందిన ఆధారాలు దొరికాయి.

ఈ యుద్ధం తరువాత అప్పటి వరకు ఈశాన్య సరిహద్దు ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతం అస్సాంలో భాగమైంది. చైనాతో ఉన్న ఘర్షణాత్మక వైఖరిని దృష్టిలో ఉంచుకుని 1987 లో అరుణాచల్ ప్రదేశ్ కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను ఇచ్చారు. కానీ చైనా దీన్ని గుర్తించలేదు.

అరుణాచల్ ప్రదేశ్ లోన్ ఎక్కువ భాగం హిమాలయాలు ఆక్రమించుకుని ఉన్నాయి. అల్థౌఘ్ పర్త్స్ ఒఫ్ లోహిత్ చాంగ్‌లాంగ్, తిరాప్ లలోని కొన్ని ప్రాంతాల్లో పట్‌కోయి కొండలు వ్యాపించి ఉన్నాయి.

అరుణాచల్ ప్రదేశ్ లో వాతావరణం ఎత్తును బట్టి మారుతూ ఉంటుంది. టిబెట్ సరిహద్ద్దుకు దగ్గరగా, ఎగువ హిమాలయాల వద్ద ఉన్న ఎత్తైన ప్రదేశాల్లో అతిశీతల వాతావరణం నెలకొని ఉంటుంది. మధ్య హిమాలయాల వద్ద సమశీతోష్ణ స్థితి ఉంటుంది. యాపిల్, కమలా పండ్ల వంటివి పండుతాయి. దిగువ హిమాలయాలు, సముద్ర మట్టానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఉష్ణ వాతావరణం ఉంటుంది. రాష్ట్రంలో వర్షపాతం చాలా ఎక్కువ; సాలుకు 2,000 నుండి 4,000 మి.మీ (80 నుండి 160 అంగుళాలు) వర్షపాతం నమోదవుతుంది. పర్వత సానువుల్లో రోడోడెండ్రన్, ఓక్, పైన్, మేపుల్, ఫర్, జూనిపర్ మొదలైన వృక్షాలతో కూడిన అరణ్యాలు విస్తరించి ఉన్నాయి.

అరుణాచల్ ప్రదేశ్ ను పరిపాలనా సౌలభ్యము కొరకు 16 జిల్లాలుగా విభజించబడింది. ప్రతి జిల్లా యొక్క పాలనా వ్యవహారాలు నిర్వర్తించడానికి, స్థానిక ప్రజల అవసరాలను తీర్చడానికి ఒక జిల్లా కలెక్టరు నియమించబడతాడు. చైనా యొక్క యోచనలపై అపనమ్మకముతో ఈ ప్రాంతము మీద ప్రత్యేకముగా టిబెట్ సరిహద్దుపై భారత సైన్యము యొక్క గట్టి నిఘా కొనసాగుతున్నది. ఉత్తర ప్రాంతాలు, ఇండో-బర్మా సరిహద్దులో, నాగాలాండ్ సరిహద్దు ప్రాంతాలలో నాగా-క్రైస్తవ తీవ్రవాద వర్గాలు స్థానిక ప్రజలను హింసిస్తున్నారని వచ్చిన ఆరోపణల వలన ఈ ప్రాంతాలను సందర్శించడానికి ప్రత్యేక అనుమతి అవసరము

జిల్లాల జాబితా:

అరుణాచల్ ప్రదేశ్ యొక్క స్థానిక తెగలలో ఆది, నిషి, మోన్పా తెగలు ప్రధానమైనవి.

రాష్ట్రములో అక్షరాస్యత శాతము 1991 లో ఉన్న 41.59% నుండి 54.74%కు పెరిగింది. ప్రస్తుత గణన ప్రకారము 487,796 మంది అక్షరాస్యులు ఉన్నారు.

రాష్ట్ర జనాభాలో దాదాపు సగభాగము ప్రజలు డోన్యి పోలో మతాన్ని అవలంబిస్తారు. ఇంకొక 42% మంది ప్రజలు భౌద్ధ మతము, హిందూ మతంనకు చెందినవారు. మిగిలిన వాళ్లు క్రైస్తవ, ఇస్లాం మతస్థులు.

వ్యావసాయమే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన ఆయువుపట్టు. స్థానికులు ఝుం అని వ్యవహరించే పోడు వ్యవసాయ పద్ధతిని గిరిజన జాతుల ప్రజలు విరివిగా అవలంబించేవారు. కానీ అది ఇప్పుడు తగ్గుముఖం పట్టినది. వ్యవసాయము తర్వాత అంతే ముఖ్య ఆర్థిక వనరు అటవీ ఉత్పత్తులు.
 
ఇక్కడ వరి, మొక్కజొన్న, జొన్న, గోధుమ, పప్పుదినుసులు, చెరుకు, అల్లం, నూనె గింజలు మొదలైన పంటలను పండిస్తారు. అరుణాచల్ వాతావరణము పండ్లు, పూల తోటలకు కూడా చాలా అనుకూలమైనది.

చెక్క మిల్లులు, ప్లైవుడ్ తయారీ (ఈ రెండు పరిశ్రమలను ఇటీవల నిషేధించారు), బియ్యపు మిల్లులు, పండ్ల నిలువ కేంద్రాలు, చేనేత, హస్తకళలు రాష్ట్రములోని ముఖ్య పరిశ్రమలు.

అరుణాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి ప్రేమ్ ఖాండు నాయకత్వమున అరుణాచల్ కాంగ్రెస్ పార్టీ అధికారములో ఉంది. అరుణాచల్ కాంగ్రెస్ (మిత్తి), కాంగ్రెస్ (డోలో), పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్లు రాష్ట్రములోని ఇతర ప్రధాన ప్రతిపక్ష పార్టీలు.

రాష్ట్రములో, ఇటానగర్, దాపర్జియో, జీరో, అలోంగ్, తేజూ, పషిగత్ పట్టణాలలో ప్రభుత్వ విమానాశ్రయాలు ఉన్నాయి. కానీ ఈ ప్రాంతము పర్వతమయమైనందు వల్ల ఈ విమానాశ్రయాలన్నీ చాలా చిన్నవి. ఎక్కువ సంఖ్యలో విమానాలకు ఇవి ఆశ్రయము ఇవ్వలేవు.

అరుణాచల్ ప్రదేశ్ యొక్క ప్రశాంత నిర్మల వతావరణము దేశవిదేశాల నుండి అనేకమంది యాత్రీకులను ఆకర్షిస్తుంది. స్థానికంగా కూడా అనేకమంది ప్రజలు అరుణాచల్ ప్రదేశ్ యొక్క విభిన్న సంస్కృతిని ఆస్వాదించడానికి బొందిలా, తవాంగ్, తిరప్ మొదలైన ప్రదేశాలను సందర్శిస్తుంటారు.

వైశాల్యము.83,743 చ.కి.




#Article 219: పంజాబ్ (593 words)


పంజాబ్ (ਪੰਜਾਬ) (Punjab) భారతదేశంలో వాయువ్యభాగాన ఉన్న ఒక రాష్ట్రం. దీనికి ఉత్తరాన జమ్ము- కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం, ఈశాన్యాన హిమాచల్ ప్రదేశ్, దక్షిణాన హర్యానా, నైరుతిలో రాజస్థాన్ రాష్ట్రాలున్నాయి. పశ్చిమాన పాకిస్తాన్ దేశపు పంజాబు రాష్ట్రము ఉంది.
 
'పంజ్' - అంటే ఐదు, 'ఆబ్' - అంటే నీరు. ఈ రెండు పదాలనుండి 'పంజాబు' పదం వచ్చింది. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ - అనే 5 నదులు పంజాబులో ప్రవహిస్తూ దానిని సశ్యశ్యామలం చేస్తున్నాయి. సారవంతమైన నేల, పుష్కలమైన నీరు, కష్టించే జనులు - వీరంతా కలిసి పంజాబును దేశపు వ్యవసాయంలో అగ్రభాగాన నిలుపుతున్నారు. పారిశ్రామికంగా కూడా పంజాబు మంచి ప్రగతి సాధిస్తున్నది.

భారత ఉపఖండంలో వికసించినట్లు కనుగొన్న ప్రథమ నాగరికత సింధునదీ నాగరికత ఈ ప్రాంతంలోనే ఉంది.

భారతదేశంపై దండెత్తిన పాశ్చాత్యులకు (గ్రీకులు, అరబ్బులు, టర్క్‌లు, ఇరానియనులు, ముఘలులు, ఆఫ్ఘనులు) పంజాబు మొదటి యుద్ధభూమి. కనుక ఆత్మ రక్షణ, పోరాట పటిమ పంజాబీయుల చరిత్రలో అత్యంత ముఖ్యభాగాలైపోయాయి. పోరస్ (పురుషోత్తముడు) అనే రాజుతో యద్ధాన్ని చేస్తున్న గ్రీకు వీరుడు అలెగ్జాండర్ తన తల్లికి వ్రాసిన లేఖలో ఇలా ఉన్నది - నేను సింహాలలాంటి ధైర్యవంతులైన వీరులతో యద్ధం చేస్తున్నాను. నా సైనికులకు ప్రతి అడుగూ ఉక్కులా అడ్డు తగులుతున్నది. నువ్వు ఒకే అలెగ్జాండరుకు జన్మనిచ్చావు. కాని ఇక్కడ ప్రతిఒకడినీ ఒక అలెగ్జాండరు అనవచ్చును

రాష్ట్ర విభజన పంజాబీయుల జీవితాలలో ఒక చేదు అనుభవంగా మిగిలిపోయింది. మత విద్వేషాలవల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది జనులు కట్టుబట్టలతో ఒక ప్రాంతంనుండి మరొక ప్రాంతానికి వలస పోయారు.

పాటియాలా, మరి కొన్ని చిన్న రాజసంస్థానాలుకూడా భారతదేశంలో భాగమైనాయి. 1950లో భారతదేశంలో రెండు పంజాబు రాష్ట్రాలు ఏర్పరచారు - బ్రిటిష్‌పాలనలో ఉన్న పంజాబును పంజాబు రాష్ట్రమనీ, అక్కడి రాజసంస్థానాలనన్నిటినీ కలిపి పాటియాలా, తూర్పు పంజాబు సంయుక్త రాష్ట్రము (Patiala and East Punjab States Union-PEPSU) అనీ అన్నారు. 1956లో PEPSU కూడా పంజాబు రాష్ట్రంలో విలీనం చేశారు. హిమాలయ ప్రాంతంలో ఉన్న ఉత్తరాది జిల్లాలను మాత్రం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేశారు.

ఆంతకుపూర్వపు పంజాబు ప్రావిన్సు రాజధాని లాహోరు పాకిస్తాన్‌కు చెందిన పంజాబులో ఉన్నందున భారత పంజాబుకు కొత్త రాజధాని అవసరమయ్యింది. అప్పుడు చండీగఢ్ నగరాన్ని క్రొత్త రాజధానిగా నిర్మించారు. 1966 నవంబరు 1న పంజాబులో హిందువులు ఎక్కువగా ఉన్న ఆగ్నేయప్రాంతాన్ని వేరుచేసి హర్యానా రాష్ట్రంగా ఏర్పరచారు. రెండు రాష్ట్రాలకూ మధ్యనున్న చండీగఢ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా నిర్ణయించారు. పంజాబుకూ, హర్యానాకూ కూడా రాజధాని చండీగఢ్‌ రాజధానిగా కొనసాగుతున్నది.

సరిహద్దుకు అటూ, ఇటూ మాట్లాడేది ' పంజాబీ' భాష అయినా లిపులు మాత్రం వేరు. భారతదేశంలో పంజాబీ భాషను 'గురుముఖి' లిపిలో వ్రాస్తారు. పాకిస్తానులో పంజాబీ భాషను 'షాహ్‌ముఖి' లిపి (అరబిక్ లిపినుండి రూపాంతరం చెందినది) లో వ్రాస్తారు.

పంజాబు సంస్కృతి ఎంతో సుసంపన్నమైనది. పంజాబీయులు తమ సాంఘిక బాధ్యతలకు మంచి విలువలనిస్తారు.

భారతదేశంలో హిందువులు మెజారిటీగా లేనటువంటి ఆరు రాష్ట్రాలలో పంజాబు ఒకటి. పంజాబులో దాదాపు 60% ప్రజలు సిక్ఖు మతస్తులు.అమృత్‌సర్‌లో స్వర్ణదేవాలయం అని ప్రసిద్ధమైన హర్‌మందిర్ సాహిబ్ సిక్ఖు మతస్తుల పరమ పవిత్ర స్థలము.

సిక్ఖుల తరువాత హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అమమృత్‌సర్‌లో జైన మతస్తులకు కూడా ఒక పవిత్రస్థలము.

పంజాబు స్థూల ఆర్థిక ఉత్పత్తి (మిలియన్ రూపాయలలో, మార్కెట్ ధరల ఆధారంగా) క్రింద ఇవ్వబడింది. .

ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం 2004లో పంజాబు స్థూల ఉత్పత్తి 27 బిలియన్ డాలర్లు అని అంచనా.

వ్యవసాయ రంగంలోనూ, పారిశ్రామిక రంగంలోనూ పంజాబు ప్రశంసనీయమైన పురోగతి సాధించింది. మంచి మౌలిక సదుపాయాలు (ముఖ్యంగా రోడ్లు, కకాలువలు, విద్యుత్తు) పంజాబును వ్యవసాయానికి, పరిశ్రమలకు అనువైన రాష్ట్రంగా మలచాయి.

పంజాబు రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు - రోడ్డు, రైలు, విమాన రవాణా వ్యవస్థ - దేశంలో అత్యుత్తమమైనదని భారత జాతీయ ప్రాయోగిక ఆర్ధిక పరిశోధనా సంస్థ (Indian National Council of Applied Economic Research -NCAER) నివేదికలో పేర్కొనబడింది. ఈ సూచిక ప్రకారం భారతదేశపు సగటు 100 పాయింట్లు కాగా పంజాబుకు ఈ విషయంలో 210 పాయింట్లు లభించాయి.

అలాగే పంజాబులో సగటు విద్యుత్తు వినియోగం దేశపు సగటుకంటే రెండున్నర రెట్లు ఎక్కువ. 1974 నాటికే పంజాబులో అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కలుగజేయబడింది.

పంజాబు నేల సారవంతమైనది. దానికి తోడు మంచి నీటి వనరులు, ప్రాజెక్టులు, అభివృద్ధిశీలురైన రైతులు పంజాబును వ్యవసాయంలో అగ్రగామిగా చేశారు. గోధుమ ప్రధానమైన పంట. ఇంకా పత్తి, చెరకు, వరి, జొన్న, ఆవాలు, బార్లీ వంటి పంటలు, రకరకాల పండ్లు పంజాబులో ముఖ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు.

పంజాబును భారతదేశానికి ధాన్యాగారం అంటారు. భారతదేశంమొత్తం గోధుమ ఉత్పత్తిలో 60%, వరి ఉత్పత్తిలో 40% పంజాబునుండే వస్తున్నాయి. ప్రపంచం మొత్తం ఉత్పత్తిలో చూసినట్లయితే 2% గోధుమ, 1% వరి, 2% ప్రత్తి పంజాబులో పండుతున్నాయి.

పంజాబులోని కొన్ని ముఖ్యమైన పారిశ్రామికోత్పత్తులు - విజ్ఞానశాస్త్రీయ పరికరాలు, విద్యుత్‌పరికరాలు, యంత్రభాగాలు, వస్త్రాలు, కుట్టు మిషనులు, క్రీడావస్తువులు, ఎరువులు, సైకిళ్ళు, మోటారు సైకిళ్ళు, ఉన్ని దుస్తులు, చక్కెర, నూనెలు.

పంజాబులో యాత్రికులను ఆకర్షించే అనేక స్థలాలున్నాయి. - చారిత్రిక స్థలాళు, ప్రకృతి అందాలు, మందిరాలు, నాగరికతానిలయాలు, గ్రామీణ సౌందర్యం, జానపద కళారూపాలు - వీటివలన పర్యాటక రంగం మంచి అభివృద్ధిని సాధిస్తున్నది. కొన్ని పర్యాటక స్థలాలు:

పంజాబులో ఉన్నతవిద్యనందించే సంస్థలు క్రింద ఇవ్వబడ్డాయి. 1960-70 దశకంలో దేశంలో హరితవిప్లవం విజయవంతం కావడానికి పంజాబు వ్యవసాయ విశ్వవిద్యాలయం ముఖ్యమైన పాత్ర వహించింది.ఇది లూథియానా లో ఉంది. అలాగే ఫగ్వారా లోని లవ్లీ ప్రాఫినాల్ విశ్వవిద్యాలయం (.L.P.U) ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండడంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడ ఎక్కువగా చదువుకుంటున్నారు.




#Article 220: మేఘాలయ (207 words)


మేఘాలయ (मेघालय)  (Meghalaya) భారతదేశపు ఈశాన్యప్రాంతంలో ఒక చిన్న రాష్ట్రము. ఇది 300 కి.మీ. పొడవు, 100 కి.మీ. వెడల్పు ఉన్న పర్వతమయ రాష్ట్రము. వైశాల్యం 22,429 చ.కి.మీ. మొత్తం జనాభా 21,75,000 (2000 సం. జనాభా లెక్కలు). మేఘాలయయకు ఉత్తరాన అస్సాం రాష్ట్రం హద్దుగా బ్రహ్మపుత్ర నది ఉంది. దక్షిణాన షిల్లాంగ్ ఉంది. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ జనాభా 2,60,000.

మేఘాలయ వాతావరణం మరీ వేడికాదు. మరీ చల్లన కాదు. కానీ వర్షాలు మాత్రం భారతదేశంలోనే అత్యధికం. కొన్ని ప్రాంతాలలో 1200 సెంటీమటర్ల వరకు వర్షపాతం నమోదవుతున్నది. షిల్లాంగ్ దక్షిణాన ఉన్న చెర్రపుంజీ పట్టణం ఒక నెలలో అత్యధిక వర్షపాతం నమోదులో ప్రపంచరికార్డు కలిగి ఉంది. ఆ దగ్గరలోని మాసిన్రామ్ ఊరు ఒక సంవత్సరంలో అత్యధిక వర్షపాతం నమోదైన ఊరిగా ప్రపంచ రికార్డు కలిగిఉన్నది.

మేఘాలయ రాష్ట్రంలో మూడోవంతు అటవీమయం. పశ్చిమాన 'గారో' పర్వత శ్రేణులు, తూర్పున 'ఖాసి', 'జైంతియా' పర్వతశ్రేణులు ఉన్నాయి కాని ఇవి మరీ ఎత్తైనవి కావు. 'షిల్లాంగ్ శిఖరం' అన్నింటికంటే ఎత్తైనది (1,965 మీటర్లు). పర్వతాలలో చాలా గుహలలో విలక్షణమైన 'స్టేలక్టైటు', 'స్టేలగ్మైటు' సున్నపురాయి ఆకృతులున్నాయి.

మేఘాలయలో 85% ప్రజలు కొండ, అటవీజాతులకు చెందినవారు. ఖాసీ, గారో తెగలవారు జనాభాలో ఎక్కువగా ఉన్నారు. ఇంక జైంతియా, హాజోంగ్ తెగలవారు 40,000 వరకు ఉన్నారు. రాష్ట్రంలో 15% జనులు కొండజాతులువారుకారు. వీరిలో 54,00 మంది బెంగాలీలు, 49,000 మంది షైక్లు. పొరుగు రాష్ట్రాలైన నాగాలాండ్, మిజోరామ్‌ల లాగా మేఘాలయలో కూడా క్రైస్తవులు ఎక్కువ. ఇంకా 16% వరకు జనులు పురాతన అటవీ సంప్రదాయాలు (Animism) ఆచరిస్తారు.

రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నది. కాని, 'ఉల్ఫా' (ULFA, NDFB) వంటి తీవ్రవాదుల ప్రభావం వల్ల దీనికి అనేక అవరోధాలున్నాయి. కొండలు, పర్వతాలతో నిండిన భూభాగమూ, బంగ్లాదేశ్ సరిహద్దూ తీవ్రవాదులకు మంచి ఆశ్రయమిచ్చే స్థావరాలు.

ikkdi prajalu 99 satam mamsaharulu, ikkda stanika samstalaku chalaadikaralu unnai.
 idimtruswamya prantam




#Article 221: మణిపూర్ (444 words)


మణిపూర్ (মনিপুর, Manipur) భారతదేశం ఈశాన్యభాగాన ఉన్న ఒక రాష్ట్రము. దీని రాజధాని ఇంఫాల్. మణిపూర్ రాష్ట్రానికి ఉత్తరాన నాగాలాండ్, దక్షిణాన మిజోరామ్, పశ్చిమాన అసోం రాష్ట్రాలున్నాయి. తూర్పున మయన్మార్ దేశంతో అంతర్జాతీయ సరిహద్దు ఉంది.

మణిపూర్‌లో మెయితీ తెగకు చెందినవారు అధిక సంఖ్యాకులు. వారి భాష మెయితీ భాష. దీనినే మెయితిలాన్ అనీ, మణిపురీ అనీ అంటారు. 1992లో దీనిని జాతీయ భాషలలో ఒకటిగా గుర్తించారు,

మణిపూర్ ఒక సున్నితమైన సరిహద్దు రాష్ట్రంగా పరిగణింపబడుతున్నది. కనుక దేశం మిగిలిన ప్రాంతాలలో లేని కొన్ని నిబంధనలు ఇక్కడ అమలులో ఉన్నాయి. మణిపూర్‌కు వచ్చే విదేశీయులు (మణిపూర్‌లో జన్మించిన విదేశీయులు కూడా) నియంత్రిత ప్రాంత అనుమతి (Restricted Area Permit) కలిగి ఉండాలి. ఈ అనుమతులు 10రోజులకు మాత్రమే చెల్లుతాయి. యాత్రికులు అనుమతింపబడిన ట్రావెల్ ఏజంట్ల ద్వారా ఏర్పాటు చేయబడిన టూర్లలో, అదీ 4 వ్యక్తుల గ్రూపులలో, మాత్రమే పర్యటించవలెను. ఇంకా వారు ఇంఫాల్ నగరానికి విమాన ప్రయాణం ద్వారానే అనుమతింపబడుతారు.

ఒకప్పుడు థాయ్‌లాండ్, బర్మాల మధ్య తగవులలో మణిపూర్, అస్సాంలు ఇరుక్కున్నాయి. బర్మావారు థాయ్‌లాండ్‌ను ఆక్రమించిన తరుణాన్ని అవకాశంగా తీసుకొని మణిపూర్ బర్మా భూభాగంలోకి చొచ్చుకొని వెళ్ళింది. ఆ కారణంగా బర్మావారు మణిపూర్, అస్సాంలపై దండెత్తారు. దీనితో ప్రక్కనున్న బెంగాల్‌ను పరిపాలిస్తున్న బ్రిటిష్‌వారు కలుగజేసుకొనవలసి వచ్చింది. తమ ఆధిపత్యాన్ని నిలుపకోవడానికి, బర్మాను నిరోధించడానికీ బ్రిటిష్‌వారు 1891లో అస్సాంను, మణిపూర్‌ను బర్మానుండి జయించి, తమ సామ్రాజ్యంలో కలుపుకొన్నారు.

రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ సేనలకూ మిత్రదళాల సేనలకూ (Allied forces) మధ్య జరిగిన భీకరయద్ధాలకు మణిపూర్ యుద్ధరంగమైంది. తూర్పు ఆసియాను జయించిన జపానీయుల సైన్యం మణిపూర్ సరిహద్దులకు చేరుకొంది. కాని వారు ఇంఫాల్‌లో ప్రవేశింపకముందే మిత్రదళాలు వారిని ఓడించారు. రెండవ ప్రపంచయుద్ధ గతిలో ఇది ఒక ముఖ్యమైన ఘటన. ఆయుధ్ధంలో నేలకొరిగిన భారతీయ, మిత్రదళాల సైనికుల స్మృత్యర్ధం బ్రిటిష్ యుద్ధ సమాధుల కమిషన్ (British War Graves Commission) ఇప్పటికీ రెండు సమాధి స్థలాల పరిరక్షణను పర్వవేక్షిస్తున్నది.

మణిపూర్ ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలలో ఒకటి మాదక ద్రవ్యాల అలవాటు (drug addiction). మాదక ద్రవ్యాల వ్యాపారంలో ముఖ్యస్థానమైన బంగారు త్రికోణం (Golden Triangle) దగ్గరలో ఉండటం ఈ సమస్య పెరగడానికి ఒక కారణం. ఇందువల్ల వేలాది యువజనులు నిర్వీర్యులై పోతున్నారు. ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తికి కూడా ఇది కారణమైనది. భారతదేశంలో ఎయిడ్స్ వ్యాధి ప్రబలంగా ఉన్నప్రాంతాలలో మణిపూర్ ఒకటి అయ్యింది.

వివిధ జాతుల మధ్య ప్రబలుతున్న వైరుధ్యాలు మణిపురి సమాజానికి గొడ్డలిపెట్టుగా పరిణమిస్తున్నాయి. ఎన్నో తరాలుగా మెయితి జాతి ప్రజలు ఇరుగు పొరుగుతో సామరస్యంగా ఉంటూ వచ్చారు. కాని ఆర్థిక అసమానతలూ, తరుగుతున్న వనరులు, పెరుగుతున్న పోటీ, జనాభాకు సరిపడా పెరగని ఉద్యోగావకాశాలూ వివిధజాతుల మధ్య వైషమ్యాలకు ఆస్కారమిస్తున్నాయి. హిందూ ముస్లిము విభేదాలతో ఈ వైషమ్యాలు ఆగటంలేదు. కొండలలోని తెగలకూ విస్తరించాయి. ముఖ్యజాతులైన నాగా, కుకీ తెగల మధ్య దారుణ మారణకాండలు ప్రజ్వరిల్లాయి.

అయితే సాయుధ వేర్పాటువాదం మణిపూర్‌లో అన్నింటికంటే తీవ్రమైన సమస్య. నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ నేతృత్వంలో భారత జాతీయ సేన (INA) త్రివర్ణ పతాకం మొదటిసారిగా ఎగురవేసిన భారతభూభాగమైన ఈ నేల ఇప్పుడు వేర్పాటువాదంతో కకావికలవుతున్నది. స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే ప్రారంభమైన ఈ వేర్పాటువాదం ఎన్నో వర్గాలు, జాతులతో విస్తరించింది. మణిపూర్ జీవనంలో పోరాటాలు, మరణాలు, ఆందోళనలు అనుదిన సంఘటనలైపోయాయి. నెలనెలా ఉగ్రవాదుల దళాలకు ధనం ముట్టజెప్పడం సర్వ సాధారణమైపోయింది.

పెచ్చరిల్లుతున్న నిరుద్యోగ సమస్య, భారత ప్రభుత్వం చూపిన అలక్ష్య ధోరణి, మణిపూర్‌వాసుల పట్ల ఇతర ప్రాంతాలవారు చూపే వివక్షత - ఇలా చాలా కారణాలు వేర్పాటు వాదానికి కారణాలని విశ్లేషకులు చెబుతారు. ప్రస్తుతం ఎన్నో వేర్పాటుపోరాఠం చేసే వర్గాలు ఉన్నాయి.
(GlobalSecurity.org నుండి)

చాలాకాలంనుండి మణిపూర్‌కు మయన్మార్‌తో సరిహద్దువిషయంలో తగవులున్నవి. ఇంకా మణిపూర్, నాగాలాండ్‌ల మధ్య కూడా సరిహద్దు విభేదాలున్నాయి.

మణిపూర్ వాసుల అసంతృప్తిని పోగొట్టేందుకు కేంద్రప్రభుత్వం కొన్ని ముఖ్యమైన చర్యలు తీసికొంది. 1992లో రాజ్యాంగం 71వ సవరణ ద్వారా మణిపురి భాషను 8వ షెద్యూలులో చేర్చారు. ఇప్పుడు మణిపూర్‌కు స్వంత టెలివిజన్ స్టేషను ఉంది.

మణిపూర్ విశ్వవిద్యాలయంకు కేంద్రీయ విశ్వవిద్యాలయం హోదా కల్పించారు. 97.9 కి.మీ. పొడవైన జిరిబామ్-ఇంఫాల్ బ్రాడ్‌గేజి రైలు మార్గం పనులు ప్రారంభించారు. ఈ మార్గం ఇంఫాల్‌కు 25 కి.మీ. దూరంలోని తుపుల్ వరకు వేయబడుతుంది.




#Article 222: కేరళ (2241 words)


కేరళ (ఆంగ్లం: Kerala,കേരളം )తెలుగు రాష్టాలకు నైరుతి దిశలో మలబార్ తీరాన ఉన్న రాష్ట్రము. కేరళ సరిహద్దులలో తూర్పు, ఉత్తరానా కర్ణాటక,తూర్పునా తమిళనాడు రాష్ట్రాలు, పడమర దిక్కున అరేబియా సముద్రం, దక్షిణాన తమిళనాడు కు చెందిన కన్యాకుమారి జిల్లా  ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి చెందిన మాహె పూర్తిగా కేరళలోనే ఉంది. దక్షిణ భారతంగా పరిగణించబడే ఐదు రాష్ట్రాలలో కేరళ ఒకటి.

క్రీ.పూ.10 వ శతాబ్దంలో ద్రావిడ భాషలు మాట్లాడే వారు ఇక్కడ స్థిరపడ్డారు. మౌర్య సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. తరువాతి కాలంలో చేర సామ్రాజ్యంలోను, భూస్వామ్య నంబూదిరిల పాలనలోను ఉంటూ వచ్చింది. విదేశాలతో ఏర్పరచుకుంటున్న సంబంధాలు చివరకు స్థానికులకు, ఆక్రమణదారులకు మధ్య ఘర్షణలకు దారితీసాయి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి 1956 నవంబర్ 1 న కేరళ పూర్తి స్థాయి రాష్ట్రంగా అవతరించింది. 19వ శతాబ్దంలో కొచ్చిన్, తిరువాన్కూరు సంస్థానాలు చేపట్టిన సామాజిక సంస్కరణలు స్వాతంత్ర్యం తరువాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించారు. అందువలన మూడో ప్రపంచ దేశాల్లోనే అత్యధిక అక్షరాస్యత ఉన్న, అత్యంత ఆరోగ్యకరమైన ప్రాంతంగా కేరళ నిలిచింది. అయితే, ఆత్మహత్యలు,నిరుద్యోగం, నేరాలు భారత్‌లో కెల్లా  అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి.

కేరళకు ఆ పేరెలా వచ్చిందనే విషయంలో వివాదం ఉంది. కేర అంటే కొబ్బరి చెట్టు, ఆళం అంటే భూమి - ఈరెంటి నుండి కొబ్బరిచెట్ల భూమిగా కేరళం అయింది అనేది ఒక వాదన. ఈ విధంగా కేరళీయులు తమ భూమిని కేరళంగా పిలుచుకుంటారు. చేర, ఆళం అనగా చేరుల భూమి అనే మాట నుండి కేరళం వచ్చిందనేది మరో వాదన.

ట్రావన్కోర్ (తిరువాన్కూరు) రాజు రాజా మార్తాండ వర్మ తన రాజ్యాన్ని తిరువనంతపురం లోని పద్మ నాభ స్వామికి అంకితం చేసి ఆయన దాసునిగా రాజ్యాన్ని పరిపాలించాడు. అతని తర్వాత ఆయన వారసులైన రాజులు కూడా ఆ విధంగా నే చేసారు. రాజ ముద్రలు దేవుని పేరునే ఉండేవి. అందు కనే కేరళను God's own country భగవంతుని రాజ్యంగా అంటారు.

పరశురాముడు సముద్రాన్ని వెనక్కి పంపించి, కేరళను వెలికితీసాడని పురాణ గాథ. కొత్త రాతియుగం కాలంలో ఇక్కడి వర్షాటవులు మలేరియాకు ఆలవాలమై ఉండడంతో కేరళ ప్రాంతంలో మానవ నివాసాలు ఉండేవి కావు. అంచేత క్రీ.పూ.10వ శతాబ్దం నాటి కుండపెంకులు, సమాధులే ప్రజల నివాసానికి సంబంధించి ఇక్కడ లభించిన మొదటి దాఖలాలు. ప్రాచీన తమిళం మాట్లాడే ప్రజలు వీటిని నిర్మించారు. దీన్ని బట్టి, ప్రాచీన కాలంలో కేరళ, తమిళనాడు ప్రాంతాలు (తమిళకం లోని భాగం) ఒకే భాష, జాతి, సంస్కృతికి చెందిన వారని తెలుస్తూంది. 14 వ శతాబ్దపు తొలినాళ్ళకు, భాష పరంగా కేరళ ప్రత్యేకతను సంతరించుకుంది. ఆధారాలు లభించిన మొదటి సామ్రాజ్యం - చేర వంశీకులు - వంచి రాజధానిగా కేరళను పాలించారు. పల్లవులతో కలిసి వారు చోళ, పాండ్య రాజులతో యుద్ధాలు చేసారు. 8- 14 శతాబ్దాల మధ్యకాలంలో చేరరాజుల పాలనా సమయంలో మళయాళం భాష అభివృద్ధి చెందింది. ఆదే సమయంలో కేరళీయులు తమిళప్రజలలో భాగంగా కాక ఒక ప్రత్యేకమైన జాతిగా గుర్తింపు ఏర్పడింది.

లిఖితంగా కేరళ గురించిన ప్రస్తావన సంస్కృత ఇతిహాసం ఐతరేయారణ్యకంలో మొదటిగా లభిస్తున్నది. తరువాత కాత్యాయనుడు, పతంజలి, పెద్దప్లినీ (ప్లినీ ది ఎల్డర్)  ల వ్రాతలలోనూ, పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ (Periplus of the Erythraean Sea) గ్రంథంలోనూ కేరళ ప్రస్తావనలున్నాయి.

చేర రాజులు వర్తకంమీద ఆధారపడినందున పశ్చిమ ఆసియా వర్తకులు క్రమంగా వ్యాపారస్థావరాలు ఏర్పరచుకొన్నారు. ఇంకా తమ దేశాలలో తమపై జరుగుతున్న అత్యాచారాలనుండి తప్పించుకోవడానికి యూదులు, క్రైస్తవులు వంటివారు ఇక్కడికి వలస వచ్చారు. అలా సిరియన్ మలబార్ క్రైస్తవ సమాజం,, మప్పిల ముస్లిమ్ సమాజం వంటివి రూపు దిద్దుకొన్నాయి. యూదులు క్రీ.పూ. 573లో ఇక్కడకి వచ్చి ఉండవచ్చునని అంచనా. 
అపోస్తలు థామస్ క్రీ.శ. 52లో కేరళలోని ముజిరిస్కు వచ్చి అక్కడి యూదులలో క్రైస్తవబోధనలు ఆరంభించాడని తెలుస్తున్నది.

కాని సుమారు క్రీ.శ.345 లో యూదుల వలసకు (నస్రాని-యూదులు) కచ్చితమైన ఆధారం క్నాయి తోమా (Knai Thoma) రాక. 8వ శతాబ్దంలో ముస్లిం మతస్తులు కేరళలో స్థిరపడ్డారు. 

డచ్చివారికి, పోర్చుగీసువారికి జరిగిన యుద్ధాలలో 1741లో డచ్చివారిది పైచేయి అయ్యింది. 1766లో మైసూరుకు చెందిన హైదర్ ఆలీ కేరళ ఉత్తరభాగమైన కోజికోడ్‌ను జయించాడు. 18వ శతాబ్దంలో హైదర్ ఆలీ కొడుకు టిప్పు సుల్తాన్‌కు, బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి మధ్య జరిగిన రెండు ఆంగ్లో-మైసూర్ యుద్ధాల ఫలితంగా మలబార్జిల్లా, దక్షిణ కెనరాలు 1790లో ఆంగ్లేయుల పరమయ్యాయి. 1791, 1795లలో కంపెనీవారు కోచి, తిరువాన్కూరు సంస్థానాలతో ఒప్పందాలు కుదుర్చుకొన్నారు. మలబార్, దక్షిణకెనరా ప్రాంతాలు మద్రాసు ప్రెసిడన్సీలో భాగాలయ్యాయి.

కేరళలో బ్రిటిష్ అధికారానికి ప్రతిఘటనలు తక్కువనే చెప్పవచ్చు. 1946 పున్నపర-వయలార్ తిరుగుబాటు అలాంటివాటిలో ఒకటి. కాని నారాయణ గురు, చత్తంపి స్వామిగళ్ వంటి సంస్కర్తల నాయకత్వంలో అంటరానితనం వంటి దురాచారాలకు వ్యతిరేకంగా గట్టి ఉద్యమాలు నడచాయి. 1924లో జరిగిన వైకోమ్ సత్యాగ్రహం వీటిలో చెప్పుకొనదగినది. 1936లో తిరువాన్కూర్ చిత్ర తిరుణాల్ బాల రామ వర్మ అన్ని కులాలకూ ఆలయప్రవేశాన్ని కల్పిస్తూ ఆదేశాలను జారీ చేశాడు. కొచ్చిన్, మలబార్‌లలో కూడా ఇదే ప్రగతిశీల పరిణామాలు చోటు చేసుకొన్నాయి.

ఆ కమ్యూనిస్టు ప్రభుత్వం కార్మికులకు, కౌలుదారులకు అనుకూలమైన విధానాలను అనుసరించింది. తరువాతి ప్రభుత్వాలు కూడా ఇదే మార్గాన్ని అవలంబించారు. 
 ప్రజల జీవన ప్రమాణాలు ఈ కాలంలో గణనీయంగా అభివృద్ధి చెందాయి.

కేరళ భూవైశాల్యం 38,863 చ.కి.మీ. ఇది భారతదేశ వైశాల్యంలో 1.18%. ఎక్కువ భాగం పడమటి కనుమలకు, అరేబియా సముద్రానికి మధ్య ఉంది. ప్రపంచంలో జీవవైవిధ్యం బాగా ఉన్న 25 
ప్రదేశాలలో కేరళ ఒకటి. (biodiversity hotspots)  ఉత్తర అక్షాంశాలు 8°18', 12°48' మధ్య, తూర్పు రేఖాంశాలు 74°52', 72°22' మధ్య  ఉన్న కేరళ పూర్తిగా భూమధ్య ఉష్ణమండల ప్రదేశంలో ఉంది. కేరళ తీరరేఖ 580 కి.మీ. పొడవైనది. కేరళ వెడల్పు వివిధ ప్రాంతాలలో 35 కి.మీ - 120 కి.మీ. మధ్య ఉంటుంది.

భౌగోళికంగా కేరళను మూడు ప్రాంతాలుగా విభజింపవచ్చును - తూర్పు మెరక ప్రాంతం, మధ్య కొండ ప్రాంతం, పశ్చిమ పల్లపు (మైదాన) ప్రాంతం. భారత tectonic plate మధ్యలో ఉండడం వలన కేరళలో భూప్రకంపనల ప్రమాదం బాగా తక్కువ.
 

కేరళ తూర్పు భాగం పడమటి కనుమల వర్షచ్ఛాయప్రదేశానికి ఆనుకొని ఉంది. ఇక్కడ ఎత్తైన కొండలు, లోతైన లోయలు ఉన్నాయి. పడమటికి ప్రవహించే 41 నదులు, తూర్పుకు ప్రవహించే 3 నదులు ఇక్కడే ఆరంభమౌతాయి. పడమటి కనుమలు దాదాపు గోడకట్టినట్లున్నాయి. పాలఘాట్ దగ్గర మాత్రం ఖాళీస్థలం ఉన్నందున మిగిలిన భారతదేశానికి ఇది ఒక ముఖ్యమైన ద్వారమయ్యింది.
 కనుమల సగటు ఎత్తు 1,500 మీ. 2,500 మీ. ఎత్తైన శిఖరాలున్నాయి. కనుమలకు ఆనుకొని పడమటి ప్రాంతంలో మధ్య పడమటి మైదానప్రాంతం ఉంది. ఇక్కడ ఎత్తుపల్లాల భూములు, లోయలు ఎక్కువ.

కేరళ పశ్చిమతీరమైదానం సమతలమైనది. ఇక్కడ అంతటా ఉప్పుటేరులు, నదీముఖద్వారాలు, కాలువలు చిలవలు పలవలుగా విస్తరించి ఉన్నాయి. వీటిని Kerala Backwaters అంటారు. 
వీటిలో అలప్పుళ్ళ, కోచిల మధ్యనున్న వెంబనాడ్ సరస్సు బాగా పెద్దది. దాని వైశాల్యం 200 చ.కి.మీ. మొత్తం దేశంలోని జలమార్గాలలో 8% కేరళలోనే ఉన్నాయి. 
 
కేరళలో మొత్తం 44 నదులున్నాయి. వీటిలో పెరియార్(244 కి.మీ.), భరతgallonioiefjcgdurg I chillinglyపుళ్ళ (209 కి.మీ.), పంబ (176 కి.మీ.), చలియార్ (169 కి.మీ.), కదలుండిపుళ్ళ (130 కి.మీ.), అచన్‌కోవిల్ (128 కి.మీ.)-ముఖ్యమైన నదులు. మిగిలిన చిన్న నదులకు ఋతుపవన వర్షాలే పూర్తి జలాధారం.

ఈ భౌగోళికకారణాలవల్ల పడమటి కనుమలలో కొన్ని ప్రాంతాలు సంవత్సరంపొడవునా నీటిమయమై ఉంటాయి. కుట్టనాడ్‌లో 500 చ.కి.మీ. ప్రదేశం సముద్రమట్టానికి దిగువున ఉంది.
కేరళ నదులు చిన్నవైనందున వాటికి (ముఖద్వారాలలో) డెల్టాలు లేవు. కనుక పర్యావరణ ప్రభావాలు వీటిపై ఎక్కువ.
 
వేసవిలో ఎండ్రు, ఆనకట్టలవల్ల ఇసుక మేటలు, కాలుష్యం వంటి సమస్యలకు కేరళ నదులు వేగంగా ప్రభావితమౌతాయి.

సంవత్సరానికి 120 నుండి 140 వరకు వర్షపు రోజులున్నందున కేరళ వాతావరణం బాగా తేమమయం. 
 
తూర్పు కేరళలో కాస్త పొడి వాతావరణం ఉంటుంది. కేరళ సగటు వర్షపాతం 3,107 మి.మీ. (భారతదేశపు సగటు 1,197 మి.మీ.). ఇడుక్కి పర్వతప్రాంతాలలో 5,000 మి.మీ. వరకు వర్షపాతం నమోదు అవుతుంది. కేరళ వర్షాలకు ప్రధానకారణం ఋతుపవనాలు. more anomalous factors resulted in the red rains of 2001. Kerala . 
వేసవిలో ఈదురుగాలులు, తుఫానులు, అల్పపీడనం కారణంగా వచ్చే వర్షాలు సామాన్యం. పర్యావరణ ఉష్ణోగ్రతలు పెరగడం (global warming) వలన కూడా అకాల వర్షాలు, సముద్ర మట్టం పెరగడం వంటి పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి.

 

కేరళ సగటు ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలు - 27 డిగ్రీలు సెంటీ గ్రేడ్ మధ్య ఉంటాయి. ఇవే తీరమైదానాలలో 20 డిగ్రీలు-22.5 డిగ్రీల మధ్య ఉంటాయి. దినసరి అధిక ఉడ్ణోగ్రతల సరాసరి 36.7 డిగ్రీలు సెంటీగ్రేడు. దినసరి అల్ప‌ఉష్ణోగ్రతల సరాసరి 19.8 డి.సెం.

కేరళ జీవవైవిధ్యం తూర్పు ప్రాంతంలో కేంద్రీకృతం అయ్యి ఉంది. భారతదేశపు మొత్తం వృక్షజాతిలో 4వ వంతు, అంటే సుమారు 10,000 జాతులు కేరళలో ఉన్నాయి. 4,000 పుష్పజాతులలో 1,272 రకాలు కేరళకు (endemic) స్థానికం, 900 రకాలు విలువైన ఆయుర్వేద ఔషధిమొక్కలు. 

కేరళలోని 9,400 చ.కి.మీ. అడవులలో, ఎత్తును బట్టి ఎన్నో విధాల ఉష్ణమండలపు, సమోష్ణమండలపు వృక్షజాతులున్నాయి. మొత్తం కేరళలో 24% అటవీ భూమి.
 సస్థంకొట్ట చెరువు, వెంబనాడ్ చెరువు - ఇవి రెండు ప్రపంచంలో గుర్తింపబడిన (Ramsar Convention listed) తేమ పర్యావరణ ప్రదేశాలు. నీలగిరి జీవ పరిరక్షణా నిలయం (Nilgiri Biosphere Reserve) కూడా ఇదే గుర్తింపు పొందింది. ఇటీవలికాలంలో అడవులను వ్యవసాయభూములుగా మార్చడం వల్ల పర్యావరణానికి జరుగుతున్న హానిని దృష్టిలో ఉంచుకొని కేరళ అడవులలో చాలా భాగాన్ని రక్షితప్రాంతంగా ప్రకటించారు.

కేరళ జంతుసంపదలో వైవిధ్యం, స్థానికత్వం గమనించదగిన విషయాలు. తీవ్రమైన పర్యావరణ వినాశనం (అడవల నరికివేత, చరియలు విరగడం, ఉప్పుపట్టడం, ఖనిజసంపద త్రవ్వకం వంటివి) వల్ల కేరళలోని ఈ జంతుసంపద మనుగడకు ప్రమాదం వాటిల్లుతున్నది.

కేరళలోని 14 జిల్లాలు చారిత్రికంగా మూడు విభాగాలుగా పరిగణింపబడుతాయి

 
కేరళ రాజధానితిరువనంతపురం రాష్ట్రంలో అత్యధిక జనాభా గల నగరం.

కొచ్చి ఎక్కువ నగరపరిసర జనాభా కలిగినది (most populous urban agglomeration)

కోజికోడ్, పాలక్కాడ్, కొల్లం, త్రిస్సూర్ముఖ్యమైన ఇతర వాణిజ్యనగరాలు. కేరళ హైకోర్టు ఎర్నాకుళంలో ఉంది.

కేరళ భారతదేశం లోనే ప్రముఖ పర్యాతక ప్రదేశం. ప్రముఖ కృష్ణ మందిరం గురువాయూర్, అయ్యప్ప స్వామి, తిరువనంత పురంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయాలను చూడ టానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.
అలాగే మున్నార్ టీ తోటలు, అలెప్పి లోని బాక్ వాటర్స్, అద్భుత మైన బీచ్ లు, జల పాతాలు చూడ టానికి దేశ విదేశాల నుండి ఎందరో వస్తుంటారు.

కేరళ పాలనా వ్యవస్థ భారతదేశంలో మిగిలిన రాష్ట్రాలవలెనే ఉంటుంది.

కేరళలో రెండు ప్రధాన రాజకీయ సంకీర్ణాలున్నాయి. ఒకటి యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (ఇండియా) (UDF-United Democratic Front,India ) - ఇది భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో నడుస్తంది. రెండవది లెఫ్ట్ డెమొక్రాటిక్ ఫ్రంట్(LDF-Left Democratic Front) - ఇది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) (CPI-M)అధ్వర్యంలో ఉంటుంది. వామపక్ష రాజకీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాలలో కేరళ ఒకటి. రాజకీయ కార్యక్రమాలలో కేరళ ప్రజలు చైతన్యవంతంగా పాల్గొంటారు.

పన్నుల ద్వారా కేరళ రాష్ట్ర ప్రభుత్వపు ఆదాయం (కేంద్రం నుండి వచ్చే వాటాను మినహాయించి) 2005లో 11,124 కోట్ల రూపాయలు (2000 సంవత్సరంలో ఇది 6,360 కోట్లు). పన్నులు కాకుండా ఇతరత్రా వచ్చే ఆదాయం 2005లో 1,080 కోట్లు (2000లో 684 కోట్లు).

అయినా కేరళ బడ్జెట్ లోటు చాలా ఎక్కువ. అందువలన ప్రభుత్వఋణభారం ఎక్కువై సామాజికసేవలకు పెట్టే ఖర్చుకు ఇబ్బంది అవుతున్నది.

మొదటినుండి కేరళ ప్రభుత్వాలు సంక్షేమకార్యక్రమాలకు పెద్దపీట వేశాయి. ప్రధానంగా సామ్యవాద ప్రజాస్వామ్యం కేరళ రాజకీయాలలో ముఖ్యమైన సిద్ధాంతం. కాని ఇటీవల మిగిలిన రాష్ట్రాలవలెనే కేరళ కూడా ఆర్థిక సంస్కరణలపట్ల, సరళీకృత వాణిజ్య విధానాలపట్ల, విదేశీ పెట్టుబడులపట్ల మొగ్గు చూపుతోంది.

 
ఈ వృద్ధి రేటు 1980 దశకంలో 2.3%, 1990 దశకంలో 5.1%-5.99% ఉంటే 2003-2005 మధ్య 7.4%, 9.2% వృద్ధి నమోదయ్యింది. 

భారీ వ్యాపార సంస్థలు, బాంకులు తమవ్యాపారాలకు కేరళను పెద్దగా ఎన్నుకోవడంలేదు.

కాని విదేశాలలో పనిచేసే కేరళీయులు తమకుటుంబాలకు పంపే ధనంవల్ల ఈ లోటు భర్తీ అవుతున్నది. కేరళ స్థూల ఉత్పత్తిలో 20% వరకు విదేశాలలో ఉండేవారు పంపే ధనమే.

కేరళ తలసరి స్థూల ఆదాయం 1,819 రూపాయలు.
ఇది మొత్తం భారతదేశం తలసరి స్థూల ఆదాయం కంటే బాగా ఎక్కువ, కాని ప్రపంచపు సగటుకంటే ఇంకా తక్కువే. ఇక కేరళ జనాభివృద్ధి సూచిక (Human Development Index), జీవన ప్రమాణాలు భారతదేశంలో చాలా ప్రాంతాలకంటే బాగా మెరుగైనవి.

ఇలా ఆర్థిక ప్రగతి లేకుండానే, గణనీయమైన జీవన ప్రమాణాలు సాధించడం కేరళ వ్యవస్థకున్న ప్రత్యేకత అని నిపుణులు భావిస్తారు. (Kerala model,Kerala phenomenon). కేరళలో ఉన్న పటిష్ఠమైన సేవారంగం (service sector) వల్లనే ఇది సాధ్యమైందని నిపుణుల విశ్లేషణ. 

సేవారంగం (టూరిజము, ప్రజాపాలన, బ్యాంకింగ్, ఫైనాన్స్, రవాణా, సమాచారం వంటివి కలిపి) కేరళ స్థూల ఆదాయంలో 63.8% సమకూరుస్తున్నాయి. వ్యవసాయం, మత్స్యపరిశ్రమల పాలు 17.2%  కేరళలో దాదాపు సగంమంది ఆదాయానికి వ్యవసాయంపై ఆధారపడుతున్నారు. కేరళవాసుల ప్రధానాహారం వరి. దాదాపు 600 రకాల వరి

)
కేరళలోని 310,521 హెక్టారుల పంటభూముల్లో పండుతుంది. (1990లో వరి సేద్యం జరిగే భూమి 588,340 హెక్టారులు ఉండేది. క్రమంగా ఇది తగ్గుతున్నది.)
)
సంవత్సరానికి 688,859 టన్నుల ధాన్యం పండుతుంది.
 
కొబ్బరి (899,198 హెక్టారులు), తేయాకు, కాఫీ (57,000 టన్నులు - భారతదేశపు ఉత్పత్తిలో 23%),

)
రబ్బరు, జీడిమామిడి, సుగంధద్రవ్యాలు (మిరియం, ఏలక, వనిల్లా, దాల్చీనీ,పోక వంటివి)కేరళలో ఇతర పంటలు. దాదాపు 10.50 లక్షల మత్స్యకారులు ఏటా 6,68,000 టన్నుల చేపలు పడతారు. (1999–2000 అంచనా); కేరళ 590 కి.మీ. తీరంలో 222 చేపలు పట్టడమే ప్రధాన వృత్తిగా ఉన్న పల్లెలున్నాయి. ఇంకా లోపలి భూభాగంలో 13 చేపలు పట్టే పల్లెలున్నాయి. పీచు పరిశ్రమ, చేనేత, హస్తకళలు వంటి వృత్తులలో 10 లక్షలమందికి జీవనాధారము. 1,80,000 చిన్న పరిశ్రమలలో 9,09,859మందికి జీవనోపాధి లభిస్తున్నది. కొద్దిగా ఖనిజాల త్రవ్వకం జరుగుతున్నది. (స్థూల ఉత్పత్తిలో 0.3%)

ఇలెమినైటు, సిలికా, క్వార్ట్జ్, రుటైల్, జిర్కోన్, కావొలిన్, సిల్లిమనైట్ వంటి ఖనిజాలు లభిస్తున్నాయి.

పెరటితోటలు, పశుపాలన కూడా లక్షలాదిమందికి ఉపాధి కలుగజేస్తున్నాయి.

ఇంకా టూరిజము, పారిశ్రామిక ఉత్పత్తులు, business process outsourcing కేరళలో ఇతర సేవారంగ ఉపాధి వనరులు. కేరళ నిరుద్యోగుల శాతం 19.2% అని ఒక అంచనా.
 20.77% అని మరొక అంచనా

రాష్ట్రంలో దారిద్ర్యరేఖ దిగువన ఉన్నవారు 12.71% అని కొన్ని అధ్యయనాలు చెప్పగా 

కేరళలో 145,704 కి.మీ. రోడ్లున్నాయి (మొత్తం దేశంలో 4.2%) అంటే ప్రతి వెయ్యి జనాభాకు 4.62 కి.మీ. అన్న మాట. (భారతదేశం సగటు 2.59 km). దాదాపు అన్ని పల్లెలూ రోడ్లతో కలుపబడి ఉన్నాయి. కేరళ జనసాంద్రత ఎక్కువ కావడం వలన భారతదేశం సగటు రోడ్ల వ్వస్థకంటే కేరళ సగటు బాగా ఎక్కువ. మొత్తం దేశం హైవేలలో 2.6% (1,524 కి.మీ.) కేరళలో ఉన్నాయి. 8 జాతీయ రహదారులు (నేషనల్ హైవేలు) కేరళలో ఉన్నాయి. ట్రాఫిక్ కూడా వేగంగా పెరుగుతున్నది. NH 47, NH 17ల ద్వారా కేరళ పశ్చిమతీరం దాదాపు అంతా కలుపబడింది.

కేరళలోని 3.18 కోట్ల జనాభా ప్రధానంగా మళయాళీ, ద్రావిడ జాతి చెందినవారు. జాతిపరంగా ఇండో-ఆర్యన్,యూదు,అరబ్బు జాతులకు గాని, సంస్కృతికిగాని చెందినవారు. ఇంకా జనాభాలో 3,21,00 మంది(1.1%)) ఆదివాసి తెగలకు చెందినవారు.
. మళయాళం కేరళ అధికార భాష. ; తమిళం, కొన్ని ఆదివాసి భాషలు కూడా ఆయా వర్గాలకు చెందినవారు మాట్లాడుతారు. దేశంలో 3.44% జనాభా కేరళలోనే ఉంది. చ.కి.మీ.కు 819 జనులున్నందున 

కేరళ జనసాంద్రత భారతదేశపు జనసాంద్రతకంటే మూడురెట్లు ఎక్కువ. కాని కేరళ జనాభా వృద్ధిరెటు దేశంలోనే అతితక్కువ.
 దశాబ్దంలో కేరళ జనాభా వృద్ధి 9.42 % (దేశం మొత్తంమీద వృద్ధిరేటు 21.34%).

కేరళలో జనాభా ఎక్కువగా తీరప్రాంతంలో ఉన్నారు.

మొత్తం జనాభాలో ఆడువారు 51.42% 

మతపరంగా హిందువులు54.7%, ముస్లిములు 26.6%, క్రైస్తవులు 18.4% ఉన్నారు.

ఒకప్పుడు గణనీయంగా ఉన్న కొచ్చిన్ యూదులు ఇప్పుడు కొద్ది సంఖ్యలో ఉన్నారు. చాలామంది ఇస్రాయెల్‌కు వలస వెళ్ళారు(aliyah). చాలా రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో మతపరమైన ఘర్షణలు దాదాపు లేవు. కాని ఇటీవల మతపరంగా తీవ్రభావాలున్న సమాజాల కార్యకలాపాలు విస్తృతమౌతున్నాయి.
 
కేరళలో నేరాలు, మానభంగాలు, హింసాత్మక చర్యలు మిగిలిన దేశంలో కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి.
 — ఈ విషయంలో దేశంలో కేరళది మూడవ స్థానం.

పితృస్వామ్య కుటుంబ విధానం తక్కిన మూడవ ప్రపంచంకంటే కేరళలో తక్కువ బలంగా ఉంది.
 
చాలామంది కేరళీయులు (కొందరు హిందువులు, మలబారు ముస్లిములు) మాతృస్వామ్య కుటుంబ విధానం (మరుమక్కతాయం) అనుసరిస్తారు. క్రైస్తవులు, తక్కిన ముస్లిములు, కొదరు హిందువులు ఒకవిధమైన పితృస్వామ్యవిధానాన్ని (మక్కతాయం)అనుసరిస్తారు.

కేరళలో స్త్రీ-పురుష సమానత్వం మిగిలిన దేశంకంటే ముందంజలో ఉంది.

 H
కాని ఇది కూడా క్రమంగా దెబ్బతింటున్నది.

ఆడువారిపై గృహహింస, అత్యాచారాలు పెరుగుతున్నాయి.
) ప్రపంచీకరణ, ఆధునికీకణ, సంస్కృతీకరణ (వెనుకబడిన పేదలు ధనికవర్గాల ఆచార వ్యవహారాలను అనుకరించడం) ఇందుకు ముఖ్యకారణాలు. 

కేరళ జనాభివృద్ధి సూచికలు— పేదరిక నిర్మూలన, ప్రాథమిక విద్యావకాశాలు, ఆరోగ్య సదుపాయాలు— భారతదేశంలో చాలా ఉత్తమస్థాయిలో ఉన్నాయి. ఉదాహరణకు కేరళలో అక్షరాస్యత 91%
,
జీవన కాలప్రమాణం 73 సంవత్సరాలు
.
ఇవి భారతదేశంలో మిగిలిన ప్రాంతాలకంటే చాలా మెరుగైనవి. కేరళలో గ్రామీణ పేదరకం 1970–1971లో 69% ఉండగా 1993–1994 లో 19%కు తగ్గింది. అదే పట్టణ, గ్రామీణ ప్రాంతాలు కలిపితే 36% తగ్గింది.
 

 
స్వాతంత్ర్యం తరువాత రాష్ట్రప్రభుత్వాలు ఈ ఒరవడిని కొనసాగించాయి.

కేరళ ఆరోగ్య సదుపాయ వ్యవస్థ ఐక్యరాజ్యసమితి శిశు సంక్షేమ నిధి(UNICEF), ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) వంటి సంస్థల నుండి పిల్లలకు అనుకూలమైన రాష్ట్రము అని మన్ననలు అందుకొన్నది.— ఉదాహరణకు 95% కంటే ఎక్కు జననాలు ఆసుపత్రులలో జరుగుతున్నాయి.

ఆయుర్వేదము,

సిద్ధ వైద్యము, యునాని, ఇంకా కొన్ని (ప్రస్తుతం కనుమరుగవుతున్న) సాంప్రదాయిక, నాటు వైద్యవిధానాలు — కలారి, మర్మచికిత్స, విషవైద్యం వంటివి
 ఇంకా కేరళలో వాడబడుతున్నాయి.
ఈ విజ్ఙానం గురుకుల విద్యా విధానం ద్వారా శిష్యులకు సంక్రమిస్తున్నది.
 వీటిలో కొన్ని మూలికలు, మంత్రాల కలగలుపు విధానాలు.
 
వైద్య పర్యాటకులు కేరళ ప్రత్యేక వైద్యవిధానాల చికిత్సకోసం కేరళకు వస్తుంటారు (Health Tourism).

కేరళ జనాభాలో వృద్ధుల శాతం క్రమంగా పెరుగుతున్నది. ప్రస్తుతం 11.2% కేరళీయులుఉ 60 సంవత్సరాల వయసు పైబడినవారు.

ఇందుకు తోడు తరుగుతున్న జననాల రేటు — వెయ్యికి 18
 — 
ఈ జనాభా పరిణామం(demographic transition)పరిస్థితి ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాలలో ఉంటుంది. కేరళ, క్యూబావంటి కొద్ది తృతీయ ప్రపంచం ప్రాంతాలలో మాత్రమే ఇలాంటి పరిస్థితి సంభవిస్తున్నది.

 

కేరళ సంస్కృతి ప్రధానంగా ద్రావిడమూలాలనుండి ఆవిర్భవించింది. తమిళకం అనబడే ప్రాంతీయ సాంస్కృతిక వర్గంలో ఇది ఒక భాగం. తరువాత శతాబ్దాలపాటు సాగిన పొరుగు దేశాల సంస్కృతుల సంబంధాలు కూడా ఈ ద్రావిడ సంస్కృతిని ప్రభావితం చేశాయి.

కథాకళి, కూడియాట్టం, కేరళనటనం, మోహినియాట్టం, తుల్లాల్, పాదయని, తెయ్యం – ఇవి కేరళకు ప్రత్యేకమైన కళారూపాలు. ఇంకా చవిట్టు నడకొం, ఒప్పన వంటి మరికొన్ని కళలు మతాలకు, కొండజాతులకు సంబంధించినవి. కాని ఇవి ఎక్కువగా ప్రత్యేక ఉత్సవాలకు, పర్యాటకులకు, ప్రత్యేక ఆసక్తి ఉన్నవారికి ప్రదర్శింపబడుతున్నాయి. సామాన్య ప్రజానీకం సమకాలీన కళలపట్ల ఆసక్తి చూపుతున్నారు (మిమిక్రీ, పేరడీ వంటివాటిపై కూడా). ఇక మళయాళం సినిమా కూడా బాగా జనాదరణ కలిగి ఉంది. బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలకు దీటుగా మళయాళం సినిమాలు ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి.

మళయాళం సాహిత్యం బాగాపురాతనమైనది. 14వ శతాబ్దంలో మాధవ పణిక్కర్, శంకర పణిక్కర్, రామ పణిక్కర్ వంటి నిరణం కవులు మళయాళ భాష ఆభివృద్ధికీ, ప్రత్యేకమైన కేరళ సాహిత్యం రూపుదిద్దుకోవడానికీ ఆద్యులు. ఆధునిక మళయాళ కవిత్రయం అని చెప్పబడే కుమారన్ ఆశన్, వల్లతోల్ నారాయణ మీనన్, ఉల్లూర్ ఎస్.పరమేశ్వర అయ్యర్‌లు కేరళకవితాసాహిత్యాన్ని పురాతనసంప్రదాయాల పట్టునుండి ఆధునిక శైలివైపు మళ్ళించారని గుర్తింపు పొందారు. 20వ శతాబ్దం ద్వితీయార్ధంలో జ్ఞానపీఠ అవార్డు పొందిన జి.శంకర కురుప్, ఎస్.కె.పొట్టక్కాట్, ఎమ్.టి.వాసుదేవన్ నాయర్‌లు, ఇతర సాహితీకారులు మళయాల సాహిత్యానికి మరింత వన్నెతెచ్చారు.

తరువాతి కాలంలో ఒ.వి.విజయన్, ఎమ్.ముకుందన్, అరుంధతీ రాయ్ (ఆమెకు 1996లో బుకర్ బహుమతి తెచ్చిపెట్టిన స్వీయచరిత్రతో ముడివడిన నవల The God of Small Things కథ కేరళ కొట్టాయం పట్టణం నేపథ్యంలో నడుస్తుంది.)— వంటి రచయితలు అంతర్జాతీయ గుర్తింపు పొందారు.

 

కేరళ సంగీతం కూడా ప్రాచీన సంప్రదాయం గలది. స్వాతి తిరునాళ్ రామవర్మ కీర్తనలు 19వ శతాబ్దంలో ప్రజాదరణ పొందిన తరువాత కర్ణాటక సంగీతం కేరళ సంగీత రంగంలో ప్రధానపాత్ర వహిస్తున్నది.

సోపానం అనబడే రాగయుక్తమైన పాటలు కథాకళి నృత్యంతో పాడబడతాయి. మేళం సంగీతప్రదర్శనలు మందిరాలలోనూ, ఉత్సవాలలోనూ ఇస్తారు. 4 గంటలకాలం కూడా సాగే ఒకో మేళంలో 150వరకు వాద్యగాళ్ళు పాల్గొంటారు. పంచవాద్యం అనే మరో సంగీతప్రదర్శనలో 100వరకూ మేళగాళ్ళు 5 వాయిద్యాలను వాడుతారు. అయితే, దేశమంతటిలాగానే, ఇటీవలికాలంలో సినిమా సంగీతం అత్యంత జనాదరణ పొందిన సంగీతం.

కేరళ చిత్రకళలలో సాంప్రదాయిక కుడ్యచిత్రాలనుండి రాజా రవివర్మ చిత్రాలవరకు ఎంతో వైవిధ్యముంది. రవివర్మ అత్యంత ప్రసిద్ధి గాంచిన చిత్రకారుడు.

కేరళకు ప్రత్యేకంగా మళయాళం కేలెండర్ ఉంది. దీనితో రైతులు తమ వ్యవసాయపనులు ప్లాన్ చేసుకొంటారు. మతసంబంధమైన (తిథి వగైరా)విషయాలు, పండుగలు ఈ కేలెండరు ఆధారంగా నిర్ణయిస్తారు. కేరళలో భోజనాన్ని సద్య అంటారు. అరటి ఆకులలో వడ్డించడం సంప్రదాయం. ఇడ్లి, పాయసం, పులిషెర్రి, పుట్టుకడల, పుళుక్కు, రసం, సాంబారు - ఇవి సాధారణమైన భోజన పదార్ధాలు.

కేరళలో పురుషులు, స్రీలు కూడా సంప్రదాయకంగా కుట్టని, పొడవాటి దుస్తులు కట్టుకోవడం పరిపాటి. మగవారు ధరించే ముండు (పంచె), ఆడువారు ధరించే చీర సాధారణ దుస్తులు. ఇప్పుడు మగవారు పాశ్చాత్య విధానంలో దుస్తులు (ప్యాంటు, షర్టు) ధరించడం సర్వసాధారణం.




#Article 223: జార్ఖండ్ (653 words)


జార్ఖండ్ లేదా ఝార్ఖండ్ (Jharkhand), భారతదేశంలో ఒక రాష్ట్రం. దీనికి ఉత్తరాన బీహార్, పశ్చిమాన ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తూర్పున పశ్చిమ బెంగాల్, దక్షిణాన ఒడిషా రాష్ట్రాలున్నాయి. ఝార్ఖండ్ రాష్ట్రానికి రాజధాని పారిశ్రామికనగరమైన రాంచి. ఇంకా ముఖ్యనగరాలైన జంషెడ్‌పూర్, బొకారో, ధన్‌బాద్ ‌కూడా భారీగా పరిశ్రమలున్న నగరాలు.

దట్టమైన అడవులు ఎక్కువగా ఉన్నందున జార్ఖండ్‌ను వనాంచల్ అనికూడా అంటారు. అడవులే కాదు. అపారమైన ఖనిజసంపద కూడా ఝార్ఖండ్ రాష్ట్రపు ప్రత్యేకత. భారత రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్ కలామ్ తను రచించిన Ignited Mindsఅనే పుస్తకంలో  వినియోగానికి వేచియున్న ఖనిజాల నిలయం అని చాలాసార్లు జార్ఖ్షండ్‌ను ప్రస్తావించాడు.

బీహారు దక్షిణ ప్రాంతాన్ని వేరుచేసి ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్యమం 1900 దశకం ఆదిలోనే మొదలయ్యింది. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న జైపాల్ సింగ్ అనే హాకీ ఆటగాడు (1928లో ఒలింపిక్ జట్టుకు కెప్టెన్, స్వర్ణపతక విజేత కూడాను) ఈ నినాదానికి ఆద్యుడని చెప్పవచ్చును. తరువాత ఏదో ఒక రూపంలో ఈ ఉద్యమం కొనసాగుతూ వస్తున్నది. 2000 ఆగస్టు 2న భారత పార్లమెంటులో బీహారు పునర్వవస్థీకరణ బిల్లు (Bihar Reorganization Bill) ఆమోదించబడింది. జార్ఖండ్ రాష్ట్రం ఆవిర్భవించింది. దక్షిణ బీహారులో 18 జిల్లాలను వేరుచేసి 2000 నవంబరు 15న జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పరచారు. ఇది భారతదేశంలో 28వ రాష్ట్రం.

కాని సాంస్కృతికంగా, భౌగోళికంగా, కొంత రాజకీయంగా జార్ఖండ్ ప్రత్యేకత చాలా పురాతనమైనది. మగధ సామ్రాజ్యంకాలం నుంచీ ఉంది. 13వ శతాబ్దంలో ఒడిషాకు చెందిన రాజా జైసింగ్ తనను జార్ఖండ్ రాజుగా ప్రకటించుకొన్నాడు. ముఘల్ సామ్రాజ్యంకాలంలో జార్ఖండ్‌ను కుకరప్రాంతమనేవారు. బ్రిటిష్ పాలన సమయంలో ఎత్తుపల్లాల కొండలు, అడవులు, దిబ్బలతో నిండినందున ఝార్ఖండ్ అనే పేరు ఈ ప్రాంతానికి పరిపాటి అయ్యింది. (ఝరీ - అంటే పొద). చోటానాగపూర్ పీఠభూమి, సంథాల్ పరగణాలలో విస్తరించి 
ఉన్న ఈరాష్ట్రం దట్టమైన అడవులు, చిట్టడవులు, ఎత్తుపల్లాల కొండలు, గుట్టలు, సెలయేర్లు, జలపాతాలు, నదులు, ఊటలతో కనులకింపైన భూభాగము.

బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ దౌర్జన్యాలతో వేసారిన ఝార్ఖండ్ ఆదివాసుల తిరుగుబాటు 1857నాటి మొదటి స్వాతంత్ర్య సంగ్రామంకంటే నూరేళ్ల ముందే ప్రారంభమైనది.

రాష్ట్రంలో అధికభాగం ఛోటానాగపూరు పీఠభూమిలో ఉంది. 
కోయల్, దామోదర్, బ్రహ్మణి, ఖర్కాయ్, సువర్ణ రేఖ వంటి నదులకు ఇది జన్మస్థానం. రాష్ట్రంలో చాలా భాగం అటవీమయం. పులులు, ఏనుగులకు కొన్ని చోట్లు ఆవాసం.

ఎక్కువగా రాళ్ళు అరిగినందువల్ల ఏర్పడిన నేల. రాష్ట్రంలో ఉన్న నేలల రకాలు:

జార్ఖండ్‌లో వైవిధ్యంగల వృక్ష సంపద, జంతుసంపద పుష్కలంగా ఉంది. చాలా జాతీయోద్యానవనాలు, జంతు ప్రదర్శన శాలలు ఉన్నాయి.

	

జార్ఖండ్ జనాభా 2కోట్ల 69 లక్షలు. మగవారు 1కోటి 39 లక్షలు. ఆడువారు 1కోటి 30 లక్షలు. (ఆడ:మగ నిష్పత్తి 941:1000) జనాభాలో 28% ఆదివాసీలు, 12% షెడ్యూల్డ్ కులాలవారు. 60% ఇతరులు. ప్రతి చదరపు కి.మీ.కు 274మంది జనాభా. (గుమ్లా జిల్లా జన సాంద్రత 148, ధన్‌బాద్ జిల్లా జనసాంద్రత: 1167)

ఎంతోకాలం నుండి చాలామంది ఆదివాసులకు జార్ఖండ్ ఆవాసంగా ఉంటూ వచ్చింది. కొన్ని జిల్లాలలో ఆదివాసుల జనాభా మెజారిటీగా ఉంది. మొత్తం జార్ఖండ్‌లో 32 ప్రధాన ఆదివాసి తెగలున్నాయి. అవి
అసుర్, బైగా, బంజారా, బతుడీ, బెడియా, బింఝియా, బిర్‌హోర్, బిర్జియా, చెరో, చిక్-బరైక్, గోడ్, గొరైత్, హో, కర్మాలి, ఖర్వార్, ఖోండ్, కిసన్, కొరా, కోర్వా, లోహ్రా, మహిలి, మల్-పహారియా, ముండా, ఒరావొన్, పర్హైయా, సంతల్, సౌరియా-పహారియా, సవర్, భుమిజ్, కోల్, కన్వర్ తెగలు.

ఇంకా ఇక్కడి ఖనిజ సంపదల వల్లా, భారీ పరిశ్రమల వల్లా లభించే అవకాశాల కారణంగా చాలామంది బీహారు, బెంగాలు వగటి పొరుగు రాష్ట్రాలవారు (ఇంతకు ముందు బీహారు పొరుగు రాష్ట్రం కాదు. జార్ఖండ్ బీహారులో భాగం) ఇక్కడ. ముఖ్యంగా ధన్‌బాద్, జంషెడ్‌పూర్, రాంచీ వంటి పారిశ్రామిక నగరాలలో - స్థిరపడ్డారు.

హిందూ మతం, ఇస్లాం, క్రైస్తవం - ఇవి జార్ఖండ్‌లో ప్రధానమైన మతాలు.

పేద ప్రజలున్న ధనికరాష్ట్రమని జార్ఖండ్‌ను వర్ణింపవచ్చును. ఎన్నో భారీ పరిశ్రమలు ఇక్కడి జంషెడ్‌పూర్, ధన్‌బాద్, బొకారోలలో ఉన్నాయి.

కాని చాలా వెనుకబడిన పల్లెలు, పట్టణాలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. పట్టణ జనాభా 22.5%. సగటు తలసరి వార్షిక ఆదాయం $90 మాత్రమే

జార్ఖండ్ రాష్ట్రం ఖనిజసంపదకు పెట్టింది పేరు.

జార్ఖండ్ పాలనా వ్యవస్థ దేశంలో అన్ని రాష్ట్రాలవలెనే ఉంటుంది.

జార్ఖండ్ ముఖ్యమంత్రులు

జార్ఖండ్‌ మొదట బీహారు రాష్ట్రంనుండి వేరుచేసి 18 జిల్లాలతో ఏర్పరచారు. తరువాత జిల్లాలను పునర్వ్యవస్థకరించి, మరో 4 జిల్లాలను ఏర్పరచారు. లాతెహార్, సరైకెలా ఖరస్వాన్, జమ్‌తారా, సాహెబ్‌గంజ్ అనేవి ఆ క్రొత్త జిల్లాలు. ఇప్పుడు మొత్తం 22 జిల్లాలున్నాయి.

ముందుగా ఉన్న18 జిల్లాల గణాంకాలు క్రింద ఇవ్వబడ్డాయి.

మూడు ప్రధాన భాషా కుటుంబాలకు చెందిన భాషలు, యాసలు జార్ఖండ్‌లో మాట్లాడుతారు.

ఆరోగ్యం

ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంవల్ల 1918లోనే రాంచిలో ప్రత్యేక మానసిక అవసరాలున్నవారికోసం మానసిక వైద్యసదుపాయ కేంద్రాన్ని నిర్మించారు (for treatment of mentally challenged) – కేంద్రీయ మానసిక వైద్య సంస్థ 

కొన్ని ప్రాంతాలలో పేదరికం, ఆహారలోపం వల్ల క్షయ వ్యాధి ప్రబలంగా ఉంది. రామకృష్ణామఠం వంటి సేవా సంస్థలు 1948నుండి అటువంటి వారికి కొన్ని వైద్య సదుపాయాలు నిర్వహిస్తున్నాయి.. కాన్సర్ వ్యాధి గ్రస్తులకోసం జంషెడ్‌పూర్‌లో టాటా మెమోరియల్ హాస్పిటల్ ఉత్తమసేవలను అందిస్తున్నది. 

అయినా వైద్య సదుపాయాలు ఇంకా మెరుగుపరచవలసిన అవసరం చాలా ఉంది.

విద్య

జార్ఖండ్‌లో అక్షరాస్యత 54.13% (2001) . ఆడువారిలో అయితే 39.38% మాత్రమే. విద్యా సదుపాయాలు ఒకోచోట బాగాను, చాలాచోట్ల అధమంగానూ ఉన్నాయి. కొన్ని క్రైస్తవ సంస్థలు మారుమూల ప్రాంతాలలో విద్యా సంస్థలను నిర్వహిస్తున్నాయి.

జార్ఖండ్‌లో 5 విశ్వ విద్యాలయాలున్నాయి

ఇతర ముఖ్యమైన విద్యా సంస్థలు

కాని చాలా మంది విద్యార్థులు ఉన్నత విద్యలకోసం ఇతరరాష్ట్రాలకు వెళ్ళవలసి వస్తున్నది.

రాష్ట్ర రాజధాని రాంచీ నుండి వెలువడే హిందీ పత్రికలు రాంచీ ఎక్స్‌ప్రెస్, ప్రభాత్ ఖబర్ ముఖ్యమైన వార్తా పత్రికలు. పెద్ద నగరాలలో దేశంనలుమూలలనుండి ప్రధానమైన పత్రికలు - ముఖ్యంగా హిందీ, ఇంగ్లీషు, బెంగాలీ భాషలవి- లభిస్తాయి. దేశంలో అన్ని ప్రాంతాలవలెనే రేడియో, టెలివిజన్, టెలిఫోన్ సౌకర్యాలున్నాయి.

జార్ఖండ్ రాష్ట్రములో హాకీ, క్రికెట్, ఫుట్‌బాల్ క్రీడలకు ఆదరణ ఉంది. భారత హాకీ జట్టుకు నాయకత్వం వహించిన ప్రముఖ హాకీ క్రీడాకారుడు జైపాల్ సింగ్, ప్రస్తుతం హాకీ జట్టు సభ్యుడు విమల్ లక్రా, ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు మహేంద్రసింగ్ ధోని ఈ రాష్ట్రం వారే.




#Article 224: మహారాష్ట్ర (1432 words)


మహారాష్ట్ర (Maharashtra), (మరాఠీ: महाराष्ट्र ) భారతదేశంలో వైశాల్యపరంగా మూడవ పెద్దరాష్ట్రం, జనాభా పరంగా రెండవ పెద్ద రాష్ట్రం (ఉత్తరప్రదేశ్ తరువాతి స్థానం). మహారాష్ట్రకు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్నాటక, గోవా రాష్ట్రాలతోనూ, కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా-నగరుహవేలి తోనూ సరిహద్దులున్నాయి. పశ్చిమాన అరేబియా సముద్రం ఉంది. ముంబయి నగరం మహారాష్ట్ర రాజధాని, అతిపెద్ద నగరం.

మహారాష్ట్ర ప్రాంతము ఋగ్వేదంలో రాష్ట్రఅనీ, అశోకుని శాసనాలలో రాష్ట్రీకము అనీ, అతరువాత హువాన్‌త్సాంగ్ వంటి యాత్రికుల రచనలలో మహారాష్ట్ర అనీ ప్రస్తావింపబడింది. మహారాష్ట్రి అనే ప్రాకృత పదం నుండి ఈ పేరు రూపాంతరం చెంది ఉండవచ్చునని భావిస్తున్నారు.

ఈ విషయమై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మహాకాంతార (అంటే పెద్ద అడవులు) అన్నపదం నుండి మహారాష్ట్ర పదం పుట్టిందని అంటారు.
.
అయితే ఈ విశ్లేక్షణలకు బలమైన ఆధారాలు లేవు.
 

మహారాష్ట్ర గురించి క్రీ.పూ. 3వ శతాబ్దం నుండే లిఖితపూర్వకమైన ఆధారాలు లభించాయి. అప్పుడు మహారాష్ట్రి అనే భాషగురించి ప్రస్తావన జరిగింది. ఒకప్పుడు ఈ ప్రాంతం దండకారణ్యం అనబడింది. తరువాత అశోకుడు పాలించిన మగధ సామ్రాజ్యంలో మహారాష్ట్ర ఒక భాగమైంది. ఇప్పటి ముంబాయి నగరానికి ఉత్తరాన ఉన్న సోపార రేవు పట్టణంనుండి కొచ్చి (భారతదేశం) తోను, తూర్పు ఆఫ్రికా, మెసపొటేమియా లతోను వర్తక సంబంధాలుండేవి.

మౌర్యసామ్రాజ్యం పతనానంతరం క్రీ.పూ. 230 - క్రీ.శ.225 మధ్య మహారాష్ట్ర ప్రాంతం శాతవాహనసామ్రాజ్యంలో భాగమయ్యింది. ఈ కాలంలో ఇక్కడి సంస్కృతి, మరాఠీ భాష బాగా వృద్దిచెందాయి. క్రీ.శ. 78 ప్రాంతంలో పాలించిన గౌతమీపుత్ర శాతకర్ణి పేరు మీద శాలివాహన శకం ఆరంభమయ్యింది. క్రీ.శ. 3వ శతాబ్ది సమయంలో శాతవాహన సామ్రాజ్యం క్రమంగా క్షీణించింది.

క్రీ.శ. 250-525లో వాకాటకులు విదర్భ ప్రాంతాన్ని పాలించారు. వారి కాలంలో కళలు, సాంకేతిక పరిజ్ఞానము, నాగరికత బాగా వృద్ధిచెందాయి. 6వ శతాబ్దానికల్లా మహారాష్ట్ర ప్రాంతమును బాదామి చాళుక్యులు పాలించారు. 753వ సంవత్సరంలో రాష్ట్రకూటులు మహారాష్ట్రపాలకులయ్యారు. వారి సామ్రాజ్యం దాదాపు దక్కన్ అంతా విస్తరించింది. మరలా రాష్ట్రకూటులను ఓడించి బాదామి చాళుక్యులు 973-1189మధ్య మహారాష్ట్రలో కొంతభాగాన్ని పాలించారు. 1189 తరువాత దేవగిరి యాదవులు ఇక్కడి రాజులయ్యారు.
 
క్రీ.శ.13వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానులు మహారాష్ట్రలో అధికారం చేజిక్కించుకొన్నారు. మొదట అల్లాఉద్దీన్ ఖిల్జీ, ఆతరువాత ముహమ్మద్ బిన్ తుఘ్లక్ దక్కన్‌లో తమ అధికారాన్ని నెలకొలిపారు. 1347లో తుఘ్లక్‌ల రాజ్యం పతనమయినాక బీజాపూర్‌కు చెందిన బహమనీ సుల్తానులు తరువాత 150 సంవత్సరాలు ఇక్కడ రాజ్యం నెరపారు. 16వ శతాబ్దంనాటికి మహారాష్ట్ర మధ్యప్రాంతం ముఘల్ సామ్రాజ్యానికి అధీనులైన చిన్న చిన్న ముస్లిమ్‌రాజుల అధీనంలో ఉండేది. తీరప్రాంతంలో పోర్చుగీసువారు అధికారం చేజిక్కించుకొని, సుగంధ ద్రవ్యాల వర్తకం పై గుత్తాధిపత్యాన్ని సాధించే ప్రయత్నంలో ఉన్నారు.

శంభాజీ కొడుకు షాహు భోన్సలే అసలైన వారసునిగా, పినతల్లి తారాబాయితో కొంత ఘర్షణను ఎదుర్కొని, తన మంత్రి (పేష్వా)బాలాజీ విశ్వనాధ్ సహాయంతో సింహాసనం చేజిక్కించుకొన్నాడు. తరువాత 4దశాబ్దాలు భోన్సలేలు నామమాత్రంగా అధికారంలో ఉన్నారు పేష్వాలు నిజమైన అధికారాన్ని నెరపారు. ముఘల్‌లను ఓడించిన పేష్వాల అధికారం ఉత్తరాన పానిపట్ ‌నుండి దక్షిణాన తంజావూరు వరకు, గుజరాత్‌ లోని మెహసనా నుండి మధ్యప్రదేశ్‌ ‌లోని గ్వాలియర్, ఇండోర్‌ల వరకు విస్తరించింది.

బాలాజీ విశ్వనాధ్, అతని కొడుకు బాజీరావు పేష్వా‌లు వారిపాలనలో ఉన్న ప్రాంతంలో రెవిన్యూ విధానాన్ని, పరిపాలనా విధానాన్ని క్రమబద్ధీకరించారు. ఇందుకు వారు ముఘల్ చక్రవర్తుల విధానాలను తమ స్వంత విధానాలతో జోడించారు. పేష్వాల కాలంలో వర్తకం, బ్యాంకింగ్ వ్యవస్థలు పటిష్ఠంగా అభివృద్ధిచెందాయి. వ్యవసాయం మరిన్ని ప్రాంతాలకు విస్తరించింది. పేష్వాలు పశ్చిమతీరంలో నౌకాభద్రతను అభివృద్ధిచేయసాగారు. అందుకై కొలాబాలో నౌకాదళాన్ని ఏర్పాటు చేశారు. నౌకాబలంమీద, సముద్ర వర్తకంమీద ఆధారపడిన పాశ్చాత్యదేశాల స్థావరాల అధిపత్యానికి ఇది కలవరపాటు కలిగించింది.

అదేసమయంలో మరాఠా ప్రాంతాలుకాని చోట్ల అధిపత్యం సామంతులకు కట్టబెట్టారు. అలా గ్వాలియర్‌లో సింథియాలు, ఇండోర్‌లో హోల్కర్‌లు, బరోడాలో గైక్వాడ్‌లు, ధార్‌లో పవార్‌లు స్థానిక రాజులయ్యారు.

భారత రాజకీయాల్లోకి బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ రావడంతో వారికి, మరాఠాలకు పోరులు మొదలయ్యాయి. 1777-1818 మధ్య మూడు ఆంగ్ల-మరాఠా యుద్ధాలు జరిగాయి. తత్ఫలితంగా 1819నాటికి మహారాష్ట్రలో పేష్వాల పాలనలో ఉన్న భూభాగం ఆంగ్లేయుల పరమైంది. మరాఠా సామ్రాజ్యం అంతమైంది.
బ్రిటిష్‌వారు ఈ ప్రాంతాన్ని బొంబాయి ప్రెసిడెన్సీలో భాగంగా పాలించారు. అది ప్రస్తుత పాకిస్తాన్లోని కరాచీనుండి ఉత్తర దక్కన్ వరకు విస్తరించి ఉండేది. చాలా మరాఠా రాజ్యాలు మాత్రం బ్రిటిష్ సామంతరాజ్యాలుగా మిగిలి ఉన్నాయి. వాటిలో నాగపూర్, సతారా, కొల్హాపూర్‌లు ముఖ్యమైనవి. 1848లో సతారా, 1853లో నాగపూర్, 1903లో బేరార్‌లు బ్రిటిష్ రాజ్యంలో కలిపివేయబడ్డాయి. మరాఠ్వాడా ప్రాంతం హైదరాబాద్ నిజాం రాష్ట్రంలో భాగంగా ఉండేది.

బ్రిటిష్ కాలంలో సంఘ సంస్కరణలు ఊపందుకొన్నాయి. మౌలిక సదుపాయాలు కొంత మెరుగు పడినాయి. క్రమంగా తిరుగుబాటులు మొదలయ్యఅయి. 20వ శతాబ్దం ఆరంభంలో బాల గంగాధర తిలక్ నాయకత్వంలో భారత స్వాతంత్ర్య పోరాటం వ్రేళ్ళూనుకొంది. తరువాత మహాత్మా గాంధీ నాయకత్వంలో ఇది 
అహింసాయుత పోరాటంగా విస్తరించింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ఆరంభమైంది.

మహారాష్ట్ర వైశాల్యం 308,000 చ.కి.మీ. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల తరువాత ఇది పెద్ద రాష్ట్రం.

తీర ప్రాంతానికి సమాంతరంగా ఉన్న పడమటి కనుమలు సగటు ఎత్తు 1,200 మీటర్లు. వాటికి పశ్చిమాన కొంకణ్ తీరభూమి మైదానం ఉంది. పడమటి కనుమలకు తూర్పున దక్కన్ పీఠభూమి ఉంది. తమ్హిని ఘాట్, వరంధ ఘాట్, సవంత్‌వాడి ఘాట్ - ఇవి పడమటి కనుమలలో విభాగాల పేర్లు. పడమటి కనుమలు భారతదేశంలో మూడు watershed ప్రాంతాలలో ఒకటి. దక్షిణభారతదేశపు ముఖ్యమైన నదులు చాలా పడమటికనుమలలో పుడుతున్నాయి. వాటిలో ముఖ్యమైనవి గోదావరి, కృష్ణ - ఇవి తూర్పువైపుకు ప్రవహించి బంగాళా ఖాతంలో కలుస్తయి. మహారాష్ట్ర మధ్య, తూర్పు ప్రాంతాలకు ఇవి ప్రధాన నీటి వనరులు. ఇంకా పడమటి కనుమలలో చాలా చిన్న నదులు పడమటివైపుకు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయు.

మహారాష్ట్రకు ఉత్తరాన, మధ్యప్రదేశ్ సరిహద్దులలో సాత్పూరా పర్వతశ్రేణులున్నాయి.

నర్మద, తపతి నదులు మహారాష్ట్ర ఉత్తరభాగంలో నీటి వనరులు. ఇవి పడమటివైపు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయి. వైన గంగ వంటి నదులు దక్షిణదిశగా ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో అనేక బహుళార్ధ సాధక ప్రాజెక్టులున్నాయి.

దక్కన్ పీఠభూమిలో చాలాభాగం నల్లరేగడినేల. ప్రత్తి వ్యవసాయానికి అనుకూలమైనది.

మహారాష్ట్ర ప్రాంతంలోని జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు చాలా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు (wildlife sanctuaries), జాతీయ ఉద్యానవనాలు (national parks), ప్రాజెక్ట్ టైగర్ (Project Tiger)ఏర్పాటు చేయ బడ్డాయి. 2004 మే నాటికి మొత్తం దేశంలో 92 జాతీయ ఉద్యానవనాలుండగా వాటిలో 5 మహారాష్ట్రలో ఉన్నాయి. మహారాష్ట్రలో ఎక్కువ అటవీ ప్రాంతం విదర్భలో ఉంది. అక్కడ ఉన్న జాతీయ ఉద్యానవనాలు

ఇవికాక మహారాష్ట్రలో 35 వన్యప్రాణి అభయారణ్యాలున్నాయి.  వాటిలో నాగ్‌జిరా (భంద్రా జిల్లా), ఫన్సాద్, కొన్యా అభయారణ్యాలు ముఖ్యమైనవి.

మహారాష్ట్ర స్థూల రాష్ట్రోత్పత్తి వివరాలు (మార్కెట్ ధరల ఆధారంగా, కోట్ల రూపాయలలో) క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి. .

మహారాష్ట్ర ప్రభుత్వపు పన్ను ఆదాయం (కేంద్రం నుండి వచ్చే వాటాను మినహాయించి) క్రింద చూపబడ్డాయి.

పన్నుల ద్వారా కాకుండా, కేంద్రం నుండి వచ్చే వాటఅను మినహాయించి, వచ్చే ఆదాయ వివరాలు

మొత్తం దేశంలో పారిశ్రామిక ఉత్పత్తులలో 13% మహారాష్ట్రనుంచే వస్తున్నాయి. రాష్ట్రంలో 64% ప్రజలు వ్యవసాయ, సంబంధిత వృత్తులపై ఆధారపడి ఉన్నారు. కాని స్థూల రాష్ట్రాదాయంలో 46% పరిశ్రమలనుండే వస్తున్నది.
 
దేశంలో మొదటి 500 వ్యాపార సంస్థలలో 41% పైగా సంస్థలు (Over 41% of the SP CNX 500 conglomerates) వాటి ప్రధాన కార్యాలయాలను మహారాష్ట్రలో కలిగి ఉన్నాయి.

మహారాష్ట్రలో ముఖ్యమైన పరిశ్రమలు:

మహారాష్ట్రలో ముఖ్యమైన వ్యవసాయోత్పత్తులు

మొత్తం రాష్ట్రంలో నీటివనరులున్న భూమి 33,500 చ.కి.మీ.
 

భారతదేశానికి ఆర్థిక రాజధాని, సినిమా రాజధాని ముంబాయి నగరమేనని అంటారు.
దాదాపు అన్ని పెద్ద బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా సంస్థలు, వాణిజ్య సంస్థల ప్రధాన కార్యాలయాలు ముంబాయ నగరంలో ఉన్నాయి. ముంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ దేశంలో షేర్ మార్కెట్ లావాదేవీల కేంద్రం. ఇది ఆసియాలో అత్యంత పురాతనమైనది.

ముంబాయిలో సినిమా పరిశ్రమను బాలీవుడ్ అని చమత్కరిస్తుంటారు. (అమెరికాలోని హాలీవుడ్ను పురస్కరించికొని). హిందీ సినిమాలకు, టెలివిజన్ పరిశ్రమకు ఇది ప్రధాన కేంద్రం. 
 
ఇటీవల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ ఊపందుకొంటున్నది. పూణే, నాగపూర్, ముంబాయి, నాసిక్ లలో సాఫ్ట్‌వేర్ పార్కులు నెలకొలుపబడ్డాయి.

బొగ్గు ఆధారంగా ఉత్పత్తి చేసే విద్యుత్తు (దేశంలో 13%), అణు విద్యుత్తు (దేశంలో 17%) - ఈ రెండింటిలోనూ మహారాష్ట్రదే దేశంలో అగ్రస్థానం.

ఇటీవల జత్రోపా వ్యవసాయం మహారాష్ట్రలో విస్తరిస్తున్నది.

రాలెగావ్ సిద్ధి అనే వూరు అహమ్మద్ నగర్ జిల్లాలో ఉంది. పర్యావరణ సంరక్షణ ఈ వూరు ఒక ఆదర్శప్రాయంగా ఉంది.

మహారాష్ట్ర పాలనా వ్యవస్థ అన్ని రాష్ట్రాలవలెనే ఉంటుంది. రాజధాని ముంబాయి నగరం. ప్రధాన న్యాయ స్థానం బొంబాయి హైకోర్టు మహారాష్ట్రకు, గోవాకు, డామన్-డయ్యుకు కూడా హైకోర్టుగా వ్యవహరిస్తుంది.

శాసన సభ బడ్జెట్, వర్షాకాలపు సమావేశాలు ముంబాయిలోను, శీతాకాలపు సమావేశాలు నాగపూర్‌లోను జరుగుతాయి. నాగపూర్‌ నగరం రాష్ట్రానికి ద్వితీయ రాజధాని అని వ్యవహరిస్తారు.

మహారాష్ట్ర శాసనసభలో విధాన సభ (అసెంబ్లీ), విధాన పరిషత్ (కౌన్సిల్) అనే రెండు సభలున్నాయి. మహాహారాష్ట్రకు లోక్‌సభలో 48 స్థానాలు, రాజ్యసభలో 19 స్థానాలు ఉన్నాయి.

స్వాతంత్ర్యం తరువాత మహారాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన పాత్రను చేజిక్కించుకొంటూ వచ్చింది. 1995వరకూ వారికి బలమైన ప్రత్యర్థులు లేరు. ఈ కాలంలో వై.బి.చవాన్ ప్రముఖ కాంగ్రెసు నాయకుడు. 1995లో బాల్ థాకరే అధ్వర్యంలోని శివసేన, భారతీయ జనతా పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తరువాత శరద్ పవార్ ప్రారంభించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మరొక ప్రధాన రాజకీయ శక్తిగా అవతరించింది. 2004 ఎన్నికలలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ ల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

మహారాష్ట్ర స్థానికులను మహారాష్ట్రియన్ అంటారు. 2001 జనాభా లెక్కల ప్రకారం మహారాష్ట్ర జనాభా 96,752,247. ఇందులో మరాఠీ మాతృభాషగా ఉన్నవారు 62,481,681. రాష్ట్రం జనసాంద్రత చ.కి.మీ.కు 322.5. రాష్ట్రజనాభాలో పురుషులు 5.03 కోట్లు, స్త్రీలు 4.64 కోట్లు. ఆడ, మగ నిష్పత్తి 922/1000. పట్టణ జనాభా 42.4 %. అక్షరాస్యులు 77.27%. స్రీలలో అక్షరాస్యత 67.5%, పురుషులలో 86.2%. 1991-2001 మధ్య జనాభా వృద్ధిరేటు 22.57%.

అధికార భాష మరాఠీ. పెద్ద నగరమైన ముంబాయిలో మరాఠీతో బాటు హిందీ, గుజరాతీ, ఇంగ్లీషు భాషలు విస్తారంగా మాట్లాడుతారు. రాష్ట్ర వాయువ్యప్రాంతంలో అహిరాణి అనే మాండలికం కొద్దిమంది మాట్లాడుతారు. దక్షిణ కొంకణ ప్రాంతంలో మాల్వాణి అని పిలువబడే కొంకణి భాషమాండలికం మాట్లాడుతారు. దీనిని మరాఠీ భాష మాండలికం అనికూడా అనవచ్చు. దక్కన్ అంతర్భాగంలో దేశ భాషి అనబడే మరాఠీ మాండలికం మాట్లాడుతారు. విదర్భ ప్రాంతంలో వర్హాదిఅనబడే మరాఠీ మాండలికం మాట్లాడుతారు.

మతపరంగా హిందువులు 80.2%, ముస్లిములు10.6%, బౌద్ధులు 6%, జైనులు 1.3%, క్రైస్తవులు 1% ఉన్నారు. భారతదేశంలో అత్యధిక జైన, జోరాస్ట్రియన్ (పార్సీ), యూదు జనాభా మహారాష్ట్రలోనే ఉన్నారు.

మహారాష్ట్రలోని 35 జిల్లాలని 6 విభాగాలు (డివిజన్లు)గా విభజిస్తారు.

భౌగోళికంగానూ, చారిత్రికంగానూ, రాజకీయ భావాలను బట్టీ మహారాష్ట్రలో 5 ముఖ్యప్రాంతాలను గుర్తింపవచ్చును.

మహారాష్ట్రలో అధికభాగంలో భారతీయ రైల్వే వారి రవాణా సదుపాయం విస్తరించి ఉంది. రైలు ప్రయాణం బాగా సామాన్యం. ముంబాయి కేంద్రంగా సెంట్రల్ రైల్వే ఎక్కువ భాగంలో ఉండగా, దక్షిణతీర ప్రాంతంలో కొకంణ్ రైల్వే ఉంది. మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ (MSRTC) వారి బస్సు రవాణా దాదాపు అన్ని పట్టణాలకు, గ్రామాలకు విస్తరించి ఉంది. ఇంకా ప్రైవేటు రవాణా వ్యవస్థ కూడా దూరప్రయాణాలకు వాడుతుంటారు.

ముంబాయిలో పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. పూణే, నాగపూర్‌ల‌లో కూడా చిన్న అంతర్జాతీయ విమానాశ్రయాలున్నాయి.
రత్నగిరి, కొల్హాపూర్, నాశిక్‌లలో విమానాశ్రయాలున్నాయి. ఫెర్రీ సర్వీసులు తీర ప్రాంత పట్టణాల మధ్య ప్రయాణ సౌకర్యాన్ని కలుగజేస్తున్నాయి. ఇటీవల అంతర్జాతీయ ప్రమాణాలతో, టోల్‌గేటు ద్వారా అనుమతి లభించే పూణె-బొంబాయి ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించారు.

ముంబాయి నగరంలో మూడు నౌకాశ్రయాలు ఉన్నాయి - ముంబాయి, నవసేన, రత్నగిరి.

మహారాష్ట్ర సంస్కృతి అన్ని మతాల, వర్గాల జీవనశైలికి కలయికగా రూపు దిద్దుకొంది. అత్యధిక సంఖ్యాక జనులు హిందువులైనందున మహారాష్ట్ర సంస్కృతిలో ఆ ప్రభావం కనిపిస్తుంది.

మహారాష్ట్రలో చాలా పురాతనమైన మందిరాలున్నాయి. ఇక్కడి మందిరాలలో ఉత్తర, దక్షిణ భారతాల నిర్మాణశైలుల కలయిక ప్రతిబింబిస్తుంది. ఇంకా హిందూ, బౌద్ధ, జైన సంప్రదాయాల మేళవింపు మందిరాల్లోనూ, ఆచారాల్లోనూ చూడవచ్చును. మహారాష్ట్రలోని మందిరాలలో పండరిపూర్‌లోని విఠలుని ఆలయం బాగా ప్రసిద్ధి చెందింది. అజంతా చిత్రాలు,ఎల్లోరాశిల్పాలు, ఔరంగాబాదు మసీదు ప్రసిద్ధ పర్యాటక స్థలాలు. ఇంకా రాయగఢ్, ప్రతాప్‌గఢ్, సింధుదుర్గ్ వంటి కోటలు కూడా చూడదగినవి.

గోంధల్, లవని, భరుద్, పొవడా వంటివి మహారాష్ట్ర జానపదసంగీత విధానాలు.

ధ్యానేశ్వరుడు రచించిన భావార్ధ దీపిక (ధ్యానేశ్వరి) మరాఠీ సాహిత్యంలో మొదటి రచనలలో ఒకటి. ధ్యానేశ్వరుడు, తుకారామ్, నామదేవ్ వంటి భక్తుల భజన, భక్తి గీతాలు జనప్రియమైనవి. ఆధునిక మరాఠీ రచయితలలో కొఒందరు ప్రముఖులు - పి.యల్.దేశ్‌పాండే, కుససుమగ్‌రాజ్, ప్రహ్లాద్ కేశవ్ ఆత్రే, వ్యాకంతేష్ మద్‌గుల్కర్.

నాటక రంగం, సినిమా పరిశ్రమ, టెలివిజన్ పరిశ్రమ - మూడూ బొంబాయి నగరంలో కేంద్రీకృతమైనాయి. నటీనటులు, సాంకేతికనిపుణులు, కళాకారులు ఈ మూడు రంగాలలో ఒకదానినుండి మరొకదానికి మారడం సర్వసాధారణం.

మహారాష్ట్ర వినోదరంగంలో కొందరు ప్రముఖులు:

మహారాష్ట్ర వంటకాలు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. కొకణతీరంలో వరిఅన్నం, చేపలు ప్రధాన ఆహారపదార్ధాలు. తూర్పు మహారాష్ట్రలో గోధుమ,జొన్న, సజ్జలతో చేసిన పదార్ధాలు ఎక్కువ తింటారు. పప్పులు, ఉల్లి, టొమాటో, బంగాళదుంప, అల్లం, వెల్లుల్లి వంటివి అన్నిచోట్లా వాడుతారు. కోడి, మేక మాంసాల వాడకం కూడా బాగా ఎక్కువ.

సాంప్రదాయికంగా ఆడువారు 9 అడుగుల చీర ధరిస్తారు. మగవారు ధోతీ, పైజమా ధరిస్తారు. ఇప్పుడు ఆడువారికి సల్వార్-కమీజ్, మగవారికి ప్యాంటు-షర్టు సాధారణ దుస్తులు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో.

భారతదేశమంతటిలాగానే క్రికెట్ అత్యంత జనప్రియమైన ఆట. 
గ్రామీణ ఆటలలో కబడ్డి, విట్టి-దండు, గిల్లి-దండా, పకడా-పకడీ ఆటలు సామాన్యం.

మహారాష్ట్రలో ముఖ్యమైన పండుగలు: గుడి-పాడ్వా, దీపావళి, రంగపంచమి, గోకులాష్టమి, వినాయక చవితి (గణేషోత్సవం) - గణేషోత్సవం పెద్ద ఎత్తున జరుపుతారు. ఈ ఊరేగింపులు దేశంలో అన్ని ప్రాంతాలకూ విస్తరించాయి. ఆషాఢమాసంలో పండరీపూర్‌కు వందలాది కిలోమీటర్లు పాదయాత్రలు చేయడం ఒక సంప్రదాయం.




#Article 225: పశ్చిమ బెంగాల్ (249 words)


పశ్చిమ బెంగాల్ (West Bengal, পশ্চিমবঙ্গ, Pôščim Bôngô) భారతదేశం తూర్పుభాగాన ఉన్న రాష్ట్రం. దీనికి పశ్చిమోత్తరాన నేపాల్, సిక్కిం ఉన్నాయి. ఉత్తరాన భూటాన్, ఈశాన్యాన అస్సాం, తూర్పున బంగ్లాదేశ్ ఉన్నాయి. దక్షిణాన బంగాళాఖాతం సముద్రమూ, వాయువ్యాన ఒడిషా, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలున్నాయి.

క్రీ.శ. 750 నుండి 1161 వరకు బెంగాల్ ను పాలవంశపు రాజులు పాలించారు. తరువాత 1095 నుండి 1260 వరకు సేనవంశపురాజుల పాలన సాగింది. 13వ శతాబ్దమునుండి మహమ్మదీయుల పాలన ఆరంభమైంది. అప్పటినుండి, ప్రధానంగా మొఘల్ సామ్రాజ్యం కాలంలో బెంగాల్ ప్రముఖమైన, సంపన్నకరమైన వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. 15వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ రూపంలో అడుగుపెట్టిన ఆంగ్లేయులు 18వ శతాబ్దంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అక్కడినుండి క్రమంగా బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశం అంతా విస్తరించింది. 

ఇక పశ్చిమ బెంగాల్ 1947 నుండి స్వతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్రమయ్యింది. ఫ్రెంచివారి పాలనలో ఉన్న చందానగర్ 1950లో భారతదేశంలో విలీనమైంది. 1955 అక్టోబరు 2 నుండి అది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక భాగమైనది.

పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి కొలకత్తా నగరం రాజధాని. ఇక్కడ బంగ్లా భాష ప్రధానమైన భాష.. 1977 నుండి ఈ రాష్ట్రంలో వామపక్ష పార్టీలు ఎన్నికలలో నిరంతరాయంగా గెలుస్తూ అధికారాన్ని నిలుపుకొంటూ వస్తున్నాయి.

పశ్చిమ బెంగాల్ లో 23 జిల్లాలు ఉన్నాయి.(2019) 

పశ్చిమ బెంగాల్ వాతావరణం ప్రధానంగా ఉష్ణమండలం వాతావరణం. భూభాగం ఎక్కువగా మైదానప్రాతం. ఉత్తరాన హిమాలయ పర్వతసానువుల్లోని డార్జిలింగ్ ప్రాంతం మంచి నాణ్యమైన తేయాకుకు ప్రసిద్ధము. దక్షిణాన గంగానది ముఖద్వారాన్న సుందర్ బన్స్ డెల్టా ప్రపంచంలోని అతిపెద్ద డెల్టా ప్రాంతము. ఇది పశ్చిమ బెంగాల్ లోను, బంగ్లాదేశ్ లోను విస్తరించి ఉంది. ప్రసిద్ధమైన బెంగాల్ టైగర్కు ఈ ప్రాంతంలోని అడవులు నివాస స్థానము.

భారతదేశపు సాంస్కృతికవేదికలో బెంగాల్ కు విశిష్టమైన స్థానం ఉంది. నేటి బెంగాల్ ఆలోచన. రేపటి భారత్ ఆలోచన అని ఒక నానుడి ఉంది. ఎందరో కవులకు, రచయితలకు, సంస్కర్తలకు, జాతీయవాదులకు, తాత్వికులకు బెంగాల్ పుట్టినిల్లు. వారిలో చాలామంది భారతదేశపు సాంస్కృతిక ప్రస్థానానికి మార్గదర్శకులైనారు.

పశ్చిమ బెంగాల్ లో బెంగాలీ ప్రధానమైన భాష. బీహారీలు కూడా రాష్ట్రమంతా నివసిస్తున్నారు. సిక్కిం సరిహద్దు ప్రాంతంలో షెర్పాలు, టిబెటన్ జాతివారు ముఖ్యమైన తెగ. డార్జిలింగ్ ప్రాతంలోని నేపాలీ భాష మాట్లాడేవారు ప్రత్యేకరాష్ట్రం కోసం చాలాకాలం ఉద్యమం సాగించారు. వారికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే స్వతంత్రప్రతిపత్తి ఇవ్వబడింది.




#Article 226: జమ్మూ కాశ్మీరు (915 words)


జమ్మూ కాశ్మీరు (Jammu and Kashmir), , కాశ్మీరీ:ज्वम त॒ कॅशीर, హిందీ:जम्मू और कश्मीर, ఉర్దూ:جموں و کشمیر) భారతదేశంలో ఉత్తరపుకొనన, హిమాలయ పర్వతసానువుల్లో ఒదిగిఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు. దీనికి ఉత్తరాన, తూర్పున చైనా, పశ్చిమాన పాకిస్తాన్ దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులున్నాయి. దక్షిణాన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రముంది.2019 వరకు లడఖ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఒక ప్రాంతంగా ఉండేది. 2019 ఆగష్టులో భారత పార్లమెంటు 2019 అక్టోబరు 31 నుండి లడఖ్ ను మరొక కేంద్ర పరిపాలనా ప్రాంతంగా ప్రకటించింది.జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో 20 జిల్లాల ఉన్నాయి. గతంలో  అంతర్భాగంగా ఉన్న లడఖ్‌ ప్రాంతాన్ని మరొక కేంద్రపాలిత ప్రాంతంగా  విభజించారు.లడఖ్‌ విభాగంలోకార్గిల్‌ జిల్లా, లేహ్నజిల్లా అనే రెండు జిల్లాలు ఉన్నాయి.ఇవి రెండు నగర పాలక సంస్థలు-2 

జమ్మూ కాశ్మీరు కేంద్రపాలిత ప్రాంతంలో రెండు విభాగాలున్నాయి. 

తరువాత 19వ శతాబ్దంలో రాజపుత్రులనుండి జమ్ముూ ప్రాంతం మహారాజా రంజిత్ సింగ్ పాలనలోకి వచ్చి, సిక్కు రాజ్యంలో భాగమయ్యింది. మళ్ళీ మహారాజా గులాబ్ సింగ్ నాయకత్వంలో ఇక్కడి అధికారాన్ని రాజపుత్రులు చేజిక్కించుకున్నారు. అతని కాలంలో కాశ్మీరు, లడక్, హుంజా, గిల్గిత్ ప్రాంతాలు కూడా జమ్ము రాజులవశమయ్యాయి. 1947లో మహారాజా హరిసింగ్ భారతదేశంలో విలీనం చేస్తూ ఇచ్చిన ఒప్పందంతో జమ్ము కాశ్మీరు స్వతంత్ర ప్రతిపత్తి కోల్పోయి భారతదేశంలో ఒక భాగమైంది.

భారత్, పాకిస్తాన్, చైనా దేశాలమధ్య కాశ్మీరువివాదం చాలా తీవ్రమైనది. భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన మూడు యుద్ధాలకు (1947, 1965, 1999 (కార్గిల్) కాశ్మీరు వివాదమే కారణం. జమ్ము-కాశ్మీరు సంపూర్ణ రాష్ట్రం భారతదేశపు అంతర్గత భూభాగమని భారతదేశం వాదన. కాని మొత్తం రాష్ట్రంలో సగభాగం మాత్రమే ఇప్పుడు భారతదేశం ఆధీనంలో ఉంది. కాశ్మీరు లోయలో కొంత భాగం పాకిస్తాన్ అధీనంలో ఉంది. ఆక్సాయ్‌చిన్ ప్రాంతం చైనా అధీనంలో ఉంది.

భారతదేశం అధీనంలో ఉన్న కాశ్మీరు భాగాన్ని భారతదేశం ఆక్రమించిన కాశ్మీరు అనీ, పాకిస్తాన్ అధీనంలో ఉన్న కాశ్మీరు భాగాన్ని స్వతంత్ర కాశ్మీరు అనీ పాకిస్తాన్ వ్యవహరిస్తుంది.
ఇక పాకిస్తాన్ అధీనంలోని కాశ్మీరు భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీరు అని భారతదేశం వ్యవహరిస్తుంది.

భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే భారత రాజ్యాంగంలోని 370వ ప్రకరణం ప్రకారం జమ్ము-కాశ్మీరు రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. కాశ్మీరులోని ఒక వర్గం మరింత ప్రత్యేక అధికారాలు కావాలని వాదిస్తారు. కాశ్మీరులోని ముఖ్యమైన రాజకీయ పార్టీలు - జమ్ము-కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, భారత జాతీయ కాంగ్రెస్, జమ్ము-కాశ్మీర్ పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ. చాలా కాలం కశ్మీర్ నాయకుడు షేక్ అబ్దుల్లా నాయకత్వంతో కాశ్మీర్ రాజకీయాలు ముడివడి ఉన్నాయి. అతని అనంతరం అతని కుమారుడు ఫరూక్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి నాయకుడు. ప్రస్తుతం (2006లో) భారత జాతీయ కాంగ్రెస్, జమ్ము-కాశ్మీర్ పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది.ఒమర్ అబ్దుల్లా  తరువాత జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రిగా పీపుల్స్ డెమెక్రటిక్ పార్టీ అధినేత ముఫ్తి మహమ్మద్ సయ్యిద్  బీజెపితో కలిసి సంకీర్ణ ప్రభుత్వం 2015 మార్చి 1 న బాధ్యతలు స్వీకరించారు. 2016 జనవరి 7 న ఆరోగ్యం విషమించడంతో మరణించారు.తరువాత ప్రభుత్వం ఏర్పడినంత వరకు గవర్నర్ పరిపాలనలో ఉంటుంది.

జమ్ము-కాశ్మీరు నైఋతి భాగంలో వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్య ప్రాంతంలో తేమతోకూడిన ఉష్ణ వాతావరణం ఉండగా, ఉత్తరభాగంలో వాతావరణం బాగా చల్లగా, తేమగా ఉంటుంది. కాశ్మీరు వాసుల జీవన విధానం అక్కడి భౌగీళిక, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మలచుకొన్నారు.

జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రపు స్థూల ఆదాయం ప్రగతి క్రింది పట్టికలో చూపబడింది. . (కోట్ల రూపాయలలో)

వ్యవసాయం, పశువుల పెంపకం జమ్ము-కాశ్మీరు ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలు. పరిశ్రమలు ప్రస్తుతం చాలా కొద్ది, కాని క్రమంగా, వేగంగా వృద్ధిపొందుతున్నాయి. 1989కు ముందు (సాయుధపోరాటం పెచ్చుపెరగకముందు) పర్యాటకరంగం జమ్ము-కాశ్మీరు ఆర్థిక వ్యవస్థలో కీలకమైనదిగా ఉండేది. తీవ్రవాదం వల్ల ఈ రంగం బాగా దెబ్బతిన్నది. అయినా జమ్ము, లడఖ్‌లు పర్యాటకులను ఇప్పటికీ బాగా ఆకర్షిస్తున్నాయి.

కాశ్మీర్ బుర్ర (విల్లో) అనే జాతి చెక్కనుండి తయారు చేసే క్రికెట్ బ్యాటులు మంచి నాణ్యమైనవని పేరు. ఇంకా కాశ్మీరు కుంకుమ పువ్వు కూడా ప్రసిద్ధం. ఇందులో ఎక్కువభాగం ఎగుమతి జరుగుతున్నది.

కాశ్మీరు జీవనవిధానంలో ప్రధాన లక్షణం, (మతంతో సంబంధంలేకుండా) శాంతి, నిదానం. వారి సహజీవన సంస్కృతివల్ల అన్ని మతాలు ఇరుగుపొరుగులో వర్ధిల్లాయి. ఉత్సవాలు, సంగీతం - ఇవి కాశ్మీరీలు అంతా కలసి పంచుకొనే సంప్రదాయాలు. ఆడ, మగల దుస్తులు రంగులమయం. కాశ్మీరు కవిత్వం, జానపదనృత్యాలు, హస్తకళలు బాగా వృద్ధి చెందాయి. వత్తల్ ప్రాంతంలో మగవారు చేసే దుమ్హల్ నృత్యం, ఆడువారు చేసే రోఫ్ నృత్యం బాగా పేరుపొందాయి.

'బుల్ బుల్ షా' అనే సూఫీసాధువు 'రించాన్' అనే బౌద్ధరాజును మహమ్మదీయ మతానికి మార్చడంతో కాశ్మీరులో ఇస్లాంమత ప్రభావం ఆరంభమైనదని చెప్పవచ్చును. కాశ్మీరులో ఇస్లాంమతాచరణలో సూఫీవిధానాలు బాగా ప్రబలంగా ఉన్నాయి. ఇది మిగిలిన దక్షీణ ఆసియాలోని ఇస్లాంమతాచారాలకంటె కాస్త భిన్నంగా కనిపిస్తుంది.

ఇంకా హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు కూడా రాష్ట్రంలో గణనీయంగా ఉన్నాయి. ఉత్తరప్రాంతంలో కొద్దిమంది యూదు మతస్తులు ఉన్నారు. వీరు సిల్క్‌ రోడ్డు ద్వారా ఇజ్రాయిలు నుండి వలసవచ్చిఉండవచ్చును.

కాశ్మీరేతరులకు కాశ్మీరులో భూమి కొనుక్కొనే అవకాశం చట్టరీత్యా లేదు. కనుక ఈ సుందరప్రాంతంలో ఉండగోరిన పరాయి ప్రాంతపువారు పడవటిళ్ళలో (House Boats) ఉండటం ప్రత్యామ్నాయవిధానంగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా బ్రిటిష్ వారికాలంలో సైనికులు ఈ పద్ధతిని అవలంబించారు. ఇది క్రమంగా కాశ్మీరు జీవనవిధానంలో ఒక అవినాభావ భాగమైంది. ఇప్పుడు చాలామంది కాశ్మీరీలు, కాశ్మీరేతరులు ఈ పడవటిళ్ళల్లో ఉంటారు.

జమ్ము-కాశ్మీరు మొత్తంలో సుమారు 70% ముస్లిములు. మిగిలినవారిలో బౌద్ధులు, హిందువులు, సిక్కులు ఉన్నారు. లడఖ్ ప్రాంతపు ప్రజలు ఇండో-టిబెటన్ జాతికి చెందినవారు. జమ్ము దక్షిణప్రాంతవాసులు తమ మూలాలు హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ వంటి ప్రాంతాలలో ఉన్నాయని చెప్పుకుంటారు.1941 వరకు కాశ్మీరు మొత్తం జనాభాలో 15%వరకు హిందువులు ఉండేవారు. 1947లో హిందువుల జనసంఖ్య 2,00,000-4,50,000 మధ్య అంచనా . 1990 తరువాత పెచ్చుపెరిగిన తీవ్రవాదం వల్ల, హిందువులపై దాడులవల్ల అధికభాగం హిందువులు కాశ్మీరుప్రాంతాన్ని వదలి వలసపోవలసి వచ్చింది. ఇప్పుడు (2006లో) మొత్తం హిందూజనాభా 5,000-15,000 మధ్య ఉంటుందని అంచనా..

జమ్ము-కాశ్మీరులో మొత్తం 20 జిల్లాలు ఉన్నాయి. వాటిని జమ్మూ విభాగం 10 జిల్లాలు, కాశ్మీరు విభాగంగా 10 జిల్లాలు ఉన్నాయి. 

జమ్మూ విభాగంలోని జిల్లాలు:కథువా , జమ్మూ, సంబా, ఉధంపూర్‌, రియాసీ, రాజౌరీ, పూంఛ్‌, దోడా, రంబాన్‌, కిష్త్‌వార్

కాశ్మీరు విభాగంలోని జిల్లాలు:అనంతనాగ్‌, కుల్గాం, పుల్వామా, షోపియన్ , బుద్గాం, గందర్బల్‌, బండిపోరా, బారాముల్లా, కుప్వారా, శ్రీనగర్‌,

కాశ్మీరును భూతల స్వర్గం అని అంటారు. 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ దాల్ సరస్సు పైన పడవటింట్లోంచి చూస్తూ అక్కడి సౌందర్యానికి ముగ్ధుడై భూమిమీద స్వర్గం ఎక్కడైనా ఉంటే అది ఇక్కడే, ఇక్కడే అన్నాడు. కాశ్మీరులో ముఘల్ ఉద్యానవనాలు అందరినీ విశేషంగా ఆకర్షిస్తాయి. ముఘల్‌ఉద్యానవనాలు, శ్రీనగర్, గుల్‌మార్గ్, పహల్‌గాఁవ్ - ఇవి కాశ్మీరులో ముఖ్యమైన పర్యాటక స్థలాలు.

భారతదేశంలో పర్యాటకులకు కాశ్మీరు అన్నింటికంటే ప్రధానగమ్యంగా ఉండేది. కాని ఇటీవల విజృంభించిన ఉగ్రవాద కార్యకలాపాలవల్లా, శాంతిభద్రతల సమస్యలవల్లా పర్యాటకులు బాగా తగ్గిపోయారు.

అప్పుడు కాశ్మీరు సంస్థానానికి సైనికబలం లేదు. శాంతిభద్రతలు క్షీణించి, అరాచకం ప్రబలుతున్న సమయంలో కాశ్మీరు రాజు భారతదేశం సహాయం అర్ధించాడు. తరువాత కాశ్మీరును భారతదేశంలో విలీనం చేయడానికి నిర్ణయించాడు. తత్ఫలితంగా నేషనల్ కాన్ఫరెన్సు నాయకుడు షేక్ అబ్దుల్లా కాశ్మీరు రాష్ట్రనాయకుడయ్యాడు.

అప్పటినుండి భారతదేశం, పాకిస్తాన్‌ల మధ్య వైరానికి కాశ్మీరు ప్రధానకారణం. ప్రపంచంరాజకీయాలలో అత్యంత ప్రమాదకరమైన యుద్ధానికి దారితీయగల ప్రమాదం ఉన్నవాటిలో ఇదిఒకటి. ఇందుమూలంగా 1948లోను, 1965లోను భారత్-పాకిస్తాన్‌లమధ్య యుద్ధాలు జరిగాయి. (1971లో జరిగిన యుద్ధం బంగ్లాదేశ్ కారణంగా జరిగింది). మరల 1999లో కార్గిల్ ప్రాంతంలో జరిగిన సంఘర్షణ పూర్తిస్థాయి యుద్ధానికి పోకుండా నిలువరించబడింది.

కానీ కాశ్మీరులో ఏ ప్రాంతాన్నైనా వివాదాస్పద ప్రాంతం అనిగాని, పాకిస్తాన్‌లో భాగం అనిగాని చూపే ప్రచురణను భారతప్రభుత్వం బహిష్కరిస్తుంది.

కాశ్మీర్ భారత్, పాకిస్థాన్‌లలో దేనికీ చెందకుండా, స్వతంత్రదేశంగా ఉండాలని లిబియా అధ్యక్షుడు గడాఫీ ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో అన్నారు. (ఈనాడు 25.9.2009).

కాశ్మీరులో భాగమైన గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ను స్థానిక గిరిజనుల సాయంతో పాకిస్థాన్‌ 1947లో ఆక్రమించింది.ఇప్పటివరకూ ఈ భూభాగం ఎలాంటి ప్రజాస్వామ్యం లేకుండా పాకిస్థాన్‌ అధ్యక్షుడి ప్రత్యక్ష పాలనలో ఉంది.ఇప్పుడు ఈ భూభాగంపై వాస్తవ నియంత్రణాధికారాన్ని పాకిస్థాన్‌ చైనాకు అప్పగించింది.అరబ్బు దేశాలకు, చైనాకు మధ్య సిల్క్‌ రవాణా మార్గంలో గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ భూభాగం ఉంది.పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే ప్రజల స్వయం నిర్ణయాధికారం గురించి మాట్లాడిన పార్టీలన్నింటినీ ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరించడాన్ని భారత విదేశాంగ శాఖ తప్పు పట్టింది.పాకిస్థాన్‌లో పీఓకే విలీనాన్ని ఆమోదించని వారిని, వ్యతిరేక ప్రచారం నిర్వహించేవారిని ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరించవచ్చునన్న నిబంధన పీఓకే తాత్కాలిక రాజ్యాంగంలో ఉంది.జమ్మూ కాశ్మీర్ లో హిందూ మతస్తులని, ఉగ్ర వాదులు చంపుతున్నారు, గతంలో చాల మందిని 10,00,000 హిందూ మతస్తులని చంపినారు, ఉగ్ర వాదులుగా మారక పోతే ముస్లిం మతస్తులని కుడా చంపుతున్నారు . ముస్లిం మహిళలని రక్షణ లేదు.

 




#Article 227: ఛత్తీస్‌గఢ్ (253 words)


ఛత్తీస్‌గఢ్ (छत्तीसगढ़) (Chhattisgarh), మధ్య భారత దేశములోని ఒక రాష్ట్రము. ఈ రాష్ట్రము 2000 నవంబర్ 1న మధ్య ప్రదేశ్లోని 16 ఆగ్నేయ జిల్లాలతో యేర్పాటు చేయబడింది. రాయ్‌పుర్ రాష్ట్రానికి రాజధాని.

ఛత్తీస్‌గఢ్‌కు వాయువ్యమున మధ్య ప్రదేశ్, పడమట మహారాష్ట్ర, దక్షిణాన తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్, తూర్పున ఒడిషా, ఈశాన్యాన జార్ఖండ్ , ఉత్తరాన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రములు సరిహద్దులుగా ఉన్నాయి.

రాష్ట్రము యొక్క ఉత్తర భాగము ఇండో-గాంజెటిక్ మైదానము అంచులలో ఉంది. గంగా నది యొక్క ఉపనది అయిన రిహంద్ నది ఈ ప్రాంతములో పారుతున్నది. సాత్పూరా శ్రేణులు యొక్క తూర్పు అంచులు, ఛోటానాగ్‌పూర్ పీఠభూమి యొక్క పడమటి అంచులు కలిసి తూర్పు నుండి పడమటికి వ్యాపించే పర్వతాలతో మహానది పరీవాహక ప్రాంతము నుండి ఇండో-గాంజెటిక్ మైదానమును వేరుచేస్తున్నాయి. రాష్ట్ర మధ్య భాగము సారవంతమైన మహానది , దాని ఉపనదుల యొక్క మైదానములలో ఉంది. ఇక్కడ విస్తృతముగా వరి సాగు చేస్తారు. రాష్ట్రము యొక్క దక్షిణ భాగము దక్కన్ పీఠభూమిలో గోదావరి , దాని ఉపనది ఇంద్రావతి యొక్క పరీవాహక ప్రాంతములో ఉంది. రాష్ట్రములోని మొత్తము 40% శాతము భూమి అటవీమయము.

ఇండో-ఆర్యన్ భాషా కుటుంబము యొక్క తూర్పు-మధ్య శాఖకు చెందిన ఛత్తీస్‌గఢీ భాష ఈ ప్రాంతము యొక్క ప్రధాన భాష. రాష్ట్రములో పర్వతమయమైన జిల్లాలు ద్రావిడ భాషలు మాట్లాడే గోండులకు ఆలవాలము.

దీనికి ఉత్తరాన , దక్షిణాన కొండలతో నిండియున్నది. ఈరాష్ట్రంలో సుమారుగా 44 శాతం అటవీప్రాంతం. భారతదేశంలోని 10వ పెద్ద రాష్ట్రం. ఈరాష్ట్రంకు వాయవ్యాన మధ్యప్రదేష్, పడమర మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ దక్షిణాన, తూర్పున ఒడిషా, జార్ఖండ్ ఈశాన్యం లోనూ , ఉత్తర ప్రదేశ్ ఉత్తరాన కలిగి ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దులను కలిగిన రాష్ట్రం.

ఛత్తీస్ గడ్ ముఖ్య భాష ఛత్తీస్ గడీ. ఇంతేకాకుండా హిందీ, ఒరియా, మరాఠి, తెలుగు , ఆదివాసీ భాషలు మాట్లాడేవారు కూడా ఉన్నారు.

ఛత్తీస్ గడ్ లో 18 జిల్లాలు (డిస్ట్రిక్ట్స్) ఉన్నాయి. అవి బస్తర్, బిలాస్ పూర్, బీజాపూర్, దన్తెవాడ (దక్షిణ బస్తర్), దమ్తరి, దుర్గ్, జంజ్గీర్-చంప, జష్పూర్, కాంకేర్ (ఉత్తర బస్తర్), కవర్ద, కోర్బా, కొరియ, మహాసముంద్, నారాయణ్ పూర్, రాయ్ గడ్, రాయ్ పూర్, రాజ్ నంద్ గాంవ్ , సర్గుజ.

వీటిలో బీజాపూర్, నారాయణ్ పూర్ లను 2007 మే 2 న రాష్ట్ర ప్రభుత్వం చే పరిపాలనా సోలభ్యానికై విభజించబడ్డాయి.

వైశాల్యము.1,36,034 చ.కి.




#Article 228: పుదుచ్చేరి (480 words)


పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి  (Pondicherry), దక్షిణ భారతదేశంలో ఒక కేంద్ర పాలిత ప్రాంతము. పుదుచ్చేరిలో ఉన్ననాలుగు జిల్లాలు విడి విడిగా ఉన్నాయి.తమిళంలో 'పుదు - చ్చేరి' అంటే 'క్రొత్త - ఊరు' అని అర్థం. దీనికి సమీపమైన ఫ్రెంచి ఉచ్ఛారణ ప్రకారం Poudichéry అని పిలిచారు. ఎప్పుడో పొరబాటున ఆంగ్లంలో 'u' బదులు 'n' అని వ్రాయడం వల్ల దీనిని ఆంగ్లంలో 'పాండిచేరి' అని పిలువడం మొదలయ్యింది. తరువాత అదే ఖరారైంది. ప్రస్తుతం ఆంగ్లంలో అధికారికంగా 'పుదుచ్చేరి' అని పేరు మార్చే ప్రయత్నం జరుగుతుంది. 

పురాణకాలంలో ఇక్కడ అగస్త్యమహర్షి ఆశ్రమం ఉండేదని చెబుతారు. ఇక్కడ ఒక సంస్కృత విద్యాలయం కూడా ఉండేదని కొన్ని పురాతనాధారాల వల్ల తెలుస్తోంది. క్రీ.శ. 2వ శతాబ్దంలో వ్రాయబడిన ఎరిథ్రేయన్ సముద్రం పెరిప్లస్ అనే పుస్తకంలో 'పొడుకె' అనే వాణిజ్యకేంద్రం గురించి వ్రాయబడింది. ఇదే ప్రస్తుత పుదుచ్చేరికి 2 మైళ్ళ దూరంలో ఉన్న'అరికమేడు' అని 'హంటింగ్ ఫోర్డ్' అనే రచయిత అభిప్రాయం. అప్పటినుండి రోము ప్రాంతంతో పుదుచ్చేరి దగ్గరి రేవులకు సముద్ర వర్తక సంబంధాలుండేవి. రోముకు చెందిన కొన్ని పాత్రలు అరికమేడులో త్రవ్వకాలలో బయటపడినాయి. క్రీ.శ. 4వ శతాబ్దానంతరం ఈ ప్రాంతం వరుసగా పల్లవ, చోళ, పాండ్య, విజయనగర రాజుల రాజ్యాలలో భాగంగా ఉంది. 1673లో ఫ్రెంచి ఈస్టిండియా కంపెనీ వారు ఇక్కడ నెలకొలిపిన వర్తక స్థావరం క్రమంగా ఫ్రెంచివారి అధికార కేంద్రమయ్యింది. తరువాత ఫ్రెంచి, బ్రిటిష్, డచ్చి వారి మధ్య అధికారం కోసం జరిగిన అనేక యద్ధాలు, ఒప్పందాల ప్రకారం పుదుచ్చేరి పై అధికారం మారుతూ వచ్చింది.1850 తరువాత పుదుచ్చేరి, మాహె, యానాం, కరైకాల్, చందేర్ నగర్ లు ఫ్రెంచివారి స్థావరాలుగా ఉన్నాయి.1954 వరకు ఇదే పరిస్థితి సాగింది.

భారత స్వాతంత్ర్య సమర కాలంలోనే పుదుచ్చేరిని ఫ్రెంచి పాలన నుండి విముక్తి చేయడానికి అనేక ఉద్యమాలు సాగాయి. 1787, 1791లో కరైకాల్ రైతులు భూమి పన్నులను వ్యతిరేకించారు. 1873లో పొన్నుతంబి పిళ్ళై అనే న్యాయవాది పారిస్ న్యాయస్థానంలో ఒక కేసు గెలిచారు. (పుదుచ్చేరి కోర్టులో చెప్పులతో ప్రవేశించినందుకు ఆయనకు విధించిన జరిమానా అన్యాయమని అంగీకరించి పరిహారం చెల్లించారు). 1927 - 1930 కాలంలో విద్యార్థిఉద్యమాలు నడచాయి. జాతీయ నాయకులు పుదుచ్చేరి వాసులను సంబోధించి ప్రసంగించారు. 1934లో 'వి.సుబ్బయ్య' అనే స్వాతంత్ర్య నాయకుడు, కార్మిక నాయకుడు 'స్వతంత్రం' అనే మాస పత్రికను ప్రారంభించాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఫ్రెంచి వారి పై విముఖత మరింత పెరిగింది. 1946లో 'ఫ్రెంచి ఇండియా కాంగ్రెసు' ప్రాంభింపబడింది. 1948 లో భారతదేశంలో విలీనానికి తీర్మానం ఆమోదించారు. దీనికి కమ్యూనిస్టుల మద్దతు కూడా లభించింది. 1947 లో భారత స్వాతంత్ర్యానంతరం 1948లో ఫ్రంచి ప్రభుత్వంతో జరిగి ఒప్పందం ప్రకారం ఈ ప్రాంతాల ప్రజలు తమ రాజకీయ భవిష్యత్తు నిర్ణయించుకొనే అవకాశం లభించింది. అయితే ప్రజా ప్రతినిధులలో కొంత ఊగిసలాట, అనిశ్చితి వల్ల, ఎన్నికలలో జరిగిన అవక తవకల వల్ల అసంగ్దిద్ధ పరిస్థితి నెలకొన్నది. 1954 మార్చి 18న పుదుచ్చేరిలో ప్రజా ప్రతినిధులంతా భారతదేశంలో విలీనానికి అంగీకరించారు. తరువాత కరైకాల్ లోనూ ఇదే జరిగింది. అలాగే యానాం విలీనానికి తీర్మానించిన ప్రజా ప్రతినిధులు బెదిరింపులను ఎదుర్కొని ప్రక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో తలదాచుకోవాల్సి వచ్చింది. వారంతా కలసి, మేయర్ సత్యానందం నాయకత్యంలో ఊరేగింపుగా యానాం వెళ్ళి, భారతజాతీయ పతాకాన్ని ఎగురవేసి యానాం విముక్తిని ప్రకటించారు. 1954 జూలై 16న కుమరన్ నాయకత్యంలో మాహె పౌరులు కూడా భారతదేశంలో విలీనమైనారు. 1952 చందోర్ నగర్ కూడా భారత ప్రభుత్వం అధీనంలోకి వచ్చింది. దానిని పశ్చిమ బెంగాల్లో హుగ్లీ జిల్లాలో భాగంగా ఏర్పరచారు.

పుదుచ్చేరిలోని నాలుగు భాగాల మొత్తం జనాభా సుమారు 9,70,000 (2001 జనాభా లెక్కలు ప్రకారం)

పుదుచ్చేరి ఒక కేంద్ర పాలిత ప్రాంతం. కనుక ఇక్కడి పాలనా విధానం కూడా అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలలాగానే ఉంటుంది. ఎన్నుకొనబడిన ముఖ్య మంత్రి, కాబినెట్ మంత్రులు ఉన్నా కొన్ని విషయాలు కేంద్రప్రభుత్వం ఆమోదం పొందాల్సి ఉంది. కేంద్రం ప్రతినిధిగా 'లెఫ్టినెంట్ గవర్నర్' ఉంటారు . అయితే కేంద్ర పాలిత ప్రాంతం పాలనకు అవసరమైన నిధులు ఎక్కువగా కేంద్రం నుండి వస్తాయి.

పుదుచ్చేరి వాసుల ప్రధాన భాష తమిళమైనా ఆంగ్లభాష, ఫ్రెంచిభాషలు ఈ పట్టణంలో బాగానే వాడబడుతాయి. ప్రధానమైన వీధి బోర్డులు మూడు భాషల్లోనూ ఉంటాయి.

పుదుచ్చేరి నగరాన్ని సముద్రం అలల తాకిడినుండి కాపాడటానికి 1735 లో ప్రెంచివారు1.25 మైళ్ళ పొడవు, 27 అడుగుల ఎత్తు ఉన్న గోడ (కరకట్ట)ను నిర్మించారు.ఇది సముద్రం అలల తాకిడినుండి పుదుచ్చేరి నగరాన్ని కాపాడుతుంది. 2004 లో వచ్చిన 'సునామీ' ఉప్పెన సమయంలో 24 అడుగుల ఎత్తు అలలనుండి ఈ గోడ పుదుచ్చేరి నగరాన్ని రక్షించింది.




#Article 229: లక్షద్వీప్ (612 words)


లక్షద్వీప్ (ലക്ഷദ്വീപ്‌), భారత దేశంలోని అతిస్వల్ప జనసంఖ్య కలిగిన అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం. ఈ దీవుల భూ వైశాల్యము మొత్తము 32 చదరపు కి.మీ, అరేబియా సముద్రములో, కేరళ తీరంనుండి 200 నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.ఈ దీవులలో పది దీవులు మాత్రమే జనావాసం ఉన్న దీవులు. మిగిలిన 17 నిర్జీవ దీవులు. ఇవేకాక ఇంకా లెక్కలోకి తీసుకోని ఎన్నో చిన్న దీపఖండాలున్నాయి.లక్షద్వీప్ రాజధాని నగరం కవరట్టి నగరం.లక్షద్వీప్‌లో లక్షద్వీప్ జిల్లా అనే పేరుతో ఒకే ఒక జిల్లా ఉంది.

కవరట్టి, ఆగట్టి, మినీకాయ్, అమిని ప్రధానమైన దీవులు. 2001 నాటి జనాభా లెక్కల ప్రకారము ఈ కేంద్రపాలిత ప్రాంతము మొత్తము జనాభా 60,595. ఆగట్టిలో ఒక విమానాశ్రయము ఉంది. ఇక్కడికి కొచ్చిన్ నుండి నేరుగా విమాన సౌకర్యము ఉంది.

లక్షద్వీపాల భాషలు మలయాళము, జెసేరీ (ద్వీప్ భాషా). ఉత్తర ద్వీపవాసులు వారి వ్యాపార సమయాలలో తమిళం, అరబిక్ ప్రభావిత మళయాళ యాసతో మాట్లాడుతుంటారు. దక్షిణ ప్రాంత మినికాయ్ ప్రజలు మహ్ల్ భాషను మాట్లాడతారు. ఇది మాల్దీవులలో మాట్లాడే దివేహి భాషకు కొంతమార్పిడి చెందిన భాష. బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో మళయాళ అక్షరాలతో కూడిన మళయాళ భాష అధికారిక భాషగా పరిచయము చేయబడింది. సమీపకాలముగా ఈ భాకు అరబిక్ ఒక విధమైన అక్షరాలను వాడుతున్నారు. ఈ విధానాన్ని భారతప్రభుత్వం కొనసాగిస్తుంది. మహ్ల్ భాషా ప్రభావితమైన మినికాయ్ ద్వీపంతో సహా లక్షద్వీపాల మధ్య అనుసంధిక భాషగా మళయాళ భాషను వాడుతుంటారు.

లక్ష ద్వీపవాసులు సాంస్కృతింగా కేరళా సముద్రతీర ప్రాంత ప్రజలను పోలి ఉంటారు. అలాగే అరబ్ వ్యాపారులచేత ప్రభావితులై ఉంటారు. దక్షిణ ప్రంతంలో ఉన్న అలాగే ద్వితీయస్థానంలో ఉన్న మినికాయ్ వాసులైన దివేహీలు ఇక్కడి స్థానికులుగా భావించబడుతున్నారు. ఈ దివేహీ సమూహాలు, ఉప దివేహీలు కొన్ని సందర్భాలలో మహ్లాస్. దేశీయంగా జనాభాపరంగా అధికులు సున్నీ ముస్లీములు. మినికాయ్ వాసులు తప్ప మిగిలిన దివి లేక ఆమ్నిదివీలు. లక్షద్వీపవాసులు
సాంస్కృతిక సమూహాలు 84.33% మలయాళీలు, 15,67% మహ్లాస్.

లక్షద్వీప సముద్రతీర ప్రాంతాలు మాల్ద్వీవులకు చాగోస్ దీవులను పోలి ఉంటుంది. లక్షద్వీప మడుగులు, కొండపగుళ్ళు, సముద్రతీరాలు పలు విధముల సముద్రతీర జీవజాలానికి విలసిల్లడానికి అనుకూల వాతావరణం కలిగి ఉంటుంది. వీటిలో జీవమున్న పగడపు కొండలు, సముద్రపు అర్చిన్స్, సముద్రపు పాచి, సముద్రపు దోసకాయలు, నక్షత్ర చేపలు, కఒరీలు, క్లామ్స్,, అక్టోపసులు ఉంటాయి. సీతాకోక చేపల వంటి అనేకరకాల చేపలు మొరే ఈల్స్, లాగూన్ (మడుగు) ట్రిగ్గర్ ఫిష్ అలాగే మరికొన్ని ఉన్నాయి. నివాసయోగ్యం కాని చర్బానియన్, బైరమ్‌గోర్ కొండ పగులు, పెరుమాల్ పార్ అలాగే పిట్టీ పాల్ ద్వీపం మొదలైనవి సముద్రపు టర్టిల్స్, బ్రౌన్ నొడ్డీ, లెసర్ క్రెస్టెడ్ టర్న్, గ్రేటర్ క్రెస్టెడ్ టర్నులు మొదలైన సముద్రపు పలు పక్షులు సంతానోత్పత్తి కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. పలురకములైన ట్యూనా, వాహూ, స్వోర్డ్ ఫిష్ (కత్తి చేపలు), డాల్ఫిన్స్ వంటివి ఈ ద్వీపతీర సముద్రంలో సాధారణంగా కనిపిస్తుంటాయి. సుహేలీ పార్ వద్ద ఉన్న సముద్రతీర ప్రాణుల పుష్కలత కారణంగా ఈ ప్రాంతాన్ని మేరిన్ నేషనల్ పార్క్ గా ప్రకటించబడింది.

లక్షద్వీప్  మొత్తం కేంద్రపాలితప్రాంతం ఒక జిల్లాగా పరిగణించబడుతుంది.

లక్షద్వీప్ జిల్లాలో 10 ఉప విభాగాలున్నాయి.

లక్షద్వీప జాతీయ ఉత్పత్తి ప్రస్తుత విలువలలో 60 మిలియన్ల అమెరికా డాలర్లు. లక్షద్వీపములో కొంత ఆర్థిక అసమానలు ఉన్నాయి. దారిద్యరేఖకు దిగువన కొంత మంది ప్రజలు ఉన్నారు. కొబ్బరిపీచు ఉత్పత్తి, పీచుతో చేయబడే ఉత్పత్తులు ఇక్కడి ప్రధాన ఆదాయ వనరులు. ఇక్కడ 5 కాయిర్ ఫైబర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. 5 ఉత్పత్తి వివరణ కేంద్రాలు, ఏడు ఫైబర్ కర్లింగ్ యూనిట్స్ ప్రభుత్వం చేత నడపబడుతున్నాయి. ఈ కేంద్రాలు కాయిర్ ఫైబర్ కర్లింగ్, కాయిర్ యార్న్, కారిడార్ ఉత్పత్తి చేస్తున్నాయి.

ఇక్కడి ప్రశాంత వాతావరణానికి శాస్త్రీయ పరిశోధనలకు అనువైన సముద్రతీలాల వలన లక్షద్వీఅపములు భారతీయులకు 1974 నుండి ప్రముఖ పర్యాటక ఆకర్షణ కలిగి ఉంది. పర్యాటకరంగం లక్షద్వీపాలకు గుర్తించతగినంత ఆదాయాన్ని ఇస్తుంది. పర్యాటకరంగం నుండి వచ్చే ఆదాయం క్రమంగా అభివృద్ధిచెందుతూ ఉంది. స్థలాభావంచేత ఈ ద్వీపాలలో ఫ్యాక్టరీలు నడపడానికి వీలు కాదు కనుక ప్రభుత్వంకూడా పర్యాటకరంగాన్ని ప్రోత్సహిస్తుంది. బంగరమ్, కడమట్ ద్వీపాలు పర్యాటకులను ఆకర్షించడంలో ప్రత్యేకత కలిగి ఉన్నాయి. అంతర్జాతీయ పర్యాటకుల ప్రత్యేక ఆకర్షణగా బంగరమ్ ద్వీపం తీర్చిదిద్దబడుతుంది. సముద్రతీర వృక్షసంపద పర్యాటకులకు కనువిందు చేస్తున్నది. నీటి క్రీడలు స్కూబాడైవింగ్, విండ్ సర్ఫింగ్, స్నార్క్లింగ్, సర్ఫింగ్, కయాకింగ్, కేనోయింగ్, వాటర్ స్కీయింగ్, యాచ్టింగ్, ధైర్యసాహసాలతో కూడుకున్న సముద్రంలో నైట్ వాయేజ్ వంటి జలక్రీడలు పర్యాటక ఆకర్ష్ణలో ప్రబలమైనవి. సముద్రం పూర్తిగా ఉగ్రరూపం ధరించే నైరుతీ ఋతుపవన కాలంలో తప్ప సంవత్సరమంతా పర్యాటనకు అనుకూలమే.

ఒక్కో దీవిలో పర్యటిస్తూ ఇక ఈ దీవిని చూసింది చాలనిపించి ఫెర్రీ ఎక్కి మరో దీవిలోకి అడుగుపెడితే అక్కడ పర్యాటకులు వాటర్ సర్ఫింగ్‌కి సిద్ధమవుతుంటారు. నీటి మీద అలలతో పోటీ పడుతూ ఎగిరి గంతులేయడాన్ని టెలివిజన్ ప్రోగ్రామ్‌లో చూసి ఆనందించడమే తప్ప స్వీయానుభవం లేని వాళ్లకు అలలతో ఆడుకోవాలనే సరదాతోపాటు కొంచెం భయం కూడా వేస్తుంది. కానీ ఇక్కడి ట్రైనర్లు ‘సర్ఫింగ్ బోర్డు మీద ఎలా నిలబడాలి, అల వస్తున్న దిశకు అనుగుణంగా ఎలా కదలాలి...’ వంటి ప్రాథమిక విషయాల్లో శిక్షణనిచ్చి నీటి మీదకు పంపిస్తారు. పొరపాటున నీటిలో పడిపోయినా వెంటనే బయటకు తీసుకొస్తారు.

లక్షద్వీప్ దీవుల్లో మనుష్య సంచారం లేని చిన్న చిన్న దిబ్బల్లాంటివి లెక్కలేనన్ని ఉంటాయి. కొన్ని దీవుల్లోకి పగడాల వేటగాళ్లు మాత్రమే అడుగుపెడుతుంటారు. ఈ కేంద్రపాలిత ప్రాంతానికి రాజధాని కరావట్టి దీవి. లక్షద్వీప్ దీవుల్లోని స్థానికులకు చేపల వేట, కొబ్బరి తోటల సాగు, కొబ్బరి పీచు తీయడం ప్రధాన వృత్తులు. అత్యంత ఖరీదైన ‘ట్యూనా ఫిష్’ ఇక్కడి నుంచి పెద్దమొత్తంలో ఎగుమతి అవుతుంది. ఇప్పుడు పర్యాటకం పెద్ద పరిశ్రమ అయింది. కొన్ని దీవులను పూర్తిగా టూరిస్టు రిసార్టులు, వాటర్ స్పోర్ట్స్ కోసమే డెవలప్ చేశారు. ఇలాంటి దీవుల్లో నివసించేవాళ్లంతా పర్యాటకశాఖ ఉద్యోగులే ఎక్కువగా ఉంటారు.




#Article 230: డయ్యూ (191 words)


డామన్ డయ్యూ, (Daman and Diu) అనేది భారతదేశంలో ఒక కేంద్రపాలిత ప్రాంతం. అరేబియా సముద్రం తీరాన ఉన్న  డామన్ డయ్యూ , గోవా, దాద్రా, నాగర్-హవేలీ చిన్న ప్రాంతాలలో ఇది ఒకటి. ఇది డయ్యూ జిల్లాకు  ముఖ్య పట్టణం

ఇక్కడ అధికారిక భాష గుజరాతీ. పోర్చుగీసు భాషను పాఠశాలలో బోధించకపోవడం వల్ల దాని వాడకం క్రమంగా క్షీణిస్తుంది. డామన్ లో 10 % ప్రజలు పోర్చుగీసు భాష మాట్లాడుతారు. అది క్రమంగా 'ముసలివారిభాష' అనిపించుకొంటుంది.

'డామన్' జిల్లా వైశాల్యం 72 చ.కి.మీ. జనాభా 1,13,949 (2001 జనాభా లెక్కలు ప్రకారం). ఇది డామన్ గంగా నది ముఖద్వారాన ఉంది. దీనికి పశ్చిమాన అరేబియా సముద్రం, మిగిలిన మూడు ప్రక్కల గుజరాత్ లోని వల్సాడ్ జిల్లా ఉంది. డామన్ కు అతి దగ్గరి రైల్వే స్టేషను 7 కి.మీ. దూరంలో ఉన్న 'వాపి' (గుజరాత్). డామన్ కు ఉత్తరాన సూరత్ నగరం, దక్షిణాన సుమారు 160 కి.మీ. దూరంలో ముంబాయి నగరం ఉన్నాయి.డామన్‌లో చేపలు పట్టడం, మత్స్య పరిశ్రమ ప్రధాన ఉపాధి మార్గాలు. అనేక పరిశ్రమలు కూడా ఉన్నాయి.

అందమైన సముద్రతీరం, పోర్చుగీసు విధానంలో నిర్మించిన కట్టడాలు, చక్కనైన చర్చిలు, ప్రకృతి సౌందర్యం - ఇవి డామన్ విశేషాలు. గంగా డామన్ నదికి ఇరువైపులా నాని-డామన్, మోతి-డామన్ అనే పట్టణాలున్నాయి.

గుజరాత్ దక్షిణ ప్రాంత తీరంలో కథియవార్ దగ్గర ఉన్న ఒక ద్వీపం పేరు డియ్యూ. ఈ ద్వీపం వైశాల్యం 40 చ.కి.మీ. జనాభా 44,110 (2001 జనాభా లెక్కల ప్రకారం). ఈ ద్వీపం తూర్పు తీరాన డియ్యూ పట్టణం ఉంది. ఇక్కడ పాతకాలపు పోర్చుగీసు కోట ఒక ప్రధాన ఆకర్షణ. చేపలు పట్టడం ప్రధానమైన ఉపాధి. భారతీయ వైమానిక దళం స్థావరముంది. ద్వీపంలో మరోప్రక్క 'ఘోగ్లా' అనే పల్లె ఉంది.




#Article 231: దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ (910 words)


దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ  (Dadra and Nagar Haveli and Daman and Diu) పశ్చిమ భారతదేశంలోని ఒక కేంద్ర పాలిత ప్రాంతం. 

 పాతకాలనీ నివాసులు భారతప్రభుత్వాన్ని పాలనాపరమైన సహాయం కొరకు అభ్యర్థించారు. భారతప్రభుత్వం  కె.జి బదలానీ (ఐ.ఎ.ఎస్ అధికారి) ని ఈ ప్రాంతానికి నిర్వాహకునిగా పంపింది.

దాద్రా నాగర్ హవేలీ వైశాల్యం 491 చ.కి.మీ. జిల్లా ఉత్తర సరిహద్దులో గుజరాత్ రాష్ట్రం, దక్షిణ సరిహద్దులో మహారాష్ట్రా ఉన్నాయి.
ఈ కేంద్రపాలిత ప్రాతం భౌగోళికంగా రెండు విభాగాలుగా విభజించింది. జిల్లా వైశాల్యం 491 చ.కి.మీ ఉంటుంది. ఈ జిల్లా ఫిలిప్పైన్‌లోని  బిలిరాన్ ద్వీపం వైశాల్యానికి సమానం. 
 భారతీయ కేంద్రపాలిత ప్రాంతాలలో ఇది 4వ స్థానంలో ఉంది. అలాగే రాష్ట్రాలలో 32వ స్థానంలో ఉంది. ఈ భూభాగం పడమటి సరిహద్దులో గుజరాత్ లోని వల్సాడ్ జిల్లా, ఉత్తర, తూర్పు సరిహద్దులో మహారాష్ట్రా లోని తానా జిల్లా ఉంది.

జిల్లా దక్షిణ భూభాగం పర్వతాలు అరణ్యాలతో నిండి ఉంటుంది. వాయవ్యభాగంలో సహ్యాద్రి పర్వతాలు (పడమటి కనుమలు), మద్యలో అల్యూవియల్ (సారవంతమైన) మైదానం వ్యవసాయానికి అత్యంత యోగ్యమైనదిగా ఉంది. పడమటి సముద్రతీరానికి 64 కి.మీ దూరం నుండి ప్రవహిస్తున్న దామన్ గంగానది దాద్రా నాగర్ హవేలీ గుండా ప్రవహించి దామన్, డయ్యూ వద్ద అరేబియా సముద్రంలో సంగమిస్తుంది. ఈ నదికి విజ్, వర్న, పిప్రి, సకర్తాండ్ అనే ఉపనదులు ఈ ప్రాంతంలో దామన్ గంగా నదితో సంగమిస్తూ ఉన్నాయి.

దాద్రా నగరు హవేలీ జిల్లాలో 43% అరణ్యాలతో నిండి ఉంటుంది. మొత్తం భూభాగంలో 40% భూభాగం కొహిస్ అభయారణ్యం ఉంది. సంరక్షితారణ్యం 2.45% ఉంది. 

 
ఈ వృక్షజాతులు దాదాపు 27చ.కి.మీ ఉంది. అంతేకాక మొత్తం భూభాగంలో 5% ఉన్నాయి. వృక్షసంపన్నమై అనుకూల వాతావరణం ఉన్నందున ఈ ప్రాంతలో వివిధ పక్షులు, జంతువులు నివసిస్తున్నాయి. ఇక్కడ ఎకోపర్యాటకం పేరుతో పర్యటనలకు వసతి కల్పిస్తున్నారు.  సిల్వస్స, బఫర్ లాండ్  ఔత్సాహిక వన్యమృగ పరిశీలనకు ఆస్కారం కలిగిస్తుంది.

దాద్రా నగరు హవేలీలో వాతావరణం ఉష్ణమండల సముద్రతీరం వాతావరణం ఉంటుంది. తూర్పు భూభాగంలో నివాసాలు తక్కువగా ఉన్నాయి. వేసవి కాలం ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. వేసవి చివరిలో వాతావరణంలో తేమ అధికంగా ఉంటుంది. వేసవి కాలంలో మే మాసంలో ఉష్ణోగ్రతలు 39° వరకు ఉంటుంది. జూన్ మాసంలో ఆరంభమయ్యే వర్షాలు సెటెంబర్ వరకు కొనసాగుతుంటాయి.నైరుతి ఋతుపవనాల కారణంగా వర్షపాతం అధికంగా ఉంటుంది. పడమటి భారతదేశభూభాగంలో అధికభాగం ఉన్న చిరపుంజిలో వర్షపాతం 200-250 మి.మీ ఉంటుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు 14° నుండి 30° ఉంటాయి. శీతాకాలంలో అప్పుడప్పుడూ వర్షాలు పడుతుంటాయి.

కేంద్రపాలిత ప్రాంతం పాలనా నిర్వహణకు లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యత వహిస్తాడు.188 చ.కి.మీ వైశాల్యం ఉన్న కేంద్రపాలితంలో రెండు తాలూకాలు ఉన్నాయి. 

దాద్రా తాలూకా ప్రధాన కేంద్రం దాద్రా. దీనిలో దాద్రా తాలూకా మరొక 2 గ్రామాలు ఉంటాయి. నగర్ హవేలీ తాలూకా కేంద్రం సిల్వస్సా పట్టణం, 68 గ్రామాలు భాగాలుగా ఉంటాయి.

దాద్రా నగరు హవేలీ జిల్లా ప్రధాన ఆదాయం వనరు వ్యవసాయం. ప్రజలలో వారిలో 60% మంది వ్యవసాయంలో పనిచేస్తున్నారు. వ్యవసాయానికి ఉపకరిస్తున్న భూమి వైశాల్యం 267. 27 చ.కి.మీ. జిల్లా మొత్తం వైశాల్యంలో వ్యవసాయానికి ఉపకరిస్తున్న భూమి శాతం 48%. అత్యధిక దిగుబడులు ఇస్తున్న ప్రదేశం 12000 ఎకరాలు. ప్రధాన పంట వరి (40%). చిరుధాన్యాలు రాగి, జొన్న, చెరుకు, టర్, నగ్లి, వంటి ధాన్యాలను, టొమాటోలు, కాలిఫ్లవర్, క్యాబేజి, వంకాయలు వంటి కూరగాయలు, మామిడి, చిక్కో, జామ, కొబ్బరి, అరటి వంటి పండ్లను పండిస్తున్నారు. వ్యవసాయరంగం జిల్లా ఆర్థికాభివృద్ధికి అధికంగా దోహదం చేస్తుంది. ప్రాంతీయ ప్రజలు కూడా వనాల అభివృద్ధి, జంతుల పెంపకం వంటి కార్యాలలో పాల్గొంటున్నారు. 92.76% వ్యవసాయదారులు బలహీనవర్గాలకు చెందినవారే. వారిలో 89.36% గిరిజనవర్గాలకు చెందిన వారే. పూర్తి స్థాయి వెటర్నరీ హాస్పిటల్,  తొమ్మిది వెటర్నరీ డిస్పెన్సరీలు ఉన్నాయి. పశుసంవర్ధక శాఖ వివిధ వ్యాధులకు వ్యాధినిరోధక టీకాలు వేయడం క్రమం తప్పకుండా జరుగుతుంది.

దాద్రా నగరు హవేలీ జిల్లా ఇతర ఆదాయవనరులలో పరిశ్రమలకు ప్రాధాన్యత ఉంది. కేంద్రపాలిత ప్రాంతాలలో పరిశ్రమలకు పన్ను మినహాయింపు ఇచ్చారు కనుక జిల్లాలో అత్యధికంగా పరిశ్రమలు నెలకొల్పబడ్డాయి. క్రమాభివృద్ధితో సంవత్సరానికి ఉపాధి కల్పనలో 5% పెరుగుదల సాధిస్తుంది

సంప్రదాయ వృత్తికారులు మట్టి కుండలు, తోలు వస్తువులు, విజ్, చెప్పులు, బూట్లు, ఇతర వస్తువులు తయారు చేసేవారు. మరికొందరు వెదురు బుట్టలు అల్లేవారు. ఈప్రాంతంలో అమ్మకపు పన్ను లేదు. తరువాత వచ్చిన 30 యూనిట్లలో ప్రధానమైనవి ఇంజనీరింగ్, చేనేత యూనిట్లు, అద్దకం, ప్రింటింగ్ యూనిట్లు 1970 వరకు ఏర్పాటు చెయ్యబడ్డాయి.

దాద్రా నగరు హవేలీ జిల్లాలో గిరిజనుల శాతం 62%. వీరిలో ధోడియా ప్రజలు 16.90%, కొక్న ప్రజలు ప్రజలు 16.85%, వర్లి ప్రజలు 62.94% ఉన్నారు. చిన్న,చిన్న బృందాలుగా కోలి, కథోడీ, నైక, డుబ్ల జిల్లా అంతటా చెదురుమదురుగా ఉన్న ప్రజలందరి శాతం 3.31% ఉన్నారు. డోడియాలు, డూబుల్ ప్రజలు జిల్లాలోని ఉత్తరప్రాంతంలో ఉన్నారు. కోక్నాలు, వర్లీలు ప్రాంతమంతా ఉన్నారు. వారి ప్రధానదైవం డీస్ (సూర్యుడు), చంద్ (చంద్రుడు), నరందేవ్, కనాసరి, హిమై, వీర్, రంగ్తై, వగ్దేవ్.

దాద్రా నగరు హవేలీ జిల్లాలో గిరిజనేతర ప్రజలు దేసమంతటి నుండి వచ్చి స్థిరపడిన వారు కావడం విశేషం. ఈ ప్రాంతంలో గుజరాతీ ప్రజలకు ప్రత్యేక ప్రభావం ఉంది. అందువలన ఇక్కడ ఉన్న 3 అధికార భాషలలో గుజరాతీ కావడం విశేషం. మీగిలిన రెండు అధికారభాషలు ఆంగ్లం, హిందీ. అంతేకాక మరాఠీ, రాజస్థానీ, బీహారీ, తమిళ, ఉత్తరప్రదేశ ప్రజలు కూడా ఉన్నారు. ఇది పారిశ్రామిక కేంద్రంగా ఉండడమే ఇంతటి విభిన్నతకు కారణం. సుందర ప్రకృతి, ఉద్యోగావకాశాలు, మంచి వాతావరణం విభిన్న ప్రజలను నగరం వైపు ఆకర్షిస్తుంది.

జిల్లాలోని ప్రధాన నగరాలైన దాద్రా, సిల్వస్సాలలో శ్వేతాంబర జైనులు ఆఅయాలను నిర్మించారు. సిల్వస్సాలో స్వామినారాయణ ప్రభావం అధికంగా ఉంది. వారి ఆలయం నిర్మాణదశలో ఉంది. అది ఈ ప్రాంతంలో అత్యంత ఖరీదైనది, అత్యంత విశాలమైనది ఉండగదని భావిస్తున్నారు.

వరలి ప్రజలు వరలి భాషను మాట్లాడుతుంటారు. అగ్రి సంప్రదాయ ప్రజలు అగ్రి భాషను మాట్లాడుతుంటారు. ఈ భాషలకు మరాఠీ- కొంకణి లిపిని వాడుతుంటారు. 
రోమన్ కాథలిక్ ప్రజలు ఒకప్పటి పోర్చుగీసును పోలిన భాషను, సిల్వెస్సాను మాట్లాడుతుంటారు. మరాఠీ, కొంకణి, గుజరాతీ భాషలను అత్యధికంగా మాట్లాడుతుంటారు. 
 హిందీ, మరాఠీ భాషలు కూడా వాడుకలో ఉన్నాయి.. వరలి, ధోడియా, కొంకణికి చెందిన వారు అత్యధికంగా ఉంది.

మహారాష్ట్రా గుజరాత్‌లతో కలిసి ఉన్నప్పటికీ వర్లీస్ ప్రజలను దాద్రానాగర్ హవేలీ ప్రజలుగానేభావిస్తారు. ఎందుకంటే వర్లీస్ పూర్వీకం దాద్రానాగర్ హవేలి అన్నదే వాస్తవం. ఆర్యన్ జాతికి చెందని ప్రజలలో వర్లి ప్రజలు కూడా ఒకరు. ఈ కేంద్రపాలిత ప్రదేశంలో వర్లి ప్రజలు మొత్తం గిరిజన జాతికి చెందిన ప్రజలలో 62.94% ఉన్నారు. 
వర్లీ ప్రజలకు ఆచారాలు చాలా ముఖ్యం. వారు ప్రకృతి ఆరాధకులు. వారు ఆరాధించే 3 దేవతా విగ్రహాలు లభ్యమయ్యాయి. వీరు సొరకాయ బుర్రతో చేసిన వాయిద్యాలను (గంగల్) వాయుస్తుంటారు. 
సాధారణంగా వర్లి ప్రజలు లోయిన్ వస్త్రంతో చేసిన చిన్న వెయిస్ట్ కోటు, టర్బన్ ధరిస్తుంటారు. స్త్రీలు మోకాళ్ళ పొడవున ఒక గజం చీరెను వెండి, వైట్ మెటల్ ఆభరణాలతో అలకరించి ధరిస్తుంటారు.

డోడియా అనే పేరు ధుండి నుండి వచ్చింది. ధుండి అంటే కప్పబడిన గుడిశ అని అర్ధం. ధోడియాలు అత్యధికంగా గుడిశవాసులు. వీరు అత్యధికంగా  దాద్రా నగరు హవేలీ  ఉత్తర భూభాగంలో ఉంది. అందరి గిరిజనులలో ధోడియాలలో అధికంగా విద్యావంతులు, వ్యవసాయదారులు ఉన్నారు. వీరిలో కొందరికి స్వంత భూములు, తమ అవసరాలకు తగినంత ఆదాయం కలిగి ఉన్నారు. పురుషులు మోకాలి వరకు ఉండే తెల్లని ధోవతి. వెయిస్ట్ షర్టు ధరిస్తుంటారు. తెల్లని లేక రంగుల టోపీలు, చెవిపోగుల చంటి ఆభరణాలు, వెండి గొలుసులు ధరిస్తుంటారు. స్త్రీలు మోకాలి పొడవైన ముదురు నీలవర్ణ చీరెలు, ఆంచల్ ధరిస్తుంటారు. మెడలో రంగురంగు పూసల మాలలు ధరిస్తుంటారు. స్త్రీలు మెడలో లోహపు రింగులు, లావైన కంటెలు ధరిస్తుంటారు.

కొకన్లకు పశ్చిమ భారతీయ కొంకణి నుండి ఈ పేరు వచ్చింది. వారికి స్వంత వ్యవసాయ భూములు ఉంటాయి. వరిలిలో నివసిస్తున్న వీరు వడ్లు, ఇతర పంటలను పండిస్తుంటారు. వారిలో ప్రభుత్వం ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టిన తరువాత వారిలో అధికులు సాంఘిక జీవితానికి అలవాటు పడుతున్నారు. దృఢకాయులైన కొక్నాల స్త్రఉరుషులిరువురు వారి శరీరాలలో భుజాలు, మోకాళ్ళ మీద పచ్చబొట్లు పొడిపించుకునే అలవాటు ఉంది. వారు కోటు లేక షర్టు ధరిస్తుంటారు. స్త్రీలు గిరిజనులకే ప్రత్యేకమైన వర్ణరంజితమైన చీరెలను కొందరు మోకాళ్ళ వరకు కొందరు పూతి పొడవున ధరిస్తారు.

దాద్రాలో ఖదోడీలు (మహారాష్ట్రలో ఖదోరీలు) 08%, ఉన్నారు. వీరి వృత్తి కాట్చ్యూ తయారీ. సాధారణంగా వీరు అరణ్యాలలో కొయ్య - రాక్షసిబొగ్గుతో నిర్మించిన గృహాలలో!నివసిస్తుంటారు. ప్రభుత్వం వారిజీవిత స్థాయిని పెంపొదించడానికి వారిలో సరికొత్త వృత్తులను ప్రవేశపెట్టింది. వారిలో స్త్రీలు మితమైన ఆభరణాలు ధరిస్తుంటాయి.




#Article 232: చండీగఢ్ (992 words)


చండీగఢ్ (Chandigarh) ఉత్తర భారతదేశంలోని ఒక నగరం, కేంద్రపాలిత ప్రాంతం.ఇది పంజాబ్, హర్యానా రెండు రాష్ట్రాలకు రాజధాని, కాని ఆ రెంటిలో ఏ రాష్ట్రానికి చెందని కేంద్రపాలిత ప్రాంతంగా ఉండడం చండీగఢ్ ప్రత్యేకత. చండీగఢ్ (పంజాబు:ਚੰਡੀਗੜ੍ਹ) ఉత్తరభారదేశంలోని ప్రముఖనగరాలలో ఒకటి. చండీగఢ్ నగరం పంజాబు, హర్యానా రాష్ట్రాలకు రాజధానిగా సేవలందిస్తుంది.భారతదేశంలో నగరనిర్మాణ ప్రణాళిక (ప్లాండ్ సిటీ) ద్వారా నిర్మించబడిన నగరాలలో చండీగఢ్ మొదటిది. ఈ నగరానికి స్విట్జర్లాండ్ నగర రూపకల్ప నిర్మాత లె కార్‌బ్యూసియె రూపకర్తగా పనిచేసాడు.ఈ నగర నిర్మాణం, రూపకల్పన స్వాతంత్ర్యానికి ముందే జరిగింది.ఈ నగర రూపకల్పన ద్వారా లె కార్‌బ్యూసియె భవనిర్మాణానికి, నగర రూపకల్పనకు అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. నగరం ప్రాథమికంగా లె కార్‌బ్యూసియె వలన రూపకల్పన చేయబడినప్పటికీ దీనికి  పిర్రే జన్నరెట్, జాన్ డ్ర్యూ , మ్యాక్స్‌వెల్ ఫ్రై వంటి వారు సహకరించారు. తలసరి ఆదాయంలో చండీగఢ్ రాష్ట్రాలలో , కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రధమ స్థానంలో ఉంది. 2010 లో భారతదేశంలో పరిశుభ్రమైన నగరంగా జాతీయ ప్రభుత్వ పరిశోధనల గుర్తింపు పొందింది. అలాగే చండీగఢ్ రాష్ట్రాలలో , కేంద్రపాలిత ప్రాంతాలలో  హ్యూమన్ డెవలెప్మెంట్ ఇండెక్స్  లో కూడా ప్రథమ స్థానంలో ఉంది. చండీగఢ్ మెట్రో , పంచకుల , మొహలి కలిసి త్రినగరాలుగా (ట్రై సిటీ) గా గుర్తింపు పొందింది. 

జవహర్‌లాల్ నెహ్రూ ప్రేరేపణపై 1950 దశకంలో ఫ్రెంచి భవన నిర్మాణకారుడు లె కార్బుజియె (architect Le Corbusier) చండీగఢ్ నగరాన్ని, అందులో చాలా భవనాలను రూపొందించాడు. అప్పుడే స్వతంత్రమైన భారతదేశపు ప్రగతిశీల పధం ఇందులో ప్రతిఫలించాలని అతని సంకల్పం.చండీగఢ్ నగరం చదరాలు అమర్చినట్లుగా సెక్టార్లుగా డిజైన్ చేయబడింది. ప్రతి సెక్టారు సుమారుగా 1.5 కి.మీ x 1.5 కి.మీ. చదరం వైశాల్యం ఉంటుంది. ప్రతి సెక్టారు ఒక చిన్న పట్టణంలా, దాని స్వంత మార్కెట్, పూజా స్థలాలు, స్కూళ్ళు, కాలేజీలు కలిగి ఉంటుంది.1 నుండి 60 వరకు సెక్టారులు ఉన్నాయి. కాని సెక్టారు నెం.13 మాత్రం లేదు. 13వ సంఖ్య అదృష్టానికి దూరమని లె కార్బుజియె నమ్మడమే దీనికి కారణం కావచ్చును.

చండీగడ్ నగరంలో పర్యాటక ఆకర్షణీయ ప్రదేశాలు అనేకం ఉన్నాయి. వాటిలో పలు విధాలైన తోటలు కొన్ని చారిత్రాత్మక ప్రదేశాలు కూడా ఉన్నాయి.

చండీగఢ్ హిమాలయ పర్వతశ్రేణులలోని శివాలిక్ పాదపర్వతాల వద్ద ఉంది. చండీగఢ్ వైశాల్యం 44.5 చదరపు కి.మీ. అలాగే మెట్రో వైశాల్యం 114 చదరపు కి.మీ. నగరసరిహద్దులలో పంజాబు, హర్యానాలు ఉన్నాయి. చండీగఢ్ సముద్రమట్టానికి 321 మీటర్ల ఎత్తున ఉంది.

చండీగఢ్ పరిసరాలలోపంజాబు రాష్ట్రానికి చెందిన మొహలి, పాజ్టలియా,  రూప్‌నగర్ ఉన్నాయి. హర్యానా రాష్ట్రానికి చెందిన అంబాలా, పంచకుల నగరాలు ఉన్నాయి. నగర ఉత్తర భాగంలో స్వల్పంగా హిమాచల ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు ఉంది.

చండీగఢ్‌లో తేమతో కూడిన ఉప ఉష్ణ వాతావరణం కలిగి ఉంటుంది. చాలా వేడి వేసవి, స్వల్పమైన చలి, అప్పుడప్పుడూ వచ్చే వర్షాలు ఉష్ణోగ్రతలో తీవ్రమైన వ్యత్యాసాలు ఉంటాయి. సంవత్సరంలో ఉష్ణోగ్రతలు 40-1 సెల్షియస్ ఉంటుంది. సంవత్సర సరాసరి వర్షపాతం 1110.7 మి.మీ ఉంటుంది. నగరంలో ఒక్కోసారి శీతాకాలంలో కూడా వర్షాలు కురుస్తుంటాయి. ఉత్తరంలో ఉన్న సిమ్లా, జమ్ముకాశ్మీరు నుండి చలిగాలులు వీస్తుంటాయి.

చండీగఢ్‌లో అధికంగా మర్రి, యూకలిఫ్టస్ ప్లాంటేషన్లు ఉంటాయి.అశోక, కసియా, మల్బరీ, ఇతర చెట్లు ఉన్నాయి. నగరమంతటా వన్యప్రాంతంలాంటి వాతావరణం గోచరిస్తుంది. నగరం చుట్టూ అరణ్యాలు ఉన్నందువలన అగరంలో అనేక జంతువులు, వృక్షాలు కనిపిస్తుంటాయి. జింకలు, సాంబారు జింకలు, బార్కింగ్ డీర్, రామచిలుకలు, వడ్రంగిపిట్టలు,, నెమళ్ళు మొదలైనవి అభయారణ్యాలలో ఉన్నాయి. సుఖ్నా సరసులో వైవిధ్యమున్న బాతులు, గీస్ ఉన్నాయి. అలాగే శీతాకాలంలో సైబీరియా, జపాన్ దేశాల నుండి వచ్చే వలసపక్షులను కూడా ఈ సరసు ఆకర్షిస్తుంది. చండీగఢ్ నగరంలో ఉన్న రామచిలుకల అభయారణ్యంలో పలు ఇతర జాతుల పక్షులకు ఆశ్రయం ఇస్తుంది. నగరంలో ప్రఖ్యాతి వహించిన  జాకీర్ హుస్సేన్ రోజ్ గార్డేన్ , టెర్రస్ గార్డేన్, బోగన్‌విల్లా గార్డెన్, శాంతికుంజ్, ఇతర పూదోటలు ఉన్నాయి.

చండీగడ్‌లో 3 ప్రధాన తయారీ సంస్థలు వారి కార్యాలయాలను ఏర్పాటు చేసాయి. అవి వరుసగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్  ఇండస్ట్రీ,, (ఎఫ్.ఐ.సి.సి.ఐ), ది పి.హెచ్.డి చంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, (పి.హెచ్.డి.సి.సి.ఐ), ది కాంఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, (సి.సి.ఐ) సంస్థల ప్రాంతీయ ప్రధానకార్యాలయాలు సెక్టర్ 31లో ఉన్నాయి.

చండీగడ్ ఐ.టి పార్క్ (రాజీవ్ గాంధీ చండీగర్ టెక్నాలజీ పార్క్ ) స్థాపనతో చండీగడ్ ఇంఫర్మేష టెక్నాలజీ ప్రపంచంలో ప్రవేశించింది. చండీగడ్ నుండి ఢిల్లీ, హర్యానా, పంజాబు, హిమాచల్ ప్రదేశ్ లకు సౌకర్యవంతమైన రోడ్డు మార్గాలు ఉండడం కూడా ఐ.టి అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఐ.టి టాలెంట్ పూల్ ఐ..టి బిజినెస్ సంబంధిత కార్యాలయాలు ఏర్పాటు చేసే వారిని కూడా ఆకర్షిస్తుంది. పలు ఇండియన్ ఫర్ంస్ అలాగే క్యుయార్క్, ఇంఫోసిస్, డెల్, ఐ.ఐ.ఎం.బి, టెక్‌మహీంద్రా సంస్థలకు నగరంలోనూ నగరం వెలుపల కార్యాలయాలు ఉన్నాయి. 

చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంలో చండీగఢ్ జిల్లా పేరుతో ఒకే ఒక జిల్లా ఉంది. జిల్లా ప్రధాన కార్యాలయాలు చండీగడ్ లోనే ఉన్నాయి.చండీగఢ్ జిల్లా ఉత్తర రైల్వేలోని చండీగఢ్ రాష్ట్రంలో ఒక భాగం.జాతీయ స్థాయిలో జిల్లా, జనాభా ర్యాంక్ స్థానంలో 51 ర్యాంక్ గా ఉంది.రాష్ట్ర స్థాయిలో 1 వ స్థానంలో ఉంది.2011 భారత జనాభా ఔవుట్‌గ్రోత్  ప్రకారం చండీగఢ్ జిల్లాను కూడా పరిపాలనాపరంగా చండీగఢ్ నగరపాలక సంస్థగా ప్రకటించారు.చండీగఢ్ రైల్వే స్టేషన్‌లో ప్రతిరోజూ 66 రైళ్లు ప్రయాణిస్తున్నాయి.దీనిని గ్రేడ్ బి రైల్వే స్టేషన్‌గా పరిగణించారు.

జిల్లా ప్రధాన కార్యాలయం చండీగఢ్ నగరం.జిల్లాలో ప్రధానంగా పంజాభీ, హిందీ మాట్లాడతారు.జిల్లా విస్తీర్ణం 114 చ.కి.మీ.ఇది సముద్ర మట్టానికి సరాసరి 334 మీటర్ల ఎత్తులో ఉంది.

జిల్లాలో ఒక నగరపాలక సంస్థ, 5 జనగణన పట్టణాలు ఉన్నాయి.

జిల్లాలో 5 గ్రామాలు ఉన్నాయి.

చండీగఢ్‌ జిల్లాలో అనేక విద్యాసంస్థలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యంలో నడుస్తున్న పలు విద్యాసంస్థలు, పంజాబు యూనివర్శిటీ మొదలగు విద్యాసంస్థలు జిల్లా, నగర ప్రజలకు విద్యను అందిస్తున్నాయి.ఈ విద్యాసంస్థలు ప్రపంచం అంతటి నుండి విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి.

చండీగఢ్ జిల్లాలో ఈ సెషన్స్ విభాగానికి చెందిన 30 కోర్టులు ఉన్నాయి.చండీగఢ్ జిల్లా కోర్టు 1966 నవంబరు 1 ఏర్పడింది.జాస్మెర్ సింగ్ మొదటి జిల్లా  సెషన్స్ జడ్జిగా,సబ్ జడ్జి ఫస్ట్ క్లాస్, చండీగఢ్ కోర్టుకు సోహన్ లాల్ వర్మలను గా నియమించారు.2014 లో 10 కొత్త కోర్టులు, అంటే అదనపు జిల్లా  సెషన్స్ జడ్జి కోర్టులు 4, 6 కోర్టులు సివిల్ జడ్జి కోర్టులు (జూనియర్) -6  సృష్టించినప్పుడు కోర్టుల సంఖ్య 30 పెరిగింది.

అవి అన్నీ చండీగఢ్ సెక్టార్ -43 లో కొత్తగా నిర్మించిన జిల్లా కోర్టుల సముదాయంలో ఉన్నాయి. చండీగఢ్ లోని ఇంటర్ స్టేట్ బస్ టెర్మినస్ నుండి కాలినడకన జిల్లా కోర్టుల సముదాయానికి చేరుకోవచ్చు.కొత్త జిల్లా కోర్టుల సముదాయంలో 31 కోర్టు గదులు ఉన్నాయి.ఇది నాలుగు అంతస్థులతో నిర్మించబడింది.  , జిల్లా బార్ అసోసియేషన్ ప్రారంభ సభ్యులు 15-20 మంది సభ్యులు నుండి, ప్రస్తుతం 3000 మంది సభ్యులుకు చేరుకుంది.

చండీగఢ్ నగరంలో రాష్ట్రాంతర క్రీడా బృందాలు అనేకం ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐ.పి.ఎల్) లోని కింగ్స్ XI పంజాబు ఒక భాగం. నగరంలో బత్రా, నీలం , కిరన్ వైల్ వంటి సినిమాహాళ్ళు , పలు మాల్స్ , పి.వి.ఆర్ ఎలెంటే మాల్, పి.వి.ఆర్ సెంట్రా మాల్, వేవ్ ఎంపోరియం మాల్, డి.టి మాల్, ఫన్ రిపబ్లిక్ , ఎలెంటే మాల్ (ఉత్తర భారతదేశంలో అత్యంత పెద్దది) వంటి మల్టీ కాంప్లెక్స్ ఉన్నాయి. నగరంలో సెక్టర్ 1 లో ఉన్న  రాక్ గార్డెన్, సెక్టర్ 16 లో ఉన్న  జాకీర్ హుస్సేన్ రోజ్ గార్డెన్  ప్రపంచ ప్రఖ్యాత కలిగినవిగా గుర్తింపు పొందాయి. అంతర్జాల అనుసంధానంలో చండీగఢ్ ప్రత్యేకత సంతరించుకుంది.

చండీగ District ్ జిల్లా ఉత్తర రైల్వేలోని చండీగ state ్ రాష్ట్రంలో ఒక భాగం, జనాభా ర్యాంక్ జాతీయ స్థాయిలో 51 వ స్థానంలో ఉంది మరియు రాష్ట్ర స్థాయిలో 1 వ స్థానంలో ఉంది. G ట్‌గ్రోత్ (2011) తో చండీగ District ్ జిల్లాను కూడా చండీగ మునిసిపల్ కార్పొరేషన్‌గా పరిపాలనాపరంగా ప్రకటించారు. చండీగ Railway ్ రైల్వే స్టేషన్‌లో ప్రతిరోజూ 66 రైళ్లు ప్రయాణిస్తున్నాయి, కాబట్టి దీనిని గ్రేడ్ బి రైల్వే స్టేషన్‌గా పరిగణిస్తారు.

భారతదేశంలో అత్యధికంగా వాహనాలను ఉపయోగిస్తున్న నగరాలలో చండీగఢ్‌కు ప్రధమస్థానం. వెడల్పైన రహదార్లు, చక్కని నిర్వహణ మార్గమంతా వాహనాల పాత్కింగ్ సౌకర్యం ఉండడం ఇందుకు కారణమని భావించవచ్చు.  ది చంఢీగఢ్ ట్రాంస్‌పోర్ట్  ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్స్ నుండి ప్రభుత్వ బసులను నిర్వహించే అధికారాన్ని అందుకున్నది. ఇది సెక్టర్లలో 17 , నగరంలో 43 బస్సులను నడుపుతుంది. సి.టి.యు పొరుగు రాష్ట్రాలైన పంజాబు , హర్యానా, హిమాచల్ ప్రదేశ్ , ఢిల్లీలకు కూడా బస్సు సేవలనను అందిస్తుంది. చండీగఢ్ జాతీయరహదారి 22 , జాయీయరాదారి 21తో రోడ్డు ద్వారా అనుసంధానం చేస్తుంది. చండీగఢ్ రైల్వేస్టేషన్ ఇండియన్ రైల్వే నార్తన్ రైల్వే జోన్‌లో ఉంది. ఇక్కడి నుండి ఢిల్లీ, ముంబై, కొలకత్తా,విశాఖపట్నం,జైపూర్,లక్నో,భోపాల్, ఇండోర్, త్రివేండ్రం , అమృత్‌సర్ వంటి ప్రముఖ నగరాలకు రైలు వసతి కల్పిస్తుంది. అంతేకాక ఇక్కడి నుండి అంబాలా , కొల్లం,పానిపట్, తిరువనంతపురం వంటి దక్షిణ భారతీయ ప్రముఖ నగరాలకు కూడా రైలు వసతి కల్పిస్తుంది.  చంఢీగఢ్ విమానాశ్రయం  భారతీయ ప్రముఖనగరాలకు కమర్షియల్ విమాన సేవలను అందిస్తుంది. ఢిల్లీ, ముంబై, జైపూర్, ఇండోర్ నగరాలకు విమానసేవలు అందిస్తుంది. సరికొత్త అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణదశలో ఉంది. చంఢీగఢ్ మెట్రో రైలు విధానం 2018 నాటికి కార్యరూపం దాల్చనుంది. .




#Article 233: అండమాన్ నికోబార్ దీవులు (1803 words)


భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవులు 572 ద్వీపాల సమూహం. వీటిలో 37 దీవుల్లో ప్రజలు నివసిస్తున్నారు. బంగాళాఖాతం, అండమాన్ సముద్రం కలిసే వద్ద ఈ ద్వీపాల సమూహం ఉంది. భూభాగం విస్తీర్ణం సుమారు 150 చ.కి.మీ.ఇండోనేషియాలోని ఆషేకు ఉత్తరంగా ఉంది. ఈ దీవులను థాయిలాండ్, మయన్మార్ నుండి అండమాన్ సముద్రం వేరు చేస్తోంది. ఇందులో రెండు ద్వీప సమూహాలున్నాయి - అండమాన్ దీవులు (పాక్షికంగా), నికోబార్ దీవులు, వీటిని 150 కిలోమీటర్ల వెడల్పు గల టెన్ డిగ్రీ ఛానల్ (10 ° N సమాంతరం ) వేరుచేస్తోంది. ఈ అక్షాంశానికి ఉత్తరాన అండమాన్లు, దక్షిణాన నికోబార్లు (వీటి మధ్య దూరం 179 కిమీ) ఉన్నాయి. ఈ దీవులకు తూర్పున అండమాన్ సముద్రం, పశ్చిమాన బంగాళాఖాతం ఉంది.

ఈ కేంద్రపాలిత ప్రాంతానికి రాజధాని పోర్ట్ బ్లెయిర్ నగరం. ద్వీపాల మొత్తం భూభాగం సుమారు 8,249 చ.కి.మీ ఉంటుంది. ఈ భూభాగాన్ని మూడు జిల్లాలుగా విభజించారు: కార్ నికోబార్‌ రాజధానిగా నికోబార్ జిల్లా, పోర్ట్ బ్లెయిర్‌తో రాజధానిగా దక్షిణ అండమాన్ జిల్లా, మాయాబందర్‌ రాజధానిగా ఉత్తర మధ్య అండమాన్ జిల్లా.ఈ ద్వీపాల్లో భారత సాయుధ దళాలకు చెందిన అండమాన్ నికోబార్ కమాండ్‌ ఉంది. త్రివిధ దళాలకు చెందిన భౌగోళిక కమాండు ఇదొక్కటే.అండమాన్ ద్వీపాల్లో సెంటినెలీస్ ప్రజలు నివాసముంటారు. నాగరికత స్పృశించని మానవులు వీరు ఇప్పటకీ పాతరాతియుగపు స్థాయి లోనే ఇంకా జీవిస్తున్న మానవులు వీరొక్కరే. 

అండమాన్ అను పేరు హండుమాన్ అను పదంనుండి పుట్టింది. మలయా భాషలో హిందూ దేవుడు హనుమాన్ లేదా హనుమంతుడిని హండుమాన్ అని పిలుస్తారు.మలయా భాషలో నికోబార్ అనగా నగ్న మనుషుల భూమి.

సుమారు 2,200 సంవత్సరాల నాటి చరిత్రకు పురావస్తు ఆధారాలున్నాయి. అయితే, 30,000 సంవత్సరాల క్రితం ముగిసిన మధ్య పాతరాతియుగ సమయంలో దేశీయ అండమానీస్ ప్రజలు ఇతర జనాభా నుండి విడివడి ఉండవచ్చని జన్యు, సాంస్కృతిక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆ సమయం నుండి, అండమానీయులు భాషాపరంగా, సాంస్కృతికంగా విభిన్నమైన, ప్రాదేశిక సమూహాలుగా పరిణమించారు.

నికోబార్ దీవుల్లో వివిధ నేపథ్యాల ప్రజలు ఉంటున్నట్లు కనిపిస్తుంది. యూరోపియన్లు వచ్చే సమయానికి స్వదేశీ నివాసులు, మోన్-ఖ్మెర్ భాష మాట్లాడే నికోబారు ప్రజలతోతీ, షాంపెన్‌ల (వీరు మాట్లాడే భాష దేనికి సంబంధించినదో తెలియదు) తోటీ మిళితమైపోయారు. వీటిలో ఏ భాష కూడా అండమానీయులకు సంబంధించినది కాదు.

మొదటి రాజేంద్ర చోళుడు (క్రీ.శ. 1014 నుండి 1042 వరకు), శ్రీవిజయ సామ్రాజ్యంపై (ఆధునిక ఇండోనేషియా) చేసిన దండయాత్రను మొదలుపెట్టేటపుడు అండమాన్ నికోబార్ దీవులను వ్యూహాత్మక నావికా స్థావరంగా ఉపయోగించాడు. క్రీస్తుశకం 1050 నాటి తంజావూర్ శాసనంలో చోళులు ఈ ద్వీపాన్ని మ-ణక్కవరం (గొప్ప బహిరంగ/నగ్న భూమి) అని పిలిచారు. యూరోపియన్ యాత్రికుడు మార్కో పోలో (12 వ -13 వ శతాబ్దం) ఈ ద్వీపాన్ని 'నెకువెరాన్' అని అన్నాడు. తమిళ పేరైన నక్కవరం బ్రిటిష్ వలసరాజ్యాల కాలంలో నికోబార్ అనే ఆధునిక పేరుకు దారితీసి ఉండవచ్చు. 

డెన్మార్క్ నికోబార్ దీవులపై తన వాదనలను విరమించుకుందని పొరపాటున భావించిన ఆస్ట్రియా, 1778 జూన్ 1 నుండి 1784 వరకు వాటిపై ఒక వలసను స్థాపించడానికి ప్రయత్నించి,  వాటికి థెరేసియా దీవులు అని పేరు పెట్టింది. 

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, ఈ ద్వీపాలు ఆచరణాత్మకంగా జపనీస్ నియంత్రణలో, నామమాత్రంగా సుభాష్ చంద్రబోస్ యొక్క అర్జీ హుకుమాటే ఆజాద్ హింద్ అధికారం క్రింద ఉన్నాయి. యుద్ధ సమయంలో బోసు ఈ ద్వీపాలను సందర్శించి, వాటి పేర్లను షహీద్-ద్వీప్ (అమరవీరుల ద్వీపం) అని, స్వరాజ్-ద్వీప్ (స్వీయ-పాలన ద్వీపం) అనీ మార్చాడు.

జపాన్ వైస్ అడ్మిరల్ హరా టీజో, మేజర్-జనరల్ తమెనోరి సాటోలు, 1945 అక్టోబరు 7 న పోర్ట్‌బ్లెయిర్‌ లోని జిమ్ఖానా గ్రౌండులో నిర్వహించిన కార్యక్రమంలో ఈ ద్వీపాలను 116 వ భారత పదాతిదళ బ్రిగేడ్ కమాండర్ బ్రిగేడియర్ జెఎ సాలమన్స్‌కు, ఇండియన్ సివిల్ సర్వీస్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ నోయెల్ కే ప్యాటర్సన్ కూ అప్పగించారు.

భారతదేశం (1947), బర్మా (1948) రెండింటి స్వాతంత్య్రం సమయంలో, వెనకి పోతున్న బ్రిటిషు వారు ఈ ద్వీపాల్లోని ఆంగ్లో-ఇండియన్స్, ఆంగ్లో-బర్మీస్ అందరూ ఈ ద్వీపాల్లో స్థిరపడి తమ సొంత దేశంగా ఏర్పరచుకోవాలని తమ ఉద్దేశాన్ని ప్రకటించారు. అయితే, ఇది ఎప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఇది 1950 లో భారతదేశంలో భాగమైంది. 1956 లో దేశపు కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. 

సునామీలో ప్రాణాలు కోల్పోయిన వారిలో అత్యధికులు ద్వీపాల్లో బయటి నుండి వచ్చి ఇకడ స్థిరపడ్డవారు, పర్యాటకులే. ఆదివాసీ ప్రజలు చాలావరకూ ప్రాణాలతో బయటపడ్డారు. ఎందుకంటే పెద్ద భూకంపాలను అనుసరించి పెద్ద సునామీలు వస్తాయని తరతరాలుగా వస్తున్న మౌఖిక సంప్రదాయాలు వారిని ఖాళీచెయ్యమని హెచ్చరించాయి. 

ఈ భూభాగంలో మొత్తం 8.249 చ.కి.మీ విస్తీర్ణం గల 572 ద్వీపాలు  ఉన్నాయి. వీటిలో సుమారు 38 దీవుల్లో ప్రజలు నివసిస్తున్నారు. ఈ ద్వీపాలు 6° నుండి 14° ఉత్తర అక్షాంశాల మధ్య, 92° నుండి 94° తూర్పు రేఖాంశాల మధ్యా విస్తరించి ఉన్నాయి. అండమాన్లను నికోబార్ సమూహం నుండి 150 కి.మీ. వెడల్పున్న ఛానల్ ( టెన్ డిగ్రీ ఛానల్ ) వేరు చేస్తుంది. అత్యంత ఎత్తైన ప్రదేశం ఉత్తర అండమాన్ ద్వీపంలో ఉన్న సాడిల్ పీక్ (732 మీటర్లు). అండమాన్ సమూహంలో 325 ద్వీపాలు ఉన్నాయి. వీటి విస్తీర్ణం 6,170 చ.కి.మీ. నికోబార్ సమూహంలో 1,765 చ.కి.మీ. విస్తీర్ణంలో 247 దీవులున్నాయి.  

ఈ కేంద్రపాలిత ప్రాంతపు రాజధాని పోర్ట్ బ్లెయిర్ కోల్‌కతా నుండి 1,255 కి.మీ దూరం లోను, విశాఖపట్నం నుండి 1,200 కి.మీ., చెన్నై నుండి 1,190 కి.మీ. దూరం లోనూ ఉంది.   అండమాన్ నికోబార్ సమూహానికి ఉత్తర కొనన స్థానం హుగ్లీ నది ముఖద్వారం నుండి 901 కి.మీ. దూరం లోను, మయన్మార్ నుండి 190 కి.మీ. దూరం లోనూ ఉంది. అన్నిటి కంటే దక్షిణాన ఉన్న దీవి, గ్రేట్ నికోబార్. ఈ దీవి లోని దక్షిణ కొసన (6° 45'10 ″ N - 93° 49'36 ″ E) ఉన్న ఇందిరా పాయింట్ భారతదేశానికి దక్షిణం వైపున చిట్టచివరి స్థానం. ఇండోనేషియాలోని సుమత్రా దీవి నుండి దీని దూరం 150 కి.మీ. మాత్రమే.

భారతదేశంలోని ఏకైక అగ్నిపర్వతం, బారెన్ ఐలాండ్, అండమాన్ నికోబార్లలో ఉంది. ఇది చురుకైన అగ్నిపర్వతం. చివరిగా 2017 లో విస్ఫోటనం చెందింది. బరాటాంగ్ ద్వీపంలో ఒక మట్టి అగ్నిపర్వతం కూడా ఉంది, ఈ మట్టి అగ్నిపర్వతాలు అప్పుడప్పుడు విస్ఫోటనం చెందాయి, 2005 లో జరిగిన విస్ఫోటనాలు 2004 హిందూ మహాసముద్రం భూకంపంతో సంబంధం కలిగి ఉన్నాయని భావిస్తున్నారు. అంతకు ముందరి పెద్ద విస్ఫోటనం 2003 ఫిబ్రవరి 18 న నమోదైంది. స్థానికులు ఈ మట్టి అగ్నిపర్వతాన్ని జల్కీ అని పిలుస్తారు . ఈ ప్రాంతంలో ఇతర అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఈ ద్వీపం భౌతిక విశేషాల్లో కొన్ని బీచ్‌లు, మడ అడవులు, సున్నపురాయి గుహలు, మట్టి అగ్నిపర్వతాలు.

సిస్టర్స్ అనేవి రెండు చిన్న జనావాసాలు లేని ద్వీపాలు. తూర్పు సిస్టర్ ద్వీపం, వెస్ట్ సిస్టర్ ద్వీపం, అండమాన్ ద్వీపసమూహంలో, డంకన్ పాసేజ్‌కు ఉత్తరం వైపున, సుమారు పాసేజ్ ద్వీపానికి 6 కి.మీ. ఆగ్నేయంగా, నార్త్ బ్రదర్‌కు 18 కి.మీ. ఉత్తరాన ఉన్నాయి. ఈ ద్వీపాల మధ్య ఎడం 250 మీటర్లు. వీటిని పగడపు దిబ్బలు కలుపుతాయి. ఈ దీవులు అడవులతో నిండి ఉంటాయి. తూర్పు సిస్టర్ ద్వీపపు వాయవ్య భాగంలో ఒక బీచ్ మినహా మిగతా తీరమంతా రాళ్ళతో కూడుకుని ఉంటుంది.

అండమాన్‌లో బ్రిటిష్ వారు ఒక కాలనీని స్థాపించడానికి ముందు, లిటిల్ అండమాన్ ద్వీపంలోని ఒంగే ప్రజలు చేపలు పట్టడం కోసం సిస్టర్స్‌ దీవులకు అప్పుడప్పుడు వెళ్తూండేవారు. 1890 - 1930 మధ్యకాలంలో తమ తాత్కాలిక స్థావరమైన రట్లాండ్ ద్వీపానికి వెళ్ళే మార్గంలో ఈ ద్వీపాలు ఒక స్థానంగా ఉండవచ్చు.1987 లో ఈ ద్వీపాలను 0.36 చ.కి.మీ. ప్రాంతాన్ని వన్యప్రాణుల ఆశ్రయంగా గుర్తించారు.

అండమాన్‌ నికోబార్‌ దీవులకు వెళ్లాలంటే ముందుగా వాటి రాజధాని పోర్ట్‌ బ్లెయిర్‌ చేరుకోవాలి. అక్కడికి చెన్నై, కోల్‌కతా ల నుంచి విమాన సర్వీసులున్నాయి. ఓడలోనూ వెళ్లొచ్చు. ప్రయాణం కనీసం మూడు రోజులు పడుతుంది. బంగాళాఖాతంలో దాదాపు 8,249 చదరపు కిలోమీటర్ల మేర ఈ అండమాన్‌ నికోబార్‌ దీవులు విస్తరించి ఉన్నాయి. మొత్తం 572 దీవులు సముద్రంలో అక్కడక్కడా విసిరేసినట్టు ఉంటాయి. వీటిల్లో అండమాన్‌ దీవుల్లోకి మాత్రమే పర్యాటకుల్ని అనుమతిస్తారు. నికోబార్‌ దీవులలోనికి ప్రవేశం లేదు.

అండమాన్ నికోబార్ దీవులను ఉష్ణమండల వర్షారణ్య పందిరి కప్పేసి ఉంటుంది. ఇది భారతీయ, మయన్మార్, మలేషియా స్థానిక జాతులసమ్మిశ్రితంగా ఉంటుంది. ఇప్పటివరకు, సుమారు 2,200 రకాల మొక్కలు నమోదయ్యాయి, వాటిలో 200 స్థానికంగా మాత్రమే ఉంటాయి. మరో 1,300 భారతదేశం ప్రధాన భూభాగంలో ఎక్కడా కనబడవు.

దక్షిణ అండమాన్ అడవులలో ఎపిఫైటిక్ వృక్షసంపద, ఎక్కువగా ఫెర్న్‌లు, ఆర్కిడ్లు పెరుగుతాయి. మధ్య అండమాన్ లో ఎక్కువగా తేమతో కూడిన ఆకురాల్చే అడవు లున్నాయి . ఉత్తర అండమాన్లలో తడి సతత హరిత అడవులు ఉన్నాయి. ఉత్తర నికోబార్ దీవుల్లో (కార్ నికోబార్, బాటిమల్వ్‌తో సహా) సతత హరిత అడవులు అసలే లేవు. అయితే నికోబార్ సమూహం లోని మధ్య, దక్షిణ ద్వీపాలలో ఇటువంటి అడవులు అధికంగా ఉన్నాయి. గడ్డి భూములు నికోబార్లలో మాత్రమే ఉంటాయి. అండమాన్లలో ఆకురాల్చే అడవులు సర్వసాధారణంగా ఉంటాయి. అవి నికోబార్లలో దాదాపుగా లేవు. ప్రస్తుత అటవీ విస్తీర్ణం మొత్తం భూభాగంలో 86.2% అని పేర్కొన్నారు.

ఈ విలక్షణమైన అటవీ కవరేజి పన్నెండు రకాలుగా ఉంటుంది, అవి:

ఈ ఉష్ణమండల వర్షారణ్యం, ఇతర భూభాగాల నుండి విడిగా, ఒంటరిగా ఉన్నప్పటికీ, ఇక్కడ ఉన్న గొప్ప జీవ వైవిధ్యం ఆశ్చర్యం కలిగిస్తుంది.అండమాన్ నికోబార్ దీవులలో సుమారు 50 రకాల అటవీ క్షీరదాలు కనిపిస్తాయి. అండమాన్ అడవి పందితో సహా కొన్ని స్థానిక జాతులు ఉన్నాయి. 26 జాతులతో ఎలుకలు అతిపెద్ద సమూహం. తరువాతవి 14 జాతుల గబ్బిలాలు. పెద్ద క్షీరదాలలో స్థానికంగా ఉండే అడవి పంది రకాలు రెండున్నాయి. అవి అండమాన్ దీవుల్లోని సుస్ స్క్రోఫా ఆండమానెన్సిస్, నికోబార్ లోని సుస్ స్క్రోఫా నికోబారికస్. వీటిని వన్యప్రాణి రక్షణ చట్టం 1972 (Sch I) ద్వారా సంరక్షించారు. ఉప్పునీటి మొసలి కూడా సమృద్ధిగా లభిస్తుంది. అండమాన్ రాష్ట్ర జంతువు డుగోంగ్. దీనిని సముద్ర ఆవు అని కూడా పిలుస్తారు. దీనిని లిటిల్ అండమాన్ లో చూడవచ్చు. 1962 లో ఈ దీవుల్లోకి చిరుతపులిని పరిచయం చేసే ప్రయత్నం జరిగింది. కాని దానికి అనుకూలమైన ఆవాసం కాకపోవడాన ఆ ప్రయత్నం విజయవంతం కాలేదు. అన్యదేశ పరిచయాలు ద్వీప వృక్ష, జంతుజాలానికి వినాశనం కలిగించగలవు కాబట్టి ఈ చర్యలు సరైనవి కావు.

సుమారు 270 జాతుల పక్షులు ఇక్కడ కనిపిస్తాయి; వాటిలో 14 స్థానికమైనవి - వీటిలో అధిక భాగం నికోబార్ ద్వీప సమూహానికి చెందినవి. ద్వీపాల్లోని అనేక గుహల్లో తినదగిన పక్షి గూళ్ళు కనిపిస్తాయి. ఈ గూళ్ళు చైనాలో ఇష్టంగా తింటారు. 

ఈ భూభాగంలో సుమారు 225 రకాల సీతాకోకచిలుకలు, చిమ్మటలు ఉన్నాయి . ఈ ద్వీపాలకు స్థానికమైనవి పది జాతులు ఉన్నాయి. మౌంట్ హ్యారియెట్ నేషనల్ పార్క్ లో అనేక రకాల సీతాకోకచిలుకలు, చిమ్మటలూ ఉంటాయి.

ఈ ద్వీపాలు విలువైన షెల్ఫిష్‌లకు ప్రసిద్ధి. ముఖ్యంగా టర్బో, ట్రోకస్, మురెక్స్, నాటిలస్ జాతులకు చెందినవి. మొట్టమొదటిగా వాణిజ్య స్థాయిలో చేపలు పట్టడం 1929 లో ప్రారంభమైంది. అనేక కుటీర పరిశ్రమలు అలంకార షెల్ వస్తువులను ఉత్పత్తి చేస్తాయి

మూడు జిల్లాల విస్తీర్ణం, జనాభా (2001 2011 జనాభా లెక్కల ప్రకారం)  :

అండమాన్ దీవుల్లో సుమారు 400–450 స్వదేశీ అండమానీస్ ఉన్నారు. ప్రత్యేకించి జరావా, సెంటినెలీస్‌ ద్వీపాల్లో ఉన్నవారు తమ స్వేచ్ఛను కొనసాగిస్తూ, తమను కలవవచ్చే వారి ప్రయత్నాలను తిరస్కరిస్తున్నారు. నికోబార్ దీవులలోని స్థానిక ప్రజలను నికోబారీస్, లేదా నికోబారి అంటారు. వీరు అనేక ద్వీపాలలో నివసిస్తున్నారు. షోంపెన్ ప్రజలు గ్రేట్ నికోబార్ లోని అంతర్గత ప్రాంతానికే పరిమితం. కారెన్ తెగకు చెందిన 2 వేలకు పైగా ప్రజలు ఉత్తర అండమాన్ జిల్లాలోని మాయాబందర్ తహసీల్‌లో నివసిస్తున్నారు. వీరిలో దాదాపు అందరూ క్రైస్తవులే. గిరిజన మూలాలు ఉన్నప్పటికీ, కారెన్‌లకు అండమాన్‌లో ఇతర వెనుకబడిన తరగతి (ఒబిసి) హోదా ఉంది.

అండమాన్ నికోబార్ దీవులలో బెంగాలీ ఎక్కువగా మాట్లాడుతారు. అధికారిక భాష హిందీ. కమ్యూనికేషన్ ప్రయోజనాల కోసం ఇంగ్లీషును అదనపు అధికారిక భాషగా ప్రకటించారు.  2011 జనాభా లెక్కల ప్రకారం, బెంగాలీ కేంద్ర పాలిత జనాభాలో 28,49 శాతం మొదటి భాషగా మాట్లాడతారు. ఆ తరువాత హిందీ (19.29%), తమిళ (15.20%), తెలుగు (13.24%), నికోబారీస్ (7.65%), మలయాళం (7.22% ) వస్తాయి. 

అండమాన్ నికోబార్ దీవులలో ఎక్కువ మంది ప్రజలు హిందువులు (69.44%), క్రైస్తవులు జనాభాలో 21.7% మందితో అతిపెద్ద మైనారిటీ. 2011 భారతదేశ జనాభా లెక్కల ప్రకారం ముస్లిములు (8.51%) ఉన్నారు.

అండమాన్ నికోబార్ దీవులను మూడు జిల్లాలుగా విభజించారు:

మొత్తం 1,20,280 ఎకరాల భూమి సాగులో ఉంది. వరి, ప్రధాన ఆహార పంట. ఎక్కువగా కొబ్బరి అయితే, అండమాన్ ద్వీపాల సమూహంలో వరి ఎక్కువగా పండిస్తారు. నికోబార్ దీవుల్లో కొబ్బరి, వక్క వంటి వాణిజ్య పంటలు పండిస్తారు. పప్పుధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలూ పండిస్తారు. దాళవా సీజన్లో వరి సాగు చేస్తారు.. మామిడి, సపోటా, నారింజ, అరటి, బొప్పాయి, పైనాపిల్, రూట్ పంటలు వంటి వివిధ రకాల పండ్లను రైతుల యాజమాన్యంలోని కొండ భూమిలో పండిస్తారు. మిరియాలు, లవంగం, జాజికాయ, దాల్చినచెక్క వంటి సుగంధ ద్రవ్యాలను కొండవాలుల్లో బహుళ అంతస్తుల పంటల పద్ధతిలో పండిస్తారు. ఈ ద్వీపాలలో రబ్బరు, ఎర్ర నూనె, తాటి, నోని, జీడిపప్పులను పరిమిత స్థాయిలో పండిస్తారు.

అండమాన్ నికోబార్ దీవుల ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పర్యాటక, మత్స్య, పరిశ్రమలు, పారిశ్రామిక ఫైనాన్సింగ్ రంగాలలో విస్తరించింది. అలయన్స్ ఎయిర్ కోసం అధీకృత ఏజెంట్లుగా పనిచేస్తుంది. ఇంకా స్వచ్ఛంగానే ఉన్న బీచ్‌లు, నీళ్ళ వలన ద్వీపాలు పర్యాటక కేంద్రంగా మారాయి 

అండమాన్ నికోబార్ దీవులు ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నాయి. సూందరమైన బీచ్‌లు, సహజమైన ద్వీపాలు అంతే అందమైన పేర్లతో, స్నార్కెలింగ్ సముద్ర నడక వంటి సాహస క్రీడలకు అద్భుతమైన అవకాశాలు కలిగిస్తున్నాయి.  ఎన్ఐటిఐ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా) ఆయోగ్ కింద వివిధ ద్వీపాలను అభివృద్ధి చేసే ప్రణాళికలు కూడా పురోగతిలో ఉన్నాయి. అవిస్ ఐలాండ్, స్మిత్ ఐలాండ్, లాంగ్ ఐలాండ్ లలో ప్రభుత్వ భాగస్వామ్యంలో లగ్జరీ రిసార్ట్స్ ఏర్పాటు చేసారు.  అండమాన్ నికోబార్ దీవులలోని సౌత్ బటన్ నేషనల్ పార్క్ భారతదేశంలో అతిచిన్న జాతీయ ఉద్యానవనం.

పోర్ట్ బ్లెయిర్‌లో, సెల్యులార్ జైలు, మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్, అండమాన్ వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, చాతం సా మిల్, మినీ జూ, కార్బిన్స్ కోవ్, చిడియా టాపు, వాండూర్ బీచ్, ఫారెస్ట్ మ్యూజియం, ఆంత్రోపోలాజికల్ మ్యూజియం, ఫిషరీస్ మ్యూజియం, నావల్ మ్యూజియం (సముద్రికా), రాస్ ఐలాండ్, నార్త్ బే ఐలాండ్ లు ముఖ్యమైన చూడదగ్గ ప్రదేశాలు. ఇంతకు ముందు సందర్శించిన వైపర్ ద్వీపాన్ని ఇప్పుడు మూసివేసారు. ఇతర ప్రదేశాలలో రాధనగర్ బీచ్‌కు ప్రసిద్ధి చెందిన హావ్‌లాక్ ద్వీపం, స్కూబా డైవింగ్ / స్నార్కెలింగ్ / సీ వాకింగ్ కోసం నీల్ ఐలాండ్, సిన్క్యూ ఐలాండ్, సాడిల్ పీక్, మౌంట్ హ్యారియెట్, బురద అగ్నిపర్వతం ఉన్నాయి. ఉత్తర అండమాన్ వద్ద ఉన్న డిగ్లిపూర్ కూడా 2018 లో ప్రాచుర్యం పొందింది. చాలా మంది పర్యాటకులు ఉత్తర అండమాన్‌ను సందర్శించడం ప్రారంభించారు. దక్షిణ సమూహం (నికోబార్ దీవులు) పర్యాటకులకు ఎక్కువగా అందుబాటులో ఉండదు.

భారత పర్యాటకులకు అండమాన్ దీవులను సందర్శించడానికి అనుమతి అవసరం లేదు, కానీ వారు ఏదైనా గిరిజన ప్రాంతాలను సందర్శించాలనుకుంటే వారికి పోర్ట్ బ్లెయిర్‌లోని డిప్యూటీ కమిషనర్ నుండి ప్రత్యేక అనుమతి అవసరం. విదేశీ పౌరులకు అనుమతులు అవసరం. విమానంలో వచ్చే విదేశీ పౌరులకు, పోర్ట్ బ్లెయిర్ వద్దకు వచ్చిన తరువాత వీటిని మంజూరు చేస్తారు.

అధికారిక అంచనాల ప్రకారం, పర్యాటకుల ప్రవాహం 2008-09లో 1,30,000 నుండి 2016-17లో దాదాపు 4,30,000 కు పెరిగింది. రాధా నగర్ బీచ్ 2004 లో ఆసియా లోనే ఉత్తమ బీచ్ గా ఎంపికైంది. 

అండమాన్ నికోబార్ దీవుల స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జిఎస్‌డిపి) మార్కెట్ ధరల ధోరణి యొక్క చార్ట్ ఇది, గణాంకాలు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ వేసిన అంచనా, కోట్ల రూపాయిల్లో. 

అండమాన్ నికోబార్ దీవుల స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి 2004 లో ప్రస్తుత ధరలలో 4354 మిలియన్లుగా అంచనా వేయబడింది.

జపనీస్ సహాయంతో, దక్షిణ అండమాన్ ద్వీపంలో ఇప్పుడు 15 మెగావాట్ల డీజిల్ విద్యుత్ ప్లాంట్ పనిచేస్తోంది. వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఈ దీవుల్లో అనుమతి పొందిన మొట్టమొదటి విదేశీ పెట్టుబడి ఇది. ఇది మలాకా జలసంధి పరిసరాల్లో పౌర మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఇండో-జపనీస్ వ్యూహాత్మక చొరవ అని నమ్ముతారు - ఇది చైనా చమురు సరఫరాకు వ్యూహాత్మకంగా ముఖ్యమైన చోక్ పాయింట్.  

ద్వీపాలలో ఇంటర్నెట్ సదుపాయం పరిమితంగా ఉంటుంది. బాహ్య ప్రపంచానికి అన్ని కనెక్టివిటీలు ఉపగ్రహ లింకుల ద్వారానే వెళ్ళాలి కాబట్టి ఈ కనెక్టివిటీ కూడా అంత నమ్మకంగా ఉండదు. భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ ఇక్కడి ఐదు ద్వీపాల నుండి చెన్నై వరకు ఫైబర్ ఆప్టిక్ జలాంతర్గామి కేబుల్‌ను నిర్మిస్తోంది, 2019 డిసెంబరులో పూర్తవుతుంది.  ప్రారంభ బ్యాండ్‌విడ్త్ 400  డేటా-రేటు యూనిట్లు పరకారం ఉంటుంది, ఇది ప్రస్తుతం ఈ దివుల్లో ఉన్న బ్యాండ్‌విడ్తు కంటే 400 రెట్లు ఎక్కువ. 




#Article 234: ఢిల్లీ (527 words)


ఢిల్లీ వ్యాసం ఆరంభంలో మూడు వేరు వేరు పదాలగురించి తెలుసుకోవాలి.జాతీయ రాజధాని ప్రదేశం (నేషనల్ కేపిటల్ టెర్రిటరీ). ఇది చట్టపరంగా ఏర్పాటు చేయబడిన ప్రదేశం. ఇందులో ప్రధాన విభాగాలు. జాతీయ రాజధాని ప్రదేశం ఒక కేంద్రపాలిత ప్రాంతంగా 1956 నవంబరు 1న ఏర్పాటు చేయబడింది. దేశం నలుమూలలనుండి రాజధాని నగరానికి ప్రజలు వలస వస్తుండడంవల్ల అక్కడ జనం వత్తిడి విపరీతంగా పెరుగుతుంది. అందువలన చుట్టుప్రక్కల నగరాలను స్వతంత్రంగా అభివృద్ధి చేయాలనే అభిప్రాయంతో జాతీయ రాజధాని ప్రదేశాన్ని ఏర్పరచారు.

ఢిల్లీ కేంద్రంగా ఎన్నో వేల సంవత్సరాల చరిత్రలో ఎన్నో సామ్రాజ్యాలు వెలసినాయి, పతనమైనాయి. మహాభారతంలో పాండవుల రాజధాని ఇంద్రప్రస్థం అని ఈ నగరాన్ని ప్రస్తావించారు. 19వ శతాబ్దారంభం వరకు ఇందర్‌పాత్ అనే గ్రామం ఇక్కడ ఉండేది. బ్రిటిష్‌వారి క్రొత్త రాజధాని నిర్మాణంలో ఆ గ్రామం కనుమరుగయ్యింది. క్రీ.పూ. 1000 సంవత్సరాల నాటి రంగువేసిన కూజాలు త్రవ్వకాలలో బయటపడినాయి. పురావస్తు పరిశోధనా సంస్థ (ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) వారి అంచనాల ప్రకారం వేల సంవత్సరాలలో నిర్మించిన చారిత్రిక కట్టడాలు 60,000 పైగా ఢిల్లీలో ఉన్నాయి. ఇటీవలి చరిత్రలోనే ఏడు సామ్రాజ్యాల రాజధానిగా ఢిల్లీని వర్ణిస్తారు.

ఒక ప్రక్క గంగా-యమునా మైదానానికి, మరొక ప్రక్క ఆరావళీ-వింధ్య పర్వత శ్రేణులకు మధ్య ప్రాంతంలో ఉన్నందున పురాతన కాలం నుండి ఢిల్లీ ప్రధాన వర్తక మార్గాలకు కూడలిగా ఉంది. ఆ కారణంగానే అక్కడ రాజ్యాధికారాలు, విద్య, సంస్కృతి వర్ధిల్లాయి.

మౌర్యసామ్రాజ్యం కాలం నాటి (క్రీ.పూ. 300) ఆధారాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. అప్పటినుండి ఢిల్లీ అవిచ్ఛిన్నంగా జనావాసంగా వర్ధిల్లింది. శ్రీనివాసపురి ప్రాంతంలో అశోకుని కాలంనాటి శాసనం 1966లో కనుగొన్నారు. ఫిరోజ్‌షా తుగ్లక్ రెండు అశోకుని కాలంనాటి శాసన స్తంభాలను ఢిల్లీకి తెచ్చాడు. కుతుబ్ మినార్ వద్ద ప్రసిద్ధి చెందిన ఉక్కు స్తంభం గుప్తవంశము, కుమారగుప్తుడు క్రీ.శ. 320-540 మధ్యకాలంలో తయారు చేయించబడింది. దానిని 10వ శతాబ్దంలో ఢిల్లీకి తెచ్చారు.

ఢిల్లీ ప్రాంతంలో 8 ప్రధాన నగరాలు వర్ధిల్లాయి. వాటిలో 4 ఇప్పటి ఢిల్లీకి దక్షిణాన ఉన్నాయి.

మధ్యకాలపు చరిత్రనుండి చూస్తే ఢిల్లీలో 7 నగరాలను గుర్తింపవచ్చును. కొన్నింటి అవశేషాలు ఇప్పటికీ ఉన్నాయి.

ఢిల్లీ జాతీయ రాజధాని ప్రదేశం 1483 చ.కి.మీ. వైశాల్యంలో విస్తరించి ఉంది. ఈ ప్రదేశం అత్యధిక పొడవు 51.9 కి.మీ., అత్యధిక వెడల్పు 48.48 కి.మీ. మొత్తం 1483 చ.కి.మీ.లలో 783 చ.కి.మీ. గ్రామీణ ప్రాంతం, 700 చ.కి.మీ. పట్టణ ప్రాంతం. మూడు స్థానిక నగర పాలనా సంస్థలున్నాయి. అవి 

ఆధారం: 

జాతీయ రాజధాని ప్రదేశం ఒక కేంద్రపాలిత ప్రాంతంగా 1956 నవంబరు 1న ఏర్పాటు చేయబడింది. 1991లో జాతీయ రాజధాని ప్రదేశానికి (ఢిల్లీకు) ఒక అసెంబ్లీ (విధాన సభ), ఒక ముఖ్యమంత్రి ఏర్పాటు ఆమోదింపబడింది. ఈ విధమైన విధానం ఢిల్లీకి, పుదుచ్చేరికి మాత్రమే ఉంది. కనుక ఢిల్లీ పూర్తిగా కేంద్రపాలిత ప్రాంతమనిగాని, పూర్తిగా రాష్ట్రమనిగాని అనడం కుదరదు.కాలక్రమంగా ఢిల్లీ ఒక పూర్తి రాష్ట్రం కావాలని ప్రణాళిక

జాతీయ రాజధాని ప్రదేశం ప్రత్యేకత ఏమంటే - పోలీసు, పాలన వంటి కొన్ని ప్రధాన బాధ్యతలు ప్రధానంగా కేంద్రప్రభుత్వం అధీనంలో ఉంటాయి. మునిసిపల్ వ్యవహారాలు స్థానికంగా ఎన్నుకొనబడిన ప్రభుత్వం చూస్తుంది.

ఢిల్లీని 9 జిల్లాలుగా విభజించారు. ఢిల్లీనుండి పార్లమెంటు లోక్‌సభకు 7గురు సభ్యులు, రాజ్యసభకు ముగ్గురు సభ్యులు ఎన్నుకొనబడుతారు.

ఢిల్లీ స్థూల రాష్ట్రోత్పత్తి (మార్కెట్ ధరల ప్రకారం) క్రిది పట్టికలో ఇవ్వబడింది (మిలియన్ రూపాయలలో)..

వాణిజ్య సంస్థలలో 12% సంస్థలకు ప్రధాన కార్యాలయాలు ఢిల్లీలో ఉన్నాయి.ఆర్ధికంగా బాగా సంపన్నమైన నగర ప్రదేశాలలో ఢిల్లీ ఒకటి. ఉదాహరణకు, మిగిలిన 4 మహానగరాలు (బెంగళూరు, కొలకత్తా, చెన్నై, ముంబై) అన్నింటి మొత్తంకంటే ఢిల్లీలో ఎక్కువ కార్లున్నాయని అంచనా. ఇటీవలికాలంలో బహుళజాతి వాణిజ్య సంస్థలకు ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలు ఆకర్క్షణీయమైన ప్రారంభ స్థలాలయ్యాయి. దేశంలో కార్లు, వార్తాసాధనాలు, గృహోపకరణాలు అందించే కంపెనీలు ఢిల్లీ పరిసరాలలో బాగా ఉన్నాయి. ఇక్కడి మంచి విద్యావకాశాలవలన విజ్ఞానం ప్రధానవనరుగా ఉండే పారిశ్రామిక,వాణిజ్య వ్యవస్థలు కూడా ఢిల్లీలో బాగా వృద్ధి చెందుతున్నాయి.

విస్తారమైన పాలనా వ్యవస్థ, ప్రభుత్వోద్యోగులు, అన్నిప్రాంతాలనుండివచ్చిన జనులు, 160 పైగా రాయబార కార్యాలయాలు - ఇవన్నీ ఢిల్లీలో వ్యాపారానికి మంచి ఊపునిస్తున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి భారీగా ఉన్నందున దేశంలో ముఖ్యమైన మార్కెట్లలో ఢిల్లీ ఒకటి.

ఢిల్లీ వాతావరణం చలీ, వేడి కూడా ఎక్కువ. ఉష్ణోగ్రతలు −2 నుండి 47 డిగ్రీలు సెంటీగ్రేడు మధ్యలో ఉంటాయి. 

ఢిల్లీలో అన్ని విధాలైన రవాణా సౌకర్యాలు ముమ్మరంగా ఉపయోగింపబడుతున్నాయి. ప్రైవేటు, ప్రభుత్వ రవాణా సౌకర్యాలు- గుఱ్ఱపు బండ్లు, రిక్షాలు, ఆటో రిక్షాలు, మోటర్ సైకిళ్ళు, కార్లు, బస్సులు, లోకల్ రైళ్ళు - అన్ని విధాలైన వాహనాలు విస్తృతంగా వినియోగిస్తారు.

అక్షరాస్యత: పురుషులు 87.3 %, స్త్రీలు 74.7%, మొత్తం మీద 81.7%  జాతీయ రాజధాని ప్రదేశం విద్యా డైరెక్టరేటు (డైరెక్ట్ర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ ) అధీనంలో ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలు నడుస్థాయి..రాజధాని, మహానగరము, వాణిజ్య, వ్యాపార కేంద్రము అయినందున ఢిల్లీలో అన్నివిధాలైన విద్యావకాశాలు, మంచి ప్రమాణాలు గల విద్యాలయాలు - అన్ని రంగాలలోనూ - మెండుగా ఉన్నాయి.




#Article 235: ఇండోనేషియా (247 words)


ఇండోనేషియా లేదా ఇండోనీషా మలయ్ ద్వీపసముదాయంలో ఉన్న దేశం. మలయ్ ద్వీపాల సముదాయం ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీప సముదాయం, ఇది భారత్ - చైనా , ఆస్ట్రేలియాల మధ్య, ఇండియన్ , ఫసిఫిక్ సముద్రాలలో విస్తరించి ఉంది. ప్రపంచం లోనే ముస్లిం జనాభా అధికంగా ఉన్న దేశం , మొత్తం జనాభా పరంగా నాలుగో స్థానంలో ఉంది. 1965లో అధికారం చేజిక్కించుకున్న జనరల్ సుహార్తో 1998లో జరిగిన ప్రజా విప్లవంతో అధికారం కోల్పోవటంతో ఇక్కడ స్వేచ్ఛా ఎన్నికలు జరుగుతున్నాయి.

హిందూ , బౌద్ధ మత ప్రభావాలతో, 7వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు సుమాత్రా , జావా ద్వీపాలలో కొన్ని రాజ్యములు ఏర్పడ్డాయి. తరువాతి కాలాల్లో భారతీయ గుజరాతీ అరబ్బు వర్తకుల రాకతో ద్వీప సముదాయంలో చాలా చోట్ల ఇస్లాం ప్రబలమైన మతంగా అవతరించి, హిందూ , బౌద్ధ రాజ్యముల పతనానికి దారితీసింది.

ఇండోనేషియా ప్రజలను రెండు గ్రూపులుగా విభజింపవచ్చును. పశ్చిమాన అత్యధికంగా మలయ్ లు, తూర్పున పాపుఅన్ లు, వీరి మూలాల మెలనేసియాకు చెందినవి. ఇండోనేషియాలోని చాలామంది ప్రజలు భాష , ప్రాంతీయ పరంగా జావనీలు (జావా ద్వీపాలకు చెందినవారు), సుందనీలు లేదా బాటక్లు.
ఇండోనేషియాలోని ప్రధాన మతం ఇస్లాం, 2000 గణాంకాల ప్రకారం దాదాపు 89% (88.22%) లు ముస్లింలు. ప్రపంచంలోనే అత్యధిక ముస్లింలు గల దేశంగా పేరొచ్చింది. క్రైస్తవులు (9%), బౌద్ధులు (2%), , హిందువులు (7%).

దాదాపు ప్రజలందరూ 'బహాసా దీరాహ్' తమ ప్రథమ భాషగా మాట్లాడుతారు. కానీ అధికారిక భాష ఇండోనేషియన్ లేదా 'బహాసా-ఇండోనేషియా'. ఇది మలయ్ భాషతో దగ్గర సంబంధాలను కలిగి ఉంది. దాదాపు ఇండోనేషియాలోని అన్ని పాఠశాలలలోనూ ఉపయోగించ బడుతున్నది.

ఇండోనేషియాలోని కళలపై అనేక సంస్కృతుల ప్రభావం ఉంది. ప్రఖ్యాత 'జావనీ' నృత్యాలు, హిందూ సంప్రదాయాలను సంస్కృతులనూ కలిగివున్నది.
ప్రఖ్యాత జావనీ , బాలినీ నృత్యం 'వయాంగ్-కులిత్' అనేక థియేటర్ షోలు, పలు మతపరమైన ఘటనలను చూపెడతాయి. అనేక ద్వీపాలు తమ 'బాతిక్' , 'ఇఖత్' వస్త్రాలకు పేరుగాంచినవి.

సిలాట్ అనునది ఏకైక 'యుద్ధ కళ', ఇది ద్వీపసమూహాలన్నింటిలోనూ ప్రసిద్ధి.

Official Sites (owned and operated by the government of Indonesia and its agencies)

Other Sites (not owned nor operated by the government of Indonesia and its agencies)




#Article 236: రష్యా (9259 words)


రష్యన్ ఫెడరేషన్ లేదా రష్యా అనే దేశం, ఉత్తర ఆసియా, తూర్పు ఐరోపా ఖండాల్లో విస్తరించి ఉంది. వైశాల్యములో రష్యా, ప్రపంచములో రెండవ స్థానములో ఉన్న కెనడా కన్న, రెట్టింపు పెద్ద దేశం. జనాభా విషయములో చైనా, భారత దేశం, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇండోనేసియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ల తరువాత రష్యా ఎనిమిదవ స్థానములో ఉంది. రష్యాకి ఇరుగు పొరుగు దేశాలు (అపసవ్య దిశలో - ): నార్వే, ఫిన్లాండ్, ఎస్టోనియా, లాత్వియా, లిథువేనియా, పోలాండ్, బెలారస్, ఉక్రెయిన్, జార్జియా, అజర్‌బైజాన్, కజకస్తాన్, చైనా, మంగోలియా, ఉత్తర కొరియా. అమెరికా సంయుక్త రాష్ట్రాల కు,జపాన్కు కూడా రష్యా కొద్ది దూరంలోనే ఉంది. బేరింగ్ జల సంధి రష్యాను అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి విడదీస్తుంటే, లా-పెరౌసీ జల సంధి రష్యాను జపాన్ నుండి విడదీస్తుంది.

తర్వాతి సహస్రాబ్దిలో రష్యన్ సంస్కృతిగా భావించబడిన బైజాంటైన్, స్లావిక్ సంస్కృతుల సంశ్లేషణ ప్రారంభమైంది. 

రష్యన్ విప్లవం తరువాత  రష్యా సోవియట్ ఫెడరేటివ్ సోషలిస్ట్ రిపబ్లిక్  యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ అతిపెద్ద, ప్రధాన విభాగంగా మారింది. ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగబద్ధమైన సామ్యవాద రాజ్యం అయింది. సోవియట్ యూనియన్ రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాల గెలుపులో నిర్ణయాత్మక పాత్ర పోషించింది. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో యునైటెడ్ స్టేట్స్‌కు గుర్తించదగిన సూపర్ పవర్‌గా, ప్రత్యర్థిగా ఉద్భవించింది. 20 వ శతాబ్దంలో సోవియట్ యుగం అత్యంత ముఖ్యమైన సాంకేతిక విజయాల్లో కొన్నింటిని కలిగి ఉంది. ప్రపంచంలో మొట్టమొదటి మానవ నిర్మిత ఉపగ్రహాన్ని పంపించినది, అంతరిక్షంలోనికి మొదట మానవులను పంపించినదీ సోవియట్ యూనియనే. 1990 చివరినాటికి సోవియట్ యూనియన్‌లు ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద సైనిక స్థావరాలు, భారీ విధ్వంస ఆయుధాల నిల్వలు ఉన్నాయి. 1991 లో సోవియట్ యూనియన్ రద్దు తరువాత యు.ఎస్.ఎస్.ఆర్ నుండి పన్నెండు స్వతంత్ర రిపబ్లిక్ లు పుట్టుకొచ్చాయి: రష్యా, ఉక్రెయిన్, బెలారస్, కజాగిస్తాన్, ఉజ్బెకిస్తాన్, అర్మేనియా, అజర్ బైజాన్, జార్జియా, కిర్గిజ్ స్థాన్, మోల్డోవా, తజికిస్తాన్, తుర్క్ మెనిస్తాన్, బాల్టిక్ రాష్ట్రాలు స్వాతంత్ర్యం పొందాయి: ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా; రష్యన్ ఎస్.ఎఫ్.ఎస్.ఆర్.అనేది రష్యన్ ఫెడరేషన్‌గా పునఃస్థాపించబడింది. సోవియట్ యూనియన్ కొనసాగింపు చట్టబద్ధమైన ప్రత్యేకత, ఏకైక వారసత్వ దేశంగా గుర్తింపు పొందింది. దీనిని ఫెడరల్ సెమీ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్‌గా పరిగణిస్తారు.

గతములో ప్రబల గణతంత్రమైన యు ఎస్ ఎస్ ఆర్ (యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్), డిసెంబరు 1991లో విడిపోయినప్పుడు రష్యా ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడినది. ఈనాటికి కూడా రష్యా కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్‌లో ఒక ప్రభావవంతమైన దేశం. సోవియట్ సమాఖ్యలో ఉన్నప్పుడు రష్యాని రష్యన్ సోవియట్ ఫెడెరేటెడ్ సోషియలిస్ట్ రిపబ్లిక్స్ (ఆర్ ఎస్ ఎఫ్ ఎస్ ఆర్) అని పిలిచేవారు.

సోవియట్ యూనియన్ అత్యధిక భూభాగం, జనసంఖ్య, పారిశ్రామిక ఉత్పత్తి ఆనాటి రెండు ప్రపంచ శక్తులలో ఒకటైన రష్యాలో విలీనం అయ్యాయి. కావున యు.ఎస్.ఎస్.ఆర్ విభజించబడిన తరువాత రష్యా కోల్పోయిన తన గత ప్రాభవాన్ని తిరిగి తెచ్చుకోవాలని ప్రయత్నించింది. ఈ ప్రభావము గుర్తింపు గణనీయం అయినా గత సోవియట్ యూనియన్‌తో పోలిస్తే చెప్పుకోదగ్గవి కావు.

రష్యా పేరు రస్ నుండి వచ్చింది. ఇది సంఖ్యాపరంగా తూర్పు స్లావ్స్ ప్రజలు అధికంగా ఉన్న ఒక మధ్యయుగ రాజ్యంగా ఉంది. ఏది ఏమయినప్పటికీ ఈ సరైన పేరు తరువాతి చరిత్రలో మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ దేశాన్ని రస్కజా జెమ్లజాగా పిలుస్తారు. దీనిని రష్యన్ ల్యాండ్ లేదా రష్ భూమిగా అనువదించవచ్చు. దాని నుండి వచ్చిన ఇతర రాజ్యాలలోని ఈ రాష్ట్రంను గుర్తించేందుకు ఆధునిక చరిత్రప్రతులు దీనిని కీవన్ రస్ అని పిలుస్తారు. మొదట మధ్యయుగ రుస్ 'ప్రజలు, స్వీడిష్ వర్తకులు, యోధులు రస్ అనే పేరు వచ్చింది. వీరు బాల్టిక్ సముద్రం నుండి వలసగా వచ్చి దేశకేంద్రంలో ఉన్న నవ్గోరోడ్‌లో కేంద్రీకృతమైయ్యారు. తరువాత ఇది  కివెన్ రస్  అయింది.కాథలిక్ ఐరోపాకు సమీపంలో ఉన్న రస్ అనే పదానికి పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో వర్తించే రుథేనియా అనే పాత లాటిన్ వెర్షన్ మూలంగా ఉంది. దేశం ప్రస్తుత పేరు రొసిజా, రస్ బైజాంటైన్ గ్రీక్ హోదా నుంచి వచ్చింది. రోసీయా-స్పెల్లెడ్ ​​ ఆధునిక గ్రీకులో రోసియా .

రష్యా పౌరులను ప్రస్తావించడానికి ప్రామాణిక మార్గం ఆంగ్లంలో రష్యన్లు, రష్యాలో రోసీయెన్ (రష్యన్: россияне). రెండు రష్యన్ పదాలు సాధారణంగా ఆంగ్లంలో రష్యన్లుగా అనువదించబడ్డాయి. ఒకటి రస్‌కియె ఇది తరచుగా జాతి రష్యన్లు. ఇంకొకటి రోసియేన్ (రోసియనేన్) అంటే రష్యా పౌరులు జాతితో సంబంధం లేకుండా అని అర్ధం. ఇతర భాషల్లోని అనువాదాలు తరచుగా ఈ రెండు వర్గాలను గుర్తించవు.

ఆరంభకాలంలో  స్కిథియా  అని పిలువబడే పొంటిక్ సోపాన భూములలో చాల్కోలిథిక్ ప్రజలు నివసించారు. వీరిపై మూడు నుండి ఆరు శతాబ్దముల మధ్య కాలములో గోథ్స్, హన్స్, తుర్కిక్ అవర్స్ వేర్వేరు రకాలుగా దాడులు చేసి వారి భూములను అధీనం చేసుకున్నారు. దాడుల పిమ్మట ఈ దేశ దిమ్మరులు ఐరోపా ఖండముకి చేరుకునేవారు. టుర్కిక్ జాతికి చెందిన ఖజర్స్ ఎనిమిదవ శతాబ్దము దాకా దక్షిణ రష్యాని పరిపాలిస్తూ, బైజంటైన్ రాజ్యం సహకారముతో అరబ్ ఖలీఫాలపై దాడులు జరిపేవారు. ఈ మధ్యనే వోల్గా ప్రాంతంలో జరిగిన తవ్వకాలలో వైదీక దేవతల విగ్రహాలు బైటపడటం వీరికి 9 వ శతాబ్దము నుండి భారత దేశంతో పరిచయాలు ఉన్నట్లు తెలుపుతున్నాయి.

క్రీస్తు పూర్వం 8 వ శతాబ్దం ప్రారంభంలో ప్రాచీన గ్రీకు వ్యాపారులు తమ నాగరికతను టనైయిస్, ఫనగోరియాలో వాణిజ్య మండలానికి తీసుకువచ్చారు. ముఖ్యంగా పైథాస్ వంటి ప్రాచీన గ్రీకు అన్వేషకులు బాల్టిక్ సముద్రం మీద ఆధునిక కాలినిన్‌గ్రాడ్ వరకు కూడా వెళ్ళారు. రోమన్లు ​​కాస్పియన్ సముద్రం పశ్చిమ భాగంలో స్థిరపడి అక్కడ వారి సామ్రాజ్యాన్ని తూర్పు వైపు విస్తరించారు.క్రీ.శ. 3 వ శతాబ్దం నుండి 4 వ శతాబ్దాల్లో పాక్షిక పురాణ గోతిక్ రాజ్యం ఓమియం దక్షిణ రష్యాలో ఉనికిలో ఉంది. వీరిని హన్స్ అధిగమించారు. గ్రీకు కాలనీల తరువాత క్రీ.శ. 3, 6 వ శతాబ్దాల్లో బోస్పోరాన్ కింగ్డమ్ అయిన హెలెనిస్టిక్ పాలసీ ఈ ప్రాంతాన్ని పాలించింది.ఈ సమయంలోనే 
హూన్స్, యురేషియా అవార్స్ వంటి యుద్ద సంబంధమైన తెగల నాయకత్వంలో సంచార దండయాత్రలచే ముంచివేయబడింది.

 ఆరంభకాల చరిత్రకారుల ఆధారంగా వారు రస్ నుండి వరాంగియన్లుగా 862 లో నొవ్గొర్డ్ ప్రాంతంలో రూరిక్ పాలనకు మారారు.ఇది కెవాన్ రస్ స్థాపించిన  ఖజార్స్ కు సామంతరాజ్యంగా ఉంది.
ఒలెక్ రూరిక్స్ కుమారుడు  ఐగార్ , ఐగార్ కుమారుడు  స్వియాటోస్ల్వ్  తూర్పు స్లావిక్ జాతులను కెవిన్ పాలనలోకి తీసుకు వచ్చి ఖజర్ ఖాగనటేను నాశనం చేసి బైజాంటైన్, పర్షియా మీద పలుమార్లు దాడి చేసాడు.

ఇది దాదాపు సగం జనాభా మరణాలకు దారితీసింది.

ఆక్రమించుకున్న మంగోల్ ప్రముఖులు వారి స్వాధీనపర్చబడిన టర్కిక్ ప్రాంతాలను (కుమాన్స్, కిప్చాక్స్, బల్గార్స్) తాతార్స్‌గా పిలిచారు ఇది గోల్డెన్ హార్డే రాజ్యాన్ని ఏర్పరుస్తుంది. ఇది రష్యన్ ప్రిన్సిపాలిటీలను దోచుకుంది; రెండు శతాబ్దాల పాటు మంగన్లు కుమన్-కిప్చాక్ కాన్ఫెడరేషన్, వోల్గా బల్గేరియా (రష్యా దక్షిణ, మధ్య వ్యయాలు) ఆధునిక పరిపాలనను పాలించాయి.

గలీసియా-వోల్నియాయా చివరికి పోలాండ్ రాజ్యం చేత సమైక్యం చేయబడింది. అయితే మంగోల్ ఆధిపత్యం వ్లాదిమిర్-సుజడాల్, నవగోరోడ్ రిపబ్లిక్, కీవ్ అంచున ఉన్న రెండు ప్రాంతాలు ఆధునిక రష్యన్ దేశపు ఆధారాలను స్థాపించింది. 
పిస్కోవ్‌తో కలిసి నవ్గోరోడ్ మంగోల్ యోక్ సమయంలో కొంత స్వతంత్రతను నిలబెట్టుకున్నది. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లోని అణచివేతలను ఎక్కువగా నిర్లక్ష్యం చేసారు. ప్రిన్స్ అలెగ్జాండర్ నెవ్స్‌కీ నేతృత్వంలో నోవగోరోడియన్లు 1240 లో నెవా యుద్ధంలో ఆక్రమించుకున్న స్వీడీన్‌ను తిప్పికొట్టారు. అలాగే 1242 లో ఐస్ యుద్ధంలో జర్మనీ క్రూసేడర్స్ వారు నార్తరన్ రస్కు వలసరావటానికి తమ ప్రయత్నాలను విరమించుకున్నారు.

అత్యంత ప్రభావమైన కీవన్ రస్ విచ్ఛిన్నం తరువాత మావోయిస్టు గ్రాండ్ డచీ (పాశ్చాత్య చరిత్రలోని ముస్కోవి) ప్రారంభంలో వ్లాదిమిర్-సుజాల్ ఒక భాగంగా ఉంది. మంగోల్-తటార్ల పాలనలో, వారి అనుబంధంతో మాస్కో 14 వ శతాబ్దం ప్రారంభంలో 'సెంట్రల్ రస్లో తన ప్రభావాన్ని నొక్కి చెప్పడం ప్రారంభించింది. మాస్కో క్రమంగా రస్ భూభాగంలో పునరేకీకరణ, విస్తరించింది.
 మాస్కో చివరి ప్రత్యర్థి నోవ్గోరోడ్ రిపబ్లిక్ ప్రధానంగా  ఫర్ వాణిజ్యం  వాణిజ్య కేంద్రంగా, హాన్సియాటిక్ లీగ్ తూర్పు నౌకాశ్రయంగా అభివృద్ధి చెందింది.

తరచుగా సంభవించిన మంగోల్-టాటర్ దాడులు పరిస్థితిని సంక్లిష్టంగా మార్చింది. లిటిల్ ఐస్ ఏజ్ ప్రారంభంలో వ్యవసాయం సమస్యలను ఎదుర్కొంది. మిగిలిన యూరోప్‌లో 1350, 1490 ల మధ్య తరచుగా ప్లేగు సంభవించింది. 
ఏది ఏమయినప్పటికీ తక్కువ జనాభా సాంద్రత, బాన్యా మంచి పరిశుభ్రత-విస్తృత అభ్యాసం, తడి ఆవిరి స్నానం కారణంగా - ప్లేగు వ్యాధి మరణాలు పశ్చిమ ఐరోపాలో కంటే తక్కువగా సంభవించాయి. and population numbers recovered by 1500.
మాస్కో ప్రిన్స్ డిమిట్రీ డాన్స్కోయ్ నాయకత్వం, రష్యన్ ఆర్థోడక్స్ చర్చ్ సహాయంతో రష్యన్ రాజ్యాల యునైటెడ్ సైన్యం 1380 లో కులిక్కోవో యుద్ధంలో మంగోల్-తతర్ల ఓటమి ఒక మైలురాయిగా మారింది. మాస్కో క్రమంగా పూర్వపు బలమైన ప్రత్యర్థులతో సహా పరిసర ప్రాంతాలు ట్వెర్, నోవ్గోరోడ్‌లతో చేర్చి పరిసరాలలోని రాజ్యాలన్నింటినీ ఆక్రమించుకుంది.మూడవ ఇవాన్ (ది గ్రేట్)  గోల్డెన్ హొర్డే  మీద నియంత్రణను వదులుకుని మద్య, ఉత్తర రస్ ప్రాంతాలను సమైక్యపరచి మాస్కో సామ్రాజ్యంలో విలీనం చేసింది.
 

థర్డ్ రోమ్ వ్యూహం అభివృద్ధిలో 1547 లో గ్రాండ్ డ్యూక్ 4 వ ఇవాన్ IV (భయంకరమైన) అధికారికంగా రష్యా మొదటి జార్ (సీజర్) కిరీటాన్ని ప్రకటించారు. శార్క్ కొత్త సూత్రాలను (1550 సుడెన్బ్నిక్) మొదటి రష్యన్ భూస్వామ్య ప్రతినిధి బృందాన్ని (జెంస్కీ సొబోర్) స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వయంప్రతిపత్తిని ప్రవేశపెట్టింది.
తన సుదీర్ఘ కాలంలో ఇవాన్ ది టెరిబుల్ దాదాపుగా మూడు పెద్ద టాటూ ఖనతలు (విచ్ఛిన్నీకరించబడిన గోల్డెన్ హార్డే భాగాలు): వోల్గా నది వెంట కజాన్, ఆస్త్రాఖన్, నైరుతి సైబీరియాలోని సైబీరియన్ ఖానేట్‌లను కలుపుతూ దాదాపుగా రెట్టింపు అయింది. అందువలన 16 వ శతాబ్దం చివరి నాటికి రష్యా బహుళజాతి, బహుళజాతి, ట్రాన్స్ కాంటినెంటల్ రాష్ట్రంగా రూపాంతరం చెందింది.

ఏదేమైనా పోలాండ్, లిథువేనియా, బాల్టిక్ తీరం, సముద్ర వాణిజ్యానికి యాక్సెస్ కోసం జరిగిన స్వీడన్ సంధికి వ్యతిరేకంగా దీర్ఘకాలం కొనసాగిన విజయవంతం కాని లివియోన్ యుద్ధంలో త్సార్డమ్ బలహీనపడింది. అదే సమయంలో గోల్డెన్ హార్డేకు మిగిలిన వారసుడైన క్రిమియన్ ఖానేట్ తారాలు దక్షిణాది రష్యా దాడిని కొనసాగించారు. వోల్గా ఖాతాలను పునరుద్ధరించే ప్రయత్నంలో బందిపోట్లు, వారి ఒట్టోమన్ మిత్రుల మధ్య రష్యాను ఆక్రమించారు. 1571 లో మాస్కో భాగాలు కూడా ఆక్రమించుకున్నారు. కానీ మరుసటి సంవత్సరంలో మోలోడి యుద్ధంలో రష్యన్లు బాగా ముట్టడించిన సైన్యం పూర్తిగా ఓటమ్యాన్-క్రిమియన్ విస్తరణను రష్యాకు మినహాయించడానికి నిరాకరించారు. ఏది ఏమయినప్పటికీ 17 వ శతాబ్దం చివరి వరకు బానిస దాడులు రద్దు చేయలేదు. అయితే దక్షిణ రష్యాలోని కొత్త కోటల నిర్మాణం నిరంతరాయంగా జరిగింది. గ్రేట్ అబిటి లైన్ వంటివి దాడులకు అడ్డంకులుగా మారాయి.

తూర్పున సైబీరియా భారీ భూభాగాల త్వరిత రష్యన్ అన్వేషణ, వలసరాజ్యం ఎక్కువగా విలువైన ఫర్, ఏనుగుదంతాల కొరకు కోసాక్స్ వేట కొనసాగింది. రష్యన్ అన్వేషకులు ప్రధానంగా సైబీరియన్ నది మార్గాల్లో తూర్పు దిశగా నడిచారు. 17 వ శతాబ్దం మధ్యకాలంలో తూర్పు సైబీరియాలో రష్యా స్థావరాలు చుక్కీ ద్వీపకల్పంలో అముర్ నది వెంట, పసిఫిక్ తీరంలో ఉన్నాయి. 1648 లో ఆసియా, ఉత్తర అమెరికాలకు మధ్య బేరింగ్ స్ట్రైట్ మొదటిసారి ఫెడోట్ పోపోవ్, సెమియోన్ డేజ్నోవ్లు దాటడానికి ఆమోదించబడింది.

వివిధ ఐరోపా దేశాలతో పొత్తు పెట్టుకున్న రష్యాలో నెపోలియన్ ఫ్రాన్స్ కు వ్యతిరేకంగా పోరాడారు. 1812 లో నెపోలియన్ అధికారం శిఖరాగ్రంలో ఉన్న సమయంలో ఫ్రెంచ్ దండయాత్ర రష్యాలోని మాస్కోకు చేరుకుంది. కానీ చివరకు తీవ్రమైన రష్యన్ చలికాలం కలవరపెట్టే 
ప్రతిఘటన కారణంగా ఆక్రమణదారులు ఘోరమైన ఓటమిని ఎదుర్కొన్నారు. దీనిలో పాన్- యూరోపియన్ గ్రాండే ఆర్మీ 95% మరణించారు. 
మిఖాయిల్ కుతుజోవ్, బార్క్‌లే డే టోలీ నాయకత్వం వహించిన రష్యన్ సైన్యం నెపోలియన్‌ను దేశం నుండి తొలగించి చివరకు పారిస్‌లోకి ప్రవేశించింది ఐరోపాలో ఆరవ కూటమిలో చేరి మొదటి అలెగ్జాండర్ వియన్నా కాంగ్రెస్ వద్ద రష్యా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాడు.

నెపోలియన్ యుద్ధాల అధికారులు రష్యాతో తిరిగి ఉదారవాదం ఆలోచనలను తెచ్చి 1825 లో జరిగిన  డెకామ్బ్రిస్ట్ తిరుగుబాటు  సమయంలో జొరాన్ శక్తులను తగ్గించటానికి ప్రయత్నించారు.మొదటి నికోలస్ (1825-55) సంప్రదాయవాద పాలన చివరిలో రష్యా అధికారం, ఐరోపాలో ప్రభావం క్రిమియన్ యుద్ధంలో ఓటమిని నివారించింది. 1847, 1851 ల మధ్య సుమారు ఒక మిలియన్ ప్రజలు ఆసియా కలరా కారణంగా మరణించారు.

నికోలస్ వారసుడు రెండవ అలెగ్జాండర్ (1855-81) 1861 సంస్కరణలతో సహా దేశంలో గణనీయమైన మార్పులను తీసుకువచ్చాడు. ఈ గొప్ప సంస్కరణలు పారిశ్రామికీకరణను ప్రోత్సహించి, రష్యన్ సైన్యాన్ని ఆధునీకరించాయి. ఇది 1877-78 రష్యా-టర్కీ యుద్ధంలో విజయవంతంగా ఒట్టోమన్ పాలన నుండి బల్గేరియాను విముక్తం చేసింది యుద్ధం.

రష్యా మిత్రదేశం సెర్బియా మీద ఆస్ట్రియా-హంగరీల యుద్ధ ప్రకటనకు ప్రతిస్పందనగా 1914 లో రష్యా మొదటి ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించి ట్రిపుల్ ఎంటెంట్ మిత్రరాజ్యాల నుండి వేరువైపుకు పోరాడారు. 1916 లో రష్యా ఆర్మీకి చెందిన బ్రసిలోవ్ యుద్ధాన్ని పూర్తిగా ఆస్ట్రియా-హంగరీ సైనికదళం నాశనం చేసింది. ఏదేమైనా ఇప్పటికే ఉన్న ప్రజా అవిశ్వాసం యుద్ధం కారణంగా పెరుగుతున్న ఖర్చులు. అధిక ప్రాణనష్టం, అవినీతి, రాజద్రోహం వంటి పుకార్ల ద్వారా మరింతగా అధికరించింది. ఇది 1917 రష్యన్ విప్లవానికి వాతావరణాన్ని ఏర్పరచింది. ఇది రెండు ప్రధాన కార్యక్రమాలలో నిర్వహించబడింది.

ఫిబ్రవరి విప్లవం రెండవ నికోలస్‌ని నిర్మూలించటానికి బలవంతం చేసింది; అతను, అతని కుటుంబం రష్యన్ పౌర యుద్ధం సమయంలో యెకాటెరిన్బర్గ్‌లో ఖైదు చేయబడ్డారు. రాచరికం స్థానంలో రాజకీయ పార్టీల సంచలనాత్మక సంకీర్ణం ఏర్పడింది. అది తాత్కాలిక ప్రభుత్వాన్ని కూడా ప్రకటించింది. 1917 సెప్టెంబరు 1 లో తాత్కాలిక ప్రభుత్వం డిక్రీ మీద రష్యన్ రిపబ్లిక్ ప్రకటించబడింది. 1918 జనవరి 6 న రష్యా రాజ్యాంగ అసెంబ్లీ రష్యాను ప్రజాస్వామ్య ఫెడరల్ రిపబ్లిక్ (తద్వారా తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయాన్ని ఆమోదించింది) ప్రకటించింది. తదుపరి రోజు రాజ్యాంగ అసెంబ్లీ ఆల్-రష్యన్ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీచే రద్దు చేయబడింది.

ఒక ప్రత్యామ్నాయ సామ్యవాద వ్యవస్థ సోవియెట్స్ అని పిలవబడే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన కార్మికుల, కార్మికుల ద్వారా అధికారాన్ని సంపాదించి పెట్రోగ్రాడ్ సోవియట్‌తో ఉండేది. నూతన అధికారుల పాలన దేశంలో సమస్యల పరిష్కారానికి బదులుగా సంక్షోభాన్ని మరింతగా పెంచింది. చివరకు బోల్షెవిక్ నేత వ్లాదిమిర్ లెనిన్ నేతృత్వంలోని అక్టోబరు విప్లవం తాత్కాలిక ప్రభుత్వాన్ని పడగొట్టింది. సోవియట్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చింది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి సోషలిస్టు రాజ్య నిర్మాణానికి దారి తీసింది.

అక్టోబరు విప్లవం తరువాత కమ్యూనిస్ట్ వ్యతిరేక తెగ ఉద్యమం, దాని రెడ్ ఆర్మీతో కొత్త సోవియట్ పాలన మధ్య ఒక అంతర్యుద్ధం జరిగింది. బోల్షెవిస్ట్ రష్యా తన ఉక్రేనియన్, పోలిష్, బాల్టిక్, ఫిన్నిష్ భూభాగాలను కోల్పోయింది. బ్రెస్ట్-లిటోవ్స్క్ ఒప్పందంలో సంతకం చేయడం ద్వారా మొదటి ప్రపంచ యుద్ధం సెంట్రల్ పవర్స్‌తో విరోధాలు ఏర్పడింది. కమ్యూనిస్టు వ్యతిరేక శక్తుల మద్దతుతో మిలిటరీ జోక్యం విజయవంతం కాలేదు. ఈ మధ్యకాలంలో బోల్షెవిక్లు, వైట్ ఉద్యమం రెడ్ టెర్రర్, వైట్ టెర్రర్‌గా పిలవబడే ఒకదానితో ఒకటి బహిష్కరణల, మరణశిక్షల పోరాటాలు నిర్వహించాయి. పౌర యుద్ధం చివరి నాటికి రష్యా ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు బాగా దెబ్బతిన్నాయి. మిలియన్ల మంది వైట్ ఎమిగ్రేస్ అయ్యారు. 1921 నాటి పోవోల్జే కరువులో 5 మిలియన్ల మంది బాధితులయ్యారు.

రష్యన్ సోవియట్ ఫెడరేటివ్ సోషలిస్ట్ రిపబ్లిక్ (ఆ సమయంలో రష్యన్ సోషలిస్ట్ ఫెడరేటివ్ సోవియట్ రిపబ్లిక్గా పిలువబడింది) ఉక్రేనియన్, బైలోరసియన్, ట్రాన్‌స్కాసియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్‌లతో సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ యూనియన్ (సోవియట్ యూనియన్) లేదా సోవియట్ యూనియన్‌ను 1922 డిసెంబరు 30 న యు.ఎస్.ఎస్.ఆర్.ను రూపొందించాయి. చేసే 15 రిపబ్లిక్లలో మొత్తం యు.ఎస్.ఎస్.ఆర్.జనాభాలో సగం, మొత్తం భూభాగంలో సగం రష్యన్ ఎస్.ఎఫ్.ఎస్.ఆర్. ఉంది.ఇది మొత్తం 69 సంవత్సరాల కాలం యూనియన్‌లో ఆధిపత్యం వహించింది.

స్టాలిన్ నాయకత్వంలో ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యవస్థను ప్రారంభించింది. ఎక్కువగా గ్రామీణ ప్రాధాన్యత కలిగిన దేశం పారిశ్రామికీకరణ, సమైక్య వ్యవసాయం అభివృద్ధి చేయబడింది. వేగవంతమైన ఆర్థిక, సాంఘిక మార్పుల కాలంలో, మిలియన్ల మంది ప్రజలు  పెనాల్ లేబర్ కేంప్ కు పంపబడ్డారు. స్టాలిన్ పాలనకు వారి వ్యతిరేకతకు అనేక రాజకీయ దోషులు ఉన్నారు; మిలియన్ల మంది సోవియట్ యూనియన్ మారుమూల ప్రాంతాలకు తరలించబడడం, బహిష్కరించబడడం సంభవించింది. కఠినమైన రాజ్యవిధానాలు, కరువుతో కలిపి దేశం వ్యవసాయం పరివర్తన అపసవ్యమై 1932-1933లో సోవియట్ కరువుకు దారితీసింది. సోవియట్ యూనియన్ స్వల్ప కాల వ్యవధిలో ఒక పెద్ద వ్యవసాయ ఆర్థికవ్యవస్థ నుండి ప్రధాన పారిశ్రామిక వేదికగా మార్చబడింది.

సోవియట్ యూనియన్‌ నాస్తికత్వం సిద్ధాంతం ప్రకారం కమ్యూనిస్టులు నిర్వహిస్తున్న నాస్తికతకు బలవంతంగా మార్పిడి చేయబడిన ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం ఉంది. కమ్యూనిస్ట్ పాలన రాజ్యప్రయోజనాలపై ఆధారపడిన మతాలను లక్ష్యంగా చేసుకుంది. చాలా వ్యవస్థీకృత మతాలు నిషేధించబడ్డాయి. మతసంబంధ ఆస్తి జప్తు చేయబడింది. మత విశ్వాసులు హింసించబడ్డారు. మతం హేళన చేస్తూ నాస్తికత్వం పాఠశాలల్లో ప్రచారం చేయబడింది. 1925 లో ప్రభుత్వానికి మిలిటెంట్ నాస్తికులు లీగ్ని హింసకు తీవ్రతరం చేసారు.

కొన్ని వృత్తుల (ఉపాధ్యాయులు, రాష్ట్ర అధికారులు, సైనికులు) సభ్యులకు ఇది సాధారణంగా ఆమోదించబడలేదు. బహిరంగంగా మతము వ్యక్తిగతంగా నిషేధించబడనప్పటికీ సోవియట్ అధికారులు రష్యన్ ఆర్థోడాక్స్ చర్చిని నియంత్రించడానికీ, జాతీయ సంక్షోభం సమయంలో పాలన సొంత ప్రయోజనాల కోసమూ దీనిని ఉపయోగించుకోవాలని ప్రయత్నించారు. కానీ వారి అంతిమ లక్ష్యం మతం తొలగించడం ప్రధానంగా ఉంది. సోవియట్ శక్తి మొదటి ఐదు సంవత్సరాల్లో బోల్షెవిక్స్ 28 రష్యన్ ఆర్థోడాక్స్ బిషప్‌లను, 1,200 రష్యన్ ఆర్థోడాక్స్ పూజారులను ఉరితీశారు. అనేకమంది ఖైదు చేయబడ్డారు లేదా బహిష్కరించబడ్డారు.మతవిశ్వాసులను వేధించడం, హింసించడం జరిగింది. చాలామంది సెమినార్లు మూసివేశారు. మతపరమైన ప్రచురణ నిషేధించబడింది. ప్రపంచ యుద్ధానికి ముందు ఉనికిలో ఉన్న చర్చీలలో 1941 నాటికి కేవలం 500 చర్చిలు మాత్రమే 54,000 మంది సభ్యులకు తెరచి ఉంచబడ్డాయి.

అడాల్ఫ్ హిట్లర్ ఆస్ట్రియా, చెకోస్లోవేకియాల ఆక్రమణ వైపు గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్సు శాంతివిధానం నాజి జర్మనీ అధికారంలో పెరుగుదలకు కారణమైంది. అదేసమయంలో 1938-39లో సోవియట్-జపనీస్ సరిహద్దు యుద్ధాలలో యు.ఎస్.ఎస్.ఆర్. బహిరంగ శత్రువు ఫార్ ఈస్ట్‌లో యు.ఎస్.ఎస్.ఆర్. ప్రత్యర్థి అయిన జపాన్ సామ్రాజ్యంతో మూడవ రెయిచ్‌తో జత కలిసింది.

ఆక్రమించింది.

రెండవ ప్రపంచ యుద్ధం 1941-45 కాలాన్ని రష్యాలో గ్రేట్ పేట్రియాటిక్ యుద్ధంగా పిలుస్తారు. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డం, చైనాలతో కలిసి సోవియట్ యూనియన్ రెండవ ప్రపంచ యుద్ధంలో అలైడ్ అధికారాల బిగ్ ఫోర్‌గా పరిగణించబడి తరువాత ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి పునాదిగా ఉన్న నాలుగురు రక్షకభటులు అయ్యారు. ఈ యుద్ధ సమయంలో మానవ చరిత్రలో చాలా ప్రాణాంతకమైన యుద్ధ కార్యకలాపాలు సోవియట్ సైన్య, పౌర మరణాలు వరుసగా 10.6 మిలియన్లు, 15.9 మిలియన్లుగా ఉన్నాయి. మొత్తం రెండవ ప్రపంచ యుద్ధం మరణాలలో మూడింట ఒక వంతు. సోవియట్ ప్రజలకు పూర్తి జనాభా నష్టం ఇంకా ఎక్కువగా ఉంది. 
సోవియట్ ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు సోవియట్ యూనియన్ కరువు 1946-47  కారణమయ్యాయి అయితే సోవియట్ యూనియన్ ఖండంలోని ఒక బలమైన సైనిక శక్తిగా గుర్తింపు పొందింది.

యుద్ధం తర్వాత తూర్పు జర్మనీ, ఆస్ట్రియా భాగంగా ఉన్న తూర్పు, మధ్య ఐరోపాను పోటడాం కాన్ఫరెన్స్ ప్రకారం ఎర్ర సైన్యం ఆక్రమించింది. తూర్పు బ్లాక్ శాటిలైట్ దేశాలలో డిపెండెంట్ సోషలిస్టు ప్రభుత్వాలు స్థాపించబడ్డాయి.తరువాత రష్యా ప్రపంచ రెండవ అణు ఆయుధ శక్తి అయింది.యు.ఎస్.ఎస్.ఆర్.వార్సా ఒప్పందం కూటమిని స్థాపించి ప్రపంచ ప్రబలంగా పోరాడుతూ ప్రచ్ఛన్న యుద్ధంగా యునైటెడ్ స్టేట్స్, నాటోతో పిలువబడింది. సోవియట్ యూనియన్ ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మక ఉద్యమాలకు మద్దతు ఇచ్చింది. వీటిలో కొత్తగా ఏర్పడిన పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఆ తర్వాత, రిపబ్లిక్ ఆఫ్ క్యూబా ఉన్నాయి. ఇతర సామ్యవాద దేశాలకు సోవియట్ వనరుల గణనీయమైన మొత్తాలను కేటాయించారు.

స్టాలిన్ మరణం, సామూహిక పాలన కొద్ది కాలం తరువాత కొత్త నాయకుడు నికితా క్రుష్చెవ్ స్టాలిన్ విధాన సంస్కృతిని నిరాకరించాడు. డి-స్టాలినిజేషన్ విధానాన్ని ప్రారంభించాడు. శిక్షా శ్రామిక వ్యవస్థ సంస్కరించబడింది. పలువురు ఖైదీలను విడుదల చేసి పునరావాసం పొందారు (చాలామంది మరణించారు). అణచివేత విధానాల సాధారణ సులభతరం చేయబడిన తర్వాత క్రుష్చెవ్ థా అని పిలిచేవారు. అదే సమయంలో రెండు ప్రత్యర్థులు క్యూబాలో టర్కీలో, సోవియట్ క్షిపణులను యునైటెడ్ స్టేట్స్ జూపిటర్ క్షిపణులను మోహరించినప్పుడు యునైటెడ్ స్టేట్స్‌తో ఉద్రిక్తతలు అధికం అయ్యాయి.

 యునైటెడ్ స్టేట్స్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సిఫార్సు చేయబడిన షాక్ థెరపీ తరహాలో తీవ్రమైన మార్పులతో సహా. అన్నిటికన్నా ప్రధానమైన 1990, 1995 మధ్యకాలంలో ఆర్థిక సంక్షోభం ఫలితంగా జి.డి.పి, పారిశ్రామిక ఉత్పత్తిలో 50% క్షీణత కలిగి ఉంది.

ప్రైవేటైజేషన్ కారణంగా ఎంటర్ప్రైసెస్ అధికారం స్టేట్ ఏజెంసీల నుండి ప్రభుత్వ సంస్థల నుండి సంస్థల ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేయబడి లోపల అధికారము ప్రభుత్వంలో అంతర్గత అనుసంధనం చేయబడింది. అనేకమంది నూతనంగా ధనవంతులై రాజధాని నుండి నగదును, ఆస్తులనూ బిలియన్ డాలర్లను దేశం వెలుపలకు తరలించారు. ఆర్థిక వ్యవస్థ మాంద్యం సామాజిక సేవల కూలిపోవడానికి దారితీసింది; మరణాల రేటు విపరీతంగా పెరిగి జనన రేటు క్షీణించింది. 1993 మధ్యలో సోవియట్ శకంలో 1.5% స్థాయి ఉన్న పేదరికం తరువాత 39-49% వరకు లక్షలాది మంది పేదరికంలో పడిపోయారు. 1990 లలో తీవ్ర అవినీతి, చట్ట అతిక్రమణ, నేర ముఠాలు, హింసాత్మక నేరాల పెరుగుదల కనిపించింది.

యుఎస్ఎస్ఆర్ బాహ్య రుణాలను స్థిరపర్చడానికి రష్యా బాధ్యత వహించింది. దాని జనాభాలో కేవలం జనాభాలో సగం మంది జనాభా సగం అయింది . అధిక బడ్జెట్ లోటులు 1998 లో రష్యన్ ఆర్థిక సంక్షోభం  కారణమయ్యాయి. ఫలితంగా జి.డి.పి. తిరోగమనం కూడా జరిగింది.

పుతిన్ అధ్యక్ష సమయంలో చేసిన అనేక సంస్కరణలు సాధారణంగా పాశ్చాత్య దేశాల ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా విమర్శించబడుతున్నాయి. పరిస్థితి స్థిరత్వం, పురోగతి తిరిగి పుతిన్ నాయకత్వం రష్యాలో విస్తృతమైన ప్రశంసలను పొందింది.

ఉక్రెయిన్కు చెందిన అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ విప్లవం ఫలితంగా 2014 లో పుతిన్ యుక్రెయిన్‌కు రష్యా దళాలను మోహరించేందుకు రష్యన్ పార్లమెంటు నుండి అధికారాన్ని అభ్యర్థించి అందుకున్నాడు.

క్రిమియన్ ప్రజాభిప్రాయ సేకరణలో అధిక సంఖ్యలో ఓటర్లు విభజనకు వ్యతిరేకంగా ఓటు వేసారు. క్రిమియన్ ప్రజాభిప్రాయ సేకరణ తరువాత రష్యన్ నాయకత్వం రష్యన్ ఫెడరేషన్‌లో క్రిమియాను ప్రవేశపెట్టిందని ప్రకటించింది. ఇది ముందు జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ అంతర్జాతీయంగా ఆమోదించబడలేదు. 

మంగోలుల ప్రాబల్యం సన్నగిల్లుతున్న దశలో మాస్కో ప్రభువులు పరిస్థితులను అంచనావేసి తెలివిగా పావులు కదపడ౦ ప్రార౦భి౦చారు. క్రమంగా, పదునాలుగవ శతాబ్దాంతానికి మంగోలుల అధిపత్యం అంతమైపోయింది. ఇవాన్-ది-టెర్రిబుల్‌గా పేరొందిన ఇవాన్ ప్రభువు కాలానికి రష్యా పూర్తిగా మంగోలుల చెరనుండి బయటపడింది. రష్యా రాజరిక చరిత్రలో ఇవాన్ ప్రభువు మొదటి జార్‌గా పేరుపొందాడు (జార్ అనే పదం రోమన్ బిరుదం సీజర్ నుండి ప్రేరణ పొందింది). ఈయన కాలంలోనే రష్యా సైబీరియాలో చాలా భాగాన్ని ఆక్రమించింది. ఆ విధంగా రష్యన్ మహా సామ్రాజ్యావిర్భావానికి అంకురార్పణ జరిగింది.

రష్యాపై మాస్కో ప్రభువుల పెత్తనం ఆ విధంగా మొదలై క్రమంగా విస్తరించింది. ఈ క్రమంలో రాచరికపు పగ్గాలు రొమనోవ్ వంశస్థుల చేతికొచ్చాయి. 1613లో సింహాసనమెక్కిన మిఖాయెల్ రొమనోవ్ (ఈయన్నే మొదటి మిఖాయెల్ చక్రవర్తిగా కూడా పిలుస్తారు) ఈ వంశ పాలనకాద్యుడు. 1689 నుండి 1725 వరకూ పాలించిన పీటర్-ది-గ్రేట్ రష్యన్ చక్రవర్తులందరిలోకీ గొప్పవాడిగా వినుతికెక్కాడు. పీటర్ చక్రవర్తి కాలంలో రష్యా సామాజికంగానూ, సాంస్కృతికంగానూ ఎంతో పురోగమించింది. ఈయన తరువాత గద్దెనెక్కిన కేధరిన్ మహారాణి (1767 - 1796) పాలనలో రష్యా మరింత పురోగమించి ఆసియా ఖండంలో ఒక ప్రబల శక్తిగా ఆవిర్భవించటమే కాకుండా ఐరోపాలో అప్పటికే బలమైన రాజ్యాలుగా పేరొందిన ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ లకు పోటీగా ఎదిగింది.

రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద దేశం; దీని మొత్తం ప్రాంతం 17,075,200 చదరపు కిలోమీటర్లు (6,592,800 చదరపు మైళ్ళు). ఇది అక్షాంశాల 41 ° నుండి 82 ° ఉత్తర అక్షాంశం, 19 ° నుండి 169 ° పశ్చిమ రేఖాంశం మద్య ఉంటుంది.

రష్యాలో విస్తృతంగా వేరు చేయబడిన రెండు ప్రదేశాలు భౌగోళిక రేఖ వెంట 8,000 కి.మీ (4,971 మై) వేరుగా ఉంటాయి. ఈ పాయింట్లు: ఒక 60 కి.మీ (37 మై) పొడవు విస్టులా లాగూన్ నుండి గ్దాంస్క్ బే, కురిల్ దీవులు చాలా ఆగ్నేయ పాయింట్. విస్టులా విండ్ దక్షిణకొనలో పోలాండ్తో సరిహద్దు ఏర్పరుస్తూ ఉంది. సుదూర రేఖాంశంలో వేరుచేసిన పాయింట్లు 6,600 కి.మీ. (4,101 మైళ్ళు) వేరు వేరుగా ఉంటాయి. ఈ పాయింట్లు: పశ్చిమాన పోలాండ్, తూర్పు బిగ్ డియోమేడ్ ద్వీపం సరిహద్దు. రష్యన్ ఫెడరేషన్ 11 సమయ మండలాలను ఏర్పరుస్తుంది.

రష్యాలో అధికభాగం దక్షిణప్రాంతంలో పచ్చిక మైదానాలు, ఉత్తరప్రాంతంలో ఉత్తరంగా భారీగా అడవులు ఉంటాయి. ఉత్తరసముద్ర తీరం వెంట టండ్రా ఉంటుంది. ప్రపంచంలో వ్యవసాయ సాగునీటి భూమిలో 10% రష్యా కలిగి ఉంది. దక్షిణాన సరిహద్దులలో కాకస్ (మౌంట్ ఎల్బ్రస్ ఇది 5,642 మీ (18,510 అడుగుల) రష్యా, యూరోప్ లలో ఎత్తైనదిగా గుర్తించబడుతుంది). అల్టాయ్ (మౌంట్ బెల్కుహా కలిగి ఉంది, ఇది 4,506 మీ. 14,783 అడుగులు) రష్యన్ ఫార్ ఈస్ట్ వెలుపల సైబీరియా ఎత్తైన ప్రాంతం); తూర్పు భాగాలలో, కెర్చాట్కా పెనిన్సులా (క్యయుచ్వ్స్కాయ సోపికా కలిగినది, ఇది 4,750 m (15,584 అడుగులు)) యురేషియాలో అత్యధిక చురుకైన అగ్నిపర్వతం, ఆసియన్ రష్యాలో అత్యధిక ఎత్తులో ఉన్న అగ్నిపర్వతాలు). ఖనిజ వనరులతో కూడిన ఉరల్ పర్వతాలు, ఐరోపా, ఆసియాలను విభజించే ఉత్తర-దక్షిణ శ్రేణిని ఏర్పరుస్తాయి.

ఆర్కిటిక్, పసిఫిక్ మహాసముద్రాల వెంట, అలాగే బాల్టిక్ సముద్రం, సీ ఆఫ్ అజోవ్, నల్ల సముద్రం, కాస్పియన్ సముద్రంతో పాటు 37,000 కి.మీ (22,991 మైళ్ళు) విస్తీర్ణంలో విస్తృతమైన సముద్ర తీరం ఉంది.
 
బారెంట్స్ సముద్రం, వైట్ సీ, కారా సముద్రం, లాపెవ్ సీ, ఈస్ట్ సైబీరియన్ సముద్రం, చుక్కీ సముద్రం, బేరింగ్ సముద్రం, ఓఖోత్స్క్ సముద్రం, జపాన్ సముద్రం ఆర్కిటిక్, పసిఫిక్ ద్వారా రష్యాకు సంబంధం కలిగి ఉంటాయి. రష్యా ప్రధాన ద్వీపాలు, ద్వీపసమూహాలు నోవా జెమ్ల్యా, ఫ్రాంజ్ జోసెఫ్ ల్యాండ్, సెవర్నయా జెమ్ల్యా, న్యూ సైబీరియన్ ద్వీపాలు, వ్రాంజెల్ ద్వీపం, కురిల్ దీవులు, సఖాలిన్ ఉన్నాయి. డయోమెడ్ ద్వీపాలు (సంయుక్త రాష్ట్రాలు సంయుక్త రాష్ట్రాలచే నియంత్రించబడుతున్నాయి) కేవలం 3 కి.మీ (1.9 మై) వేరుగా ఉంటాయి. కునాషీర్ ద్వీపం జపాన్‌లోని హక్కైడో నుండి 20 కి.మీ. (12.4 మై) దూరంలో ఉంటుంది.

రష్యాలో వేలాది నదులు, లోతైన నీటి వనరులు ఉన్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద ఉపరితల జల వనరులలో ఇది ఒకటి. రష్యాలోని సరస్సులలో ప్రపంచంలో తాజా నీటిలో సుమారుగా నలుగవభాగం కలిగివుంటాయి. రష్యా మంచినీటి అతి పెద్ద, అతి ముఖ్యమైన సరసులలో బైకాల్ సరస్సు ప్రపంచంలోని లోతైన, స్వచ్ఛమైన, అత్యంత పురాతనమైన, అత్యంత మన్నికగల మంచి నీటి సరస్సుగా గుర్తించబడుతుంది. బైకాల్ సరసులో ప్రపంచంలోనే తాజా ఉపరితల నీటిలో ఐదో వంతు కంటే ఎక్కువగా ఉంటుంది. ఇతర పెద్ద సరస్సులలో లడొగా, ఒనెగా, ఐరోపా‌లో రెండు అతిపెద్ద సరస్సులుగా గుర్తించబడుతున్నాయి. మొత్తం పునరుత్పాదక నీటి వనరుల పరిమాణంతో బ్రెజిల్‌కు రష్యా తరువాత స్థానంలో ఉంది. దేశంలో 1,00,000 నదులు ఉన్నాయి. వోల్గా నది ప్రసిద్ధి చెందింది. ఇది ఐరోపాలో అతి పొడవైన నదిగా ఉండటంతోపాటు రష్యన్ చరిత్రలో ప్రధాన పాత్ర వహిస్తున్న కారణంగా కూడా ఇది ప్రసిద్ధి చెందింది. సైబీరియన్ నదులు ఓబ్, యెనీసీ, లేనా, అముర్ ప్రపంచంలో అతి పొడవైన నదులుగా గుర్తించబడుతున్నాయి.

రష్యా అపారమైన వైశాల్యం, సముద్రం నుండి అనేక ప్రాంతాల దూరం ఫలితంగా తేమతో కూడిన ఖండాంతర శీతోష్ణస్థితి ఆధిపత్యంలో ఉంది. ఇది టండ్రా, తీవ్రమైన ఆగ్నేయ ప్రాంతాన్ని మినహాయించి దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రబలంగా ఉంది. దక్షిణప్రాంత పర్వతాలు హిందూ మహాసముద్రం నుండి వెచ్చని గాలి ద్రవ్యరాశి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. పశ్చిమ, ఉత్తరప్రాంతం మైదానప్రాంతాలలో దేశం ఆర్కిటిక్, అట్లాంటిక్ ప్రభావాలకు తెరవబడుతుంది.
నార్త్ ఐరోపా రష్యా, సైబీరియా చాలావరకు ఉపరితల శీతోష్ణస్థితిని కలిగి ఉన్నాయి. ఈశాన్య సైబీరియా లోతట్టుప్రాంతాలలో (ఎక్కువగా సాక్ రిపబ్లిక్‌లో ఎక్కువగా కోల్డ్ ఉత్తర ధ్రువం -71.2 ° సె లేదా -96.2 ° ఫా) మరికొంత మోడరేట్ చలికాలాలు ఉంటాయి. ఆర్కిటిక్ మహాసముద్రం, రష్యన్ ఆర్కిటిక్ ద్వీపాల తీరం వెంట ఉన్న భూమి ధ్రువ వాతావరణాన్ని కలిగి ఉంటుంది.

నల్ల సముద్రం మీద ఉన్న క్రాస్నోడార్ క్రైయి తీర ప్రాంతం, ముఖ్యంగా సోచిలో, తేలికపాటి, తడి శీతాకాలాలలో తేమతో కూడిన ఉపఉష్ణమండలీయ వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఈస్ట్ సైబీరియా, ఫార్ ఈస్ట్ అనేక ప్రాంతాల్లో వేసవితో పోలిస్తే శీతాకాలం పొడిగా ఉంటుంది; దేశంలోని ఇతర ప్రాంతాలలో రుతుపవనాల కన్నా ఎక్కువ వర్షాలు చోటు చేసుకుంటాయి. దేశంలోని చాలా ప్రాంతాలలో శీతాకాలం వర్షపాతం సాధారణంగా మంచులా కురుస్తుంది. దిగువ ఓల్గా, కాస్పియన్ సముద్రతీర ప్రాంతం అలాగే దక్షిణంగా ఉన్న సైబీరియాలోని కొన్ని ప్రాంతాలు సెమీ-వాయువు వాతావరణాన్ని కలిగి ఉన్నాయి.

భూభాగం మొత్తంలో రెండు వేర్వేరు రుతువులు మాత్రమే ఉన్నాయి-శీతాకాలం, వేసవికాలం. వసంత, శరదృతువులు సాధారణంగా చాలా తక్కువ. అధిక ఉష్ణోగ్రతల మధ్య మారుతున్న క్లుప్త కాలాలు. అత్యంత చల్లని నెల జనవరి (సముద్రతీరంలో ఫిబ్రవరి); వెచ్చని నెల జూలై. ఉష్ణోగ్రత గొప్ప పరిధులు విలక్షణమైనవి. శీతాకాలంలో దక్షిణం నుండి ఉత్తరం, పశ్చిమం నుండి తూర్పు వరకు ఉష్ణోగ్రతలు చల్లగా ఉంటాయి. వేసవి కాలం సైబీరియాలో కూడా చాలా వేడిగా ఉంటుంది.
 ఖండాంతర లోపలి ప్రాంతాలలో పొడిగా ఉంటాయి.

ఉత్తరం నుండి దక్షిణానికి రష్యన్ ప్లెయిన్గా పిలువబడే ఈస్ట్ యూరోపియన్ ప్లెయిన్, ఆర్కిటిక్ టండ్రా, కనేఫెరస్ అటవీ (టైగా), మిశ్రమ, విస్తృతమైన- అడవులు, గడ్డిభూమి (స్టెప్పీ), సెమీ ఎడారి (కాస్పియన్ సముద్రం తిప్పడం), వృక్ష జాతులలో వాతావరణంలోని మార్పులను ప్రతిబింబిస్తాయి. సైబీరియా ఇదే విధమైన సన్నివేశానికి మద్దతు ఇస్తుంది. కానీ ఎక్కువగా టైగా. రష్యా ఐరోపా ఊపిరితిత్తులుగా  అని పిలువబడే ప్రపంచంలో అతిపెద్ద అటవీ నిల్వలు  కార్బన్ డయాక్సైడ్ను గ్రహించడంలో అమెజాన్ తరువాత స్థానంలో ఉన్న వర్షారణ్యాలు ఉన్నాయి.

రష్యాలో 266 క్షీరదాలు, 780 పక్షి జాతులు ఉన్నాయి. 1997 నాటికి రష్యన్ ఫెడరేషన్ రెడ్ డేటా బుక్లో మొత్తం 415 జంతు జాతులు చేర్చబడ్డాయి . అవి ఇప్పుడు రక్షించబడుతున్నాయి. రష్యాలో 28 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, 40 యునెస్కో జీవావరణ రిజర్వులు  41 జాతీయ పార్కులు, 101 ప్రకృతి నిల్వలు ఉన్నాయి.

రష్యాలో ఉన్నత-మధ్యతరగతి ఆదాయం కలిసిన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ  కలిగి ఉంది. రష్యాలో భారీ సహజ వనరులు ఉన్నాయి. వీటిలో చమురు, సహజ వాయువు ఉన్నాయి. ఇది నామమాత్ర జి.డి.పి.తో ప్రపంచంలో 12 వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. కొనుగోలు శక్తి సమానత (పి.పి.పి) 6 వ అతిపెద్దది. 21 వ శతాబ్దం ప్రారంభమైనప్పటినుంచి అధిక గృహ వినియోగం, అధికమైన రాజకీయ స్థిరత్వం రష్యా ఆర్థిక వృద్ధిని మరింత బలపరిచాయి. దేశంలో తొమ్మిదవ సంవత్సరం వృద్ధిరేటుతో 2008 లో ముగిసింది. అయితే చమురు గ్యాస్ ధరల పెరుగుదల క్షీణించడంతో వృద్ధి మందగించింది.2010 లో తలసరి రియల్ జి.డి.పి, పి.పి.పి. (ప్రస్తుత అంతర్జాతీయ) 19,840.
 చమురు లేదా ఖనిజ వెలికితీతకు, ఎగుమతులకు వ్యతిరేకంగా ప్రధానంగా దేశీయ విఫణి కొరకు వాణిజ్య రహిత సేవలు, వస్తువులను అభివృద్ధి చేశారు. రష్యాలో సగటు నామమాత్ర జీతం 2000 లో మాసానికి 80 డాలర్ల నుండి 2013 లో ప్రారంభంలో మాసానికి $ 967 డాలర్లకు అభివృద్ధి చెందింది. మే నెలలో 2016 నెలలో సగటు నామమాత్రపు నెలవారీ వేతనాలు నెలకు $ 450 క్రింద పడిపోయాయి. అత్యధిక ఆదాయాలపై వ్యక్తులు ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 2016 నాటికి సుమారు 19.2 మిలియన్ల మంది రష్యన్లు జాతీయ దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారు, 2015 లో ఇది 16.1 మిలియన్లు ఉంది. రష్యాలో నిరుద్యోగం 2014 లో 5.4% ఉంది. 1999 లో ఇది 12.4% ఉంది. అధికారికంగా రష్యన్ జనాభాలో దాదాపు 20-25% ప్రజలు మధ్య తరగతిగా వర్గీకరించబడుతున్నారు. కొందరు ఆర్థికవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు ఈ సంఖ్య అధికరించి ఉంటుందని, నిజమైన భిన్నం సుమారు 7% ఉంటుందని భావిస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ తరువాత యూరోపియన్ యూనియన్, ఇతర దేశాలలో చమురు ధరలు పడిపోవడంతో పాటు ఆయాదేశాలు ఆర్థిక ఆంక్షలు విధించడంతో మధ్యతరగతి నిష్పత్తి బాగా తగ్గిపోతుంది.

రష్యన్ ఎగుమతులలో చమురు, సహజ వాయువు, ఖనిజాలు, కలప 80% కంటే అధికంగా ఉన్నాయి. 2003 నుండి అంతర్గత మార్కెట్ గణనీయంగా బలపడటంతో ఆర్థిక ప్రాముఖ్యతలో సహజ వనరుల పాత్ర తగ్గుముఖం పట్టింది.2012 నాటికి చమురు-,-గ్యాస్ రంగం జి.డి.పి.లో 16% ఫెడరల్ బడ్జెట్ ఆదాయంలో 52%, మొత్తం ఎగుమతుల్లో 80% పైగా ఆధిక్యత వహిస్తూ ఉంది. చమురు ఎగుమతి ఆదాయాలు రష్యా తన విదేశీ నిధులను 1999 లో $ 12 బిలియన్ల ఉండగా 2008 ఆగస్టు 1 నాటికి 597.3 బిలియన్ డాలర్లకు అధికరించాయి. 2017 ఏప్రిల్ నాటికి రష్యాలో విదేశీ నిల్వలు 332 అమెరికన్ డాలర్లకు పడిపోయాయి. ఆర్థిక శాఖ మంత్రి అలెక్సీ కుడ్రిన్ నేతృత్వంలోని స్థూల ఆర్థిక విధానం కారణంగా రష్యా స్థిరీకరణ నిధిలో ఎక్కువ ఆదాయం నిల్వ చేయబడి ఉంది. 2006 లో రష్యా భారీ రుణాలను తిరిగి చెల్లించి అతిపెద్ద ఆర్థికవ్యవస్థలలో అత్యల్ప విదేశీ రుణాలలో ఇది ఒకటిగా మారింది. అనేక మంది నిపుణులు ఊహించిన దాని కంటే రష్యా ఆర్థిక సంక్షోభం నుండి ఆర్థికాభివృద్ధి స్థితిలోకి రావడానికి స్థిరీకరణ ఫండ్ సహాయం చేసింది.

 యురేషియా దేశాల కంటే దేశంలో ఉన్నత గ్రాడ్యుయేట్లు అధిక సంఖ్యలో ఉన్నారు.

మాస్కో ప్రాంతం దేశపు జి.డి.పి.లో చాలా పెద్ద వాటాను కలిగి ఉన్న కారణంగా దేశం ఆర్థిక అభివృద్ధి భౌగోళికంగా అసమానంగా ఉంది. 
 గృహ ఆదాయం, సంపద అసమానత్వం కూడా గుర్తించబడింది. క్రెడిట్ సూసీ కనుగొన్న రష్యన్ సంపద పంపిణీ ఇతర దేశాల కంటే చాలా తీవ్రంగా ప్రత్యేక వర్గంలో ఉంచడానికి అర్హమైనదిగా భావించబడుతుంది. 1990 లలో నిర్లక్ష్యం చేయబడిన సంవత్సరాల తర్వాత పాతబడిన, సరిపోని మౌలిక సదుపాయాల ఆధునికీకరణ కొరకు 2020 నాటికి $ 1 ట్రిలియన్ల పెట్టుబడి పెట్టనుంది.  డిసెంబరు 2011 లో 18 సంవత్సరాల సుదీర్ఘచర్చల తరువాత రష్యా ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్యదేశంగా ఆమోదించబడింది. ఇది విదేశీ విపణులకు ఎక్కువ అవకాశం కల్పించింది. కొంతమంది విశ్లేషకులు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సభ్యత్వం పొందడంతో రష్యన్ ఆర్ధికవ్యవస్థ సంవత్సరానికి 3% వరకు అభివృద్ధి చేయగలరని అంచనా వేశారు. కరప్షన్ పెర్సెప్షన్ ఇండెక్స్  ప్రకారం రష్యా ఐరోపాలో రెండవ అత్యంత అవినీతి దేశం (యుక్రెయిన్ తరువాత) గా ఉంది. నార్వేజియన్-రష్యన్ చాంబర్ ఆఫ్ కామర్స్ కూడా రష్యన్, అంతర్జాతీయ కంపెనీలు ఎదుర్కోవలసి ఉన్న అతిపెద్ద సమస్యలలో ఇది ఒకటిగా ఉందిఅని భావిస్తునాయి. రష్యాలో అవినీతి ముఖ్యమైన అంశంగా గుర్తించబడింది. 
ఇది ప్రభావితం చేస్తున్న మొత్తం అంశాలలో ప్రజా పరిపాలన  చట్ట అమలు  ఆరోగ్య సంరక్షణ, విద్య వంటివి ఉన్నాయి. రష్యాలో ప్రజా పరిపాలన చారిత్రక నమూనాలో అవినీతి స్పష్టంగా గోచరిస్తూ స్థిరపడి రష్యాలో సాధారణ పాలన బలహీనతకు కారణమైంది. ట్రాన్స్పెరెన్సీ ఇంటర్నేషనల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2016 ఆధారంగా రష్యా స్కోరు 29 తో 176 దేశాలలో 131 వ స్థానాన్ని పొందింది.

అవినీతికి సంబంధించిన వాస్తవ వ్యయాల గురించి అనేక అంచనాలు ఉన్నాయి. రోస్టాట్ నుండి అధికారిక ప్రభుత్వ గణాంకాల ఆధారంగా నీడ ఆర్థిక వ్యవస్థ 2011 లో రష్యా జి.డి.పి.లో కేవలం 15% మాత్రమే ఆక్రమించింది. దీనిలో నమోదు చేయని జీతాలు (పన్నులు, సాంఘిక చెల్లింపులను నివారించడం), ఇతర రకాల పన్ను ఎగవేత ఉన్నాయి. రొస్టాట్ అంచనాల ప్రకారం 2011 లో అవినీతి జి.డి.పి.లో కేవలం 3.5% నుండి 7% మాత్రమే ఉంది. కొంతమంది స్వతంత్ర నిపుణులు రష్యా జి.డి.పి.లో 25% వరకు అవినీతికి వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు నివేదికలో ఈ సంఖ్యను 48% ఉంది. లంచగొండితనంలో ప్రధానంగా ఒక ఆసక్తికరమైన మార్పు కూడా ఉంది: గతంలో అధికారులకు చట్టపరమైన ఉద్ఘాటనలకు వారి కళ్ళు మూసివేయడానికి పనిచేసింది. ప్రస్తుతం లంచాలు తీసుకున్నప్పటికీ వారు ఇప్పుడు తమ బాధ్యతలను నిర్వహించటానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవల సంవత్సరాల్లో రష్యాలో అవినీతి వ్యాపారం అయ్యిందని పలువురు నిపుణులు ఒప్పుకుంటారు. 1990 వ దశకంలో వ్యాపారవేత్తలు క్రిష్షా (సాహిత్యపరంగా, పైకప్పు, అనగా రక్షణ) అందించడానికి వివిధ నేర సమూహాలకు చెల్లించాల్సి వచ్చింది. ఈ రోజుల్లో ఈ రక్షణ ఫంక్షన్ అధికారులు నిర్వహిస్తారు. అవినీతి అధికార వ్యవస్థ ఆర్థిక వ్యవస్థలోని వివిధ విభాగాలను కలిగి ఉంటుంది, 
 విద్యవ్యవస్థలో కూడా అవినీతి చోటుచేసుకుంది.

చివరకు రష్యన్ జనాభా తమ ధనాన్ని ఈ అవినీతికి చెల్లిస్తుంది. ఉదాహరణకు గృహనిర్మాణం, నీరు, వాయువు, విద్యుత్ సుంకాలలో త్వరిత పెరుగుదల ద్రవ్యోల్బణ రేటును గణనీయంగా అధిగమిస్తుందని కొందరు నిపుణులు విశ్వసిస్తున్నారు. అత్యధిక స్థాయిలో ఉన్న అవినీతి ప్రత్యక్ష ఫలితం చూపిస్తుందని భావిస్తున్నారు.

పుతిన్ రెండోసారి పరిపాలన చేపట్టినప్పటి నుండి ఇటీవల సంవత్సరాల్లో అవినీతికి వ్యతిరేక ప్రతిస్పందన అధికరించింది.ప్రస్తుతం అవినీతి కేసులు చాలా తక్కువగా ఉన్నాయి. పుతిన్ వ్యవస్థలో పౌర సేవా, వ్యాపారం సర్వవ్యాప్తి, బహిరంగ విలీనం, అలాగే బంధువులు, స్నేహితులు, పరిచయస్థుల ఉపయోగం బడ్జెట్ వ్యయం నుండి లబ్ధి పొందేందుకు, ప్రభుత్వఆస్తిని స్వాధీనం చేసుకునేందుకు విశేషంగా అవినీతి చోటుచేసుకుంటుంది. కార్పొరేట్, ఆస్తి,, భూమి రైడింగ్ సర్వసాధారణంగా ఉంది.

 రష్యన్ అధికారుల నుండి తగిన ప్రతిస్పందన లేకపోవడం వలన ప్రచురించబడిన పరిశోధనాత్మక చలన చిత్రం ఇజ్ నాట్ డిమాన్ టూ యు యు కి, యూట్యూబ్‌లో 20 మిలియన్ల కంటే ఎక్కువ వీక్షణలను పొందింది. 2017 జూన్ 12 న కొత్త సామూహిక నిరసనలు ప్రకటించబడ్డాయి.

.
రష్యా మొత్తం భూభాగం సాగు భూమిలో 12,37,294 చదరపు కిలోమీటర్లు (4,77,722 చదరపు మైళ్ళు) ప్రపంచంలో నాల్గవ అతిపెద్దదిగా అంచనా వేయబడింది. 1999 నుండి 2009 వరకు రష్యా వ్యవసాయం క్రమంగా పెరిగింది. తరువాత దేశం ధాన్యం దిగుమతిదారు నుండి ఇ.యూ, యునైటెడ్ స్టేట్స్ తర్వాత మూడవ అతిపెద్ద ధాన్యం ఎగుమతిదారుగా మారింది. 1999 లో 68,13,000 టన్నులు ఉన్న మాంసం ఉత్పత్తి 2008 లో 93,31,000 టన్నులకు అధికరించింది. ఈ వ్యవసాయ పునరుద్ధరణ ప్రభుత్వం క్రెడిట్ విధానం ద్వారా మద్దతు పొందింది. వ్యక్తిగతమైన రైతులు, భారీ సోవియట్ కొల్ఖోజోలుగా ఉన్న పెద్ద ప్రైవేటీకరించిన కార్పోరేట్ పొలాలు, ఇప్పటికీ వ్యవసాయ భూములలో గణనీయమైన వాటా కలిగివున్నాయి. 
 పెద్ద వ్యవసాయ క్షేత్రాలు ముఖ్యంగా చేస్తున్న ధాన్యం ఉత్పత్తి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులపై దృష్టి పెడుతుంటాయి. చిన్న ప్రైవేట్ గృహ క్షేత్రాలలో దేశం బంగాళాదుంపలు, కూరగాయలు, పండ్లను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంటారు.

రష్యాకు మూడు మహాసముద్రాలు (అట్లాంటిక్, ఆర్కిటిక్,, పసిఫిక్) సరిహద్దులుగా ఉన్నందున రష్యన్ చేపల పెంపకదారులు ఒక ప్రధాన ప్రపంచ చేపల సరఫరాదారులుగా ఉన్నారు. రష్యా 2005 లో 31,91,068 టన్నుల చేపలను స్వాధీనం చేసుకుంది. 2008 లో చేపలు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులు రెండింతలు పెరిగాయి. 2008 లో చేపల ఉత్పత్తుల విలువ $ 2,415, $ 2,036 మిలియన్లు చేరుకుంది.

బాల్టిక్ సముద్రం నుండి పసిఫిక్ మహాసముద్రం వరకు విస్తరించిన రష్యా అటవీసంపద ప్రపంచంలోని అడవులలో ఐదో వంతు కంటే ఎక్కువగా ఉంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద అటవీ దేశంగా మారుతుంది. ఏదేమైనా ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ, రష్యన్ ఫెడరేషన్ ప్రభుత్వం  అధ్యయనం ఆధారంగా రష్యన్ అడవుల గణనీయమైన శక్తిని ఉపయోగించుకోవడం లేదు. అటవీ ఉత్పత్తులలో ప్రపంచ వాణిజ్యంలో రష్యా వాటా నాలుగు కంటే తక్కువ శాతం ఉంది.

ఇటీవల సంవత్సరాల్లో రష్యా తరచుగా శక్తి వనరుగా మీడియాలో వివరించబడుతుంది. దేశం సహజవాయువు నిల్వలు ప్రపంచంలో అతిపెద్ద సహజవాయువు నిల్వలు కలిగిన దేశంగా, ​8 వ అతిపెద్ద చమురు నిక్షేపాలు కలిగిన దేశంగా, రెండవ అతిపెద్ద బొగ్గు నిల్వలు కలిగిన దేశంగా ఉంది. రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు ఎగుమతిదారు, రెండవ అతిపెద్ద సహజ వాయువు ఉత్పత్తిదారు. అతిపెద్ద చమురు ఎగుమతిదారు, అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు.

రష్యా ప్రపంచంలోనే 3 వ అతిపెద్ద విద్యుత్తు ఉత్పత్తిదారు. దేశంలో బాగా అభివృద్ధి చెందిన జలవిద్యుత్ ఉత్పత్తి కారణంగా 5 వ అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిదారు దేశంగా ఉంది. వోల్గా వంటి పెద్ద నదుల వెంట యూరోపియన్ రష్యాలో భారీ జల విద్యుత్ కేంద్రాల నిర్మించబడ్డాయి. రష్యాలోని ఆసియా ప్రాంతంలో అనేక ప్రధాన జల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి; అయినప్పటికీ, సైబీరియా లోను, రష్యన్ ఫార్ ఈస్ట్ భూభాగంలోనూ అతిపెద్ద జలవిద్యుత్ ఎక్కువగా కనిపించలేదు.

పౌర అణుశక్తిని అభివృద్ధి చేయటానికి ప్రపంచంలో మొట్టమొదటి అణు విద్యుత్ కర్మాగారాన్ని నిర్మించేందుకు ప్రయత్నించిన మొట్టమొదటి దేశం రష్యా. ప్రస్తుతం దేశంలో 4 వ అతిపెద్ద అణు ఇంధన ఉత్పత్తిదారు దేశంగా, రష్యాలోని అన్ని అణు విద్యుత్‌తో  రోసాటమ్ స్టేట్ కార్పొరేషన్  నిర్వహించబడుతోంది. 2020 నాటికి 16.9% నుండి 23% వరకు అణుశక్తి వాటాను పెంచడం లక్ష్యంగా ఈ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. రష్యన్ ప్రభుత్వం 127 బిలియన్ రూబిళ్లు ($ 5.42 బిలియన్) కేటాయించటానికి ఒక సమాఖ్య కార్యక్రమంలో ప్రణాళికలు సిద్ధం చేసింది. అణుశక్తి టెక్నాలజీ. ఫెడరల్ బడ్జెట్ నుండి 2015 నాటికి 1 ట్రిలియన్ రూబిళ్లు ($ 42.7 బిలియన్లు) అణు విద్యుత్ పరిశ్రమ అభివృద్ధికి కేటాయించబడతాయి.

రష్యాలో రైల్వే రవాణా ఎక్కువగా ప్రభుత్వనిర్వహణలో రైల్వేస్ గుత్తాధిపత్య నియంత్రణలో ఉంది. ఈ సంస్థ రష్యా జి.డి.పి.లో 3.6% కంటే అధికమైన వాటాను కలిగి ఉంది. మొత్తం సరుకు ట్రాఫిక్లో 39% (పైప్లైన్స్తో సహా), ప్రయాణీకుల రద్దీలో 42% కంటే ఎక్కువగా నిర్వహిస్తుంది. సాధారణ-ఉపయోగించే రైల్వే ట్రాక్స్ మొత్తం పొడవు 85,500 కిమీ (53,127 మైళ్ళు), ఇది ప్రపంచంలో రెండవదిగా ఉండి యునైటెడ్ స్టేట్స్‌ను మించిపోయింది. 44,000 కి.మి కంటే అధికంగా (27,340 మైళ్ళు) ట్రాక్స్ను విద్యుద్దీకరణ చేస్తారు, ఇది ప్రపంచంలోని అతిపెద్ద సంఖ్య, అదనంగా పారిశ్రామిక కాని సాధారణ కారియర్ లైన్ల కంటే అధికంగా 30,000 కి.మీ (18,641 మైళ్ళు) రైలు మార్గాలు ఉన్నాయి. రష్యాలో రైల్వేలు చాలా వరకు 1,520 మిమీ (4 అడుగులు 11 27/32 అం) బ్రాడ్ గేజ్ను ఉపయోగిస్తాయి. సకాలిన్ ద్వీపంలో 957 కిమీ (595 మై) మినహా, సన్నని గేజ్ 1,067 మిమీ (3 అడుగులు 6 అం). రష్యాలో అత్యంత ప్రసిద్ధ రైల్వే ట్రాన్స్-సైబీరియన్ (ట్రాన్స్సిబ్), రికార్డు 7 సమయ మండలాలను కలిగి ఉంది. ప్రపంచంలో అతి పొడవైన సింగిల్ నిరంతర సేవలు మాస్కో-వ్లాడివోస్టోక్ (9,259 కి.మీ. (5,753 మై)), మాస్కో-ప్యోంగ్యాంగ్ (10,267 కి.మీ. ( 6,380 మై)), కీవ్-వ్లాడివోస్టోక్ (11,085 కి.మీ (6,888 మై)) ఉంది.

మొత్తం 102,000 కి.మీ. (63,380 మైళ్ళు) రష్యాలోని లోతట్టు జలమార్గాలు, సహజ నదులు లేదా సరస్సులతో నిర్మించబడ్డాయి. దేశంలోని ఐరోపా భాగంలో చానెల్స్ నెట్వర్క్ ప్రధాన నదులను సరోవరాలను కలుపుతుంది. రష్యా రాజధాని, మాస్కో, కొన్నిసార్లు బాల్టిక్, వైట్, కాస్పియన్, అజోవ్, బ్లాక్ సీలకు దాని జలమార్గ కనెక్షన్ల కారణంగా, ఐదు సముద్రాల ఓడరేవుగా పిలువబడుతుంది.

రష్యా అతిపెద్ద సముద్ర ఓడరేవులు ఉన్నాయి. అజోవ్ సముద్రం మీద నోటోసోసిస్క్, నల్లసముద్రం తీరంలో నొవొరొస్సియ్స్క్, కాస్పియన్ సముద్రతీరంలో అస్ట్రాఖాన్, మక్చాకాలో, బాల్టిక్ సముద్రతీరంలో అర్కింగెల్స్క్, కాలినిన్గ్రాడ్ తెల్ల సముద్రతీరంలో అర్ఖంగెల్స్క్, పెట్రోపావ్లోవ్స్క్, బారెంట్స్ సముద్రతీరంలో, పసిఫిక్ మహాసముద్రంపై కాంచట్స్కీ, వ్లాడివోస్టోక్‌ నౌకాశ్రయాలు ఉన్నాయి. 2008 లో దేశంలో 1,448 వ్యాపార సముద్ర నౌకలు ఉన్నాయి. నార్తరన్ సముద్ర మార్గంలో ఐరోపా, తూర్పు ఆసియా మీదుగా  న్యూక్లియర్ - పవర్డ్ ఐస్‌బ్రేకర్  రష్యా ఆర్కిటిక్ కాంటినెంటల్ షెల్ఫ్ ఆర్థికంగా అతి వినియోగం, సముద్రవ్యాపారాభివృద్ధి రష్యన్ సముద్రమార్గ వాణిజ్యకార్యకలాపాలు నిర్వహించబడుతున్నాయి.

సహజవాయువు పైప్లైన్ల మొత్తం పొడవుతో రష్యా యునైటెడ్ స్టేట్స్కు తరువాత రెండవ స్థానంలో ఉంది. ప్రస్తుతము చాలా కొత్త పైప్లైన్ ప్రాజెక్టులు ఐరోపాకు నోర్డ్ స్ట్రీమ్, సౌత్ స్ట్రీం సహజ వాయువు పైప్లైన్స్, తూర్పు సైబీరియా - పసిఫిక్ మహాసముద్ర పైప్లైన్ (ESPO) లు రష్యన్ ఫార్ ఈస్ట్, చైనా లకు తోడ్పడ్డాయి.

రష్యా 1,216 విమానాశ్రయాలను కలిగి ఉంది. రష్యాలో రద్దీగా ఉండే షెర్మేమీటీవో, డోమోడిడోవో, మాస్కోలో విన్నౌకో, సెయింట్ పీటర్స్బర్గ్లోని పుల్కోవో విమానాశ్రయాలు ఉన్నాయి.

సాధారణంగా ప్రధాన రష్యన్ నగరాలు ప్రజా రవాణా వ్యవస్థ బాగా అభివృద్ధి చెందిన వ్యవస్థలు కలిగివుంటాయి. వీటిని బస్సులు, ట్రాలీలు, ట్రాంలను ఉపయోగించి అత్యంత సాధారణంగా అత్యంత నిర్వహించబడుతుంది. ఏడు రష్యన్ నగరాలైన మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్, నిజ్నీ నొవ్గోరోడ్, నవోసిబిర్క్స్, సమారా, యెకాటెరిన్బర్గ్, కజాన్లలో భూగర్భ మెట్రో మార్గాలు ఉన్నాయి. వోల్గోగ్రాండ్ మెట్రోట్రామ్ను కలిగి ఉంది. రష్యాలో మెట్రోమార్గం మొత్తం పొడవు 465.4 కిలోమీటర్లు (289.2 మైళ్ళు) ఉంది. మాస్కో మెట్రో, సెయింట్ పీటర్స్బర్గ్ మెట్రో రష్యాలో అత్యంత పురాతనమైనవిగా ఉన్నాయి. ఇవి వరుసగా 1935, 1955 లో ప్రారంభించబడ్డాయి. ఈ రెండూ ప్రపంచంలో వేగవంతమైన, అత్యంత రద్దీ కలిగిన మెట్రో వ్యవస్థలలో ఒకటిగా ఉన్నాయి. వాటిలో కొన్ని గొప్ప అలంకరణలు, వాటి స్టేషన్ల ప్రత్యేకమైన డిజైన్లకు ప్రసిద్ధి చెందాయి. ఇది రష్యన్ మెట్రో, రైల్వేలలో సాధారణ సంప్రదాయంగా ఉంది.

నికోలాయ్ లాబోచేవ్స్కి (నాన్ యూకోక్డియన్ జ్యామితి మార్గదర్శకుడు జ్యామెట్రి కోపెర్నికస్), ప్రముఖ శిక్షకుడు పాఫ్నిటీ చెబిషేవ్ కాలం నుండి రష్యన్ గణిత శాస్త్ర విద్య ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైనదిగా మారింది. చెబిషేవ్ విద్యార్థులు ఆధునిక స్థిరత్వ సిద్ధాంతాన్ని స్థాపించిన  అలెక్సాండ్రా లియాపనోవ్ , ఆండ్రీ మార్కోవ్  మార్కోవ్ గొలుసులు  కనిపెట్టాడు. 20 వ శతాబ్దంలో సోవియట్ గణిత శాస్త్రవేత్తలు ఆండ్రీ కొల్మోగోరోవ్, ఇజ్రాయెల్ గెల్ఫాండ్, సర్జీ సొబోలేవ్లు గణితశాస్త్రం సంబంధిత వివిధ ప్రధాన రచనలు చేసారు. తొమ్మిది సోవియట్ / రష్యన్ గణిత శాస్త్రవేత్తలు గణితశాస్త్రంలో అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారం అయిన ఫీల్డ్స్ మెడల్‌తో సత్కరించబడ్డారు. ఇటీవలే గ్రిగోరి పెరెల్మ్యాన్ 2002 లో పోయిన్కేర్ మొట్టమొదటి క్లే మిలీనియం ప్రైజ్ ప్రాబ్లమ్స్ అవార్డును అందుకున్నాడు 

రష్యన్ రసాయన శాస్త్రజ్ఞుడు డిమిట్రీ మెండేలీవ్ ఆధునిక కెమిస్ట్రీ ప్రధాన చట్రం ఆవర్తన పట్టికను కనిపెట్టాడు. రసాయన నిర్మాణం సిద్ధాంతానికి చెందిన రచయితలలో ఒకరు అలెగ్జాండర్ బట్లర్వ్, సేంద్రీయ కెమిస్ట్రీలో కీలక పాత్ర పోషించాడు. రష్యన్ జీవశాస్త్రవేత్తలు డిమిట్రీ ఇవనోవ్స్కీ వైరస్‌లను కనుగొన్నారు. ఇవాన్ పావ్లోవ్ శాస్త్రీయ కండిషనింగ్‌తో మొట్టమొదటి ప్రయోగాలు చేసాడు. ఇల్యా మెచ్నికోవ్  రోగనిరోధక వ్యవస్థ, ప్రోబయోటిక్స్  మార్గదర్శకుడుగా ఉన్నారు.

ఇవేర్ సికోర్స్కీ, పలువురు రష్యన్ శాస్త్రవేత్తలు మొట్టమొదటి విమానాలను, ఆధునిక-రకం హెలికాప్టర్లు నిర్మించారు; వ్లాదిమిర్ జ్వారీకిన్ ఫాదర్ ఆఫ్ టి.వి గా శ్లాగించబడ్డాడు. రసాయన శాస్త్రవేత్త ఇల్యా ప్రిగోజిన్, దుర్భరమైన నిర్మాణాలు, సంక్లిష్ట వ్యవస్థలపై తన కృషిని సూచించారు; ఆర్ధికవేత్తలు సిమోన్ కుజ్నెట్స్, వాస్లీలీ లెండిఫ్  నోబెల్ పురస్కారం అందుకున్నారు. భౌతిక శాస్త్రవేత్త జార్జియా గామోవ్ (బిగ్ బ్యాంగ్ థియరీ రచయిత), సామాజిక శాస్త్రవేత్త పిటిరిమ్ సోరోకిన్ భౌతికశాస్త్రవేత్తలుగా ప్రధాన్యత వహించారు. లియోనార్డ్ ఎయిలర్, అల్ఫ్రెడ్ నోబెల్ లాంటి విదేశీయులు పలువురు దీర్ఘకాలంగా రష్యాలో పనిచేశారు.

రష్యన్ ఆవిష్కర్త నికోలాయ్ బెనార్డోస్చే ఆర్క్ వెల్డింగ్ను కనుగొన్నాడు. దీనిని నికోలాయ్ స్లావియనోవ్, కాంస్టాంటిన్ ఖ్రెనోవ్, ఇతర రష్యన్ ఇంజనీర్లు అభివృద్ధి చేశారు. గ్లేబ్ కొట్టీనికోవ్ నాప్సాక్ పారాచూట్ను కనిపెట్టాడు. ఎవ్వనియ చెర్టోవ్స్కీ  ప్రెషర్ సూట్  ప్రవేశపెట్టాడు. అలెగ్జాండర్ లాడియోన్, పావెల్ యాబ్లోచ్కోవ్ విద్యుత్ దీపాలకు మార్గదర్శకులుగా ఉన్నారు. మిఖాయిల్ డోలివో-డాబ్రోవోల్స్కై మొదటి  త్రీ ఫీజ్ ఎలెక్ట్రిక్ పవర్  వ్యవస్థలను ప్రవేశపెట్టారు. ఈ రోజు అది విస్తృతంగా ఉపయోగించబడుతుంది. సెర్గీ లెబెడెవ్ మొదటి వాణిజ్యపరంగా విజయవంతమైన, సామూహిక ఉత్పాదక రకం సింథటిక్ రబ్బరును కనుగొన్నాడు. నికోలాయ్ బ్రూసెంటెవ్వ్ మొట్టమొదటి టెర్నరీ కంప్యూటర్ సెటూన్ అభివృద్ధి చేసాడు.

సోవియట్, రష్యన్ స్పేస్ స్టేషన్ మీర్

ప్రముఖ రష్యన్ యుద్ధ ట్యాంకులు T34, రెండో ప్రపంచ యుద్ధం భారీగా ఉత్పత్తి చేయబడిన ట్యాంక్ రూపకల్పన, టి-సిరీస్ ట్యాంకులు ఉన్నాయి. ఇవి చరిత్రలో T54 / 55 లో అత్యధిక ఉత్పత్తి చేయబడ్డాయి. మిఖాయిల్ కలాష్నికోవ్చే AK47, AK74 ట్యాంకులలో ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించే రైఫిల్ రైఫిళ్ళు ఉంటాయి. కాబట్టి అన్ని ఇతర తుపాకీలను మిళితం చేసిన దానికన్నా మరింత శక్తివంతమైన AK-రకం రైఫిళ్లు తయారు చేయబడ్డాయి.

ఏది ఏమయినప్పటికీ ఈ విజయాలన్నింటితో చివరి సోవియట్ యుగం నుండి రష్యా అనేక పశ్చిమ సాంకేతిక పరిజ్ఞానాలలో వెనకబడి ఉంది. వీటిలో అధికంగా శక్తి పరిరక్షణ, వినియోగ వస్తువులు ఉత్పత్తికి సంబంధించినవి ఉన్నాయి. 1990 ల సంక్షోభం విజ్ఞాన శాస్త్రానికి ప్రభుత్వ సహాయాన్ని తీవ్రంగా తగ్గించింది. ఇది రష్యా నుండి ఒక బ్రెయిన్ డ్రెయిన్ వలసను దారితీసింది.

పస్తుతం రష్యా గ్లోనాస్ శాటిలైట్ నావిగేషన్ సిస్టం పూర్తి చేసింది. దేశం తన సొంత ఐదవ తరం జెట్ యుద్ధాన్ని అభివృద్ధి చేస్తుంది. ప్రపంచంలోని మొట్టమొదటి సీరియల్ మొబైల్ అణు కర్మాగారాన్ని నిర్మిస్తోంది.

స్పేస్ టెక్నాలజీ, అంతరిక్ష అన్వేషణ రంగంలో రష్యన్ విజయాల నేపథ్యంలో సిద్ధాంతపరమైన వ్యోమనౌకల తత్వవేత్త అయిన కోన్స్టాన్టిన్ సియోల్కోవ్స్కీ ఉన్నాడు. అతని రచనలు సోవియట్ రాకెట్ ఇంజనీర్లను ప్రేరేపించాయి.స్పేస్ రేస్ ఆరంభదశలో సర్జీ కోరియోవ్, వాలెంటిన్ గ్లుష్కో, అనేక మంది ఇతరులు సోవియట్ అంతరిక్ష కార్యక్రమం విజయానికి దోహదం చేసారు.

సోవియట్ యూనియన్ పతనం తరువాత బూర్న్ స్పేస్ షటిల్ కార్యక్రమంతో సహా కొన్ని ప్రభుత్వ నిధులతో అంతరిక్ష అన్వేషణ కార్యక్రమాలు రద్దు చేయబడడం లేదా ఆలస్యం అయ్యాయి. కాగా వాణిజ్య కార్యకలాపాలు, అంతర్జాతీయ సహకారంతో రష్యా అంతరిక్ష పరిశ్రమలో పాల్గొనడం మరింత తీవ్రమైంది.

ఈ రోజుల్లో రష్యా అతిపెద్ద ఉపగ్రహ ప్రయోగం చేస్తున్న దేశంగా ఉంది. యునైటెడ్ స్టేట్స్ స్పేస్ షటిల్ కార్యక్రమం 2011 లో ముగిసిన తరువాత సోయుజ్ సంస్థకు చెందిన రాకెట్లు మాత్రమే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లలోని వ్యోమగాములకు రవాణా చేస్తున్నాయి.

రష్యాలో సుమారు 70% నీరు త్రాగునీరు జలప్రవాహాల నుండీ, 30% భూగర్భజలం నుండి వస్తుంది. 2004 లో నీటి సరఫరా వ్యవస్థలు మొత్తం రోజుకు 90 మిలియన్ క్యూబిక్ మీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. రోజువారీ నివాస నీటి వినియోగం రోజుకు 248 లీటర్లు. ప్రపంచంలో ఉపరితల, భూగర్భజలాల్లో రష్యా నాలుగవ స్థానంలో ఉంది. రష్యాలో మొత్తం రష్యన్ ప్రజలకు సేవలు అందిస్తున్న అతిపెద్ద పరిశ్రమలలో నీటి వినియోగాలు ఒకటి.

జార్ చక్రవర్తుల హయాంలో రష్యా ఏకీకృతమై ఒక బలమైన రాజ్యంగా ఎదిగినా, కింది తరగతి ప్రజలలో సమానావకాశాలు లేకపోవటం, దానికి తోడు చక్రవర్తుల అణచివేత విధానాల వల్ల గూడుకట్టుకున్న అసంతృప్తి మొదటి ప్రపంచ సంగ్రామం నాటికి పెల్లుబికి అప్పటి రాజు రెండవ నికొలాస్ మీద ఆయన వంశస్థుల మీద ఆగ్రహ జ్వాలలుగా పైకెగసింది. అగ్నికి ఆజ్యం తోడయినట్లు మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యన్ సేనల పరాజయ పరంపర దానికి తోడై, దేశంలో అంతర్యుద్ధానికి దారితీసింది. దీన్నే రష్యన్ విప్లవంగా పిలుస్తారు. ఆ ధాటికి 1917లో రష్యా రొమనోవ్ వంశస్థుల రాజరికపు పాలన నుండి బయటపడింది. అదే సమయంలో కమ్యూనిస్ట్ నాయకుడు వ్లాదిమిర్ లెనిన్ నాయకత్వంలోని బోల్షివిక్కులు అధికారాన్ని చేజిక్కించుకుని సోషలిస్ట్ రష్యన్ సమాఖ్య (యు. ఎస్. ఎస్. ఆర్) ను ఏర్పాటు చేశారు. లెనిన్ తరువాత కమ్యూనిస్ట్ పార్టీ పగ్గాలు చేపట్టిన జోసెఫ్ స్టాలిన్ హయాంలో రష్యా పారిశ్రామికంగానూ, వ్యవసాయికంగానూ అప్రతిహతంగా పురోగమించింది. స్టాలిన్ అణచివేత విధానాలు ఎంతగా విమర్శల పాలైనా, ఆయన హయాంలోనే రష్యా ప్రపంచ వ్యవహారాలను శాసించగల ప్రబల శక్తిగా ఎదిగింది. మానవ వనరుల వినియోగం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుత విజయాలు, పారిశ్రామికీకరణ, అద్వితీయమైన సైనిక సంపత్తి మొదలయిన వాటితో అమెరికా సంయుక్త రాష్ట్రాలతో ఢీకొనే స్థాయికి ఎదిగి ప్రపంచంలో రెండవ అగ్రరాజ్యంగా పేరొందింది.

కమ్యూనిజాన్ని ఆధునికీకరించే ప్రయత్నంలో 1980లలో ప్రధాన కార్యదర్శి మిఖాయిల్ గోర్బచెవ్ పరిపాలనలో పారదర్శకత ( గ్లాస్ నోస్త్ ), సంస్కరణ ( పెరిస్త్రోయికా ) లను ప్రవేశ పెట్టాడు. ఆ ప్రయత్నం ఊహించని ఫలితాలకు దారి తీసింది.ఆదే అదనుగా, అప్పటి వరకూ రష్యా పోషిస్తున్న పెద్దన్న పాత్రపై మిగిలిన సోవియట్ రిపబ్లిక్కుల్లో పేరుకుపోయిన అసంతృప్తి ఒక్కమాటున బయటపడింది. తదనంతర పరిణామాలలో 1991 డిసెంబరు 15నాటికి సోవియెట్ సమాఖ్య పదిహేను స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది. అలా ఏర్పడిన రాజ్యాల్లో భూభాగం, జనాభా పరంగా రష్యా అన్నింటికన్నా పెద్దది. ఆ తరువాత సుమారు దశాబ్దం పాటు రష్యా ఎన్నో ఆటుపోట్లకు గురయ్యింది. ఈ కాలంలో రష్యాలో ఏక పార్టీ కమ్యూనిస్టు పాలన కనుమరుగై ఆ స్థానంలో ప్రజాస్వామ్య వ్యవస్థ రూపుదిద్దుకుంది. 1990లలో చెచెన్యా ప్రాంతం కూడా రష్యా నుండి స్వతంత్రం ప్రకటించుకుంది. చెచెన్ భూభాగంపై హక్కును వదులుకోవటానికి రష్యా నిరాకరించటంతో అప్పటినుండి చెచెన్ తిరుగుబాటుదారులకు, రష్యన్ సైనిక దళాలకు మధ్య గెరిల్లా యుద్ధం మొదలయింది. దశాబ్దంపైబడి సాగుతున్న ఈ అప్రకటిత యుద్ధంలో ఇప్పటివరకూ సుమారు రెండు లక్షలమంది అసువులు బాసినట్లు అంచనా. ఇటీవలి కాలంలో చెచెన్ తిరుగుబాటు ఇస్లాం మతం రంగు కూడా సంతరించుకుంది. చెచెన్యా తోనే కాకుండా రష్యాకు ఉత్తర ఒసేషియా, ఇన్గ్షెషియాలతో కూడా చిన్న చిన్న సరిహద్దు సమస్యలున్నాయి.

ప్రస్తుతం రష్యాలో అధ్యక్ష తరహా పాలన నడుస్తుంది. అధ్యక్షుడిని నాలుగేళ్లకోమారు ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకొంటారు. రష్యా అధ్యక్షుడికి అపరిమితమైన అధికారాలుంటాయి. ఈయన అధికార నివాసం క్రెమ్లిన్ . ప్రధాన మంత్రి సహా ముఖ్యమైన ప్రభుత్వ అధికార గణాన్ని అధ్యక్షుడే నియమిస్తాడు. ఈ నియామకానికి పార్లమెంటు ఆమోదం తప్పనిసరి. కొన్ని సందర్భాల్లో పార్లమెంటు ఆమోదంతో పని లేకుండా అధ్యక్షుడే అత్యున్నత ఆదేశాలు జారీ చేయవచ్చు. ఈయన రష్యన్ జాతీయ భద్రతా మండలికి అధ్యక్షుడు, రష్యన్ సర్వ సైన్యాధ్యక్షుడు కూడా.

స్వేచ్ఛా వణిజ్య పరంగానూ, వినిమయదారుని అభిరుచుల పరిగణణ లోనూ కొన్ని అసమర్ధతలున్నప్పటికీ, మునుపటి సోవియట్ యూనియన్ ఆర్థిక
విధానంలో రష్యా ప్రజల జీవన ప్రమణాలు ముఖ్యంగా 1950ల తరువాత విపణి కేంద్రీకృతమూ, పెట్టుబడిదారీ వ్యవస్థలైన మెక్సికో, బ్రజిల్, భారతదేశం,
అర్జెంటీనా తదితర దేశాల ప్రజల జీవన ప్రమాణాలతో పోల్చితే మెరుగ్గానే వున్నాయని చెప్పక తప్పదు.

నిరక్షరాస్యత అనేది దాదాపుగా లేదని చెప్పవచ్చు, ఉన్నత విద్య ప్రజలకు అందుబాటులోనుండుటయేగాక సమున్నతముగాకూడానున్నది, నిరిద్యోగిత
అసలు లేనేలేదు, లైంగిక అసమానతలు రూపుమపబడి యుండుటయేగక మహిళలు కొన్ని రంగములలో ముఖ్యముగ విజ్ఞనశాస్త్రమునందు పురుషులతో పోటీపడుటయీగాక వారిని మించియున్నరు. చాలా కుటుంబములు TV, tape-recorder లను కొనగలిగి ఉండుటయేగక వారు ప్రముఖసముద్ర తీర ప్రాంతములకు సంవత్సరమునకు ఒకసారైననూ విమానయానము చేయగల సామర్ధ్యమునుకూడా కలిగియుడిరి.

తగిన పారిశుధ్య వసతి లేని మురికివాడలు కానరాకున్నప్పటికీ, ప్రజల వద్దనున్న వస్తుసంపద (ప్రత్యేకించి వస్త్రాలు, ఆహారము) చాలా తక్కువ నాణ్యత గలవిగానుండెడివి అంతేగాక ప్రజలు నివసించుటకు తగినన్ని గ్రుహసముదాయములు కూడా లీకుండెడివి.

ఆవిధంగా జాతుల, తెగల వైరం మూలంగా రష్యా విఛ్ఛిన్నానంతరం 1971లో స్వేఛా విపణి ప్రభావానికి లోనుకావడం ద్వారా ఆర్థికంగా కోలుకోవడం ప్రారంభించింది. అదే సంవత్సరం సంభవించిన ఆసియా ఆర్థిక మాంద్యము 1998లో రూబుల్ పతనానికి, రష్యన్ ప్రభుత అప్పులలో కూరుకు పొవడానికి తద్వారా రష్యన్ ప్రజాజీవన విలువల పతనానికి కారణభూతమైంది. ఆ విధంగా 1998 విపణి మాంద్యానికి, ఆర్థిక వనరుల కొరతకి కూడా కారణమైంది.

ఐతే 1999 నాటికి ఆర్థిక వ్యవస్థ కొద్దిగా కోలుకోవడమేగాక త్వరితగతిన వృద్ధిచెందడం ప్రారంభించింది. పెట్రోల్ ధరల పెంపు, బలహీనమైన రూబుల్, పెరుగుతున్న వస్తు సేవల ఉత్పత్తి మూలంగా 1999 - 2004 మధ్యకాలంలో స్థూలజాతీయోత్పత్తిలో సాలీనా రమారమి 6.8% అభివృద్ధి సాధ్యమవసాగింది. ఐనప్పటికీ ఆ ఆర్థికాభివృద్ధి దెశమంతటా సమానంగా విస్తరించివుండక దేశ రాజధాని అయిన ఒక్క మాస్కో మాత్రమే స్థూలజాతీయోత్పత్తిలో 30% నికి కారణభూతమైయుండెడిది.

దేశ జనాభాలో 81% మంది జాతి రష్యన్లు ఉన్నారు. రష్యన్ ఫెడరేషన్ కూడా గణనీయంగా అల్పసంఖ్యాక ప్రజలకు నిలయంగా ఉంది.దేశ సరిహద్దుల లోపల మొత్తంగా 160 వేర్వేరు సంప్రదాయ సమూహాలు, దేశీయ ప్రజలు నివసిస్తున్నారు. Though Russia's population is comparatively large, list of countries by population density|its

రష్యా జనాభా చాలా పెద్దది అయినప్పటికీ దేశం అపారమైన పరిమాణం కారణంగా దాని సాంద్రత తక్కువగా ఉంటుంది. ఐరోపా రష్యాలో ఉరల్ పర్వతాల సమీపంలో, నైరుతి సైబీరియాలో జనాభా సాంద్రత ఎక్కువగా ఉంది. 73% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 27% మంది నివసిస్తున్నారు. 2010 జనాభా లెక్కల ఫలితాలు మొత్తం జనాభా 14,28,56,536 ఉన్నాయి.

సోవియట్ యూనియన్ రద్దుకు ముందు రష్యా జనాభా 1991 లో 14,86,89,000 ఉంది. ఇది 1990 ల మధ్యలో వేగవంతమైన జనాభా క్షీణతను అనుభవించడం ప్రారంభమైంది. తగ్గిన మరణాల శాతం జననాల శాతం, పెరిగిన ఇమ్మిగ్రేషన్ కారణంగా ఈ క్షీణత ఇటీవల సంవత్సరాల్లో మందగించింది.

 అదే సంవత్సరంలో రష్యన్ ఫెడరేషన్కు 2,79,906 వలసదారులు వచ్చారు. వీరిలో 93% సిఐఎస్ దేశాల నుండి వచ్చారు. రష్యన్ వలసదారుల సంఖ్య 2000 లో 3,59,000 నుండి 2009 లో 32,000 కు తగ్గింది. రష్యాలోని మాజీ సోవియట్ రాష్ట్రాల నుండి వచ్చిన అక్రమ వలసదారులు సుమారుగా 10 మిలియన్ ఉన్నారు. రష్యాలో సుమారుగా 116 మిలియన్ల సంప్రదాయ రష్యన్లు ఉన్నారు. 20 మిలియన్ల సంప్రదాయ రష్యన్లు రష్యా వెలుపల సోవియట్ యూనియన్ మాజీ రిపబ్లిక్లలో నివసిస్తున్నారు. ఎక్కువగా ఉక్రెయిన్, కజాఖస్తాన్ లలో నివసిస్తున్నారు.

యూరోపియన్ యూనియన్ సగటు 1000 మందికి 10.1 శాతంతో పోల్చి చూస్తే పోలిస్తే యూరోపియన్ దేశాల కంటే రష్యాలో జననాలి ( 1000 మందికి 13.3 జననాలు) అధికంగా ఉన్నాయి. రష్యా జననాల శాతం ఎక్కువగా ఉంది. అయితే దాని మరణ రేటు గణనీయంగా అధికంగా ఉంది. (2014 లో రష్యా 1000 మందికి 13.1 మంది మరణించారు  యురేపియన్ యూనియన్ సగటు కంటే (1000 మందికి 9.7 గా ఉంది). 
compared to the EU average of 9.7 per 1000). ఆరోగ్యం, సాంఘిక వ్యవహారాల మంత్రిత్వశాఖ అంచనా ప్రకారం 2011 నాటికి సంతానోత్పత్తి పెరుగుదల అలాగే మరణాల క్షీణత కారణంగా మరణ శాతం జనన శాతంతో సమానం అని అంచనా వేసింది. జనన రేటు పెంచడానికి అలాగే మరింత మంది వలసదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. మంత్లీ ప్రభుత్వ చైల్డ్-సహాయం చెల్లింపులు యు.ఎస్. డాలర్లకు 55 కు రెట్టింపయ్యాయి. 2007 నుండి రెండో చైల్డ్ ఉన్న మహిళలకు ఒక సమయ చెల్లింపుగా యు.ఎస్. డాలర్లు 9,200 చెల్లించబడింది.

ఆగస్టు 2012 లో దేశం 1990 ల నుండి మొదటి జనాభా వృద్ధిని సాధించిన తరువాత రష్యా జనాభా 2025 నాటికి 146 మిలియన్లకు చేరవచ్చని అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు, ప్రధానంగా ఇమ్మిగ్రేషన్ ఫలితంగా జరగవచ్చని భావిస్తున్నారు.

రష్యాలో బహుళ రాజ్యాలకు చెందిన 170 సంప్రదాయ సమూహాలకు చెందిన ప్రజలు ఉన్నారు: వీరిలో కన్ని సమూహాలకు చెందిన ప్రజలు ఆధికసంఖ్యాక ప్రజలుగా ఉన్నారు. (రష్యన్లు, తాతర్లు). 10,000 కంటే తక్కువ సంఖ్యలో సామీ ప్రజలు, ఇనుయిట్ ప్రజలు ఉన్నారు.

రష్యాలో ఉన్న 160 సంప్రదాయ సమూహాలు దాదాపు 100 భాషలు మాట్లాడతాయి. 2002 జనాభా లెక్కల ప్రకారం 142.6 మిలియన్ల మంది ప్రజలకు రష్యన్ వాడుక భాషగా ఉంది. తర్వాత స్థానంలో ఉన్న టాటర్ 5.3 మిలియన్ల మందికి వాడుక భాషగా ఉంది. ఉక్రేనియన్ 1.8 మిలియన్ మందికి వాడుక భాషగా ఉంది. రష్యా మాత్రమే ప్రభుత్వ అధికారిక భాషగా ఉంది. కానీ రాజ్యాంగం రష్యన్లతో పాటు తమ సొంత భాషలను స్థాపించే హక్కును రిపబ్లిక్కులకు అందిస్తుంది.

రష్యన్ భాష దేశవ్యాప్తంగా ఏకజాతీయ భాషగా విస్తారంగా వాడుకలో ఉంది. యూరసియా భౌగోళికంగా అత్యధికంగా విస్తారంగా వాడుకలో ఉన్న భాషగా రష్యా అలాగే విస్తారంగా మాట్లాడే స్లావిక్ భాషగా ఉంది. ఇది ఇండో-యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినది. తూర్పు స్లావిక్ భాషల్లో ఇప్పటికీ ఉనికిలో ఉన్న భాషలలో ఇది ఒకటి. ఇతర భాషలలో బెలారసియన్, ఉక్రేనియన్ (, బహుశా రుయ్న్) ప్రధానమైనవి. ఓల్డ్ ఈస్ట్ స్లావిక్ వ్రాతపూర్వక ఉదాహరణలు (ఓల్డ్ రష్యన్) 10 వ శతాబ్దం నుండి వీటిని ధ్రువీకరించబడ్డాయి.

అంతర్జాలంలో అత్యధికంగా వాడుకలో ఉన్న భాషలలో రష్యన్ ద్వితీయ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఇంగ్లీష్ ఉంది. ఉన్న రెండు అధికారిక భాషలలో ఆంగ్లము ఒకటి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తరువాత రష్యన్ రెండవ భాషగా ఉపయోగించబడుతుంది. ఇది ఐదు ఆరు అధికారిక భాషలలో ఇది ఒకటి. స్థానిక ప్రభుత్వాలు వివిధ ప్రాంతాల్లో రష్యాలో 35 భాషలను అధికారికంగా గుర్తించాయి.

రష్యన్లు 10 వ శతాబ్దం నుంచి ఆర్థడాక్స్ క్రిస్టియానిటీని అభ్యసించారు. ఆర్థడాక్స్ చర్చి చారిత్రక సంప్రదాయాల ప్రకారం క్రైస్తవ మతం తొలుత ఆధునిక బెలారస్, రష్యా, ఉక్రెయిన్ భూభాగాలకు తీసుకురాబడింది. ఇది క్రీస్తు మొదటి ఉపదేశకుడు సెయింట్ అండ్రూ చేత చేయబడింది. ప్రైమరీ క్రానికల్ తరువాత కీవన్ రస్ కచ్చితమైన క్రైస్తవీకరణ సంవత్సరం 988 (సంవత్సరానికి వివాదాస్పదమైనదిగా ఉంది), వ్లాదిమిర్ ది గ్రేట్ (చెర్సొనెసస్లో) బాప్టిజం పొందాడు అలాగే కీవ్ లో తన కుటుంబాన్ని, ప్రజలను బాప్టిజం చేయడానికి ముందుకు తీసుకుని వచ్చాడు. తరువాతి సంఘటనలు సంప్రదాయబద్ధంగా రష్యన్, ఉక్రెయిన్ సాహిత్యంలో రష్యన్  బాప్టిజంగా వర్ణించబడింది. ఇతర స్లావిక్ ప్రజల మాదిరిగా రష్యన్ జనాభాలో చాలా శతాబ్దాలుగా  డబుల్ బిలీఫ్   (డౌవెరీయే)ఉంది. ప్రజలు దేశీయ మతం, ఆర్థడాక్స్ క్రిస్టియానిటీలు ఒకేసారి ఆచరించారు.

అందువలన ఒక సైద్ధాంతిక లక్ష్యంగా, మతం తొలగింపు, సార్వత్రిక నాస్తికత్వం దాని ప్రత్యామ్నాయంగా ప్రకటించిన మొదటి కమ్యూనిస్ట్ దేశాలలో యు.ఎస్.ఎస్.ఆర్ ఒకటి. కమ్యూనిస్ట్ ప్రభుత్వం మతాలను, వాటి విశ్వాసులనూ అపహాస్యం చేసింది. పాఠశాలల్లో నాస్తికత్వం ప్రచారం చేసింది. సంపద అక్రమ సేకరణకు సంబంధించిన ఆరోపణల మీద మతపరమైన ఆస్తులను జప్తు చేయడం తరచూ జరిగాయి.

సోవియెట్ యూనియన్‌లో ప్రభుత్వ నాస్తికత్వం రష్యాలో  గోసటీజం  గా గుర్తించబడింది. మార్క్సిజం-లెనినిజం భావజాలంపై ఆధారపడింది. మార్క్సిస్ట్-లెనినిస్ట్ నాస్తికత్వం అనేది మతం నియంత్రణ, అణచివేత, తొలగింపు కొరకు నిలకడగా వాదించింది. విప్లవం ఒక సంవత్సరం లోపలే తమను తాము చర్చిలు, 1922 - 1926 వరకు 28 రష్యన్ ఆర్థోడాక్స్ బిషప్లు, 1,200 మంది పూజారులు చంపబడ్డారు  చర్చీలు అన్నింటి ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. చాలామంది హింసించబడ్డారు. సోవియట్ యూనియన్ కుప్పకూలిన తరువాత రష్యాలో మతాల పునరుద్ధరణ జరిగింది. రోడ్స్నోరి (స్లావిక్ నేటివ్ ఫెయిత్), రింగింగ్ సెడార్స్ అనస్టాసియానిజం, హిందూయిజం,
 సైబీరియన్ షమానిజం  వంటి క్రైస్తవ మతంతో  స్లావ్లు ఉద్యమాలు, ఇతర మతాలు ఉద్భవించాయి.

ప్రస్తుతం రష్యాలో మతం పరమైన అధికారిక గణాంకాలు లేవు. అంచనాలు సర్వేల ఆధారంగా మాత్రమే ఉంటాయి. 2012 లో పరిశోధన సంస్థ సెర్డా అరేనా అట్లాస్ ప్రచురించింది.ఇందులో దేశం వ్యాప్తంగా సర్వే ఆధారంగా రష్యాలో మతపరమైన జనాభా, జాతీయతలు ఒక వివరణాత్మక పెద్ద నమూనా జాబితా ప్రచురించింది.జాబితా ఆధారంగా రష్యన్లు 46.8% తాము క్రైస్తవులుగా (41% రష్యన్ ఆర్థోడాక్స్, 1.5% కేవలం ఆర్థోడాక్స్ కానివారు లేదా రష్యన్ కాని ఆర్థోడాక్స్ చర్చిలలో సభ్యులు, 4.1% అనుబంధిత క్రైస్తవులు వీరిలో కాథలిక్లు, ప్రొటెస్టంట్లు 1% కన్నా తక్కువ) 13% మంది నాస్తికులు, 6.5% మంది ముస్లింలు, 1.2% దేవతలు, పూర్వీకులను గౌరవించే సాంప్రదాయిక మతాలు (రోడినోవే, టెంగారిమ్, ఇతర జాతి మతాలు), 0.5% టిబెట్ బౌద్ధులు ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఆ సంవత్సరం తర్వాత లెవాడా సెంటర్ అంచనా ప్రకారం 76% మంది రష్యన్లు క్రైస్తవులు ఉన్నారని అంచనా వేయబడింది. జూన్ 2013 లో పబ్లిక్ ఒపీనియన్ ఫౌండేషన్  జనాభాలో 65% మంది క్రిస్టియన్ అని అంచనా వేశారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ 2011 అంచనాల ప్రకారం, రష్యన్ ప్రజల 73.6% క్రైస్తవులు, రష్యన్ పబ్లిక్ ఒపీనియన్ రీసెర్చ్ సెంటర్ 2010 సర్వే (~ 77% క్రిస్టియన్),, ఇప్సొస్ మోరి 2011 తో సర్వే (69%).

ఇటీవలి ప్యూ రీసెర్చ్ సెంటర్ పరిశోధన ప్రకారం రష్యాలో జనాభాలో 71% మంది తూర్పు సంప్రదాయం, 15% మతపరంగా అనుబంధంగా లేని నాస్తికులు, అగోనిస్టులు (తమ మతాన్ని ముఖ్యంగా ఏమీలేదు), 10% ముస్లింలు, 2% ఇతర క్రైస్తవులు, 1% ఇతర విశ్వాసాలకు చెందినవారు ఉన్నారని వివరించింది. అలాగే మతపరంగా అనుబంధించబడనివారు 4% మంది నాస్తికులుగా, 1% అజ్ఞేయవాదిగా, 10% ప్రత్యేకంగా ఏమీ లేదని. 
 కమ్యూనిస్ట్ యుగంలో మతాన్ని ప్రభుత్వం అణచివేయడం విస్తృతంగా అలాగే సోవియట్ వ్యతిరేక మత శాసనం కారణంగా 1991 లో రష్యా జనాభాలో 37% ఈస్ట్రన్ ఆర్థడాక్స్ మాత్రమే ఉన్నారు. సోవియట్ యూనియన్ రద్దు తరువాత తూర్పు సంప్రదాయ చర్చికి అనుబంధ సంభ్యుల గణనీయంగా పెరిగింది. 2015 లో రష్యా జనాభాలో సుమారు 71% మంది తూర్పు సంప్రదాయంగా ప్రకటించారు. 1991 లో మతపరంగా అనుబంధం 61% నుండి 2008 నాటికి 18%కు పెరిగింది.

ఆర్థోడాక్స్ క్రైస్తవ మతం, ఇస్లాం, జుడాయిజం, బౌద్ధమతం మతాలు రష్యా సాంప్రదాయ మతాలుగా గుర్తించబడ్డాయి. ఇవి దేశ చారిత్రాత్మక వారసత్వంగా గుర్తించబడ్డాయి.

రష్యన్ ఆర్థోడాక్సీ తరువాత రష్యాలో రెండవ అతి పెద్ద మతం ఇస్లాం. ఇది కొన్ని కాకేసియన్ జాతులలో (ముఖ్యంగా చెచెన్లు, ఇంగుష్, సిర్కాసియన్లు), కొంతమంది టర్కిక్ ప్రజలలో (ముఖ్యంగా టాటార్స్, బాష్కిర్స్) మధ్య సాంప్రదాయ లేదా ప్రధాన మతం.

బుద్ధిజం రష్యన్ ఫెడరేషన్లోని మూడు ప్రాంతాలలో సాంప్రదాయంగా ఉంది: బురియాషి, తువా, కల్మికియా. వివిధ నివేదికల ప్రకారం, రష్యాలో మతపరమైన ప్రజల సంఖ్య 16% - 48% మధ్య ఉంది. ఇటీవలి అధ్యయనాల ప్రకారం సోవియట్ యూనియన్ రద్దు తరువాత దశాబ్దాలుగా ఉన్న నాస్తికుల సంఖ్య గణనీయంగా తగ్గింది.

సాంస్కృతిక, సాంఘిక వ్యవహారాలలో వ్లాదిమిర్ పుతిన్ రష్యన్ ఆర్థోడాక్స్ చర్చితో కలిసి పనిచేశారు.చర్చి అధిపతి మాస్కో పాట్రియార్క్ కిరిల్, 2012 లో తన ఎన్నికను ఆమోదించాడు. స్టీవెన్ మైయర్స్ నివేదిక ప్రకారం,  చర్చి, ఒకప్పుడు భారీగా అణచివేయబడినది. సోవియట్ కుప్పకూలిన తరువాత నుండి చాలా గౌరవనీయ సంస్థలలో ఒకటిగా ఉద్భవించింది ... ఇప్పుడు కిరిల్. మాస్కో పాట్రియాటిక్ కిరిల్ రష్యా క్రిమియా, ఉక్రెయిన్ వరకు విస్తరించడానికి నేపథ్యంలో ఉన్నాడని మార్క్ వుడ్స్ ప్రత్యేక ఉదాహరణలు అందజేసాడు. సెప్టెంబరు 2016 లో న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, చర్చి విధాన సూచనలు సాంఘిక సంప్రదాయవాదులకు క్రెమ్లిన్ విజ్ఞప్తిని ఇలా సమర్ధించాయి:
స్వలింగసంపర్కం తీవ్రమైన శత్రువు, కుటుంబం, సమాజం వ్యక్తిగత హక్కులను ఉంచే ప్రయత్నం

రష్యన్ రాజ్యాంగం సార్వజనిక ఉచిత ఆరోగ్య సంరక్షణకు హామీ ఇస్తుంది. అయినప్పటికీ ఆచరణలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసిన కారణంగా ఉచిత ఆరోగ్య సంరక్షణ పాక్షికంగా పరిమితం చేయబడింది. సోవియట్ యూనియన్ రద్దు తరువాత రష్యన్ జనాభా ఆరోగ్యం గణనీయంగా క్షీణించటం వలన రష్యాలో వైద్యుల సంఖ్య, ఆసుపత్రులు ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు ప్రపంచంలోని ఏ ఇతర దేశం కంటే తలసరి ప్రాతిపదికన అధికంగా ఉన్నారు. ఈ ధోరణి ఇటీవలి సంవత్సరాల్లో మాత్రమే తారుమారు చేయబడింది. 2006 - 2014 మధ్య పురుషుల సగటు ఆయుర్ధాయం 5.2 సంవత్సరాలు అధికరించింది. మహిళలకు 3.1 సంవత్సరాలు అధికరించింది.

ప్రపంచంలో అత్యధిక శాతం కాలేజి స్థాయి, ఉన్నత పట్టబధ్రులులు రష్యాలో (54%) ఉన్నారు. రాజ్యాంగ పౌరులందరికి ఉచిత విద్యకు హామీ ఇస్తుంది. అయితే సబ్సిడీ ఉన్న ఉన్నత విద్యా ప్రవేశానికి పోటీ అధికంగా ఉంది. విద్యలో సైన్స్, టెక్నాలజీలకు అత్యధిక ఉన్నత కారణంగా రష్యన్ వైద్య, గణిత శాస్త్ర, శాస్త్రీయ, అంతరిక్ష పరిశోధనలు సాధారణంగా అధిక నైపుణ్యం కలిగివున్నాయి.

అతి పెద్ద రష్యన్ విశ్వవిద్యాలయాలలో మాస్కో స్టేట్ యూనివర్సిటీ, సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్ యూనివర్సిటీ పురాతనమైనవిగా గుర్తించబడుతున్నాయి. 2000 లలో రష్యన్ ప్రాంతాలలో ఉన్నత విద్య,పరిశోధనా సంస్థలను సృష్టించటానికి ప్రభుత్వం ఫెడరల్ విశ్వవిద్యాలయాలను స్థాపించటానికి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. పెద్ద ప్రాంతీయ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలను అనుసంధానించి వాటికి ప్రత్యేక నిధులతో అందిస్తుంది. ఈ నూతన సంస్థలలో సదరన్ ఫెడరల్ యూనివర్సిటీ, సైబీరియన్ ఫెడరల్ యూనివర్సిటీ, కజాన్ వోల్గా ఫెడరల్ యూనివర్సిటీ, నార్త్-ఈస్టర్న్ ఫెడరల్ యూనివర్శిటీ, ఫార్ ఈస్ట్రన్ ఫెడరల్ యూనివర్సిటీ ఉన్నాయి.

రష్యాలో 160 కు పైగా విభిన్న జాతులకు, దేశాలకు చెందిన ప్రజలు ఉన్నారు. దేశం విస్తారమైన సాంస్కృతిక వైవిధ్యత కలిగిన ప్రజలు ఉన్నారు. స్లావిక్ ఆర్థోడాక్స్ సంప్రదాయాలు, తాతర్లు, టర్కిక్ ముస్లిం సంస్కృతికి చెందిన బాష్కిర్లు, బౌద్ధ సంచార బుర్యాటు ప్రజలు, ఉత్తర సరిహద్దు ప్రాంతం, సైబీరియాలలో కేంద్రీకృతమైన కల్మిక్ ప్రజలు, ఉత్తర కాకసస్ పర్వతప్రాంతాలలో నివసిస్తున్న షమానిస్టిక్ ప్రజలు, రష్యన్ నార్త్ వెస్ట్, వోల్గా ప్రాంతంలో నివసిస్తున్న ఫిన్నో-ఉగ్రిక్ ప్రజలు ఉన్నారు.

Dymkovo బొమ్మ, ఖోఖోలోమా, గిజెల్, పలేఖ్ సూక్ష్మరూపాలు వంటి హస్తకళాఖండాలు రష్యన్ జానపద సంస్కృతిలో ముఖ్యమైన అంశంగా ఉన్నాయి. సాంప్రదాయిక రష్యన్ దుస్తులలో కాఫ్టన్, కోసోవొరాట్కా, యూస్హాకా (పురుషుల కోసం), సారాఫాన్, కోకోష్నిక్ లాప్టీ (మహిళల దుస్తులు)లప్తి, వాలెన్కీల వంటి బూట్లు వాడుకలో ఉన్నాయి. దక్షిణ రష్యా నుండి కోసాక్కు వంటి దుస్తులు బుర్కే, పాపాహ, ఉత్తర కాకాసియన్ ప్రజలకు కూడా వాడుకలో ఉంటాయి.

రష్యన్ వంటకాలలో చేపలు, పౌల ఉత్పత్తులు, పుట్టగొడుగులు, బెర్రీలు, తేనెను విస్తారంగా ఉపయోగిస్తుంటారు. రై, గోధుమ, బార్లీ, చిరు ధాన్యాలతో తయారు చేసే వివిధ రొట్టెలు, దోశలు, సీరియల్ ఆహారాలు, క్వాస్, బీరు, వోడ్కా పానీయాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే బ్లాక్ రొట్టె రష్యాలో బాగా ప్రజాదరణ పొందింది. రుచికరమైన సూపులు, షాచి, బోర్ష్, ఉఖ, సోలియోంకా, ఓక్రోకో వంటి స్ట్యూలు రష్యా ఆహారాలలో భాగంగా ఉంటాయి. సూపులు, సలాడ్లకు స్మేటన (ఒక భారీ పుల్లని క్రీమ్) తరచుగా జోడించబడుతుంది. స్థానిక రకాల దోశలలో పిరోజ్కి, బ్లిని, సిరినికి వంటివి ఉంటాయి. చికెన్ కీవ్, పెల్మెని, షష్లిక్ మాంసం వంటకాలలో చివరి రెండు తాతర్, కాకసస్ మూలాలు వరుసగా ఉన్నాయి. ఇతర మాంసం వంటలలో సాధారణంగా మాంసంతో నింపిన క్యాబేజ్ రోల్స్ (గోలౌట్స్) ప్రాధాన్యత వహిస్తూ ఉంటాయి. సలాడ్లలో ఆలివియర్ సలాడ్, వైన్ టెర్రెట్, అలంకరించిన హెర్రింగ్ ప్రాధాన్యత వహిస్తూ ఉన్నాయి.

రష్యా పెద్ద సంఖ్యలో సంప్రదాయ జాతుల సమూహాల జానపద సంగీతం విలక్షణ సంప్రదాయాలను కలిగి ఉంది. సాధారణంగా సంప్రదాయ జాతి రష్యన్ సంగీత వాయిద్యాలలో గుస్లీ, బాలాలాక, జ్హేలికా, గర్మోష్కా ప్రాధాన్యత వహిస్తున్నాయి. రష్యన్ శాస్త్రీయ స్వరకర్తలపై జానపద సంగీతం గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఆధునిక కాలంలో మెల్నిట్సా వంటి అనేక ప్రసిద్ధ జానపద బృందాలకు ప్రేరణ లభించింది. రష్యన్ జానపద గీతాలు అలాగే దేశభక్తి సోవియట్ పాటలు, ప్రపంచ ప్రఖ్యాత ఎర్ర సైన్యం గాయక బృందం, ఇతర ప్రముఖ బృందాల సమ్మేళనంగా ఉంటాయి.

రష్యన్లు అనేక సంప్రదాయాలకు చెందిన ప్రజలు ఉన్నారు. వీరి సంప్రదాయంలో బాన్యా వాషింగ్ ఒకటి. ఇది కొంతవరకు సౌరా అనే ఆవిరితో స్నానంతో సమానంగా ఉంటుంది. పాత రష్యన్ జానపద పురాణ సాహిత్యం స్లావిక్ మతం మూలాల ప్రభావం ఉంది. అనేక రష్యన్ కథలు, బిలినా అనే ఇతిహాసం రష్యన్ యానిమేషన్ చలన చిత్రాలకు ఆధారంగా ఉన్నాయి. అలెగ్జాండర్ పట్ష్కో (ఇల్యా మురొమెట్స్, సాడ్కో), అలెగ్జాండర్ రౌ (మోరోజో, వాసిలిసా ది బ్యూటిఫుల్) వంటి ప్రముఖ దర్శకుల చలన చిత్రాలకు కూడా ఆధారంగా ఉన్నాయి. ప్యోటర్ యెర్షోవ్, లియోనిడ్ ఫిలోటోవ్లతో సహా రష్యన్ కవులు, సాంప్రదాయ అద్భుత కథలను మూలంగా స్వీకరించి అనేక ప్రసిద్ధ కవిత్వ వివరణలు చేశారు. కొన్ని సందర్భాల్లో, అలెగ్జాండర్ పుష్కిన్ వలె, గొప్ప ప్రజాదరణ పొందిన అద్భుత పద్య కావ్యాలను సృష్టించారు.

క్రైస్తవీకరణ కాలం నుండి అత్యధిక కాలం రష్యా వాస్తుశిల్పాన్ని బైజాంటైన్ వాస్తుశిల్పం ప్రభావితం చేసింది. కోటలు మాత్రమే కాకుండా (క్రెమ్లిన్స్), పురాతన రస్ శిలా భవంతులు 'అనేక గోపురాలతో ఉన్న సంప్రదాయ చర్చిలు, ఇవి తరచూ ముదురు రంగు పెయింటులతో పూతచేయబడి ఉన్నాయి.

అరిస్టాటిల్ ఫియోరావంటి ఇతర ఇటాలియన్ వాస్తుశిల్పులు 15 వ శతాబ్దం చివర నుండి రష్యాలోకి సరికొత్త వాస్తుకళా ధోరణులను తీసుకువచ్చారు. 16 వ శతాబ్దం సెయింట్ బాసిల్స్ కేథడ్రాల్లో చదునైన ఏకైక గుడారాల వంటి చర్చిలను అభివృద్ధి చేయబడ్డాయి. 
 ఆ సమయం లోనే  ఆనియన్ టవర్  రూపకల్పన పూర్తిగా అభివృద్ధి చేయబడింది. 17 వ శతాబ్దంలో మాస్కో, యారోస్లావులో అలంకరించిన  ఫియరీ స్టైల్  క్రమంగా అభివృద్ధి చెంది 1690 ల నాటి నరిస్కిన్ బరోక్ మార్గం సుగమం చేసింది. పీటర్ ది గ్రేట్ సంస్కరణలు తరువాత పాశ్చాత్య ఐరోపా నిర్మాణశైలి రష్యా నిర్మాణ శైలిని ప్రభావితం చేసింది.

కమ్యూనిస్ట్ భావజాలం విధించిన విలువల మార్పు కారణంగా సంరక్షించబడిన సంప్రదాయం విచ్ఛిన్నమైంది. మాస్కో-ఆధారిత ఒ.ఐ.ఆర్.యు. వంటి లౌకిక ప్రదేశాలలో మాత్రమే రక్షించబడిన స్వతంత్ర సమాజాలు 1920 చివరినాటికి రద్దు చేయబడింది. 1929 లో సమష్టి రైతు సమాజాలలో సరి కొత్త మత వ్యతిరేక ప్రచారం అభివృద్ధి చెందింది. 1932 లో నగరాల్లోని చర్చిలను విధ్వంసం శిఖరాగ్రానికి చేరుకుంది. మాస్కోలోని క్రీస్తు కేథడ్రలుతో సహా పలు చర్చిలను కూల్చివేశారు. మాస్కోలో 1917-2006లో జరిగిన నష్టాలలో గుర్తించతగిన 640 భవనాలు (మొత్తం 3,500 భవనాల జాబితా నుండి 150 నుండి 200 భవనాలతో సహా ) ధ్వంసం చేయబడ్డాయని అంచనా వేయబడింది. వీటిలో కొన్ని పూర్తిగా అదృశ్యమయ్యాయి. మిగిలినవి కాంక్రీటు కట్టడాలతో భర్తీ చేయబడ్డాయి.

ప్రారంభ రష్యన్ చిత్రకళలలో బైజాంటియమ్ నుండి వారసత్వంగా వచ్చిన రెండు తరాల చిత్రాలలో చిహ్నాలు, శక్తివంతమైన ఫ్రెస్కోసులు ప్రాతినిధ్యం వహించాయి. మాస్కో అధికారంలోకి రావడంతో, థియోఫేన్స్ గ్రీక్, డియోనిసియస్, ఆండ్రూ రూబ్లెలు స్పష్టంగా రష్యన్ కళకు ప్రాతినిథ్యం వహించారు.

రష్యన్ అవాంట్-గార్డే అనేది 1890 - 1930 వరకు రష్యాలో ఆధునిక కళలు పెద్ద అలలా ప్రభాతితం చేసింది. ఈ కళాప్రక్రియలలో నయా-ప్రిమిటివిజం, సుప్రియాటిజం, నిర్మాణాత్మకత, రోయోనిజం, రష్యన్ ఫ్యూచరిజం భాగస్వామ్యం వహించాయి. ఈ శకం కళాకారులలో ఎల్ లిసిట్జ్కీ, కజిమిర్ మేలేవిచ్, వాస్సిలీ కండింస్కీ, మార్క్ చాగల్ ప్రఖ్యాతి గడించారు. 1930 ల నుండి అవాంట్-గార్డే విప్లవాత్మక ఆలోచనలు నూతనంగా ఉద్భవించిన సామ్యవాద భావాలతో జతకలిసాయి.

సోయియట్ కళలు గ్రేట్ పేట్రియాటిక్ యుద్ధం సమయంలో, తరువాత తీవ్రంగా దేశభక్తి, ఫాసిస్టు వ్యతిరేక ధోరిణి సృష్టించింది. అనేక యుద్ధ స్మారకాలు గంభీరతకు చిహ్నంగా గుర్తించబడ్డాయి. దేశవ్యాప్తంగా నిర్మించారు. సోవియట్ కళాకారులు తరచుగా సోషలిస్టు వాస్తవికత కలిగిన సోవియట్ కళాకారులు ప్రధానంగా ఆధునిక శిల్పులలో వేరా ముఖినా, ఎవ్జెనీ వుచెట్టిచ్, ఎర్నెస్ట్ నీజ్వేత్నీలతో ప్రఖ్యాతి గడించారు.

ప్రముఖ సోలో వాద్యకారులు రష్యన్ సంప్రదాయావాదులుగా మారారు. వీరిలో జాస్చా హెఫెట్జ్, డేవిడ్ ఒరిస్టాక్, లియోనిడ్ కోగన్, గిడన్ క్రెమెర్, మాగ్జిమ్ వెంర్గోవ్ వయోలిన్ వాద్యకారులుగా గుర్తింపు పొందారు. సెల్లిస్టులుగా మిస్టివ్ రోస్ట్రోపోవిచ్, నటాలియా గుట్మాన్ గుర్తింపు పొందారు. పియానో కళాకారులుగా వ్లాదిమిర్ హోరోవిట్జ్, సవిటోస్లావ్ రిచ్టర్, ఎమిల్ గైల్ల్స్, వ్లాదిమిర్ సోఫ్రానిట్స్కీ, ఎవ్వని కిస్సిన్ గుర్తింపు పొందారు. గాత్రకళాకారులుగా ఫెడోర్ షాలియాపిన్, మార్క్ రీజెన్, ఎలెనా ఓబ్రాస్త్సోవా, తమరా సైనోస్స్కాయా, నినా డోరియక్, గాలిన విష్నేవ్స్సా, అన్నా నేట్రేబో, డిమిట్రి హ్వోరోస్టోవ్స్కీ గుర్తింపు పొందారు.

ఆధునిక రష్యన్ రాక్ సంగీతం పాశ్చాత్య రాక్ అండ్ రోల్, హెవీ మెటల్ సోవియట్ యుగంలో వ్లాదిమిర్ వైస్త్‌స్కీ, బులాట్ ఓకుజుజా సంప్రదాయాల మూలాలు రష్యన్ బోర్డ్సులకు ఆధారంగా ఉన్నాయి. ప్రముఖ రష్యన్ రాక్ బృందాలలో మషినా వ్రెమెని, డి.డి.టి, అక్వేరియం, అలిసా, కినో, కిపెలోవ్, నౌటిలస్ పామొఇలియస్, అరియా గఝ్దంస్కయా ఒబ్రొనా, స్ప్లీన్, కొరొల్ ఐ షట్ ప్రాధాన్యత ఉన్నాయి. సోవియట్ కాలంలో ఎస్ట్రేడాను పూర్తిస్థాయిలో పరిశ్రమగా పిలిచే వారు. దాని నుండి రష్యన్ పాప్ సంగీతం అభివృద్ధి చెందింది. కొంతమంది ప్రదర్శనకారులు విస్తారంగా అంతర్జాతీయ గుర్తింపు పొందారు. వీరిలో టి.ఎ.టి.యు, న్యు విర్గోస్, విటాలు ప్రాధాన్యత వహిస్తున్నారు.

The Soviet Union was also a major producer of science fiction, written by authors like Arkady and Boris Strugatsky, Kir Bulychov, Alexander Belayev and Ivan Yefremov. Traditions of Russian science fiction and fantasy are continued today by numerous writers.

అనేక రష్యన్ చిత్ర ట్రైలర్స్ గోల్డెన్ ట్రైలర్ అవార్డ్స్ కొరకు ప్రతిపాదించబడ్డాయి.

 కవిటిక్స్ ట్రైలర్ సంభాషణ రూపకల్పన చేసిన నికోలాయ్ కుర్బాటోవ్ ట్రైలర్లు అనేకం అతిపెద్ద యూ ట్యూబ్ ఛానళ్ళలో అప్లోడ్ చేయబడి. ప్రధాన ట్రైలర్లుగా ఉపయోగించబడి  బూక్ ఆఫ్ రికార్డు లో ప్రవేశించాయి.

రష్యా సామ్రాజ్యం కాలంలో రష్యన్ యానిమేషన్ ప్రారంభం అయింది. సోవియట్ యుగంలో సోయుజ్‌ల్టు ఫిల్మ్ స్టూడియోలో యానిమేషన్ అధికంగా నిర్మించబడ్డాయి. సోవియట్ యానిమేటర్లు ఇవాన్ ఇవనోవ్ -వానో, ఫ్యోడర్ ఖిట్రుక్, అలెక్సాండర్ తతారేర్కీల వంటి ప్రముఖ దర్శకులు పలు ప్రముఖ విధానాలలో, అందమైన రీతిలో అనిమేషన్ చిత్రాలను అభివృద్ధి చేశారు. రష్యన్-శైలి అనుసరిస్తూ రూపొందించిన విన్నీ-ది-ఫూ, అందంగా రూపొందించబడిన చెబరాష్కా, వుల్ఫు, హు, న్యు, పోగొడి వంటి అనేక సోవియట్ కార్టూన్ హీరోలు రష్యాలో, అనేక పరిసర దేశాలలో ఐకానిక్ పాత్రలుగా గుర్తింపు పొందాయి.

రష్యన్ యానిమేటెడ్ టెలివిజన్ ధారావాహికలో మాషా అండ్ ది బేర్ భాగం అత్యధిక ప్రజాదరణ పొంది 3 బిలియన్ల కంటే ఎక్కువ వీక్షణలను సాధించింది.

సోవియట్ కాలంలో కొద్ది స్టేషన్లు, ఛానళ్లు ఉన్నప్పటికీ గత రెండు దశాబ్దాల్లో అనేక నూతన ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యం కలిగిన రేడియో స్టేషన్లు, టివి ఛానళ్లు వెలుగులోకి వచ్చాయి. 2005 లో ఒక ప్రభుత్వం ఇంగ్లీష్ భాషలో  రష్యా టుడే టీవీ  ప్రసారాన్ని ప్రారంభించింది. 2007 లో అరబిక్ భాషలో రష్యా ఆల్- యాయుం ప్రారంభించబడింది. రష్యాలో సెన్సార్షిప్, మీడియా స్వేచ్ఛ ఎప్పుడూ రష్యన్ మీడియా ప్రధాన ఇతివృత్తంగా ఉంది.

సోవియట్ కాలం తరువాత రష్యన్ కాలంలో రష్యన్ అథ్లెట్లు వేసవి ఒలింపిక్సులో సేకరించిన బంగారు పతకాల సంఖ్యతో అంతర్జాతీయంగా మొదటి నాలుగు స్థానాల్లో నిలిచారు. సోవియట్ బాస్కెట్బాల్, హ్యాండ్ బాల్, వాలీబాల్, ఐస్ హాకీ క్రీడాకారులతో పాటు సోవియట్ జిమ్నాసిస్ట్లు, ట్రాక్ అండ్ ఫీల్డ్ ఫీల్డ్ అథ్లెట్లు, వెయిట్ లిఫ్టర్లు, మల్లయోధులు, బాక్సర్లు, ఫెన్సర్లు, షూటర్లు, క్రాస్ కంట్రీ స్కియర్స్, భయాత్లేట్లు, స్పీడ్ స్కేటర్లు, ఫిగర్ స్కేటర్ల వంటి క్రీడాకారులు ప్రపంచంలో అత్యుత్తమమైన క్రీడాకారులుగా గుర్తించబడుతున్నారు. 1980 సమ్మర్ ఒలింపిక్స్ క్రీడలకు మాస్కో ఆతిథ్యం ఇచ్చింది.2014 వింటర్ ఒలింపిక్ క్రీడలకు సోచి ఆతిథ్యం ఇచ్చింది.

సోవియట్ యుగంలో ఐస్ హాకీని ప్రవేశపెట్టిన సోవియట్ యూనియన్ జాతీయ జట్టు దాదాపు అన్ని ఒలంపిక్సు, ప్రపంచ ఛాంపియన్షిప్లలో పోటీ చేసింది. రష్యన్ ఆటగాళ్ళు వాలెరి ఖర్లావ్వ్, సెర్గీ మాకోరోవ్, వ్యాచెస్లావ్ ఫెటిసోవ్, వ్లాడిస్లావ్ ట్రెతియాక్ సెంచరీ ఐ.ఐ.హెచ్.ఎఫ్. బృందాలలో ఆరు స్థానాలలో నాలుగు స్థానాలను స్వంతం చేసుకుని ఉన్నారు. యునిఫైడ్ టీం 1992 లో బంగారు పతకాన్ని పొందిన తరువాత రష్యా ఒలింపిక్ ఐస్ హాకీ టోర్నమెంటులో విజయం సాధించ లేదు. రష్యా 1993, 2008, 2009, 2012, 2014 ఐ.ఐ.హెచ్.ఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్లను గెలుచుకుంది.

రష్యన్ సూపర్లీగు తరువాత 2008 లో కాంటినెంటల్ హాకీ లీగ్ స్థాపించబడింది. ఇది ఐరోపాలో అత్యుత్తమ హాకీ లీగుగా ఉంది. 2009 నాటికి  ప్రపంచంలో ద్వితీయ స్థానంలో ఉంది. ఇది యురేషియాలో అంతర్జాతీయ వృత్తిపరమైన ఐస్ హాకీ లీగుగా ఉంది. దీనిలో 29 జట్లు ఉన్నాయి. వీటిలో 21 రష్యాలో, 7 ఇంకా లాట్వియా, కజఖస్తాన్, బెలారస్, ఫిన్లాండ్, స్లోవేకియా, క్రొయేషియా, చైనాలో ఉన్నాయి. ఐరోపాలో కె.హెచ్.ఎల్. 4 వ స్థానంలో ఉంది.

రష్యన్ హాకీగా కూడా పిలువబడే బండీ మరొక సాంప్రదాయసిద్ధమైన ప్రసిద్ధ మంచు క్రీడగా భావించవచ్చు. 1957-79 మధ్యకాలంలో సోవియట్ యూనియన్ పురుషుల బ్యాండీ ప్రపంచ ఛాంపియన్షిప్లను అన్నింటినీ గెలుచుకుంది. తరువాత కూడా కొన్ని చాంపియంషిప్పులను గెలుచుకుంది. సోవియట్ యూనియన్ రద్దు తరువాత రష్యా చాలా విజయవంతమైన జట్లలో ఒకటిగా ఉండి అనేక ప్రపంచ ఛాంపియన్షిప్లను గెలుచుకుంది.

ఆధునిక రష్యాలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడలలో అసోసియేషన్ ఫుట్బాల్ ఒకటి. 1958 - 1970 వరకు నాలుగు ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. ప్రపంచ కప్పులలో కనిపించిన సోవియట్ జాతీయ జట్టు మొదటి యురోపియన్ ఛాంపియన్‌గా అవతరించింది. ఫుట్బాల్ చరిత్రలో లెవ్ యషిన్ గొప్ప గోల్కీపరుగా గుర్తించబడుతూ ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. వరల్డ్ కప్ డ్రీం జట్టుకు ఎన్నిక చేయబడింది. సోవియట్ జాతీయ జట్టు యూరో 1988 ఫైనలుకు చేరుకుంది. 1956 - 1988 లలో సోవియట్ యూనియన్ ఒలంపిక్ ఫుట్బాల్ టోర్నమెంట్లో బంగారు పతకాన్ని సాధించింది. సి.ఎస్.కె.ఎ. మాస్కో, జెనిట్ సెయింట్ పీటర్సుబర్గ్ వంటి క్లబ్బులు 2005 - 2008 లో యు.ఇ.ఎఫ్.ఎ. కప్పును గెలుచుకున్నాయి. రష్యన్ జాతీయ ఫుట్బాల్ జట్టు యూరో 2008 సెమీ ఫైనలుకు చేరుకుంది. చివరికి స్పెయిను జట్టుతో ఓడిపోయింది. రష్యా 2018 ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. ప్రపంచ కప్పును నిర్వహించాలని ప్రణాళిక వేసింది. దేశంలోని యూరోపియన్ ప్రాంతంలో, ఉరల్ ప్రాంతంలో 11 నగరాలు ఆతిథ్యం ఇస్తూ ఉన్నాయి.
బాస్కెట్బాల్ జట్టు యూరోపియన్ బాస్కెట్బాల్ చాంపియన్షిప్పును గెలుచుకుంది. రష్యన్ బాస్కెట్బాల్ క్లబ్బు  పిబిసి సి.ఎస్.కె. మాస్కో  ఐరోపాలో అత్యుత్తమ జట్లలో ఒకటిగా 2006 - 2008 లో యూరోలీగు గెలిచింది.

లారిసా లాటిననా ఒలంపిక్ పతకాలను పతకాలను అత్యధికంగా సాధించిన మహిళా క్రీడాకారిణిగా రికార్డును సృష్ట్ంచింది. యు.ఎస్.ఎస్.ఆర్ జిమ్నాస్టిక్ క్రీడలో ఒక ప్రధానమైన శక్తిగా చాలా సంవత్సరాలు నిలిచింది. ప్రస్తుతం రష్యా యెవ్జెనీ కైనెవాతో రిథమిక్ జిమ్నాస్టిక్స్ క్రీడలో ప్రముఖ దేశంగా ఉంది. డబుల్ 50 ఎం, 100 ఎమ్ ఫ్రీస్టైల్ ఒలంపిక్ బంగారు పతాక విజేత అలెగ్జాండర్ పోపోవ్ చరిత్రలో గొప్ప స్ప్రింట్ స్విమ్మర్గా అంతర్జాతీయంగా గుర్తించబడ్డాడు. 
రష్యన్ సిన్క్రోనైజ్డ్ స్విమ్మింగ్ ప్రపంచంలోని ఉత్తమమైనది. ఇటీవలి దశాబ్ధాలలో ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్షిపులో దాదాపు బంగారు పతకాలు అన్నింటినీ రష్యన్లు స్వాధీనం చేసుకున్నారు. రష్యాలో మరొక ప్రముఖ క్రీడ ఫిగర్ స్కేటింగ్ ముఖ్యంగా జంట స్కేటింగ్, ఐస్ డ్యాన్సింగ్ ఇందులో భాగంగా ఉంటాయి. 1964 నుండి 2010 వరకు సోవియట్, రష్యా జంట ప్రతి శీతాకాల ఒలింపిక్స్ క్రీడలలో బంగారు పతకాన్ని సాధించింది.

సోవియట్ శకం ముగిసిన నాటి నుండి టెన్నిస్ క్రీడకు ప్రజాదరణ అధికరించింది. రష్యా మరియా షరపోవాతో సహా పలు ప్రముఖ క్రీడాకారులను ఉత్పత్తి చేసింది. మార్షల్ ఆర్టులో రష్యా సామ్బో, ఫెడోర్ ఎమేలియనేంకో వంటి ప్రఖ్యాత యోధులను తయారు చేసింది. చదరంగం రష్యాలో విస్తృతంగా ప్రజాదరణ పొందిన క్రీడగా ఉంది. 1927 నుండి రష్యన్ గ్రాండ్ మాస్టర్స్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్పును నిరంతరాయంగా గెలిచారు.

రష్యా దక్షిణ ప్రాంతంలోని సోచిలో 2014 వింటర్ ఒలింపిక్స్ నిర్వహించబడ్డాయి. 2016 లో మెక్లారెన్ రిపోర్ట్ రష్యా పోటీదారుల మాదకద్రవ్యాల ఉపయోగం వెలుగులోకి వచ్చింది. కప్పిపుచ్చడానికి సానుకూల ఔషధ పరీక్షల ఫలితాలను సాధించడానికి సంస్థాగత కుట్రకు ఆధారం కనుగొనబడింది. 2017 డిసెంబరు 1 నాటికి 25 మంది అథ్లెట్లు అనర్హులుగా నిర్ణయించబడి 11 పతకాలు తొలగించారు.

రష్యాలో ఫార్ములా వన్ కూడా బాగా ప్రజాదరణ పొందింది. 2010 లో వైబ్రోగ్ (విటలీ పెట్రోవ్) మొదటి ఫార్ములా వన్‌లో నడిపిన మొదటి రష్యన్ అయింది. వెంటనే 2014 లో యు.ఎఫ్.ఎ. నుండి  డానియల్ క్వ్యాత్  రెండవ క్రీడాకారుడయ్యాడు. రష్యన్ గ్రాండ్స్ ప్రిక్స్ (1913 - 1914 లో) రెండు మార్లు మాత్రమే సాధించారు. 2014 లో ఆరు సంవత్సరాల ఒప్పందంలో భాగంగా ఫార్ములా వన్ సీజన్ రష్యన్ గ్రాండ్ ప్రిక్స రష్యాకు తిరిగి వచ్చింది.

ఉల్లంఘనల కారణంగా అధిక సంఖ్యలో పతకాలను (51) జారవిడిచిన దేశాలలో రష్యా మొదటి స్థానంలో ఉంది. నాలుగు రెట్లు రన్నర్-అప్ పోగొట్టుకున్నది. ప్రపంచ మొత్తంలో ఇది మూడో వంతు కంటే అధికం. ఒలింపిక్ క్రీడలలో మాదకద్రవ్యాలు ఉపయోగించినట్లు నిరూపించబడిన రష్యన్ అధికెట్ల సంఖ్య 129. ఒలంపిక్ పతకాలు అత్యధికంగా జారవిడిచిన దేశాలలో రష్యా మొదటి స్థానంలో ఉంది. 

రష్యాలో పబ్లిక్ సెలవులు ఏడు ఉన్నాయి. ఆదివారం ఆచరించేవి మినహా. క్రిస్మస్, న్యూ ఇయర్ ట్రీస్, బహుమతులు, శాడ్ క్లాజ్ వలె డాడ్ మొరోజ్ (తండ్రి ఫ్రోస్ట్) నటించిన పాశ్చాత్య క్రిస్మస్ తరహాలో రష్యన్ నూతన సంవత్సరం సంప్రదాయాలు ఉన్నాయి. జనవరి 7 న ఆర్థోడాక్స్ క్రిస్మస్ పండుగ వస్తుంది. రష్యన్ ఆర్థోడాక్స్ చర్చి ఇంకా జూలియన్ క్యాలెండరును అనుసరించడం అందుకు కారణంగా ఉంది. అన్ని సాంప్రదాయ సెలవులు పాశ్చాత్య దేశాల 13 రోజుల తరువాత జరుపుకుంటారు. ఇద్దరు ఇతర ప్రధాన క్రైస్తవ సెలవు దినాల ఈస్టరు, ట్రినిటీ ఆదివారం ప్రధానమైనవి. కుర్బన్ బేరం, ఉర్రాజా బేరం పండుగలను రష్యన్ ముస్లింలు జరుపుకుంటారు.

ఇంకా రష్యన్ సెలవుదినాలు ఫాదర్ల్యాండ్ డిఫెండర్ డే (ఫిబ్రవరి 23) పండుగ రష్యన్ పురుషులకు ప్రత్యేకంగా సైన్యంలో పనిచేస్తున్నవారిని గౌరవిస్తూ జరుపుకుంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8), మదర్స్ డే, వాలెంటైన్స్ డే సంప్రదాయాలు ఉన్నాయి; స్ప్రింగ్ అండ్ లేబర్ డే (మే 1); విక్టరీ డే (మే 9); రష్యా డే (జూన్ 12); యూనిటీ డే (నవంబరు 4)ను 1612 లో మాస్కో నుండి పోలిష్ ఆక్రమణ బలమును బహిష్కరించిన ప్రసిద్ధ తిరుగుబాటు జ్ఞాపకార్ధంగా జరుపుకుంటారు.

విక్టరీ డే రష్యాలో రెండవ అత్యంత ప్రసిద్ధ సెలవుదినంగా జరుపుకుంటారు; ఇది గ్రేట్ పేట్రియాటిక్ యుద్ధంలో నాజీయిజంపై విజయాన్ని స్మరించుకుంటూ జరుపుకుంటారు. మాస్కోలో రెడ్ స్క్వేర్లో రష్యా అధ్యక్షుడు ఆధ్వర్యంలో భారీ సైనిక దళాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఇదే విధమైన పెరేడ్లు హీరో సిటీ హోదా కలిగిన అన్ని ప్రధాన రష్యన్ నగరాల్లోనూ (మిలిటరీ గ్లోరీ నగరంతో) జరుగుతాయి.

టొటియా డే (జనవరి 25 న విద్యార్థుల సెలవుదినం), మాసెన్లిసా (గ్రేట్ లెంట్కు ఒక వారానికి ముందు  ప్రి క్రిస్టియన్ స్ప్రింగ్ హాలిడే  సెలవుదినం), కాస్మోనాటిక్స్ (ఓల్డ్ న్యూ ఇయర్ (జూలియన్ క్యాలెండర్ ప్రకారం ది న్యూ ఇయర్, జనవరి 14 న ) ఇవాన్ కుపాలా డే (జులై 7 న మరొక క్రిస్టియన్ సెలవుదినం), పీటర్ అండ్ ఫెనోరోని డే (కుటుంబం ప్రేమ, విశ్వసనీయతలను గౌరవిస్తూ జూలై 8 న రష్యన్ అనలాగ్ జరుపుకునే వాలెంటైన్స్ డే ).

రష్యన్ కోట్ ఆఫ్ మాస్కోలోని సెయింట్ జార్జ్‌తో కలిపిన బైజాంటైన్ డబుల్ హెడ్ ఈగిల్ రష్యన్ దేశీయ చిహ్నంగా ఉంది. రష్యా చివరి కాలం నాటి రష్యన్ జెండా రష్యా సామ్రాజ్యం నుండి ఉపయోగించబడింది. రష్యన్ గీతానికి సోవియట్ సంగీతం అందించినప్పటికీ సాహిత్యం వైవిధ్యంగా ఉంటుంది. సామ్రాజ్య నినాదం  గాడ్ ఈజ్ విత్ అజ్ , సోవియట్ నినాదం  ప్రోలెటిరియంస్ ఆఫ్ ఆల్ కంట్రీస్ యునైట్  ఇప్పుడు ఉనికిలో లేవు. క్రొత్త నినాదం వాటిని భర్తీ చేసింది. సుత్తి, కొడవలి, పూర్తి సోవియట్ కోటు ఆయుధాలు ఇప్పటికీ పాత నగర నిర్మాణాలలో భాగంగా రష్యన్ నగరాల్లో విస్తారంగా కనిపిస్తాయి. సోవియట్ రెడ్ స్టార్స్ కూడా తరచుగా సైనిక పరికరాలు, యుద్ధ స్మారకాలపై చోటు చేసుకున్నాయి. ఇది రెడ్ బ్యానర్ గౌరవించబడుతోంది (ప్రత్యేకించి బ్యాక్ ఆఫ్ విక్టరీ ఆఫ్ 1945).

మాత్రోషోకా డాల్ గుర్తించదగిన రష్యా చిహ్నంగా భావించబడుతుంది. మాస్కోలోని  మాస్కో క్రెమ్లిన్  సెయింట్ బాసిల్స్ కేథడ్రల్ గోపురాలు రష్యా ప్రధాన నిర్మాణ చిహ్నాలుగా ఉన్నాయి. రష్యన్ జాతీయ ఒలింపిక్ జట్టు చిహ్నంగా చెబురస్కాఉంది. సెయింట్ మేరీ, సెయింట్ నికోలస్, సెయింట్ ఆండ్రూ, సెయింట్ జార్జ్, సెయింట్ అలెగ్జాండర్ నేవ్‌స్కీ, సెయింట్ సెర్గియస్ ఆఫ్ రాడోనేజ్, సెయింట్ సెరాఫిమ్లు రష్యా సన్యాసులుగా గుర్తించబడుతున్నారు. జాతీయ పుష్పంగా చమోమిలే, జాతీయ చెట్టుగా బిర్చు రష్యన్ ఎలుగుబంటు ఒక జంతువు చిహ్నంగా, రష్యా ఒక జాతీయ వ్యక్తిత్వంగా ఉన్నప్పటికీ ఈ చిత్రం పాశ్చాత్య మూలం కలిగి ఉందని రష్యన్లు ఇటీవల స్వయంగా అంగీకరించారు. స్థానిక రష్యా జాతీయ గుర్తింపు మదర్ రష్యా.

సోవియట్ కాలం నుండి రష్యాలో ముందుగా దేశీయ పర్యాటకరంగం తరువాత అంతర్జాతీయ పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందింది. దేశంలోని గొప్ప సాంస్కృతిక వారసత్వం, గొప్ప ప్రకృతి సౌందర్యం రష్యాపర్యాటక రంగం అభివృద్ధికి సహజరిస్తున్నాయి. రష్యాలో పురాతన నగరాలను అనుసంధానం చేస్తున్న గోల్డెన్ రింగ్ మార్గం, వోల్గా నదుల వంటి నదులపై క్రూజ్ ప్రయాణం, ప్రసిద్ధ ట్రాన్స్-సైబీరియన్ రైల్వేలో సుదూర ప్రయాణాలు ప్రధాన పర్యాటక మార్గాలుగా ఉన్నాయి. 2013 లో 28.4 మిలియన్ల మంది పర్యాటకులు రష్యాను సందర్శించారు; ఇది ప్రపంచంలో పర్యాటకులు అత్యధికంగా సందర్శించే దేశాలలో తొమ్మిదవ స్థానంలోనూ ఐరోపాలో దేశాలలో ఏడవ స్థానంలోనూ ఉంది. 
 2014 లో పాశ్చాత్యదేశాల సందర్శకుల సంఖ్య తగ్గింది.

రష్యా ప్రస్తుత రాజధాని మాస్కో మాజీ రాజధాని సెయింట్ పీటర్స్బర్గ్ నగరాలు రష్యాలో పర్యాటకులు అధికంగా సందర్శించే గమ్యస్థానాలుగా ఉన్నాయి. ఇవి ప్రపంచ నగరాలుగా గుర్తించబడుతున్నాయి. ఈ నగరాలలో ట్రైటకోవ్ గ్యాలరీ, హెర్మిటేజ్ వంటి ప్రసిద్ధ ప్రపంచ మ్యూజియంలు, బోల్షియి, మారిస్కీ వంటి ప్రసిద్ధ థియేటర్లు, సెయింట్ బాసిల్స్ కేథడ్రల్, కాథెడ్రల్ ఆఫ్ క్రైస్ట్ ది సవైర్, సెయింట్ ఐజాక్ కేథడ్రల్, చర్చ్ ఆఫ్ ది బ్లడ్ ఆన్ ది బ్లడ్ వంటి చర్చీలు, క్రెమ్లిన్, పీటర్, పాల్ కోటెస్ వంటి అందమైన కోటలు, రెడ్ స్క్వేర్, ప్యాలెస్ స్క్వేర్, ట్రెవ్స్‌క్యా వీధి, నెవ్‌స్కై ప్రాస్పెక్ట్, అర్బత్ స్ట్రీట్ వంటి అందమైన వాణిజ్య కేంద్రాలకు నిలయంగా ఉన్నాయి. మాస్కో నగరంలో సంపన్నమైన రాజభవనాలు, ఉద్యానవనాలు (కొలోమేన్స్కోయ్, ట్సార్టినో) ఉన్నాయి. సెయింట్ పీటర్స్‌బర్గ్ (పీటర్హాఫ్, స్ట్రెల్నా, ఒరానిన్బామ్, గట్చినా, పావ్‌లోవ్స్క్, సార్స్కోయ్ సెలో) ఉన్నాయి. మాస్కో నగరంలో సోవియట్ శిల్పకళను ప్రతిబింబించే ఆధునిక ఆకాశసౌధాలు ఉన్నాయి. సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో (ఉత్తర వెనిస్ అనే మారుపేరు) సాంస్కృతికత ప్రతిబింబించే నిర్మాణాలు, అనేక నదులు, కాలువలు, వంతెనలు ఉన్నాయి.

తాతర్ స్థాన్ రాజధాని కజాన్ నగరంలో క్రిస్టియన్ రష్యన్, ముస్లిం తాతర్ మిశ్రమ సంకృతి కనిపిస్తుంది. నోవోసిబిర్స్కు, యెకాటెరిన్బర్గ్, నిజ్నీ నొవ్గోరోడ్లతో సహా అనేక ఇతర ప్రధాన నగరాలకు పోటీగా ఈ నగరం రష్యా మూడవ రాజధానిని గుర్తించబడుతుంది.

రష్యా వెచ్చని ఉపఉష్ణమండలి నల్ల సముద్ర తీరంతో రష్యాలో  సోచీ  వంటి పలు సముద్రతీర రిసార్టులు ఉన్నాయి.  2014 వింటర్ ఒలింపిక్స్ కు ఇక్కడ ఆతిథ్యం ఇవ్వబడింది. ఉత్తర కౌకాసస్ పర్వతాలలో దోమ్బే వంటి ప్రసిద్ధ స్కీ రిసార్ట్లు ఉన్నాయి. రష్యాలో అత్యంత సహజ పర్యాటక గమ్యస్థానమైన బైకాల్ సరసు, సైబీరియా బ్లూ ఐ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ సరస్సు ప్రపంచంలో పురాతనమైన లోతైన స్పటికం వంటి స్పష్టమైన నీటిని కలిగి ఉంది. ఈ సరసు టైగా-కప్పబడిన పర్వతాలతో చుట్టబడి ఉంటుంది. ఇతర ప్రసిద్ధ సహజ గమ్యస్థానాలలో కమ్చట్కా పర్వతాలలో అగ్నిపర్వతాలు, హిమశిఖరాలు, కరేరియా పర్వతంలోని సరస్సులు, గ్రానైట్ రాళ్ళు, మంచుతో కప్పబడిన ఆల్టై పర్వతాలు, తువా అరణ్య సోపానాలు ఉన్నాయి.




#Article 237: రంగారెడ్డి జిల్లా (1376 words)


రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి., ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కొండా వెంకట రంగారెడ్డి, దేశంలోనే తొలి మహిళా హోంశాఖ మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి, విమోచనోద్యమకారులు కాటం లక్ష్మీనారాయణ, వెదిరే రాంచంద్రారెడ్డి, గంగారాం ఆర్య, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ జిల్లాకు చెందినవారే. శ్రీరామునిచే ప్రతిష్ఠించబడిన కీసర లింగేశ్వరాలయం, అనంతగిరి, చిలుకూరు బాలాజీ, కీసర లాంటి పుణ్యక్షేత్రాలు, షాబాద్ నాపరాతికి, సిమెంటు కర్మాగారాలకు ప్రఖ్యాతిగాంచిన జిల్లా.

ఈ జిల్లాలో 37 మండలాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 2 లోకసభ నియోజకవర్గాలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాదుకు చెందిన 150 డివిజన్లలో 48 డివిజన్లు రంగారెడ్డి జిల్లాకు చెందినవి. ఈ జిల్లాలో ప్రవహించే ప్రధాన నది మూసీ. దేశంలోనే పొడవైన 7వ నెంబరు జాతీయ రహదారి, 9వ నెంబరు జాతీయ రహదారి, హైదరాబాదు నుంచి కాజీపేట, గద్వాల, వాడి, బీబీనగర్ రైలుమార్గాలు, వికారాబాదు-పర్భని మార్గం జిల్లా గుండా వెళ్ళుచున్నాయి. 

నిజాం కాలంలో ఇది అత్రాప్-ఎ-బల్ద్ జిల్లాలో భాగంగా గుల్షనాబాదు సూబాలో ఉండేది. 1830లో కాశీయాత్రలో భాగంగా జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాలలో మజిలీ చేస్తూ ప్రయాణించిన యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఆనాడు ఈ ప్రాంతపు స్థితిగతుల గురించి వ్యాఖ్యానించాడు. హైదరాబాద్ రాజ్యంలో కృష్ణ దాటింది మొదలుకొని హైదరాబాద్ నగరం వరకూ ఉన్న ప్రాంతాల్లో (నేటి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ నగర జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాల్లో) సంస్థానాధీశుల కలహాలు, దౌర్జన్యాలు, భయభ్రాంతులను చేసే స్థితిగతులు ఉన్నాయని ఐతే హైదరాబాద్ నగరం దాటిన కొద్ది ప్రాంతం నుంచి గోదావరి నది దాటేవరకూ (నేటి నిజామాబాద్, మెదక్ జిల్లాలు) గ్రామాలు చాలావరకూ అటువంటి దౌర్జన్యాలు లేకుండా ఉన్నాయని వ్రాశారు. కృష్ణానది నుంచి హైదరాబాద్ వరకూ ఉన్న ప్రాంతాల్లో గ్రామ గ్రామానికి కోటలు, సైన్యం విస్తారంగా ఉంటే, హైదరాబాద్ నుంచి గోదావరి నది వరకూ ఉన్న ప్రాంతంలో మాత్రం కోటలు లేవని, చెరువులు విస్తారంగా ఉండి మెట్టపంటలు ఉంటున్నాయని వ్రాశారు. 1948లో నిజాం నిరంకుశ పాలన అంతం తర్వాత హైదరాబాదు రాష్ట్రంలో హైదరాబాదు జిల్లాలో భాగంగా ఉంది.ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత కూడా 1978 వరకు హైదరాబాదు జిల్లాలోనే కొనసాగింది.హైదరాబాదు రాష్ట్రంలో బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో, ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తర్వాత నీలం సంజీవ రెడ్డి మంత్రివర్గంలో సభ్యుడైన కె.వి.రంగారెడ్డి పేరు మీదుగా ఈ జిల్లాకు నామకరణము చేశారు.ఈ జిల్లా ఇంతకు మునుపు హైదరాబాదు జిల్లాలో భాగంగా ఉండేది.1978లో హైదరాబాదు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలను విడదీసి కె.వి.రంగారెడ్డి పేరిట ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశారు.తర్వాత జిల్లాపేరు లోంచి కె.వి.పదాలను తొలిగించారు.ఏర్పాటు సమయంలో రంగారెడ్డి జిల్లాలో 11 తాలుకాలు ఉండగా 1986లో మండలాల వ్యవస్థ ప్రారంభం కావడంతో తాలుకాల స్థానంలో 37 మండలాలు ఏర్పడ్డాయి.

మనదేశంలో ఉన్న ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ముఖ్యమైన అబ్జర్వేటరీలలో రంగాపూర్ అబ్జర్వేటరీ ఒకటి. ఇది రంగాపూర్ గ్రామంలో ఉంది. ఈ గ్రామం హైదరాబాదుకు 56 కి.మీ. దూరంలో ఇబ్రహీంపట్నం దగ్గరగా ఉంది.

రంగారెడ్డి జిల్లా 16°30' నుండి 18°20' ఉత్తర అక్షాంశం, 77°30' నుండి 79°30' తూర్పు రేఖాంశంల మధ్యన విస్తరించియుంది. జిల్లాకు ఉత్తరాన మెదక్ జిల్లా, తూర్పున నల్గొండ జిల్లా, దక్షిణమున మహబూబ్‌నగర్ జిల్లా, పశ్చిమాన కర్ణాటకకు చెందిన గుల్బర్గా, బీదర్ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లా విస్తీర్ణం 7493 చ.కి.మీ. వైశాల్యం దృష్ట్యా రాష్ట్రంలో రెండవ జిల్లాగా ఉంది.ఈ జిల్లాలో మూసీ నది ప్రవహిస్తుంది

ఈ జిల్లాలో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండడం వలన, వీరి ప్రధాన వృతి వ్యవసాయం.జిల్లాలో పండించే ప్రధానపంట వరి. ఖరీఫ్, రబీలలో కలిపి 77వేల హెక్టార్లలో వరిపంట సాగవుతుంది. రెండోస్థానంలో ఉన్న జొన్న పంట రెండు కాలాలలో కలిపి 44వేల హెక్టార్లలో పండించబడుతుంది. కందులు ఖరీఫ్‌లో 28వేల హెక్టార్లలో సాగుచేయబడుతుంది. తాండూరు ప్రాంతం కందులకు రాష్ట్రంలోనే ప్రసిద్ధిచెందినది. వేరుశనగ రబీలో 7వేల హెక్టార్లలో పండుతుంది. మండలాల వారీగా చూస్తే వరిపంట హయత్‌నగర్, కందుకూరు, ఇబ్రహీంపట్నం మండలాలో అత్యధికంగా సాగుఅవుతుంది. జొన్న పంట ఉత్పత్తిలో బషీరాబాదు, మర్పల్లి, వికారాబాదు మండలాలు ముందంజలో ఉన్నాయి. కందిపంట తాండూరు, యాలాల, బషీరాబాదు మండలాలలో ఎక్కువగా సాగుచేయబడుతుంది. మొక్కజొన్న సాగులో చేవెళ్ళ, శంషాబాదు, మొయినాబాదు మండలాలు అగ్రస్థానంలో ఉన్నాయి. చెరుకు పంట బంటారం, పెద్దెముల్ మండలాలలో ఎక్కువగా సాగుచేయబడుతుంది. పండ్ల ఉత్పత్తిలో కందుకూరు మండలం, కూరగాయల ఉత్పత్తిలో చేవెళ్ళ, శంకర్‌పల్లి మండలాలు, పూలఉత్పత్తిలో శంకర్‌పల్లి మండలం ముందంజలో ఉన్నాయి.

జిల్లాలో రెండూ నదులు ప్రవహిస్తున్ననూ పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు లేవు. మొత్తం సాగువిస్తీర్ణంలో కేవలం 30% విస్తీర్ణానికే నీటిపారుదల సౌకర్యం ఉంది. హిమాయత్ సాగత్, ఉస్మాన్ సాగర్ చెరువులున్ననూ అవి ప్రధానంగా త్రాగునీటికే ఉపయోగపడుతున్నాయి. కాగ్నానదిపై నిర్మించిన కోట్‌పల్లి ప్రాజెక్టి మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుగా సుమారు 3700 హెక్టార్లకు సాగునీరు అందిస్తుంది. జుంటుపల్లి ప్రాజెక్టు, లక్నాపూర్ ప్రాజెక్టులు రెండు కలిపి సుమారు 1800 హెక్టార్లకు నీరు అందిస్తున్నాయి.

హైదరాబాదుకు సమీపంలో ఉన్న రంగారెడ్డి జిల్లా మండలాలలో పలు భారీ, అనేక మధ్యతరహా పరిశ్రమలే కాకుండా పలు పారిశ్రామిక వాడలున్నాయి. రాష్ట్ర పారిశ్రామికరంగంలో పేరుగాంచిన బీహెచ్‌ఈఎల్, ఈసీఐఎల్, ఐడీపీఎల్, హెచ్‌సీఎల్, హెచ్‌ఎంటీ, ఎన్‌ఎఫ్‌సీ లాంటి పరిశ్రమలు జిల్లాలో కేంద్రీకృతమై ఉన్నాయి.ఇవే కాకుండా చెర్లపల్లిలో భారత్ పెట్రోలియం కార్పోరేషన్, కుత్బులాపూర్ మండలంలో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీ, జీడీమెట్లలో ఈక్విస్ ఇంజనీర్స్, మేడ్చల్‌లో జీటీ అల్మాక్స్, తుర్కపల్లి, బోడుప్పల్‌లలో జీవీకే బయోసైన్స్, ఉప్పల్‌లో హెరిటేజ్ ఫుడ్స్, మౌలాలీలో హిందుస్తాన్ కోకాకోలా బెవెరేజెస్, గుండ్లపోచంపల్లిలో ఇంటగ్రేటెడ్ ఫార్మాసీటికల్స్ ఉన్నాయి. జీడీమెట్ల, బాలానగర్, ఉప్పల్ లలో భారీ, మధ్యతరహా పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. .

రంగారెడ్డి జిల్లాలో లభ్యమగు ఖనిజాలలో నాపరాయి, సున్నపురాయి, ఫెల్స్పార్, క్వార్ట్జ్ మున్నగునవి ముఖ్యమైనవి. తాండూరు, బషీరాబాదు మండలాలలో నాపరాయి, మర్పల్లి మండలంలో సున్నపురాయి, మేడ్చల్, మహేశ్వరం మండలాలలో ఫెల్ప్సార్ దొరుకుతుంది.

రంగారెడ్డి జిల్లాలోని 14 పాత మండలాలుతో పాటు 15 నుండి 17 వరకు గల మూడు మండలాలు రంగారెడ్డి జిల్లాలోని మండలాల గ్రామాల నుండి, కొత్తగా ఏర్పడినవి.18 నుండి 24 వరకు గల ఏడు మండలాలు మహబూబ్‌నగర్ జిల్లా నుండి విలీనంకాగా, 25 నుండి 27 వరకు గల మూడు మండలాలు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గ్రామాల నుండి కొత్తగా ఏర్పడినవి.

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (6)

జిల్లాలో  ఏర్పడిన కొత్త పంచాయితీలుతో కలుపుకొని 560 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.

జిల్లాలో 12 పురపాలక సంఘాలు,3 నగరపాలక సంస్థలు ఉన్నాయి.

భౌగోళికంగా రంగారెడ్డి జిల్లాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు 37 రెవిన్యూ మండలాలగా విభజించారు. రంగారెడ్డి జిల్లా హైదరాబాదు జిల్లా చుట్టూ ఉన్న ప్రాంతంతో ఏర్పడింది. అందువలన ఈ బొమ్మలో హైదరాబాదు జిల్లా తెలుపు రంగులో సున్నతో గుర్తించబడింది.

రాష్ట్ర రాజధాని చుట్టూ ఆవరించి ఉండటంతో జిల్లా తూర్పు భాగంగా రవాణా సౌకర్యాలు చాలా చక్కగా ఉన్నాయి. జాతీయ రహదారులు, రైల్వేమార్గాలు మాత్రమే కాకుండా హైదరాబాదుకు చెందిన అంతర్జాతీయ విమానాశ్రయం కూడా రంగారెడ్డి జిల్లాలోనే ఉంది.
 
రోడ్డు రవాణా: హైదరాబాదు నుంచి వెళ్ళు అన్ని జాతీయ రహదార్లు రంగారెడ్డి జిల్లా నుంచే వెళ్ళుచున్నాయి. 7వ నెంబరు జాతీయ రహదారి ఉత్తరాన మేడ్చల్ నుండి రాజేంద్రనగర్ వరకు, 9వ నెంబరు జాతీయ రహదారి శేరిలింగంపల్లి నుండి హయత్‌నగర్ వరకు, వరంగల్ వెళ్ళు రాజీవ్ రహదారు ఘట్‌కేసర్ వరకు, బీజాపూర్ వెళ్ళు అంతర్రాష్ట్ర రహదారి పరిగి వరకు ఉన్నాయి. జిల్లా పశ్చిమ భాగంగా తాండూరు వెళ్ళు రహదారి ముఖ్యమైనది. జిల్లాలో జాతీయ రహదార్ల పొడవు 96 కిలోమీటర్లు, కాగా 1850 కిలోమీటర్ల రోడ్డు, భవనాల శాఖ పరిధిలో ఉంది.

రైలు రవాణా: దక్షిణ మధ్య రైల్వేలో భాగంగా ఉన్న రంగారెడ్డి జిల్లాలో 11 మండలాల గుండా రైలుమార్గం వెళ్ళుచున్నది. ఇందులో అత్యధికంగా హైదరాబాదు పరిసరాలలో ఉండే (మల్కాజ్‌గిరి, ఘట్‌కేసర్, మేడ్చల్, శేరిలింగంపల్లి, శంషాబార్, శంకర్‌పల్లి) మండలాలు కాగా పశ్చిమ భాగంలో తాండూరు, వికారాబాదు, ధారూరు, నవాబ్‌పేట్, మర్పల్లి మండలాలు ఉన్నాయి. జిల్లా పశ్చిమ భాగంగా ఉన్న వికారాబాదు రైల్వే జంక్షన్. జిల్లాలో ఉన్న మొత్తం 35 రైల్వేస్టేషన్లలో మల్కాజ్‌గిరి మండలంలో అత్యధికంగా 9 రైల్వేస్టేషన్లు ఉన్నాయి. లింగంపల్లి నుంచి ఎంఎంటీఎస్ రైళ్ళు ప్రారంభమౌతాయి. జిల్లాలో రైల్వేలైన్ల నిడివి 250 కిమీ. హైదరాబాదు నుంచి వాడి, డోన్, కాజీపేట, నిజామాబాదు వెళ్ళు లైనులే కాకుండా, వికారాబాదు నుంచి పర్లివైద్యనాథ్ లైను కూడా జిల్లా నుంచే ప్రారంభమౌతుంది. వికారాబాదు జంక్షన్ నుంచి రాయచూరుకు నూతన మార్గం ఏర్పాటుకు రైల్వే శాఖ సర్వే కూడా జరిపింది. ఈ మార్గం పరిగి గుండా వెళ్తుంది.

వాయుమార్గం: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రంగారెడ్డీ జిల్లాకు చెందిన శంషాబాదు మండలంలో ఉంది. రాష్ట్ర రాజధానికి 22 కిమీ దూరంగా ఉన్న ఈ విమానాశ్రయాన్ని 2008లో ప్రారంభించారు.

జిల్లాలో దాదాపు 390 చ.కి.మీ.ల అడవులు ఉన్నాయి. ఈ అడవులలో అధికభాగం జిల్లా పశ్చిమ భాగంలో ఉన్నాయి.

రాష్ట్ర రాజధానిని ఆవరించి ఉండటంతో ఈ జిల్లాలో పలు ఉన్నత విద్యాసంస్థలు నెలకొల్పబడ్డాయి. జిల్లాలోని ఉన్నత విద్యాసంస్థలలో అధికభాగం హైదరాబాదు సమీపంలో ఉన్న మండలాలలో కేంద్రీకరించబడి ఉన్నాయి. గచ్చిబౌలీలో హైదరాబాదు విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్‌లో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆదిభట్లలో గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల, చిలుకూరులో హైపాయింట్ ఇంజనీరింగ్, టెక్నాలజీ కళాశాల, గండిపేట్‌లో హైటెక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాల, కోకాపేట్‌లో మహాత్మాగాంధీ టెక్నాలజీ సంస్థ, చేవెళ్ళలో ఇంద్రారెడ్డి స్మారక ఇంజనీరింగ్ కళాశాల, కొండాపూర్‌లో సంస్కృతి ఇంజనీరింగ్ టెక్నాలజీ సంస్థ, నాగర్‌గుల్‌లో స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాల, శేరిగూడలో శ్రీదత్తా ఇంజనీరింగ్  సైన్స్ కళాశాల, బోగారంలో తిరుమల ఇంజనీరింగ్ కళాశాల, కాచారంలో వర్థమాన్ ఇంజనీరింగ్ కళాశాల, కనకమామిడీలో కె.ఎస్.రాజు టెక్నాలజీ సైన్స్ కళాశాల, ఎంకేపల్లిలో భాస్కర్ ఇంజనీరింగ్ కళాశాల ఉన్నాయి.ఇవి కాకుండా వ్యాప్తంగా 2459 ప్రాథమిక, 882 మాధ్యమిక, 1235 ఉన్నత పాఠశాలలు, 258 జూనియర్ కళాశాలలు, 73 డీగ్రీ కళాశాలలు ఉన్నాయి.

వీసాల దేవాలయంగా పేరుగాంచిన చిలుకూరు బాలాజీ దేవాలయం, కీసరగుట్ట శివాలయం,మిలారమ్ బాలాజీ దేవాలయం,గండిపేట చెరువు, రత్నాలయం, నీళ్ళపల్లి, జుంటుపల్లి, శివసాగర్ ప్రాజెక్టు, కోట్‌పల్లి ప్రాజెక్టు జిల్లాలోని ముఖ్య పర్యాటక క్షేత్రాలు. అనంతగిరి కొండలు మూసీనదికి జన్మస్థానం. ఇక్కడే శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం ఉంది. ఈ ప్రదేశాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పరిచారు. తాండూరు ప్రాంతంలో అంతారం, కొత్లాపూర్‌లలో నూతనంగా నిర్మించిన దేవాలయాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.

హైదరాబాదుకు సమీపంలో ఉన్న రంగారెడ్డి జిల్లా ప్రాంతాలలో అన్ని రకాల క్రీడలు అభివృద్ధి చెందాయి. జిల్లా పశ్చిమ భాగంలో క్రికెట్, వాలీబాల్ లాంటి క్రీడలు ప్రజాదరణ పొందాయి. ఉప్పల్ లో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన క్రీడా స్టేడియం ఉంది. కుల్కచర్ల మండలానికి చెందిన వాలీబాల్ క్రీడాకారులు జాతీయస్థాయి (బాలుర) జట్టులో స్థానం పొందారు

మర్రి చెన్నారెడ్డి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి వికారాబాదు సమీపంలోని సిర్పూర్ గ్రామంలో 1919 జనవరి 13న జన్మించాడు. 1969లో తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజాసమితి పార్టీ స్థాపించి అన్ని సీట్లలో విజయం సాధించాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. తమిళనాడు గవర్నరుగా ఉంటూ 1996లో మరణించాడు.

కొండా వెంకట రంగారెడ్డి

స్వాతంత్ర్య సమరయోధుడు, 2సార్లు ఆంధ్రమహాసభలకు అధ్యక్షత వహించిన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో పలు మంత్రిపదవులు, ఉప ముఖ్యమంత్రిపదవి నిర్వహించిన తెలంగాణ దురంధరుడు కొండా వెంకట రంగారెడ్డి. రంగారెడ్డి జిల్లాకు ఈ పేరు ఇతని మీదుగానే పెట్టబడింది. 1890 డిసెంబరులో జన్మించిన కె.వి.రంగారెడ్డి 1970 జూలైలో మరణించాడు.

గంగారాం ఆర్య

వెదిరే రమాణారెడ్డి

నిరంకుశ నిజాం ప్రభుత్వ అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడిన నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు వెదిరే రమణారెడ్డి 193 జూన్‌లో ఆరుట్ల గ్రామంలో జన్మించాడు. డీఎస్పీ హోదాలో పనిచేసి ఇండీయన్ పోలీస్ మెడల్‌ను అందుకున్నాడు.

సి.మాధవరెడ్డి

రజాకార్ల మితిమీరిన అకృత్యాలను, నిజాం నిరంకుశ పాలనను ఎదిరించిన విమోచనోద్యమనేత మాధవరెడ్డి 1932 జూలై 31న హయత్‌నగర్ మండలంలో జన్మించాడు. రంగారెడ్డి జిల్లా స్వాతంత్ర్య సమరయోధుల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశాడు.

టి.దేవేందర్ గౌడ్

రంగారెడ్డి జిల్లాపరిషత్తు చైర్మెన్‌గాను, 3 సార్లు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడుగాను పనిచేసి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో అనేక మంత్రిపదవులను చేపట్టిన రాజకీయ నాయకుడు తూళ్ళ దేవేందర్ గౌడ్ మహేశ్వరం మండలం తుక్కుగూడ గ్రామంలో 1953, మార్చి 18న జన్మించాడు. ప్రారంభం నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉండి 2009లో తెలంగాణా అంశంతో విభేదించి నవతెలంగాణ పార్టీ స్థాపించాడు. ఆ తర్వాత దాన్ని ప్రజారాజ్యంలో విలీనం చేశాడు. 2009 ఎన్నికలలో స్వయంగా శాసనసభకు, పార్లమెంటుకు ప్రజారాజ్యం తరఫున పోటీచేసి ఓటమి పాలయ్యాడు. చివరికి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరినాడు.

కాటం లక్ష్మీనారాయణ

సబితా ఇంద్రారెడ్డి దేశంలోనే తొలి మహిళా హోంమంత్రిగా నియమితులైన సబితా ఇంద్రారెడ్డి తాండూరు సమీపంలోని కోటబాస్పల్లి గ్రామంలో 1963, మే 5న జన్మించింది. మాజీ మంత్రి పి.ఇంద్రారెడ్డి మరణంతో రాజకీయ రంగప్రవేశం చేసి 2004లో వైఎస్సార్ మంత్రివర్గంలో గనుల శాఖ మంత్రిగా, 2009లో హోంశాఖ మంత్రిగా నియమితులైంది. ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ మంత్రివర్గాల్లోనూ అదే శాఖ లభించింది.

జి.కిషన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన జి.కిషన్ రెడ్డి 1964లో రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించాడు. 2004 శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి, 2009లో అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికైనాడు. 2010, మార్చి 6న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనాడు.




#Article 238: భారతీయ వంటకాలు (242 words)


భారతీయ వంటలను ఈ కింది ప్రాంతీయ రకములుగా విభజించవచ్చును.
భారత దేశ భౌగోళిక పరీస్థితులవలన, ఉత్తర భారతదేశంలోని పదార్ధాలకు గోధుమ మూలం అయితే దక్షిణ భారతదేశం, తూర్పు భారతదేశం లోని ఆహారాలకు వరి ముఖ్య మూలం.

భారతదేశ ఆహారంలో ముఖ్యమైన మూలాలు వరి, గోధుమ పిండి దీనినే ఆట్టా అనికూడా అంటారు, సుమారు 5 డజన్ల రకాల దినుసులు. వాటిలో ముఖ్యమైనవి శెనగలు (వీటినే బెంగాల్ శెనగలు అని కూడా అంటారు, ఇవి తెల్ల శనగలలాగానే ఉంటాయి కానీ పరిమాణము చిన్నదిగా ఉండి మంచి సువాసనని కలిగిఉంటాయి), కందులు, మినుములు, పెసలు. దిణుసులని పప్పులాగా ఉపయోగిస్తారు, అంటే కందిపప్పు, మినపపప్పు, పచ్చిశనగపప్పు, పెసర పప్పు అలా. కొంతమంది శనగల్ని, పెసలని మొలకెత్తించి ఉపాహారం లా తీసుకుంటారు. శనగల్ని పిండి (శెనగ పిండి) రూపంలో ఎక్కువగా ఉపయోగిస్తారు

భారత దేశ ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలు మిరప, నల్ల ఆవాలు, జీలకర్ర, పసుపు, మెంతులు, ధనియాలు, ఇంగువ, వాము. ముఖ్యమైన సుంధ ద్రవ్యాలు పసుపు, లవంగము, యాలుకలు, శొంఠి, దాల్చిన చెక్క, గులాబి రేకులు, నల్ల మిరియాలు, తెల్ల నువ్వులు, గసగసాలు, పలావు ఆకు, కంకుమ పూవ్వు, జల్-జీరా, యెండు కొబ్బరి, కర్పూరం మొదలైనవి. వీటిలో కొన్నింటిని పొడిగా చేసి గరం మసాలా అని అంటారు. గరం మసాలాలో ఉండే దిణుసులు - ఎండబెట్టిన లవంగాలు, యాలుకలు, దాల్చిన చెక్క, ధనియాలు, జాజికాయా, జాపత్రి, ఎండు కొబ్బరి, గసగసాలు మొదలినవి. వీటిలో కొన్నితిని తీపిపదార్ధాల తయారీలో వినియోగిస్తారు. అవి గులాబీ రేకులు, కర్పూరం, తెల్ల నువ్వులు, కుంకుమ పువ్వు మొదలైనవి.

ఉప్పిట్టు అనేది ఉప్మాకి కన్నడ రూపాంతరం. దీన్ని రకరకాలుగా చేసుకోవచ్చు. గోధుమరవ్వతో చేసేవాళ్ళు కొంతమంది, ఉప్మా రవ్వతో చేసేవాళ్ళు కొంతమంది. గోధుమ రవ్వ లేక ఉమ్పా రవ్వ కూరగాయలతో ఉడికితే వచ్చేదే ఉప్మా

భారతదేశంలో రకరకాల రొట్టెలు చేసుకుంటారు అవి రోటీ, పోలి, పరాఠా, నాన్ మొదలైనవి.

బ్రిటీషు వారు బ్రిటీషు రాజరికం దగ్గరనుంచీ భారతదేశ వంటకాలతో ముడిపడి ఉన్నారు. ఇప్పటికీ కొన్ని భారత భోజనశాలలు సంపన్న లండన్ లో భారతదేశంలో పనిచేసి తిరిగివెళ్ళే ఉన్నత ఉద్యోగులకోసం సేవలు చేస్తున్నాయి.

ప్రస్తుతం భారత వంట ఆంగ్ల వంటకాలల్లో ఇమిడి పోయి ఉన్నది: ఐతే ఆంగ్ల వంటకాలల్లో భారత వంట మిళితమి మాత్రమే ఉన్నదన్న వాదనా లేకపోలేదు.




#Article 239: భారతీయ రైలు రవాణా వ్యవస్థ (1407 words)


భారతీయ రైల్వేలు (ఆంగ్లం: Indian Railways; హిందీ: भारतीय रेल Bhāratīya Rail); సంక్షిప్తంగా భా.రే.) భారత ప్రభుత్వ విభాగము. ఇది భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తూ భారత రైల్వే రవాణా వ్యవస్థను నిర్వహిస్తూ ఉంటుంది. రైల్వే మంత్రిత్వ శాఖ కేంద్ర రైల్వే మంత్రి (కేబినెట్ హోదా) నిర్వహణలో ఉండే రైల్వే విభాగం, రైల్వే బోర్డు కింద పనిచేస్తుంది. భారతీయ రైల్వేలు కార్పొరేట్ సంస్థ కానప్పటికీ ఈ మధ్య కాలంలో కార్పొరేట్ నిర్వహణ శైలిని అలవర్చుకొంటోంది. 

భారతీయ రైలు మార్గాలపై ప్రభుత్వానికి ఏకఛ్ఛత్రాధిపత్యం ఉంది. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలలో ఒకటి. ఇది ప్రతి రోజూ ఒక కోటీ అరవై లక్షల ప్రయాణీకులను గమ్యం చేరుస్తూండడమే కాక  మరో పది లక్షల మెట్రిక్ టన్నుల సరుకులను కూడా రవాణా చేస్తోంది. 
 భారతీయ రైల్వే ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను (సుమారు పదహారు లక్షలు)కలిగి వున్న సంస్థగా రికార్డుని నెలకొల్పింది.

రైలు మార్గాలు భారతదేశపు నలుమూలలా విస్తరించి ఉన్నాయి. ఈ మార్గాల మొత్తం దూరం సుమారుగా 63,140 కి.మీ (39,233 మైళ్ళు). సం,2002 నాటికి రైల్వేల వద్ద 2,16,717 వాగన్లు, 39,263 కోచ్ లు, 7,739 ఇంజిన్లు ఉన్నాయి. భారత రైల్వే ప్రతి రోజూ 14,444 రైళ్ళను నడుపుతూండగా అందులో 8,702 పాసెంజర్ రైళ్ళు. 

భారత దేశంలో రైల్వేలు మొదటిసారిగా సం.1853 లో ప్రవేశపెట్టబడ్డాయి. సం.1947 (స్వతంత్రం వచ్చే)నాటికి దేశంలో మొత్తం42 రైల్వే సంస్థలు నెలకొల్పబడి ఉన్నాయి. సం.1951లో ఈ సంస్థలన్నింటినీ కలుపుకొని భారత రైల్వే, ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే సంస్థలలో ఒకటిగా ఆవిర్బవించింది. భారత రైల్వే దూర ప్రయాణాలకు (long distance) , నగరాలలో దగ్గరి ప్రయాణాలకు (suburban)అవసరమైన రైళ్ళను నడుపుతోంది.

భారత దేశంలో రైల్వే వ్యవస్థ కొరకు 1832లో ప్రణాళిక రూపొందించినా, తరువాతి దశాబ్ద కా‍లం‍ వరకూ ఆ దిశలో ఒక్క అడుగూ పడలేదు. భారతదేశంలో మొదటి రైలు 1837 లో రెడ్ హిల్స్ నుండి చింతప్రేట్ వంతెన వరకు నడిచింది. దీనిని రెడ్ హిల్ రైల్వే అని పిలుస్తారు , విల్లియం అవేరీచే తయారు చేయబడిన రోటరీ స్టీమ్ లోకోమోటివ్ని ఉపయోగించారు. ఈ రైల్వే సర్ ఆర్థర్ కాటన్ చే నిర్మించబడింది , ప్రధానంగా మద్రాసులో రహదారి నిర్మాణ పనుల కొరకు గ్రానైట్ రాళ్ళను రవాణా చేయడానికి ఉపయోగించబడింది. 1844 లో, అప్పటి గవర్నరు జనరలు, లార్డు హార్డింజ్ రైల్వే వ్య్వస్థ నెలకొల్పేందుకు ప్రైవేటు సంస్థలకు అనుమతి ఇచ్చాడు. రెండు కూత రైల్వే కంపెనీలను స్థాపించి, వాటికి సహాయపడవలసిందిగా ఈస్ట్ ఇండియా కంపెనీని అదేశించారు. ఇంగ్లండు లోని పెట్టుబడిదారుల ఆసక్తి కారణంగా తరువాతి కొద్ది సంవత్సరాలలో రైల్వే వ్యవస్థ త్వరిత గతిన ఏర్పడింది. 1845 లో గోదావరిలో ఒక డ్యామ్ నిర్మాణం కోసం రాళ్ళు సరఫరా చేయడానికి ఉపయోగించే రాజమండ్రిలో దోల్స్లేవమ్ వద్ద గోదావరి డాం కన్స్ట్రక్షన్ రైల్వేను నిర్మించారు. 1851 లో సోలాని అక్విడక్ట్ రైల్వేను రూర్కీలో నిర్మించారు, దీనిని ఒక బ్రిటీష్ అధికారి పేరు మీద ఉన్న థామస్సన్ అని పిలిచే ఆవిరి లోకోమోటివ్లచే నడపబడుతుంది. సోలానీ నదిపై ఒక కాలువ కోసం నిర్మాణ పదార్థాలను రవాణా చేసేందుకు ఉపయోగించబడింది. కొన్నేళ్ళ తరువాత, 1853 ఏప్రిల్ 16 న బాంబే లోని బోరి నందర్, ఠాణాల మధ్య -34 కి.మీ.దూరం - మొట్టమొదటి ప్రయాణీకుల రైలును నడిపారు.

ఆంగ్ల ప్రభుత్వం ఎల్లపుడూ రైల్వే సంస్థలను స్థాపించమంటూ ప్రైవేటు రంగ పెట్టుబడుదారులను ప్రోత్సాహించేది. అలా సంస్థలను స్థాపించేవారికి మొదటి సంవత్సరాలలో సంవత్సరానికి లాభం ఐదు శాతానికి తక్కువ కాకుండా ఉండేలా ప్రణాళికను తయారుచేసింది. అలా పూర్తి అయిన తరువాత ఆ సంస్థ ప్రభుత్వానికి అప్పగించేది, కానీ సంస్థ యొక్క కార్యాకలాపాల పర్యవేక్షణ బాధ్యతలను మాత్రం తమ ఆధీనంలోనే ఉంచుకొనేవి. 1880 సం నాటికి ఈ రైలు మార్గాల మొత్తం దూరం సుమారుగా 14,500 కి.మీ (9000 మై) వరకు విస్తరించింది. ఈ మార్గాలలో ఎక్కువ శాతం మహా నగరాలైన బొంబాయి, మద్రాస్, కలకత్తాలకు చేరుకునేలా వుండేవి. 1895 నుండి భారత దేశం తన సొంత లోకోమోటివ్స్ (locomotives) స్ద్డాపించడం మొదలుపెట్టింది. తరువాత 1896లో తమ ఇంజనీర్లను , locomotive లను ఉగాండా రైల్వే నిర్మాణానికి పంపింది.

తరువాత భారత రాజ్యాలులు తమ సొంత రైల్వేలను ఏర్పాటు చేసుకొని తమ రాజ్యమంతా విస్తరించారు. అవి నవీన రాష్ట్రాలు అయిన అస్సాం, రాజస్థాన్ , ఆంధ్ర ప్రదేశ్. 1901లో రైల్వే బోర్డు ఏర్పాటు చేయబడింది కాని దాని మొత్తం అధికారం భారత వైస్రాయ్ (లార్డ్ కర్జన్) దగ్గర ఉండేది. రైల్వే బోర్డును కామర్స్ డిపార్ట్ మెంటు పర్యవేక్షంచేది. ఇందులో ముగ్గురు సభ్యులు ఉండేవారు. వారు ఒక ప్రభుత్వ అధికారి (ఛైర్మెన్), ఇంగ్లండు నుండి ఒక రైల్వే మానేజర్ , , రైల్వే కంపెనీలలో నుండి ఒక కంపెని ఏజెంట్. భారతీయ రైల్వే చరిత్రలో మొదటిసారిగా రైల్వే సంస్థలు చిన్నపాటి లాభాలను ఆర్జించటం మొదలైంది. ప్రభుత్వము 1907లో అన్ని రైల్వే కంపేనీలను స్వాధీనము చేసుకొన్నది.

ఆ తరువాతి సంలో విద్యుత్ లోకోమోటివ్ దేశంలో మొదటిసారిగా ప్రవేశపెట్టబడింది. కానీ ఇంతలో మొదలైన మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయ రైల్వేలు బ్రిటిష్ వారి యుద్ధ అవసరాలకు దేశం వెలుపల కూడా ఉపయోగించడ్డబడ్డాయి. దీంతో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే సరికి రైల్వేలు భారీగా నష్టపోయి ఆర్థికంగా చతికిల పడ్డాయి. ఆ తరువాత 1920 సంలో ప్రభుత్వం రైల్వే సంస్థల నిర్వహణను హస్తగతం చేసుకొని ఇతర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల పరిధి నుండి రైల్వే ఆర్థిక వ్యవహారాలను తప్పిస్తూ నిర్ణయం తీసుకొంది.

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అన్ని రైళ్ళను మధ్య-ఆసియాకు తరలించి , రైల్వే కర్మాగారాలను ఆయుధ కర్మాగారాలగా ఉపయోగించడంతో రైల్వే రంగం దారుణంగా చచ్చుబడి పోయింది. స్వాతంత్ర్య పోరాట సమయంలో (1947)రైల్వేలోని పెద్ద భాగం అప్పట్లో కొత్తగా నిర్మించబడిన పాకిస్తాన్ దేశంలోకి వెళ్ళిపోయింది. నలభై రెండు వేర్వేరు రైల్వే సంస్థలు, అందులోని ముప్పై రెండు శాఖలు అప్పటిలోని భారత రాజరిక రాష్ట్రముల యొక్క సొత్తు, అన్నీ ఒకే సముదాయంలో కలిసి ఏకైక సంస్థగా రూపొందుకొంది. ఆ సంస్థకు భారతీయ రైల్వే సంస్థగా నామకరణ చేసారు.
సం 1952 లో అప్పటి వరకు వివిధ సంస్థల ఆధీనంలో వున్న రైల్వే మార్గాలను ప్రాంతాల వారీగా విభజిస్తూ మొత్తం ఆరు ప్రాంతీయ విభాగలను ఏర్పాటు చేయటం జరిగింది. భారత దేశపు ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా చక్కపడటంతో అన్ని రైల్వే ఉత్పత్తులూ దేశీయంగానే తయారు చేయటం మొదలయ్యింది. 

మొత్తం రైలు మార్గము సుమారు 108,706 కీ.మీ. (67,547 మైళ్ళు). ఈ మార్గాలని వేగం ఆధారముగా (75 కీ.మీ/గం నుండి 160కీ.మీ/గం లేదా 47 మైళ్ళు/గం నుండి 99 మైళ్ళు/గం) విభజించారు. భారతీయ రైలు మార్గాన్ని బ్రాడ్ గేజ్ (స్టాండర్డ్ గేజ్ కంటే వెడల్పైనది ndash; 4  అడుగులు 8½  అంగుళాలు (1,435 మిల్లీ మీటర్లు)); మీటర్ గేజ్; , నారో గేజ్ (స్టాండర్డ్ గేజ్ కంటే తక్కువ).

 బ్రాడ్ గేజ్  ndash; 1,676 మీ.మీ (5.5 అడుగులు) ndash; భారత దేశములో అత్యధిక రైలు మార్గం బ్రాడ్ గేజ్. సుమారు 86,526 కీ.మీ (53,765 మైళ్ళు)ల బ్రాడ్ గేజ్ రైలు మార్గం ఉంది. రద్దీ తక్కువ ఉన్న ప్రాంతాలకు మీటర్ గేజ్ (1,000 మీ.మీ. (3.28 ft) రైలు మార్గాన్ని నిర్మించారు. ప్రస్తుతం అన్ని మార్గాలను బ్రాడ్ గేజ్ గా మార్చే పనులు జరుగుతున్నాయి. కొండ ప్రాంతాలలో ఉన్న రైలు మార్గాలను నారో గేజ్ మార్గాన్ని నిర్మించారు. ఈ మార్గాలను బ్రాడ్ గేజ్ గా మార్చడం చాలా కష్టం. మొత్తం నారో గేజ్ రైలు మార్గం 3,651 కీ.మీ (2,269 మైళ్ళు). ప్రఖ్యాత నీలగిరి పర్వత రైల్వే , డార్జిలింగ్ హిమాలయాల రైల్వేలు నారో గేజ్ రైలు మార్గాన్ని కలిగి ఉన్నాయి. రైల్వేలు ఉపయొగించిన కొన్ని రైలు మార్గాలను జంతు ప్రదర్శన శాలలో ఉపయొగిస్తున్నారు.

రైలు పట్టాల కింద ఉపయోగించే స్లీపెర్స్ ఎక్కువ భాగం కాంక్రీట్ తో తయారైనప్పటికీ కొన్ని పాత రైలు మార్గాలలో టేకు, మహాగని వంటి చెక్క స్లీపర్స్ కూడా వాడకంలో ఉన్నాయి. కాంక్రీట్ స్లీపర్స్ వాడటం వీలు కాని ప్రదేశాలలో లోహపు స్లీపర్స్ కూడా వినియోగంలో ఉన్నాయి.

సామాన్యంగా ప్రతి ట్రైన్ వెనుక గార్డుకు ఒక ప్రత్యేకమైన భోగి కేటాయంచబడి వుంటుంది. ఈ గార్డు ట్రైన్ బయలుదేరే ముందు అన్నీ సరిగా వున్నాయో లేదో చూసి మందు వుండే వాహకునికి (డ్రైవర్) సంకేతాలను ఇవ్వవలసి వుంటుంది. సాధారణంగా ప్రతి ప్రయాణీకుల ట్రైన్ కూ నాలుగు సాధారణ బోగీలు (ముందు రెండు, వెనుక రెండు) వుంటాయి. అందులో ఒకటి ఆడవారికి కేటాయించబడి వుంటుంది. ప్రతి ట్రైన్ కీ వుండే భోగీల సంఖ్య ఆ మార్గానికి వుండే రద్దీని బట్టి వుంటుంది. అవసరాన్ని బట్టి సామాన్ల కోసం, ఉత్తరాల బట్వాడా కోసం ప్రత్యేక బోగీలు అనుసంధానించి వుండటం కూడా గమనించవచ్చు. దూర ప్రయాణాలు చేసే ట్రైన్లలో వంట సదుపాయం వుండే ప్రత్యేక బోగి భోజన సదుపాయ బోగి కూడా వుంటుంది.

రైళ్ళు వివిధ వివిధ వర్గాలుగా విభజించబడ్డాయి. వీటి ప్రకారం వాటి ప్రాముఖ్యత, అవి ఆగే ప్రదేశాలు, టిక్కెట్ల రేట్లు ఉంటాయి. ప్రతి ఎక్స్‌ప్రెస్ రైలుకు నాలుగు అంకెల పేరు ఉంటుంది ndash; మొదటి అంకె ఆ రైలును నడిపే రైల్వే మండలాన్ని, రెండోది ఆ రైలును నియంత్రించే సదరు మండలంలోని విభాగం పేరు, చివరి రెండు ఆ రైలు వరుస సంఖ్యను తెలియజేస్తాయి.

సూపరు-ఫాస్టు రైళ్ళన్నిటికీ, మొదటి అంకె ఎప్పుడూ '2' ఉంటుంది. రెండో అంకె రైల్వే మండలాన్ని, మూడోది విభాగాన్ని, ఆ విభాగంలోని వరుస సంఖ్యను తెలుపుతాయి. రెండు గమ్యస్థానాల మధ్య ఎదురుబొదురుగా నడిచే జంటా రైళ్ళకు సాధారణంగా పక్కపక్క నంబర్లు ఉంటాయి. దాదాపుగా అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్ళన్నిటికీ ఓ ప్రత్యేకమైన పేరు పెడతారు. ఈ పేరు ప్రముఖ వ్యక్తులకు, సంఘటనలకు, నదులు, పర్వతాలు మొదలైన వాటికి చెంది ఉంటాయి. కొన్ని గుర్తుపెట్టుకోదగిన ఉదాహరణలు:

భారతీయ రైల్వేలను 16 మండలాలు, ఒక ఉప మండలం - కొంకణ్ రైల్వే -గా విభజించారు.

కోల్‌కతా మెట్రో భారతీయ రైల్వేల స్వంతమే అయినప్పటికీ అది ఏ రైల్వే మండలంలోకీ రాదు. దానికదే ఓ ప్రత్యేక మండలంగా పరిగణిస్తారు.

రైళ్ళను వాటి సగటు వేగం ఆధారంగా విభజిస్తారు. వేగవంతమైన రైళ్ళు కేవలం ముఖ్య రైల్వే స్టేషన్లలో మాత్రమే ఆగుతాయి , దూరప్రయాణానికి కావలసిన భోజన సదుపాయాలు కూడా కలిగి ఉంటాయి.

ఎనభయ్యవ దశాబ్ధం వరకు రైల్వే రిజర్వేషన్ టికేట్టు మాన్యువల్ గా జరిగేది. 1987 సంవత్సరం కంప్యూటర్ వ్యవస్థని ప్రవేశపెట్టారు. అప్పటి నుండి అంచెలంచెలగా దేశమాంతా కంప్యూటర్ రిజర్వేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 

ఈమధ్య ముఖ్యమైన కూడళ్ళలో , చిన్న చిన్న గ్రామాలలో సైతం కంప్యూటర్ ద్వారా రిజర్వేషన్ చేసుకొనే సదుపాయం ఏర్పాటుచేసారు. ఇటీవలే రైల్వే టికేట్టు ప్రయాణికులకు సులభ పద్ధతిలో ( అనగా ఇంటర్నెట్ ద్వారా , మొబైల్ ద్వారా ) రిజర్వేషన్ చేసుకొనే సదుపాయం ఏర్పాటుచేసారు, కాని ఈ సౌలభ్యానికి అదనపు రుసుము వసూలు చేస్తారు.

కొన్ని వర్గాల వారికి అనగా ముసలవారికి (60 ఏళ్ళు పైబడిన వారికి), వికలాంగులకు, చదువుకొనే విద్యార్థులకు , పైస్ధాయిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు టికేట్టులో రాయితీ కేటాయించడం జరిగింది. ఒక కాల పరిమితిలో లేదా కొన్ని రైళ్ళలో లేదా కొన్ని రైల్వే విభాగాలలో ఎన్ని సార్లైనా ప్రయాణించడానికి వీలుగా సీజన్ టిక్కెట్లు కూడా లభ్యమవుతాయి. యూ-రెయిల్ పాస్ ను పోలి ఉండే ఇండ్-రెయిల్ పాస్ ను కొనడం ద్వారా విదేశీ యాత్రికులు ఒక గరిష్ఠ కాల పరిమితిలోపు భారత దేశాన్ని మొత్తం చుట్టి రావచ్చు. అనగా ఈ కాల పరిమితిలో ఎన్ని రైళ్ళనైనా ఎక్కవచ్చు.

అధిక దూరం ప్రయాణించే రైలులో పడుకొనేందుకు పడకల (బెర్త్)ఏర్పాటు ఉంటుంది. ఆ పడకలకు రిజర్వేషన్ ప్రయాణించే తారీఖుకు రెండు నెలల ముందు లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ప్రయాణించే వ్యక్తి యొక్క నామధేయము, వయస్సు , రాయితీ వివరాలు టికేట్టులో పొందుపరచబడతాయి. టికెట్టు ధర సాధారణంగా మూల ధరతో పాటు టికెట్టు ధర సాధారణంగా మూల ధరతో పాటు ప్రయాణీకులు ఎంచుకున్న బోగీ తరగతి , రాత్రి ప్రయాణాలకు గానూ రిజర్వేషన్ ధరను కూడా కలుపుకుని ఉంటుంది. మూల ధరకు కొన్నిసార్లు రైలు వర్గీకరణలను బట్టి అదనపు ధరను కలుపుతుంటారు. (ఉదాహరణకు: సూపర్ ఫాస్ట్ రైళ్ళకు సర్చార్జి టికెట్టు మూల ధరకు కలుపుతారు.)

ఒకవేళ రైలులోని సీట్లన్నీ నిండిపోయి ఉంటే టికెట్టు పై ఒక క్రమ సంఖ్యను ముద్రిస్తారు. అది ఆ రైలులో ప్రయాణించడానికి సీటు కోసం వేచి చూస్తున్నవారి సంఖ్యను సూచిస్తుంది. అలా కాకపోతే టికెట్టు పై సీటు / పడక సంఖ్యను ముద్రిస్తారు. అలాంటి టికెట్టును ఖచితపరచబడిన టికెట్టుగా వ్యవహరిస్తారు. వేచియుండు సంఖ్య ఉన్న టికెట్టు కలిగిన ప్రయాణికుడు రైలులో ప్రయాణించరాదు. కేవలం సీటు ఖచితపరచబడిన మీదటనే రైలు ఎక్కాలి. ఇవి రెండూ కాకుండా మరో రకం టికెట్టు ఉంది. దీన్ని RAC లేదా 'రిజర్వేషన్ అగైన్‌స్‌ట్ కేన్సిలేషన్' అని వ్యవహరిస్తారు. అంటే ప్రయాణం రద్దైన వారి సీట్ల కోసమని అర్థం. ఇవి ఖచితపరచబడిన , వేచియుండు టికెట్లకు మధ్య జాతి టికెట్లు. ఇలాంటి టికెట్టు కలిగిన ప్రయాణికుడు సీటు ఖచితం కాకపోయినా రైలు ఎక్కవచ్చు. ఈ టికెట్టుపైనా ఒక క్రమ సంఖ్య ముద్రించబడి ఉంటుంది. వీరికి ఈ సంఖ్య ఆధారంగా రైలు టికెట్టు కలెక్టరు ప్రయాణం మానుకున్న ప్రయాణీకుల సీట్లను కేటాయిస్తారు.

రిజర్వేషన్ లేని టికెట్లు ప్రయాణానికి ముందుగా రైల్వే స్టేషనులోనే కొనుక్కోవచ్చు. కాని ఇలాంటి టికెట్లు కొన్న ప్రయాణీకులు జనరల్ బోగీలోనే ప్రయాణించాల్చి రావచ్చు.




#Article 240: కిన్నెరసాని (607 words)


కిన్నెరసాని, గోదావరి నది యొక్క ఉపనది. కిన్నెరసాని వరంగల్ జిల్లాలోని మేడారం - తాడ్వాయి కొండసానువుల్లో పుట్టి ఆగ్నేయంగా ప్రవహించి ఖమ్మం జిల్లాలో భద్రాచలానికి కాస్త దిగువన బూర్గంపాడు, వేలేరు గ్రామాల మధ్యన గోదావరిలో కలుస్తుంది. 96 కిలోమీటర్లు ప్రవహిస్తున్న ఈ నది యొక్క ఆయకట్టు ప్రాంతం మొత్తం 1300 చదరపు కిలోమీటర్లు. కిన్నెరసాని ఉపనదైన మొర్రేడు, కొత్తగూడెం పట్టణం గుండా ప్రవహించి సంగం గ్రామం వద్ద కిన్నెరసానిలో కలుస్తుంది.

కిన్నెరసాని నదిపై పాల్వంచ మండలంలోని యానంబైలు గ్రామం వద్ద విద్యుత్ ఉత్పాదనకై, కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీరందించేందుకు కిన్నెరసాని ప్రాజెక్టు నిల్వ జలాశ్రయాన్ని నిర్మించారు. 1972లో నిర్మాణము పూర్తి చేసున్న ఈ ప్రాజెక్టుకు 558 లక్షల వ్యయమైనది. 1998 ఏప్రిల్ లో రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈ ప్రాజెక్టును విద్యుచ్ఛక్తి శాఖకు బదిలీ చేసింది. ఈ ప్రాజెక్టు వ్యవసాయ భూములకు, విద్యుత్ ఉత్పత్తికే కాక పాల్వంచ, కొత్తగూడెం పట్టణ ప్రజలకు త్రాగునీరు కూడా అందిస్తుంది.

కిన్నెరసానీ! ఊహలోనైనా కాస్త నిలువమని ఆమె భర్త ప్రాధేయపడుతున్నాడు. 
తనప్రియురాలైన కిన్నెరసాని నిలువెల్ల కరిగిపోయి తన హృదయాన్ని, తన ప్రాణాన్ని హరించి అదృశ్యమైందని అతడు ఆవేదన చెందాడు. 
భర్తగా ఒకవేళ తప్పుచేసినా, ఏ స్త్రీలైనా ఇంత కఠినులుగా ఉంటారా! అని అతడు ఆమెను ప్రశ్నించాడు. 
స్త్రీలెవరైనా లోకంలో ఇంతకోపం,ఇంత పట్టుదల కైలిగి ఇలా చేస్తారా! అని అతడు అడిగాడు. 
శోకమూర్తివైన నిన్ను కౌగిలించుకున్నాను అయినా ఇంతలో నీరైపోయావా! అంటే భర్తగా కిన్నెరసానిని ఓదార్చాలని ప్రయత్నించే లోపలే ఆమె జీవం కోల్పోయిందని అర్ధం. 
ఎంతో కోపం ఎంతోపగ ఉన్నా తనను శిక్షించడానికి వేరే మార్గం లేదా అని అతడు ఆవేదన చెందాడు. 
రాతి మీద కాలుపెట్టలేని సుకుమారి కిన్నెరసాని కరిగినీరై కొండల్లో గుట్టల్లో ఎలా ప్రవహించగలదని ఆమె భర్త అమే సౌకుమార్యన్ని గురించి ఆలోచించాడు. 
ఆమె పాతివ్రత్యాన్ని గురించి ప్రశించలేదు అలాంటి ఆలోచన తనకు ఉంటే తనకత్తితో గొంతుకోసుకుంటానని అతడు ఆమె పట్ల తన విశ్వాసాన్ని ప్రకటించాడు. 
కిన్నెరసాని ప్రవాహంలోని నురుగు వెన్నెలవలె తెల్లనై ఆమె సుందరమైన శరీరఛాయ వలె ఉందని అతడు భావించాడు. 
సెలయేటి రూపంలో మెలికలుగా ప్రవహిస్తుంటే ఆమె ఒయ్యారపు నడకలు అతనికి గుర్తుకు వచ్చాయి. 
సెలయేటి నురుగులు ఆమె నవ్వులుగా, అలలు ఆమె శరీరపు ముడతలుగా, చేపలు ఆమె కన్నులుగా అతడు వర్ణించాడు. 
ఆమె మడికట్టును ఇసుకతెన్నెగా జూచిన అతని కళ్ళు పరితపించాయి 
పూర్వం భగీరథుని వెంట పరుగెత్తిన ఆకాశగంగ వలె ఆమె ప్రవాహం ఉన్నదని అతడు ప్రశంసించాడు. 
ఆమె జడ పట్టుకోవలని ప్రయత్నించిన అతని చేతికి నీటి ప్రవాహం తగిలింది. 
ఎడమ చేతితో కొంగుపట్టుకోవాలనుకుంటే అతని చేతికి తడి తగిలిందికాని కొంగుదొరకలేదు. 
అతని నుదుటి మీద చెమట ఇలా వాగుగా మారిన అమెపై ప్రేమను ప్రకటిస్తున్నది. 
ఆమె అతని జీవితానికి విలువైనది, ప్రాణాధారమైనది, శిరోరత్నం వంటిది అని అతడు పేర్కొన్నాడు. 
ఆమె ఆ విధంగా మారినపుడు అతని శరీరంలో ప్రాణాలు నిలువవని చెప్పి తానుకూడ ప్రవాహంలాగే మారుతానని చెప్పాడు. 
ఆమె రసహృదయ కాబట్టి ప్రవాహంలాగా మారింది కాని తాను కఠినహృదయుడు కాబట్టి ప్రవాహంలాగే మారలేనని తెలిపాడు. 
నది మనిషిగా మారినదేమొ అని అతడు అమే కన్నులు జూచి అనుకున్నాడు. 
పరుగెత్తిపోతున్న కిన్నెరసాని అలలకదలికలో ఆమె యవ్వన సంపదను అతడు వీక్షించాడు. 
ఆమెను కౌగిలించుకున్నప్పుడు కలిగినపుకింత అతనిని వీడక ముందే ఆమె కిరిగినీరై కనిపించకుండా పోయింది. 
అడవులో ఏడుస్తూ తిరుగుతున్నా అతనికి నీదే నీదే తప్పని వాదించినట్లనిపించింది. 
చేతులు చాచి, గొంతెత్తి ఏడుస్తున్నా అమే వినిపించుకోవటంలేదని అతడు ఆవేదన చెందాడు. 
ఆమె కొరకు ఏడ్చి ఏడ్చి అతని గొంతు పూడుకొని పోయింది . కన్నీరు అడ్డంపడి కంటిచూపు మందగించింది. శరీరం గట్టిపడింది. 
ఏడ్చే రోదనలో తనను తాను మర్చిపోయిన అతని దేహం రాయిగా మారిపోయింది. 
కిన్నెరా వరదగా ప్రవహించింది. అలలతో పరుగులు పెట్టింది. 
కిన్నెరసాని ఉధృతమై, సుళ్ళు తిరుగుతూ నురుగులు కక్కింది. 
రాళ్ళ మీద పచ్చిక మీద, పయనించిన కిన్నెరసాని సుడులతో మోగింది. ఒడ్డులను వొరుసుకుంటూ ప్రవహించి సుళ్ళుతిరిగిన ఆ ప్రవాహం మెలికలు తిరిగింది. 
కిన్నెరసాని అలల వరుసలతో మెరిసింది . సుడుల ముడులతో వేగంగా నడిచింది. ఇసుకనేలపైన బుసబుస పొంగింది. 
కిన్నెరసాని లేళ్ళ సమూహంలాగా, పూలనదిలాగ, పడగవిప్పిన తెల్లత్రాచులాగా కనిపించింది. 
తొడిమవూడిన పూవులాగ, సిగ్గుపడిన రాకుమార్తె లాగ, అందం కోల్పోయిన రత్నపేటికలాగ కనిపించింది. 
కిన్నెరసాని తనభర్త రాయిగా మారిన బోటనే అతనిని విడిచిపెట్టలేక దిగులుగా తిరిగింది. 
కిన్నెర తాను నదిగా మారినందుకు ఎంతో బాధపడింది. ముక్తగీతం వలె ఆమె బాధ మోగింది. ఆమె ఒకచోట నిలువలేక పరుగులు పెట్టింది. 
ఏ ఉపాయంతోనైనా మళ్ళీ మనిషిగా మారితే బాగుండుననే కోరికను ఆపుకోలేక విలపించింది కిన్నెరసాని . అంటే ఆమె తన భర్తప్రేమకు చలించిపోయి తన తొందరపాటుకు పశ్చాత్తపడిందని అర్ధం. 
తనను విడిచి ఆమెభర్త జీవీంచలేడని ఆమె బ్రతికుండగా గ్రహించలేకపోయింది. అది తెలిసి ఉంటే అతనితో ఎంతో ప్రేమగా ఉండే దాన్నని కిన్నెరసాని ఎంతో వెలపించింది. 
అటువంటి భర్తతో కాపురాన్ని ఇలా నాశనం చేసుకున్నానని కిన్నెర ఎంతో దిగులుపడింది. 
చివరికి ఏమీ చేయలేక కిన్నెరసాని రాయిగా మారిన భర్తను తన అల్లలు అనే చేతులతో చుట్టి ఎంతో వ్యధచెందింది. 
కొండగా మారిన భర్తను మాటిమాటికి కిన్నెర చేతులతో కౌగిలించి అలలమోతతో పలుకరించింది. 
తన భర్తను కూడా నదిగా మారిపొమ్మని కిన్నెర కోరింది. జలరూపంలో ఇద్దరం కలిసి పోదామని కెరటాలతో కౌగలించుకుందామని పేర్కొన్నది. 
ఓ నాథ! ఇలాంటి తప్పు ఇంక చేయను . నీవు ఆఙ్ఞాపిస్తే అడుగుదాటను. మరుజన్మలో ఇంతకోపం తెచ్చుకోను అని కిన్నెరసాని భర్తతో చెప్పింది. 
తాను కలత చెందానని, శ్రమతో అలసిపోయానని కిన్నెరసాని చెప్పింది. 
చేసిన తప్పు తెలుసుకున్నానని చెప్పి కిన్నెరసాని రాయిగా మారిన తనభర్తను విడిచివెళ్ళిపోయింది.

వికీపీడియా కామన్స్ లో ఉన్న కిన్నెరసాని ప్రాజెక్టు ఫోటోల కొరకు  చూడగలరు.

వికీపీడియా కామన్స్ లో ఉన్న కిన్నెరసాని జింకల పార్కు ఫోటోల కొరకు  చూడగలరు.




#Article 241: మున్నేరు (113 words)


మున్నేరు కృష్ణా నదికి ఉపనది.

మున్నేరు వరంగల్ జిల్లాలోని పాకాల సరస్సు వద్ద పుట్టి, ఖమ్మం, నల్గొండ, కృష్ణా జిల్లాల గుండా ప్రవహించి, పులిచింతలకు 20 కిలోమీటర్ల దిగువన కృష్ణానదిలో కలుస్తుంది. ఆకేరు, వైరా నదులు మున్నేరు యొక్క ప్రధాన ఉపనదులు. మున్నేరు సముద్రమట్టం నుండి 238 మీటర్ల ఎత్తున ప్రారంభమై కృష్ణానదిలో కలిసే సరికి మొత్తం 195 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. మున్నేరు యొక్క పరీవాహక ప్రాంతపు వైశాల్యం 10,490 చ.కి.మీలు. ఆకేరు ఖమ్మం గ్రామీణ మండలంలోని తిర్తల గ్రామం వద్ద మున్నేరులో కలుస్తుంది. వైరా నది దక్షిణానికి ప్రవహించి కృష్ణా జిల్లా, కంచికచెర్ల మండలంలోని కీసర వద్ద మున్నేరులో కలుస్తుంది.

మున్నేరు ఖమ్మం పట్టణపు శివార్లలోని దానవాయిగూడెం నుండి ప్రవహిస్తుంది. ఖమ్మం పట్టణ ప్రజలకు మంచినీటి వనరు మున్నేరే. ఖమ్మం జిల్లాలోని గార్ల మండలం, ముల్కనూరు గ్రామం వద్ద మున్నేటిపై మున్నేరు ప్రాజెక్టును నిర్మించాలని ప్రతిపాదించబడింది.

మున్నేరును ఆనుకొని పెనుగంచిప్రోలు పక్కన ప్రసిద్ధి గాంచిన శ్రీ గోపయ్య నమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మ వారి దేవాలయము ఉంది.




#Article 242: నాగావళి (156 words)


నాగావళి నది (River Nagavali) దక్షిణ ఒడిషా, ఉత్తరతీరాంధ్రలోని ముఖ్యనది. ఒడిషా రాష్ట్రములో పుట్టి, 225 కిలోమీటర్లు ప్రవహించి బంగాళా ఖాతములో చేరుతుంది. శ్రీకాకుళం పట్టణం ఈ నదీ తీరమునే ఉంది.

నాగావళి నది ఒడిషా రాష్ట్రము, కలహంది జిల్లాలో తూర్పు కనుమలలో సముద్ర మట్టానికి 915 మీటర్ల ఎత్తున్న తూర్పు కనుమలలో ప్రారంభమవుతుంది. ఈ నది మొత్తము 256 కిలోమీటర్లు సముద్రానికి ప్రవహిస్తుంది. అందులో 161 కిలోమీటర్లు ఒడిషా రాష్ట్రములో, 2 కిలోమీటర్లు ఒడిషా - ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుపై, దాదాపు 93 కిలోమీటర్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రవహిస్తుంది.

బర్హా, బల్దియా, సత్నాల, సీతగుర్హ, శ్రీకోన, జంఝావతి, గుముడుగెడ్డ, వొట్టిగెడ్డ, సువర్ణముఖి, వోనిగెడ్డ, రెల్లిగెడ్డ, వేగావతి నదులు నాగావళి యొక్క ప్రధాన ఉపనదులు. నది యొక్క మొత్తము పరీవాహక ప్రాంతము 9,410 చ.కి.మీ అందులో 4,462 చ.కి.మీలు ఒడిషా రాష్ట్రములో (1006 చ.కి.మీలు కలహంది జిల్లాలో, 3,456 చ.కి.మీలు కోరాపుట్ జిల్లాలో), 4,948 చ.కి.మీలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో (1,789 చ.కి.మీలు శ్రీకాకుళం, 3,096 చ.కి.మీలు విజయనగరం జిల్లా, 63 చ.కి.మీలు విశాఖపట్నం జిల్లాలో) ఉంది.

నాగావళి నది మీద తోటపల్లి, నారాయణపురం వద్ద నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మించబడ్డాయి. తోటపల్లి నీటిపారుదల ప్రాజెక్టు యొక్క ఆయకట్టు 37,000 ఎకరాలు, నారాయణపురం ఆనకట్ట యొక్క ఆయకట్టు దాదాపు 40,000 ఎకరాలు.

నాగావళి శ్రీకాకుళం పట్టణం నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్లేపల్లి గ్రామం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.




#Article 243: వంశధార (339 words)


వంశధార నది ఒడిషా రాష్ట్రం లో, నియమగిరి పర్వత సానువులలో పుట్టింది. మొత్తం 230 కిలోమీటర్లు పొడవున పాఱుచున్నది. ఇందులో 150 కిలోమీటర్లు ఒడిషాలో ఉంది. ఆంధ్ర ప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లా వద్ద మన ఆంధ్రలోనికి వచ్చి కళింగపట్నం అనే చోట బంగాళా ఖాతములో కలుస్తుంది. వంశధార దాదాపుగా 11,500 చదరపు కిలోమీటర్లు మేర ఆవరించి, శ్రీకాకుళం జిల్లా యొక్క ప్రధాన నీటి వనరులలో ఒకటిగా వాడుకోబదుతుంది. ఇప్పటిలోన దీనిపై కట్టించఁబడిన ఒకేయొక్క ఆనకట్ట గొట్టా (శ్రీకాకుళం జిల్లా) అను పిలువఁబడు చోటులో ఉంది.

శ్రీకాకుళం జిల్లాలో పారాఱునట్టి వంశధారానదియొక్క ఒక పాయకు కల కథనుఁబట్టి దక్షిణ సముద్ర తీరమున శ్వేతపురమనే పట్టణమును శ్వేతచక్రవర్తి ఏలుచుండేవాడు. ఆయనకు విష్ణుప్రియ అనే పేరుఁగల పెండ్లము ఉండేది. ఆమె మహా విష్ణు భక్తురాలు. ఆమె ఒకనాటి ఏకాదశి వ్రత దీక్షలో ఉండగా ఆమె భర్త అయిన శ్వేతమహారాజు కామమోహితుడై ఆమె వద్దకు వచ్చెను. అప్పుడు విష్ణుప్రియ మగనికి ముద్దుఁగా బ్రతిమాలి పిలిఁచి, కూర్చుండబెట్టి, పూజా గదికి పోయి విష్ణువును కొలిఁచి, స్వామీ! అటు నా మొగుఁడును నేను కాదనలేను, ఇటు నీ వ్రతమును భంగపడనివ్వలేను. నువ్వే నన్ను కాఁపాడమని పరిపరి విధముల వేడుకొంది. స్వామీ! కూర్మరూపమున భూమిని దాలేదా? అట్లే నన్ను ఆదుకోమని ప్రార్థించింది. శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చి, అక్కడనే గంగను వెలఁయింపఁసేసెను. ఆ గంగ గొప్ప ఉఱఁవడి పఱఁవడిఁగా రాగా మహారాజు జడిఁసి పరుగిడి ఒక కొండ మీదకు చేరి తమ మంత్రిని విషయము అడుగగా, ఆతను రాజుకు విషయమంతా వివరించెను. అప్పుడు రాజు పశ్చాతాపంతో మరణమే తన పాపేమునకు ప్రాయశ్ఛిత్తమని తలచి, శ్రీమహా విష్ణువును ధ్యానించుచుండెను. అప్పుడు నారదుడు అటుగా వచ్చి, రాజును విషయమడుగగా, రాజు తన బాధను వివరించెను. అప్పుడు నారదుడు రాజుకు శ్రీకూర్మ మంత్రమును ఉపదేశించి దీక్షతో ధ్యానించమని చెప్పెను. ఈ గంగా ప్రవాహము వంశధార అను పేరుతో సాగరములో లీనమగునని, ఇది సాగరసంగమ ప్రదేశమని చెప్పెను.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వంశధార నదినీరును అదనంగా వాడుకోవడానికని గుఱించిన ప్రాజెక్టు అడ్డంకులను ట్రిబ్యునల్ తొలగించింది. వంశధార నది ఆంధ్ర- ఒడిషా ఎల్లల్లో 29 కిలోమీటర్లు, ఆంధ్ర ప్రదేశ్‌లో 82 కిలోమీటర్లు పాఱుచున్నది. ఈ రెండు రాష్ట్రాల నడుమ 1962లో కుదిరిన ఒప్పందమునిఁబట్టి వంశధార నీటిని ఇద్దరు, చెఱి సగము (50:50 శాతం) వాడుకోవాలి. ఈ నదిపై కట్టించాల్సిన ప్రాజెక్టులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రెండు దశలుగా విడఁగొట్టింది. మొదటి దశలో గొట్టా బ్యారేజీ, ఎడమ ప్రధాన కాల వలను కట్టించింది. 17,841 టిఎంసిల నది నీటిని వాడుకుంటోంది. అందు వల్లన 1.48 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. రెండో దశలో 16.048 టిఎంసిలతో 1.07 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే నేరడి ప్రాజెక్టును ప్రతిపాదించింది. దీని కోసం ఒడిషాలోని 106 ఎకరాలు ముంపుకు గురవుతున్నాయి. అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుఁదల ఇవ్వనందున ఇంతకాలం జాగు జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ పనిని కూడా రెండుగా విడఁదీసి మొదటి దశగా గొట్టా బ్యారేజీ నుంచి కుడి ప్రధాన కాలువ కట్టించింది. 0.62 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పనులు ముగించింది. ఇప్పుడు ట్రిబ్యునల్ తీర్పుతో కాట్రగడ్డ వద్ద సైడ్ వీయర్ కట్టడం చేపట్టి మరో 8 టిఎంసిలను వాడుకోవడానికి వీలుచిక్కింది:




#Article 244: చిత్రావతి (144 words)


చిత్రావతి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ల గుండా ప్రవహించే అంతర్రాష్ట్ర నది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నది అనంతపురం జిల్లా గుండా ప్రవహిస్తుంది. ఇది పెన్నా నదికి కుడివైపు ఉపనది. దీని పరీవాహక ప్రాంతం 5,908 చ.కి.మీ. ఇది వర్షాకాలంలో ప్రవహించే వర్షాధారమైన నది. 

పుట్టపర్తి పట్టణం ఈ నదీ తీరాన ఉంది. సత్యసాయి బాబా ప్రశాంతి నిలయం ఈ నది ఒడ్డునే ఉంది. ప్రారంభ దశలో బాబా ఈ నదీ తీరంలో ఉపన్యాసాలు భక్తులకు వినిపించేవాడు. భజన కార్యక్రమాలు నిర్వహించేవాడు.

చిత్రావతి నది కర్ణాటక లోని చిక్కబళ్ళాపూర్ జిల్లాలో పుట్టి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం, కడప జిల్లాల గుండా ప్రవహించి పెన్నానదిలో కలుస్తుంది. కర్ణాటక లోని బాగేపల్లితో పాటు, ఆంధ్రప్రదేశ్ లోని గోరంట్ల, హిందూపూర్, బుక్కపట్నం, ధర్మవరం, తాడిపత్రి, కదిరి మండలాలు దీని పరీవాహక ప్రాంతంలో ఉన్నాయి. కడప జిల్లా గండికోట వద్ద చిత్రావతి పెన్నానదిలో కలుస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గండికోట ప్రాజెక్టును చేపట్టింది. చిత్రావతి, పాపాఘ్ని కలిసి మధ్య పెన్నా బేసిన్ అవుతాయి.

అనంతపురం జిల్లా, తాడిమర్రి వద్ద ఒక బాలెన్సింగు జలాశయాన్ని నిర్మించారు. కర్ణాటక ప్రభుత్వం కోలారు జిల్లా బాగేపల్లి వద్ద నిర్మించిన పరగోడు ఆనకట్ట రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అనేక సాగునీటి చెరువులకు నీరు అందదని ఆంధ్ర రైతులు వాదించారు.




#Article 245: కుందేరు (126 words)


కుందేరు నది,  ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉన్న ఎర్రమల కనుమలలో పుట్టి దక్షిణ దిశలో ప్రవహించి వైఎస్ఆర్ జిల్లా, కమలాపురం సమీపములో పెన్నా నదిలో కలుస్తుంది. దీనిని కుందూ, కుముద్వతి అని పేర్లతో కూడా వ్యవహరిస్తుంటారు.ఈ నదీతీరాన ఉన్న పట్టణాలలో నంద్యాల ముఖ్యమైంది, అతి పెద్దది.కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు, మిడుతూరు, గడివేముల, నంద్యాల, గోస్పాడు, కోయిలకుంట్ల, దొర్నిపాడు, చాగలమర్రి, వైఎస్ఆర్ జిల్లాలోని మైదుకూరు మండలాలు కుందేరు నది నీటి పరీవాహక పరిధిలో ఉన్నాయి.

కుందేరులో నీళ్లు పశ్చిమాన మద్దులేరు, జుర్రేరు నుండి తూర్పున కాళి, వక్కలేరు నుండి చేరతాయి. కుందేరు, మద్దులేరు నిండా నీటితో ప్రవహించినప్పుడు వాటి మధ్యన ఉన్న జలకనూరు వంటి గ్రామాలు నీటితో నిండిపోతాయి. జుర్రేరు బనగానపల్లె ప్రాంతం నుండి ప్రవహించి కుందేరులో చేరుతుంది.కుందేరు నదీ అడుగున ఎక్కవ భాగం రాతిమయంతో ఉంటింది.ఇక్కడ సున్నపురాళ్లను త్రవ్వి తీస్తారు.నది అడుగు శిలల పొరలతో ఉంటాన నీరు భూమిలోకి ఇంకక పోవడం ఈ నది విశేషం. దీనివల్ల నది వెంబడి ఉన్న బావుల్లో నీరు తాగే యోగ్యంగా లేదు.నంద్యాల వద్ద కుందేరు కర్నూలు - కంభం రహదారి దాటే చోట 1864లో ఒక వంతెన నిర్మించారు.




#Article 246: పాపాఘ్ని (128 words)


పాపాఘ్ని పెన్నా నదికి ఉపనది. పాపాఘ్ని నది కర్ణాటక రాష్ట్రం, చిక్‌బళ్లాపూర్ జిల్లాలోని సిడ్లఘట్ట గ్రామం వద్ద పుట్టి, చిత్తూరు జిల్లా ద్వారా ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తుంది. పాలకొండ శ్రేణుల గుండా ప్రవహించి, వైఎస్ఆర్ జిల్లా మైదానపు ప్రాంతంలోకి పారుతుంది. పాపాఘ్ని వైఎస్ఆర్ జిల్లాలోని కమలాపురం వద్ద పెన్నా నదిలో కలుస్తుంది. పాపాఘ్ని ఉపనదుల్లో మొగమేరు చెప్పుకోదగినవి. మొత్తం 205 కిలోమీటర్ల పొడవున్న పాపాఘ్ని నది యొక్క మొత్తం పారుదల ప్రాంతం 7,423 చ.కి.మీలు. ఇది మొత్తం పెన్నా నది పారుదల ప్రాంతంలో 14.14%. పాపాఘ్ని నది యొక్క పారుదల ప్రాంతం చిత్తూరు, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాలో ఉన్నా, ప్రధాన భాగం చిత్తూరు జిల్లాలోని పశ్చిమభాగంలోని కొండప్రాంతంలో ఉంది. వైఎస్ఆర్ జిల్లాలో ప్రవహించే పాపాఘ్ని పై గాలివీడు మండలం, వెలిగల్లు గ్రామం వద్ద మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.

పాపాఘ్ని నదీ తీర ప్రాంతంలో చిక్‌బళ్లాపూర్ వద్ద అత్యంత పురాతనమైన పాపాఘ్ని మఠం ఉంది.

వైఎస్ఆర్ జిల్లాలో ఈ నదీతీరంలోనే రాయచోటి-వేంపల్లి మార్గమధ్యంలో పవిత్ర గండి క్షేత్రం వెలసింది. పాపఘ్నీ నది ఇక్కడ శేషాచలం కొండను చీలుస్తుంది. కొండకు గండి కొట్టింది కాబట్టి ఈ ప్రాంతానికి గండి అని పేరు వచ్చింది.




#Article 247: సగిలేరు (183 words)


సగిలేరు పెన్నా నదికి ఉపనది. ఇది ప్రకాశం జిల్లా నల్లమల కొండలలో కంబం వద్ద పుట్టి, దక్షిణమున గిద్దలూరు, బద్వేలు తాలూకాల గుండా ప్రవహించి వైఎస్ఆర్ జిల్లాలో పెన్నానదిలో కలుస్తుంది. పూర్వము ఈ నదిని స్వర్ణబాహు నది అని పిలిచేవారు. సగిలేరు నదిపై వైఎస్ఆర్ జిల్లాలో రెండు మధ్యతరహా నీటి పారుదల పథకాలు ఉన్నాయి - ఎగువ సగిలేరు ప్రాజెక్టు, దిగువ సగిలేరు ప్రాజెక్టు.

దిగువ సగిలేరు ప్రాజెక్టు వైఎస్ఆర్ జిల్లాలో బి.కోడూరు మండలంలోని వడ్డెమాను గ్రామం వద్ద నిర్మించబడింది. దీని మొత్తం ఆయకట్టు 11804 ఎకరాలు. ఈ ప్రాజెక్టు 0.6 టి.ఎం.సిల లభ్యమయ్యే జలాల్ని వినియోగించుకుంటుంది. జలాశయం యొక్క పూర్తి సామర్థ్యం 0.169 టి.ఎం.సి.లు, నికర సామర్థ్యం 0.166 టి.ఎం.సి.లు. దీన్ని మొత్తం 51 లక్షల వ్యయంతో 1954లో నిర్మించారు. 1996లో ఇంతకుముందెన్నడూ లేనివిధంగా సంభవించిన వరదల వల్ల ఆనకట్ట, గేట్లు, కాలువలు, పంపీణీ వ్యవస్థ దెబ్బతినడంతో 6.95 కోట్ల ఖర్చుతో మరమత్తులు చేపట్టి 2003 మార్చిలో పూర్తిచేశారు. 2009లో ఈ ప్రాజెక్టుకు మాజీ రాష్ట్రమంత్రి పేరుమీద వడ్డెమాను చిదానందం జలాశయం అని పేరు మార్చారు.

ఎగువ సగిలేరు ప్రాజెక్టు కలసపాడు మండలం దిగువ తంబళ్లపల్లె వద్ద సగిలేరు నదిపై నిర్మించబడింది. దీనిని వంకమర్రి డ్యామ్ అని కూడా వ్యవహరిస్తారు. ఈ ప్రాజెక్టు యొక్క మొత్తం ఆయకట్టు 5448 ఎకరాలు. దీన్ని 1896లో 4.6 లక్షల వ్యయంతో నిర్మించారు. 1898-99లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టులో ఆనకట్టతో పాటు 10 మైళ్ల పొడవున్న కాలువ దారివెంట ఉన్న అనేక చెరువులకు నీరందిస్తున్నది. 1996లో వరదల వల్ల దెబ్బతిన్న ఆనకట్ట, కాలువలు, పంపీణీ వ్యవస్థను 2.32 కోట్ల ఖర్చుతో మరమ్మత్తులు చేశారు. ఈ పని మార్చి 2001లో పూర్తయ్యింది.




#Article 248: చెయ్యేరు నది (336 words)


చెయ్యేరు, పెన్నా నదికి ఉపనది. దీనినే బాహుదా నది అని కూడా అంటారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అత్తిరాల ఈ నదీతీరాన్నే వెలసింది.ఈ నది కర్ణాటకలోని కోలార్ జిల్లా రాయపాడు కొండల్లో పుట్టి చిత్తూరు జిల్లా, మదనపల్లె ప్రాంతం నుంచి ప్రహహించి వైఎస్ఆర్ జిల్లా, సరిపల్లి సమీపంలో కడప జిల్లాను తాకుతుంది. ఈ నది మీద బాదనగడ్డ వద్ద అన్నమయ్య ప్రాజెక్టు నిర్మించబడింది.జిల్లాలో సుమారో 150 కి.మీ. మేర ఈ నది విస్తరించింది. టి.సుండుపల్లె మండలంలోని రాయవరం వద్ద బహుదా, పింఛ నదులు అనుసంధానం చేసుకుని బాలరాచపల్లి మీదుగా, అన్నమయ్య ప్రాజెక్టు ముందుభాగాన మాండవ్య, గంగనేరులను కలుపుకుని సిద్దవటం మీదుగాశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోకి ప్రవేశిస్తుంది.

ఈ నదికి చెయ్యేరు లేక బాహుద అనే పేర్లు రావడానికి వెనుకనున్న కథ ఇది: శంఖ - లిఖితులనే అన్నదమ్ములిద్దరు ఏటికి ఈ ఒడ్డున ఒకరు, ఆ ఒడ్డున ఒకరు కాపురముండేవారని,తమ్ముడు ప్రతిరోజూ అన్న వద్దకు వచ్చి వేదం, శాస్త్రం నేర్చుకుని వెళ్ళేవాడు. ఏటి ఒడ్డునే ఒక మామిడి తోట ఉంది. ఒకనాడు లిఖితుడు ఆ దారి వెంట నడుస్తుండగా అతనికి ఆకలి వేసింది. తోట యజమాని కోసం చూస్తే అతను ఎక్కడా కనిపించలేదు. లిఖితుడు ఆకలికి తాళలేక రెండు పళ్ళు కోసుకుని తిన్నాడు. తర్వాత ఈ విషయం అన్నకు చెప్పాడు. చేసింది నేరమని, రాజు రవివర్మ వద్దకు వెళ్ళి శిక్షను కోరుకొమ్మన్నాడు అన్న శంఖుడు. పొత్తపి రాజు లిఖితుడి చేతులు ఖండించాడు. లిఖితుడు తెగిన చేతులతో అన్న దగ్గరకు వచ్చాడు. శంఖుడు దైవాన్ని ప్రార్థించి చేతులు ఏట్లో ముంచమన్నాడు. లిఖితుడు అలాగే చేయగా అతనికి చేతులు వచ్చాయి. చేతులను రప్పించిన ఆ నదికి 'చెయ్యేరు' అని పేరు వచ్చింది. సంస్కృతంలో 'బాహు' అంటే చెయ్యి. 'ద' అంటే ఇచ్చునది. అందుకే చేతిని ఇచ్చిన ఈ నది పేరు బాహుద అయింది. ఈ నదిని గురించి తొలితెలుగు యాత్రాచరిత్ర ఐన కాశీయాత్ర చరిత్రలో ప్రస్తావనలున్నాయి. 1830లో ఈ ప్రాంతమీదుగా కాశీయాత్ర చేసిన గ్రంథకర్త ఏనుగుల వీరాస్వామయ్య ఈ నదిని గురించి, చుట్టుపక్కల ప్రాంతాల గురించి వ్రాసుకున్నారు.అతను తన గ్రంథంలో నది గడియ దూరము వెడల్పు ఉందని వ్రాశారు. దాన్ని బట్టి ఆ నదిని దాటేందుకు గడియ సేపు పట్టేదని, అంత వెడల్పు అని అర్థంచేసుకోవచ్చు.నదికి ఇరుపక్కల గుళ్ళున్నాయని, పుణ్యక్షేత్రం నెలకొందని పేర్కొన్నారు.

చెయ్యేరు యొక్క ఉపనదులు

చెయ్యేరు నది మీద వైఎస్ఆర్ జిల్లా, రాజంపేట మండలంలోని బాదనగడ్డ వద్ద అన్నమయ్య ప్రాజెక్టు నిర్మించబడింది. ఈ ప్రాజెక్టు వలన వైఎస్ఆర్ జిల్లాలోని 22,500 ఎకరాల భూమికి సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు 2.17469 టి.ఎం.సిల నీటిని ఉపయోగించుకొంటుంది. జలాశయం యొక్క నీటి నిల్వసామర్ధ్యం 2.33948 టి.ఎం.సి (గ్రోస్), 2.23948 టి.ఎం.సి (నెట్).

తొలి అంచనా ప్రకారం ఈ ప్రాజెక్టు యొక్క వ్యయం 60.44 కోట్ల రూపాయలుగా 1996-97 లో నిర్ణయించడమైనది కానీ 2001-02 లో తిరిగివేసిన అంచనాలో అభివృద్ధి, ఆధునీకరణ ఖర్చులతో మొత్తం వ్యయం 68.92 కోట్ల రూపాయలుగా వెలకట్టబడింది. 2004 జనవరి వరకు 57.347 కోట్ల రూపాయల మొత్తం ప్రాజెక్టు ఆధునీకరణ, పునరావాసం, వైఎస్ఆర్ జిల్లా లోని రాజంపేట, పుల్లంపేట మండలాలలో 22,500 ఎకరాల ఆయకట్టు స్థిరపరచడానికి ఖర్చు చేయబడింది.




#Article 249: గుండ్లకమ్మ రిజర్వాయర్ (196 words)


గుండ్లకమ్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలలో ప్రవహించే నది. కృష్ణా నది, పెన్నా నది మధ్య స్వతంత్రముగా తూర్పు ప్రవహించే చిన్న నదులలోకెల్లా ఇదే పెద్దది. దీనిపై కందుల ఓబుల రెడ్డి గుండ్లకమ్మ జలాశయం ప్రాజెక్టు నిర్మించి సాగు, తాగు నీటి అవసరాలను తీరుస్తున్నారు.

మార్కండేయడు రచించిన గజారణ్య సంహిత ప్రకారం కృతయుగంలో ఈ ప్రాంతమంతా దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండి, ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండేదట. అందుకే ఈ ప్రాంతాన్ని గజారణ్యంగా పిలిచేవారట. ఈ గజారణ్యంలో అనేక మంది మునులు ఆశ్రమాలు నిర్మించుకుని తపస్సు చేస్తుండేవారట. నంది మండలంగా పిలువబడిన ఈ ప్రాంతాన్ని హైహయుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. 

ఒక రోజు వేటకువెళ్ళిన రాజు పరివారానికి జమదగ్ని మహర్షి ఆశ్రమం కనిపించింది. వారు మహర్షిని ప్రార్థించి, రెండు కుండల నిండుగా నీటిని తీసుకుని వెళ్తుండగా, ఆ కుండలు గుండ్ల బ్రహ్మేశ్వరం అనేచోట పైకెగిరి పగిలిపోయాయి. ఆ కుండల నుండి జాలువారిన జలమే నదిగా ప్రవహించిందని కథనం. ఆ గుండికానదే వాడుకలో గుండ్లకమ్మగా రూపాంతరం చెందింది. గుండికా నదీగా పిలవబడిన ఈ నదీ తీరంలోనే మార్కండేయ మహర్షి తపస్సు చేస్తుండేవారట.

ఇది కర్నూలు జిల్లా నంద్యాల, ఆత్మకూరు మండలాల సరిహద్దులో నల్లమల్ల కొండల లోని గుండ్ల బ్రహ్మేశ్వరము వద్ద 800 మీటర్ల (2900 అడుగులు) ఎత్తులో పుడుతుంది. 

గుండ్లకమ్మ వేగం పుంజుకొని రాచర్ల మండలం, జె. పుల్లలచెరువు గ్రామం సమీపాన నెమలిగుండం జలపాతాన్ని ఏర్పరుస్తుంది. ఆ తరువాత ఇది కంభం చెరువును, మార్కాపురం చెరువును నింపుతుంది.

ఆ తరువాత ఈశాన్యముగా ప్రవహించి గుంటూరు జిల్లాలో ప్రవేశిస్తుంది. గుంటూరు జిల్లాలో తిరిగి దిశమార్చుకొని ఆగ్నేయముగా ప్రవహించి ఒంగోలు మండలం, ఉలిచి గ్రామం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. చామవాగు, రాళ్లవాగు, పొగుల్లవాగు, దువ్వలేరు, జంపాలేరు, తీగలేరు, కోనేరు, చిలకలేరు గుండ్లకమ్మ యొక్క ఉపనదులు. ఈనది మొత్తం పొడవు 220 కి.మీ.




#Total Article count: 248
#Total Word count: 199926